-
సంగీతంలో అపశ్రుతి
సంగీతంలో సప్తస్వరాలు ఉన్నాయి. పశుపక్ష్యాదుల ధ్వనుల నుంచి ఇవి పుట్టినట్లు ప్రతీతి. శ్రుతి లయలు స్వరాల గమనానికి దిశానిర్దేశం చేసి, సంగీతాన్ని మనోరంజకం చేస్తాయి. సంగీతానికి ఆధారభూతమైన సప్తస్వరాలైనా, శ్రుతిలయాదులైనా– అన్నీ ప్రకృతి నుంచి పుట్టినవే! ప్రకృతికి కులమతాలు లేవు. ప్రకృతి నుంచి పుట్టిన సంగీతానికి కూడా కులమతాలు లేవు, సరిహద్దులు లేవు. చక్కని సంగీతానికి శ్రావ్యతే గీటురాయి. సంగీత కళను శాస్త్రబద్ధం చేసిన తొలి రోజుల్లో సంగీతానికి సంబంధించిన శాస్త్రీయ సంప్రదాయాలు కొన్ని ఏర్పడ్డాయి. తర్వాతి తరా లలో కొందరు సంగీత విద్వాంసులు పూర్వసంప్రదాయాలను, చాదస్తాలను తోసిపుచ్చి, తమదైన సృజనతో కొత్త ఒరవడికి నాంది పలికారు. తొలినాళ్లలో ఏకరీతిలో ఉన్న భారతీయ సంగీతంలో పద్నాలుగో శతాబ్దం నాటికి విభజన ఏర్పడింది. భారతీయ సంగీతంలో హిందుస్తానీ సంగీతం, కర్ణాటక సంగీతం ప్రధాన శాఖలుగా ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సంగీతంలో ఎన్ని శాఖలు ఉన్నా, అవన్నీ శైలీభేదాల వల్ల ఏర్పడి నవి మాత్రమే! కర్ణాటక సంగీతానికి పురందరదాసు పితామహుడిగా పేరుగాంచారు. ఆయన తర్వాతి కాలంలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి ‘కర్ణాటక సంగీత త్రిమూ ర్తులు’గా పేరుపొందారు. వీరందరూ ఎవరి స్థాయిలో వారు ప్రయోగాలు చేసిన వారే గాని, పూర్వ శాస్త్రగ్రంథాల్లోని పాఠాలకు కట్టుబడి, వాటినే తు.చ. తప్పకుండా వల్లెవేసిన వారు కాదు. వారంతా మడిగట్టుకుని పూర్వగ్రంథాల్లోని పద్ధతులకే పరిమితమై ఉన్నట్లయితే, ఈనాడు కర్ణాటక సంగీతం ఇంతటి ఉత్కృష్ట స్థాయికి చేరుకునేదే కాదు. ముత్తుస్వామి దీక్షితార్ సాహసోపేతమైన ప్రయోగాలే చేశారు. ఈస్టిండియా కంపెనీ అధికారి కర్నల్ జేమ్స్ బ్రౌన్ ప్రోత్సాహంతో ఇంగ్లిష్ సంగీత బాణీలకు సంస్కృత రచనలు చేశారు. ఈస్టిండియా కంపెనీ బ్యాండ్ ఆర్కెస్ట్రాలో ఉపయోగించే వయొలిన్ను చూసి ముచ్చటపడి కర్ణాటక సంగీత కచేరీల్లోకి తీసుకువచ్చారు. ముత్తుస్వామి సోదరుడు బాలుస్వామి తొలిసారిగా కర్ణాటక సంగీత కచేరీలో వయొలిన్ వాయించారు. పాశ్చాత్య శైలిలో ‘నోటు స్వరాలు’ కూర్చి సంప్రదాయ కచేరీల్లో వినిపించడం ప్రారంభించారు. ముత్తుస్వామి దీక్షితార్ చేసిన ప్రయోగాలు ఆనాటిసంప్రదాయవాదులకు మింగుడుపడనివే! చాదస్తపు విమర్శలకు భయపడి ముత్తుస్వామి తన ప్రయోగాలను విరమించుకున్నట్లయితే, ఆయన అనామకంగానే కాలగర్భంలో కలిసిపోయేవారు. ముత్తుస్వామి దీక్షితార్ తర్వాతికాలంలో కూడా కొందరు విద్వాంసులు క్లారినెట్, శాక్సాఫోన్, మాండొలిన్, గిటార్, వయోలా, పియానో వంటి పాశ్చాత్య వాద్యపరికరాలను కర్ణాటక సంగీత కచేరీలకు పరిచయం చేశారు. త్యాగరాజు కాలం నాటికి అప్పటి తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య సంగీతానికి కూడా సమాదరణ ఉండేది. త్యాగరాజు రాజాశ్రయానికి దూరంగా తనసంగీత సాధన కొనసాగించినా, ఆయనపైనా పాశ్చాత్య సంగీత ప్రభావం లేకపోలేదు. త్యాగరాజు ఏటా వేసవిలో ఎక్కువగా తిరువయ్యారులో గడిపేవారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన పాశ్చాత్యసంగీతాన్ని ఆస్వాదించారు. త్యాగరాజు ఆ తర్వాతి కాలంలో శంకరాభరణ రాగంలో కూర్చిన ‘వరలీలా గానలోలా’, ‘సారస నేత్ర’, సుపోషిణి రాగంలో కూర్చిన ‘రమించు వారెవరురా’ వంటి కొద్ది కీర్తనల్లో పాశ్చాత్య సంగీత ధోరణులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ప్రయోగాలు లేకుండా ఏ కళా, ఏ శాస్త్రమూ అభివృద్ధి చెందదు. మన కాలానికి చెందిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ కూడా కర్ణాటక సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసి శ్రోతలను మెప్పించారు. సంగీత సంప్రదాయం ప్రకారం ఆరోహణ అవరోహణలలో ఒక రాగానికి కనీసం ఐదేసి స్వరాలు ఉండాలి. ఆరోహణ అవరోహణలలో ఐదు కంటే తక్కువ స్వరాలను ఉపయో గించి ఆయన కొత్త రాగాలను సృష్టించారు. నేటితరంలో టి.ఎం.కృష్ణ తనదైన శైలిలో సంగీతంలో ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. సంప్రదాయ కచేరీ నమూనాలోనే మార్పులను తీసుకొచ్చారు. వర్ణాలు, కృతులు, తిల్లానాలు వంటి వాటితోనే సాగే కర్ణాటక సంగీత కచేరీల్లో టి.ఎం.కృష్ణ క్రైస్తవ గీతాలను, ఇస్లాం గీతాలను, తమిళ కవుల గేయాలను కూడా పాడటం ద్వారా కొత్త ఒరవడికి నాంది పలికారు. కచేరీల్లో టి.ఎం. కృష్ణ ఈ మార్పులను తెచ్చినప్పటి నుంచి మతతత్త్వవాదులు ఆయనపై విమర్శలు గుప్పిస్తూ వస్తు న్నారు. టి.ఎం.కృష్ణ సంగీత రంగానికి మాత్రమే పరిమితం కాకుండా; దేశంలోని సామాజిక పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందించే తీరు, దళితవాడలకు వెళ్లి కచేరీలు చేస్తూ సంగీతాన్ని సామాన్యుల చెంతకు చేరుస్తున్న పద్ధతి కూడా వారికి కంటగింపుగా మారింది. ఇదివరకు టి.ఎం. కృష్ణకు రామన్ మెగసెసె అవార్డు వచ్చినప్పుడు రుసరుసలు వినిపించాయి. ఇటీవల ఆయనకు మ్యూజిక్ అకాడమీ ‘సంగీత కళానిధి’ అవార్డును ప్రకటించింది. దీనికి నిరసనగా గాయనీమణులు రంజని, గాయత్రి మ్యూజిక్ అకాడమీలో ఈసారి కచేరీ చేయబోమంటూ, అకాడమీ అధ్యక్షుడికి లేఖ రాశారు. మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు ఎన్. మురళి ఆ లేఖకు ఇచ్చిన సమాధానంలో వారి తీరును తప్పుపట్టారు. టి.ఎం.కృష్ణపై అక్కసు వెళ్లగక్కుతున్న వారంతా ఆయన సంగీత సామ ర్థ్యాన్ని గురించి మాట్లాడకుండా, ఆయన సంప్రదాయాన్ని మంటగలిపేస్తున్నాడంటూ గగ్గోలు పెడుతుండటం గమనార్హం. రంజని, గాయత్రి వంటి వారి తీరు సంగీత ప్రపంచంలో ఒక అపశ్రుతి. అయితే, సంగీతం ఒక స్వరవాహిని. ఇలాంటి అపశ్రుతులను సవరించుకుంటూ తన ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. -
ఫీజికల్ హెల్త్ పై మెంటల్ హెల్త్ ప్రభావం...!
-
Rajampeta : పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్న ప్రవాసాంధ్రుడు
కడప: దృష్టి.. జీవన ప్రయాణంలో అత్యంత కీలకం. కళ్లు సరిగా ఉంటే.. ఏ పనయినా చేసుకోవచ్చు. కానీ కొందరు కళ్లను సరిగా పట్టించుకోకపోవడం వల్ల అది దృష్టి లోపానికి దారి తీస్తోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల కంట్లో శుక్లాలకు దారి తీస్తుంది. ఇలాంటి అభాగ్యులకు అండగా నిలిచారు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుడు వల్లూరు రమేష్ రెడ్డి.ఆకేపాడు గ్రామంలోని అమర్నాథరెడ్డి నివాసంలో చెన్నై శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 రోజులపాటు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం రవాణా సదుపాయంతో పాటు ఉండేందుకు వసతి కల్పించారు. ఈ శిబిరం ద్వారా ఏకంగా 238 మంది కంటి శస్త్రచికిత్సలు చేయించుకోవడం నిజంగా గొప్ప విషయం. శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు సమావేశానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్నివేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలనే ఉద్దేశంతో పట్టణాన్ని సైతం వదిలి స్వగ్రామంలోనే నివాసం ఉంటూ నిత్యం వివిధ రకాల సేవలను పేదలకు అందిస్తున్న జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి సేవా తత్పరుడని కడప మేయర్ సురేష్ బాబు తెలిపారు. అలాగే వైఎస్సార్సిపి అమెరికా కన్వీనర్ వల్లూరు రమేష్ రెడ్డి తల్లి తండ్రుల జ్ఞాపకార్థం 30 లక్షల రూపాయలు వెచ్చించి ఈ ఉచిత కంటి శిబిరం నిర్వహించి 238 మందికి కంటి చూపు తెప్పించడం చాలా అదృష్టమని అన్నారు. ఎక్కడో అమెరికాలో స్థిరపడి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ పుట్టిన గడ్డను మరవకుండా బడుగులకు సేవలు అందిస్తోన్న వల్లూరు రమేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 12 రోజులు పాటు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 1032 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 238 మందిని ఆపరేషన్లు చేయించేందుకు నిర్ణయించారు. పూర్తిగా ఉచితంగా ఈ చికిత్స అందించడంతో పాటు అద్దాలు, మందులను కూడా పంపిణీ చేశారు. ఎప్పుడో ఓసారి ఎక్కడో ఓ చోట ఏవైనా కార్పొరేట్ ఆసుపత్రులు ఒక్కరోజు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారని కానీ 12 రోజులు పాటు ఏకతాటిగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి సేవ చేయాలనే ఆలోచన చాలా గొప్పదని సురేష్బాబు కొనియాడారు. రమేష్ రెడ్డి చేసిన సేవకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ ప్రాంతం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వారందరూ ఆకేపాటి అమర్నాథరెడ్డిని ఆదర్శంగా తీసుకొని వారి వారి స్వగ్రామాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తే గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతాయని చెప్పారు. పుట్టిపెరిగిన గడ్డ అమ్మకు సమానమని, ఆ మాతృభూమికి ఎంతో కొంత సేవ చేసే అవకాశం నిజంగా అదృష్టమన్నారు రమేష్ రెడ్డి వల్లూరు. వైఎస్సార్ కడప జిల్లా నుంచి మూడు దశాబ్దాల కింద అమెరికా వెళ్లిన రమేష్ రెడ్డి ప్రస్తుతం వాషింగ్టన్ డి.సి.లో స్థిరపడ్డారు. ఇటీవలే తన తల్లితండ్రుల స్మృతిలో భాగంగా శంకర నేత్రాలయ ద్వారా ఈ ఉచిత కంటి శిబిరానికి తన వంతుగా చేయూత నిచ్చారు. 👁️ Proud to share that I've made a my contribution to a health camp that provided free eye check-ups for 1000+ patients and free surgeries for 238 people. We’re making a difference in improving lives! 🙏 💪❤️ #HealthcareForAll #CommunityImpact #GivingBack #CMJagan #AndhraPradesh — Ramesh Valluru Reddy (@YSRDist_RameshR) September 7, 2023 ఈ శిబిరానికి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యులు గజేందర్ కుమార్ వర్మ, డాక్టర్ సురభి, డాక్టర్ శంకర్ హాజరై శిబిరానికి వచ్చిన వారికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేశారు. వీరికి శంకర నేత్రాలయ నుంచి అరుల్ కుమార్, రంజిత్ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చొప్ప ఎల్లారెడ్డి, వైసీపీ నాయకులు పోలి మురళి, దాసరి పెంచలయ్య, డీలర్ సుబ్బరామిరెడ్డి, మహర్షి, రమేష్ నాయుడు పాల్గొన్నారు. -
సమంత, విజయ్ల ఎమోషన్స్ ‘ఖుషి’కి బ్యూటీని తీసుకొచ్చాయి
ప్రేమ గురించి కొన్ని కలలు కనే యువకుడికి లవ్, లైఫ్ అంటే మన ఊహలకు అనుగుణంగా ఉండదని తెలిసిరావడమే ‘ఖుషి’ సినిమా నేపథ్యం. మణిరత్నం సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ చూపించే విజువల్ బ్యూటీ ఈ చిత్రంలో చూస్తారు. అయితే అలాంటి సీన్స్ ను మేము కాపీ కొట్టలేదు. అలాంటి ఫీల్ కలిగించేలా విజువల్స్ ఉంటాయి’అని సినిమాటోగ్రాఫర్ జి.మురళి అన్నారు. విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు . మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి జి.మురళి సినిమాటోగ్రఫీ అందించాడు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మురళీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► నేను 2005 నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను. అందాల రాక్షసి మూవీకి పనిచేశాను. ఆ తర్వాత నేను చేసిన లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఖుషి’నే. మైత్రీ రవి గారి ద్వారా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. ఈ సినిమాకు మైత్రీ మూవీ ప్రొడ్యూసర్స్ బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వారికి సినిమాల మీద ఉన్నంత ప్యాషన్ నేను ఇంకో ప్రొడక్షన్ లోనూ చూడలేదు. సినిమా బాగా వచ్చేందుకు ఏది కావాలన్నా సమకూర్చుతారు. ఫిలిం మేకింగ్ లో వాళ్లు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ► మైత్రీ రవి గారు ఫోన్ చేసి చెన్నైకి డైరెక్టర్ తో కలిసి వస్తున్నాం. మీరు కథ వినండి అని చెప్పారు. అలా శివ గారు కథ చెప్పారు బాగా నచ్చింది. ఆయన ప్రీవియస్ మూవీస్ గురించి తెలుసుకున్నా. అలాంటి మంచి డైరెక్టర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడంతో హ్యాపీగా ఫీలయ్యా. ► లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘ఖుషి’ ఉంటుంది. ఇందులో విప్లవ్, ఆరాధ్య క్యారెక్టర్ లలో విజయ్, సమంత నటన మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. వాళ్ల క్యారెక్టర్స్ మధ్య వచ్చే సందర్భాల్లో విజయ్, సమంత చూపించిన ఎమోషన్స్, డీటెయిల్స్ సినిమాకు ఒక బ్యూటీ తీసుకొచ్చాయి. క్యారెక్టర్ లో ఎంతవరకు నటించాలో విజయ్ కు బాగా తెలుసు. ‘ఖుషి’లో అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. ఈ సినిమాతో తొలిసారి సమంతతో కలిసి పనిచేశాను. ► దర్శకుడు శివ నిర్వాణ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. సినిమా మేకింగ్ మీద ఇష్టం ఉన్న దర్శకుడు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. ఆయన మ్యూజిక్ సెన్స్ సూపర్బ్. ఇవాళ ‘ఖుషి’లో ఇంతమంచి మ్యూజిక్ వచ్చిందంటే దానికి శివ నిర్వాణ మ్యూజిక్ టేస్ట్ కారణం. ► నేను పనిచేసిన గత చిత్రాలు కాలా, సార్పట్ట వంటివి చూస్తే రా అండ్ రస్టిక్ గా ఉంటాయి. కానీ ‘ఖుషి’లో బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ విజువల్స్ తెరపైకి తీసుకొచ్చే అవకాశం కలిగింది. ఫుల్ లైఫ్ తెరపై చూపిస్తున్న ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా చూడటం పూర్తయ్యాక మీకొక కొత్త అనుభూతి కలుగుతుంది. కెమెరా ద్వారా ఆ ఎమోషన్ తీసుకొచ్చేందుకు నా ప్రయత్నం చేశాను. -
రైతుల ఆత్మహత్యలపై స్పందన ఏదీ?
పంజగుట్ట: రాష్ట్రంలో సిరులు కురిపిస్తున్న సేద్యం అని బీఆర్ఎస్ ప్రభుత్వం డప్పులు కొట్టుకుంటోందని... అయితే రాష్ట్రం వచ్చిన 9 సంవత్సరాల్లో 7007 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదని పలువురు వక్తలు ఆరోపించారు. సోషల్ డెమొక్రటిక్ ఫోరమ్ (ఎస్డీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో “తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండాలి?’ అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ పద్మజాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్డీఎఫ్ కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నాగిరెడ్డి, కో కన్వినర్లు కన్నెగంటి రవి, పృధ్విరాజ్ యాదవ్, ప్రొఫెసర్ రమ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండాలి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అన్ని పార్టీల అధ్యక్షులకు ఇచ్చి వారి మేనిఫెస్టోలో పెట్టాలని సూచించనున్నట్లు వారు తెలిపారు. అనంతరం ఆకునూరి మురళి మాట్లాడుతూ... రాష్ట్రంలో 59 లక్షల రైతులు కోటి 45 లక్షల భూమిని సాగుచేస్తున్నారన్నారు. వారికి 3.2 టన్నుల విత్తనాలు అవసరమున్నదని రాష్ట్ర ప్రభుత్వం విత్తన అభివృద్ధి సంస్థ పాత్ర రోజురోజుకూ తగ్గించడంతో నకిలీ విత్తనాలు అమ్మే మోసగాళ్లు పెరిగి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలకు సంబంధించి సమగ్ర చట్టం విత్తన విధానం తీసుకురావాలని సూచించారు. రైతుల వ్యవహారాలకు సంబంధించి ఎప్పటికప్పుడూ నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో సహకరించేందుకు రాజ్యాంగ బద్ద సంస్థ ఒక వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని దానికి ప్రతి సంవత్సరం రూ. 100 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిషన్ అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించడం, విత్తనాలు సరఫరా, నాణ్యమైన విత్తనలు, జన్యుపరంగా మార్పు చేసి ఇవ్వాలన్నారు. క్రిమి సంహారక మందులు కూడా ఏ పంటకు ఏ మేర క్రిమిసంహారక మందులు వాడాలో సూచించాలన్నారు. రైతుబంధు పథకం చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీన్ని కొనసాగిస్తూనే పది ఎకరాలు పైబడి మాగాణి, వర్షాధార భూములు ఉన్న వారికి ఇవ్వరాదన్నారు. ఆదాయపు పన్ను కట్టే ఏ రైతుకుటుంబానికి, భూ యజమానులకు రైతుబందు ఇవ్వకూడదని, ఇతరదేశాల్లో స్థిరపడి ఉన్న భూ యజమానులకూ ఇవ్వరాదని సూచించారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎలాంటి పంటల బీమా లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ప్రతి సంవత్సరం కరువుతోనో, అధిక వర్షాలతోనో రైతులు నష్టపోతూనే ఉన్నారని ఏ ఒక్క రైతుకూడా నష్టపోకుండా పటిష్టమైన పంటల బీమా వర్తింపచేయాలన్నారు. రైతులు బాగుపడేందుకు ప్రభుత్వం రూ. 38500 కోట్లు అవసరం అవుతాయని ప్రతి సంవత్సరం అదనంగా రూ. 6400 కోట్లు కేటాయించాలని సూచించారు. సమావేశంలో రంజిత్ కుమార్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
జైళ్ల శాఖ రెండో ఐజీగా మురళీబాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖలో ప్రస్తుతం ఉన్న పోస్ట్కు అదనంగా.. మరో ఐజీ పోస్ట్ ఏర్పాటుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ రేంజ్ డీఐజీగా పనిచేస్తున్న మురళీబాబు త్వరలో ఐజీగా పదోన్నతి పొందనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినందున జైళ్ల శాఖలో డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) సమావేశమై మురళీబాబుకు ఐజీగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఇక లాంఛనప్రాయమే. ఈ మొత్తం ప్రక్రియ మరో వారంలోగా ముగిసే అవకాశం ఉండడంతో ఆ తర్వాత మురళీబాబు ఐజీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం జైళ్లశాఖ ఐజీగా పనిచేస్తున్న రాజేశ్కుమార్, పదోన్నతిపై ఐజీగా బాధ్యతలు స్వీకరించనున్న మురళీబాబుల మధ్య పని విభజన చేయనున్నారు. కాగా, ఈ ఇద్దరు అధికారులు ఒకే బ్యాచ్ అధికారులు. సీనియారిటీ అంశంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించే దిశగా జైళ్ల శాఖలో రెండో ఐజీ పోస్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. మురళీబాబుకు పదోన్నతి లభించడంతో ఖాళీ అయ్యే డీఐజీ పోస్ట్ వరంగల్ సెంట్రల్ జైలు ఎస్పీ సంపత్కు దక్కే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత డీఐజీ శ్రీనివాస్తోపాటు సంపత్ డీఐజీ హోదా పొందనున్నట్టు సమాచారం. -
అదే LSG కొంప ముంచింది ఇకనయినా కళ్ళు తెరవండి
-
దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. స్టేజ్పైనే కుప్పకూలిన ప్రముఖ గాయకుడు
జయపురం: పట్టణంలో సంబరంగా జరుగుతున్న దసరా ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. శరన్నవరాత్రి సంబరాల్లో సందర్భంగా నిర్వహకులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి జయపురం రాజ్మహల్ కూడలి వద్ద విశాలమైన వేదికపై సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినీపతి, మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, సబ్ కలెక్టర్ దేవధర ప్రధాన్, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి సిద్ధార్థ పట్నాయక్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు మురళీ మహాపాత్రొ తన బృందంతో కలిసి సుమధుర గీతాలతో శ్రోతలను అలరించారు. అనంతరం మిగతా గాయకులు పాడుతుండగా.. కుర్చీ నుంచి వారిని ప్రోత్సహిస్తున్న ఆయన హఠాత్తుగా గుండె నొప్పితో వేదికపై ఒరిగిపోయారు. నిర్వాహకులు, తోటి కళాకారులు వెంటనే జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మరణించినట్లు ప్రకటించారు. దీంతో అంతా షాక్కు గురయ్యారు. దసరా వేడుకల్లో ఇటువంటి అవాంఛనీయ ఘటన జరగడం దురదృష్టకరమని నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. చదవండి: (NIMS Director: అనారోగ్యంతో అపోలోకు.. ఆరోగ్యంగా నిమ్స్కు..!) -
మదనపల్లె వైద్య కళాశాల పనులు ప్రారంభం
మదనపల్లె : రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న వైద్యకళాశాల స్థలంలో పనులు ప్రారంభమయ్యాయి. గురువారం ఆర్డీఓ ఎం.ఎస్.మురళి, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ ఆనందరెడ్డి, డీఈ కరీముల్లా తదితరులు ఆరోగ్యవరం వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయించిన 95.14 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగా ఆ స్థలంలో అంతరరోడ్ల నిర్మాణం, ప్రహరీ, సరిహద్దులను గుర్తించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈఈ ఆనందరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సూపర్స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు, నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు వైద్యవిద్యను చేరువ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుచేస్తామని ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగా రాజంపేట పార్లమెంటరీ పరిధిలో రూ.475 కోట్లతో వైద్య కళాశాలను ఏర్పాటుచేస్తూ అనుమతిలిచ్చిందన్నారు. ఈ పనులకు సంబంధించి మేఘ ఇంజినీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ టెండర్లు దక్కించుకుందన్నారు. అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయిందని, 30 నెలలలోపు నిర్మాణాలు పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. మొత్తం 13,31,812 చదరపు అడుగుల విస్తీర్ణంలో వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాల, ఆస్పత్రి భవనాలు, సిబ్బంది క్వార్టర్స్, ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్స్(పీఈబీ) నిర్మిస్తారన్నారు. ఆర్డీఓ ఎం.ఎస్.మురళి మాట్లాడుతూ మెడికల్ కళాశాల స్థలంలో పలుచోట్ల బండరాళ్లు ఉండటంతో వాటిని పగులగొట్టేందుకు బ్లాస్టింగ్ లైసెన్స్ కోసం కాంట్రాక్టర్ దరఖాస్తు చేసుకోవడంతో అనుమతులిచ్చేందుకు పరిశీలన చేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరయ్య, తహసీల్దార్ సీకే.శ్రీనివాసులు, మేఘ సంస్థ ఇంజినీర్లు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ఈఈగా ఆనందరెడ్డి మదనపల్లెలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజి ఈఈగా ఆనందరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పెనుకొండ మెడికల్ కాలేజీ ఈఈగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను ప్రభుత్వం మదనపల్లె మెడికల్ కాలేజీ బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఆకట్టుకుంటున్న ‘మౌనం’ థియేట్రికల్ ట్రైలర్!
‘మల్లెపువ్వు’ఫేమ్ మురళి, ‘బిగ్ బాస్’ ఫేమ్ భానుశ్రీ జంటగా నటించిన తాజా చిత్రం ‘మౌనం’.‘వాయిస్ ఆఫ్ సైలెన్స్’ ట్యాగ్ లైన్. లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషన్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎమ్.ఎమ్.శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ ప్రథమార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు రమేశ్ వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేశ్ వర్మ మాట్లాడుతూ.. ‘మణిరత్నం’ మౌనరాగం తరహాలో... తన మిత్రుడు మురళి నటించిన ‘మౌనం’ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. నిర్మాతలు అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి మాట్లాడుతూ... ‘మౌనం కూడా కొన్ని సందర్భాల్లో ఎంత శక్తివంతంగా ఉంటుందో చాలా సెన్సిబిల్ గా చూపించే పారా సైకలాజికల్ థ్రిల్లర్ ‘మౌనం’. అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’అన్నారు. ఐశ్వర్య అడ్డాల, 'శివ' ఫేమ్ చిన్నా, జీవా, ధనరాజ్, శేషు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ: అనిల్, స్క్రీన్ ప్లే-ఎడిటింగ్: శివ శర్వాణి. -
ఇంటర్ 2 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ.72వేల కోట్లకు అధిపతి
జీవితం అంటేనే సంతోషం, బాధ, గెలుపు, ఓటమి వీటన్నింటి కలయిక. ఈ రోజు మనం ఎదుర్కొనే అతి పెద్ద సమస్య.. కొన్ని రోజుల తర్వాత చాలా చిన్నగా అనిపిస్తుంది. అందుకే ఓడిపోయినప్పుడు.. కుంగిపోకూడదు. ధైర్యంగా ముందడుగు వేయాలి.. విజయం తప్పక వరిస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచారు మురళి దివి. ఇంటర్ రెండు సార్లు ఫెయిలైన మురళి దివి.. నేడు 72వేలకు కోట్లకు అధిపతిగా నిలిచారు. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం మురళి దివి స్వస్థలం. ఆయన తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. మురళి దివికి 12 మంది తోబుట్టువులున్నారు. మురళి తండ్రికి వచ్చే 10 వేల రూపాయల పెన్షనే వారికి జీవినాధారం. సరిపడా ఆదాయం లేనప్పటికి పిల్లల్ని చదువుకు దూరం చేయలేదు మురళి దివి తండ్రి. ఇంటర్కు వచ్చే వరకు కూడా కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి మురళి పెద్దగా పట్టించుకోలేదు. (చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఇవే..! టాప్-10 లో ఇండియన్ ఫ్యామిలీ..!) మలుపు తిప్పిన సంఘటన ఇలా ఉండగా.. మురళి ఇంటర్ రెండు సార్లు ఫెయిలయ్యాడు. ఈ సంఘటన మురళి జీవితం మీద చాలా ప్రభావం చూపింది. తనను చదివించడం ఆర్థికంగా భారమైనప్పటికి తండ్రి అవేం పట్టించుకోలేదు. కానీ తాను మాత్రం రెండు సార్లు ఫెయిలయ్యాననే బాధ మురళిని పీడించసాగింది. ఆ తర్వాత నుంచి మురళి మరింత కష్టపడి చదివాడు.. అమెరికాలో ఉద్యోగం సంపాదించాడు. ఇంటర్లో ఫెయిలవ్వడం గురించి మురళి అంతర్జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘చదువు విషయంలో నేను చాలా నిజాయతీగా ఉండేవాడిని. చాలా కష్టపడేవాడిని. కానీ నాకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల రెండు సార్లు ఫెయిల్ అయ్యాను. అప్పుడే నాకు మా కుంటుంబ ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల గురించి అర్థం అయ్యింది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. బాగా చదివి.. మంచి ఉద్యోగం సాధించి.. కుటుంబాన్ని ఆదుకోవాలని భావించాను. కష్టపడి చదివి.. అమెరికాలో ఉద్యోగం సాధించాను’’ అని తెలిపాడు. (చదవండి: ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్) అమెరికా ప్రయాణం.. మురళి దివి తన అన్నల మాదిరిగానే కెమిస్ట్గా మారే మార్గంలో ఉన్నాడు. కానీ విధి రాత మరోలా ఉంది. ఈ క్రమంలో మురళి గ్రీన్ కార్డ్ పొంది 1976 లో అమెరికా వెళ్లాడు. ఫార్మసిస్ట్గా జీవితం ప్రారంభించాడు. అమెరికాలోని వివిధ కంపెనీలలో పని చేశాడు. చివరకు ఏడాదికి 65 వేల డాలర్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. కానీ ఇంటి మీద బెంగ, మాతృభూమి నుంచి వచ్చిన పిలుపు మురళీ దివిని భారతదేశానికి తిరిగి తీసుకువచ్చింది. ఇండియాకు తిరిగి వచ్చాడు. కానీ ఇక్కడ ఏం చేయాలి.. అనే దాని గురించి ఏం ఆలోచించుకోలేదు మురళి. అప్పుడే అనగా 1984లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రారంభం అయ్యింది. దానిలో చేరాడు మురళి. ఆరేళ్ల తర్వాత రెడ్డీస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా దివిస్ లాబొరేటరీస్ని ప్రారంభించాడు. (చదవండి: ఆ దీవిలో జరిగేవన్నీ దాదాపుగా రాక్షస వివాహాలే.. ఎందుకంటే!) బిలియనీర్గా ఎదిగాడు.. దివీస్ ల్యాబ్స్ స్థాపించిన 23 సంవత్సరాల తరువాత, అనగా 2013లో మురళి బిలియనీర్ అయ్యాడు. 2018-19లో, అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్గా నిలిచాడు. దివీస్ ల్యాబ్స్ స్టాక్ విలువ గత 3 సంవత్సరాలలో 400% కంటే ఎక్కువ పెరిగింది. అలానే కేంద్రం ప్రారంభించిన ఆత్మ-నిర్భర్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా మద్దతు.. కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఫార్మా ఉత్పత్తుల అవసరం పెరగడంతో దివిస్ ల్యాబ్స్ మరింత ఎదిగింది. ఫోర్బ్స్ ప్రకారం, మురళీ దివి, అతడి కుటుంబం రూ .72,000 కోట్ల (9.9 బిలియన్ డాలర్లు) నికర సంపదతో ప్రపంచంలోని 384 వ ధనవంతులుగా నిలిచారు. చదవండి: ఈ ఏడాది ఎక్కువ నష్టపోయిన వ్యక్తి.. ఏకంగా రూ. 1.98 లక్షల కోట్లు -
బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బందీగా ఉన్న ఏఎస్ఐ మురళీని హత్య చేశారు. అనంతరం మురళీ మృతదేహాన్ని గంగుళూరు వద్ద రహదారిపై పడేశారు. మృతదేహం వద్ద ఒక లేఖను వదిలి వెళ్లారు. ఈ నెల 21న గంగుళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలనార్ గ్రామంలో ఏఎస్ఐ మురళీని మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి విదితమే. నాలుగు రోజుల తర్వాత కిడ్నాప్ ఘటన విషాదంతో ముగిసింది. మురళీని విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యులు విన్నవించిన మావోయిస్టులు కనికరించలేదు. ఏఎస్ఐ విడుదలకు గోండ్వానా సమాజ్ కోఆర్డినేషన్ కమిటీ యత్నించిన సంగతి తెలిసిందే. చర్చలు జరిపే సమయంలోనే మురళీని మావోయిస్టులు హత్య చేశారు. చదవండి: కొంపముంచిన వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో.. టెకీ ఘనకార్యం; పెళ్లి పేరుతో ఇంటికి రప్పించుకొని.. -
బంధీగా ఉన్న మురళీని హత్య చేసిన మావోయిస్టులు
-
ఇంగ్లిష్లో ‘శతక సానెట్స్’
చేర్యాల(సిద్దిపేట): వివిధ సంస్థలు గత మే నెల 2వ తేదీ నుంచి నేటి వరకు నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ ఇంగ్లిష్ పద్యాల పోటీల్లో మండల పరిధిలోని గుర్జకుంట ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రేణుకుంట్ల మురళి శతక సానెట్స్ పూర్తి చేసి 50కి పైగా అవార్డులు సాధించాడు. గురువారం మురళి విలేకరులతో మాట్లాడుతూ.. పీబీ పబ్లిషర్స్ కమ్యూనిటీ, అన్టచ్డ్ ఎమోషన్స్, వ్రైటర్స్ యునైట్, నాజ్మేహయత్ సంస్థలు ఆన్లైన్లో నిర్వహించిన ఇంగ్లిష్ పద్యాల పోటీల్లో పాల్గొని కన్స్టాలేషన్, మదర్ గాడ్డెస్, స్మైల్ చైల్డ్హుడ్ మెమొరీస్, గస్టీ విండ్స్, విల్టెడ్ రేయిన్బో మొదలైన అంశాలపై 100కు పైగా పద్యాలు రాసినట్లు చెప్పారు. అందుకుగాను 50కి పైగా అవార్డులను ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గెలుచుకున్నట్లు తెలిపారు. తాను రాసిన పద్యాలలో కొన్నింటిని ఇన్సెంటివ్, ఇన్పినిటీ, బియాండ్, ఎంబర్, అరోరా, డియర్డాడ్, ఫోర్జెన్ ఫోలెన్, ఇంక్ పాబ్లెస్ లాంటి 20 ఆంథోళజీ పుస్తకాల్లో ముద్రించినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు స్పోకెన్ ఇంగ్లిష్, గ్రామర్ పుస్తకం రచించానని, ప్రచురణ జరుగుతుందన్నాడు. తాను రచించిన పుస్తకాలు అమేజాన్, అమేజాన్ కిండ్లే, నేషన్ ప్రెస్, పిబి పబ్లిషర్స్ వంటి ప్రముఖ పుస్తక విక్రయశాలల్లో లభిస్తాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన మురళిని కవులు, కళాకారులు, సాహితీ వేత్తలు అభినందించారు. -
గొందిరెడ్డిపల్లి ఘటనపై కేసు
అనంతపురం ,రాప్తాడు: గొందిరెడ్డిపల్లి ‘పసుపు కుంకుమ’ కార్యక్రమంలో జరిగిన ఘటనలో 34 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. పది మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులపైన, ఎనిమిది మంది టీడీపీ నాయకులపైన, అలాగే కానిస్టేబుల్పై జరిగిన దాడికి సంబంధించి ఇరు పార్టీలకు చెందిన 16 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆరోజు ఏం జరిగిందంటే..? ఈ నెల నాలుగో తేదీన గొందిరెడ్డిపల్లిలో జరిగిన ‘పసుపు కుంకుమ’ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు మిడతల శీనయ్య వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తామని చంద్రబాబు ఫొటోపై పాలు పోసి ప్రమాణం చేయాలని డ్వాక్రా మహిళలకు హుకుం జారీ చేశాడు. దీంతో కొందరు మహిళలు తాము చంద్రబాబుకు ఓటు వేయబోమని, వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తామని స్పష్టం చేశారు. రెచ్చిపోయిన మిడతల శీనయ్య ఓ మహిళను చెప్పుకాలితో తన్నాడు. దీంతో మహిళలు, గ్రామస్తులు శీనయ్యపై ఎదురు దాడికి దిగారు. పోలీసులు కూడా టీడీపీ నాయకులకే వత్తాసు పలకడంతో ఆగ్రహించిన మహిళలు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత సోదరుడు, టీడీపీ మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి, మంత్రి సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ అనుచరులు పెద్ద ఎత్తున గ్రామంలోకి వచ్చి హల్చల్ చేశారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. మహిళలు అనే ఇంగిత జ్ఞానం లేకుండా వారిని చితకబాదారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన హన్మంతరెడ్డి, పద్మావతి, నాగరత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు మరో ఐదుగురుకు స్వల్పంగా గాయపడిన విషయం విదితమే. 8 మందిపై కేసు నమోదు టీడీపీ నేతలు దాడిలో గాయపడి అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు హన్మంతరెడ్డి, పద్మావతి, నాగరత్నమ్మ ఫిర్యాదు మేరకు రాప్తాడు పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు. మిడతల శీనయ్య, ఈశ్వరయ్య, మహమ్మదయ్య, డీలర్ మల్లికార్జున, పుటుక నాగభూషణం, మిడతల ముత్యాలు, మిడతల ఉజ్జినయ్య, ఎం.బండమీదపల్లి మాజీ సర్పంచు దుగ్గపాటి శ్రీనివాసులుతో పాటు మరికొంత మంది ఘటనలో ఉన్నట్లు కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులపైనా.. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు మాత్రమే దెబ్బలు తగిలాయని, టీడీపీ కార్యకర్తలకు ఒక్కరికి కూడా గాయం కాలేదని గొందిరెడ్డిపల్లి వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. అయితే కేసును తప్పుదోవ పట్టించేందు కోసం టీడీపీకి చెందిన గోపాల్, మల్లికార్జున, రామాంజినేయులుకు దెబ్బలు తగలకున్నా దెబ్బలు తగిలాయంటూ ప్రభుత్వాస్పత్రిలో చేరారని తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు రాప్తాడు పోలీసులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన వెంకట్రామిరెడ్డి, శశిధర్రెడ్డి, హన్మంత రెడ్డి, వివేకానందరెడ్డి, మంజునాథ్రెడ్డి, సోమశేఖర్రెడ్డి, నరసింహరెడ్డి, కొండారెడ్డి, చెన్నారెడ్డి, నరేష్ కుమార్రెడ్డిలతో పాటు మరి కొంతమందిపై కేసు కట్టారు. వీరిలో ఆరోజు ఎవరూ కుడా ఘటలో పాల్గొనకున్నా పోలీసులు కేసు నమోదు చేయడం గమన్హారం. కానిస్టేబుల్పై దాడి ఘటనలో 16మందిపై కేసు ఈ ఘటనలో గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ జయచంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు ఇరు పార్టీలకు చెందిన 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో మిడతల శీనయ్య, శీనా, ఉజ్జినయ్య, డీలర్ మల్లికార్జున, గురవ మల్లికార్జున, మల్లప్ప, ఈశ్వరయ్య, మంజునాథ్రెడ్డి, వెంకట్రామిరెడ్డి, హరినాథ్రెడ్డి, పుల్లారెడ్డి, మధు, మిషన్ కొండారెడ్డి, లక్ష్మీదేవి, భాగ్యమ్మ, సింహాద్రిలతో పాటు మరి కొంతమంది ఉన్నారు. ధర్మవరపు మురళి పేరు తొలగింపు టీడీపీ నేతలు కొట్టిన దెబ్బలకు గాయపడి అనంతపురంలో చికిత్స పొందుతున్న బాధితులు హన్మంతరెడ్డి, పద్మావతి, నాగరత్నమ్మలు తమను గ్రామస్తులతో పాటు మంత్రి సోదరుడు ధర్మవరపు మురళి, పరిటాల శ్రీరామ్ అనుచరులు వచ్చి దాడి చేశారని, ధర్మవరపు మురళినే కొట్టించాడని, అతన్ని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు. ధర్మవరపు మురళి తన కాన్వాయ్తో వచ్చి బా«ధితులపై రాళ్లు రువ్విన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పలు మీడియా చానళ్లలో కూడా ధర్మవరపు మురళి రాళ్లు రువ్విన దృశ్యాలను పదే పదే చూపిస్తున్నా పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఆయన మంత్రి పరిటాల సునీత సొదరుడు కాబట్టి. ధర్మవరపు మురళిని అరెస్ట్ చేస్తే తమ ఉద్యోగాలు ఊడిపోతాయన్నది పోలీసుల భయం. ధర్మవరపు మురళితో పాటు మండల వ్యాప్తంగా పలువురు టీడీపీ నాయకులు ఈ ఘటనలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలను చూస్తే పాల్గొన్నదెవరో పోలీసులకే తెలుస్తుంది. -
మహిళలపై స్వయంగా మంత్రి సోదరుడి దాడి
సాక్షి, అనంతపురం: జిల్లాలో డ్వాక్రా మహిళలపై అధికార పార్టీ నేతల దాడులు కొనసాగుతున్నాయి. స్వయంగా మంత్రి పరిటాల సునీత సోదరుడు మురళీ మహిళలపై రాళ్లు రువ్వాడు. పోలీసుల సమక్షంలోనే మంత్రి సోదరుడు మురళీ రెచ్చిపోయాడు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేస్తామని ప్రమాణం చేయాల్సిందిగా పరిటాల వర్గీయులు అడుగగా.. అందుకు డ్వాక్రా మహిళలు నిరాకరించారు. దీంతో రెచ్చిపోయిన మంత్రి పరిటాల సునీత వర్గీయులు దాడులకు దిగారు. పోలీసుల సమక్షంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మంత్రి సోదరుడు మురళీ, పరిటాల అనుచరుల దాడి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. -
రెచ్చిపోయిన సునీత సోదరుడు మురళి
-
‘సాక్షి’ ఎడిటర్ వర్దెల్లి మురళికి మాతృ వియోగం
-
‘సాక్షి’ ఎడిటర్ వర్ధెల్లి మురళికి మాతృవియోగం
సూర్యాపేట: సీపీఎం సీనియర్ నాయకుడు వర్ధెల్లి బుచ్చిరాములు సతీమణి, ‘సాక్షి’ఎడిటర్ వర్ధెల్లి మురళి మాతృమూర్తి వర్ధెల్లి లక్ష్మమ్మ (78) గుండెపోటుతో మరణించారు. సూర్యాపేటలోని వారి నివాసంలో మంగళవారం మధ్యా హ్నం 1.30 గంటలకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించే లోపే ఆమె తుదిశ్వాస విడిచారు. వీరి స్వగ్రామం తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం కాగా సూర్యాపేటలోని విద్యానగర్లో నివాసముంటున్నారు. వర్ధెల్లి బుచ్చిరాములు, లక్ష్మమ్మ దంపతులకు కుమారుడు మురళితో పాటు కుమార్తె పద్మ ఉన్నారు. విషయం తెలుసుకున్న సాక్షి ఎడిటర్ మురళి సూర్యాపేటకు చేరుకుని మాతృమూర్తి భౌతికకాయం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణ ఇంటిపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. లక్ష్మమ్మ మరణంపై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి వేర్వేరుగా ప్రకటనల్లో తమ సంతాపం తెలిపారు. ఆమె భౌతికకాయాన్ని సీపీఎం నాయకులు సందర్శించి నివాళులర్పించారు. లక్ష్మమ్మ అంత్యక్రియలు బుధ వారం సూర్యాపేటలో జరుగుతాయని తెలిపారు. -
పరిటాల సునీత సోదరుడు వర్సెస్ మాజీ సర్పంచ్
సాక్షి, అనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీత సోదరుడికి టీడీపీ నేత, మాజీ సర్పంచ్కు విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పరిటాల సునీత సోదరుడు మురళి తమపై ఆధిపత్యం చెలాయించడంపై మరూరు టీడీపీ నేత, మాజీ సర్పంచ్ బోయ వెంకటేష్ మండిపడ్డారు. తనపై కావాలనే కక్ష్య కట్టాడని బోయ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అండదండలు చూసుకుని తనకు వచ్చిన కాంట్రాక్టు పనులను మురళి రద్దు చేయించారని ఆరోపించారు. జిల్లాలో బీసీల ఎదుగుదలను పరిటాల కుటుంబం ఓర్వలేకపోతుందని విమర్శించాడు. తాను ఇన్ని రోజులుగా టీడీపీలో పని చేసినందుకు సిగ్గుపడుతున్నానన్నారు. -
7న రైతునేస్తం అవార్డుల బహూకరణ
సాక్షి, అమరావతి: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట ఏర్పాటు చేసిన రైతునేస్తం పురస్కారాలను ఈనెల 7న హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్లో అందజేయనున్నట్టు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు జరిగే అవార్డుల బహూకరణ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, విస్తరణ అధికారులు, అగ్రిజర్నలిస్టులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు. పురస్కార గ్రహీతల్లో ప్రముఖ ఆరోగ్య ఆహార నిపుణుడు డాక్టర్ ఖాదర్ వలీ, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ వెల్చాల ప్రవీణ్రావు, సాక్షి దినపత్రిక సంపాదకులు వి.మురళి, పలువురు వ్యవసాయ రంగ నిపుణులు, రైతులు ఉన్నారు. -
కాంగ్రెస్ గూటికి కొండా దంపతులు
-
కాంగ్రెస్లోకి కొండా దంపతులు!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో తమకు టికెట్ కేటాయించలేదని పార్టీ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్పై తీవ్రంగా ధ్వజమెత్తిన కొండా సురేఖ, మురళీ దంపతులు.. కాంగ్రెస్ గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలి సింది. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ కుటుం బంపై విమర్శలు చేసిన తర్వాత సాయంత్రానికి వారిద్దరూ ఢిల్లీ చేరుకున్నారు. దీంతో అందరూ ఊహించినట్టుగానే వారు కారు దిగి హస్తం గూటికి చేరబోతున్నట్టు స్పష్టమైంది. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్తో భేటీ కానున్నారని సమాచారం. తమకు కేటాయించాల్సిన సీట్లపై పూర్తి స్థాయిలో హామీ తీసుకున్న అనంతరమే పార్టీలో చేరే విషయంపై నిర్ణయం తీసుకుం టామని కాంగ్రెస్ వర్గాలకు స్పష్టంచేసినట్టు తెలుస్తోంది. అయితే, ఆజాద్ భేటీ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరతారని తెలంగాణ కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలి సింది. కొండా దంపతులు కాంగ్రెస్లోకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవైపు కేటీఆర్కు సవాల్ విసిరిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైతం స్వాగతిస్తున్నట్లు తెలిసింది. -
మంత్రి తమ్ముడా.. మజాకా!
మంత్రాలయం: అధికారం ఉంటే ఎలాంటి మర్యాదైనా అలా నడిచివస్తుందేమో! మంత్రి తమ్ముడి రాకతో ఇక్కడి రెవెన్యూ అధికారులు రాచమర్యాదలు చేశారు. అడుగడుగునా వంగి వంగి దండాలు పెట్టారు. అడిగిన వెంటనే స్వామి దర్శనంతో పాటు పీఠాధిపతి ఆశీర్వచనాలూ అందజేయించారు. ఆఖరికి కుటుంబ సభ్యుల ఫొటోలు తీయడానికి ఫొటోగ్రాఫర్లుగానూ మారిపోయారు. మండల మేజిస్ట్రేట్ మొదలు ఇద్దరు వీఆర్వోలు ‘తమ్ముడి’ సేవలో తరించారు. ఈ దృశ్యం చూసి భక్తులంతా ముక్కున వేలేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తమ్ముడు మురళీ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయం వచ్చారు. రెవెన్యూ అధికారులు ప్రొటోకాల్ను విస్మరించి.. దగ్గరుండి ‘తమ్ముడి’ సేవలో తరించారు. విడిది కోసం వసతి మొదలు పీఠాధిపతి ఆశీర్వచనం వరకు దగ్గరుండి చేయించారు. తహసీల్దార్ చంద్రశేఖర్, వీఆర్వోలు జనార్దన్రావు, భీమయ్య వారి సేవల్లో తరించారు. గ్రామ దేవత మంచాలమ్మ, శ్రీరాఘవేంద్రస్వామి దర్శనం, పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల ఆశీర్వచనాలు రాచమర్యాదలతో చేయించారు. ప్రసాదాల పార్శిళ్లతో పాటు ఆశీర్వచన ఫల, పూల మంత్రాక్షింతలు, శేషవస్త్రాలను రెవెన్యూ అధికారులే మోసుకుని ప్రదక్షిణ చేశారు. శ్రీమఠంలో చివరికి కుటుంబ సభ్యుల ఫొటోలు తీయడానికి వీఆర్వో జనార్దన్రావు ఫొటోగ్రాఫర్గా మారిపోయారు. మంత్రులు వస్తే ఇవ్వాల్సిన ప్రొటోకాల్ వారి తమ్ముళ్లకు సైతం లభిస్తోందంటే నిజంగా దౌర్భాగ్యమని భక్తులు వ్యాఖ్యానించారు. కార్యాలయాల్లో పనులు పక్కనపెట్టి రెవెన్యూ అధికారులు ఇలా ‘తమ్ముడి’ సేవలో తరించడం విమర్శలకు తావిస్తోంది. -
ప్రజలు మెచ్చిన పాత్రికేయుడు మురళి
సనత్నగర్ : పాత్రికేయులు రాసే ఏ వార్తయినా ప్రజలకు అర్థమయ్యేట్టు ఉండాలని, లేకుంటే ఉపయోగం ఉండదని మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. సామాన్య ప్రజలు మెచ్చుకునేలా, ఆకట్టుకునేలా వార్తలు రాయడంలో వర్ధెల్లి మురళి పేరుప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు. శివశ్రీ మాదల వీరభద్రరావు స్మారక పురస్కారం–2018 ప్రదానోత్సవం ఆదివారం సాయంత్రం చిక్కడపల్లి కళా సుబ్బారావు కళావేదిక (శ్రీ త్యాగారయ గానసభ)లో కనుల పండువగా జరిగింది. రాజకీయ ఉద్దండులు, సీనియర్ పాత్రికేయుల సమక్షంలో ‘సాక్షి’ దినపత్రిక సంపాదకులు వర్ధెల్లి మురళి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. శివశ్రీ మాదల వీరభద్రరావు స్మారక సమితి, శ్రీత్యాగరాయ గానసభ, సాధన సాహితీ స్రవంతి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రోశయ్య మాట్లాడారు. సేవాతత్పరుడు, స్వాతంత్య్ర ఉద్యమకారుడు, పాత్రికేయుడు మాదల వీరభద్రరావు పురస్కారాన్ని మురళికి ప్రదానం చేయడం సముచితమన్నారు. ప్రెస్ అకాడమీ పూర్వ అధ్యక్షుడు పొత్తురి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మచ్చలేని రాజనీతికి దర్పణంగా మాదల వీరభద్రరావు నిలుస్తారన్నారు. నాగార్జున ప్రాజెక్టుపై గోపాలకృష్ణ, మాదల రాసిన వ్యాసాలు ఎవరూ రాయలేదని, వారి వ్యాసాలు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రేరేపించాయన్నారు. సీనియర్ పాత్రికేయుడు వరదాచారి మాట్లాడుతూ.. ప్రస్తుతం మీడియా రంగంలో సంచలనం పెరిగిందని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా అవలంబిస్తున్న విధానాలపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. మురళిని అజ్ఞాత సూరీడుగా అభివర్ణించారు. తొమ్మిదేళ్లు సంపాదకులుగా ఉండి ఎక్కడా ఆయన వేదికలను పంచుకోలేదన్నారు. సబ్ ఎడిటర్ నుంచి అనుభవాన్ని గడించి ఎడిటర్ స్థాయికి ఎదిగిన వారు తక్కువ మంది ఉంటారని, అందులో మురళి ఒకరన్నారు. ఆ రోజుల్లో ఉన్నత విలువలు గలవారి వద్ద పనిచేయడం ద్వారా మురళి నేటికీ ఆ విలువలను పాటిస్తూ పాత్రికేయ వృత్తికి వన్నె తెస్తున్నారన్నారు. మురళిది అద్భుతమైన భాష అని, ఇరాన్–ఇరాక్ యుద్ధ సమయంలో ఆయన చూపిన పనితీరు స్ఫూర్తిదాయకమన్నారు. మహామహులైన సంపాదకులు అందుకున్న మాదల వీరభద్రరావు స్మారక పురస్కారం మురళి అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. మురళి జర్నలిజంలోకి ఉద్యోగం కోసం రాలేదని, సామాజిక మార్పునకు దోహదపడాలనే కాంక్షతో వచ్చారన్నారు. తెలుగు జర్నలిజంలో కొత్త ఒరవడిన సృష్టించిన మురళికి మాదల పురస్కారం దక్కడం శుభపరిణామన్నారు. చారిత్రక నవలా చక్రవర్తి, విశ్రాంత ఆచార్యులు ఆచార్య ముదిగొండ శివప్రసాద్ మాట్లాడుతూ.. మాదల వీరభద్రరావు నిరాడంబరుడని, ఖద్దరు కట్టిన జాతీయవాదిగా జీవితాంతం రాజీలేని పోరాటం చేశారన్నారు. పురస్కార గ్రహీత వర్దెల్లి మురళి మాట్లాడుతూ.. 1984లో జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నానని, తనకు ఓనమాలు నేర్పిన వారిలో వరదాచారి ఒకరన్నారు. మాదల వీరభద్రరావు పురస్కారం అంటే గౌరవాన్ని పెంచుతుందని, ఆ ఉద్దేశంతోనే తాను స్వీకరించేందుకు అంగీకరించానన్నారు. స్వాతంత్య్ర సమరంలో ప్రత్యక్షంగా పోరాటం చేసిన మాదల రెండేళ్ల పాటు అజ్ఞాతవాసం కూడా చేశారన్నారు. 1935–50 వరకు ఉద్యమం చేసి, తరువాత పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టి ఆ రంగాన్ని ప్రవర్ధమానం చేశారని కొనియాడారు. జలవనరులు, నదీ జలాలు, జల విద్యుత్ ప్రాజెక్టులు, పంచాయతీరాజ్ అంశాలపై ఆ రోజుల్లో సమగ్ర సమాచారంతో మాదల వ్యాసాలు రాశారన్నారు. అలాంటి సబ్జెక్టులపై ఎంతో కష్టపడితే తప్ప రాయడం సాధ్యంకాదన్నారు. నేటితరం పాత్రికేయులు ఆయన ఆశయాలను కొనసాగిం చడం ద్వారా నిజమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. ఈ సందర్భంగా మాదల వీరభద్రరావు తనయుడు, శివశ్రీ మాదల వీరభద్రరావు స్మారక సమితి కార్యదర్శి మాదల రాజేంద్రప్రసాద్ వీరభద్రరావు అందించిన సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్రెడ్డి, గానసభ అధ్యక్షులు వీఎస్ జనార్దనమూర్తి, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిష్ట్రార్ టి.గౌరీశంకర్, సాధన సాహితీ స్రవంతి అధ్యక్షులు సాధన నరసింహాచార్య, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. కాగా మాదల వీరభర్రరావు శత జయంతి సందర్భంగా సీనియర్ పాత్రికేయులు రాసిన వ్యాసాలతో ప్రత్యేక సంచిక విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-05-2024)
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement