-
మోదీ సభలో నోరెత్తగలవా? చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్
చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ! ఒకపక్క 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తున్న బీజేపీతో జత కడతాడు. మరోపక్క మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు మొదలుపెట్టాడు. మైనార్టీలపై దొంగ ప్రేమ నటిస్తూ ఎన్డీఏలో కొనసాగుతానంటాడు. ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? – నెల్లూరు సభలో సీఎం జగన్మండుటెండలోనూ పలమనేరులో చక్కటి వర్షం పడింది. మీ చిక్కటి చిరునవ్వులతోపాటు ఈ వర్షం దేవుడి ఆశీస్సులుగా భావిస్తున్నా. విజయం మనదే. – పలమనేరు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి నెల్లూరు, సాక్షి, తిరుపతి, సాక్షి, పుట్టపర్తి: ‘నేను ఈరోజు.. ధైర్యంగా చెబుతున్నా. ఆరునూరైనా కూడా 4 శాతం రిజర్వేషన్లు మైనార్టీలకు ఉండి తీరాల్సిందేనని మీబిడ్డ ఈరోజు తలెత్తుకుని చెబుతున్నాడు. ఇది మీ జగన్ మాట. ఇది మీ వైఎస్సార్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా పోరాడతా. మరి చంద్రబాబు ప్రధాని మోదీ సభలో ఇలా చెప్పగలడా? ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా? ఎందుకీ దొంగ ప్రేమ? ఒకవైపు ఎన్డీఏలో కొనసాగుతూ.. మరోవైపు వాళ్లు 4 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా.. వారితోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు? సమాధానం చెప్పు చంద్రబాబూ..!’ అని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా నిలదీశారు. శనివారం హిందూపురం, పలమనేరు, నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు..ఇక్కడ కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. మైనార్టీ సోదరులకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు మతం ప్రాతిపదికగా ఇచ్చినవి కావు. ముస్లింలలో కూడా కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు, సయ్యద్లకు, మొఘల్లకు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చిన రిజర్వేషన్లు. ఇవాళ నేను ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించే వారిని, బీజేపీని అడుగుతున్నా. ఒక్క ముస్లింలలో మాత్రమే కాదు. అన్ని మతాల్లో కూడా బీసీలు, ఓసీలున్నారు. అవి రాజ్యాంగానికి లోబడి వెనుకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు. మరి ఇలాంటి వెనుకబాటుకి గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్లపై రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడటం ధర్మమేనా? ఇది కరెక్టేనా? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.మైనార్టీలకు మీ జగనన్న భరోసా..నేను ఇవాళ ప్రతి మైనార్టీ సోదరుడు, అక్కచెల్లెమ్మకు భరోసా ఇస్తూ చెబుతున్నా. మీకు 4 శాతం రిజర్వేషన్ల విషయం అయినా, ఎన్ఆర్సీ అయినా, సీఏఏ అయినా ఇంకా ఏ మైనార్టీ అంశమైనా.. మీ మనోభావాలకు, ఇజ్జత్ ఔర్ ఇమాన్కు మీ బిడ్డ జగన్ ఎప్పటికీ అండగా ఉంటాడు. మైనార్టీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డీబీటీ స్కీమ్లే కాకుండా ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా లాంటి వాటితో అండగా నిలిచాం. ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం మొదలు నలుగురు మైనార్టీలను ఎమ్మెల్సీలుగా, నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. నా మైనార్టీ సోదరుడు ఒకరిని డిప్యూటీ సీఎంగా, మైనార్టీ సోదరిని శాసనమండలి వైస్ చైర్పర్సన్గా అవకాశం కల్పించి గౌరవించాం. మైనార్టీ సబ్ ప్లాన్ బిల్లు తేవడం దాకా ప్రతి సందర్భంలోనూ వారికి సముచిత స్థానం కల్పించి సాదరంగా పక్కన పెట్టుకున్న ప్రభుత్వం ఇదేనని గర్వంగా చెబుతున్నా. మొట్టమొదటిసారిగా మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు మాత్రమే కాకుండా ఎన్నికల్లో 7 స్థానాలు మైనార్టీలకే ఇవ్వడం ద్వారా వారికి రాజకీయంగానూ నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లయింది. అలా ఇచ్చిన పార్టీ వైఎస్సార్ సీపీనే అని గర్వంగా చెబుతున్నా.ఖాతాల్లోకి రూ.2.70 లక్షల కోట్లు.. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుమరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుంది. రాబోయే ఐదేళ్ల పాటు మీ ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి. మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడం. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. ఐదేళ్ల పాటు మీ రక్తం తాగుతుంది. మీ బిడ్డ 59 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. 130 సార్లు బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు రూ.2.70 లక్షల కోట్లు నేరుగా డీబీటీతో జమ చేశాడు. గతంలో రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. మేనిఫెస్టోలోని హామీల్లో 99 శాతం నెరవేర్చి చిత్తశుద్ధి చాటుకున్నాడు. మీ బిడ్డ ఐదేళ్లలో చేసిన మంచినే చూపిస్తున్నాడు. నలుగురిలో నిలబడి కళ్లల్లో కళ్లు పెట్టి చూడగలుగుతున్నాడు. ఒక మనిషి 14ఏళ్లు సీఎంగా చేసిన తర్వాత కూడా 75 ఏళ్ల వయసుండీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేకపోతున్నాడంటే, పొత్తులతో నిలబడే ప్రయత్నం చేస్తున్నాడంటే, అసాధ్యమైన వాగ్దానాలు, మోసాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? మనం చేసిన అభివృద్ధి...నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీలు పూర్తిచేసి జాతికి అంకితం చేసింది మన ప్రభుత్వమే. ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి చిత్రావతి, గండికోట, పులిచింతల రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేశాం. వెలిగొండలో రెండు టన్నెళ్లను ఇప్పటికే పూర్తిచేశాం. ఈ వర్షాకాలంలో వెలిగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకెళుతున్నాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులను పరుగులు పెట్టిస్తున్నాం. పైప్లైన్ వేసి రక్షిత మంచినీటి సదుపాయం కల్పించి ఉద్దానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించాం. చంద్రబాబు దిక్కుమాలిన బుర్రకు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా తట్టిందా? మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎంఎస్ఎంఈలకు చేయి అందించి తోడుగా నిలిచాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రాన్ని వరుసగా నెంబర్ వన్గా నిలబెట్టాం. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.32 వేలు కోట్లు అయితే ఇదే మన పాలనలో వచ్చిన పెట్టుబడులు ఏకంగా రూ.లక్ష కోట్లు. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల పోస్టులు భర్తీ చేశాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్నాం. నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దాదాపు పూర్తి కావచ్చాయి. గడగడా చెబుతాగవర్నమెంట్ బడికి వెళ్లే పిల్లల చేతుల్లో ట్యాబ్లు, బడులు తెరిచేసరికే విద్యాకానుక, గోరుముద్ద, చదువులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి లాంటివి గతంలో ఉన్నాయా? పూర్తి ఫీజులతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన గతంలో ఎప్పుడైనా చూశారా? నా అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా ఎదిగేలా ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తంతోపాటు 31 లక్షల ఇళ్ల స్థలాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టాం. అవ్వాతాతలకు ఇంటికే రూ.3,000 పెన్షన్, రైతన్నలకు పెట్టుబడికి సాయంగా రైతు భరోసా లాంటివి గతంలో ఉన్నాయా? రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, ఓ ఆర్బీకే వ్యవస్థ లాంటివి ఇంతకు ముందెప్పుడైనా ఉన్నాయా? సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ చేదోడు, తోడు, లాయర్లకు లా నేస్తం లాంటి పథకాలు గతంలో ఉన్నాయా?ఆరోగ్యశ్రీని విస్తరించి రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఆరోగ్య ఆసరా ద్వారా కోలుకునే సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా అండగా నిలిచాం. సచివాలయాల ద్వారా ఏకంగా 600 రకాల సేవలు ప్రజలకు గడప వద్దే అందిస్తున్నాం. వలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలు డోర్ డెలివరీ అవుతున్నాయి. నాడు ఆ డబ్బంతా ఎవరి ఖాతాల్లోకెళ్లింది? పిండి కొద్దీ రొట్టె సామెత మనకు తెలుసు. కానీ,పిండీ.. రొట్టె మొత్తం తినేసే బ్యాచ్కు లీడర్ చంద్రబాబు! తన 14 ఏళ్ల పాలనలో పేదలకు ఒక్కటైనా మంచిపనిగానీ, ఖాతాల్లోకి ఒక్క రూపాయిగానీ జమ చేశాడా? నాడూ నేడూ ఇదే రాష్ట్రం.. అదే బడ్జెట్. అప్పుల గ్రోత్ రేట్ ఇప్పుడే తక్కువ. మరి చంద్రబాబు ఆ డబ్బంతా ఎవరి ఖాతాల్లో జమ చేశారో నిలదీసి అడగండి. చంద్రబాబుకి ఎంత పోయింది? దత్తపుత్రుడికి ఎంతిచ్చారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5కి ఎంత పోయింది? జన్మభూమి కమిటీల జేబుల్లోకి ఎంత పోయింది?మన అభ్యర్థులను దీవించండిపలమనేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ, చిత్తూరు ఎంపీ అభ్యర్థి ఎన్.రెడ్డెప్ప, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి æదీపికమ్మ, ఎంపీ అభ్యర్థి శాంతమ్మ, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి సాయిరెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. 2014లో బాబు ముఖ్యమైన విఫల హామీలివీ..» రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? » రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని నమ్మబలికి రూపాయి అయినా ఇచ్చాడా? » ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ అమలైందా? ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా? » అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మరి ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10,000 కోట్లతో బీసీ సబ్ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేశాడా? » సింగపూర్కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? హిందూపురం, పలమనేరు, నెల్లూరులో ఎక్కడైనా కనిపిస్తున్నాయా?» ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు.» మళ్లీ ఇప్పుడు అదే కూటమి పేరుతో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కారు అంటూ మరోసారి మోసాలకు తయారయ్యారు.ఇంటికే పెన్షన్లను అడ్డుకున్న బాబు..చంద్రబాబు మొన్న అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పింఛన్ను అడ్డుకున్నారు. ఇవాళ బ్యాంకుల చుట్టూ పడిగాపులు కాయాల్సిన దుస్థితికి తీసుకొచ్చారు. వలంటీర్లు ఇంటికి రాకూడదు, వాళ్లు పెన్షన్లు ఇవ్వకూడదంటూ చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్కు లెటర్ రాశాడు. అవ్వాతాతలు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుండటంతో ఆ నెపాన్ని మీ బిడ్డ జగన్పై వేయాలని ప్రయత్నించడం సిగ్గు చేటు. మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవాలని కోరుతున్నా. జగనన్న వచ్చాడు.. వర్షాన్ని తెచ్చాడుహిందూపురంలో పర్యటన ముగించుకుని సీఎం జగన్ పలమనేరు చేరుకునే సరికి మధ్యాహ్నం 2 గంటలు అయింది. అయితే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకే క్లాక్ టవర్ వద్దకు జన ప్రవాహం మొదలైంది. అందరిలో హర్షం వెల్లివిరిసేలా సీఎం జగన్తో పాటు వరుణ దేవుడు తోడుగా వచ్చాడు. దాదాపు 30 నిమిషాల పాటు మోస్తరు వర్షం కురిసింది. జగన్ వస్తే వానొస్తుందంటూ రైతన్నలు ఆనందం వ్యక్తం చేశారు. -
Lok sabha elections 2024: నేడే రెండో దశ.. 13 రాష్ట్రాలో 88 స్థానాలకు ఎన్నికలు
-
Lok sabha elections 2024: పదేళ్ల అభివృద్ధి.. ట్రైలర్ మాత్రమే: మోదీ
త్రిసూర్/తిరువనంతపురం/తిరునల్వేలి: గత దశాబ్దాకాలంగా ఎన్డీఏ పాలనాకాలంలో దేశం చవిచూసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాకారంకానుందని ఆయన ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యతనిస్తూ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ‘సంకల్ప పత్రం’ విడుదల చేసిన మరుసటి రోజే ప్రధాని మోదీ ఆ హామీలను పునరుద్ఘాటించారు. కేరళలోని కున్నమ్కులమ్, కట్టకడ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభల్లో మోదీ ప్రసంగించారు. రాహుల్గాంధీపై పరోక్ష విమర్శలు చేశారు. ‘‘ కాంగ్రెస్ యువరాజుకు ఉత్తరప్రదేశ్లో దశాబ్దాలుగా తమ కుటుంబ గౌరవం(అమేథీ ఎంపీ స్థానం)ను కాపాడే సత్తాలేదుగానీ కేరళకు వచ్చి ఓట్లడుగుతారు. కేరళీయుల ఓట్లడిగే ఆయన సీపీఐ(ఎం) ఏలుబడిలో కరువన్నూర్ సహకార బ్యాంక్లో వెలుగుచూసిన కుంభకోణంపై నోరు మెదపరెందుకు? నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగం సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు కాంగ్రెస్కు ఉంది. ఈ రెండింటి మధ్య చీకటి ఒప్పందం కుదిరింది. కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్కు పాల్పడి ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఈ మోసంపై నేనే ఈడీ దర్యాప్తు నకు ఆదేశించా’’ అని అన్నారు. లెఫ్ట్ ఉంటే అంతా లెఫ్ట్ అయినట్లే ‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి, అధికార ఎల్డీఎఫ్ కూటములు కేరళలో అభివృద్ధికి ప్రతిబంధకాలుగా తయా రయ్యాయి. త్రిపుర, పశ్చిమబెంగాల్, కేరళ ఈ రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉందీ అంటే అక్కడ అంతా పోయినట్లే(లెఫ్ట్ అయినట్లే). అక్కడ మంచి అనేదే జరగదు. పశ్చిమబెంగాల్, త్రిపురలో ఏం చేశారని, కొత్తగా కేరళకు చేయడానికి?’ అంటూ ధ్వజమెత్తారు. కచ్ఛతీవు ఉదంతాన్ని 4 దశాబ్దాలు దాచారు తమిళనాడులోని తిరునల్వేలిలో జరిగిన సభలోనూ మోదీ ప్రసంగించారు. కచ్ఛ తీవు ను శ్రీలంకకు ఇచ్చేసి కాంగ్రెస్, డీఎంకే ఈ ఉదంతాన్ని 40 ఏళ్లు దాచిపెట్టాయని మోదీ ఆరోపించారు. అక్కడ తమిళ మత్స్య కారులు తరచూ అరెస్ట్ అవుతున్నారని, ఈ పాపం ఆ పార్టీలదేనన్నారు. -
బీజేపీని బలోపేతం చేయమంటే.. నిండా ముంచారు!
కప్పుకునేది కాషాయం కండువా. చేసేది పసుపు రాజకీయం. ఇదీ ఏపీ బిజెపి చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహారశైలి. సంక్షోభంలో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీని బతికించుకోడానికి.. చంద్రబాబుకు మద్దతుగా ఉండేందుకు పురందేశ్వరి పడని పాట్లు లేవు. ఏపీలో బిజెపిని బలోపేతం చేయవమ్మా అని అధ్యక్ష పదవి కట్టబెడితే.. బిజెపిని నిండా ముంచి మరిది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసం ఎందాకైనా వెళ్తానంటున్నారు పురందేశ్వరి. టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడవాలని డిసైడ్ అయినపుడు పురందేశ్వరి దంపతులే మంచి కత్తి ఒకటి చంద్రబాబుకు కానుకగా ఇచ్చారని అప్పట్లో వైస్రాయ్ కోళ్లు ఆగ్రహంగా కూశాయి. వైస్రాయ్ ఎపిసోడ్లో.. తన తండ్రిని ముఖ్యమంత్రి పీఠం నుండి నిర్దాక్షిణ్యంగా దించేసిన కుట్రలో ఎన్టీయార్ తనయ దగ్గుబాటి పురందేశ్వరి.. ఆమె భర్త వెంకటేశ్వరరావులు భాగస్వాములన్నది బహిరంగ రహస్యం. వెన్నుపోటులో తనకు అండగా ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సిఎం పదవి ఇస్తానని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారని అంటారు. తీరా వెన్నుపోటు పొడిచేసి కత్తికంటిన నెత్తుటిని తుడిచేసి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తర్వాత దగ్గుబాటి విషయాన్ని పక్కన పెట్టేశారు చంద్రబాబు. ఇవాళో రేపో తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని దగ్గుబాటి కొద్ది రోజులు వెయిట్ చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలు లాంటిదని దాని వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు మనసా వాచా కర్మేణా నమ్మడం వల్ల వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సిఎం పదవి రాలేదు. అప్పటికి కానీ తాము మోసపోయామని దగ్గుబాటి దంపతులు గ్రహించలేకపోయారు. తెలిసిన తర్వాత ఉక్రోషంతో టిడిపి నుండి బయటకు వచ్చి చంద్రబాబుపై కారాలూ మిరియాలను మిక్సీలో వేసి రుబ్బారు. కొంతకాలం బిజెపిలో మరి కొంతకాలం కాంగ్రెస్ లో కాలక్షేపం చేసిన వెంకటేశ్వరరావు ఖాళీ సమయంలో ఓ ఆత్మకథ రాసి అందులో చంద్రబాబును నిర్మా వాషింగ్ పౌడర్ తో ఉతికి ఆరేశారు. ఆ కోపం చాలా ఏళ్ల పాటు చంద్రబాబులో ఉండిపోయింది. అందుకే 2014లో టిడిపి-బిజెపిలు పొత్తు పెట్టుకున్నా.. రాజంపేట నుండి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన పురందేశ్వరిని దగ్గరుండి మరీ ఓడించారు చంద్రబాబు.ఎన్నికల ఫలితాల రోజున పురందేశ్వరి ఓడారని తెలిసిన తర్వాతనే చంద్రబాబు సంతృప్తిగా నవ్వారని టిడిపి వర్గాలంటాయి. రెండు దశాబ్దాలకు పైగా నారా-దగ్గుబాటి కుటుంబాల మధ్య వైరం అలానే కొనసాగింది. 2019 ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం చెందడం ఆ తర్వాత వరుసగా అన్ని స్థానిక ఎన్నికల్లోనూ టిడిపి అడ్రస్ గల్లంతు కావడం జరిగిపోయాయి. 2024 ఎన్నికల్లోనూ టిడిపి లేచి నిలబడే పరిస్థితి లేదని తేలిపోయింది. ఈ సమయంలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండె సంబంధ సమస్య వచ్చి ఆసుపత్రిలో చేరితే పరామర్శ పేరిట చంద్రబాబు వెళ్లారు. అలా వెళ్లడానికి రామోజీ సలహాయే కారణమంటారు. విడిపోయిన నారా-దగ్గుబాటి కుటుంబాలు మళ్లీ కలవకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ను ఎదుర్కోలేమని రామోజీరావే రెండు కుటుంబాలకూ నూరిపోశారని కృష్ణా జిల్లా కోళ్లు మొహమాటంగా కూశాయి. అలా రాజగురువు ఇచ్చిన టిప్ తో ఆసుపత్రిలో దగ్గుబాటి దంపతలు కాళ్లమీద పడిపోయిన చంద్రబాబు వెన్నుపోటు ఘటన అనంతరం తాను చేసిన ద్రోహాన్ని ఒప్పుకుని క్షమించమన్నారట. దాంతో దగ్గుబాటి దంపతులు చంద్రబాబును క్షమించేసి ఇకనుంచి కలిసుందాం రా అన్నారట.ఆ క్రమంలోనే ఎన్టీయార్ నాణెం విడుదల చేసినపుడు పురందేశ్వరే ప్రణాళిక రచించి చంద్రబాబును ఎన్టీయార్ నాణెం విడుదల కార్యక్రమానికి కుటుంబ సభ్యుల ముసుగులో ఆహ్వానించారు. అక్కడ బిజెపి అధ్యక్షుడు నడ్డాతో వన్ టూ వన్ మాట్లాడుకునే వీలూ కల్పించారు. బిజెపితో తిరిగి పొత్తుకు ఆ క్షణానే చంద్రబాబు నడ్డాను మోహించినట్లు నటించారు. ఆ తర్వాత 371 కోట్ల రూపాయలు దోచుకు తిన్న స్కిల్ స్కాంలో చంద్రబాబు నాయుణ్ని కోర్టు ఆదేశాలతో అరెస్ట్ చేసి జైలుకు పంపగానే.. టిడిపి నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులకన్నా కూడా ముందుగా స్పందించింది పురందేశ్వరే. చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అక్రమం అని ఆమె ముందస్తుగా ఖండించేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు బెయిల్ రాకపోవడంతో ఆ ప్రయత్నాలకోసం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతల అపాయింట్ మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే పురందేశ్వరి ఏపీ బిజెపి నేతలకు కూడా చెప్పకుండా అర్జంట్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి హస్తినలో దిగి అక్కడ తన చెల్లెలి కొడుకు నారా లోకేష్ ను తీసుకుని పార్టీ అగ్రనేత కేంద్రమంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో భేటీ కుదిర్చి తన వంతు సాయం అందించారు. ఇక ఎన్నికలు దగ్గర పడే సమయంలో టిడిపితో పొత్తు విషయంలో బిజెపి జాతీయ నాయకత్వం అనాసక్తిగా ఉండడంతో పురందేశ్వరే జోక్యం చేసుకుని టిడిపితో పొత్తు కుదిరేలా అగ్రనేతల దగ్గర మంత్రాంగం నడిపారని అంటారు. మొత్తం మీద టిడిపి-బిజెపిల మధ్య పొత్తు కుదిర్చారు. ఆ తర్వాత ఏపీ బిజెపిలో చంద్రబాబు అనుకూల నేతలకు టికెట్లు ఇప్పించారు. చంద్రబాబు అవినీతిని అను నిత్యం ఎండగట్టిన సోము వీర్రాజు, జి.వి.ఎల్. నరసింహారావులకు టికెట్ దక్కకుండా పక్కన పెట్టారు పురందేశ్వరి. అలా చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాలకోసం తాను ఏమైనా చేస్తానని చాటుకున్నారు. తాజాగా టిడిపి నేతల అవినీతి విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటూ స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తోన్న ఐపీఎస్ అధికారులపై వేటు వేయాలంటూ ఏకంగా ఈసీకే లేఖ రాసి బరితెగించేశారు పురందేశ్వరి.ఫలానా అధికారులు ఉంటే అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేయడం వేరు..వారిని తప్పిస్తే ఆ స్థానాల్లో ఎవరిని వేయాలో కూడా పురందేశ్వరే సిఫారసు చేస్తూ జాబితా పంపడం వివాదస్పదం అయ్యింది. ఈ ఎన్నికల్లో కూడా తన తండ్రి స్థాపించిన టిడిపి గెలిచి అధికారంలోకి రాలేకపోతే ఇక పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందని పురందేశ్వరి భయపడుతున్నారు. తన తండ్రి పెట్టిన పార్టీని గుంజుకుని..తన తండ్రి ఆశాయలకు తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడి రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి జారుకోకూడదని పాపం పురందేశ్వరి విపరీతంగా కష్టపడుతున్నారు. అయితే ఏవీ వర్కవువ్ కావంటున్నారు రాజకీయ పండితులు. -
Bihar politics: పాత కత్తులు.. కొత్త పొత్తులు
కులాల కుంపట్లు, పొత్తుల కత్తులు, కిచిడీ కూటములు, జంపింగ్ జపాంగ్లకు పెట్టింది పేరైన బిహార్లో రాజకీయాలు ఎప్పుడూ కాక పుట్టిస్తూనే ఉంటాయి. 40 సీట్లతో లోక్సభ నియోజకవర్గాల పరంగా దేశంలో నాలుగో స్థానంలో నిలుస్తున్న ఈ తూర్పు రాష్ట్రానిది జాతీయ రాజకీయాల్లో ఆది నుంచీ కీలక పాత్రే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ మొదలు జగ్జీవన్రాం, నుంచి లాలూ ప్రసాద్, నితీశ్కుమార్ దాకా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉద్ధండ నేతలకు పుట్టిల్లు బిహార్. అధికారం కోసం ప్రాంతీయ, జాతీయ పార్టీల మధ్య కుమ్ములాటలు, వర్గ పోరు, పవర్ పాలిటిక్స్ ఇక్కడ సర్వసాధారణం. స్టేట్ స్కాన్ రాజకీయంగా చైతన్యవంతమైన బిహార్లో లోక్సభ ఎన్నికల ముంగిట కొత్త పొత్తులు పొడిచాయి. గత ఎన్నికల్లో బీజేపీ, జేడీ (యూ), లోక్ జనశక్తి పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఏకంగా 39 సీట్లను ఒడిసిపట్టింది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసి అన్నీ గెలుచుకుంది. జేడీ(యూ) 17 సీట్లకు 16 చోట్ల, ఎల్జేపీ ఆరింటికి ఆరూ కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీల మహాకూటమి మహా ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ 9 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు గెల్చుకోగా ఆర్జేడీ 19 స్థానాల్లో తలపడినా సున్నా చుట్టింది. మిగతా పార్టీలదీ అదే పరిస్థితి. కేంద్రంలో మోదీ 2.0 బలమైన సర్కారు ఏర్పాటులో బిహార్ ఘనవిజయానిది ప్రధాన పాత్ర. ఈసారి పాత మిత్రులతో పూర్వ వైభవానికి కాంగ్రెస్ ప్రయతి్నస్తోంది. బిహార్లో 40 స్థానాల్లో ఆరింటిని ఎస్సీలకు కేటాయించారు. నితీశ్ పిల్లిమొగ్గలు... బిహార్ రాజకీయాల్లో వెలుగు వెలిగిన లాలు అవినీతి కేసుల్లో జైలుపాలైన నాటి నుంచీ రాష్ట్రంపై నితీశ్ కుమార్ పట్టుబిగించారు. ఏదో ఒక పార్టీతో పొత్తుతో 15 ఏళ్లుగా సీఎం పీఠాన్ని అంటిపెట్టుకున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సమాజ్వాదీ, జేడీ(ఎస్), కాంగ్రెస్ మహా కూటమిగా పోటీ చేశాయి. ఆర్ర్జేడీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినా నితీశ్ సీఎం పదవి దక్కించుకున్నారు. రెండేళ్లు తిరిగేసరికి మహాకూటమికి గుడ్బై చెప్పి మళ్లీ బీజేపీతో జట్టుకట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో సీట్ల సర్దుబాటు చేసుకుని అత్యధిక ఎంపీ సీట్లను దక్కించుకున్నారు. అదే జోరులో 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ భాగస్వామిగా పోటీ చేసి సీఎం పీఠమెక్కారు. జేడీ(యూ) (43) కంటే బీజేపీ (74)కే ఎక్కువ సీట్లు దక్కినా నితీశ్ మళ్లీ సీఎం పదవి దక్కించుకోవడం విశేషం. రెండేళ్లలోనే ఆయన మళ్లీ ప్లేటు ఫిరాయించారు. లోక్సభ ఎన్నికల్లో మోదీని ఢీకొట్టడమే లక్ష్యంగా విపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తామంటూ ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చేశారు. మహాకూటమి దన్నుతో మళ్లీ సీఎం అయ్యారు! ఇండియా కూటమి ఏర్పాటు కీలక పాత్ర పోషించారు. తీరా గత జనవరిలో ఎన్డీఏలోకి గెంతి మహాకూటమికి, ఇండియా కూటమికీ కోలుకోలేని షాకిచ్చారు. బీజేపీ దన్నుతో సీఎం పదవిని కాపాడుకున్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. బీజేపీకి కలిసొస్తుందా...? నితీశ్తో కలిసి 2019 ఫలితాలను రిపీట్ చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కానీ దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న నితీశ్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎన్డీఏ సీట్లకు గండి కొట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టడాన్ని నితీశ్ సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. అది తమ ఘనతేనని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఆ హామీ ఇస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. బీజేపీ అయోధ్య రామ మందిరంతో హిందుత్వ నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంపై ఆశలు పెట్టుకుంది. ఈసారి బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేపీ 5, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ ఆవామ్ మోర్చా, రా్రïÙ్టయ లోక్ సమతా పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. కులగణన ఎవరికి ప్లస్! బిహార్ రాజకీయాలు చిరకాలంగా కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. నితీశ్ చేపట్టిన కులగణన మరోసారి రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. రాష్ట్రంలో 94 లక్షల కుటుంబాలు (34.13%) నెలకు రూ.6,000 సంపాదన కూడా లేక పేదరికంలో మగ్గుతున్నాయని కులగణనలో వెల్లడైంది. రాష్ట్రంలో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాల్సిందేనని నితీశ్ పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 19.65 శాతం ఎస్సీలు, 1.68 శాతం ఎస్టీలున్నారు. వారిలో ఏకంగా 42.7 శాతం మంది నిరుపేదలని కులగణనలో తేలింది. 27.13 శాతం ఓబీసీలున్నారు. వీరిలో 14.26 శాతం యాదవులు. దాదాపు 17 శాతం మంది ముస్లింలున్నారు. మహాకూటమి యాదవులు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ గురిపెట్టింది. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగాల ని డిమాండ్ చేస్తోంది. అగ్రవర్ణాలతో పాటు ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలనూ ఆకర్షించేలా బీజేపీ, జేడీయూ పావులు కదుపుతున్నాయి. ప్రధాని మోదీ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సర్వేల సంగతేంటి...? బిహార్లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా. ఇండియా కూటమి పైచేయి సాధిస్తుందా? ఎన్నికల వేళ వెన్నుపోటు పొడిచిన నితీశ్కు గుణపాఠం నేర్పాలని కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది. ఆయనది పచ్చి అవకాశవాదమంటూ కాంగ్రెస్, ఆర్జేడీ దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో కులగణన తమ సంకీర్ణ సర్కారు ఘనతేనని ప్రచారం చేస్తున్నాయి. ఇది దేశానికి ఎక్స్రే వంటిదని, కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్నారు. మోదీ హయాంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, కార్పొరేట్ దోపిడీ తదితరాలను ప్రచారా్రస్తాలుగా మలచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వోద్యోగాలతో పాటు పలు సంక్షేమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 6 న్యాయాలు 25 గ్యారంటీలతో విడుదల చేసిన జాతీయ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ ఊరూవాడా ప్రచారం చేస్తోంది. పొత్తులో భాగంగా ఆర్జేడీకి 26, కాంగ్రెస్ 9కి, లెఫ్ట్ పార్టీలకు 5 సీట్లు దక్కాయి. ఆర్జేడీ తమ 26 సీట్లలో మూడింటిని మాజీ మంత్రి ముకేశ్ సాహ్ని సారథ్యంలోని వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి కేటాయించింది. అబ్బాయ్–బాబాయ్ పోరు బిహార్లో అబ్బాయ్–బాబాయ్ అమీతుమీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన వారసత్వం కోసం కుమారుడు చిరాగ్, సోదరుడు పశుపతి పరాస్ హోరాహోరీ తలపడ్డారు. చివరికి పార్టీని పరాస్ చేజిక్కించుకున్నారు. చిరాగ్కు ఎల్జేపీ (రాం విలాస్), పశుపతికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) పేర్లను ఎన్నికల సంఘం కేటాయించింది. పశుపతి పార్టీకి బీజేపీ ఒక్క సీటూ ఇవ్వకపోవడంతో ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారు. సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించారు. చిరాగ్కు బీజేపీ ఐదు సీట్లు ఇవ్వగా పట్టుబట్టి పాశ్వాన్ల కంచుకోట అయిన హాజీపూర్ను సాధించుకున్నారు. అక్కడ బాబాయ్ పశుపతిపై చిరాగ్ నేరుగా తలపడుతుండటం విశేషం! సర్వేల సంగతేంటి...? బిహార్లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా. యూపీఏ హయాంలో భారత్ను బలహీన దేశంగా చూసేవారు. చిన్నాచితకా దేశాల నుంచి కూడా ఉగ్రవాదులు మనపై దాడులకు తెగబడేవారు. కాంగ్రెసేమో చేతకానితనంతో వేరే దేశాలకు ఫిర్యాదు చేస్తుండేది. నేటి భారత్ అలాకాదు, అవసరమైతే ఉగ్రవాదుల ఇళ్లలో దూరి మరీ అంతం చేస్తుంది. – బిహార్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ మహాకూటమి దెబ్బకు బీజేపీ, ఎన్డీఏ కంగుతిన్నాయి. అందుకే మోదీతో సహా అగ్ర నేతలంతా బిహార్లోనే తిరుగుతున్నారు. విపక్షాలపై కత్తిగట్టి ఈడీ, సీబీఐ కూడా ఇక్కడే మరింత ఫోకస్ చేస్తున్నాయి. పేదరికం, ఉపాధి, బిహార్ చిరకాల కోరికైన ప్రత్యేక హోదా గురించి మోదీ మాట్లాడాలి. – ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: ఆ మూడ్ స్వింగ్ ఎటో!
దేశంలో మోదీ మేనియా ఏమాత్రం తగ్గలేదని, ఫలితంగా వరుసగా మూడో ఘనవిజయంతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే కీలక రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్రల్లో మాత్రం ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు. దాంతో వాటిని ఈసారి ఎన్నికల ఫలితాలను నిర్దేశించగల స్వింగ్ స్టేట్లుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఆ మూడు రాష్ట్రాలూ కలిపి ఏకంగా నాలుగో వంతు ఎంపీలను లోక్సభకు పంపుతున్నాయి! వాటిని నిర్ణాయక రాష్ట్రాలుగా మారుస్తున్న కారకాలేమిటి? అక్కడ ఫలితాలను ఊహించడం ఎందుకింత కష్టసాధ్యంగా మారింది...? అమెరికాలో 7 రాష్ట్రాలను స్వింగ్ స్టేట్స్గా పేర్కొంటారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రతిసారీ అవే నిర్ణయిస్తుంటాయి. ఎన్డీఏ 400 సీట్లు దాటాలన్న లక్ష్యాన్ని దాటుతుందో లేదో బెంగాల్, బిహార్, మహారాష్ట్ర ఫలితాలు నిర్ణయించనున్నాయి. బెంగాల్లో టీఎంసీ,బీజేపీ మధ్య పోరు నెలకొంది. బిహార్లో రాజకీయ పునరేకీకరణతో సమీకరణాలు మారాయి. మహారాష్ట్రలో రెండు పెద్ద పార్టీలు నిలువునా చీలి రెండో ఎన్డీఏలో, మరో రెండు విపక్ష ఇండియా కూటముల్లో చేరి ఎదురెదురుగా మోహరించాయి. దాంతో 130 ఎంపీ సీట్లున్న ఈ 3 రాష్ట్రాల్లో ఎవరికెన్ని సీట్లు వస్తాయన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. బెంగాల్లో బీజేపీ పాచిక పారేనా...? 2019 లోక్సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో బీజేపీ పాగా వేసిన తీరు ఆసక్తికరం. మోదీ మేనియాకు పౌరసత్వ అంశం తదితరాలు తోడవడంతో 42 లోక్సభ స్థానాల్లో ఏకంగా 18 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకోగలిగింది. 2014లో 17 శాతమున్న ఓటు శాతాన్ని 40 శాతానికి పెంచుకోగలిగింది. ఈసారి పరిస్థితి ఎలా ఉండనందన్నది అంచనాలకు అందడం లేదు. కాకపోతే ప్రతి స్థానంలోనూ హోరాహోరీ పోరు ఖాయంగా కన్పిస్తోంది. ప్రధాని మోదీ ఇంకా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టలేదు. ఆయన ఏయే అంశాలను ప్రచారాస్త్రాలుగా సంధిస్తారన్నది కూడా ఆసక్తికరం. వాటిని బట్టి రాష్ట్రంలో ఓటర్ల మూడ్ మారిపోయే ఆస్కారముంది. అయితే బెంగాల్లో ఈసారి బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెబుతుండటం ఆసక్తికరం. మిగతా విశ్లేషకులు మాత్రం బీజేపీకి ఈసారి ఓట్లశాతం మరింత పెరగవచ్చంటూనే, అది సీట్ల సంఖ్యలో ప్రతిఫలిస్తుందో లేదో చూడాలని చెబుతుండటం విశేషం. పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడం తదితరాల నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా ఉన్న ముస్లింల ఓట్లు పూర్తిగా టీఎంసీ వైపు మళ్లినట్టేనని వారంటున్నారు. ఇది మా పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి అతి పెద్ద సానుకూలాంశంగా కన్పిస్తోంది. ‘‘దీనికి తోడు యూపీ వంటి రాష్ట్రాల మాదిరిగా బెంగాల్లో బీజేపీకి పటిష్టమైన సంస్థాగత నిర్మాణం లేదు. పైగా రాష్ట్ర పార్టీలో సువేందు అధికారి, దిలీప్ ఘోష్, సుకాంతో మజుందార్ మధ్య ఆధిపత్య పోరు పుట్టి ముంచేలా కన్పిస్తోంది’’ అని సీనియర్ జర్నలిస్టు జయంత ఘోషా అభిప్రాయపడ్డారు. తృణమూల్ తన 22 స్థానాలను నిలుపుకుంటుందని, బీజేపీకి ఒక సీటు పెరుగుతుందని, కాంగ్రెస్ ఒక్క స్థానానికి పడిపోతుందని ఇండియాటుడే సర్వే పేర్కొంది. రసకందాయంలో బిహార్ 2019లో ఎన్డీఏ క్లీన్స్వీప్ చేసిన రాష్ట్రాల్లో బిహార్ ముఖ్యమైనది. 40కి ఏకంగా 39 స్థానాలు అధికార కూటమి వశమయ్యాయి. కానీ ఇక్కడ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం ఎప్పుడూ కత్తిమీద సామే. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడకేనని అంతా భావించారు. తీరా చూస్తే ఆ అంచనాలన్నీ తప్పి జేడీ(ఎస్), ఆర్జేడీల మహాఘట్బంధన్ ఘనవిజయం సాధించింది. కానీ పల్టూ రామ్గా పేరుపడ్డ జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్కుమార్ 2020 అసెంబ్లీ ఎన్నికల నుంచి వేస్తున్న పిల్లిమొగ్గలతో ఓటర్లలో తీవ్ర అయోమయం నెలకొన్నట్టు కన్పిస్తోందని పటా్నకు చెందిన సీనియర్ జర్నలిస్టు రోహిత్సింగ్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టిన నితీశ్ 2022లో దానికి కటీఫ్ చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమితో స్నేహం చేశారు. తాజాగా గత జనవరిలో మళ్లీ ఎన్డీఏ గూటికి చేరారు. దీన్ని జనం జీరి్ణంచుకోలేకపోతున్నారన్నది రోహిత్ విశ్లేషణ. అయితే కుల సమీకణాల కోణంలో బీజేపీ–జేడీ(యూ) భాగస్వామ్యం బలమైన జోడీగా కన్పిస్తుండటం విశేషం. కుర్మీ సామాజికవర్గానికి చెందిన నితీశ్కు రాష్ట్రంలో ఏకంగా 36 శాతమున్న అత్యంత వెనకబడ్డ వర్గాల్లో విశేష ఆదరణ ఉంది. పైగా గతేడాది బిహార్లో జరిపించిన కులగణన ఆయనకు మరిన్ని ఓట్లు కురిపించేలా కన్పిస్తోంది. 2005, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–జేడీ(యూ) జోడీ సూపర్హిట్టయింది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ ఏకంగా 39 సీట్లు కొల్లగొట్టింది. దీనికి తోడు ఎన్నికల వేళ ఇంటి పోరు ఆర్జేడీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ–నితీశ్ జోడీ దూకుడును తేజస్వీ యాదవ్ ఏ మేరకు నిలువరిస్తారన్నది ఆసక్తికరం. ‘మహా’ గందరగోళం... 48 సీట్లున్న మహారాష్ట్ర యూపీ తర్వాత లోక్సభకు అత్యధిక ఎంపీలను పంపుతోంది. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. 2019లోనైతే బీజేపీ, శివసేన సంయుక్తంగా ఏకంగా 41 స్థానాలు ఒడిసిపట్టాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో రాజకీయాలతో పాటు ఏకంగా పార్టీలే మారిపోయాయి! తర్వాత ఏక్నాథ్ షిండే సారథ్యంలో శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలో మరో కీలక పార్టీ ఎన్సీపీ నిలువునా చీలిపోయాయి. చీలిక వర్గాలే అసలైన పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఎన్డీఏలో చేరి బీజేపీతో జట్టు కట్టి ఎన్నికల బరిలో దిగాయి. దీన్ని ప్రజలు పెద్దగా జీర్ణించుకోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ఈసారి కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కూడిన విపక్ష ఇండియా కూటమిదే పైచేయి కావచ్చంటున్నారు. సర్వేలు కూడా ఇండియా కూటమి ఏకంగా 26 స్థానాలు గెలుస్తుందంటున్నాయి. అదే నిజమైతే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి 20 సీట్లకు పైగా గండి పడుతుంది! అదే సమయంలో ఎన్నికల వేళ ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రే మద్దతు ఎన్డీఏకు కాస్త కలిసొచ్చేలా కన్పిస్తోంది. మరాఠా రిజర్వేషన్లది కూడా ఈసారి రాష్ట్రంలో కీలక పాత్ర కానుంది. విద్య, ఉద్యోగాల్లో వారికి అదనంగా 10 శాతం కోటా కలి్పస్తూ శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే ఇటీవలే అసెంబ్లీలో బిల్లు పెట్టారు. సాంప్రదాయికంగా బీజేపీ ఓటర్లయిన ఇతర వెనకబడ్డ వర్గాలు దీనిపై గుర్రుగా ఉన్నారు. మరాఠా కోటా తమ వాటాకే ఎసరు పెడుతుందన్న భయం వారిలో పెరుగుతోంది. ఇన్ని సమీకరణాల మధ్య మహారాష్ట్రలో ఎవరికెన్ని సీట్లొస్తాయో అంచనా వేయడం కష్టంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిజంగా అంత నమ్మకం ఉందా?
అయోధ్యలో రామమందిరం ప్రారంభం ఎన్నికల సునామీని సృష్టిస్తుందని బీజేపీ భావించింది. అందుకే దేవాలయం ప్రారంభించిన వెంటనే బీజేపీ ఏకంగా 370 సీట్లు కైవసం చేసుకుంటుందనీ, ఎన్డీయే కూటమి సంఖ్య 400 దాటుతుందనీ గట్టిగా ప్రకటించింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 400కు పైగా సీట్లు గెలుచుకుంది. అప్పటి నుంచి ఏ పార్టీ కానీ, కూటమి కానీ ఆ రికార్డును అధిగమించలేదు. బీజేపీ వంటి ఆచరణాత్మక పార్టీకి మూడింట రెండు వంతుల మెజారిటీని గెలవడం పిల్లల ఆట కాదని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అందుకే చేజారిపోతోందని భావిస్తున్న అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవడానికి అన్ని ఉపాయాలనూ ఆశ్రయిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీలో భారీ స్థాయిలో విశ్వాస లోపం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీకి తన గెలుపు పట్ల కచ్చితంగా నమ్మకం ఉంటే, పార్లమెంటు ఎన్నికలకు ముందు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్లను ఈడీ (ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) లేదా సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అరెస్టు చేసేవా? ప్రతిపక్ష నేతలపై ఈ విధమైన దాడి, అనివార్యంగా మోదీకి మూడోసారి ప్రధాని పదవి చేపట్టడంపై నమ్మకం లేదన్న సందేశాన్ని పంపుతోంది. మోదీ, ఆయన మనుషులు ఈ దఫా ఎన్నికల్లో 370 సీట్లు గెలుస్తామనీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (నేషనల్ డెమో క్రటిక్ అలయన్ ్స) తరపున 400 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించుకుంటామనీ బహిరంగంగా ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ వాస్తవానికి వారు స్వీయ సందేహంతోనూ, భయాందోళనల తోనూ కొట్టుమిట్టాడుతున్నారు. అలా కాకపోతే, బీజేపీని గెలిపించేందుకు మోదీ తన పాలనలో ‘ప్రతిపక్ష ముక్త్’ (ప్రతిపక్షం లేకుండా) ఎన్నికలను నిర్వహించాలని ఎందుకు నిశ్చయించుకుంటారు? మోదీ చాలా చురుకైనవారు. చాలా తెలివైనవారు. పైగా రాజీ పడని, కరడు గట్టిన వాస్తవికవాది. ఊహాజనిత, భ్రమలు కలిగించే ప్రపంచంలో ఆయన జీవించరు. ఓటర్లు గుడ్డిగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయరని ఆయనకు బాగా తెలుసు. నిస్సందేహంగా ఆయన భారతదేశంలో అత్యంత బలమైన, ఆకర్షణీయమైన నాయ కుడు. కానీ బీజేపీని విజయ తీరాలకు తీసుకెళ్లడానికి తన ముఖం, వ్యక్తిత్వం సరిపోవని ఆయనకు బాగా తెలుసు. ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకుని ప్రజలు ఓట్లు వేస్తారని కూడా మోదీకి తెలుసు. నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుంది. ఒకవైపు నిరుద్యోగ సంక్షోభం, ఉద్యోగాలు పొందే అదృష్టవంతుల ఆదాయంలో స్తబ్ధత ఉండగా, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి, జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ధనవంతులు మరింత ధనికులుగా, పేదలు మరింత పేదలుగా మారడంతో అసమానత రోజురోజుకూ మరింత ప్రస్ఫుటమవుతోంది. మోదీ, ఆయన సహచరులు వేసుకుంటున్న అంతర్గత అంచనాలలో ఇవన్నీ బీజేపీ అవకాశాలపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి; వారిని గందరగోళానికి గురిచేస్తున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆఖరికి తమ మాజీ ముఖ్యమంత్రులను కూడా రంగంలోకి దింపేంత భయంకరమైన పరిస్థితి నెలకొంది. మధ్యప్రదేశ్కు చెందిన శివరాజ్సింగ్ చౌహాన్, కర్ణాటకకు చెందిన బసవరాజ్ బొమ్మై దీనికి ప్రధాన ఉదాహరణలు. అంతేగాక, పార్టీ అభ్యర్థుల భవితవ్యం తెలుసుకోవడం కోసం... ఉత్కంఠతతో, విరామం లేకుండా శ్రమిస్తున్న అగ్ర నాయకులు... సీటు తర్వాత సీటు విషయంలో కులపరమైన అంకగణితాన్ని బేరీజు చేసుకుంటున్నారు. 1994–95లో కాంగ్రెస్ పార్టీ సమర్పించిన పన్ను ఖాతాలపై, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆదాయపు పన్ను శాఖ మదింపు చర్యలను తిరిగి ప్రారంభించాల్సినంత తీవ్రమైన అభద్రతాభావంతో బీజేపీ ఇప్పుడు కొట్టుమిట్టాడుతోంది. ఇది ఖననం చేసిన మూడు దశాబ్దాల తర్వాత పోస్ట్మార్టం పరీక్ష కోసం శవాలను తవ్వినట్లే అవుతుంది. ఒకవైపు కాంగ్రెస్ అవినీతిపై గురిపెడుతూ, దాన్ని దొంగలు, దొంగల పార్టీ అని మోదీ, ఇతర బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు నేరచరిత్ర ఉన్న నేతలను బీజేపీ ఆలింగనం చేసుకుంటోంది. 20 పోలీసు కేసులు, అడవులు, గనులను దోచుకున్నందుకుగాను తొమ్మిది సీబీఐ కేసులతోపాటు తనపై కేసుల్లో బెయిల్ కోసం జడ్జికి 40 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన గాలి జనార్దన్ రెడ్డిని ఇప్పుడు బీజేపీ తనలో (తిరిగి) చేర్చుకుంది! అధికార పక్షాన్ని వాషింగ్ మెషీన్ గా ప్రతిపక్షం అభివర్ణించడాన్ని ఇటువంటి ఫిరాయింపులు బలపరుస్తాయి. దీని ద్వారా కళంకిత నాయకులు నిష్కళంకంగా శుభ్రంగా బయటపడతారు. ఎనిమిది నెలల క్రితం బీజేపీలో చేరిన ప్రఫుల్ పటేల్పై ఉన్న భారీ అవినీతి కేసుపై సీబీఐ గత వారం మూసివేత నివేదికను దాఖలు చేసింది. బీజేపీ సిగలో మరో కలికి తురాయి నవీన్ జిందాల్! ‘కోల్గేట్’ నిందితుడైన హరియాణాకు చెందిన ఈ కాంగ్రెస్ ఎంపీ, తన తల్లి సావిత్రి జిందాల్తో కలిసి భారతదేశాన్ని అభివృద్ధి చేయడం కోసం మోదీతో కలిసి పని చేసేందుకు బీజేపీలోకి వెళ్లారు. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకులను తన రెక్కల కింద పొదువు కోవడానికి బీజేపీని నడిపిస్తున్న కారణం ఏమిటి? 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 400కు పైగా సీట్లు గెలుచుకుంది. అప్పటి నుంచి ఏ పార్టీ కానీ, కూటమి కానీ ఆ రికార్డును ఇప్పటి వరకూ అధిగ మించలేదు. 1984 తర్వాత మూడు దశాబ్దాల పాటు ఏ ఒక్క పార్టీ కూడా 272 సీట్లు కూడా గెలుచుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ అసంఖ్యాక వైఫల్యాలను ఉపయోగించుకుని ‘అచ్ఛే దిన్’ (మంచి రోజులు) వాగ్దానం చేయడం ద్వారా బీజేపీకి 282 సీట్లు వచ్చాయి. ఇక 2019లో, పుల్వామాలో కేంద్ర బలగాలపై జరిగిన మారణకాండను ఉపయోగించుకోవడం ద్వారా బీజేపీ తన సంఖ్యను అనూహ్యంగా 303కు పెంచుకుంది. పుల్వామాలో రక్తపాతానికి ముందు, బీజేపీ చాలా తక్కువ సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశారు. కానీ పుల్వామా ఆ పార్టీకి గేమ్ ఛేంజర్ అయింది. జనవరి 22న అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిన తర్వాత, అది ఏప్రిల్–మేలో ఎన్నికల సునామీని సృష్టిస్తుందని బీజేపీ భావించింది. అందుకే దేవాలయం ప్రారంభించిన వెంటనే బీజేపీ ఏకంగా 370 సీట్లు కైవసం చేసుకుంటుందనీ, ఎన్డీయే సంఖ్య 400 దాటుతుందనీ, లౌకిక–ఉదారవాద భారత్పై హిందుత్వ విజయానికి సంకేతంలా గొంతెత్తి ప్రకటించడం ప్రారంభించింది. కానీ బీజేపీ వంటి ఆచరణాత్మక పార్టీకి ఈసారి మూడింట రెండు వంతుల మెజారిటీని గెలవడం పిల్లల ఆట కాదని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఉత్తర భారతదేశంలో బీజేపీకి ఇప్పటికే ఉన్న దానికంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకునే అవకాశం లేదు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో దాని సంఖ్యను పెంచుకోవడానికి సంస్థాగతమైన శక్తి లేదు. 2019లో కర్ణాటకలోని 28 ఎంపీ స్థానాలకు గానూ బీజేపీ 25 స్థానా లను కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు సిద్దరామయ్య, శివకుమార్లు అధికారంలో ఉన్నందున, బీజేపీ తక్కువ సీట్లు గెలుచుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదు. ఏక్నాథ్ షిండేకి చెందిన శివసేనతో, అజిత్ పవార్కి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ద్వారా మహా రాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ, ఎన్ డీఎ 2019లో గెల్చుకున్న 48 సీట్లలో 41 స్థానాలకు మళ్లీ చేరుకునే అవకాశం లేదు. అదే విధంగా బిహార్లో ఎన్డీఎ 40కి 39 ఎంపీ సీట్లు గెలుచుకుంది. నితీష్ కుమార్ ఎన్ డీఎలోకి తిరిగి వచ్చినప్పటికీ ప్రస్తుత చిత్రం అంత ఆశాజనకంగా లేదు. ఈ అంశాలన్నీ బీజేపీ విశ్వాస సంక్షోభాన్ని, తీవ్రమైన అభద్ర తను, నిర్వీర్యపర్చే సందేహాలను వివరిస్తాయి. అందుకే నిజానిజాలు బయటపడే తరుణంలో బీజేపీ భయాందోళనలకు గురవుతోంది.అందుకే చేజారిపోతోందని భావిస్తున్న అధికారాన్ని ఎలాగైనా నిల బెట్టుకోవడానికి అన్ని ఉపాయాలనూ ఆశ్రయిస్తోంది. ఎస్ఎన్ఎమ్ ఆబ్ది వ్యాసకర్త విదేశాంగ విధానం, దేశీయ రాజకీయాల వ్యాఖ్యాత (‘ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
కాలం చెల్లిన బాబు నమూనా
ఫ్రెంచ్ వనిత డా‘‘ డెలాల్ బెన్బాబాలి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో సోషల్ జాగ్రఫీ – ఆంత్రో పాలజీ స్కాలర్. ఆమె – ‘క్యాస్ట్ డామినెన్స్ అండ్ టెరిటరీ ఇన్ సౌత్ ఇండియా: అండర్స్టాండింగ్ కమ్మాస్ సోషియో –స్పేషియల్ మొబిలిటీ’ అంశంపై పరిశోధన చేశారు. ఆమె తన పరిశోధనలో ప్రధానంగా దృష్టి పెట్టిన అంశం ఆసక్తికరమైనది. ఒక భూభాగంపై ఆధిపత్యం చలాయించే విషయంలో జనాధిక్యత ఉండే కులాలకూ, ఆధిపత్య కులాలకూ మధ్యఉండే వ్యత్యాసాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేశారామె. ‘హైదరాబాద్ నగరంలో ఆంధ్ర కల్చర్ విస్తరించడంలో కొత్తగా వలస వచ్చినవారి పాత్ర,’ ‘సామాజిక ఊర్ధ్వ చలనానికి దోహదం చేస్తున్న వలసలు’ వంటి మరో రెండు పరిశోధనా పత్రా లను కూడా గమనిస్తే వాటిల్లో ‘కామన్’గా కనిపి స్తున్న అంశాలు మూడు ఉన్నాయి. అవి – భూమి, వలసలు, ఆధిపత్యం. ఈ అంశాలను, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అన్వయించడం జరిగింది. ఆమె విదేశీ స్కాలర్ కనుక ఆమెకు ఇక్కడి రాజకీయాలు, కులాల విషయంలో ఇష్టాయిష్టాలకు ఆస్కారం లేదు. పైగా ఆమె పరిశోధనా వ్యాసాలు 2010కి ముందు కాలం నాటివి. కనుక ఆమె సూత్రీక రణలలోని నిజాయతీని అనుమానించడానికి ఆస్కారం కనిపించదు. అయితే, ఆమె తన మొత్తం పరిశోధనను – ‘ఆధిపత్యం’ వద్దకు తెచ్చి ఒక ముగింపు ఇవ్వడం, అందుకు ఆమె తీసుకున్న ఉదాహరణను ముందుగా మనం గుర్తించాలి. ఆంధ్ర ప్రాంతం నుంచి వలసవచ్చిన చంద్రబాబు కులస్థులు హైదరాబాద్ నగరానికి పశ్చిమాన జూబ్లీ హిల్స్–కూకట్ పల్లికి మధ్య ఉన్న భూములను ఆవాసాలుగా చేసుకుని స్థిరపడ్డారు. దాంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆప్రాంతంలో ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారాన్ని ప్రోత్స హించి, దాన్ని ‘సైబరాబాద్’ అంటూ వారు ప్రయోజనం పొందే వ్యూహాన్ని అమలు చేశారు. అతని వ్యూహం మేరకు అది విజయవంతం అయినప్పటికీ, హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణ జిల్లాల్లో కూడా స్థానికులు వీరి ‘ఆధిప త్యాన్ని’ ప్రశ్నించడంతో రాష్ట్ర విభజన జరిగింది. దాంతో ఏపీ సీఎంగా చంద్రబాబు మళ్ళీ అదే పాత ‘సైబరాబాద్’ వ్యూహాన్ని ఈసారి – ‘రాజధాని అమరావతి’ పేరుతో ఇక్కడ అమలుకు తెర తీశారు. బాబు దాని కోసం, భారత ప్రభుత్వం నియమించిన ‘శివరామ కృష్ణన్ కమిటీ’ నివేదికను సైతం పక్కనపెట్టి, అందుకు ‘ఎన్డీయే’లో టీడీపీ భాగస్వామ్యాన్ని అడ్డంగా వాడుకున్నారు. అమరావతి భూమి పూజకు 2016లో వచ్చిననరేంద్రమోదీ ఆ తర్వాత, బాబు ఏపీ తన సొంత జాగీరు అన్నట్టుగా, విదేశీ కంపెనీలతో నిర్మాణ ఒప్పందాలు, ‘అమరావతి’ భూముల్లో వాటాలు ఇచ్చినా, ఏనాడూ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? అని అడిగింది లేదు. బాబు నిజంగా ‘విజనరీ’ అయితే, కొత్త రాష్ట్రం అభివృద్ధి కోసం మొదటి ఐదేళ్లలో పూర్తి చేయగలిగిన ‘ప్లాన్’ మాత్రమే అమలు చేయాలి. అదే జగన్ మోహన్ రెడ్డి విషయంలో చూడండి. అన్ని ఆర్థిక స్థాయుల్లోని వర్గాలకు ‘సంక్షేమం’అందిస్తూనే, రెండున్నర ఏళ్ళ ‘కరోనా’ కాలాన్ని దాటి, తీరాంధ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టి 16 వేల కోట్ల రూపాయలతో 4 పోర్టులు, రూ. 3,793 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లేండ్సెంటర్లు నిర్మిస్తున్నారు. అలా శ్రీకాకుళం నుంచి చిత్తూరు సరిహద్దు వరకు సముద్ర తీరం వెంట సహజ ప్రకృతి వనరుల అభివృద్ధికి పెట్టుబడుల్ని వికేంద్రీకరించడం వల్ల; భవిష్యత్తులో ‘భూమి’ దాని సొంతదారు ‘ఆధిపత్యం’ వంటివి ఇకముందు లేకపోగా, ‘వలసలు’ కూడా ఇకముందు తగ్గుతాయి. డా‘‘ డెలాల్ బెన్బాబాలి తన పరిశోధనా వ్యాసాల్లో ప్రస్తావించిన – భూమి, వలసలు, ఆధిపత్యం అంశాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ తన తొలి టర్మ్లోనే ‘అడ్రెస్’ చేయడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఆమె పరిశోధనా వ్యాసాలు– కమ్మ కులం కేంద్రంగా ఉన్నప్పటికీ, రెడ్ల ప్రస్తావనను ఆమె వదిలి పెట్టలేదు. అయినా ఇక్కడ కులాలు ఏవి అనే ఆరా కంటే, ‘ఎప్పుడు’, ‘ఎవరు’ అనే దృష్టి మనకు ముఖ్యం. దేశం స్వతంత్రమై వందేళ్లకు చేరువ అవుతున్నప్పుడు, వనరుల పంపిణీ అన్ని ప్రాంతాలకూ, అన్ని సామాజిక వర్గాలకూ వారి వారి దామాషా మేరకు చేరే ప్రయత్నం మొద లయిందా లేదా అనేది ఇక్కడ కీలకం. తన మొదటి ఐదేళ్ల టర్మ్ లోనే 13 జిల్లాలను 26గా చేసి ప్రభుత్వాన్ని సూక్ష్మ స్థాయికి తీసుకువెళ్లడంలో జగన్ ప్రభుత్వం విజయవంతం అయింది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఇప్పుడు జరుగుతున్న వనరుల పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. అనుమానం లేదు, అందువల్ల పేద వర్గాల జీవన ప్రమాణాలు మునుపటి కంటే చాలా బాగా మెరుగవుతాయి. - వ్యాసకర్త మాజీ శాసన సభ్యులుమొబైల్: 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
ఎన్సీపీ నేత ప్రఫుల్పటేల్కు సీబీఐ క్లీన్చిట్.. అందుకేనా ?
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన విమానాల లీజు వ్యవహారంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సీబీఐ తాజాగా క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీలో ఈ కేసు విచారణ జరుగుతున్న కోర్టులో సీబీఐ ఈ మేరకు దర్యాప్తు క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది. యూపీఏ హయంలో ప్రఫుల్ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నపుడు ఎయిర్ ఇండియా విమానాల లీజులో అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని క్లోజర్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. ఈ క్లోజర్ రిపోర్టును విచారించి కేసును మూసివేసే అంశంలో నిర్ణయం తీసుకునేందుకుగాను ఏప్రిల్ 15న హాజరుకావాలని కేసు దర్యాప్తు అధికారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. శరద్పవార్ అధ్యక్షుడిగా ఉన్న ఎన్సీపీని ఆయన మేనల్లుడు అజిత్పవార్ చీల్చి మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇది జరిగిన 8 నెలల తర్వాత ఎన్సీపీ ముఖ్య నేత ప్రఫుల్పటేల్కు సీబీఐ క్లీన్చిట్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. అవసరం లేకున్నా ఎయిర్ఇండియా కోసం అత్యంత ఎక్కువ ఖర్చుతో విమానాలు లీజుకు తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రఫుల్పటేల్ మీద 2017లో సీబీఐ కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసింది. ఇదీ చదవండి.. బీజేపీకి అర్థం కావడం లేదు.. చిదంబరం -
అక్కా.. వచ్చేస్తున్నా! ఎన్డీఏ వైపు పల్లవి పటేల్
లోక్సభ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఉత్తర ప్రదేశ్లో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ‘ఇండియా’ కూటమికి షాకిస్తూ అప్నా దళ్ (కామెరవాడి) నాయకురాలు, సిరతు ఎమ్మెల్యే పల్లవి పటేల్ ( Pallavi Patel ) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇక పొత్తుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బిహార్లో ‘ఇండియా’ కూటమికి నితీష్ కుమార్ ఇచ్చిన షాకే ఉత్తరప్రదేశ్లోని అప్నా దళ్-కామెరవాడి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. "ప్రస్తుతం ఎన్డీఏతో చర్చలు లేవు. ఒకవేళ ఆఫర్ వస్తే తమ పార్టీ పరిశీలిస్తుంది" అని డాక్టర్ పల్లవి పటేల్ చెప్పారు. మరోవైపు అప్నా దళ్ (కామెరవాడి) ఉత్తరప్రదేశ్లోని మూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఒక రోజు తర్వాత సమాజ్వాదీ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కృష్ణ పటేల్ నేతృత్వంలోని పార్టీతో పొత్తు లేదని తెలిపింది. “అప్నాదళ్ (కె), సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు 2022 అసెంబ్లీ ఎన్నికల కోసమే కానీ, 2024 ఎన్నికల కోసం కాదు” అని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. పల్లవి పటేల్ సోదరి, అప్నా దళ్ (సోనేలాల్) అధినేత్రి అనుప్రియా పటేల్ ( Anupriya Patel ) ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. అప్నా దళ్ (కే) ప్రకటించిన మూడు స్థానాల్లో మీర్జాపూర్ స్థానం నుండి అనుప్రియా పటేల్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఫుల్పూర్, కౌశంబి లోక్సభ స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం మూడు స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. -
బీజేపీతో పొత్తు: లోక్సభ బరిలో దినకరన్ పార్టీ.. ఎన్ని సీట్లంటే?
చెన్నై: సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఈసారి బోణి చేసి.. అధిక సీట్లు గెలవాలనే లక్ష్యంతో ముందుకువెళ్తోంది. ఈనేపథ్యంలో ఎన్డీయే కూటమిలో భాగంగా.. తమిళనాడు పొత్తులపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తమిళనాడులో పీఎంకే (పట్టాలి మక్కళ్ కట్చి) పార్టీతో బీజేపీ పొత్తు ఖరారైంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో పీఎంకే పార్టీకి 10 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ.. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే)తో పొత్తులో భాగంగా సీట్ల పంపకం ఖరారు చేసింది. బీజేపీ ఏఎంఎంకేకు రెండు సీట్లు కేటాయించినట్లు ఆ పార్టీ చీఫ్ టీటీవీ దినకరన్ బుధవారం వెల్లడించారు. ‘బీజేపీ మా పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వడానికే మొగ్గు చూపింది. కానీ, మాకు కేవలం రెండు సీట్ల మాత్రమే కావాలని కోరాం. మా అభిప్రాయాన్ని పరిగణలోకి బీజేపీ మాకు రెండు సీట్లు కేటాయించింది. మాకు సీట్ల సంఖ్య పాధాన్యం కాదు.. మాకే ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించటమే ముఖ్యం’ అని టీటీవీ దినకరన్ అన్నారు. ఏయే పార్లమెంట్ నియోజకవర్గాలను తమకు కేటాయిస్తారమే విషయాన్ని బీజేపీ వెల్లడిస్తుందని తెలిపారు. తమిళనాడులో బీజేపీ గణనీయమైన ఎదుగుదలను కనబరుస్తోందని తెలిపారు. అయితే తమ పార్టీ గుర్తు కుక్కర్ కేటాయింపు విషయంలో ఎన్నికల సంఘం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఏడీఎంకే పార్టీపై దినకరన్ విమర్శలు చేశారు. ఆ పార్టీ రోజురోజుకుగా ప్రభావం కోల్పోతోందన్నారు. కేవలం కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఆ పార్టీ పనిచేస్తోందని అన్నారు. పరోక్షంగా ఏఐఏడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామిపై విమర్శలు చేశారు. దినకరన్.. ఏఐఏడిఎంకే పార్టీ నుంచి 2017లో బయటకు వచ్చి ఏఎంఎంకే పార్టీన స్థాపించిన విషయం తెలిసిందే. ఇక.. తమిళానాడు ఇప్పటివరకు బీజేపీ ఒక్కస్థానంలో కూడా గెలుపొందకపోటం గమనార్హం. 2019లో లోకసభ ఎన్నికల్లో సైతం ఎన్డీయే మిత్రపక్ష పార్టీ ఏఐఏడిఎంకే పార్టీ ఒక సీటు గెలుచుకుంది. చదవండి: కాంగ్రెస్లో చేరిన బీఎస్పీ సస్పెండెడ్ ఎంపీ -
ఇండియా కూటమితో టచ్లో పశుపతి పరాస్!
రాష్ట్రీయ లోక్జనశక్తి (ఆర్ఎల్జేపీ) పార్టీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్.. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీహార్లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో తనకు అన్యాయం జరగటంతో ఎన్డీయే కూటమితో పాటు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం ప్రకటించారు. అయితే ఆయన ప్రతిపక్షాల ఇండియా కూటమికి టచ్లో ఉన్నారని తెలుస్తోంది. పశుపతి పరాస్ ఎన్డీయేకు గుడ్బై చెప్పిన వెంటనే ఆర్జేడీ నేత తేజ్ప్రతాప్ యాదవ్ స్పందిస్తూ.. బిహార్లోని ప్రతిపక్ష కూటమికి ఆహ్వానించారు. ‘ఒకవేళ పశుపతి పరాస్ బీహార్ ప్రతిపక్ష కూటమిలోకి రావాలనుకుంటే.. మేము స్వాగతం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధమే. రాజీనామా చేసిన పరాస్ను బీజేపీ ఏం చేయలేదు’ అని అన్నారు. అయితే పరాస్.. పలు లోక్సభ స్థానాలతో పాటు హాజీపూర్ సెగ్మెంట్ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు ఎంతో కీలకమైన హాజీపూర్ స్థానంలో కచ్చితంగా పోటీ చేస్తానని.. అవసరమైతే ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడానికి కూడా సిద్దమేని ఇటీవల పరాస్ ప్రకటించారు. అయితే సోమవారం బీజేపీ.. పరాస్ను పక్కనబెట్టి జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్)తో సీట్ల పంపకం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పశుపతి పరాస్ ఎన్డీయే నుంచి తప్పుకున్నారు. మరోవైపు పరాస్కు కంచుకోట అయిన హాజీపూర్లో బీజేపీ.. లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) పార్టీ అభ్యర్థికి టికెట్ కేటాయించటం గమనార్హం. ఒకవేళ పరాస్ ఇండియా కూటమిలో చేరితే ఆయనకు హాజీపూర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందో లేదో వేచి చూడాలి. -
Bihar: అబ్బాయ్వైపే బీజేపీ మొగ్గు
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్లో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ రాజకీయం రంజుగా మారింది. లోక్సభ సీట్ల కేటాయింపుతో బీహార్లో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ రాజకీయం తెరపైకి వచ్చింది. నిన్న మొన్నటి వరకు లోక్ జనశక్తిని పార్టీ (ఆర్ఎల్జేపీ) శాసించి మోదీ వర్గంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బాబాయ్ పసుపతి పరాస్ ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం పోరాడుతుంటే.. మరోవైపు తన తండ్రి స్థాపించిన లోక్ జన శక్తి పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టిన అబ్బాయి చిరాగ్ పాశ్వాన్ వైపే బీజేపీ మొగ్గు చూపింది. బీజేపీ తీరుపై అసంతృప్తి గత కొంత కాలంగా పసుపతి పరాస్ కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగుతారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అతని ఎమ్మెల్యేలు ఇండియా కుటమికి మద్దతు పలుకుతున్నారని, వారం క్రితం చిరాగ్ పాస్వాన్ సైతం బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారంటూ రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు జోరుగా సాగాయి. ఈ వరుస పరిణామాలపై పశుపతి పరాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పార్టీ ఆర్ఎల్జేపీ కూడా ఎన్డీయేలో భాగమేనని తెలిపారు. అంతేకాదు తమ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని పశుపతి పరాస్ అన్నారు. ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ తమకు ఉందని ఎన్డీయేను హెచ్చరించారు. పాశ్వాన్ వైపే మొగ్గు అదే సమయంలో ఒకప్పుడు తనను తాను ప్రధాని నరేంద్ర మోదీకి ‘హనుమంతుడు’గా అభివర్ణించుకున్న పాశ్వాన్ ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా పాశ్వాన్ ఆశించిన ఆరు సీట్లలో ఐదు స్థానాలను దక్కించుకున్నారు. అయితే, ఆ జాబితాలో అతని దివంగత తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్కు చెందిన హాజీపూర్ లోక్సభ స్థానం ఉంది. అంచనాలు తారుమారు రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి పరాస్ హాజీపూర్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారు చేశాయి. 6 శాతం పాశ్వాన్ వర్గం ఓట్లు చిరాగ్ పాస్వాన్కు కలిసొచ్చాయి. పొత్తులో భాగంగా లోక్సభ సీట్ల పంపిణీలో బాబాయ్ పశుపతి పరాస్ను కాదనుకుని అబ్బాయి చిరాగ్ పాస్వాన్తో పొత్తు పెట్టుకునేందుకు కారణమయ్యాయి. కాగా, చిరాగ్ పాశ్వాన్ తండ్రి దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్ హాజీపూర్ నుండి ఎనిమిది సార్లు గెలుపొందారు. వాటిలో నాలుగు వరుస విజయాలున్నాయి. చిరాగ్ పాస్వాన్ పార్టీ సమస్తిపూర్, జముయి, వైశాలి, ఖగారియా లోక్సభ స్థానాల్లో పోటీకి దిగనుంది. ఎవరికెన్ని సీట్లంటే? లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్లో పొత్తులు ఖరారయ్యాయి. అలయన్స్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న 40 లోక్సభ స్థానాలకు గాను పెద్దన్నగా వ్యవహరిస్తున్నబీజేపీ (17), సీఎం నితీష్కుమార్ పార్టీ జనతాదళ్ యూనైటెడ్ (16), లోక్జనశక్తి పార్టీ (5), బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ పార్టీ హిందుస్థాన్ ఆవామ్ మోర్చాకి (1), రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీకి (1) సీట్లు కేటాయించింది. మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుంది. -
మరో ఫ్లాప్ షో.. ప్రజాగళం
సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి, నరసరావుపేట: ఎన్డీఏలో తెలుగుదేశం, జనసేన చేరిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సభ ప్రధానికి అవమానంతో మొదలై, జనం రాక, మైకులు పనిచేయక చివరకు నవ్వులపాలై ఓ ఫ్లాప్ షోగా మిగిలింది. ప్రధాని మోదీ వస్తుండటంతో 15 లక్షల మందితో భారీ సభ ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రచారం చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటిస్తామని చెప్పారు. తీరా చూస్తే సభకు పట్టుమని లక్ష మంది కూడా రాలేదు. మేనిఫెస్టో కూడా లేదు. వైఎస్సార్సీపీ సిద్ధం సభలు పది లక్షలు, పదిహేను లక్షల జనంతో విజయవంతమై చరిత్ర సృష్టించాయి. వాటి స్థాయిలో నిర్వహించాలన్న భావనతో టీడీపీ, జనసేన ఏర్పాట్లు చేశాయి. తీరా చూస్తే కనీసం లక్ష మంది కూడా రాలేదు. మరోపక్క జనం లేకపోవడాన్ని కవర్ చేయడానికి చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలతో చేయించిన హడావుడి ప్రధాని మోదీని అసహనానికి గురి చేసింది. టీడీపీ కార్యకర్తలు సౌండ్ బాక్సుల పైకి దూసుకురావడంతో చాలాసార్లు మైకులు మొరాయించాయి. కార్యకర్తలు సౌండ్ బాక్సుల టవర్లు, లైటింగ్ టవర్ల పైకి ఎక్కడంతో మోదీ తీవ్రంగా వారిని హెచ్చరించారు. 100 ఎకరాల్లో సభకు 30 ఎకరాలే బొప్పూడి వద్ద సుమారు దాదాపు 100 ఎకరాల్లో ఈ సభకు ఏర్పాట్లు చేశారు. అందులో పార్కింగ్కి పోను కేవలం 40 ఎకరాలను సభ కోసం కేటాయించారు. అందులో వేదిక, హెలీప్యాడ్ల కోసం పది ఎకరాలు కేటాయించగా మిగిలిన 30 ఎకరాల్లో మాత్రమే కార్యకర్తల కోసం ఏర్పాట్లు చేశారు. మొత్తం 24 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో 2 వేల కుర్చిలు వేశారు. అవి కూడా ఒక కుర్చికి ఇంకో కుర్చికి మధ్య రెండు అడుగులు గ్యాప్ ఉండేలా వేశారు. మొత్తం 48 వేల కుర్చిలు వేసినట్లు చెబుతున్నారు. వాటిలో 6 వేల కుర్చిలు కూడా నిండలేదు. మోదీ ప్రసంగం మొదలైన నిమిషానికే మైకు మొరాయించడంతో రెండు నిముషాలు ఆగాల్సి వచ్చింది. ఈ సమయంలోనే ఎక్కువ మంది లేచి వెళ్లిపోవడం మొదలెట్టారు. మోదీ మాట్లాడే సమయంలో మూడుసార్లు అంటే దాదాపు ఏడు నిమిషాలకు పైగా మైకులు ఆగిపోవడంతో సభా ప్రాంగణం ఖాళీ అయిపోయింది. టీడీపీ ప్రోద్బలంతో టవర్లెక్కిన కార్యకర్తలు.. హెచ్చరించిన ప్రధాని సభా వేదికపైకి మోదీ వచ్చిన సమయానికి కూడా జనం లేకపోవడంతో చంద్రబాబు, పవన్లో ఆందోళన కనిపించింది. మోదీ వేదిక మీదకు వచ్చిన తరువాత పవన్, బాబు ప్రసంగించారు. దీన్ని గమనించిన చంద్రబాబు అండ్ టీం పరువు కాపాడుకోవడానికి తమకు తెలిసిన టక్కుటమార విద్యలను ప్రదర్శించారు. ఖాళీ కుర్చిల నుంచి మోదీ దృష్టి మళ్లించేందుకు సభలో టీడీపీ కార్యకర్తలతో గందరగోళం సృష్టించి జనం భారీగా వచ్చారన్న భ్రమలు కల్పించే ప్రయత్నం చేశారు. ముందు ఉన్న కార్యకర్తలు స్టేజ్ వద్దకు దూసుకువస్తున్నట్టు ప్రయత్నించారు. సౌండ్ బాక్స్ టవర్లను సైతం ఎక్కి హడావుడి చేశారు. పవన్ మాట్లాడుతున్న సమయంలో చాలా మంది మైక్ టవర్స్, లైటింగ్ కోసం కట్టిన టవర్లపై ఎక్కడాన్ని మోదీ గమనించారు. పవన్ను ఆపి మోదీ మాట్లాడారు. ఏదైనా జరగరానిది జరిగితే ఇబ్బందులు ఎదురౌతాయని, దయచేసి దిగాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రధాని గట్టిగా హెచ్చరించడంతో టీడీపీ కార్యకర్తలు టవర్ల పైనుంచి కిందికి దిగారు. మొరాయించిన మైకులు..ప్రధాని అసహనం ప్రధాని మోదీ మాట్లాడుతుండగా మైకులు పదే పదే మొరాయించడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. జనం రాకపోవడాన్ని కవర్ చేయడంలో భాగంగా చంద్రబాబు తన కార్యకర్తలతో చేయిస్తున్న హడావుడిలో భాగంగా వారంతా సౌండ్ సిస్టం వద్దకు దూసుకుపోయారు. వారి తాకిడితో వైర్లు, ఇతర పరికరాలు కదిలిపోయి మైకులు మొరాయించాయి. పవన్, చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ఒకటి, రెండుసార్లు అంతరాయం కలిగింది. ప్ర«ధాని మోదీ మాట్లాడుతున్న సమయంలో తొలుత మూడు నిమిషాలు మైకులు పనిచేయలేదు. తరువాత ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా మరోసారి ఐదు నిమిషాల దాకా అంతరాయం కలిగింది. దీంతో మోదీ అసహనానికి గురయ్యారు. ‘దయ ఉంచి అక్కడ ఉన్నవారంతా వెనక్కి వెళ్తే మైక్ పనిచేస్తుంది. సభకు అంతరాయం కలిగించవద్దు. మీ ఉత్సాహం, మీ జోష్ నాకు ఇష్టమే. కానీ మీరు కొంచెం ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. దూరంగా ఉన్నవారు ప్రశాంతంగా ఉన్నారు. మీరెందుకు హడావిడి చేస్తున్నారు’ అంటూ మోదీ చిరాకు పడ్డారు. తొలి మీటింగే ఫెయిలవడంతో... బీజేపీతో పొత్తు కుదరడంతో టీడీపీ నిర్వహించిన తొలి సభ విఫలమవడంతో టీడీపీ, జనసేన కేడర్ నైరాశ్యంలోకి వెళ్లింది. గట్టిగా ఓ మీటింగ్ నిర్వహించలేకపోతున్నాం.. ఇదేమి ఖర్మ.. అంటూ టీడీపీ కార్యకర్తలు అక్కడే వ్యాఖ్యానించారు. మరోవైపు సభలో సామాన్య ప్రజలు కనిపించలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. చిలకలూరిపేట సమీపంలో టీడీపీ నేతల మిల్లుల్లో పనిచేసే నార్త్ ఇండియా వలస కూలీలు కూడా సభలో అధిక సంఖ్యలో కనిపించారు. మహిళలు ఈ సభకు దూరంగా ఉన్నారు. సభలో స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆర్టీసీ బస్సులతోపాటు నారాయణ, భాష్యం వంటి టీడీపీ అనుకూల విద్యా సంస్థల నుంచి వందలాది బస్సులు గ్రామాలకు పంపినా జనం లేక ఖాళీగానే వచ్చాయి. కొన్నింటిలో సగం మంది కూడా లేరు. ఒక్కొక్కరికి రూ.500 నుంచి రూ.1,000 దాకా నగదు, మందు బాటిల్, బిర్యానీ పొట్లం ఇచ్చినా సభకు రాలేదని నేతలు చిరాకుపడ్డారు. బొçప్పూడి సభతో ప్రజల నాడి అర్థమవుతోందన్న భావన వారిలో నెలకొంది. ప్రజలు సీఎం వైఎస్ జగన్ వైపు ఉన్నారన్న విషయం ఈ సభ ద్వారా మరోసారి రుజువైందని టీడీపీ కార్యకర్తలే సభ బయట వ్యాఖ్యానించారు. వైఫల్యాన్ని పుల్లారావుపై నెట్టేశారు సభ వైఫల్యాన్ని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు పైకి తోసే ప్రయత్నం మొదలైంది. సభ అట్టర్ ఫ్లాప్ అవడం, ప్రధానికి వేదికపై అవమానం జరగడం, మైకులు పనిచేయకపోవడానికి పుల్లారావే కారణం అంటూ ఎల్లో మీడియా ప్రచారం మొదలు పెట్టింది. మైక్ సిస్టమ్కు సరైన రక్షణ ఏర్పాట్లు చేయలేదని, అసలు ఏర్పాట్లను పుల్లారావు పట్టించుకోలేదంటూ ప్రచారం చేస్తున్నారు. వ్యాఖ్యాతను కూడా సరైన వారిని పెట్టలేదంటూ కామెంట్లు మొదలుపెట్టారు. దీంతో పుల్లారావు మీడియా ముందుకు వచ్చి పోలీసుల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ వివరణ ఇచ్చారు. సభకు ప్రజలు రాకపోవడానికి కారణాన్ని ఎల్లో మీడియా కూడా పోలీసులపై నెట్టేసింది. ట్రాఫిక్ జామ్ అయ్యిందని, పోలీసులు సరిగా పర్యవేక్షించలేదంటూ ఎల్లో మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. సభా వేదికపై ప్రధానికి అవమానం రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్డీఏ కూటమి సభకు హాజరైన ప్రధాన మంత్రి మోదీకి సభా వేదికపైనే అవమానం జరిగింది. దేశ ప్రధాని కోసం కనీసం ఒక పూల బొకే తీసుకురావాలన్న ఆలోచన 40 ఏళ్ల రాజకీయం అనుభవం, 14 ఏళ్లు సీఎంగా పనిచేసన టీడీపీ అధినేత చంద్రబాబుకు, వందలాది పుస్తకాలు చదివానని చెప్పుకొనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు రాలేదు. ప్రధాని హెలికాప్టర్ దిగి వేదిక పైకి రాగానే వట్టి చేతులతోనే ఆహా్వనం పలికారు. ఆయన కూర్చున్న తర్వాత ప్రధాని మంత్రి మోదీని చంద్రబాబునాయుడు సన్మానిస్తారని, పవన్ పూల బొకే ఇస్తారని వ్యాఖ్యాత చెప్పారు. దీంతో మోదీ సహా అందరూ లేచి నిల్చున్నారు. అయితే, అక్కడ శాలువా లేదు, పూల బొకే లేదు. దీంతో చంద్రబాబు, పవన్ దిక్కులు చూస్తూ నిల్చున్నారు. శాలువా కోసం అటూఇటూ చూశారు. విషయం గమనించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తాను సభ పూర్తి అయిన తర్వాత మోదీని సన్మానించేందుకు తీసుకువచ్చిన వినాయకుడి విగ్రహాన్ని బహూకరించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబుకు మోదీ క్లాస్! ఏ సభలో అయినా ఉత్సాహంగా ప్రసంగించే ప్రధాని మోదీ ఈ సభలో జనం లేకపోవడం, పదే పదే మైకులు మొరాయించడంతో కొంత కోపంగా ప్రసంగించారని బీజేపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని సభా వేదికపై ఉన్నంతసేపూ కోపంగానే ఉన్నారు. చంద్రబాబు, పవన్తో అంటీముట్టనట్లుగానే ఉన్నారు. మీటింగ్ జరిగిన తీరుపై ప్రధాని మోదీ చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేస్తూ క్లాస్ పీకినట్టు సమాచారం. సభ జరుగుతున్నంత సేపు చంద్రబాబు, పవన్ల మొహాల్లోనూ ఏమాత్రం ఆనందం లేదు. అన్నమో ‘నారాయణా’ ♦ ప్రజాగళం సభకు నుంచి జనాన్ని పంపిన మాజీ మంత్రి నారాయణ ♦ ఒంగోలు వద్ద భోజనం పెడతామని పంపారు.. సాయంత్రం 4 దాటినా భోజనాలు అందని వైనం ♦ ఆకలితో అలమటించిన మహిళలు ♦ సభకు వెళ్లకుండానే వెనక్కి వెళ్లిన బస్సులు మద్దిపాడు: చిలకలూరిపేట సమీపంలో ఆదివారం జరిగిన ప్రజాగళం సభకు బయల్దేరిన జనం ఆకలితో అలమటించి, మధ్యలోనే ఆగిపోయారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, రాయలసీమ జిల్లాల నుంచి ప్రజలను తరలించారు. నెల్లూరు, చుటుపక్కల ప్రాంతాల నుంచి టీడీపీకి చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ ప్రజలను ఈ సభకు తరలించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నారాయణ విద్యా సంస్థల బస్సులను తెప్పించి, మధ్యాహ్నం 12 గంటలకే వాటిలో కార్యకర్తలు, మహిళలను తరలించారు. వారికి మధ్యాహ్నం 2 గంటలకు ఒంగోలు సమీపంలోని సూరారెడ్డిపాలెం వద్ద భోజనాలు అందిస్తారని చెప్పారు. వారు అక్కడికి మధ్యాహ్నం వేళ చేరారు. అక్కడ నారాయణ పంపిన బస్సుల్లోని వారికి భోజనాలు అందలేదు. సాయంత్రం 4 దాటినా భోజనం పెట్టలేదు. బస్సుల్లో ఉన్న మహిళలు ఆకలికి తట్టుకోలేకపోవడంతో వారితో వచ్చిన ద్వితీయ శ్రేణి నేతలు గుండ్లాపల్లి సమీపంలో బస్సులు నిలిపి స్థానికంగా ఉన్న ధాబాల వద్ద వారికి భోజనం పెట్టించి వెనక్కి తీసుకువెళ్లారు. మీటింగ్కు వెళ్లరా.. అని ద్వితీయ శ్రేణి నాయకులను అడగ్గా.. మీటింగ్ సంగతి ఎత్తితే మహిళలు కొట్టేలా ఉన్నారని, తెలిపారు. మీటింగ్కు వెళ్లడానికి డబ్బులు ఇచ్చారా... అన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు. -
ఎన్డీఏలోకి రాజ్ఠాక్రే?
మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరగబోతున్నాయి. ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ఠాక్రే ఎన్డీఏలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ ఠాక్రే ఎన్డీయేలో చేరడంపై జరుగుతున్న చర్చలు చివరి దశలో ఉన్నాయని తెలుస్తోంది. దక్షిణ ముంబై సీటును ఎంఎన్ఎస్ అభ్యర్థికి కేటాయించాలని రాజ్ ఠాక్రే డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఈ సీటు నుంచి ఇప్పటికే బీజేపీ తరపున రాహుల్ నర్వేకర్ పేరు వినిపిస్తోంది. కాగా రాజ్ ఠాక్రే డిమాండ్పై బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఈ సీటు కేటాయించిన తర్వాతనే రాజ్ఠాక్రే ఎన్డీఏలో చేరనున్నారనే వార్త వినిపిస్తోంది. తాజాగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో బీజేపీకి ఒప్పందం ఏమీ లేదని అన్నారు. బీజేపీ, షిండే నేతృత్వంలోని శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) కూటమి మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈసారి బీజేపీ సీట్ల రికార్డును బ్రేక్ చేస్తుందన్నారు. -
‘అభివృద్ధిని ఇండియా కూటమి ఓర్వలేదు’: ప్రధాని మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లో రూ.42 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘అజంగఢ్లో గతంలో మాఫియా పాలన ఉండేదని, ఇప్పుడు ఇక్కడి ప్రజలు చట్టబద్ధమైన పాలనను చూస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ‘ఇండియా కూటమి’కి నిద్రపట్టడంలేదని ప్రధాని మోదీ విమర్శించారు. అజంగఢ్ అభివృద్ధికి బాటలు వేస్తుందని, నక్షత్రంలా వెలిగిపోతుందని మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నేతలు కేవలం పథకాలను మాత్రమే ప్రకటించేవారని విమర్శించారు. మోదీ కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అని, దేశాభివృద్ధే లక్ష్యంగా తన ప్రయాణం సాతున్నదని అన్నారు. అజంగఢ్ అభివృద్ధికి చిహ్నంగా మారుతుందని మోదీ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజల కళ్లలో దుమ్ము కొట్టిందని ఆరోపించారు. తాము దేశంలో అనేక రైల్వే స్టేషన్లు ఏకకాలంలో నిర్మిస్తున్నామన్నారు. దేశం మొత్తం మీద అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఇక్కడ నుండే ప్రారంభమవుతున్నాయని, ఈరోజు దాదాపు రూ.34 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అజంగఢ్ నుంచి ప్రారంభించామన్నారు. నేడు ఆజంగఢ్ కొత్త చరిత్ర నాందిపలుకుతోందని అన్నారు. కులతత్వం, బంధుప్రీతి, ఓటు బ్యాంకుపై ఆధారపడిన ఇండియా కూటమి ఇంతటి అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తోపాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ.. అజంగఢ్, పూర్వాంచల్ ప్రజలకు రాజా సుహెల్దేవ్ స్టేట్ యూనివర్శిటీ, మండూరి విమానాశ్రయంతో సహా అనేక ప్రాజెక్టులను కానుకగా ఇచ్చారు. पूर्वी उत्तर प्रदेश समेत पूरे देश के परिवारजनों के जीवन को आसान बनाने के लिए हमारी सरकार दिन-रात काम रही है। आजमगढ़ में विकास कार्यों के शिलान्यास और लोकार्पण कार्यक्रम को संबोधित कर रहा हूं।https://t.co/fGxt3QsZt4 — Narendra Modi (@narendramodi) March 10, 2024 -
ఇండియా కూటమి కొత్త ప్లాన్.. బీజేపీ మిత్ర పక్షానికి గాలం!
రానున్న లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి సరికొత్త ఎత్తులు వేస్తోంది. బీహార్లో సీట్ల పంపకాల విషయంలో ఎన్డీఏలో తర్జనభర్జనలు కొనసాగుతుండగా ఇండియా కూటమి రాజకీయ చదరంగంలో ఎత్తుగడ వేసింది. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్కు బిహార్లో ఎనిమిది లోక్సభ స్థానాలు, ఉత్తరప్రదేశ్లో రెండు స్థానాలను ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఎన్డీఏ బీహార్లో తమకు కేవలం ఆరు లోక్సభ నియోజకవర్గాలను మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఇవి కూడా తన చిన్నాన్న పశుపతి పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీతో పంచుకోవాల్సి రావచ్చు. ఇటువంటి పరిస్థితిలో ఇండియా కూటమి నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన పాశ్వాన్ను ఊరించవచ్చు. చిరాగ్ పాశ్వాన్ను ఆకట్టుకునేందుకు 2019లో అవిభాజ్య లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) పోటీ చేసిన మొత్తం ఆరు సీట్లతోపాటు అదనంగా బిహార్లో రెండు, ఉత్తరప్రదేశ్లో రెండు స్థానాలను ఇండియా కూటమి ఈ డీల్లో పొందుపరిచినట్లు సమాచారం. పార్టీ చీఫ్, ప్రముఖ నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణించిన ఏడాది తర్వాత పశుపతి పరాస్ తిరుగుబాటుతో 2021లో లోక్ జనశక్తి పార్టీ చీలిపోయింది. పశుపతి పరాస్ రామ్ విలాస్ పాశ్వాన్కు సోదరుడు. చిరాగ్ పాశ్వాన్కు చిన్నాన్న. పరాస్కు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేబినెట్ బెర్త్ ఇచ్చినప్పుడు చిరాగ్ పాశ్వాన్ జేడీయూ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై విమర్శలు చేశారు. అయితే బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని మాత్రం పళ్లెత్తు మాట కూడా అనలేదు. నితీష్ కుమార్తో విభేదాల కారణంగా 2020లో ఎన్డీఏ నుండి వైదొలిగిన చిరాగ్ పాశ్వాన్ మళ్లీ గతేడాది తిరిగి ఎన్డీఏలో చేరారు. -
RLD: అలా ఎన్డీఏలో చేరిక.. ఇలా అభ్యర్థుల ప్రకటన!
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో అధికారికంగా చేరిన రెండు రోజుల్లోనే రాష్ట్రీయ జనతాదళ్ (RLD) లోక్సభ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించింది. 2024 లోక్సభ ఎన్నికలకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఆర్ఎల్డీ వెల్లడించింది. జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ పార్టీ బిజ్నోర్ నుండి చందన్ చౌహాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ నుండి రాజ్కుమార్ సాంగ్వాన్లను పోటీకి దింపింది. 2019 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన మలూక్ నగర్ బిజ్నోర్ స్థానాన్ని గెలుచుకుంది. బాగ్పట్ సీటును బీజేపీ అభ్యర్థి సత్యపాల్ సింగ్ గెలుచుకున్నారు. ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికలకు కూడా ఆర్ఎల్డీ అభ్యర్థిని ప్రకటించింది. యోగేష్ చౌదరిని రంగంలోకి దించింది. ఉత్తరప్రదేశ్లో 51 మందితో సహా దేశవ్యాప్తంగా 195 మంది అభ్యర్థులను బీజేపీ ఆదివారం ప్రకటించింది. అత్యధికంగా 80 సీట్లు ఉండటంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో పాటు ప్రతిపక్ష ఇండియా కూటమికి ఉత్తరప్రదేశ్ కీలకం . జయంత్ చౌదరి తాత, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్కు మరణానంతరం గత నెలలో భారతరత్న అవార్డు లభించింది. జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో 2019లో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల పొత్తుతో పోటీ చేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 80 స్థానాలకు గానూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 64 స్థానాలను కైవసం చేసుకుంది. -
బిహార్లో ఆగని ఫిరాయింపుల పర్వం
పట్నా: బిహార్లోని మహాఘఠ్బంధన్ కూటమిలో ఫిరాయింపుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆర్జేడీకి చెందిన మరో ఎమ్మెల్యే భరత్ బిండ్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన శుక్రవారం ఎన్డీఏ పక్షంలోకి మారారు. కాంగ్రెస్కు చెందిన మహిళా ఎమ్మెల్యే నీతూ కుమారి పార్టీ లోక్సభ టిక్కెట్ ఇస్తే సరేసరి లేకుంటే బీజేపీలో చేరడం ఖాయమని ప్రకటించారు. ఇప్పటికే ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవధ్ బిహారీ చౌధరిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా అదే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటేయడం, నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం తెలిసిందే. తాజా పరిణామాలతో 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఎన్డీఏ బలం 135కు చేరుకుంది. -
Lok Sabha elections 2024: ‘మోదీ గ్యారంటీల’తో గెలుస్తాం
బర్వాడా/సింద్రీ: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400కుపైగా సీట్లు సాధించడం తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మోదీ గ్యారంటీలే తమను గెలిపిస్తాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా ‘మోదీ గ్యారంటీ’ అనే నినాదం గట్టిగా వినిపిస్తోందని చెప్పారు. ప్రజల ఆశలు అంతమైన చోటునుంచే మోదీ గ్యారంటీ ప్రారంభమవుతుందని మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం జార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్ జిల్లాలోని సింద్రీలో రూ.35,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అనంతరం ‘విజయ్ సంకల్ప్ మహార్యాలీ’లో ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అబివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా కూడా ఒకటి అని గుర్తుచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 8.4 వృద్ధిరేటు నమోదైందని, ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉందని వెల్లడించారు. ప్రజల కలలే మా ప్రతిజ్ఞ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. జార్ఖండ్లో అధికార జేఎంఎం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. రూ.350 కోట్ల నగదుతో జార్ఖండ్లో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ దొరికిపోవడాన్ని మోదీ ప్రస్తావించారు. అన్ని నోట్ల కట్టలు తన జీవితంలో ఏనాడూ చూడలేదని అన్నారు. ఆ సొమ్మంతా జార్ఖండ్ ప్రజలదేనని తేలి్చచెప్పారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాల్సిన డబ్బును కాంగ్రెస్ నేతలు లూటీ చేశారని ధ్వజమెత్తారు. వారు దోచుకున్న సొమ్మును తిరిగి వసూలు చేసి, ప్రజలకు అందజేస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని చెప్పారు. జార్ఖండ్ ప్రజలు కష్టపడి పనిచేస్తారని, వారి కష్టం వృథా కానివ్వబోమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఎంత బురద చల్లినా కమలం(బీజేపీ గుర్తు) ప్రతిచోటా వికసిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ‘ప్రజల కలలే మా ప్రతిజ్ఞ, వారి సంక్షేమమే మోదీ గ్యారంటీ’ అని స్పష్టం చేశారు. తన జీవితంలో ప్రతిక్షణం ప్రజలకే అంకితం అని పేర్కొన్నారు. జనం బాగు కోసమే తాను పని చేస్తున్నానని వెల్లడించారు. దేశంలో గత పదేళ్లలో ఏకంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని హర్షం వ్యక్తం చేశారు. పేదరికాన్ని పూర్తిగా అంతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నామని తెలిపారు. సందేశ్ఖాలీపై నోరు విప్పరెందుకు? ప్రధాని మోదీ శుక్రవారం పశి్చమ బెంగాల్లో పర్యటించారు. హుగ్లీ జిల్లాలోని అరామ్బాగ్లో రూ.7,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వ పాలనలో అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయని మోదీ మండిపడ్డారు. సందేశ్ఖాలీలో మహిళలు ఘోరమైన అకృత్యాలు జరిగాయని, దీనిపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఎందుకు నోరువిప్పడం లేదని నిలదీశారు. సందేశ్ఖాలీలో మన అక్కచెల్లెమ్మలను తృణమూల్ కాంగ్రెస్ నేతలు వేధించారని, అత్యాచారాలు చేశారని, ఇది నిజంగా సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. నిందితులను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. -
మధుర సీటుపై ఎన్డీఏ మల్లగుల్లాలు? హేమా మాలినికి మొండి చెయ్యి?
ఉత్తరప్రదేశ్లోని మధుర లోక్సభ టిక్కెట్ కేటాయింపుపై నేషనల్ డెమెక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) మల్లగులల్లాలు పడుతోంది. రాష్ట్రీయ లోక్దళ్ ఎన్డీఏలో చేరుతుందనే చర్చల నడుమ మధుర లోక్సభ సీటు కేటాయింపుపై ఆసక్తికర చర్చ ప్రారంభమయ్యింది. తాజాగా మధుర ఎంపీ హేమ మాలిని తాను మథుర నుండి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కాగా ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి ‘ఇండియా’ కూటమిని వీడి ఎన్డిఎలో చేరుతారనే చర్చ ప్రారంభమైనప్పటి నుండి, బీజేపీ- ఆర్ఎల్డీ మధ్య సీట్ల కేటాయింపుపై పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. మధుర సీటు జయంత్ చౌదరి పార్టీకి దక్కవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. జయంత్ చౌదరి 2009లో తొలిసారిగా మధుర నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే గత రెండు ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నాయకురాలు, నటి హేమమాలిని ఈ స్థానం నుంచి గెలుపొందారు. కాగా తాజాగా మధుర వచ్చిన హేమమాలిని ఆకాశవాణి ప్రసారం చేస్తున్న ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని స్థానిక బీజేపీ నేతల మధ్య కూర్చుని విన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను పార్టీ ఆదేశిస్తే మథుర నుంచి పోటీ చేస్తానని తెలిపారు. -
దేశఖ్యాతిని పెంచిన నాయకుడు
‘మన దేశ ప్రజల మానసిక స్థితిని నేను సరిగ్గా అంచనా వేయగలను. నా అంచనా ప్రకారం రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి కచ్చి తంగా 400 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి. అందులో బీజేపీకి కనీసం 370 సీట్లు వస్తాయ’ని అన్నారు ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ! రానున్న లోక్ సభ ఎన్నికల్లో ‘మిషన్– 400’ (దేశంలోని లోక్ సభ స్థానాల్లో 400 సీట్లలో గెలవడం) లక్ష్యంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీజేపీ శ్రేణులకు పిలుపునిస్తూ, ఆ లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కోల్పోయాయనీ, మూడో దఫా బీజేపీ ప్రభుత్వ పాలన ఎంతో దూరంలో లేదంటూ మోదీ బీజేపీ కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపారు. అదే క్రమంలో జమ్మూ–కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు కోసం జీవితాంతం ఉద్యమించిన శ్యామప్రసాద్ ముఖర్జీకి ఇది నిజమైన నివాళి అవుతుందని అన్నారు. ప్రధాని మోదీ పిలుపు అందుకున్న పార్టీ కార్య కర్తలంతా ఊరూరా, వాడవాడలా పర్యటిస్తూ ప్రజలతో మమేకమై, లక్ష్య సాధన దిశగా సమరోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో బీజేపీ చేపట్టిన ‘విజయసంకల్ప యాత్ర’ కూడా విజయవంతంగా జరుగుతున్నది. ఈ ఏడాది ఆరంభంలో జనవరి 22న అయోధ్యలో జరిగిన రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలు కొని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల దాకా ప్రధాని మోదీ ప్రసంగాల సరళితో బీజేపీ గ్రాఫ్ అనూహ్యంగా పెరుగూతూనే ఉన్నది. రామ మందిరం శాంతికీ, సహనానికీ, సామరస్యానికీ, సమన్వ యానికీ చిహ్నమని చెప్పడం ప్రధాని మోదీ ఔన్నత్యానికి నిదర్శనం. ఇవాళ ఈ దేశానికి దశ దిశ బీజేపీ మాత్రమేననీ, నరేంద్రమోదీ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అనీ దేశ ప్రజానీకం భావించడానికి ప్రధాన కారణం భారతదేశ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ప్రధానిగా మోదీ చరిత్ర కెక్కడమే. భారత దేశ ఆర్థికరంగ బలోపేతానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా మరో 20 ఏండ్లలో భారతదేశం 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రపంచంలోనే అగ్ర దేశాల సరసన నిలవబోతున్నది. ప్రధానమంత్రి మోదీ అవలంబిస్తున్న జాతీయ, అంతర్జాతీయ విధానా లతో భవిష్యత్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థాయి దేశంగా అవతరించనున్నది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు భారత ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ, భారత్కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వ డానికి సహకరిస్తామని హామీ ఇచ్చాయి. భారత్, ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇదంతా ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయమే. మోదీ దౌత్య విజయాలకు ప్రపంచ నేతలందరి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇవాళ నరేంద్ర మోదీ ప్రపంచ నాయకుడు అయ్యారు. అంతర్జాతీయ వేదికల మీద భారతదేశం విజయాలు మార్మోగుతున్నాయి. సంక్షేమ పథకాలతో పేద ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని భావించిన బీజేపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ, కోట్లాది భారతీయుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. దేశ ప్రజల ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత పరంగా సమాజంలోని అన్ని వర్గాలకూ నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు అనేక పథకాలను విజయవంతంగా అంది స్తున్నది. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఒక విషయాన్ని మనమందరం గుర్తు చేసుకో వాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు కశ్మీర్లో తిరగాలంటే ప్రజలు భయంతో వణికిపోయేవారు. ఇవాళ కశ్మీర్ రోడ్ల మీద స్వేచ్ఛగా క్రికెట్ అడుకుంటున్నారు. ఈ దేశాన్ని 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పాలనకు, పదేండ్లుగా పాలిస్తున్న బీజేపీ పాలనకు తేడా అదే. అందుకే భారతమాత సేవలో తరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మిషన్ – 400 లక్ష్యానికి అండగా నిలవడం అనే విషయాన్ని అందరూ బాధ్యతగా భావించాల్సి ఉన్నది. పి.ఎల్. శ్రీనివాస్ వ్యాసకర్త బీజేపీ నాయకులు -
అధికార పార్టీని ఆపడం సాధ్యమేనా?
రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 స్థానాలనూ, తన నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400 స్థానాలనూ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రాంతీయ పార్టీలనూ, గుర్తింపు రాజకీయాల మూలాలున్న పార్టీలనూ కూడా ఆకర్షించి తమతో కలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీనివల్ల సీట్ల పంపకంపై సర్వత్రా వాగ్వివాదాలు తలెత్తవచ్చు. అయితే బీజేపీ వ్యూహకర్తలకు అలాంటి చిక్కులను అధిగమించే నేర్పు ఉంది. మరోవైపు శక్తిమంతమైన బీజేపీని ఎదుర్కోవాల్సిన ఇండియా కూటమిని ఎవరు నడిపిస్తారు అనే ప్రశ్న ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. పైగా అవి ఒక ఉమ్మడి ఆదేశం మీద పనిచేయడంలో విఫలమవుతున్నాయి. కాంగ్రెస్ తన గొప్పతనపు భ్రమలను విడిచిపెట్టేవరకు, ఇండియా కూటమిపై పెద్ద ఆశలు లేవు. లోక్సభ ఎన్నికలకు ముందు రాజకీయ చదరంగంలో పావులు కదులుతున్న వేళ... తర్కాలు, ఔచిత్యాలు తలకిందులవుతున్నాయి. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మేరకు బీజేపీ 370 లోక్సభ స్థానాలను (ఎన్డీయే కూటమికి 400) లక్ష్యంగా పెట్టుకుంది. ‘ఇండియా’ కూటమి సంకీర్ణానికి భారీగా బలాన్నిచ్చే ప్రతిపక్ష పార్టీలను తుడిచిపెట్టడానికి గర్వాతిశయంతో కూడిన అధికార పార్టీ నిశ్చయంగా ప్రయత్నిస్తుంది. దీనికి వ్యతిరేకంగా తన శ్రేణులను బలోపేతం చేయడానికి ఇండియా కూటమికి ఎన్ని మిత్రపక్షాలైనా అవసరమే. విపత్తులను (ఉదాహరణకు, తమిళనాడు వరదలు) ఎదుర్కోవడానికి కేంద్రం నుండి తగినంత సహాయం అందించని ఆర్థిక అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ‘కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు’ అనే చర్చను ఇండియా కూటమి లేవనెత్తుతోంది. అలాగే అక్రమాల పేరుతో ఎంపిక చేసిన మంత్రులపై కేంద్రం అణచివేత చర్యలకు పాల్పడటాన్ని కూడా విమర్శిస్తోంది. మంది ఎక్కువైతే వచ్చే చిక్కులు మరోవైపు బీజేపీ శక్తిమంతమైన నాయకత్వం కలిగివుంది. తన తోటి నేతలను అవలీలగా అధిగమించగలిగే ప్రజాకర్షక ప్రధాన మంత్రి, చట్టబద్ధమైన సంస్థలపై పట్టు, బలీయమైన పార్టీ యంత్రాంగం వంటి అంశాలతో ఆ పార్టీ క్షీణిస్తున్న ప్రతిపక్షాల కూటమితో పోలిస్తే ఎంతో బలంగా ఉంది. ప్రాంతీయ పార్టీలకు వంశపారంపర్య లేదా గుర్తింపు రాజకీయాలలో మూలాలున్నప్పటికీ, ఎన్డీయేలోకి సాధ్యమైనన్ని ప్రాంతీయ శక్తులను ఆకర్షించి, కలుపు కోవడానికి బీజేపీ చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో అత్యున్నత అభాస ఉంది. ఇది పార్టీపరంగా చూస్తే బీజేపీకి ఎంతమాత్రం పొసగనిది. గత ఐదేళ్లలో, అవిభక్త శివసేన, జనతాదళ్ (యునైటెడ్), శిరోమణి అకాలీదళ్ వంటి ఒకప్పటి విలువైన భాగస్వాములను బీజేపీ కోల్పోయింది. అయితే, చిన్న పార్టీలను చేర్చుకోవడంతో ఎన్డీయే పరిధి ఇప్పుడు విస్తృతమైంది. బీజేపీ తన అపారమైన యుక్తుల ద్వారా, మహారాష్ట్రలో అసలు నాయకుడు ఉద్ధవ్ థాకరే నుంచి శివ సేనను విభజించింది. శరద్ పవార్ నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ విభాగాన్ని స్వాధీనం చేసుకుంది. శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గం ఇప్పుడు ఎన్డీయే ఆస్తి. శరద్ పవార్, ఉద్ధవ్ థాకరేలపై బీజేపీ మోపిన ఆరోపణలకు అజిత్ పవార్, శివసేనను చీల్చిన ఏక్నాథ్ శిందే ఆమోదయోగ్యతను కల్పించారు. ‘లౌకిక’ సంకీర్ణ ప్రభుత్వ పతనానికి దారితీసిన నాటకీయ తిరుగుబాటులో జేడీ(యూ)ను బీజేపీ తిరిగి పొందింది. విశ్వసనీ యత కోల్పోయిన నితీష్ కుమార్ నాయకత్వంలో తిరిగి బిహార్లో అధికారంలోకి వచ్చింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోవడా నికి శిరోమణి అకాలీదళ్తో చర్చలను పునఃప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లో రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ)ని బుజ్జగించడం బీజేపీ సంకీర్ణ కూటమికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన అంశం. ఇది రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో తన ప్రయోజనాలను పటిష్టం చేయడానికేనని స్పష్టం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతం బీజేపీని ఎన్నడూ నిరాశపరచలేదు. గత జూన్ లో బీజేపీని సవాలు చేయడానికి ఉమ్మడి ఫ్రంట్ ద్వారా తీవ్రంగా ప్రయత్నించిన ప్రతిపక్షాన్ని ఖాళీ చేయించాలనే ఆలోచనలో ఇది భాగం. అయితే ఇండియా కూటమిని ఎవరు నడిపిస్తారు? కాంగ్రెసా లేదా ప్రాంతీయ నాయకుడా అనే ప్రశ్న ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. గత డిసెంబర్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ను ఓడించి, హిందీ మాట్లాడే ప్రధాన భూభాగంపై తన ఆధిపత్యాన్ని బీజేపీ తిరిగి నెలకొల్పిన తర్వాత, ఇండియా కూటమి నాయకత్వ శూన్యత గణనీయంగా ఎత్తి చూపబడింది. ఓటములతో కంగుతిన్న కాంగ్రెస్, ఇప్పుడు తమిళనాడు, కేరళలో ఉన్న బలమైన మిత్రపక్షాల అండదండలతో దక్షిణాది వైపు చూస్తోంది. దక్షిణాదిలో సాపేక్షంగా స్వల్పంగానే ఉనికిలో ఉన్నప్పటికీ వెరవకుండా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత, దాదాపుగా దేవెగౌడ వంశానికి చెందిన ఒక ప్రైవేట్ ఎస్టేట్ అయిన జనతాదళ్ (సెక్యులర్)తో కలిసి బీజేపీ ముందుకు సాగుతోంది. ఇక తెలంగాణలో మాత్రం భారత రాష్ట్ర సమితితో పొత్తుపై బీజేపీ అధినాయకత్వం సందిగ్ధంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో– బిహార్, ఉత్తరప్రదేశ్లోని మిత్రపక్షాల బలాధిక్యతతో బీజేపీ పుష్కలంగా నాయకులు ఉండటం అనే సమస్యను ఎదుర్కొంటోంది. మరోవైపున జేడీ(యూ), ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులు, తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నిష్క్రమణ తర్వాత ఇండియా కూటమి నాయకుల కరువు నెదుర్కొంటోంది. ఎన్డీయేలో సీట్ల పంపకంపై సర్వత్రా వాగ్వివాదాలు తలెత్తవచ్చు. అయితే బీజేపీ వ్యూహకర్తలకు అలాంటి చిక్కులను అధిగమించే నేర్పు ఉంది. ఇండియా కూటమికి కాలం ఎందుకు అననుకూలంగా మారింది? కాంగ్రెస్ లేదా ప్రాంతీయ పార్టీలు తమ సమీకరణాలను సరిగ్గా నిర్వచించుకోలేక పోవడం వల్ల, కూటమి సంకట పరిస్థితి ఆరంభంలోనే నిర్ణయమైపోయినట్టు అనిపించింది. జేడీ(యూ), తృణ మూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ తమను తాము కాంగ్రెస్ పార్టీతో సమానంగా భావించాయి. అయితే మాటల్లో చెప్పకుండానే కాంగ్రెస్ అధిష్ఠానం తానే నాయకత్వం చేపట్టాలనుకుంది. మరోవైపు ప్రాంతీయ పార్టీలు ఒక ఉమ్మడి ఆదేశంపై పనిచేయలేకపోయాయి. నితీష్ కుమార్ను కూటమికి కన్వీనర్గా నియమించాలనే ప్రతిపాదనను తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకించాయి. ఈ పదవి ఆయనను భారతదేశ ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలో ఉంచడానికి ఒక నిచ్చెన మెట్టు అని ఈ పార్టీల నాయకులు అనుమానించారు. తన వంతుగా రాహుల్ గాంధీ, తాను ప్రధాని పదవికి పోటీలో ఉన్నాననే ఊహాగానాలను ఎన్నడూ కొట్టివేయలేదు. సంకీర్ణం ఒక క్రీడ కాదు కాంగ్రెస్ ఆకాంక్షలు దాని క్షేత్ర బలానికి చాలా అసమానంగా ఉన్నాయి. గత ఏడాది డిసెంబరులో వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, మూడు హిందీ ప్రధాన రాష్ట్రాలలో దాని తిరోగమనం... కాంగ్రెస్కు సమర్థవంతంగా తలుపులు మూసివేశాయి. కాంగ్రెస్ మూడింట రెండు రాష్ట్రాలను కైవసం చేసుకున్నట్లయితే, అది న్యాయ బద్ధంగా ఇండియా కూటమికి నాయకత్వం వహించగలిగేది. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో అధికారాన్ని కోల్పోవడానికీ, మధ్యప్రదేశ్ను తిరిగి కైవసం చేసుకోవడంలో విఫలం కావడానికీ తెలంగాణలో గెలవడం అనేది పరిహారం కాదు. సంకీర్ణ నిర్మాణం కాంగ్రెస్కు ఎప్పుడూ లేదు. లోక్సభలో మెజా రిటీ సాధించలేక పోయినప్పుడు, అది బీజేపీయేతర సంకీర్ణాలకు అయిష్టంగానే మద్దతిచ్చింది. అది ఒక క్రీడగా భావించి వాటిని విచిత్రంగా పడగొట్టడానికి మాత్రమే మద్దతిచ్చింది. రాహుల్ గాంధీ ఈ సంప్రదాయానికి తగ్గట్టుగా ఉన్నారు. ఇండియా కూటమిలో నితీష్ అశాంతితో ఉన్నారనీ, ఆర్ఎల్డీ నూతన అవకాశాలను కోరుకున్నదనీ జనానికి తెలుసు. వారు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో, వారికి ఏం కావాలో తెలుసుకునేందుకు రాహుల్ ప్రయత్నించలేదు. మిలింద్ దేవరా వంటి సన్నిహిత సహచరుడితోపాటు తన పార్టీ ఇతర సహచరుల నిష్క్రమణ పట్ల కూడా ఆయన ఉదాసీనంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తన గొప్పతనం మీద భ్రమలను వీడేంతవరకూ,ఇండియా కూటమిపై పెద్దగా ఆశలు లేవు. రాధికా రామశేషన్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇండియా కూటమి కథ ముగిసింది: నితీశ్ కుమార్
పాట్నా: ఎన్డీఏలో చేరి అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత బిహార్ సీఎం నితీశ్కుమార్ ఇండియా కూటమిపై తొలిసారి స్పందించారు. శనివారం పాట్నాలో ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసిందని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి వ్యవహారం ముగిసి చాలా కాలమైందన్నారు. అసలు ఆ కూటమికి ఇండియా అనే పేరు పెట్టడం తనకు ముందునుంచే ఇష్టం లేదని చెప్పారు. వేరే పేరు పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించానన్నారు. బిహార్ ప్రజల అభివృద్ధి కోసమే ఎన్డీయేలో చేరానన్నారు. కాగా, ఇప్పటికే ఇండియా కూటమిలో పలు పార్టీలు పొత్తులను పట్టించుకోకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కూటమిలోని కాంగ్రెస్ పొత్తులో భాగంగా సీట్లను తేల్చకపోవడం వల్లే మిగిలిన పార్టీలు సొంతగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. w ఈ నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి.. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు బిగ్ షాక్ -
వలసపోయిన మందహాసం
పురుటిలోనే సంధి కొట్టింది. కేంద్రంలోని అధికార ఎన్డీఏకి వ్యతిరేకంగా జట్టుకట్టిన ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి పరిస్థితి ఒక్క మాటలో అదే. ఏడాదైనా కాక ముందే... ఎన్నికలు మరో రెండు నెలల దూరమైనా లేక ముందే... ఆ కూటమి అంతర్గత కుమ్ములాటలతో చతికిలపడిన పరిస్థితి. బిహార్ నుంచి మహారాష్ట్ర దాకా కూటమి నుంచి వలసపోతున్న నేతలు, సీట్ల పంపిణీ సమస్యలతో ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్న పార్టీలను చూస్తుంటే ఆ మాట అక్షరసత్యమని అర్థమవుతోంది. కొద్ది వారాల క్రితం బిహార్ సీఎం నితీశ్ కుమార్ ‘ఇండియా’ కూటమికి గుడ్బై చెప్పి, ఎన్డీఏ గూటికి తిరిగొచ్చారు. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి, సోమవారం అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో కూడా నెగ్గారు. బిహార్లోనే కాదు... మహారాష్ట్రలోనూ ‘ఇండియా’ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మాజీ ఎంపీ మిళింద్ దేవరా గత నెలలో గ్రాండ్ ఓల్డ్ పార్టీని వదిలేసి, శివసేనలో చేరారు. అది జరిగిన కొద్ది వారాలకే కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ హస్తాన్ని విడిచిపెట్టి, కమలం చేత ధరించారు. ఇలా సొంత కూటమిలోనే సవాలక్ష తలనొప్పులతో ఎన్నికలు రాకముందే బలహీనమైపోయింది. ఎన్డీఏకు సరైన ప్రత్యామ్నాయం తామేనంటూ చెప్పిన మాటలు రోజు రోజుకూ నీరుగారుతున్నాయి. ఈ దుఃస్థితికి కారణం ‘ఇండియా’ కూటమి పక్షాల స్వయంకృతం కొంతయితే, భారతరత్న పురస్కారాలు – ఈడీ – సీబీఐ లాంటి సామ దాన భేద దండోపాయాలతో పరవారిని కూడా తమ వారిని చేసుకొనేలా బీజేపీ నడుపుతున్న చాణక్య తంత్రం మరికొంత. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీ కండువాలు మార్చే సీజన్ ప్రబలుతోంది. అధికారం, ఎన్నికల్లో విజయాలే పరమావధిగా ఒకప్పటి ‘ఆయా రామ్, గయా రామ్’ సంస్కృతిని బీజేపీయే మళ్ళీ యథేచ్ఛగా పెంచిపోషిస్తోందనే విమర్శ బలంగానే వినిపిస్తోంది. గమ్మత్తేమిటంటే, కీలక నేతలే కాదు... కూటములు మారుస్తున్న పార్టీలదీ అదే సంస్కృతి, అదే సరళి. నిరుడు బీజేపీని అడ్డమైన మాటలూ అని బయటకు వెళ్ళిన నితీశ్, ఆయన జేడీయూ ఇవాళ మళ్ళీ అదే కమలం పార్టీ చంకనెక్కారు. కొత్త కూటమితో మళ్ళీ సీఎం సీటులో కూర్చున్నారు. మహారాష్ట్ర సీఎం సహా అనేక ఉన్నత పదవులను అనుభవించిన అశోక్ చవాన్ 38 ఏళ్ళ కాంగ్రెస్ సాహచర్యాన్ని వదులుకొని, కమలనాథుల పంచన చేరారు. అవినీతి ఆరో పణల్ని ఎదుర్కొంటున్న ఆయన తీరా కాషాయ వస్త్రం కప్పుకొన్న మరునాడే రాజ్యసభ అభ్యర్థి కాగ లిగారు. ఎవరెప్పుడు ఎటుంటారో, తిరిగి వదిలొచ్చిన పార్టీలోకే వెళతారో తెలియకపోవడంతో ఇప్పుడు ‘ఆయా రామ్... గయా రామ్... మళ్ళీ ఆయేగా రామ్’ అనేది తాజా ఛలోక్తి అయింది. నిజానిజాలేమో కానీ, మధ్యప్రదేశ్లో మరో మాజీ సీఎం సైతం కాంగ్రెస్ గూడ్స్ బండి దిగిపోయి, బీజేపీ ఎక్స్ప్రెస్ ఎక్కుతారని వార్త. వ్యక్తులు వెళ్ళిపోయినా, వ్యవస్థలు శాశ్వతమనే మాట నిజమే. కానీ, కాంగ్రెస్ అధినాయకత్వం కానీ, ‘ఇండియా’ కూటమి కానీ ముందున్న సవాళ్ళపై లోతుగా ఆలోచిస్తున్నాయా అన్నది ప్రశ్న. పార్టీని విడిచిపెట్టిపోయే ముందు రోజు సైతం అశోక్ చవాన్ రానున్న లోక్సభ ఎన్నికలకు పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసే కీలక సమావేశంలో ఉన్నారంటే, చుట్టుపక్కల ఏం జరుగుతోందో పార్టీ చూడలేకపోతోందని అనుకోవాలా? ఒకపక్క బీజేపీ కొత్త కూటములు కట్టడంలో, పాత దోస్తీలు వదిలించుకోవడంలో చాలా చులాగ్గా వ్యవహ రిస్తోంది. కాంగ్రెస్ మాత్రం కనీసం ఎన్నికల్లో పోటీకి సీట్ల పంపిణీలో సైతం అడుగులు ముందుకు వేయలేకపోవడం విచిత్రం. గడచిన పక్షం రోజుల్లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కానీ, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ కానీ ఏకపక్షంగా తామే అన్ని సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారంటే ఏమనాలి? చివరకు ఢిల్లీలో కాంగ్రెస్కు ఒకే ఒక్క సీటు మాత్రం ఇస్తామనే స్థాయికి తెగించిందంటే ‘ఇండియా’ కూటమిలో సయోధ్య ఏమున్నట్టు? పార్టీల మధ్య వలసలు వెక్కిరిస్తుంటే, మరోపక్క ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన చర్చలు కరవై, చట్టసభలు సైతం గౌరవం కోల్పోవడం మరో విషాదం. 1990 తర్వాత పార్లమెంట్ పనితీరు నానాటికీ తీసికట్టు నాగంభొట్లుగా మారింది. ఇటీవలే ఆఖరుసారి సమావేశమైన ప్రస్తుత 17వ లోక్సభలో అసలు డిప్యూటీ స్పీకర్ నియామకమే జరగలేదు. సాంప్రదాయికంగా ప్రతిపక్షాలకు కేటాయించాల్సిన డిప్యూటీ స్పీకర్ పదవి అనేదే భర్తీ కాకుండా అయిదేళ్ళు గడిచిపోవడం పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారి. అలాగే, ప్రతిపక్ష ఎంపీలలో 70 శాతానికి పైగా సస్పెన్షన్లో ఉండగా కీలకమైన నేర సంస్కరణల చట్టాల లాంటివి ఆమోదం పొందాయి. ఒకే ఒక్క ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇవ్వడం తప్ప, ఏ ప్రశ్నకూ ప్రధాని మౌఖికంగా జవాబివ్వని లోక్సభా ఇదే. గద్దె మీది పార్టీలతో సంబంధం లేకుండా గత 30 ఏళ్ళుగా పెరిగిన ధోరణికి ఇది తార్కాణం. ఈ పరిస్థితులకు ఎవరిని తప్పుబట్టాలో, ప్రజలు ఏ పార్టీ వైపు ఆశగా ఎదురుచూడాలో తెలియని పరిస్థితి. మోదీ తరహా రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ‘ఇండియా’ కూటమి వైపు చూడవచ్చని కొందరు ఆశపడ్డా, ఇప్పుడదీ అంతంత మాత్రమేననే భావన కలుగుతోంది. నిజాలు ఏమైనా, అయోధ్య, అబూధాబీల్లో ఆలయాలతో అధికసంఖ్యాకుల్లో అనుభూతిపరంగా మార్కులు కొట్టేస్తున్న మోదీతో పోటీపడాలంటే ప్రతిపక్ష కూటమి ఇకనైనా కళ్ళు తెరవాలి. బలమైన ప్రత్యర్థిని ఢీ కొట్టాలంటే, ఎంత మంచిదైనా ఆఖరి నిమిషపు ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లు చాలవని రాహుల్ గాంధీ లాంటివారు గ్రహించాలి. కూటమిలో ఐక్యత కావాల్సిన కీలక క్షణాల్లో, నిర్ణయాలు తాత్సారం చేస్తే ఫలితాలు చేదుగా ఉంటాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, త్వరపడి తగు చర్యలు తీసుకోకపోతే... ‘ఇండియా’ కూటమి ఎన్నికల్లో పోటీకి ముందే చేతులెత్తేయాల్సి వస్తుంది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మదర్స్ డే స్పెషల్: మీ అమ్మని ఇలా సర్ ప్రైజ్ చేయండి..!
చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇదే: సీఎం జగన్
గవర్నర్ మారేవరకు రాజ్భవన్లో అడుగుపెట్టను: మమతా బెనర్జీ
సినిమాలకు హీరో గుడ్బై.. నాలుగురోజులే ఉండే కూతురు.. తనకోసం అన్నీ చేస్తా!
బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
నా అంతిమ యాత్ర ..! వంగా గీత ఎమోషనల్ స్పీచ్
ఆడపిల్ల విలువ తెలియజేసేలా ‘చిట్టి పొట్టి’
రీల్ విలన్తో టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్.. ఇక మిగిలింది పెళ్లే?
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
వంగా గీత గూస్ బంప్స్ స్పీచ్.. దద్దరిల్లిన పిఠాపురం
తప్పక చదవండి
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- ‘ఫోర్లు, సిక్స్లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- టీడీపీ, పవన్కు మంత్రి బొత్స కౌంటర్
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement