-
Lok Sabha Election 2024: కాంగ్రెస్కు కనీసం 50 సీట్లు కూడా రావు
ఫూల్బాణీ/బోలాంగిర్/బార్గఢ్/ఛాత్రా: కాంగ్రెస్ పార్టీ కనీసం 50 చోట్ల కూడా గెలవబోదని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. విజయం కాదుకదా కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఒడిశా, జార్ఖండ్లోని ఫూల్బాణీ, బోలాంగిర్, బార్గఢ్, ఛాత్రాలలో ఎన్నికల ప్రచారసభల్లో మోదీ ప్రసంగించారు. ‘‘ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సిన కనీసం 10 శాతం సీట్లు కూడా కాంగ్రెస్ సాధించబోదు. వాళ్లు కనీసం 50 సీట్లు కూడా గెలవలేరు’ అని అన్నారు. రాహుల్ గాం«దీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ గాంధీ యువరాజు 2014 నుంచి అదే స్క్రిప్ట్ చదువుతున్నారు. నా మాటలు రాసిపెట్టుకోండి. ఎన్డీఏ అన్ని రికార్డులను బద్దలుకొట్టి 400 సీట్లు సాధిస్తుంది’’ అని అన్నారు. సొంత ప్రజల్నే కాంగ్రెస్ భయపెడుతోంది మణిశంకర్ అయ్యర్ ‘అణుబాంబు’ వ్యాఖ్యలను మోదీ ప్రస్తావించారు. ‘ పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని సొంత ప్రజల్నే కాంగ్రెస్ భయపెడుతోంది. వర్చువల్గా ఇప్పటికే చనిపోయిన కాంగ్రెస్ నేతలు ప్రజల గుండెల్లో నిండిన దేశ స్ఫూర్తిని చంపేస్తున్నారు. సొంత అణుబాంబుల నిర్వహణ బాధ్యతలు కూడా పాక్కు చేతకావట్లేదు. అందుకే అణుబాంబులను అమ్మేద్దామని భావిస్తోంది. బాంబులను అమ్ముదామన్నా కొనేవారు లేరు. అవి ఎంత నాసిరకానివో ఇతర దేశాలకు తెలుసు. జమ్మూకశీ్మర్ విషయంలో కాంగ్రెస్ తీసుకున్న బలహీనమై న నిర్ణయాల వల్ల ఆ ప్రాంతం ఆరు దశాబ్దా లు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంది. కాంగ్రెస్ హ యాంలో భారత్ ఎన్నోసార్లు ఉగ్రదాడుల బా రినపడింది. కఠిన నిర్ణయాలకు బదులు చర్చలకు మొగ్గుచూపింది’’ అని ధ్వజమెత్తారు.పాండియన్పై విసుర్లు తమిళనాడుకు చెందిన మాజీ ఉన్నతాధికారి పాండియన్పై మోదీ విమర్శలు గుప్పి ంచారు. ‘‘ పటా్నయక్ తన ప్రభుత్వ బాధ్యతలను ఔట్సోర్సింగ్కు ఇచ్చేశారు. బయటివ్యక్తి(ఔట్సైడర్) పాండియన్ ఒడిశాను పాలిస్తున్నారు. ముఖ్యమంత్రిని మించి సూపర్ సీఎం పాలిస్తున్నారు. ఒడిశా బిడ్డలు, కూతుళ్లకు సొంత ప్రభుత్వాన్ని నడుపుకునే సత్తా లేదా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దమ్ము ఇక్కడి వారికి లేదా?’’ అని ప్రశ్నించారు.నవీన్ పటా్నయక్ జిల్లాల పేర్లు చెప్పగలరా? ‘‘ఒడిశాకు ఇన్నేళ్లు సీఎంగా ఉన్న నవీన్ పటా్నయక్కు ఇదే నా సవాల్. ఆయన ఒడిశాలోని అన్ని జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లను ఏ పేపర్లో చూడకుండా, ఎవరి సాయం లేకుండా ఒడియా భాషలో చెప్పగలరా?. పేర్లే చెప్పలేని వ్యక్తి పేదల బాధలెలా తీర్చగలరు? ప్రజా సమస్యలను ఎలా అర్థంచేసుకోగలరు?’’ అని మండిపడ్డారు. -
Lok Sabha Elections 2024: యూపీ... హస్తినకు గేట్వే
ఉత్తరప్రదేశ్. లోక్సభ ఎన్నికలనగానే అందరి మదిలో మెదిలే రాష్ట్రం. రాజకీయంగానే కాక జనాభాపరంగా, భౌగోళికంగానూ దేశంలో యూపీది ఎప్పుడూ కీలక పాత్రే. 2024 లోక్సభ ఎన్నికల ముంగిట ఇక్కడి రాజకీయ ముఖచిత్రం కూడా కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయోధ్య రామమందిరం కల సాకారం చేసి హిందువుల మనసుల్లో గుడి కట్టుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరింత దూకుడు పెంచగా, విపక్ష ఇండియా కూటమి కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. యూపీ కుంభస్థలాన్ని కొట్టిన పార్టీ హస్తినలో పాగా వేసినట్లేననేది నానుడి. స్టేట్ స్కాన్ దేశ రాజకీయాలకు గుండెకాయ వంటి యూపీలో సత్తా చాటేందుకు పార్టీలన్నీ అ్రస్తాలను రెడీ చేసుకుంటున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఏకంగా 80 లోక్సభ స్థానాలున్న రాష్ట్రం యూపీ. దేశాన్నేలే నాయకులను తీర్చిదిద్దడంలోనూ ఈ రాష్ట్రానిది ఘన చరిత్రే. ఏకంగా 8 మంది ప్రధానులను అందించింది యూపీ. ఈ రికార్డుకు మరే రాష్ట్రమూ దరిదాపుల్లో కూడా లేదు... ఈ ఎన్నికలు అత్యంత కీలకం... ఒకప్పుడు కాంగ్రెస్, సమాజ్వాదీ, బహుజన సమాజ్ పార్టీ వంటి పార్టీలకు కంచుకోటగా ఉన్న యూపీలో 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయిలో పాగా వేసింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుని తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. యూపీలో క్లీన్ స్వీప్ ద్వారానే బీజేపీ వరుసగా రెండుసార్లు బంపర్ మెజారిటీతో హస్తిన పీఠాన్ని చేజిక్కించుకోగలిగింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఒంటరి పోరు చేసి కకావికలమైంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ కలిసి పోటీ చేసినా ప్రభావం చూపలేకపోయాయి. బీజేపీ హవాలో చిన్నా చితకా పార్టీలు సోదిలో కూడా లేకుండా పోయాయి. ఈసారి కూడా యూపీలో సత్తా చాటాలని బీజేపీ ఉవి్వళ్లూరుతోంది. ఎన్నికల షెడ్యూలైనా రాకుండానే తొలి విడతలో అభ్యర్థులను ప్రకటించిన 195 సీట్లలో ఏకంగా 51 స్థానాలు యూపీ నుంచే ఉండటం విశేషం! ఎస్పీ ఈసారి విపక్ష ఇండియా కూటమి భాగస్వామిగా కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తోంది. 2014లో యూపీలో ఏకంగా 71 సీట్లు గెలిచిన బీజేపీ 2019లోనూ 62 స్థానాలు నెగ్గింది. ఎన్డీఏ భాగస్వామి అప్నాదళ్(ఎస్) 2 సీట్లు గెలిచింది. బీఎస్పీ, ఎస్పీ, రాష్ర్టీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ)తో కూడిన మహా కూటమి 15 సీట్లకే పరిమితమైంది. బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేసి 10 సీట్లలో విజయం సాధించగా, ఎస్పీ 37 సీట్లలో పోటీ చేసి ఐదే నెగ్గింది. ఆర్ఎల్డీ 3 సీట్లలోనూ మట్టికరిచింది. 67 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. కేవలం సోనియాగాంధీ మాత్రమే రాయ్బరేలీలో నెగ్గారు. అతి పెద్ద రాష్ట్రం కావడంతో యూపీలో ఈసారి మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్ జరుగుతోంది. అయోధ్య.. బీజేపీ బ్రహా్మస్త్రం ఈసారి 400 పైగా లోక్సభ స్థానాలే లక్ష్యంగా బీజేపీ ముందునుంచే చకచకా పావులు కదిపింది. అయోధ్య రామమందిర కలను సాకారం చేయడం హిందువుల ఓట్లను కొల్లగొట్టడం ఖాయమని నమ్ముతోంది. ప్రధాని మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయడం ఎప్పట్లాగే మరింతగా కలిసొస్తుందని భావిస్తోంది. రాష్ట్రంలోనూ బీజేపీ సర్కారే ఉండటం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి, వేలాది కోట్లతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యకలాపాలను చేపడుతుండటమూ బీజేపీకి కలిసొచ్చేదే. యూపీలో రెండుసార్లు బీజేపీ జెండా రెపరెపలాడించిన సీఎం యోగి ఆధిత్యనాథ్ పార్టీకి అదనపు బలం. జాట్ల మద్దతు దండిగా ఉన్న మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ మనుమడు జయంత్ నేతృత్వంలోని ఆర్ఎల్డీ ఇండియా కూటమికి గుడ్బై చెప్పి ఎన్డీఏలో చేరడం కాషాయదళంలో కొత్త జోష్ నింపింది. చరణ్ సింగ్కు భారతరత్న ప్రకటనతో జాట్ల ఓట్లు ఎన్డీఏకేనని బీజేపీ భావిస్తోంది. మరో భాగస్వామి అప్నాదళ్ (ఎస్)కూ యూపీలో మంచి పట్టుంది. ప్రధాని మోదీ ఇప్పటికే రాష్ట్రంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు తోడు రాజ్నాథ్సింగ్, సీఎం యోగితో సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా కలియదిరుగుతున్నారు. ‘ఇండియా’ కూటమి పోటీనిచ్చేనా? విపక్ష ‘ఇండియా’ కూటమి యూపీలో ఇంకా కాలూచేయీ కూడదీసుకునే పనిలోనే ఉంది. కూటమి భాగస్వాముల్లో ఎస్పీ 63 సీట్లలో, కాంగ్రెస్ 17 సీట్లలో పోటీ చేసేలా ఒప్పందం కుదిరింది. సోనియా రాజ్యసభకు వెళ్లడంతో రాయ్బరేలీ నుండి ప్రియాంక పోటీ చేసే అవకాశం కన్పిస్తోంది. 2019 పరాజయం నేపథ్యంలో అమేథీలో రాహుల్ గాంధీ ఈసారి బరిలో దిగుతారో, లేదో చూడాలి. ఈ రెండు తప్ప మిగతా 15 స్థానాలకూ కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. వెనకబడ్డ, దళిత, మైనారిటీ వర్గాలపై అఖిలేశ్ బాగా దృష్టి పెట్టారు. కానీ గత ఎన్నికల సరళిని బట్టి చూస్తే, యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళిత ఓటర్లను బీజేపీ తనవైపు తిప్పుకునేలా కనిపిస్తోంది. ఇక ఆర్ఎల్డీ గుడ్బై చెప్పడం ఇండియా కూటమికి ఎదురుదెబ్బే. బీఎస్పీ ఈసారి ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఇవన్నీ బీజేపీకి మరింత కలిసొచ్చే అవకాశముందని విశ్లేషకుల అంచనా. ముస్లింల రూటెటు? యూపీ జనాభాలో 19% ఉన్న ముస్లింల ఓట్లపై విపక్షాలు ప్రధానంగా గురి పెడుతున్నాయి. 24 లోక్సభ సీట్లలో వీరు 20 నుంచి ఏకంగా 50 శాతం దాకా ఉన్నారు. దాంతో ఆ స్థానాల్లో వారు కీలకం కానున్నారు. ఈసారి ఎస్పీ, కాంగ్రెస్ జట్టు కట్టేందుకు ముస్లిం ఫ్యాక్టర్ కూడా ప్రధాన కారణమే. 2014, 2019ల్లో అవి విడిగా పోటీ చేయడంతో ముస్లిం ప్రాబల్య స్థానాల్లో బీజేపీ బాగా లాభపడింది. 2019లో ఎస్పీ, బీఎస్పీ నెగ్గిన స్థానాల్లో ముస్లింల ప్రాబల్యమున్నవే ఎక్కువ! రాహుల్ భారత్ జోడో యాత్ర, అఖిలేశ్ పీడీఏ (వెనుకబడిన, దళిత, మైనారిటీ) యాత్రలు యూపీలో ముస్లిం ప్రాబల్య జిల్లాల్లోనే సాగాయి. సర్వేలు ఏమంటున్నాయి...? యూపీలో ఎన్డీఏ కూటమికి ఏకంగా 70 నుంచి 72 సీట్లు రావచ్చని పలు ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇండియా కూటమి ఆరేడు స్థానాలకు మించకపోవచ్చని చెబుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అవినీతిపరుల కూటమి: ప్రధాని మోదీ
మీరట్/ లక్నో: సార్వత్రిక సమరానికి షెడ్యూల్ మొదలయ్యాక ఉత్తరప్రదేశ్ వేదికగా ప్రధాని మోదీ తొలి ఎన్నికల ప్రచార సభలో పాల్గొని విపక్షాల ‘ఇండియా’కూటమిపై విమర్శల వాగ్భాణాలు సంధించారు. ఆదివారం మీరట్లో జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈడీ అరెస్ట్తో కేజ్రీవాల్, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ కటకటాల వెనక్కి వెళ్లిన వేళ ఢిల్లీ రాంలీలా మైదానంలో ఆదివారం విపక్ష ‘ఇండియా’ కూటమి ‘లోక్తంత్ర బచావో’ ర్యాలీ చేపట్టిన కొద్దిసేపటికే మోదీ విపక్షాల కూటమిపై విమర్శల జడివాన కురిపించారు. ‘‘అవినీతిపై నేను పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించగానే విపక్ష నేతలంతా కలిసి ఇండియా కూటమిగా పోగయ్యారు. నన్ను భయపెట్టొచ్చని భావించారు. కానీ నా భారతదేశమే నా సొంత కుటుంబం. అవినీతి నుంచి దేశాన్ని రక్షించేందుకు యుద్ధం మొదలుపెట్టా. అందుకే వాళ్లంతా ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. వాళ్లకు సుప్రీంకోర్టు నుంచి కూడా కనీసం బెయిల్ దొరకడం లేదు. ఈసారి రెండు శిబిరాల మధ్యనే సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగబోతోంది. నా మంత్రం ‘భ్రష్టాచార్ హటావో’ (అవినీతి అంతం). వాళ్ల తంత్రం ‘భ్రష్టాచార్ బచావో’ (అవినీతిని కాపాడుకోవడం). పేదల కోసం ఉద్దేశించిన డబ్బు అవినీతిపరులకు దక్కకుండా పదేళ్లుగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అవినీతిని కూకటివేళ్లతో పెకలిస్తున్న ఎన్డీఏ ఒకవైపు ఉంటే, అదే అవినీతి నేతలను కాపాడేందుకు అలుపెరగక కష్టపడుతున్న ‘ఇండియా’ కూటమి నేతలు మరోవైపు ఉన్నారు. అవినీతికి అంతం పలకాలో వద్దో మీరే నిర్ణయించుకోండి’ అన్నారు. ‘‘అవినీతిపరులకు చెప్పేదొక్కటే. కుటుంబం లేదంటూ నన్నెంతగా అవమానించినా, ఎన్ని ఆరోపణలు గుప్పించినా, బీజేపీ నేతలపై దాడులు చేసినా అవినీతిపై నేను పోరాటం ఆపబోను. అవినీతికి పాల్పడింది ఎంత పెద్ద నేతలైనా సరే కఠిన చర్యలు ఖాయం. దేశాన్ని లూటీ చేసిన వారు తిరిగి ఆ సొమ్ము కక్కాల్సిందే. ఇదే మోదీ గ్యారెంటీ’’ అని అన్నారు. ప్రజల కోసం ఆశల పల్లకీని మోసుకొచ్చామంటూ సభకు ముందు మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘పదేళ్లలో దేశవ్యాప్తంగా నా కుటుంబసభ్యులందరి ఆకాంక్షలూ తీర్చాం. కొంగొత్త కోరికలను తీర్చేందుకు మళ్లీ మీ ముందుకొచ్చాం. ఆశలు నెరవేర్చిన ఎన్డీఏఏ కూటమికే ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు’’ అన్నారు. పదేళ్ల అభివృద్ధి ట్రైలరే ‘‘ఈసారి లోక్సభ ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని మాత్రమే ఎన్నుకోవు. ఈ ఎన్నికలు వికసిత భారత్కు పునాది వేయనున్నాయి. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు మేం ఇప్పటికే కసరత్తు ప్రారంభించాం. మా ప్రభుత్వం వచ్చే ఐదేళ్లకు మార్గసూచీని రూపొందిస్తోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి 100 రోజుల్లో అమలుజరపాల్సిన పనులపై ఆలోచిస్తున్నాం. గత పదేళ్లకాలంలో మీరు చూసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు దేశాన్ని మరింత శరవేగంతో అభివృద్ధి పథంలో ఉరకలెత్తిస్తాం. నేను పేదరికంలో జీవించా కాబట్టే పేదల గురించి తెల్సు నాకు. ప్రతి ఒక్క పేదవాడి బాధలు, కష్టాలను అర్ధంచేసుకోగలను. అందుకే పేదలకు లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను రూపొందించి అమలుచేశాం. ఈ పథకాలు పేదల సాధికారతకు మాత్రమే బాటలు వేయవు. అవి పేదలకు ఆత్మగౌరవాన్ని తిరిగి తెచ్చి ఇచ్చాయి’’ అని మోదీ అన్నారు. ‘‘అయోధ్యలో రామాలయం అసాధ్యమ ని చాలామంది అ న్నారు. నేడు రోజూ లక్షలాది మంది అయోధ్య రామాలయాన్ని దర్శించుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్పై కఠిన చట్టం, ఆరి్టల్ 370 రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం అసాధ్యమన్నారు. మేం చేసి చూపాం’ అని మోదీ అన్నారు. -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ పాలనలో దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నాశనమవుతున్నాయని విపక్ష ఇండియా కూటమి ఆరోపించింది. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని విపక్షాలను, నేతలను వేధిస్తున్నారని మండిపడింది. ఢిల్లీ సీఎం, ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టును తీవ్రంగా ఖండించింది. వారికి అండగా నిలుస్తామని ప్రకటించింది. నియంతృత్వ పాలనను తరిమికొట్టి దేశాన్ని కాపాడుకుందామంటూ పిలుపునిచ్చింది. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ కూటమి మహా ర్యాలీ నిర్వహించింది. ‘తానాషాహీ హటావో, లోక్తంత్ర్ బచావో (నియంతృత్వాన్ని రూపుమాపాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి)’ పేరుతో జరిగిన ఈ ర్యాలీ విపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మారింది. ఇండియా కూటమిలోని 28 పారీ్టల నేతలు ఇందులో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలను మోదీ నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివరి్ణంచారు. దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ఎన్నికల్లో విపక్షాలను నిర్వీర్యం చేసేందుకు అధికార బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్ర నేతలు సోనియాగాం«దీ, రాహుల్గాం«దీ, ప్రియాంక గాం«దీ, పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్మాన్ సింగ్, అఖిలేష్ యాదవ్ (సమాజ్వాదీ), డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), శరద్ పవార్ (ఎన్సీపీ–పవార్), ఉద్దవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ) తదితరులు వీరిలో ఉన్నారు. కేజ్రీవాల్ సతీమణి సునీత, హేమంత్ సోరెన్ సతీమణి కల్పన వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ రాజకీయాల్లోకి రావచ్చనే చర్చ ఊపందుకుంది. వారితో సోనియా వేదికపై చేతిలో చేయి కలిపి మాట్లాడారు. తన పక్కనే కూచోబెట్టుకున్నారు. విపక్షాలన్నీ ఒక్కటై బీజేపీని ఓడించాలని స్టాలిన్, ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. స్టాలిన్ తరఫున ఆయన సందేశాన్ని డీఎంకే నేత తిరుచ్చి శివ చదివి విని్పంచారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా పోరాడదామని శరద్ పవార్ అన్నారు. దేశం పెను సంక్షోభంలో ఉందని డి.రాజా అన్నారు. ఈ ర్యాలీతో రాజకీయాల్లో కొత్త శక్తి పుట్టిందని ఏచూరి అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని అఖిలేశ్ పిలుపునిచ్చారు. తృణమూల్ విపక్ష ఇండియా కూటమిలోనే ఉందని ఓబ్రియాన్ చెప్పారు. కూటమి డిమాండ్లు... కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం, విపక్ష నేతల అరెస్టులు, ఎన్నికల బాండ్ల పేరుతో బలవంతపు వసూళ్లు, విపక్షాలే లక్ష్యంగా ఆదాయ పన్ను నోటీసులు, నిత్యావసరాల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరోద్యగం, రైతులకు అన్యాయం వంటి ఏడు అంశాలపై కూటమి డిమాండ్లను ప్రియాంక చదివి ప్రస్తావించారు. విపక్షాలపై దర్యాప్తు సంస్థల చర్యలను నిలిపేయాలని కోరారు. బీజేపీ ఎన్నికల బాండ్ల క్విడ్ ప్రో కో వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ఆరెస్సెస్, బీజేపీ విషతుల్యం ‘‘ఆరెస్సెస్, బీజేపీ విషం వంటివి. పొరపాటున కూడా వాటిని రుచి చూడొద్దు. ఇప్పటికే దేశాన్ని ఎంతో నాశనం చేసిన విచి్ఛన్న శక్తులవి. మరింత సర్వనాశనం చేయకుండా చూడాల్సిన బాధ్యత విపక్షాలదే. పరస్పరం కుమ్ములాడుకోకుండా ఏకమైతేనే బీజేపీని ఓడించడం సాధ్యం. ప్రజాస్వామ్యం, నియంతృత్వాల్లో ఏది కొనసాగాలో నిర్ణయించే కీలక ఎన్నికలివి. ప్రజాస్వామ్యంపై మోదీకి నమ్మకం లేదు. అధికార వ్యవస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పి బెదిరిస్తున్నారు. ప్రభుత్వాలను పడదోస్తున్నారు. హేమంత్ సోరెన్ను బీజేపీలో చేరనందుకే అరెస్టు చేయించారు. తనకు లొంగడం లేదనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్నూ జైలుపాలు చేశారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఇలా ప్రతిపక్షాలకు బీజేపీతో సమానంగా ఎన్నికల్లో తలపడే అవకాశం లేకుండా చేస్తున్నారు. రూ.14 లక్షల నగదు డిపాజిట్లకు సంబంధించి కాంగ్రెస్కు ఏకంగా రూ.135 కోట్ల జరిమానా విధించారు. రూ.42 కోట్ల నగదు డిపాజిట్లు అందుకున్న బీజేపీకి అదే సూత్రం ప్రకారం రూ.4,600 కోట్ల జరిమానా విధించాలి’’ – కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేజ్రీవాల్ సింహం: సునీత ‘‘కేజ్రీవాల్ సింహం. ఆయనను ఎక్కువ రోజులు జైల్లో పెట్టలేరు. దేశ ప్రజలంతా ఆయన వెంట ఉన్నారు’’ అని ఆయన భార్య సునీత అన్నారు. మోదీ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. లోక్సభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. మా రక్తంలోనే పోరాటం: కల్పన రాజ్యాంగ హక్కులన్నింటినీ మోదీ సర్కారు కాలరాస్తోందని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన మండిపడ్డారు. ‘‘అధికారాన్ని పూర్తిగా గుప్పెట్లో పెట్టుకున్నామని కొన్ని పార్టీలు అపోహ పడుతున్నాయి. కానీ నిజమైన అధికారం ప్రజలదే. మేం గిరిజనులం. త్యాగం, పోరాటం మా రక్తంలోనే ఉన్నాయి. మా సుదీర్ఘ చరిత్రను తలచుకుని గర్వపడతాం’’ అన్నారు. నిర్ణాయక ఎన్నికలివి... ‘‘అంపైర్లపై ఒత్తిడి పెట్టి, కెపె్టన్ను, ఆటగాళ్లను కొనేస్తే మ్యాచ్ గెలిచినట్టే. క్రికెట్లో దీన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. లోక్సభ ఎన్నికల వేళ అంపైర్లను (కేంద్ర ఎన్నికల కమిషనర్లను) ఎంపిక చేసిందెవరు? మ్యాచ్ మొదలైనా కాకముందే ఇద్దరు ఆటగాళ్లను (సీఎంలను) అరెస్టు చేయించిందెవరు? ఇవ్నీ చేసింది ఒక్కే ఒక్క శక్తి. ప్రధాని మోదీ! ముగ్గురు నలుగురు బిలియనీర్ల సాయంతో కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడటం ద్వారా లోక్సభ ఎన్నికలను మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను దేశమంతా గమనిస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్, ఈవీఎంల సాయంతోనే 400 సీట్లు నెగ్గుతామని బీజేపీ ధీమాగా అంటోంది. అదే జరిగితే దేశమే సర్వనాశనమవుతుంది. దేశ గుండె చప్పుడైన రాజ్యాంగం కనుమరుగవుతుంది. తద్వారా దేశాన్ని ముక్కలు చేయడమే బీజేపీ లక్ష్యం. మ్యాచ్ఫిక్సింగ్, ఈవీఎంలు, మీడియాను బెదిరించడం, కొనేయడం జరగకుంటే బీజేపీకి 180 సీట్లు కూడా రావు. కానీ ఇవేం ఎన్నికలు? విపక్షాలను నిరీ్వర్యం చేసి నెగ్గజూస్తున్నారు. ప్రచార వేళ అతి పెద్ద విపక్షమైన కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేశారు. ఈడీ, ఐటీ, సీబీఐ బెదిరింపులు, బల ప్రయోగాలతో దేశాన్ని పాలించలేరు. కానీ దేశం గొంతును అణచలేరు. ప్రజల గళాన్ని అణచే శక్తి ప్రపంచంలోనే లేదు. మోదీ అసమర్థ పాలనలో దేశంలో నిరుద్యోగం 40 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరింది. దేశ సంపదంతా ఒక్క శాతం సంపన్నుల చేతిలో పోగుపడింది. ఈ నిరంకుశత్వాన్ని పారదోలేందుకు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలివి’’ – కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అహంకారానికి అంతం తప్పదు ‘‘సత్యం కోసం చేసిన యుద్ధంలో రామునికి అధికారం లేదు, వన రుల్లేవు. అయినా అవన్నీ ఉన్న రావణుడిపై గెలిచాడు. అధికారం శాశ్వతం కాదని, అహంకారం వీడాలని రాముని జీవి తం నేర్పుతోంది. రాముని భక్తులమని ప్రకటించుకునే వారికి ఇది చెప్పాలనుకుంటు న్నా. అహంకారం అణగక తప్పదు’’ – కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా -
ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, తాడేపల్లి: ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తిరిగి వైఎస్సార్సీపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్సార్సీపీ గెలవాలన్నారు. మంగళగిరిలో వైఎస్సార్సీపీ గెలుపునకు తాను పనిచేస్తానన్నారు. పేదవారికి జరుగుతున్న మేలును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. ‘‘2019లో ఓసీ చేతిలో నారా లోకేష్ ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోతారు. సీఎం జగన్ మంగళగిరి సీటును బీసీ అభ్యర్థికి ఇస్తామన్నారు. ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి -
ప్రతిపక్షాల ప్రవర్తన బాధించింది
సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రతిపక్షాల ప్రవర్తన తనను బాధించిందని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదనను వ్యక్తంచేశారు. ప్రస్తుతం జరుగుతున్న 15వ అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రతిపక్షాల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని మాట్లాడారు. గురువారం సభను నిరవధికంగా వాయిదా వేసే ముందు సభ్యులతో తన ఆవేదనను పంచుకున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో మంత్రి పదవులను నిర్వహించానని, కానీ రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని ఐదేళ్లపాటు నిర్వర్తించడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా తన విధులను కర్తవ్యదీక్షతో నిర్వర్తించానని, అన్ని పార్టీల సభ్యులకు మాట్లాడటానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా తొలిసారి సభకు వచ్చిన ఎమ్మెల్యేలు, మహిళా సభ్యులను మాట్లాడించడానికి ప్రోత్సహించినట్లు తమ్మినేని చెప్పారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ద్వారా సభ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి కృషి చేశానన్నారు. తాను స్పీకర్గా ఉన్న సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధికరణ బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు బిల్లు, మహిళా రక్షణకు ఉద్దేశించిన దిశ బిల్లు వంటి అనేక కీలక బిల్లులు ఆమోదం పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. కానీ, అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు తమ పరిధిని దాటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, ప్రతిష్టాత్మక వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా ప్రవర్తించారన్నారు. సభలో భిన్న వాదనలు ముఖ్యమని, అయితే పరిధి దాటి స్పీకర్ పోడియం మీదకు వచ్చి కాగితాలు, ఫైళ్లు విసిరారని, ఇది తనకు జరిగిన అవమానం కాదని, గౌరవ ప్రదమైన స్పీకర్ స్థాయిని, శాసనసభ స్థాయిని తగ్గించడమేనని తమ్మినేని అన్నారు. సభను హుందాతనంగా నడపడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్లుగా వ్యవహరించిన కోన రఘుపతి, కోలగట్ల వీరభద్రస్వామి, స్పీకర్ కార్యాలయ సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 15వ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు 10 గంటల రెండు నిమిషాలు జరిగాయని, ఇందులో 9 బిల్లులను ఆమోదించగా, 20మంది సభ్యులు మాట్లాడినట్లు తెలిపారు. ఫిబ్రవరి 8 నాటికి సభలో వైఎస్సార్సీపీకి 151 మంది, టీడీపీకి 22 మంది, జనసేనకు ఒకరు చొప్పున సభ్యులు ఉన్నారని, ఒక స్థానం ఖాళీగా ఉందని స్పీకర్ వెల్లడిస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు. -
ప్రతిపక్షాలవి నక్కజిత్తుల రాజకీయాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రతిపక్షాలు నక్కజిత్తుల రాజకీయాలు చేస్తున్నాయని మంత్రులు పీడిక రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు ఘాటుగా విమర్శించారు. త్వరలో జరగబోయే ఎన్నికల మహా యుద్ధానికి అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అమలు కాని హామీలిచ్చే మోసగాళ్లొస్తున్నారు జాగ్రత్త అని హెచ్చరించారు. శనివారం విశాఖపట్నం జిల్లా సంగివలస వద్ద జరిగిన ‘సిద్ధం’ సభలో వారు ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనకు తేడాను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు చెప్పారు. సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. పంచుతున్నాడంటున్నారే గానీ.. గ్రామాల్లో మన కార్యకర్తలు ప్రజాధనం మింగేశారని ప్రజలెవరూ అనడంలేదు. పథకాలు అందలేదని, వివక్ష చూపారని, ధనబలం, కండబలం, కుల బలం చూశారని ఎవ్వరూ అనడంలేదు. మనం నిజాయితీగా పని చేయడం వల్ల దక్కిన గౌరవం ఇది. జగన్మోహన్రెడ్డి ప్రజలకు అన్నీ పంచుతున్నాడు, ఇస్తున్నాడు అని అంటున్నారు గానీ, ఒక్కరు కూడా జగన్ తినేస్తున్నాడు అని అనడంలేదని ఒక మహిళ నాతో అన్నది. ఇదీ ఒక సాధారణ మహిళ సూక్ష్మ పరిశీలన. ఇదీ మన నాయకుడికి ఉన్న గుడ్విల్. ప్రజాస్వామ్యంలో యుద్ధాన్ని ఎన్నుకొనే వారు వీరులు. కొద్దిరోజుల క్రితం చంద్రబాబు ఊరూరా ప్రచారం చేస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఓటు వేయొద్దని చెబుతున్నారు. విద్యుత్ ధరలు తగ్గిస్తానని మాత్రం చంద్రబాబు చెప్పడంలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలు తక్కువగా ఉన్నాయో చెప్పాలని టీడీపీ వారిని అడుగుతున్నాను. ఇతర రాష్ట్రాల్లో జగన్ ముఖ్యమంత్రి కాదు. ఇటువంటి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పాలనలో పెన్షన్, ఇళ్లు, స్థలం, సంక్షేమం అందాయి. గ్రామాల్లో మనం ఉన్నంత గౌరవంగా మరే ఇతర రాజకీయ పార్టీ కార్యకర్తలూ లేరు. టీడీపీ కార్యకర్తల్లా దోచుకుని ఉంటే గ్రామాల్లో గౌరవంగా ఉండగలమా? రానున్న ఎన్నికల్లో అనేక బలాలు కలిగిన మన ప్రత్యర్థులు అనేక అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. వాటిని ప్రజలెవ్వరూ నమ్మడంలేదు. 60 శాతం ప్రజలు మన పార్టీకే ఓటు వేస్తున్నామని చెబుతున్నారు. – రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్కు చెడు తలపెట్టాలని కుట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేస్తున్న మేళ్లను, అందిస్తున్న సుపరిపాలనను చూసి ఓర్వలేక ఆయనకు చెడు చేయాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయి. సీఎం జగన్ దేశంలో మరే ముఖ్యమంత్రీ అందించనంత సంక్షేమాన్ని అందిస్తున్నారు. మరే సీఎం చేయనంత అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు, గిరిజనులను, మహిళలను ఉన్నత స్థితిలోకి తెస్తున్నారు. సామాజిక సాధికారతకు శ్రీకారం చుట్టారు. మంత్రులే ప్రజల ఇంటికి వెళ్లి మాట్లాడిన రాష్ట్రం ఏపీ ఒక్కటే. ప్రజల అవసరాలు తెలుసుకుని ప్రతి ఒక్కటీ పరిష్కరించాం. నక్క జిత్తుల నాయకులు మనల్ని చెడు మార్గంలో నడిపించి అధికారం పొందాలని చూస్తున్నారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. మన నాయకుడు జగన్ సింహంలా సింగిల్గానే వస్తారు. ప్రతిపక్షాల ప్రచారంపై తిరుగుబాటు చేయాలి. దేనికైనా రెడీ అన్నట్టు మనం ఉండాలి. పొత్తులతో వస్తున్న మాయగాళ్లతో, హామీలిచ్చి మోసం చేసిన బాబులున్నారు జాగ్రత్త. – ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సీఎం జగన్ను మరోసారి సీఎంని చేసే వరకు విశ్రమించొద్దు పేదలను ఉన్నత స్థితికి తెస్తూ, సంక్షేమం, అభివృద్ధితో సుపరిపాలన అందిస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్. సీఎం జగన్ దేశంలో నంబర్ వన్ నాయకుడు. నాయకుడంటే ఇలా ఉండాలని నిరూపించారాయన. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా 2024లో మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారు. జగన్ను సీఎంను చేయడానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. జగనన్నను సీఎంగా కూరోబెట్టే వరకు విశ్రమించకూడదు. సైనికుల్లా పోరాడుదాం. – భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రతి ఒక్కరూ సైన్యమై కదలాలి జగనన్న సైనికులుగా, వైఎస్సార్ కుటుంబ సభ్యులుగా అందరూ ఎన్నికలకు సిద్ధం కావాలి. ప్రతి ఒక్క కార్యకర్తా సైన్యమై కదలాలి. రాష్ట్రంలో ప్రతి పేద విద్యారి్థకి నాణ్యమైన విద్య, ఆంగ్ల విద్య అందాలన్నా, రాష్ట్రంలో రైతుకు మంచి జరగాలన్నా, గౌరవంగా వ్యవసాయం చేయాలన్నా, ఇంటి వద్దకే ఎరువులు రావాలన్నా, పంటను అక్కడికక్కడే అమ్ముకోవాలన్నా జగనన్నే మళ్లీ సీఎం కావాలి. పేదవాడు జన్మభూమి కమిటీల వద్ద తలదించుకోకుండా, ఎవరి వద్దా చేతులు కట్టుకోకుండా నేరుగా ఇంటింటికి సంక్షేమ ఫలాలు చేరాలన్నా, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నా జగనే ముఖ్యమంత్రి కావాలి. అందుకే ప్రతి వైఎస్సార్సీపీ సభ్యుడు, జగనన్న శ్రేయోభిలాషులు అందరూ సైన్యమై కదలాలి. – మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అంబేడ్కర్ ఆశయాలు అమలు చేసే ఏకైక సీఎం జగన్ పేదల పెన్నిధి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నాలుగేళ్ల తొమ్మిది నెలల పాలనలో రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకు ఎవ్వరికీ ఆకలి చావు లేకుండా, ప్రతి ఒక్కరూ గౌరవంగా తలెత్తుకుని బతికేలా సుపరిపాలన అందించారు. స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ వారిని అక్కున చేర్చుకొన్న మొట్టమొదటి నాయకుడు సీఎం వైఎస్ జగన్. సామాజికంగా వెనకబడిన వారిని అభివృద్ధి దిశగా నడిపిస్తూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసిన నాయకుడు జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు అనేక పదవులిచ్చారు. ఎవ్వరూ ఊహించని విధంగా నా వంటి దళితుడిని రాజ్యసభకు పంపుతున్న మహానుభావుడు. ఇది నాకిచ్చిన కానుక కాదు. పేద దళిత, అణగారిన వర్గాలకు, ఉత్తరాంధ్రకు ఇచ్చిన కానుక. రాజ్యసభలో మన ప్రభుత్వ సంస్కరణలను వినిపిస్తాను. సీఎం జగన్ మరోసారి గెలిస్తేనే సంక్షేమ ఫలాలు కొనసాగుతాయి. లేదంటే ప్రజలకు అందవు. అందుకే జగన్నీ ముఖ్యమంత్రిగా మళ్లీ గెలిపించుకోవాలి. – పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు -
లోక్ సభలో నేడు 49 మంది ఎంపీలపై వేటు
ఢిల్లీ: పార్లమెంట్లో నేడు మరింత మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై గందరగోళం సృష్టించిన కారణంగా ఇవాళ ఒక్కరోజే లోక్సభ నుంచి 49 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై పార్లమెంట్లో నిన్న 78 మంది సస్పెండ్ అయ్యారు. ఈ సెషన్లో ఇప్పటివరకు మొత్తంగా 141 మంది ఎంపీలపై వేటు పడింది. More Opposition MPs in Lok Sabha including Supriya Sule, Manish Tewari, Shashi Tharoor, Md Faisal, Karti Chidambaram, Sudip Bandhopadhyay, Dimple Yadav and Danish Ali suspended for the remainder of the winter session of Parliament pic.twitter.com/nxcUVnlVEn — ANI (@ANI) December 19, 2023 సస్పెన్షన్కు గురైన ఎంపీల్లో కాంగ్రెస్కు చెందిన శశిథరూర్, మనీష్ తివారీ, కార్తీ చిదంబరం, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, సమాజ్వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్, ఎన్సీపీకి చెందిన ఫరూక్ అబ్దుల్లా, డీఎంకేకు చెందిన ఎస్ సెంథిల్కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుశీల్ కుమార్ రింకు, సుదీప్ బంధోపాధ్యాయ ఉన్నారు. ఎంపీల సస్పెన్షన్ తీర్మానాన్ని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్సభలో నిన్న 33 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. రాజ్యసభలో 45 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ తదితరులు ఉన్నారు. డిసెంబర్ 13న పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది. నలుగురు యువకులు పార్లమెంట్లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు యువకులు లోక్సభ లోపల గ్యాస్ బాంబులను ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పార్లమెంట్లో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో 14 మంది సస్పెన్షన్కు గురయ్యారు. ఇందులో ఒక రాజ్య సభ సభ్యుడు కాగా, 13 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన ఎంపీలతో కలిపి మొత్తంగా పార్లమెంట్లో 141 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఇదీ చదవండి: Ram Mandir Ayodhya: రామాలయం థీమ్తో వజ్రాలహారం.. -
పార్లమెంట్లో మొత్తం 92 మంది ఎంపీల సస్పెన్షన్
ఢిల్లీ: పార్లమెంటులో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తంగా 92 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. ఈరోజు లోక్సభలో 33 మంది ఎంపీలు, రాజ్యసభలో 45 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గతవారం 14 మంది ఎంపీలు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై విపక్షాలు గందరగోళం సృష్టించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్సభలో నేడు 33 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై లోక్సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన లోక్సభ ఎంపీల్లో 31 మందిని శీతాకాల సమావేశాలకు సస్పెండ్ చేయగా.. ముగ్గుర్ని ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేశారు. ఎంపీలు కే జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ ఎంపీల సస్పెన్షన్ ప్రతిపాదనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో సమర్పించారు. వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించారు. Winter Session | A total of 33 Opposition MPs, including Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury, suspended from the Parliament today for the remainder of the Session. pic.twitter.com/zbUpeMaHmU — ANI (@ANI) December 18, 2023 సస్పెన్షన్పై అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. 'నాతో సహా 33 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గతంలో సస్పెండ్ చేసిన మా ఎంపీలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండే చేశాం. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై సభలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడాలని కోరాం.' అని చెప్పారు. #WATCH | On his suspension from the Lok Sabha, Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury says, "All leaders, including me, have been suspended. We have been demanding for days to reinstate our MPs who were suspended earlier and that the Home Minister come to the… pic.twitter.com/y19hCUY7iG — ANI (@ANI) December 18, 2023 డిసెంబర్ 13న పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది. నలుగురు యువకులు పార్లమెంట్లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు యువకులు లోక్సభ లోపల గ్యాస్ బాంబులను ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పార్లమెంట్లో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో 14 మంది సస్పెన్షన్కు గురయ్యారు. ఇందులో ఒక రాజ్య సభ సభ్యుడు కాగా, 13 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన ఎంపీలతో కలిపి మొత్తంగా పార్లమెంట్లో 47 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఇదీ చదవండి: Covid 19 Cases: మళ్లీ కరోనా.. కొత్తగా 355 కేసులు.. ఐదుగురు మృతి! -
లోక్సభలో అలజడి ఘటన: ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి ఫైర్
ఢిల్లీ: పార్లమెంట్ అలజడి ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తప్పుబట్టారు. మహ్మద్ అలీ జిన్నా భావజాలంతో ఓవైసీ ప్రభావితమయ్యారని విమర్శించారు. జిన్నా ఆత్మ ఓవైసీలోకి చొరబడిందని వ్యగ్యాస్త్రాలు సంధించారు. అందుకే ఆయన ఓ వర్గం కోసమే పనిచేస్తారని అన్నారు. నేరస్థుల్లో కూడా మతకోణం చూడటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లోక్సభలో భద్రతా వైఫల్యం కేసుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. ఉగ్రవాదుల మతం, కులం, విశ్వాసాలతో పట్టింపులేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మతపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే ఉగ్రవాదులను ఉగ్రవాదులుగానే గుర్తించామని తెలిపారు. పార్లమెంట్లో అలజడి కేసులో నిందితులు ముస్లింలు అయితే పరిస్థితి ఏంటని ప్రతిపక్షాలు అడగడంపై ఆయన ఆక్షేపించారు. ఉగ్రవాద అంశంలో ప్రతిపక్షాలు మత కోణాన్ని చూస్తున్నారు.. ఈ అంశంపై హోమంత్రి అమిత్ షా స్పందించాలని పట్టుబడుతున్నారు.. ఇలాంటి విషయాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పారిపోయేవారు కాదు అని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. దృఢ సంకల్పంతో ప్రతిస్పందించే వ్యక్తి అని తెలిపారు. పార్లమెంటు చొరబాటుదారులు ముస్లింలైతే పరిస్థితి మరోలా ఉండేదని జేడీయూ, ఏఐఎంఐఎం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు -
పార్లమెంట్ అలజడి ఘటన: ప్రతిపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనలో ప్రతిపక్షాల తీరును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని హితువు పలికారు. 'ఇది తీవ్రమైన సంఘటన. దీనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. సహజంగానే లోపం జరిగింది. పార్లమెంట్ భద్రత స్పీకర్ ఆధ్వర్యంలోనే ఉంటుందని అందరికీ తెలుసు. ఈ అంశంపై హోం మంత్రిత్వ శాఖకు స్పీకర్ లేఖ కూడా రాశారు. మేము విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ నివేదికను త్వరలో స్పీకర్కు పంపుతాం.' అని అమిత్ షా చెప్పారు. భద్రతా ఉల్లంఘన ఘటనపై దర్యాప్తు చేయడంతోపాటు పార్లమెంట్ భద్రతను పెంచే బాధ్యతను కమిటీకి అప్పగించామని అమిత్ షా చెప్పారు. పార్లమెంట్ భద్రతలో లోపాలు ఉండకూడదని పేర్కొన్న అమిత్ షా.. ఆ ఖాళీలను పూడ్చడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. దీన్ని రాజకీయ అంశంగా మార్చవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో ఆరుగురు వ్యక్తులు బుధవారం గందరగోళం సృష్టించారు. పక్కా ప్రణాళికతో పార్లమెంట్లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. నిందితులను ఎంపీలే పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఉపా(దేశ వ్యతిరేక కార్యకాలాపాల చట్టం) చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్పై దాడి జరిగిన రోజే మళ్లీ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: నిందితుల ఎంట్రీ పాస్లపై ఎంపీ ప్రతాప్ సింహ వివరణ -
పార్లమెంట్ నుంచి 15 మంది ఎంపీల సస్పెన్షన్
ఢిల్లీ: పార్లమెంట్లో అలజడి ఘటన తర్వాత సభ నుంచి 15 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. వారిలో 14 మంది లోక్సభ నుంచి కాగా ఒకరు రాజ్య సభకు చెందినవారున్నారు. ఇందులో 9 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాగా, ఇద్దరు సీపీఎం, ఒకరు సీపీఐ, మరో ఇద్దరు డీఎంకే పార్టీ ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, ఎండీ జావేద్, వీకే శ్రీకందన్, బెన్నీ బెహనాన్, డీఎంకే ఎంపీలు కే కనిమొళి, ఎస్ఆర్ పార్థిబన్, సీపీఎం ఎంపీలు పీఆర్ నటరాజన్, ఎస్ వెంకటేషన్, సీపీఐ ఎంపీ కే సుబ్బరాయన్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. సభలో వికృత చేష్టలకు పాల్పడిన ఆరోపణలతో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సస్పెండయ్యారు. సస్పెన్షన్ తర్వాత సభ నుంచి బయటకు వెళ్లడానికి ఆయన నిరాకరించారు. దీంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మోషన్ తర్వాత ఈ అంశాన్ని హౌస్ ప్రివిలేజెస్ కమిటీకి పంపారు. ఈ స్పస్పెన్షన్ను రాజ్యాంగేతర చర్యగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు. పార్లమెంట్లో అలజడి బుధవారం జరగగా.. అదే రోజు ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు. టిఎన్ ప్రతాపన్, హైబీ ఈడెన్, జోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియకోస్లను సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టారు. అయితే..పార్లమెంట్లో ఆగంతుకులు చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో అలజడికి సూత్రదారి? వైరల్ చేయాలని వీడియోలను షేర్ చేసి.. -
ఇండియా కూటమి భేటి మళ్లీ వాయిదా
ఢిల్లీ: ఇండియా కూటమి భేటీ మళ్లీ వాయిదా పడింది. డిసెంబర్ 17న నిర్ణయించిన సమావేశాన్ని డిసెంబర్ 19కి వాయిదా వేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఇందుకు గల కారణాలను మాత్రం ఆయన బయటకు వెళ్లడించలేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో వెంటనే డిసెంబర్ 6న ఇండియా కూటమి భేటీకి పిలుపునిచ్చింది. కానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా కూటమిలోని అగ్రనేతలు రాలేమని స్పష్టం చేశారు. దీంతో సమావేశాన్ని డిసెంబర్ 17కి వాయిదా వేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. ప్రస్తుతం ఉత్తర భారతంలో హిమాచల్ ప్రదేశ్ మాత్రమే కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉంది. ప్రాంతీయ పార్టీల పొత్తుతో భాగస్వామిగా బీహార్, జార్ఖండ్లలో అధికారంలో ఉంది. దేశం మొత్తంలో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్లో మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉంది. బీజేపీని గద్దే దించే ధ్యేయంతో దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. పాట్నాలో మొదటిసారి సమావేశమయ్యారు. అనంతరం బెంగళూరు, ముంబయితో కలిపి ఇప్పటికి మూడు సమావేశాలు జరిగాయి. కూటమి సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇదీ చదవండి: ఛత్తీస్గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి -
‘ఇండియా’ భేటీ వాయిదా
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్ర నేతల సమావేశం డిసెంబర్ మూడో వారానికి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలతో బిజీగా ఉన్నందున బుధవారం జరగాల్సిన భేటీకి రాలేకపో తున్నట్లు కూటమిలోని కొన్ని పార్టీల నేతలు అశక్తత వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇండియా కూటమి పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన నివాసంలో బుధవారం సాయంత్రం తలపెట్టిన సమావేశం మాత్రం కొనసాగనుంది. కూటమి అగ్ర నేతల సమావేశం డిసెంబర్ మూడో వారంలో అందరికీ అనుకూలమైన తేదీలో జరగనుందని ‘ఇండియా’ ప్రచార కమిటీ సభ్యుడు గుర్దీప్ సప్పాల్ తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో చర్చించనున్నారు. బుధవారం జరగాల్సిన భేటీకి తాము రాలేకపోతున్నట్లు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. బిహార్ సీఎం, జేడీయూ నితీశ్ కుమార్ అనారోగ్య కారణాలతో, తమిళనాడు సీఎం స్టాలిన్ తమ రాష్ట్రంపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో రాలేకపోతున్నట్లు తెలిపారని సప్పాల్ వివరించారు. -
Rajasthan Elections 2023: ఫేక్ అని మహిళలను అవమానిస్తారా?
పాలి (రాజస్థాన్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలకు సంబంధించి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పేదలకు, రైతులకు, మహిళలకు వ్యతిరేకమని, గెహ్లాట్ హయాంలో మహిళలపై నేరాల్లో ఆ రాష్ట్రం నంబర్ వన్గా నిలిచిందని ఆరోపించారు. రాజస్థాన్లోని పాలీలో సోమవారం జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మహిళలపై నేరాల్లో కాంగ్రెస్ రాజస్థాన్ను నంబర్ వన్గా నిలిపిందని, పైగా మహిళలు ఇచ్చిన ఫిర్యాదులే ఫేక్ అని సీఎం గెహ్లాట్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మహిళలను అవమానించడం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నరాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు త్వరితగతిన, సమర్థంగా అమలవుతన్నాయని మోదీ పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అదనంగా రూ. 6,000 అందిస్తున్నాయని, రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇక్కడ కూడా రూ.6 వేలు అదనంగా అందిస్తామన్నారు. ఇక సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విపక్షాల కూటమిపైనా ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. అది ‘దురహంకార కూటమి’ అని అభివర్ణించారు. వారు సనాతన ధర్మాన్ని అవమానించడం ఇది మొదటిసారి కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ తమ ప్రయోజనాల కోసం దళితులను వాడుకుంటోందన్నారు. దళితులు, మహిళలపై కాంగ్రెస్ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో మీరూ చూస్తున్నారు కదా అక్కడి మహిళలకు గుర్తు చేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే 'నారీశక్తి వందన్ చట్టం' ఆమోదించినప్పటి నుంచి మహిళలపై వారి దురహంకారం మరింత ఎక్కువైందన్నారు. ఆ దురహంకార కూటమి నాయకులు మహిళల గురించి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనన నియంత్రణపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. నితీష్ కుమార్ వ్యాఖ్యలను ఏ ఒక్క కాంగ్రెస్ నేత ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రతిపక్ష ఎంపీల ఐఫోన్ల హ్యాకింగ్!
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరిన వేళ విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్ వార్తలు దేశవ్యాప్తంగా పెను రాజకీయ సంచలనానికి దారితీశాయి. కాంగ్రెస్ మొదలుకుని పలు విపక్షాల ఎంపీలు తదితరుల ఐఫోన్లకు దాని తయారీ సంస్థ యాపిల్ నుంచి మంగళవారం వచ్చిన హ్యాకింగ్ అలర్టులు తీవ్ర కలకలం రేపాయి. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న హ్యాకర్లు మీ ఐఫోన్లను నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ వచ్చిన హెచ్చరిక నోటిఫికేషన్లు సంచలనం సృష్టించాయి. ఇది కచ్చితంగా కేంద్రంలోని మోదీ సర్కారు పనేనంటూ విపక్ష నేతలు భగ్గుమన్నారు. గతంలో పెగసెస్ సాఫ్ట్వేర్తో తమపై గూఢచర్యం చేసిన బీజేపీ, ఎన్నికల వేళ మరోసారి ఇలాంటి చౌకబారు చర్యలకు దిగిందంటూ దుయ్యబట్టారు. ఈ ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించి వాస్తవాలు వెలుగులోకి తెస్తామని ప్రకటించింది. మరోవైపు ఈ కలకలం నేపథ్యంలో, తమ నోటిఫికేషన్లలో కొన్ని ఫేక్ అలర్టులు కూడా ఉండొచ్చంటూ యాపిల్ స్పందించింది. భారత్లోనేగాక 150 దేశాల్లో పలువురు యూజర్లకు ఇలాంటి అలర్టులు వచ్చాయని పేర్కొంది. అయితే ఈ అలర్టులకు దారితీసిన కారణాలను బయట పెట్టేందుకు నిరాకరించింది. దుయ్యబట్టిన విపక్ష నేతలు ఈ ఉదంతంలో కేంద్రప్రభుత్వ పాత్ర కచ్చితంగా ఉందంటూ విపక్ష నేతలు ఆరోపించారు. తమ ఫోన్లలో అభ్యంతరకర సమాచారాన్ని చొప్పించి అందుకు తమను బాధ్యులను చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ అంశాన్ని తక్షణం లోక్సభ హక్కుల కమిటీకి నివేదించాలని డిమాండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, గోప్యతలపై ఇలాంటి దాడి దారుణమని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితర విపక్ష నేతలను విచారణ పేరుతో వేధించడం, తాజాగా వారి ఫోన్ల హ్యాకింగ్కు ప్రయత్నించడం మోదీ సర్కారు అభద్రతా భావానికి సూచనలని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. లోతుగా దర్యాప్తు: ఐటీ మంత్రి వైష్ణవ్ విపక్ష నేతల ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొట్టిపారేశారు. మోదీ నాయకత్వంలో దేశ ప్రగతిని చూసి ఓర్వలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఈ ఉదంతంపై కూలంకషంగా దర్యాప్తు జరిపించి నోటిఫికేషన్ల వ్యవహారాన్ని నిగ్గుదేలుస్తామని ప్రకటించారు. ‘పూర్తి పారదర్శకంగా సరైన సమాచారాన్ని అందజేయడం ద్వారా విచారణలో మాతో కలిసి రావాల్సిందిగా యాపిల్ను కోరాం. ముఖ్యంగా ప్రభుత్వ దన్నుతో హ్యాకింగ్ జరగవచ్చని ఏ ఆధారంతో చెప్పారో వివరించాలని సూచించాం. ఇది పూర్తిగా సాంకేతికపరమైన దర్యాప్తు. కనుక కంప్యూటర్ సెక్యూరిటీ సంబంధిత అంశాలకు బాధ్యత వహించే జాతీయ నోడల్ ఏజెన్సీ సెర్ట్–ఇన్ దీన్ని చేపడుతుంది.’ అని మంత్రి ప్రకటించారు. ఇలాంటి నోటిఫికేషన్లు 150కి పైగా దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు వచ్చాయని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. నా ఫోన్ తీసుకోండి: రాహుల్ ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. విపక్ష నేతల ఐఫోన్ల హ్యాకింగ్ కచ్చితంగా మోదీ సర్కారు పనేననంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘మేం భయపడేది లేదు. మా ఫోన్లను ఎంతగా హాకింగ్ చేసుకుంటారో చేసుకోండి. మీకు కావాలంటే చెప్పండి, నా ఫోన్ కూడా ఇస్తా’ అంటూ విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్త గౌతం అదానీయే ప్రస్తుతం దేశాన్ని రిమోట్ కంట్రోల్తో నడుపుతున్నారని ఆరోపించారు. ‘ఇప్పుడు దేశంలో అదానీయే నంబర్ వన్. తర్వాతి స్థానాల్లో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారు. మోదీ ఆత్మ అదానీ దగ్గరుంది. అందుకే అదానీని ఎవరైనా ఒక్క మాటన్నా వెంటనే నిఘా వర్గాలు రంగంలోకి దిగుతున్నాయి. అలర్టులు అందుకున్న నేతలు.. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్, పవన్ ఖేరా, కె.సి.వేణుగోపాల్, సుప్రియా శ్రీనేత్, టి.ఎస్.సింగ్దేవ్, భూపీందర్ సింగ్ హుడా, రాహుల్గాంధీ సహాయకులు, మహువా మొయిత్రా (టీఎంసీ), సీతారాం ఏచూరి (సీపీఎం), ప్రియాంకా చతుర్వేది (శివసేన–యూబీటీ), రాఘవ్ ఛద్దా (ఆప్), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), సమీర్ సరణ్ (ఓఆర్ఎఫ్ అధ్యక్షుడు), సిద్ధార్థ్ వరదరాజన్ (ద వైర్ వ్యవస్థాపక ఎడిటర్), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓఎస్డీ తదితరులు యాపిల్ అలర్టులో ఏముందంటే... ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే హాకర్లు మీ ఐఫోన్ను టార్గెట్ చేసుకుని ఉండొచ్చని యాపిల్ అనుమానిస్తోంది. బహుశా మీ హోదా, మీరు చేస్తున్న పనుల వల్ల మీరు వ్యక్తిగతంగా వారి లక్ష్యంగా మారి ఉండొచ్చు. ఇలాంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని హాకర్లు మీ ఫోన్ను హాక్ చేసి తమ అ«దీనంలోకి తీసుకుంటే అందులోని సున్నితమైన డేటా, సమాచారంతో పాటు కెమెరా, మైక్రోఫోన్ వారి చేతిలోకి వెళ్లిపోతాయి. ఇది ఫేక్ హెచ్చరికే అయ్యుండే ఆస్కారమూ లేకపోలేదు. కానీ దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోండి’ -
నితీష్ కుమార్ను రెండో గాంధీగా పోలిక.. ప్రతిపక్షాలు ఫైర్
పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్ని మహాత్మాగాంధీతో పోలుస్తూ వెలువడిన పోస్టర్లపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఇలాంటి పోలికలు మహాత్మాగాంధీని అవమానించడమేనని ఆర్జేడీ విమర్శించింది. ఇది హేయమైన చర్య అని బీజేపీ మండిపడింది. పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను దేశానికి రెండో గాంధీగా పేర్కొంటూ పోస్టర్లు వెలిశాయి. జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన ఆయన పార్టీ సభ్యులు ఈ పోస్టర్లను అంటించారు. నితీష్ కుమార్ సమానత్వ కోసం పోరాడారని పోస్టర్లో కొనియాడారు. సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని, మహాత్మాగాంధీ అనుసరించిన బాటలోనే ఆయన నడుస్తున్నారని జేడీ(యూ) నాయకులు పోస్టర్లలో పేర్కొన్నారు. నితీష్ కుమార్ను ‘రెండో గాంధీ’గా అభివర్ణిస్తూ వచ్చిన పోస్టర్పై ప్రతిపక్ష పార్టీలు ఫైరయ్యాయి. రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు శివానంద్ తివారీ మాట్లాడుతూ.. ఈ పోస్టర్ నితీష్ కుమార్ అభిమానులు అంటించి ఉండవచ్చు.. కానీ ఇలా మహాత్మా గాంధీని అవమానించవద్దని కోరారు. మహాత్మా గాంధీలాంటి వాళ్లు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి పుడతారని తివారీ అన్నారు. ఈ పోస్టర్లపై బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాత్మాగాంధీతో నితీశ్ కుమార్ను పోల్చడం హేయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుంటాల కృష్ణ అన్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఒకే రోజు భారత్కు చేరిన రెండు విమానాలు -
తెలంగాణలో కరువు, కర్ఫ్యూ లేదు
హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా): బీఆర్ఎస్ పాలనలో కరువు, కర్ఫ్యూ అనే మాటే ఎప్పుడూ రాలేదని మంత్రి హరీశ్రావు అన్నారు. ఒకప్పుడు తిండిలేని తెలంగాణ ఈరోజు దక్షిణాది ధాన్య భాండాగారంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15న బీఆర్ఎస్ మేనిఫేస్టోను అధినేత కేసీఆర్ ప్రకటించనున్నారని, ఆ మేనిఫేస్టో చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. నవంబర్ 3న నోటిఫికేషన్, నవంబర్ 30న పోలింగ్, డిశంబర్ 3న ఫలితాలు కలిసోచ్చే 3 అనే సంఖ్య రావడంతో బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో 3వ సారి గెలిచి హ్యా ట్రిక్ సాధించడం ఖాయమన్నారు. అవినీతి సొమ్ముతో కాంగ్రెస్... మాటలు, డబ్బు మూటలు, కర్ఫ్యూలకు, మత కల్లోలాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీ... మంటల ముఠాలతో ఎన్నికలు చేయాలనుకుంటోందని మంత్రి టి.హరీశ్రావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఫేక్ సర్వేలు, గ్లోబల్ ప్రచారాలు చేయడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని విమర్శించారు. కర్ణాటకలో సంపాదించిన అవినీతి సొమ్ముతో తెలంగాణలో గెలవాలని ఆ పార్టీ చూ స్తోందని దుయ్యబట్టారు. ముఠా రాజకీయాలతో ఢిల్లీలో టికెట్ల పంచాయితీ చేస్తోందని మండిపడ్డారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)తో పొత్తు పొట్టుకొని అధికారంలోకి వచ్చాక తమను మోసం చేసిందని, పొత్తు పెట్టుకున్న పార్టీని పొట్టన పెట్టుకుందామని చూసిందని ఆరోపించారు. మూడు గంటల కరెంట్ రైతులకు చాలన్న కాంగ్రెస్ మంచిదా, రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్న బీజేపీ మంచిదా, మూడు పంటలకు సరిపడా 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ మంచోడా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని హరీశ్రావు కోరారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వస్తే అందరూ సంతోషిస్తారని, కానీ ప్రతిపక్షాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యే సతీశ్కుమార్ తదితరులు ఉన్నారు. హుస్నాబాద్లో కేసీఆర్కు తొలి ‘ఆశీర్వాదం’ హుస్నాబాద్: హుస్నాబాద్ ప్రజలపై ఉన్న నమ్మకంతోనే సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావానికి మరోసారి హుస్నాబాద్ వేదిక కాబోతుందని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈ నెల 15న నిర్వహించే కేసీఆర్ ఎన్నికల శంఖారావ బహిరంగ సభ స్థలాన్ని మంగళవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యే సతీశ్కుమార్లతో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్కు ఈశాన్యంలో ఉండే హుస్నాబాద్ను కేసీఆర్ సెంటిమెంట్గా భావిస్తారన్నారు. ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేశారని పేర్కొన్నారు. -
అమెరికాలో ఆర్థిక ప్రతిష్టంభన తప్పదా?
వాషింగ్టన్: అమెరికా మరోసారి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతోంది. ఫెడరల్ ప్రభుత్వం ప్రతిపాదించిన వార్షిక ద్రవ్య బిల్లును విపక్ష రిపబ్లికన్ పార్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం చెల్లింపులన్నీ నిలిచిపోయే ముప్పు ఉంది. రిపబ్లికన్ల డిమాండ్ మేరకు సరిహద్దు భద్రత సహా వివిధ ఏజెన్సీల చెల్లింపుల కోసం ప్రతిపాదిత బడ్జెట్లో 30% మేరకు నిధుల్లో కోత విధించినప్పటికీ మద్దతునివ్వడానికి వారు అంగీకరించడం లేదు. ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్లకే స్వల్ప మెజార్టీ ఉండడంతో ఈ బిల్లు పాస్ కాకపోతే ఏం చెయ్యాలన్న ఆందోళనలో అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నారు. అదే జరిగితే 20 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది జీతాల్లేకుండా పని చేయాల్సి ఉంటుంది. వివిధ పథకాలకు నిధులు కేటాయించలేరు. -
ప్రతిపక్షం పలాయనం
సాక్షి, అమరావతి: తాము చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరించడానికి అధికార పక్షానికి.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షానికి శాసనసభ సమావేశాలు సరైన వేదిక. అధికార పక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ శాసనసభ సమావేశాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే.. చంద్రబాబు చేసిన అక్రమాలతో ఆత్మరక్షణలో పడ్డ ప్రతిపక్షం పలాయనం చిత్తగించి అభాసుపాలైంది. గత 52 నెలల్లో సంక్షేమ, అభివృద్ధి, పథకాల ద్వారా ప్రజలకు చేసిన మంచిని వివరించడంతోపాటు టీడీపీ సర్కార్ హయాంలో జరిగిన కుంభకోణాలను సాక్ష్యాధారాలతో బయటపెట్టడంలో అధికార పక్షం విజయవంతమైంది. స్కిల్ స్కామ్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్ట్ చేయడంపై శాసనసభ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజలకు వాస్తవాలు తెలిసేలా గళమెత్తుతామని బీరాలు పలికిన ప్రతిపక్ష సభ్యులు చిల్లర చేష్టలు, వెకిలి వేషాలు, అసభ్య సైగలు చేస్తూ లేకి ప్రవర్తనతో ఆత్మరక్షణలో పడి రెండ్రోజుల్లోనే పలాయనం చిత్తగించారు. ఇదీ శాసనసభ సమావేశాలు జరిగిన తీరు. ఈనెల 21న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు బుధవారం ముగిశాయి. ఐదు రోజులపాటు సమావేశాలు జరిగాయి. ఆత్మరక్షణలో ప్రతిపక్షం స్కిల్ స్కామ్లో ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లు దోచేసి, సీఐడీ పోలీసులకు దొరికిపోయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపింది. ఈ ఉదంతంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. ప్రజలకు వాస్తవాలను వివరించేలా గళమెత్తి అధికార పక్షం కక్ష సాధింపు చర్యలను జనంలోకి తీసుకెళ్తామని టీడీపీ శాసనసభా పక్షం ప్రకటించింది. తీరా శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాక ఆత్మరక్షణలో పడిపోయింది. స్కిల్ స్కామ్తోపాటు ఫైబర్ నెట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలు చర్చకు వస్తే చంద్రబాబు అక్రమాల బాగోతం సాక్ష్యాధారాలతో సహా అధికారపక్షం గుట్టురట్టు చేయడం ఖాయమని.. అప్పుడు ప్రజల్లో మరింత చులకనవుతామని భావించిన ప్రతిపక్షం వ్యూహం మార్చింది. ఎలాగైనా సరే సస్పెన్షన్ వేటు వేయించుకుంటే చర్చ నుంచి తప్పించుకోవడంతోపాటు సభ నుంచి బయటకు వచ్చాక అధికార పక్షం తమ గొంతు నొక్కుతోందంటూ రాద్ధాంతం చేసి చంద్రబాబు కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లింపవచ్చని ఎత్తు వేసింది. ఆ వ్యూహంలో భాగంగా తొలి రోజు, రెండో రోజూ స్కిల్ స్కామ్పై చర్చకు సిద్ధమని అధికార పక్షం స్పష్టం చేసినా వినకుండా స్పీకర్ పోడియంను చుట్టుముట్టి.. పేపర్లు చింపి విసిరేస్తూ వీధి రౌఢీల్లా అరుపులు, కేకలు వేస్తూ.. బూతులు తిడుతూ ప్రతిపక్ష సభ్యులు వీరంగం చేశారు. బాలకృష్ణ అయితే మీసం మెలేసి.. అసభ్య సైగలు చేస్తూ లేకిగా ప్రవర్తించి చట్టసభల ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించి సస్పెన్షన్ వేటు వేయించుకున్నారు. శాసనభలో మొదటి రోజు, రెండో రోజు ప్రతిపక్షం లేకి ప్రవర్తనను ప్రజలు అసహ్యంచుకోవడంతో.. అకారణంగా తమను సస్పెండ్ చేస్తూ అధికార పక్షం తమ గొంతు నొక్కుతోందని.. అందుకే తాము శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నామంటూ ప్రతిపక్షం పలాయన మంత్రం జపించింది. ప్రజాపక్షమై ప్రతిధ్వనిస్తూ.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా చేసిన మేలును శాసనసభ సాక్షిగా అధికార పక్షం ప్రజలకు వివరించింది. టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానం మేరకు స్కిల్ స్కామ్పై చర్చను చేపట్టి.. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లను అప్పటి సీఎం చంద్రబాబు ఎలా దోచుకున్నారన్నది సాక్ష్యాధారాలతో ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యింది. ఇదే క్రమంలో ఫైబర్ గ్రిడ్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు స్కామ్లతో చంద్రబాబు, లోకేశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడి.. ప్రభుత్వ ఖజానాను దోచేయడంతోపాటు తమ వందిమాగధులకు ఎలా లబ్ధి చేకూర్చారన్నది సాక్ష్యాధారాలతోసహా ప్రజల ముందు పెట్టింది. ప్రజాధనానికి ధర్మకర్తగా వ్యవహరించాల్సిన బాధ్యతను నిర్వర్తించే క్రమంలోనే దర్యాప్తు సంస్థ సీఐడీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని.. స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికిన చంద్రబాబును ఆ సంస్థ అరెస్ట్ చేసిందని వివరించింది. ఈ వ్యవహారంలో ఎలాంటి కక్ష సాధింపులు లేవని.. ప్రజాధనానికి ధర్మకర్తగా వ్యవహరించాల్సిన బాధ్యతను త్రికరణ శుద్ధితో నిర్వర్తిస్తున్నామనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో అధికార పక్షం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. -
సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటున్నారు: మోదీ ఫైర్
PM Modi Comments On Sanatan Dharma Row: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారడం లేదు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చుతూ, దాన్ని నిర్మూలించాలంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలను కొంతమంది సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం ఖండిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ, హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై ఘాటుగా స్పందించారు దేశాన్ని బానిసత్వంలోకి నెట్టేందుకు కుట్ర ఈ మేరకు మధ్యప్రదేశ్లోని బినాలో గురువారం ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. తొలిసారి సనాతన ధర్మం వివాదంపై బహిరంగంగా వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశాన్ని వెయ్యేళ్లు వెనక్కి తీసుకెళ్లి, బానిసత్వంలోకి నెట్టేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. భారతీయుల నమ్మకాలు, విలువలపై దాడి ‘ఇటీవల ఇండియా కూటమి ముంబైలో భేటీ అయ్యింది. ఘమండియా (దురహంకారి) కూటమిని నడిపేందు కోసం వ్యూహాలను వారు సిద్ధం చేసుకొని ఉంటారని నేను అనుకుంటున్నా. భారత సంస్కృతిపై దాడి చేయడమే వారి వ్యూహం. వేల ఏళ్లుగా దేశాన్ని ఏకం చేసిన భారతీయుల నమ్మకాలు, విలువలు, సంప్రదాయాలపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు’ అని ధ్వజమెత్తారు. చదవండి: Special Parliament Session: ఎంపీలకు బీజేపీ విప్ జారీ #WATCH | Bina, Madhya Pradesh: Prime Minister Narendra Modi says "The people of this INDIA alliance want to erase that 'Sanatana Dharma' which gave inspiration to Swami Vivekananda and Lokmanya Tilak...This INDIA alliance wants to destroy 'Sanatana Dharma'. Today they have openly… pic.twitter.com/wc0C2hBxtS — ANI (@ANI) September 14, 2023 ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, వాల్మికీ, మహత్మాగాంధీ.. దేవి అహల్యాబాయి హోల్కర్కు స్ఫూర్తినిచ్చిన సనాతన సంస్కృతి, సంప్రదాయాలను అంతం చేయాలని 'ఘమండియ' కూటమి కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి సనాతన ధర్మమే ఓ బలంగా నిలిచిందని. తన ఘాన్సీ ప్రాంతాన్ని వదులుకోనని బ్రిటిష్ వారికి సవాల్ విసిరిందని చెప్పారు. మహర్షి వాల్మీకి కూడా సనాతన ధర్మాన్ని ఆచరించారన్నారు. మహాత్మాగాంధీ సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించారన్న ప్రధాని మోదీ.. ఆయనకు రాముడు ప్రేరణగా నిలిచారని చనిపోయే ముందు కూడా ‘హేరామ్’ అని సంభోదించారని చెప్పారు. దేశాన్ని ముక్కలు చేసేందుకు యత్నం ఇక స్వామి వివేకానంద, లోకమాణ్య తిలక్ లాంటి వారికి సనాతన ధర్మమే ప్రేరణగా నిలిచిందని మోదీ తెలిపారు. సనాతన శక్తితోనే స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ వాళ్ల చేతిలో ఉరికంబం ఎక్కిన వీరులు కూడా భారతమాత ఒడిలోనే మళ్లీ జన్మించాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆ ధర్మమే వేల సంవత్సరాల నుంచి భారత్ను ఒక్కటిగా నిలిపిందన్నారు. అలాంటి ధర్మాన్ని ఇండియా కూటమి నాశనం చేయాలని భావిస్తోందని ఆరోపించారు. ఇండియా కూటమి పార్టీలు అంతా ఒక్కటే.. ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలని చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు. దేశాన్ని ప్రేమించే వాళ్లు అప్రమత్తంగా ఉండాలి బహిరంగంగా ఇండియా కూటమి నేతలు సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నారని, రాబోయే రోజుల్లో వాళ్లు మనపై దాడుల్ని ఉధృతం చేస్తారని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సనాతన ఆచారాన్ని పాటించేవాళ్లు, ఈ దేశాన్ని ప్రేమించేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టించి. దేశాన్ని 1,000 సంవత్సరాల వెనక్కు బానిసత్వంలోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. కలిసి కట్టుగా ఆ పోరాటాన్ని ఆపాలని.. వారి వ్యూహాలను విజయవంతం అవ్వకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాగా ప్రధాని కంటే ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సనాతన ధర్మంపై స్పందిస్తూ.. దీనిపై చర్యలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు. ‘‘సనాతన ధర్మానికి మద్దతుగా స్పందించాలంటూ ప్రధాని మోదీ తన కేబినెట్ మంత్రులకు కొన్ని రోజుల క్రితం సూచించారు. దీనిపై రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ట్రాప్లో మనం చిక్కుకోవద్దు’’ అని స్టాలిన్ వివరించారు. బీజేపీ అవినీతిని ప్రధానంగా ప్రస్తావించాలంటూ సూచించారు. కళంకిత, మతతత్వ, నిరంకుశ బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కష్టపడి పనిచేయాలని కోరారు. -
దేశంలో హిందీపై వ్యతిరేకత ఎందుకు?
నేడు (సెప్టెంబరు 14) హిందీ దినోత్సవం. దీనిని హిందీ పక్షోత్సవంగానూ నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా పలుచోట్ల హిందీ భాషకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందీకి తగిన గౌరవం అందించేందుకే హిందీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే దేశంలో అత్యంత విస్తృతమైన మనుగడ కలిగిన ఈ భాషకు దేశ జాతీయ భాష హోదాను ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలు విమర్శల పాలవుతున్నాయి. హిందీని దేశ జాతీయ భాషగా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా పలు చోట్ల ప్రజలు నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీని వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో హిందీ చాలా విస్తృతంగా మాట్లాడే భాష. ఇది అనేక విభిన్న మాండలికాలు, రూపాలను కలిగి ఉంది. ప్రాథమికంగా హిందీ ఇండో-యూరోపియన్ భాషా కుటుంబంలోని ఇండో-ఇరానియన్ శాఖకు చెందిన ఇండో-ఆర్యన్ సమూహం మాట్లాడే భాషగా పరిగణిస్తారు. ఇది భారతదేశంలోని అనేక ప్రాంతాలలో అధికారిక భాషగానూ కొనసాగుతోంది. స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి హిందీకి తగిన గౌరవం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే హిందీపై వ్యతిరేకత ఏర్పడటానికి దాని చరిత్ర, నేపథ్యం కూడా కారణంగా నిలుస్తోంది. హిందీ భాష దేశంలోని ఇతర రాష్ట్రాలకు చేరుకోగలిగినంత సులభంగా తమిళనాడు, కేరళకు చేరుకోలేకపోయింది. బ్రిటీష్ వారు సముద్ర మార్గం ద్వారా దక్షిణ భారతదేశంలోని ఈ రాష్ట్రాలకు చేరుకున్నారు. అక్కడి నుంచే ఉత్తర భారతదేశంలోకి తమ చొరబాట్లను విస్త్రృతం చేశారు. ఫలితంగా ఆ రెండు రాష్ట్రల్లో ఇంగ్లీష్ భాషా వినియోగం అధికంగా ఉండేది. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల మాదిరిగా ఈ రాష్ట్రాల ప్రజలు హిందీలో మాట్లాడటం సులభతరంగాలేదని భావించారు. దీంతో ఈ రాష్ట్రాల్లో హిందీని విదేశీ భాషగా వర్ణించే పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు, కేరళ ప్రజలు తమపై హిందీని రుద్దుతున్నారని ఆరోపించడానికి ఇదే కారణంగా నిలిచింది. 1937లో స్వాతంత్ర్య సమరయోధుడు సి రాజ్గోపాలాచారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడులోని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలయ్యింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో రాజ్యాంగ సభలో హిందీని అధికార భాషగా చేయడంపై చర్చ జరిగింది. ఈ నేపధ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో మరోసారి నిరసనలు చోటుచేసుకున్నాయి. దేశంలో హిందీకి ఎదురవుతున్న వ్యతిరేకతను పరిణలోకి తీసుకుని, 1950లో కేంద్ర ప్రభుత్వం రాబోయే 15 సంవత్సరాల పాటు ఆంగ్లంతో పాటు ఇతర భాషలు దేశంలో అధికారిక భాషలుగా ఉండాలనే నిర్ణయం తీసుకుంది. అయితే 1965లో హిందీపై వ్యతిరేకత మరోసారి మొదలైంది. దీంతో 1950లో తీసుకున్న నిర్ణయాన్నే కొనసాగించాలని ప్రభుత్వం తీర్మానించింది. కాగా భాషకు సంబంధించి కేంద్రం నుంచి ఎప్పుడైనా ఏదైనా చట్టం, ప్రతిపాదన వచ్చినప్పుడల్లా హిందీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది కూడా చదవండి: ఆ భారత యువరాణి బ్రిటన్లో మహిళల కోసం ఎందుకు పోరాడారు? -
మంత్రినైపోయా.. లేకుంటే కొట్టేవాడిని
సంగెం: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్ జిల్లా సంగెం మండలంలో బుధవారం కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన మాట్లాడిన మాటలు గురువారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. గవిచర్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ప్రతిపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు దుర్మార్గపు అబద్ధపు మాటలు చెబుతుంటే.. ఈడ్చి కొట్టాలని ఉన్నా.. మంత్రి పదవి అడ్డు వస్తోందని పేర్కొన్నారు. తనకు టీడీపీని వీడాలని లేదని.. చంద్రబాబు ఇక్కడ దుకాణం ఎత్తివేసి ఆంధ్రాకు వెళ్లడంతో.. ఇక్కడ పార్టీని ఎంత లేపాలని చూసినా లేవదు కాబట్టి.. కార్యకర్తలను కాపాడుకోవడానికే బీఆర్ఎస్లో చేరానని స్పష్టం చేశారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. -
పార్లమెంట్లో ‘మోదీ చాలీసా’ వద్దు
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మోదీ చాలీసాను తాము కోరుకోవడం లేదని, ప్రజా సమస్యలను లేవనెత్తుతామని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సోనియా గాంధీ నేతృత్వంలో మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశమైంది. పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రత్యేక సమావేశాల అజెండాపై ప్రతిపక్షాలతో ప్రభుత్వం చర్చించడం ఆనవాయితీగా వస్తోందని, ఈసారి ప్రభుత్వం ఆ పని చేయలేదని, విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదని కాంగ్రెస్ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆక్షేపించారు. ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఆ వెబ్సైట్లకు కష్టాలు -
తైవాన్ అధ్యక్ష రేసులో..టెర్రీ గౌ
ఐ ఫోన్ తయారీ సంస్థ ఫౌండర్, అపర కుబేరుడు టెర్రీ గౌ కూడా తైవాన్ అధ్యక్ష రేసులో నిలిచారు. కుచేలుడి నుంచి కుబేరుని స్థాయికి ఎదిగిన ఆసక్తికర నేపథ్యం టెర్రీది. కనుక ఆయనకున్న ప్రజాదరణ నేపథ్యంలో ఒక్కడే గనక బరిలో ఉంటే పాలక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కి గట్టి పోటీ ఇవ్వడం కూడా ఖాయమేనని అంటున్నారు. కానీ విపక్షాల తరఫున ఇప్పటికే ఇద్దరు రంగంలోకి దిగారు.ఈ నేపథ్యంలో టెర్రీ పోటీ విపక్ష ఓటును మూడుగా చీల్చి చివరికి 2024 జనవరిలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో అధికార పక్షం నెత్తిన పాలు పోసేలా కనిపిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ... తైవాన్కు చెందిన 72 ఏళ్ల టెర్రీ అపర కుబేరుడు. ఐ ఫోన్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ వ్యవస్థాపకుడు.వ్యాపారవేత్తగా దేశ ప్రజల్లో ఆయనకున్న చరిష్మా అంతా ఇంతా కాదు. అధికార పక్షంతో ఇప్పటికే రెండు విపక్షాలు తలపడుతుండగా మూడో శక్తిగా ఆయన కూడా రంగంలోకి దిగి అధ్యక్ష ఎన్నికల రేసును ఆసక్తికర మలుపు తిప్పారు. బరిలో ఆ ముగ్గురు... అధ్యక్షుడు సై ఇంగ్ వెన్కు ఇది రెండో టర్మ్. అంతకు మించి పదవిలో కొనసాగేందుకు తైవాన్ నిబంధనలు అనుమతించవు. దాంతో ఈసారి అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) తరఫున విలియం లై చింగ్ తే బరిలో దిగుతున్నారు. ప్రధాన విపక్షమైన జాతీయవాద కోయిమిన్ టాంగ్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్గా చాన్స్ దక్కించుకునేందుకు టెర్రీ ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయనకు బదులుగా హొవ్ యూ ఇయ్కు పార్టీ అవకాశం ఇచ్చింది. మరో విపక్షం టీపీపీ తరఫున దేశ ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్న కో వెన్ జే పోటీ పడుతున్నారు. రాజధాని తాయ్ పీ సిటీ మేయర్గా చేసిన అనుభవం ఆయన సొంతం. పైగా యువ ఓటర్లు ఆయనను వేలం వెర్రిగా అభిమానిస్తారు. ప్రస్తుతం రేసులో రెండో స్థానంతో వెన్ దూసుకుపోతున్నారు. ఎంత ప్రయత్నించినా ప్రధాన విపక్షం డీపీపీ నుంచి అవకాశం దక్కకపోవడంతో టెర్రీ స్వతంత్ర హోదాలో పోటీకి దిగారు. అంతులేని సంపద, వ్యాపార విజయాలతో పాటు చైనాతో దీర్ఘకాలం పాటు విజయవంతంగా కలిసి పని చేసిన విశేషానుభవం టెర్రీకి మరింతగా కలిసొచ్చే అంశం.– నేషనల్ డెస్క్, సాక్షి తైవాన్ ఇంజనీరింగ్ ప్రతిభకు మానవ వనరులను కలగలిపి ఫాక్స్ కాన్ (హాన్ హై ఇండస్ట్రీస్)ను ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్రక్టానిక్స్ తయారీదారుగా తీర్చిదిద్దారు టెర్రీ. 1980, 90ల్లో దక్షిణ చైనాలో అతి పెద్ద తయారీ సంస్థలను నెలకొల్పి చైనీయులకు వేలాదిగా ఉపాధి కల్పించారు. ఈ మోడల్ సూపర్ సక్సెస్ అయింది. ఎంతగా అంటే, యాపిల్ తన మాక్ బుక్స్, ఐ ఫోన్ల తయారీని ఫాక్స్ కాన్కే అప్పగించేలా ఒప్పించగలిగారు టెర్రీ. దాంతో ఫాక్స్ కాన్ అతి పెద్ద కంపెనీగా, టెర్రీ దేశంలోనే అతి సంపన్నుల్లో ఒకరిగా ఎదగడం సాధ్యపడింది. తైవాన్ సారబౌమత్వాన్ని కాపాడేందుకు చైనాతో తనకున్న సంబంధాలన్నింటిన్నీ ఉపయోగిస్తానని, దేశాభివృద్ధి కోసం తన అనుభవం మొత్తాన్నీ రంగరిస్తానని చెబుతున్నారు టెర్రీ. తైవాన్ను ఎలాగైనా పూర్తిగా తనలో కలిపేసుకోవాలని చైనా ప్రయత్నిస్తుండటం, ఇటీవల ఆ దిశగా దూకుడు పెంచడం, అది తైవాన్ కు కొమ్ము కాస్తున్న అమెరికాతో ఘర్షణ దాకా వెళ్లడం తెలిసిందే పాలక డీపీపీ అసమర్థ, అసంబద్ధ, దుందుడుకు విధానాలే ఈ దుస్థితికి కారణమని టెర్రీ ఆరోపిస్తున్నారు. కానీ తైవాన్ ప్రజల్లో అత్యధికులు ఈ వాదనను విశ్వసించడం లేదు. త్రిముఖ ఓటుతో ఇప్పటికే అవకాశాలు సన్నగిల్లేలా కనిపిస్తున్న టెర్రీకి ఇది మరింత ప్రతికూలంగా మారేలా ఉంది. 40 శాతానికి పైగా ఓటర్లు పాలక పక్షానికి గట్టిగా మద్దతిస్తున్నట్టు ఇటీవలి సర్వేలు కూడా తేల్చాయి. ఈ పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఒక్కటై ఉమ్మడిగా ఒకే అభ్యర్ని నిలిపితేనే అధికార పార్టీ కి కాస్తో కూస్తో పోటీ ఇవ్వడం సాధ్యపడేలా కనిపిస్తోంది. కానీ అందుకు రెండు విపక్షాల్లో ఏదీ సిద్ధంగా లేదు. దాంతో సర్వేలు చెబుతున్నట్టు అధికార డీపీపీకి కేవలం 40 శాతం ఓట్లు మాత్రమే వచ్చినా అది అధికారం నిలుపుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
యాదాద్రి భువనగిరి: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం
20 ఏళ్ల క్రితం నాటా.. ఇప్పుడు చూస్తే : రాఘవ లారెన్స్
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్కు ప్రమాదం
Indraja Sankar: విజిల్ నటి బర్త్డే సెలబ్రేషన్స్.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్బీఐ ఏం చెబుతోంది?
పంజాబ్పై ఘన విజయం.. సెకెండ్ ప్లేస్కు ఎస్ఆర్హెచ్
అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement