-
టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!
యంగ్ హీరో నిఖిల్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. తన ఫ్యామిలీ, రీసెంట్గా పుట్టిన కొడుకు కోసం ఓ త్యాగం చేశాడు. ఇకపై కొన్ని విషయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఫిక్సయ్యాడు. తాజాగా తన కొడుకు గురించి చెబుతూ ఇదంతా బయటపెట్టాడు. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: హీరోయిన్కి చేదు అనుభవం.. సొంత భాషలో మాట్లాడినందుకు ఏకంగా!) 'హ్యాపీడేస్' సినిమాలో ఓ నటుడిగా కెరీర్ ప్రారంభించిన నిఖిల్.. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. 'స్వామి రారా', 'కార్తికేయ' చిత్రాలతో పేరు సంపాదించాడు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం 'స్వయంభు' అనే పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. నిఖిల్ వ్యక్తిగత జీవితానికొస్తే.. 2020లో పల్లవి అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీళ్లకు బాబు పుట్టాడు. తాజాగా తన కొడుక్కు ధీర సిద్ధార్థ అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు ఎప్పుడో ఓసారి అయినా నైట్ పార్టీలకు వెళ్లేవాడినని, ఇకపై మాత్రం టైమ్ అంతా తన కొడుక్కే ఇస్తానని చెప్పుకొచ్చాడు. పిల్లలు పుడితే తల్లిదండ్రులు మారతారని అంటారు. బహుశా నిఖిల్ కూడా కొడుకుతో టైమ్ స్పెండ్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడనమాట. (ఇదీ చదవండి: జబర్దస్త్ కమెడియన్ల బ్రేకప్? గొడవలు నిజమేనన్న నూకరాజు) -
ఇది చాలా సిగ్గు పడాల్సిన విషయం: టాలీవుడ్ హీరో ఆగ్రహం
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేసిన నెట్టింట వైరల్గా మారింది. ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ క్వాలిఫయర్ మ్యాచ్లో ఇండియా ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రదర్శనకు ఇండియా ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గు పడాలని సిద్దార్థ్ విమర్శించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మనం ఇలాంటి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చాలంటూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఇండియన్ ఫుట్బాల్ కౌన్సిల్ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నిఖిల్ తన ట్విట్లో రాస్తూ..'ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ ఫుట్బాల్ మ్యాచ్ని ఇప్పుడే చూశా. మన భారత జట్టు అత్యంత తీవ్రంగా నిరాశపరిచింది. ఇలాంటి ప్రదర్శన పట్ల ఇండియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గుపడాలి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నా. క్రీడల్లో మనం మరింత మెరుగైన ప్రదర్శన చేయాలి. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చండి.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ హీరోకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ చిత్రంలో నటిస్తున్నారు. అంతే కాకుండా కార్తికేయ-3 కూడా ఉంటుందని నిఖిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. కాగా.. ఇటీవలే సిద్ధార్థ్కు కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. Just watched the Most Frustrating Football Match of our Indian Team at the #FIFAWorldCupQualifiers The @IndianFootball association should be Ashamed for this embarrassing display. The Most Populous country in the World 🇮🇳 We deserve better.. CHANGE THE SYSTEM @ianuragthakur… pic.twitter.com/Lt9S1P2ltw — Nikhil Siddhartha (@actor_Nikhil) March 21, 2024 -
నిఖిల్ 'కార్తికేయ'.. ముచ్చటగా మూడోసారి
హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందూ మొండేటిలది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘కార్తికేయ’(2014) సూపర్ హిట్గా నిలిచింది. అలాగే వీరి కాంబోలో వచ్చిన ద్వితీయ సినిమా ‘కార్తికేయ 2’ (2022) పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. దీంతో ‘కార్తికేయ 3’ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. తాజాగా వారి ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పడింది. నిఖిల్, చందూ కలయిక ముచ్చటగా మూడోసారి రిపీట్ అవుతోంది. ‘కార్తికేయ 3’ సినిమా రూపొందనున్నట్లు స్పష్టత ఇచ్చారు నిఖిల్. ‘‘దర్శకుడు చందూ మొండేటి అడ్వెంచరస్ థ్రిల్లర్ మూడవ ఫ్రాంచైజీకి (కార్తికేయ 3) సంబంధించిన స్క్రిప్ట్ వర్క్పై పని చేస్తున్నారు. ‘కార్తికేయ 3’ స్పాన్, స్కేల్ పరంగా చాలా పెద్దగా ఉండబోతోంది. డా.కార్తికేయ సరికొత్త సాహసం త్వరలోనే ప్రారంభం కానుంది’’ అన్నారు మేకర్స్. కాగా ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. మరోవైపు నాగచైతన్య హీరోగా ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు చందూ మొంటేటి. -
హీరో నిఖిల్ కుమారుడి నామకరణ వేడుక
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ మధ్యే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పల్లవి వర్మ ఫిబ్రవరి 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టడంతో నిఖిల్ తెగ సంతోషించాడు. ఏడాది క్రితం నాన్న చనిపోయాడని, ఆయనే మళ్లీ తన కొడుకుగా తిరిగి వచ్చాడంటూ ఎమోషనలయ్యాడు. కుమారుడిలోనే తండ్రిని చూసుకుని మురిసిపోయాడు. తాజాగా నిఖిల్ ఇంట అతడి తనయుడి బారసాల వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. నిఖిల్-పల్లవి దంపతులు తమ కుమారుడికి కొత్త బట్టలు వేసి తొట్లె(ఊయల)లో వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ దంపతులు బాబుకు ఏ పేరు పెట్టి ఉంటారా? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. కాగా నిఖిల్ - పల్లవి 2020వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. హ్యాపీ డేస్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నిఖిల్ 'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం స్వయంభూ అనే మూవీతో బిజీగా ఉన్నాడు. చదవండి: స్టేజీపై హీరోయిన్కు హారతి.. వామ్మో.. బానే ఎక్స్ట్రాలు కొడ్తున్నాడే! -
తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. సీమంతం ఫోటో వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ త్వరలోనే తండ్రి కాబోతున్నారు. తాజాగా ఆయన భార్యకు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ విషయాన్ని నిఖిల్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. సీమంతం వేడుకలో తన భార్యతో దిగిన ఫోటోను షేర్ చేశారు. కాగా.. 2020లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిఖిల్. నిఖిల్ తన ట్విటర్లో రాస్తూ.. 'నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డ స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు పంపండి.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నిఖిల్ అభిమానులు తమ హీరోకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. 'హ్యాపీడేస్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరో నిఖిల్. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన 'స్వయంభూ' సినిమాలో నటిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నారు. ఇలా ఒక సినిమా కోసం హీరోలు ఇంతలా శ్రమించడం చాలా అరుదు. నిఖిల్కు 'స్వయంభూ' 20వ సినిమా కాగా.. ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. Seemantham .. Traditional Indian form of BabyShower.. Pallavi & Me r happy to announce that Our first baby is expected very soon 👶🏼👼🏽 Please send in your blessings 🙏🏽😇 pic.twitter.com/3Nn4S3wFHv — Nikhil Siddhartha (@actor_Nikhil) January 31, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement