-
లాంచ్కు ముందే వివరాలు లీక్.. ఐఫోన్ 16 ఇలాగే ఉంటుందా!
ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ విడుదల చేస్తున్న యాపిల్.. ఐఫోన్ 16 లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. విడుదల చేయడానికి ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే దీనికి సంబంధించిన చాలా వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 16 డిజైన్, కెమెరా, చిప్సెట్ వంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. డిజైన్ లీకైన సమాచారం ప్రకారం, రానున్న కొత్త ఐఫోన్ సాలిడ్-స్టేట్ బటన్లను పొందే అవకాశం ఉంది. కంపెనీ దీనిని ఐఫోన్ 16 ప్రో మోడల్లలో క్యాప్చర్ బటన్గా అందించే అవకాశం ఉంది. ఇది ఒత్తిడి, స్పర్శను వంటి వాటిని గుర్తించేలా ఉంటుంది. డిస్ప్లే 2024లో విడుదల కానున్న కొత్త ఐఫోన్ 16 ప్రో 6.3 ఇంచెస్ స్క్రీన్, ప్రో మాక్స్ 6.9 ఇంచెస్ స్క్రీన్ను కలిగి ఉండవచ్చు. కాగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ స్క్రీన్లు వరుసగా 6.1 ఇంచెస్, 6.7 ఇంచెస్ వరకు ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా రాబోయే ఈ కొత్త మోడల్స్ శాంసంగ్ అందించే ఓఎల్ఈడీ మెటీరియల్ కలిగి.. బ్లూ ఫాస్ఫోరోసెన్స్తో బ్లూ ఫ్లోరోసెంట్ టెక్నాలజీని కలిగి ఉండవచ్చు. మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే టెక్నాలజీ ఇందులో ఉండే అవకాశం ఉంది. కొత్త ఐఫోన్ 16 సిరీస్ మల్టిపుల్ కలర్స్లో లాంచ్ అవ్వనున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. చిప్సెట్ వచ్చే సంవత్సరం విడుదలకానున్న కొత్త ఐఫోన్ 16 చిప్సెట్కు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు, కానీ ఇది ఐఫోన్ 15 ప్రో మోడల్లలోని A17 ప్రో చిప్ను ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే కంపెనీ రానున్న కొత్త ఐఫోన్స్ కోసం 3 నానోమీటర్ A18 చిప్ అందించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. చిప్సెట్కు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. కెమెరా సెటప్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్లు 'టెట్రా-ప్రిజం' టెలిఫోటో కెమెరాను పొందే అవకాశం ఉంది. అద్భుతమైన ఫొటోల కోసం ఆప్టికల్ జూమ్ 3ఎక్స్ నుంచి 5ఎక్స్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్రో సిరీస్ కోసం ఉపయోగించే 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా తక్కువ వెలుతురులో (లైటింగ్) కూడా మంచి పనితీరుని అందిస్తుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
అనుష్క శర్మ చేతిలో కొత్త స్మార్ట్ఫోన్ - విడుదలకు ముందే..
ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వన్ప్లస్ భారతీయ మార్కెట్లో ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్గా 'వన్ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్' విడుదల చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. అయితే దేశీయ విఫణిలో విడుదలకాక ముందే బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. నిజానికి వన్ప్లస్ తన ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను ఈ నెల 20 (అక్టోబర్)న లాంచ్ చేయనున్నట్లు గతంలో కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెల్లడించలేదు. దీని డిజైన్ & స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. పుకార్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో అధికారికంగా విడుదలకాక ముందే అనుష్క శర్మ చేతిలో కనిపించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగింది. వైరల్ భయాని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఫోటోలు కూడా చూడవచ్చు. దీని ధర రూ. 1,10,000 నుంచి రూ. 1,20,000 వరకు ఉంటుందని సమాచారం. అధికారిక ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. ఇదీ చదవండి: బెంగళూరు నడిరోడ్డుపై మంటల్లో ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్ ఈ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజితో, ఆక్టా గోనల్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 SoCతో విడుదలయ్యే అవకాశం ఉంది. డిస్ప్లే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక భాగంలో ఒక రౌండ్ మాడ్యూల్లో ఉంచిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉండనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
గంటలో అన్ని బుక్ అయిపోయాయ్.. ఇది కదా ఆ మొబైల్కున్న డిమాండ్!
ప్రపంచ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకున్న క్రేజే వేరు. ఈ సంగతి అందరికి తెలుసు. ఇటీవల కంపెనీ కొత్త ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ లాంచ్ చేసింది. కాగా నేడు (2023 సెప్టెంబర్ 16) ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమైన కొంత సమయానికి కనీవినీ ఎరుగని రీతిలో బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం గంటలోపు ఐఫోన్15 ప్రో సిరీస్కి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు మొత్తం అమ్ముడైనట్లు తెలిసింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. నిజానికి ఈ నెల 12న యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడల్స్ లాంచ్ చేసింది. ఇవి పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో 128, 256, 512 జీబీ స్టోరేజి కెపాసిటీతో లభిస్తాయి. కంపెనీ మొదటి సారి ఈ మొబైల్స్కి USB టైప్ సీ పోర్ట్, ఫ్రీమియం టైటానియం బాడీ, లేటెస్ట్ కెమెరా లెన్స్ వంటివి అందిస్తుంది. ఈ కారణంగా ఎక్కువమంది వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇదీ చదవండి: ఏటా వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే.. గతంలో ఇలా.. గతంలో కూడా కేవలం యాపిల్ కంపెనీ ఫోన్స్ మాత్రమే కాకుండా.. శాంసంగ్ వంటి కంపెనీల మొబైల్స్ కూడా భారీగా బుక్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే వినియోగదారులకు నచ్చిన ఫీచర్స్ కలిగిన మొబైల్ తప్పకుండా మంచి బుకింగ్స్ పొందుతాయని స్పష్టమవుతోంది. -
న్యూ ఐఫోన్ 15 గురించి ఆసక్తికర విషయాలు.. 16 సిరీస్ వస్తుందా?
యాపిల్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న 'వండర్లస్ట్' మెగా ఈవెంట్ ఈ రోజు ప్రారంభం కానుంది. ఇందులో సంస్థ ఐఫోన్ 15 సిరీస్తో పాటు ఇతర గ్యాడ్జెట్స్ కూడా లాంచ్ చేయనుంది. యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్ కాలిఫోర్నియాలో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు మొదలవుతుంది. అర్బన్ డిక్షనరీ ప్రకారం, 'వండర్లస్ట్' అనే పదానికి అర్థం 'నిరంతరం అద్భుత స్థితిలో ఉండాలనే కోరిక'. టిమ్ కుక్ నేతృత్వంలోని కంపెనీ ఉత్పత్తులు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్న కారణంగా ఈ పేరు పెట్టడం జరిగినట్లు తెలుస్తోంది. యాపిల్ మెగా ఈవెంట్లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో అండ్ ఐఫోన్ 15 ప్రో మాక్స్ వంటి వాటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 9 కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఐఫోన్ 15 సిరీస్ ధరలు 1199 నుంచి 1299 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. లక్ష కంటే ఎక్కువ. స్టోరేజ్ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మొబైల్ డిజైన్ అండ్ ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పకుండా వినియోగదారుని అవసరమైన ఆధునిక ఫీచర్స్ ఇందులో లభించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన విషయాలు కూడా తెలియాల్సి ఉంది. స్టోరేజ్ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇదీ చదవండి: సింగిల్ ఛార్జ్తో 800కిమీ రేంజ్! ధర రూ. 3.47 లక్షలు - ఇది కదా కావాల్సింది! గత ఏడాది ఇదే సమయంలో ఐఫోన్ 14 సిరీస్ ప్రారంభమైనప్పటి నుంచి 15 సిరీస్ గురించి మాట్లాడుకోవడం ఎక్కువైంది. అయితే ఈరోజు జరిగే ఈవెంట్లో 16 సిరీస్ గురించి ప్రస్తావిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ రోజు జరిగే ఈవెంట్ చూడాలనుకునే వారు యాపిల్ వెబ్సైట్, యూట్యూబ్ స్ట్రీమ్, యాపిల్ టీవీ ద్వారా వీక్షించవచ్చు. -
JioBharat phone: సక్సెస్ను పట్టేసిన అంబానీ.. ఇక దూకుడే..
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 17.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో భారతదేశపు అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. అనేక రంగాల్లో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తోంది. భారత టెలికాం పరిశ్రమలో అత్యధిక మార్కెట్ వాటాతో తిరుగులేని సంస్థగా ఉన్న రిలయన్స్ జియో బ్రాండ్ గత కొన్నేళ్లుగా అనేక ఉత్పత్తులను భారతీయ మార్కెట్కు సరసమైన ధరతో అందిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే జియో భారత్ వీ2 (JioBharat V2) ఫోన్ను విడుదల చేసింది. దీని ధర రూ.999 మాత్రమే. భారతదేశంలో ఇంటర్నెట్ కలిగిన అత్యంత చవకైన ఫోన్ ఇదే. మరిన్ని ఫోన్ల ఉత్పత్తి.. ట్రయల్ దశలో రూ.99 కోట్ల విలువైన 10 లక్షల ఫోన్లను మాత్రమే రిలయన్స్ జియో విక్రయానికి ఉంచింది. ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోయిన తర్వాత మరిన్ని జియో భారత్వీ2 ఫోన్లను తయారు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత రిలయన్స్ జియో ‘జియో భారత్’ ఫోన్ల అమ్మకాల్లో పురోగతిని గమనించిందని, 10 లక్షల ఫోన్ల విక్రయాల ట్రయల్ పూర్తవ్వగానే ఈ ఫోన్ల ఉత్పత్తిని మరింత పెంచేందుకు సిద్ధమైందని బ్రోకరేజ్ సంస్థ బీఎన్పీ పారిబాస్ ఓ నివేదికలో పేర్కొంది. జియో భారత్ వీ2 ఫోన్లలో 1.77 అంగుళాల QVGA TFT స్క్రీన్, 1000mAh రిమూవబుల్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లు. ఇంకా ఇందులో జియో సినిమా, తాజా వెబ్ సిరీస్లు, బ్లాక్బస్టర్ సినిమాలు, హెచ్బీఓ ఒరిజినల్స్, స్పోర్ట్స్ కంటెంట్ టీవీ షోలతో సహా విస్తారమైన నాన్-స్టాప్ వినోదాన్ని అందించే యాప్ ప్రధానంగా ఉంటుంది. అలాగే ప్రముఖ ఉచిత మ్యూజిక్ యాప్ జియో సావన్, జియో ప్లే వంటివి కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: Nokia 110 4G/2G: నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు! ప్రస్తుతానికి కార్బన్ కంపెనీ భాగస్వామ్యంతో జియో భారత్ వీ2 ఫోన్లను రిలయన్స్ జియో ఉత్పత్తి చేస్తోంది. ఇందు కోసం రానున్న రోజుల్లో ఇతర కంపెనీలూ రిలయన్స్ జియోతో జత కలిసే అవకాశం ఉంది. అతి తక్కువ ధరతోపాటు ఈ ఫోన్ కోసం రిలయన్స్ సరసమైన డేటా ప్లాన్లను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మరో సంచలనానికి నాంది పలికింది. చౌక ధరలో ఫోన్ను లాంచ్ చేసింది. జియో 2 జీ ముక్త్ భారత్ విజన్లో భాగంగా తీసుకొస్తున్న ఈ జియో భారత్ 4జీ ఫోన్ను కేవలం రూ. 999లకే అందిస్తోంది. అంతేకాదు ఈ ఫోన్తో పాటు కొత్త రూ. 123 ప్లాన్ ప్రకటించింది. ఇది 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అన్లిమిటెడ్ కాల్స్తోపాటు, 14GB డేటా (రోజుకు 0.5 GB) అందిస్తుంది. ప్రత్యర్థులతో పోలిస్తే ఇది ఏడు రెట్లు ఎక్కువని జియో పేర్కొంది. ఇంకా 2జీ టెక్నాలజీని ఉపయోగిస్తున్న కస్టమర్ల కోసం ఇన్-క్లాస్ జియో 4జీ నెట్వర్క్ తొలి 10 లక్షల జియో భారత్ ఫోన్ల బీటా ట్రయల్ జూలై 7 నుండి ప్రారంభమవుతుందని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తుండగా, భారతదేశంలో ఇప్పటికీ 250 మిలియన్ల మంది మొబైల్ వినియోగదారులు 2G యుగంలోనే ఉన్నారని, కొత్త జియో భారత్ ఫోన్ ఆ దిశలో మరో అడుగు అని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు. ప్రతీ భారతీయుడికి, ఇంటర్నెట్, ఆధునిక టెక్నాలజీని అందించే లక్ష్యంతో ఆరేళ్ల క్రితం జియోను లాంచ్ చేశాం. ఈ విషయంలో ఎలాంటి రాజీలేదని నిరూపించాం. ఇకపై టెక్కాలజీ కొంతమంది ప్రత్యేక హక్కుగా మిగలబోదు అని ఆకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. 1.77-అంగుళాల QVGA TFT స్క్రీన్, 1000mAh రిమూవబుల్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయి. ఇంకా ఇందులో JioCinema, తాజా వెబ్ సిరీస్లు, బ్లాక్బస్టర్ సినిమాలు, హెచ్బీఓ ఒరిజినల్స్, స్పోర్ట్స్ కంటెంట్ టీవీ షోలతో సహా విస్తారమైన నాన్-స్టాప్ వినోదాన్ని అందించే యాప్ ప్రధానంగా ఉంటుంది. అలాగే ప్రముఖ ఉచిత సంగీత యాప్ JioSaavn, JioPayని కలిగి ఉంది. -
నోకియా నుంచి రానున్న కొత్త స్మార్ట్ఫోన్ సీ32 - లాంచ్ ఎప్పుడంటే?
Nokia C32: ఆధునిక యుగంలో లేటెస్ట్ ఉత్పత్తులు పుట్టుకొస్తున్న వేళ నోకియా సంస్థ దేశీయ మార్కెట్లో 'సీ32' మొబైల్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైపోయింది. ఈ కొత్త స్మార్ట్ఫోన్ ఈ నెలలోనే అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. నోకియా సీ32 గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. నోకియా నుంచి సీ సిరీస్లో మరో బడ్జెట్ 4జీ ఫోన్ రానుంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న ఈ మొబైల్ త్వరలోనే భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. దీని ధర రూ. 9,999 వరకు ఉండవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ఫోన్ బీచ్ పింక్, చార్కోల్, అటమ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇదే కలర్ ఆప్షన్స్ మన దేశంలో కూడా లభించనున్నాయి. ఫీచర్స్.. కొత్త నోకియా సీ32 మొబైల్ 6.5 ఇంచెస్ హెచ్డీ రెజల్యూషన్ ఐపిఎస్ LCD డిస్ప్లే కలిగి, గ్లాస్ బ్యాక్ అండ్ మెటాలిక్ ఫినిష్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో యునిఎస్ఓసీ ఎస్సీ9863ఏ ప్రాసెసర్ ఉంటుంది. వర్చువల్గా 3జీబీ వరకు అదనంగా ర్యామ్ పెంచుకోవచ్చు. దీనికి మైక్రోఎస్డీ కార్డు స్లాట్ కూడా ఉంటుంది. (ఇదీ చదవండి: రూ. 1.50 లక్షల గూగుల్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ - ప్రత్యేకతలివే!) ఇక కెమెరా ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులో రెండు రియర్ కెమెరాలు (50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా & 2 మెగాపిక్సెల్ కెమరా), ఒక 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ మొబైల్ 10 వాట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. పవర్ బటన్కే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అదే సమయంలో ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా లభిస్తుంది. మొత్తం మీద ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. -
అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే..
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23) కొత్త రంగులో వస్తోంది. లైమ్ కలర్ వేరియంట్ మే 16 నుంచి భారత్లో అమ్మకానికి వస్తోంది. గెలాక్సీ ప్రస్తుతం ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ రంగులలో అందుబాటులో ఉంది. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! ధర, ఆఫర్లు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 కొత్త లైమ్ కలర్ వేరియంట్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. 8/128 జీబీ ధర రూ. 74,999 కాగా 8/256 జీబీ వేరియంట్ ధర రూ. 79,999. ఈ కొత్త కలర్ వేరియంట్ ఆన్లైన్, ఆఫ్లైన్లో ప్రధాన రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. గెలాక్సీ ఎస్23 కొనేవారికి పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ సీడీ లేదా బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐని ఎంచుకునే వారు నెలకు కేవలం రూ. 3,125 ఈఎంఐతో గెలాక్సీ ఎస్23 ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. అదనంగా ప్రస్తుత ఫ్లాగ్షిప్ ఫోన్ యజమానులు రూ.8,000 అప్గ్రేడ్ బోనస్ ప్రయోజనాన్ని పొందవచ్చు . దీన్న 24 నెలల బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ లేదా హెచ్డీఎఫ్సీ సీడీ పేపర్ ఫైనాన్స్తో కలపవచ్చు. అప్గ్రేడ్ బోనస్ను రూ.5 వేల బ్యాంక్ క్యాష్బ్యాక్తో కలపడం మరో ఆప్షన్. దీని వల్ల 8/128 జీబీ వేరియంట్ రూ. 61,999లకు, 8/256 జీబీ మోడల్ ధర రూ.66,999లకు తగ్గుతుంది. ఈ ఆఫర్లో భాగంగా హెచ్డీఎఫ్సీతో 9 నెలల నో కాస్ట్ ఈఎంఐని కూడా ఎంచుకోవచ్చు. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు గేమ్ మోడ్లో సూపర్ స్మూత్ 6.1 అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50 MP వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా 3,900mAh బ్యాటరీ, ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్ 8జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్చువల్ గర్ల్ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! -
Vivo Y56 5G: వివో వై సిరీస్లో మరొకటి.. ధర రూ.20వేల లోపే!
మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో.. వై సిరీస్లో మరో ఫోన్ను విడుదల చేసింది. ఇప్పటికే లాంచ్ అయిన వివో వై100 కస్టమర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. భారత్లో వివో వై100 విడుదలైన కొద్దిసేపటికే వివో వై56 5జీ మార్కెట్లోకి వచ్చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో పనిచేసే ఈ బడ్జెట్ కేటగిరీ స్మార్ట్ఫోన్ ధర రూ. 19,999. ఆరెంజ్ షిమ్మర్, బ్లాక్ ఇంజిన్ రంగుల్లో లభిస్తోంది. వివో అఫీషియల్ వెబ్సైట్తోపాటు రిటైల్ స్టోర్లలోనూ కొనుగోలు చేయొచ్చు. మరి ఈ ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఏంటో చూసేయండి.. వివో వై56 5జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్: 6.58 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ ఎల్సీడీ స్క్రీన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ (SD కార్డ్తో 1టీబీ వరకు పెంచుకోవచ్చు) 50ఎంపీ రియర్ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ బరువు 184 గ్రాములు (ఇదీ చదవండి: రంగులు మార్చే ఫోన్: వివో వై100 లాంచ్, ధర ఎంతంటే?) -
Lava Blaze 5G: రూ.11 వేలకే 5జీ స్మార్ట్ఫోన్.. ఫీచర్స్ మాత్రం అదుర్స్!
భారతీయ ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ లావా కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. లావా బ్లేజ్ 5జీ (Lava Blaze 5G) సిరీస్లో నూతన వేరియంట్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. 6జీబీ ర్యామ్, 128బీజీ స్టేరేజ్ కెపాసిటీతో వచ్చిన ఈ స్మార్ట్ఫోన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. చవకైన రేంజ్లో లభించే ఈ 5జీ ఫోన్ గురించి లావా కంపెనీ గత ఏడాదిలోనే తెలియజేసింది. లావా బ్లేజ్ 5జీ ఫోన్ ధరను రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ప్రారంభ ఆఫర్ కింద రూ.11,499కే ఈ ఫోన్ను అందిస్తోంది. గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్ల్యూ, గ్లాస్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ అలాగే అమెజాన్ ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. (ఇదీ చదవండి: టెక్ ప్రపంచంలోనే తొలి ఫోన్,10 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. ధర ఎంతంటే!) లావా బ్లేజ్ 5జీ స్పెసిఫికేషన్స్ 90హెడ్జ్ రిఫ్రెష్ రేటుతో 6.5 అంగులాల హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ఓసీ 2.2 గిగాహెడ్జ్ క్లాక్స్పీడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ మెమొరీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ 1 టీబీ వరకు పెంచుకునే ఎక్స్టర్నల్ మెమొరీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అనానమస్ కాల్ రికార్డింగ్ ఫీచర్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ -
రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్లు
హైదరాబాద్: దక్షిణ కొరియా శాంసంగ్ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన గెలాక్సీ ఎస్23 ఫోన్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. ‘‘శాంసంగ్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ ఒప్పందం ద్వారా కస్టమర్లకు గెలాక్సీ ఎస్23 సిరీస్ వంటి అత్యాధునిక సాంకేతికత అందించడం గర్వంగా ఉంది’’ అని కంపెనీ చీప్ ఎగ్జిక్యూటివ్ బ్రియాన్ బడే అన్నారు. గెలాక్సీ ఎస్23 కొనుగోలుపై గెలాక్సీ వాచ్4 బ్లూటూత్ను రూ.2,999 పొందవచ్చు. గెలాక్సీ ఎస్23 అల్ట్రా కొనుగోలుపై గెలాక్సీ వాచ్4 క్లాసిక్ ఎల్టీఈ–గెలాక్సీ బడ్స్ రూ.4999కే లభిస్తుంది. -
ఐకూ నుంచి స్నాప్డ్రాగన్ 8 ఫోన్
న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీ సంస్థ ఐకూ తాజాగా స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్తో పనిచేసే స్మార్ట్ఫోన్ ఐకూ 11ను ఆవిష్కరించింది. దేశీయంగా ఈ తరహా స్మార్ట్ఫోన్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని సంస్థ తెలిపింది. వేరియంట్ను బట్టి దీని ధర రూ. 59,999 నుంచి రూ. 64,999గా ఉంటుంది. ఆఫర్ ప్రకారం రూ. 51,999 నుంచి రూ. 56,999కే ఈ ఫోన్ను కొనుగోలు చేయొచ్చు. జనవరి 12న ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ సేల్ కింద అదనంగా ఐకూ రూ. 1,000 డిస్కౌంటును ప్రకటించింది. జనవరి 13 నుంచి ఐకూ ఈ–స్టోర్, అమెజాన్డాట్ఇన్లో ఇది లభిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 గి ఫ్లాష్చార్జ్ టెక్నాలజీ, 6.78 అంగుళాల స్క్రీన్ మొదలైన ఫీచర్స్ ఉంటాయి. 8జీబీ+256జీబీ, 16జీబీ+256జీబీ వేరియంట్లలో ఇది లభిస్తుంది. -
మోటరోలా నుంచి మరో పవర్ఫుల్ స్మార్ట్ఫోన్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటరోలా సరికొత్త మోటో జీ పవర్ 2022 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన మోటో జీ పవర్ 2021 అప్గ్రేడ్గా రానుంది. 50-మెగాపిక్సెల్ సెన్సార్తో ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్, హోల్-పంచ్ డిస్ప్లేలో సెల్ఫీ కెమెరా, వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఏర్పాటుచేసింది. ఈ స్మార్ట్ఫోన్స్ ధరలు సుమారు రూ. 14 వేల నుంచి 18 వేల మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ యూఎస్ మార్కెట్లలో అందుబాటులో ఉండనుంది. భారత మార్కెట్లలోకి వచ్చే ఏడాదిలో రానున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 11తో పనిచేయనుంది. మోటో జీ పవర్ స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే మీడియా టెక్ హెలియో జీ37 ప్రాసెసర్ 4జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 50ఎమ్పీ ప్రైమరీ కెమెరా 8 ఎమ్పీ ఫ్రంట్ కెమెరా ఆండ్రాయిడ్ 11 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ టైప్ సీ సపోర్ట్ చదవండి: భారతీయులు ఎక్కువగా వాడుతున్న పాస్వర్డ్ ఇదే..! -
మోటోరోలా నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్..!
Moto E40 India Launch Teased: భారత మార్కెట్లలోకి మోటోరోలా సరికొత్త స్మార్ట్ఫోన్ మోటో ఈ40 లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ భారత్ మార్కెట్లలోకి వస్తోందని మోటోరోలా ఇండియా తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మోటో ఈ40 ‘ది పర్ఫెక్ట్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్లైన్తో ట్విటర్లో టీజ్ చేసింది. కాగా ఈ స్మార్ట్ఫోన్ లాంచ్ డేట్ను ప్రకటించలేదు. మోటో ఈ40 స్మార్ట్ఫోన్ను ఈ నెల చివరలో లేదా నవంబర్ తొలి వారంలో రిలీజ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇక మోటో ఈ40 ధర విషయానికి వస్తే ఈ డివైజ్ భారత్లో రూ 10,000లోపు లభించనున్నట్లు తెలుస్తోంది. మోటో ఈ40 స్మార్ట్ఫోన్ గ్రే, పింక్ కలర్ వేరియంట్ ఆప్షన్లతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: టీమిండియా స్పాన్సర్కు భారీ షాక్...! మోటో ఈ40 ఫీచర్స్(అంచనా) 6.5-అంగుళాల హెచ్డి+ ఐపిఎస్ ఎల్సిడి డిస్ప్లే 1,600x720 పిక్సెల్స్ రిజల్యూషన్ విత్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఆండ్రాయిడ్ 11 యునిసోక్ టీ700 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్+ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 42+2+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫింగర్ ప్రింట్సెన్సార్ 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ టైప్ సీ ఛార్జింగ్ సపోర్ట్ Fuel your imagination with the #PerfectEntertainer and color the world with your ideas! Can you guess what we're talking about? pic.twitter.com/NZXAr5QLkh — Motorola India (@motorolaindia) October 6, 2021 చదవండి: అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్ రిపీట్..! -
శామ్సంగ్ నుంచి 5 జీ ఫోన్.. ప్రత్యేక తగ్గింపు ధర
దక్షిణ కొరియా టెక్నాలజీ కంపెనీ శామ్సంగ్ పండగ సీజన్లో సరికొత్త ఫోన్ని ఇండియా మార్కెట్లో లాంఛ్ చేయనుంది. మీడియం రేంజ్ బడ్జెట్లో హై ఎండ్ ఫీచర్లతో ఈ ఫోన్ని కస్టమర్లకు అందుబాటులోకి తేనుంది. బరిలో శామ్సంగ్ దేశంలో ఇంకా 5 జీ సర్వీసులు ప్రారంభం కాలేదు. దీంతో యాపిల్, శామ్సంగ్ వంటి దిగ్గజ కంపెనీలు 5జీ ఫోన్ మార్కెట్పై ఇంత కాలం ఫోకస్ పెట్టలేదు. మరోవైపు ఎంట్రీ, మీడియం సెగ్మెంట్లో షావోమి, రియల్మీ, వన్ప్లస్ వంటి సంస్థలు వరుసగా 5జీ ఫోన్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. దీంతో శామ్సంగ్ సైతం బడ్జెట్ ధరలో 5జీ ఫోన్ తెచ్చేందుకు రెడీ అయ్యింది. శామ్సంగ్ ఎం 52 5జీ టెక్నాలజీ సపోర్ట్తో శామ్సంగ్ సంస్థ ఎం 52 మోడల్ని మార్కెట్లోకి తేబోతుంది. అక్టోబరు 3న అమెజాన్లో ఈ ఫోన్ అమ్మకాలు షురూ అవుతున్నాయి. గ్రేట్ ఇండియా ఫెస్టివ్ సేల్స్లో భాగంగా ఈ ఫోన్ని తగ్గింపు ధరతో రూ. 26,999కే అందివ్వబోతున్నారు. అదిరిపోయే ఫీచర్లు - శామ్సంగ్ ఎం 52 మోడల్లో లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 778 జీ ప్రాసెసర్ని ఉపయోగించారు. ప్రాసెసింగ్ స్పీడ్, ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ విభాగాల్లో ఈ ప్రాసెసర్ పని తీరు ఎంతో మెరుగని శామ్సంగ్ చెబుతోంది - ఈ మొబైల్లో 6.7 ఫుల్హెచ్డీ ఎస్ అమోల్డ్ డిస్ప్లేని పొందు పరిచారు. డిస్ప్లే రీఫ్రెష్ రేటు 120 హెర్జ్గా ఉంది. - మొబైల్లో వెనుకు వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్ ఉండగా మిగిలిన రెండు కెమెరాలు 16 ఎంపీ (ఆల్ట్రా వైడ్), 5 ఎంపీ (మైక్రో లెన్స్)లు గాఉన్నాయి. ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 32 మెగా పిక్సెల్స్. - బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ , 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని అందిస్తున్నారు - ఈ మొబైల్లో శామ్సంగ్ డిఫెన్స్ గ్రేడ్ సెక్యూరిటీ అయిన శామ్సంగ్ నాక్స్ని ఇన్బిల్ట్ చేశారు. దీంతో యూజర్ల డేటాకు మరింత భద్రత ఉంటుంది - ఆండ్రాయిడ్ 11 ప్లాట్ఫామ్పై ఈ ఫోన్ రిలీజ్ అవుతోంది. స్లీక్ డిజైన్తో పాటు కేవలం 173 గ్రాముల బరువు కలిగి ఉంది. - స్క్రీన్ ప్రొటెక్షన్గా గోరిల్లా గ్లాస్ 5ని అందించారు. ధరలు వేరియంట్ ధర ఆఫర్ ప్రైస్ 6 జీబీ, 128 జీబీ రూ.29,999 రూ.26,999 8 జీబీ, 128 జీబీ రూ.31,999 రూ.28,999 చదవండి : జియో స్పెషల్ ఆఫర్... ఈ రీఛార్జ్లపై క్యాష్బ్యాక్ -
మార్కెట్పై మైక్రోమ్యాక్స్ ఫోకస్.. మరో కొత్త ఫోన్ రిలీజ్కి రెడీ
దేశీయంగా స్మార్ట్ఫోన్ మార్కెట్లో పుంజుకోవాలని ప్రయత్నిస్తోన్న మైక్రోమ్యాక్స్ మరో మోడల్ ఫోన్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. అందులో భాగంఆ చైనా ఫోన్లకు దీటుగా తక్కువ బడ్జెట్లో ఓ ఫోన్ను మార్కెట్లోకి తేనుంది. మైక్రోమ్యాక్స్ నోట్ సిరీస్లో చాన్నాళ్ల గ్యాప్ తర్వాత మైక్రోమ్యాక్స్ సంస్థ 2020 నవంబరులో నోట్ 1 పేరుతో స్మార్ట్పోన్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ మోడల్కి కొనసాగింపుగా నోట్ 1 ప్రో మొబైల్ని మార్కెట్లోకి తేనున్నట్టు సమాచారం. మీడియాటెక్ హెలియె G 90 చిప్సెట్ను ఈ ఫోన్లో ఉపయోగించారు. నోట్ 1 ఫోన్ ఆండ్రాయిడ్ 10 పై పని చేస్తుండగా నోట్ 1 ప్రో మొబైల్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్పై పని చేయనుంది. అంతేకాకుండా 5000ఎంఎహెచ్ బ్యాటరీ, 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, టైప్సీ పోర్టుతో కొత్త ఫోన్ ఉండబోతుంది. ధర ఎంత ? మైక్రోమ్యాక్స్ నోట్ 1 ప్రో ధర రూ 15,000లు దగ్గరగా ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సెప్టెంబరు చివరి వారంలో ఈ ఫోన్ను ఇండియన్ మార్కెట్లోకి తెస్తారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. పట్టుకోసం ప్రయత్నాలు ఇండియన్ మార్కెట్లో నోకియా, శామ్సంగ్ హవా కొనసాగుతున్న కాలంలో వాటి తర్వాత స్థానం మైక్రోమ్యాక్స్దే అన్నట్టుగా ఉండేంది. ముఖ్యంగా కాన్వాస్ పేరుతో తక్కువ ధరకే స్మార్టు ఫోన్లను అందించి మార్కెట్ను కైవసం చేసుకుంది. అయితే మైక్రోమ్యాక్స్ తరహాలోనే చైనా కంపెనీలైన వివో, ఒప్పో, షావోమీ, రియల్మీలు ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టాయి. వీటితో పోటీ తట్టుకోలేక మైక్రోమ్యాక్స్ వెనుకబడిపోయింది. మరోసారి ఇండియన్ మార్కెట్పై పట్టు పెంచుకునేందుకు ఆ సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చదవండి: ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్లో విడుదలైన మరో స్మార్ట్ ఫోన్ -
గూగుల్ పిక్సెల్ 5ఏ 5జీ స్మార్ట్ఫోన్ విడుదల..
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మార్కెట్లలోకి గూగుల్ పిక్సెల్ 5ఏ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. కొత్తగా లాంచ్ చేసిన స్మార్ట్ఫోన్ గూగుల్ 4ఏ 5జీ మాదిరగానే ఉండనుంది. డిజైన్ మాత్రమే కాదు, చాలా స్పెసిఫికేషన్లు అలాగే ఉన్నాయి. పిక్సెల్ 5 ఎ స్మార్ట్ఫోన్ను కస్టమర్లకు మరింత చౌక ధరకు అందించేందుకు ఈ స్మార్ట్ఫోన్లో కొద్ది మార్పులను చేసింది. ఈ స్మార్ట్ఫోన్ కాస్త పెద్ద డిస్ప్లేతో రానుంది, డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ తో ఈ ఫోన్ను మార్కెట్లలోకి రిలీజ్ చేసింది. పిక్సెల్ 4ఎ 5జీ మోడల్తో పోలిస్తే చాలా పెద్ద బ్యాటరీని ఈ స్మార్ట్ఫోన్లో అమర్చారు. పిక్సెల్ 5ఏ 5జీ స్మార్ట్ఫోన్ చార్జర్తో పాటురానుంది. కాగా పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లకు చార్జర్ రాదని తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ కేవలం ఒకే కలర్ బ్లాక్ కలర్లో రానుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ కేవలం యూఎస్ఏ, జపాన్ దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. త్వరలోనే భారత మార్కెట్లలోకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పిక్సెల్ 5ఏ 5జీ ధర సుమారు రూ. 33,400 ఉండనుంది. గూగుల్ పిక్సెల్ 5ఏ 5జీ ఫీచర్స్ ఆండ్రాయిడ్ 11 అపరేటింగ్ సిస్టమ్ 6.34-అంగుళాల ఫుల్-హెచ్డి+ (1,080x2,400 పిక్సెల్స్) ఓఎల్ఈడీ డిస్ప్లే విత్ 60 హెర్జ్ రిఫ్రెష్ రేట్ 20: 9 యాస్పెక్ట్ రేషియో, 413ppi పిక్సెల్ డెన్సిటీ+ హెచ్డీఆర్ సపోర్ట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765జీ ఎస్ఓసీ అడ్రినో 620 జీపీయూ 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ 12.2+ 16మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా 8మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 118.7 ఫీల్డ్ ఆఫ్ వ్యూ IP67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 4,680mAh బ్యాటరీ -
బాప్రే! ఇది నోకియా ‘బాహుబలి’
ఒకప్పుడు మొబైల్ ఫోన్ బ్రాండ్లలో నోకియా అంటే మన్నికకు మరో పేరు. ఈ కంపెనీ ఫోన్లు కొంటే త్వరగా రిపేరుకు రావని ఎక్కువ కాలం వాడుకోవచ్చనే నమ్మకం ప్రజల్లో ఉండేది. ఇంతకాలం ఫీచర్లపై దృష్టి పెడుతూ వచ్చిన నోకియా ఈసారి రూటు మార్చి ఎక్కువ కాలం వాడుకునేలా ధృఢమైన ఫోన్ని మార్కెట్లోకి తేనుంది. పూర్వ వైభవం కోసం ఒకప్పుడు ఇండియా మొబైల్ ఫోన్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన నోకియా మరోసారి పునర్వైభవం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నోకియా యాజమాన్య బాధ్యతలు హెచ్ఎండీ గ్లోబల్కి మారిన తర్వాత గత ఐదేళ్లుగా రకరకాల మోడల్స్ని ప్రవేశ పెట్టినా పెద్దగా మార్కెట్ సాధించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా మార్కెట్లో పట్టు సాధించే లక్ష్యంతో కొత్త మొబైల్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. రఫ్ అండ్ టఫ్ రఫ్ అండ్ టఫ్ ఫీచర్లతో ఎస్ఆర్ 20 మొబైల్ని నోకియా మార్కెట్లోకి తెచ్చింది. కఠినమైన పరిస్థితులను తట్టుకుంటూ ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఫోన్ను డిజైన్ చేసింది. ఈ మొబైల్కి ఐపీ 68 సర్టిఫికేట్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవడంతో డస్ట్ ఫ్రూఫ్, వాటర్ ప్రూఫ్గా పని చేస్తుంది. అంతేకాదు 1.8 ఎత్తు నుంచి కింద పడినా పగిలిపోకుండా ఉండేలా డిస్ప్లే ధృడంగా తయారు చేసింది. లేటెస్ట్ 5జీ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 480 ఇంటర్నల్ ఫీచర్లకు సంబంధించి నోకియా కొంత మేరకు కాంప్రమైజ్ అయ్యింది. స్నాప్డ్రాగన్ 480 చిప్సెట్ని ఉపయోగించింది. 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజీ, 6జీబీ ర్యామ్తో 128 జీబీ స్టోరేజీ వేరియంట్లలో అందిస్తోంది. వెనుక వైపు 48 మెగా పిక్సెల్, 13 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన రెండు కెమెరాలను అందించింది. వీటికి విడివిడిగా ఎల్ఈడీ ఫ్లాష్లను ఇచ్చింది. ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్. ప్రస్తుతం మార్కెట్లో 4కే డిస్ప్లేల హవా నడుస్తుండగా నోకియా 6.7 అంగులాల ఫుల్హెచ్డీ డిస్ప్లేకే పరిమితమైంది. కాకపోతే తడి చేతులతో ముట్టుకున్నా ‘టచ్’ పని చేసేలా డిజైన్ చేసింది. వైర్లెస్ ఫాస్ట్ ఛార్జర్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్పై ఈ మొబైల్ ఫోన్ పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్తయం 4,630 ఎంపీఎహెచ్గా ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు వాడుకోవచ్చని నోకియా హామీ ఇస్తోంది. ఈ మొబైల్కు సపోర్ట్గా 18 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జర్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జర్ను అందిస్తోంది. సెక్యూరిటీగా ఫ్రింగర్ ప్రింట్ స్కానర్ని ఫోన్ డిస్పై వైపు కాకుండా పవర్ బటన్ ఉండే వైపున ఏర్పాటు చేసింది. ఆగస్టు 24న నోకియా ఎక్స్ఆర్ 20 మోడల్ని ఆగస్టు 24 మార్కెట్లో అమ్మకానికి రానుంది,. మొబైల్ ధర రూ.43,800ల నుంచి ప్రారంభం కానుంది. ఈ మొబైల్కి సంబంధించి నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని నోకియా తెలిపింది. -
మళ్లీ మార్కెట్లోకి నోకియా 5310
హైదరాబాద్: హెచ్ఎమ్డీ గ్లోబల్ సంస్థ తాజాగా నోకియా5310 ఫీచర్ ఫోన్ను మార్కెట్లోకి తెచ్చింది. 2007లో నోకియా 5310 ఎక్స్ప్రెస్ మ్యూజిక్ పేరుతో వచ్చిన ఫీచర్ ఫోన్ను మరింత అప్గ్రేడ్ చేసి అందిస్తున్నామని హెచ్ఎమ్డీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సన్మీత్ సింగ్ పేర్కొన్నారు. ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ధర రూ. 3,399 అని తెలిపారు. ఈ ఫోన్లో ఇన్బిల్ట్ ఎమ్పీ 3 ప్లేయర్, వైర్లెస్ ఎఫ్ఎమ్ రేడియో, వెనక వైపు ఎల్ఈడీ ఫ్లాష్తో కూడిన వీజీఏ కెమెరా. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే, 16 ఎమ్బీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్పాండబుల్ మెమెరీ, 1,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయి. ఈ నెల 23 నుంచి నోకియా ఇండియా ఆన్లైన్, అమెజాన్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. వచ్చే నెల 23 నుంచి రిటైల్ స్టోర్స్లో లభ్యం కానున్నది. -
బ్రహ్మాండమైన అప్డేట్స్తో కొత్త ఐఫోన్, ట్రైలర్
సాక్షి, న్యూఢిల్లీ: యాపిల్ మరో ప్రతిష్టాత్మక స్మార్ట్ఫోన్ను తీసుకురానుంది. ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్ల సిరీస్ లాంచింగ్ ముగిసిన వెంటనే తన పాపులర్ మోడల్ యాపిల్ ఐఫోన్ ఎస్ఆ సిరీస్ ఫోన్పై లీక్లు మొదలయ్యాయి. ముఖ్యంగా భారతదేశంలో తక్కువ రేటులో 2016లో తీసుకొచ్చిన ఐఫోన్ ఎస్ఈకి కొనసాగింపుగా ఎస్ఈ2ని లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఒకటి ఐ ఫోన్ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఐఫోన్ఎస్ఈ మాదిరిగానే కొత్త ఐఫోన్ ఎస్ఈ2 ఉన్నప్పటికీ 4.7 డిస్ప్లేతో రానున్న ఈ డివైస్లో ఐఫోన్11 సిరీస్లో పొందుపర్చిన గార్జియస్ ఫీచర్లను అమర్చింది. యాపిల్కు చెందిన అత్యంత ప్రియమైన డిజైన్తో పాటు వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఫేస్ ఐడి నాచ్ అప్ ఫ్రంట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ లాంటి లేటెస్ట్ స్పెసిఫికేషన్లతో, తక్కువ ధరలో తీసుకురానుంది. 2019 చివర్లో నిర్వహించే ఒక ఈవెంట్లో ఈ స్మార్ట్ఫోన్ను తీసుకురానుందని అంచనా. చదవండి : యాపిల్ ఐఫోన్ 11 వచ్చేసింది.. -
షావోమి మరో విప్లవం : ఈ ఫోన్కు మీరే పేరు పెట్టండి!
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి మరోసారి విప్లవాత్మక ఆవిష్కారానికి నాంది పలికింది. శాంసంగ్, ఎల్జీ లాంటి దిగ్గజ సంస్థలు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ఆవిష్కరణకు అష్టకష్టాలు పడుతోంటే స్మార్ట్ఫోన్ సంచలనం ఏకంగా మూడు స్క్రీన్లతో డబుల్ ఫోల్డబుల్ డివైస్ను పరిచయం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మడిచివేసేందుకు అనువైన మూడు స్క్రీన్ల మొబైల్ని రిలీజ్ చేసింది. ఈ మేరకు షావోమి సహ వ్యవస్థాపకుడు లిన్-బిన్ చైనా వెబ్సైట్ వైబోలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. టాబ్లెట్ సైజులో ఉండే ఈ ఫోల్డబుల్ మొబైల్ విశేషం ఏమిటంటే...ఈ ఫోన్ను తెరచి..ఫోల్డ్ చేయగానే చిన్న సెంట్రల్ డిస్ప్లే కనబడుతుంది. మరోసారి ఫోల్డ్ చేస్తే లోపల మరో రెండు స్క్రీన్స్ కనిపిస్తాయి. అలాగే మడిచివేసిన స్క్రీన్లోని భాగాలు డీ-యాక్టివేట్ అయిపోయి తిరిగి యధాతధ స్థితికి చేరుకుంటాయట. అయితే వాటిని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు. మరోవైపు ఈ డివైస్లోని ఇతర ఫీచర్లు, కెమెరా గురించి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ఫ్లెక్సిబుల్ ఫోల్దింగ్ స్క్రీన్ టెక్నాలజీతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తాము ఇలాంటి ఫోన్ని డెవలప్ చేశామని లిన్-బిన్ తెలిపారు. చైనా యాపిల్గా పిలుస్తున్న ఈ స్మార్ట్ఫోన్ ప్రాథమికంగా ఇంజనీరింగ్ మోడల్లో ఉందనీ, మరింత అభివృద్ది పరుస్తామని తెలిపారు. అలాగే డిమాండ్ ఆధారంగా వీటిని ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రస్తుతం షావోమీ డ్యుయెల్ ఫ్లెక్స్, షావోమీ మిక్స్ ఫ్లెక్స్ అనే పేర్లను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. అంతేకాదు ఇంకా మార్కెట్లోకి రాని ఈ త్రీ స్క్రీన్ ఫోన్కి ఎవరైనా పేరు పెట్టవచ్చునని లిన్ ఆహ్వానించారు. అందుకే ఈ ఫోన్ను అందరికీ పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. కామెంట్లు, లైకుల ఆధారంగా, అందరికీ నచ్చితే.. భవిష్యత్తులో భారీ సంఖ్యలో వీటిని తయారు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. Xiaomi foldable phone? #xiaomi #foldable pic.twitter.com/yAXYsTdl2Z — Bang Gogo (@bang_gogo_) January 23, 2019 -
కొత్త ఫోను, కొత్త నంబరు
తపాలా కొత్త ఫోన్, కొత్త నంబర్. మొదటి కాల్ అమ్మకి చేయాలి. రింగ్ చేశాను. కానీ అమ్మ లిఫ్ట్ చేయటం లేదు. మరలా చేశాను. అలా ఎనిమిది సార్లు. ఫోన్ తీయటం లేదు. అమ్మ కాల్ కోసం ఎదురుచూస్తున్నా. రాత్రి ఎనిమిదింటికి వంట చేస్తున్నప్పుడు నా ఫోన్ రింగ్ అవుతోంది. గబగబా వచ్చి, ‘‘హలో, అమ్మా! ఉదయం నుండి మాట్లాడాలని ప్రయత్నించాను. ఫోన్ తీయలేదెందుకు?’’ అన్నాను. ‘‘హలో, ఆగండి. నేను ఉదయం నా ఫోన్ ఇంట్లో మరచిపోయి ఆఫీసుకి వెళ్లాను. సాయంత్రం వచ్చాక చూసుకుంటే ఈ నంబరుతో 8 మిస్డ్కాల్స్ ఉన్నాయి. మీరెవరు, ఎందుకు చేశారు?’’ ఆశ్చర్యంగా అట్నుంచి వేరొకాయన గొంతు. ‘‘హలో మీరెవరు? ఇది మా అమ్మ నంబరు. ఈ నంబరుతో మా అమ్మ తప్ప ఇంకెవరూ మాట్లాడరు’ అన్నాను. ‘‘నంబర్ సరిగా చూసుకోండి’’ అన్నారు. నేను సీరియస్గా, ‘‘మా అమ్మ నంబరు నాకు తెలియదా? మీరు ఎవరు మాట్లాడుతున్నారో చెప్పండి?’’ ‘‘హలో, మేడమ్. నా పేరు రవి. మాది హైదరాబాద్. మీది ఏ ఊరు?’’ ‘‘మా ఊరేదో మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. పెట్టేయండి ఫోన్’’ ఫోన్ కట్ చేశాను. కొంతసేపటికి, పాత ఫోన్ తీసి అమ్మ నంబర్ చెక్ చేశాను. సింగిల్ నంబర్ రాంగ్ డయల్ చేశాను. తప్పు నాదే. మరుసటిరోజు అదే నంబరుతో ఫోన్ కాల్. ఎందుకులే అని కట్ చేశాను. గంట తర్వాత వేరే నంబరుతో నా ఫోన్ రింగ్ అవుతోంది. తీశాను. ‘‘ఎవరండి? హలో మీరెవరండి’’ అని అడుగుతున్న వాయిస్ నిన్నటిదే. ‘‘మీరే కాల్ చేసి మీరెవరని అడుగుతారేమిటి? మీకు ఎవరు కావాలి?’’ అన్నాను. ‘‘హలో! మీది ఏ ఊరండి?’’ అంటున్నాడు. కోపంగా ఫోన్ కట్ చేశాను. తర్వాతి రోజు కొత్త సంవత్సర శుభాకాంక్షలతో మెసేజ్! చిన్న కౌన్సెలింగ్ ఇవ్వాలని కాల్ చేశాను. ‘‘హాయ్! మేడమ్, హ్యాపీ న్యూ ఇయర్.’’ ‘‘ఓకే. థాంక్యూ. సేమ్ టూ యూ.’’ ‘‘మేడమ్ ఇప్పుడు చెప్పండి మీరెవరు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు?’’ ‘‘చూడమ్మా! నువ్వు చిన్నవాడిలా ఉన్నావు. ఫోన్లో నా వాయిస్కి ఎట్రాక్ట్ అయ్యావేమో. నేను చెప్పేది విను. నా వయస్సు 40 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. నేను డాక్టర్ని. బిజీగా ఉన్నప్పుడు కాల్చేసి మీరెవరు అని అడుగుతున్నావు. ఆ రోజు నేను రాంగ్ కాల్ చేయటం తప్పే. క్షమించు’’ అన్నాను. ‘‘మేడమ్! మీరనుకున్నట్లు నేనేమీ చిన్నవాడిని కాదు. నాకూ ఇద్దరు పిల్లలున్నారు. నా కాలేజ్ స్నేహితురాళ్లు ఎవరైనా నన్ను ఆటపట్టిస్తున్నారేమో అనుకున్నాను. సారీ, మేడమ్. ఇంకెప్పుడూ కాల్ చేయను’’ అన్నాడతను. ‘‘అనవసరమైన ఫోన్ కాల్స్ వలన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. థాంక్యూ, అర్థం చేసుకున్నందుకు’’ అని పెట్టేశాను. అక్కడితో ముగిసిపోయిందనుకున్నాను. ఆరు నెలల తర్వాత- అర్ధరాత్రి భర్త పిల్లలతో నిద్రపోతుండగా, నా ఫోన్ సౌండ్కి నా భర్త ‘‘ఎవరు?’’ అని అడగటం, ‘‘పిల్లలు క్లాక్ టైమ్ రాంగ్ సెట్ చేసినట్లున్నారు’’ అని అబద్ధం చెప్పి కాల్ని కట్ చేయటం సెకనులో జరిగిపోయింది. ఇక అప్పట్నుంచీ మొదలు టెన్షన్! నేనెందుకు భయపడుతున్నాను! ఏదైనా తప్పు చేసినవాళ్లు కదా భయపడేది! అబద్ధం చెప్పటం వలన భయమా? అయినా వీడు ఈ టైమ్లో ఫోన్ చేయటం ఏమిటి? భార్యకు ఏదైనా సమస్య వస్తే భర్తకు చెప్పుకుంటే పరిష్కారమవుతుంది, అనే నమ్మకం కల్పించిన భర్త దొరికిన భార్య అదృష్టవంతురాలు... అలా అనేక ఆలోచనలతో తెల్లవారింది. సమయం చూసుకుని కాల్ చేశాను. ‘‘హలో రవిగారూ, మీరు అర్ధరాత్రి ఫోన్ చేయటం పద్ధతేనా? మీకు భార్య, పిల్లలు ఉన్నారు కదా? ఇంకెప్పుడూ చేయనని చెప్పారు...’’ అన్నాను కోపంగా. ‘‘మేడమ్! మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. రాత్రి కాల్ చేసింది నేను కాదు, నా భార్య. నేనెంత చెప్పినా నమ్మటం లేదు’’ అన్నాడు. అప్పుడు అనిపించింది భర్తను అర్థం చేసుకునే భార్య దొరకటం కూడా అదృష్టమేనని. ‘‘రవిగారూ! ఒక్కసారి మీ ఫోన్ మీ భార్యకివ్వండి’’ అని చెప్పి ఆమెతో మాట్లాడాను. పది నిమిషాల్లో సమస్య పరిష్కారమైపోయింది. తర్వాత ఆ కుటుంబం మాకు పరిచయమైపోయింది. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి వారు పంపే శుభాకాంక్షలు నాకు చాలా ఆనందాన్నిస్తాయి. - లక్ష్మి, గుంటూరు
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జగన్ కి ఓటు వేస్తే ఇంటింటి అభివృద్ధి, కూటమికి ఓటు వేస్తే పథకాలు ముగింపు
గ్లామర్తోనే 'హార్ట్ ఎటాక్' ! అదా శర్మ' అరుదైన ఫోటోలు
మదర్స్ డే స్పెషల్: మీ అమ్మని ఇలా సర్ ప్రైజ్ చేయండి..!
దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా?: సీఎం జగన్
ప్రధాని మోదీ వయస్సుపై.. అమిత్ షా క్లారిటీ
గవర్నర్ మారేవరకు రాజ్భవన్లో అడుగుపెట్టను: మమతా బెనర్జీ
సినిమాలకు హీరో గుడ్బై.. నాలుగురోజులే ఉండే కూతురు.. తనకోసం అన్నీ చేస్తా!
బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
నా అంతిమ యాత్ర ..! వంగా గీత ఎమోషనల్ స్పీచ్
ఆడపిల్ల విలువ తెలియజేసేలా ‘చిట్టి పొట్టి’
తప్పక చదవండి
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- ‘ఫోర్లు, సిక్స్లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- టీడీపీ, పవన్కు మంత్రి బొత్స కౌంటర్
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement