-
'జబర్దస్త్' కమెడియన్కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!
ఏంటో ఈ మధ్య పవిత్ర అనే పేరున్న వాళ్లకు అస్సలు కలిసి రావట్లేదు. ఈ మధ్య తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం.. కారు ప్రమాదంలో మరణించింది. ఇప్పుడు అదే పేరున్న మరో నటి కారు ఇలానే యాక్సిడెంట్ అయింది. కాకపోతే ఇక్కడ ఎవరికీ ఏం కాలేదు. ఇది జరిగిన దాదాపు వారం రోజులు పైనే అయింది. ఇప్పుడు తనకు జరిగిన షాకింగ్ యాక్సిడెంట్ గురించి 'జబర్దస్త్' ఫేమ్ పవిత్ర బయటపెట్టింది. ప్రాణాలతో బయటపడ్డామని చెబుతూ ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)సాధారణ నటిగా కెరీర్ ప్రారంభించిన పవిత్ర.. 'జబర్దస్త్' షోలో తనదైన కామెడీతో ఆకట్టుకుంటోంది. గత కొన్నేళ్ల నుంచి ఇదే షోలో చేస్తున్న పవిత్ర.. ఏడాదిన్నర క్రితం కారు కూడా కొన్నది. ఇప్పుడు ఆ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు పిన్ని, పిల్లలతో కలిసి పవిత్ర సొంతూరు వెళ్లింది. కాకపోతే నెల్లూరు జిల్లాలోని ఉప్పలపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి గోతిలో పడింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. చిన్న దెబ్బలు మినహా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.'మా పిన్ని, ఆమె పిల్లలిద్దరూ ఫస్ట్ టైమ్ నా కారు ఎక్కారు. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనేలోపు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎదురుగా వస్తున్న వెహికల్ డ్రైవర్ కన్ఫ్యూజ్ చేయడంతోనే మాకు ఇలా జరిగింది. ఎవ్వరికీ ఎలాంటి దెబ్బలు తగలకపోవడం నాకు కాస్త హ్యాపీగా అనిపించింది. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్లే నాకు దెబ్బలేం తగల్లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కుదుటపడటానికి రోజంతా పట్టింది. అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ నన్ను గుర్తుపట్టారా కానీ ఒక్కరు కూడా సాయం చేయలేదు. వీడియోలు తీశారు. అదొక్కటే నాకు బాధగా అనిపించింది' అని చెబుతూ పవిత్ర ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?) -
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్ (ఫోటోలు)
-
ఆ దేవుడు పిలుస్తున్నాడు..నటి పవిత్ర ఆఖరి ఇన్స్టా పోస్ట్, వీడియో వైరల్
కన్నడ బుల్లితెర నటి పవిత్రా జయరామ్ అకాల మరణం పరిశ్రమ వర్గాలను, తోటి నటీనటులను సహోద్యోగులు,అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. త్రినయని తిలోత్తమ పాత్రతో తెలుగు వారికి దగ్గరైన పవిత్ర మరణంపై పలువురు సంతాపం ప్రకటించారు. అయితే చనిపోయిందన్న వార్త వెలుగులోకి రావడానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో జవిత్ర జయరామ్ చందర్ చివరి ఇన్స్టా పోస్ట్ ఒకటి వైరల్ మారింది. నటుడు, భర్త చందూతో కలిసి చేసిన రీల్ నెట్టింట్ చక్కర్లు కొడుతోంది.త్రినయని సీరియల్లో సోదరుడిగా నటించిన భర్త చల్లా చందుని ట్యాగ్ని చేస్తూ ఆమె చివరి ఇన్స్టా పోస్ట్ ఇది. "నా ప్రేమ ఎప్పుడూ నీదే పాపా @chandrakanth_artist మిస్ యూ పాపా ఎందుకు అంత ఏడుస్తున్నావు నన్ను నీతోనే వున్నారా పిచ్చోడా లవ్ యు మామా" అని క్యాప్షన్ ఉన్న పోస్ట్ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar) అలాగే ‘‘ఆల్వేస్ మై లవ్ ఫర్ యూ మామా, లవ్ యూ సో మచ్.. చాలా సమయం నీతో గడపాలని అనుకున్నా.. కానీ, ఆ దేవుడు పిలుస్తున్నాడు.. నాన్నా, నువ్వ టైమ్కి తిను’’ అంటూ మరో పోస్ట్ ఉంది. దీంతో ఫ్యాన్స్ కమెంట్స్ వెల్లువెత్తాయి. ఆమె చనిపోయిన తరువాత పోస్ట్లు ఎలా పెడుతున్నారు అని కొంతమంది సందేహం వ్యక్తం చేయగా, ఆమె భర్త చందూనే పోస్ట్ చేస్తున్నాడు మరికొంతమంది కమెంట్ చేయడం గమనార్హం. మదర్స్ డే రోజు విషాదం ఆర్ఐపీ పవిత్ర అంటూ చాలామంది నెటిజన్లు స్పందించారు. కన్నడిగులు మిమ్మల్ని గుర్తుంచుకుంటూ ఉంటారు.. ఓం శాంతి పవిత్ర మామ్ అంటూ కన్నడ ఫ్యాన్స్ సంతాపం ప్రకటించారు. త్రినయని సీరియల్లో పవిత్ర ఆన్-స్క్రీన్ సోదరుడు పరశురామ్గా చంద్రకాంత్ నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar)పవిత్రా జయరాం మృతిపై నటుడు సమీప్ ఆచార్య సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా తన విచారాన్ని వ్యక్తం చేశారు. “మీరు ఇక లేరనే వార్తతో మేల్కొన్నాను. ఇది నమ్మశక్యంగా లేదు. నా తొలి ఆన్స్క్రీన్ తల్లి, మీరు ఎప్పుడూ ప్రత్యేకమే.” అంటూ పోస్ట్ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్లోని మెహబూబా నగర్ సమీపంలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో చంద్రకాంత్తో అపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్ తదితరులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. -
ప్రచారంలో దూసుకుపోతున్న బియ్యపు మధుసూదన్ రెడ్డి కూతురు
-
Jabardasth Pavithra: ప్రియుడికి ఉంగరం తొడిగిన పవిత్ర.. త్వరలోనే పెళ్లి (ఫోటోలు)
-
నిన్ను చూడాలని, నీ చేతిముద్ద తినాలనుంది: బుల్లితెర నటి ఎమోషనల్
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతవారం తమిళ బుల్లితెర నటి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి ఏడు రోజుల క్రితం కన్నుమూశారు. ఈ విషాద ఘటనను తలుచుకుంటూ నటి పవిత్ర లక్ష్మి తన ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: 'ఇండియన్ ఐడల్ సీజన్ 2' ఫినాలేకు చీఫ్ గెస్ట్గా బన్నీ) ఇన్స్టాలో పవిత్ర రాస్తూ.. 'నువ్వు మమ్మల్ని విడిచివెళ్లి అప్పుడే ఏడు రోజులైంది. ఈ బాధ నుంచి బయటపడాలని చూస్తున్నా. నువ్వు ఎందుకింత త్వరగా వదిలి వెళ్లిపోయావో అర్థం కావటం లేదు. దాదాపు 5 ఏళ్లుగా నువ్వు అనుభవించిన కష్టాలు, బాధలు అక్కడ ఉండవని భావిస్తున్నా. నువ్వు ఒక సూపర్ మామ్. సింగిల్ పేరెంట్గా ఉంటూ బిడ్డల్ని చూసుకోవటం అంత తేలికైన విషయం కాదు. నాకు నిన్ను ఓ సారి చూడాలని ఉంది. నీతో ఒకసారి మాట్లాడాలని ఉంది. నీ చేతి ముద్దలు తినాలని ఉంది. ఈ కష్ట సమయంలో నా పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన సినీ ప్రముఖులు ఆమెకు సంఘీభావం ప్రకటించారు. (ఇది చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్ హీరో? స్పందించిన హీరోయిన్) View this post on Instagram A post shared by Pavithralakshmi (@pavithralakshmioffl) -
పెళ్లి చేసుకున్న నరేశ్-పవిత్ర?
సీనియర్ నటుడు నరేశ్, పవిత్రలు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. నటి పవిత్రతో ఏడడుగులు వేశానంటూ తాజాగా నరేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా తన ట్విటర్లో పెళ్లి వీడియోను షేర్ చేశాడు. ‘ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముడ్లు, ఏడు అడుగులు’ అంటూ ట్వీట్కు రాసుకొచ్చాడు. అలాగే మీ ఆశీస్సులు కావాలని కోరాడు. కాగా కొంతకాలంగా నరేశ్-పవిత్రలు సీక్రెట్ రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: ఆర్ఆర్ఆర్పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన నరేశ్-పవిత్రలు శుక్రవారం(మార్చి 10న) మూడు మూళ్ల బంధంతో ఒక్కటైనట్లు తెలుస్తోంది. కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగినట్లు సమాచారం. కాగా నరేశ్కు ఇది నాలుగవ పెళ్లి కాగా, పవిత్రకు ఇది మూడవ పెళ్లి. ఇదిలా ఉంటే ఈ పెళ్లి ప్రకటన ఓ మూవీ ప్రమోషన్లో భాగంగా చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో తమ మూవీ ప్రమోషన్స్ కోసం పవిత్రతో రిలేషన్పై ప్రకటన చేసి షాకిచ్చిన నరేశ్.. ఇప్పుడు కూడా అదే స్టంట్ చేసుంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ పెళ్లి ప్రకటనలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗 ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్ళు ఏడు అడుగులు 🙏 మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు - మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023 -
నాన్న లేడు, పాత ఇల్లు కొని మరమ్మత్తులు చేయిస్తున్న పవిత్ర
కామెడీ షోలో మహిళలు కూడా భాగస్వామ్యులయ్యారు. మగవారికంటే కూడా మేమేం తక్కువ కాదంటూ సరికొత్త స్కిట్లతో గ్యాప్ లేని పంచులతో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నారు. అందులో పవిత్ర కూడా ఒకరు. గతేడాది తండ్రిని కోల్పోయిన ఆమె కుటుంబ పోషణను తన భుజాల మీద వేసుకుంది. తాజాగా ఆమె ఓ పాతింటిని కొనుగోలు చేసి దానికి మెరుగులు దిద్దుతోంది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో ద్వారా వెల్లడించింది ఈ వీడియోలో పవిత్ర మాట్లాడుతూ.. 'నేను పుట్టి పెరిగిన ఊరిలో ఇంతవరకు సొంతిల్లు లేదు. నాకు బ్యూటీ సెలూన్ ఉండేది. అది అమ్మేయగా వచ్చిన డబ్బులతో పాత ఇల్లు అమ్ముతుంటే నేను తీసుకున్నాను. కాకపోతే వాస్తు బాలేదని కొన్ని మార్పుచేర్పులు చేస్తున్నాను. ఇంకో నెలలో నాన్న సంవత్సరీకం ఉంది. అప్పటిలోపు ఇంటిపనులు అన్నీ పూర్తి చేయాలనుకుంటున్నా' అని చెప్పుకొచ్చింది. చదవండి: హీరో అడివి శేష్కు ఆదిరెడ్డి కౌంటర్, నాగ్ మామూలుగా నవ్వలేదుగా బాహుబలి సింగర్కు త్వరలో పెళ్లి, ఫొటోలు వైరల్ -
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సినీ నటి పవిత్ర
-
ఒకే కాలేజీ.. ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి..
సాక్షి, కేపీహెచ్బీకాలనీ: ప్రేమించానంటూ, పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించిన ఓ యువకుడు ప్రేయసితో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకపోవడంతో ఆవేదనకు గురైన ఆ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన కొండా నారాయణ కూతురు పవిత్ర ఉపాధి కోసం నగరానికి వచ్చి కూకట్పల్లి హౌసింగ్బోర్డు కాలనీలో నివాసం ఉంటోంది. అయితే ఆమెతో పాటు ఒకే కాలేజీలో చదువుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన బండి గౌతమ్తో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెరిగింది. పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో పవిత్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గౌతమ్ ఆమెతో సంవత్సర కాలంగా సహజీవనం చేస్తున్నాడు. తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే ఇటీవల గౌతమ్కు వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరిన విషయం తెలుసుకున్న పవిత్ర అతడిని నిలదీసింది. దీంతో పెద్దల ఒత్తిడితోనే పెళ్లికి ఒప్పుకున్నానని అతడు పేర్కొన్నాడు. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..) పెద్దలను ఎదిరించి పవిత్రనే పెళ్లి చేసుకుంటానంటూ ఆమెతోనే సహజీవనం సాగిస్తున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం గౌతమ్.. పవిత్ర తండ్రికి ఫోన్చేసి పవిత్ర ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుందంటూ సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటికి తిరిగి ఫోన్చేసి పవిత్ర సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. దీంతో పవిత్ర కుటుంబీకులు హుటాహుటిన నగరానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవిత్ర ఆత్మహత్యకు గౌతమ్ కారణమంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: ముగ్గురు యువతుల అదృశ్యం.. షాకింగ్ ఏంటంటే..) -
సీనియర్ నటి కవిత ఇంటికి వెళ్లిన ‘మా’ సభ్యులు
సీనియర్ నటి కవిత ఇంట ఇటీవల విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రోజుల వ్యవధిలోనే కుమారుడు స్వరూప్, భర్త దశరాథ రాజు కరోనాతో మృత్యువాత పడ్డారు. కుటుంబంలోని ముఖ్యమైన ఇద్దరూ వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో కవిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొడుకు మరణం మరవక ముందే భర్త మృతి వార్త ఆమెను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆమెను ఓదార్చం ఎవరి తరంగా కావడం లేదు. అయితే టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెను ఫోన్ ద్వారా పరామర్శించినప్పటకీ తాజాగా మా అసోసియేషన్ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. సీనియర్ నటుడు, మా అధ్యక్షులు నరేష్తో పాటు కరాటే కల్యాణి, నటి పవిత్రలు కవిత, ఆమె కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు. ఇక భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా తప్పకుండా అందిస్తామని నరేష్ భరోసానిచ్చారు. కాగా కవిత భర్త దశరథ రాజు నెల రోజుల కరోనా పాజిటివ్గా తేలింది. మధ్యలో ఓ సారి నెగిటివ్గా వచ్చింది. ఈ క్రమంలోనే వారి తనయుడు స్వరూప్ కరోనాతో మృత్యువాత పడ్డాడు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న దశరథ రాజును కవిత ఆస్పత్రికి తరలించారు. దాదాపు 20 రోజులు చికిత్స తీసుకున్న తర్వాత కవిత భర్త కన్నుమూశారు. కవిత 'ఓ మజ్ను' అనే తమిళ సినిమాతో 11 ఏళ్లకే వెండితెర అరంగ్రేటం చేశారు. సుమారు 50కి పైగా తమిళ చిత్రాల్లో తళుక్కున మెరిసిన ఆమె తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించారు. హీరోయిన్గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. Movie artists association (MAA) President @ItsActorNaresh, along with other artists from TFI met and conveyed their condolences to actress #kavitha on the huge loss of her husband and son due to #Covid19. pic.twitter.com/SJ5MiSTyIW — BARaju's Team (@baraju_SuperHit) July 3, 2021 -
నటిని ఎత్తి పడేశారు: ఏడ్వలేక నవ్విన పవిత్ర!
బుల్లితెర నటి పవిత్ర లక్ష్మిని నెటిజన్లు ఓ ఆటాడేసుకుంటున్నారు. ఆమె షేర్ చేసిన ఫొటో మీద మీమ్స్ క్రియేట్స్ చేస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటారా? ఆ ఫొటోలే ఏం లేదు.. కానీ దానికిచ్చిన క్యాప్షన్లోనే ఉంది అసలు మ్యాటరంతా! తాపీగా కూర్చున్న ఫొటోను షేర్ చేసిన పవిత్ర 'నన్ను పైకి తీసుకెళ్లండి' అని రాసుకొచ్చింది. ఇంకేముందీ.. నెటిజన్లు ఆమెను పైకెత్తేందుకు సవాలక్ష ప్రయత్నాలు చేశారు. గాల్లో ఎగిరే వాహనాల మీద పవిత్ర కూర్చున్నట్లు ఫొటో ఎడిట్ చేశారు. అంతేకాదు, ఓ హీరో గాల్లో నుంచి దూకుతుంటే అతడి భుజాల మీద కూర్చున్నట్లు, నలుగురు కలిసి ఆమెను మోస్తున్నట్లు, పై నుంచి ఆమెను ఎత్తిపడేసినట్లు.. ఇలా రకరకాలుగా ఎడిట్ చేశారు. మీమర్స్ తెలివితేటలు చూసి షాకైన పవిత్ర మరీ ఈ రేంజ్లోనా? అంటూ నవ్వేసింది. ఇక పవిత్ర లక్ష్మి కెరీర్ విషయానికి వస్తే.. 'కూకూ విత్ కోమలి' షోతో ఆమెకి పాపులారిటీ వచ్చింది. పలు షార్ట్స్ ఫిల్మ్స్లో నటించిన పవిత్ర 'ఉల్లాసం' అనే మలయాళ చిత్రంలోనూ కనిపించింది. కానీ ఇది ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. Adapaavingalaaa 😲😱🤣🤣 pic.twitter.com/hhtRQNSPGF — Pavithra Lakshmi (@pavithralaksh_) June 8, 2021 చదవండి: సమంత కొడుకుగా అలరించనున్న స్టార్ హీరో కుమారుడు! -
నీలం ట్రైలర్పై నిషేధం
తమిళసినిమా: ఉనకుల్ నాన్, లైన్మెన్, బ్యూటిఫుల్ ఐ వంటి చిత్రాలను రూపొందించిన వెంకటేష్ కుమార్ తాజాగా దర్శకత్వం వహించిన కొత్త చిత్ర నీలం. బ్లూవెల్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ ద్వారా ఆయన ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఇందులో శ్రీ, పవిత్రా, జగన్, జయకుమార్ వంటి పలువురు నటించారు. సతీష్ చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చగా. రామలింగం స్క్రీన్ప్లే చేశారు. నీలం చిత్రాన్ని శ్రీలంకలో జరిగిన అంతర్గత పోరు, ఈలం తమిళుల కష్టాలను కళ్లకు కట్టే రీతిలో రూపొందించారు. ఇప్పటికీ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ సిద్ధమైంది. దీనిని సెన్సార్ అధికారుల తనిఖీ కోసం పంపారు. ట్రైలర్ తిలకించిన సెన్సార్ బోర్డు సభ్యులు ఇబ్బందికర రీతిలో డైలాగ్లు అధికంగా ఉన్నాయన్నారు. దీంతో ట్రైలర్కు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విషయం గురించి చిత్ర దర్శక నిర్మాత వెంకటేష్ కుమార్ మాట్లాడుతూ నీలం చిత్ర ట్రైలర్ను సెన్సార్ బృందం నిరాకరించారని తెలిపారు. ఈ చిత్రం ఈలం తమిళుల నేపథ్యంలో చిత్రీకరించినందున సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిపారు. ఇది తన ఐదేళ్ల శ్రమ. ఈ చిత్రం పూర్తిగా తమిళుల కోసం రూపొందించింది. తనకు న్యాయం కావాలని వెంకటేష్ కోరుతున్నారు. -
మా నాన్నకు సంబంధం లేదు : పూరి కూతురు
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపించటం పై ఆయన కూతురు పవిత్ర పూరి ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇతరులు గురించి వార్తలు రాసేప్పుడు జాగ్రత్తగా ఉండండి. నిజం తెలుసుకోకుండా ఇతర మీద నిందలు వేయోద్దు.కేవలం మా నాన్న సెలబ్రిటీ అయిన కారణంగా ఆయన మీద పుకార్లు సృష్టించటం కరెక్ట్ కాదు. ఆయన మీద నిందలు వేసే ముందు ఆయన కుటుంబం గురించి వారి గౌరవ మర్యాదల గురించి ఆలోచించండి. నేను మాట్లాడేది పనీ పాట లేకుండా పిచ్చి మాటలు మాట్లాడే వారి గురించి మాత్రమే. మా నాన్న ఉన్నత లక్ష్యాలతో పనిచేసే వ్యక్తి. ఓ దర్శకుడిగా ఆయన ఆలోచనే ఆయన పెట్టుబడి, భవిష్యత్తు.అలాంటిది ఆయన కెరీర్ ను ఆయనే ఇలాంటి అలవాట్లతో ఎందుకు నాశనం చేసుకుంటాడు.గుర్తుంచుకోండి సెలబ్రిటీ అంటే పబ్లిక్ పర్సనాలిటీ కాదు. మా నాన్నకు డ్రగ్స్ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. జాగ్రత్తగా మాట్లాడండి.' అంటూ ఘాటుగా తన అభిప్రాయాలను సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసింది. Plzzzz repost... A post shared by Pavithra Puri (@pavithra_puri607) on Jul 15, 2017 at 1:27am PDT -
సస్పెన్స్తో థ్రిల్
సంజీవ్కుమార్ హీరోగా నటిస్తూ, నిర్మించిన సస్పెన్స్ ప్రేమకథా చిత్రం ‘థ్రిల్’. ఫాదర్ అండ్ మదర్ సమర్పణలో సురేశ్ సబ్నే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. పవిత్ర, సోనాలి కథానాయికలు. సంజీవ్కుమార్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే చిత్రమిది. కథ బాగా నచ్చడంతో హీరోగా నటించి, నిర్మించా. ‘ప్రేమకథా చిత్రమ్’, ‘క్షణం’, హిందీలో ‘రాజ్’, ‘1920’ చిత్రాల తరహాలో ‘థ్రిల్’ కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. జూలై నెలాఖరులో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘నేను చెప్పిన కథ సంజీవ్కి బాగా నచ్చడంతో తొలిసారిగా హీరోగా నటించి, నిర్మించారు. అనుభవం ఉన్నవాడిలా నటించాడు’’ అన్నారు సురేశ్ సబ్నే. సుమన్ శెట్టి, రేలంగి, వెంకట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సుధాకర్ నాయుడు, సంగీతం: మురళి లియోన్. -
ఆత్మహత్యకు పురిగొల్పిన పెళ్లి నిశ్చయం
ఆత్మహత్యకు పురిగొల్పిన పెళ్లి నిశ్చయం చున్నీతో కట్టుకుని కాలువలో దూకి వారిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. తమను ఎవరూ విడదీయలేరనే విశ్వాసం వారిలో నిత్యం తొణికసలాడేది. అయితే కాలానుగుణంగా రావాల్సిన మార్పులను ఎవరూ ఆపలేరు కదా. వీరి విషయంలోనూ అదే జరిగింది. ఇద్దరిలో ఒకరికి పెళ్లి నిశ్చయం కావడంతో తమ స్నేహానికి అంతిమ గడియలు దాపురించాయని భయపడ్డారు. అలా కాకూడదనుకున్నారు. తమ స్నేహం అజరామరమని ఈ లోకానికి చాటి చెప్పాలనుకున్నారు. ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ మరణం తమకే కానీ తమ స్నేహానికి కాదని చాటి చెప్పారు. శ్రీరంగ పట్టణ తాలూకాలోని మజ్జిగపురలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక సంఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. మండ్య : రామనగర తాలూకాలోని హొంబేగౌడన దొడ్డికి చెందిన పవిత్ర (22), చన్నపట్టణ తాలూకాలోని కాచహళ్లికి చెందిన జయంతి (22)లు ఎనిమిదో తరగతి నుంచి బీకాం వరకు కలసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారి స్నేహం పటిష్ట పునాదులను పరుచుకుంది. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లే వారు. ఒకరినొకరు వదిలి ఉండేవారు కాదు. జయంతికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ పెళ్లి జయంతికి ఇష్టం లేదు. పవిత్ర వివాహం చేసుకునే వరకు తానూ పెళ్లి చేసుకోకూడదనేది ఆమె ఉద్దేశం. అయితే పవిత్రకు అక్క ఉంది. ముందుగా ఆమెకు పెళ్లి కావాలి. ‘నిన్ను వదిలి ఈ పెళ్లి చేసుకోను’ అని పవిత్రకు జయంతి చెప్పింది. ఇద్దరూ తర్జన భర్జన పడ్డారు. చివరికి తమ స్నేహానికి అమరత్వం కల్పించాలని నిర్ణయించుకున్నారు. గురువారం మధ్యాహ్నం పవిత్ర తన ఇంటిలో మరణ వాంగ్మూలం రాసి టేబుల్పై ఉంచింది. అనంతరం జయంతిని కలుసుకుంది. ఇద్దరూ రామనగర నుంచి కృష్ణరాజ సాగర జలాశయం వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి మజ్జిగపురం చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేసి పక్కన పడవేశారు. చున్నీలతో చేతులు కట్టుకుని కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పవిత్ర కుటుంబ సభ్యులు మరణ వాంగ్మూలాన్ని చూసి గాబరా పడ్డారు. ఆమె కోసం వెదకడం ప్రారంభించారు. ఫోన్ చేసినా ఫలితం లేదు. ఇక లాభం లేదనుకుని ఇరు కుటుంబాల వారు పోలీసులను ఆశ్రయించారు. స్థానిక పోలీసులు అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. శుక్రవారం ఉదయం మజ్జిగపుర కాలువలో ఇద్దరి మృత దేహాలు కనిపించాయి. స్థానికులు పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పొలీసులు పక్కన పడి ఉన్న ఫోన్లను స్విచాన్ చేశారు. వెంటనే బంధువుల నుంచి ఫోన్ వచ్చింది. ఇక్కడ ఇద్దరి మృత దేహాలు ఉన్నాయని పోలీసులు తెలపడంతో, అందరూ అక్కడికి చేరుకుని బోరుమన్నారు. డెత్నోటు వివరాలు నేను మరియు జయంతి చని పోవాలని నిర్ణయించుకున్నాము. జయాకు పెళ్ళి చేసుకొవడం కొంచెం కూడ ఇష్టం లేదు. ఆమెకు కావాలిసింది నేను మాత్రమే. మీ స్వార్థం కోసం మమ్మల్ని ఇద్దరిని దూరం చేయకండి. రెండు తలలు కలిసి ఉంటాయి కాని, రెండు జడలు ఒక దగ్గర ఉండవని అంటారు కాని. అది మేము అబద్దమని నిరూపించాము. ఎంతో మంది ప్రేమ కోసం చనిపోతున్నారు. కాని స్నేహం కోసం ఎవరూ చనిపోరు. ఆ స్నేహం కోసం చని పోవాలని మేము మాత్రం నిర్ణయించుకున్నాము. గుడ్ బై. మా ఇద్దరి స్నేహితులకు వేరీ సారీ. ఇప్పటి వరకూ నేను ఎవరినీ ఏమి అడగ లేదు. మేము చనిపోయే ముందు అడిగేది ఒక్కటే. నన్ను జయంతిని ఇద్దరిని ఒకే చోట మట్టిలో ఫూడ్చండి. ఇది మా ఇద్దరి ఆశ. నా తల్లిదండ్రులను కోరేది కూడ ఇది ఒక్కటే. - (పవిత్ర) -
ఆకాశమంత..
నా ధైర్యం నా చెల్లెలే అంటున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్. కంటికి రెప్పలా కాపాడుకునే అన్నంటే నాకు ప్రాణం అంటోంది పూరీ తనయ పవిత్ర. ఆకాశ్ ఇంటర్, పవిత్ర టెన్త్ చదువుతున్నారు. తండ్రికి జిరాక్స్ కాపీలా ఉండే చెల్లికి కాస్త మేకప్ చేసి.. నాన్నలా ముస్తాబు చేయడం ఆ అన్నకు సరదా. అన్నయ్యకు సర్ప్రైజ్ లు ఇవ్వడం చెల్లికి మహా సరదా. లాస్ట్ ఇయర్ ఆకాశ్ బర్త్డేకి రేర్ ఫొటోగ్రాఫ్స్తో ఏవీ ప్రిపేర్ చేసి కానుకగా ఇచ్చింది. ఇద్దరిలో చెల్లెలిదే డామినేషన్. ‘అన్నయ్యకు కోపం వస్తే బొమ్మలు గాల్లో తేలుతాయి. అప్పుడు ఎవరేం చెప్పినా వినడు. అన్నయ్యను ఎవరేం అన్నా నేను ఊరుకోను’ అంటోంది పవిత్ర. ఫ్యాషన్ డిజైనింగ్ లో ఓనమాలు దిద్దుతున్న చెల్లిని ప్రోత్సహించడం ఒక్కటే ఆ అన్నయ్యకు తెలుసు. ‘నేను డిజైన్ చేసిన షర్ట్స్ను మెచ్చుకోవడమే కానీ.. బాగోలేదని ఎప్పుడూ చెప్పడు. సలహాలు ఇస్తుంటాడు’ అని పవిత్ర కాస్త గర్వంగా చెబుతుంటుంది. ‘రాఖీ రోజు అన్నయ్య నాకిష్టమైన బహుమతి ఇస్తాడు. రాఖీకి అన్నయ్య ప్రజెంట్ చేసిన డైమండ్ ఇయర్ రింగ్స్ అమ్మను కూడా ముట్టుకోనివ్వన’ని చె ప్పుకొచ్చింది. ఈ రాఖీ పండుగకు.. చెల్లికి పర్షియన్ క్యాట్ ఇవ్వబోతున్నానని ఆకాశ్ రహస్యంగా చెప్పాడు. తను హీరో అవ్వాలని కోరుకుంటున్న ఆకాశ్.. చెల్లెలు డెరైక్టర్గా రాణించగలద ని నమ్మకంగా చెబుతున్నాడు. -
నాటి ఉష... నిన్నటి అశ్విని బాటలో.
ప్రతిభ అది 2012వ సంవత్సరం... సింగపూర్లో 800 మీటర్ల పరుగుపందెంలో మొదటి స్థానంలో నిలిచింది పవిత్ర. ఆ మరుసటి ఏడాది 2013లో మలేసియాలో జరిగిన అంతర్జాతీయ పోటీలలోనూ మొదటి స్థానం సంపాదించింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో ఒకటో తరగతిలో పవిత్ర పరుగుల ప్రస్థానం మొదలైంది. ఇప్పటికీ ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. ఒలింపిక్స్లో పాల్గొని గెలవాలన్న ఆశయం ఆమె ముందుంది. పి.టి. ఉష, అశ్వినీ నాచప్పల స్ఫూర్తితో పరుగులో వేగం పెంచుతోంది. ఒక్కసారి గతంలోకి వెళితే... 2009వ సంవత్సరం డిసెంబర్15న చెన్నైలోని పోలీసు అకాడమి గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం జరుగుతున్నాయి. పరుగు పందెంలో పాల్గొంటున్న వారిలో తిరుచ్చి జిల్లా నుండి వచ్చిన 14 ఏళ్ళ పవిత్ర రాకెట్లా ముందుకు దూసుకెళ్లి మొదటి స్థానాన్నిసొంతం చేసుకుంది. అప్పుడు అందరి దృష్టి ఆమె మీద కేంద్రీకృతమైంది. ఎవరీ అమ్మాయి? ఎక్కడ సాధన చేసింది? ఆమెకు శిక్షణ ఎవరిచ్చారు? అనే ప్రశ్నలు. యాభై ఏళ్ల కిందట తమిళనాడుకు వెళ్లి స్థిరపడిన తెలుగు కుటుంబం వీరిది. పవిత్ర తండ్రి రాజేంద్రన్ తిరుచ్చిలో టీ స్టాల్ నడుపుతారు. తల్లి రాజకుమారి గృహిణి. తమ్ముడు తొమ్మిదవ తరగతి. మొదటిసారి బహుమతి! ఒకటో తరగతిలో పాఠశాలలో ఆటల పోటీలో డజను మందిని ఓడించి బహుమతిని అందుకుంది పవిత్ర. ఆమెకు విజయం అంటే ఏమిటో తెలిసిన పరుగు అది. ఆ తరవాత ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్లో పాల్గొంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే తపనను తల్లిదండ్రులకు వివరించింది పవిత్ర. అన్ని మధ్యతరగతి కుటుంబాల్లోనూ ఎదురయ్యే సమస్యే ఇక్కడ కూడా. ‘చదువుకోవడానికి పాఠశాలకు పంపితే ఈ పరుగులేంటి, వద్దులే’ అంటూ ఆమె ఆశలను మొగ్గలోనే తుంచేసేందుకు ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. నాటి పరుగుల రాణి బాటలోనే... కానీ, పవిత్ర ఆలోచన వేరు. పరుగుల రాణిగా పేరుపడ్డ పి.టి.ఉష, అశ్వినీ నాచప్పల జీవిత చరిత్రల స్ఫూర్తితో తన ఆశయాన్ని వదులుకోకూడదని గట్టిగా భావించింది. తల్లిదండ్రులను ఒప్పించింది. పదవ తరగతిలో 91 శాతంలో ఉత్తీర్ణత సాధించిన ఈ అమ్మాయి తిరువణ్ణామలైలోని హయ్యర్ సెకండరీ స్కూల్లో చేరింది. క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చే ఆ పాఠశాలలో శిక్షణతో అంతర్జాతీయంగా రాణించి మువ్వన్నెల జెండాను ఎగురవేసింది.ప్రస్తుతం చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో బీటెక్ చదువుతున్న పవిత్ర... క్రీడలలో భారతదేశ ఖ్యాతిని మరింతగా పెంచేందుకు సాధన చేస్తోంది. - కోనేటి వెంకటేశ్వర్లు న్యూస్లైన్, తిరువళ్లూరు ఒలింపిక్స్లో రాణించాలి! భారతదేశం తరఫున ఒలింపిక్స్ పోటీలలో పాల్గొని విజయం సాధించాలనేదే నా ధ్యేయం. ఇప్పుడు మా టీచర్లు, కోచ్తోపాటు మా అమ్మానాన్నలు సహకరిస్తున్నారు. అనుకున్నది సాధించగలననే నమ్మకం ఉంది. - పవిత్ర, క్రీడాకారిణి
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ
ప్రముఖ నటికి సర్జరీ.. షాకయ్యానన్న మాజీ భర్త!
నేను గెలిస్తే సినిమాలు మానేస్తా.. కంగనా సంచలన నిర్ణయం
T20 WC 2024 Trophy At Sakshi: సెమీస్ చేరే జట్లు ఇవే: పీయూశ్ చావ్లా
ఈ డివైజ్తో క్షణాల్లో సిల్కీ హెయిర్ సొంతం!
సింగర్ సుచిత్రకు లీగల్ నోటీసులు జారీ
గుడుల పేరుతో మేం ఓట్లడగలేదు: కేటీఆర్
తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
సుడిగాలి సుధీర్ బర్త్డే.. రష్మిగౌతమ్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
అలాగే పెళ్లి కూడా చేసిపెట్టమని అడగండి మేడం!
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement