-
బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిల్.. మహిళా పైలట్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా మహిళా పైలట్ బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిలైంది. దీంతో టాటా గ్రూపు విమానయాన సంస్థ ఆ మహిళా పైలట్పై కఠిన చర్యలు తీసుకుంది. మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేసింది. గత వారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బోయింగ్ 787 విమానం ఫస్ట్ ఆఫీసర్గా మహిళా పైలట్ విధులు నిర్వహించాల్సి ఉంది. ఇంతలో ఆమె బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిలై విధులకు దూరమైంది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా అధికారులు మంగళవారం(ఏప్రిల్ 9) ధృవీకరించారు. సస్పెన్షన్కు గురైన మహిళా పైలట్ సోషల్ మీడియాలో పాపులర్ అని తెలుస్తోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) రూల్స్ ప్రకారం ఆల్కహాల్ తీసుకున్న పైలట్లను విమానం నడిపేందుకు అనుమతించరు.ఎవరైనా ఆల్కహాల్ ఉన్న మౌత్వాష్లు,టూత్ జెల్ మందులు తీసుకుంటే ముందుగా సమాచారమివ్వాల్సి ఉంటుంది. లేదంటే టెస్టుల్లో పట్టుబడితే తొలిసారి శిక్ష కింద విధుల నుంచి 3 నెలలు సస్పెండ్ చేస్తారు. ఇదీ చదవండి.. సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ,ఈడీ సోదాలు -
తొలిసారి కుటుంబాన్ని ఫ్లైట్ ఎక్కించిన పైలట్.. తల్లి కంటతడి
విమానంలో ప్రయాణించడం ప్రతి ఒక్కరి కల. కొంతమందికి ఇది తేలికైన విషయమే కావచ్చు. కానీ ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనుకునే వారి సంఖ్య అనేకం. వీరిలో చాలామందికి ఈ ఆశ నిరాశగానే మిగిలిపోయిన సందర్బాలూ ఉన్నాయి. తాజాగా ఓ పైలట్ తన కుటుంబాన్ని మొదటిసారి విమానం ఎక్కించాడు. దీంతో ఆనందంతో తల్లి కంటతడి పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రదీప్ కృష్ణన్ అనే వ్యక్తి ఇండిగో విమానంలో పైలట్గా పనిచేస్తున్నాడు. ఇటీవల తన కుటుంబాన్ని తొలిసారి విమానం ఎక్కించాడు. తన తల్లి, బామ్మ, తాతను చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న విమానం ఎక్కించి సర్ప్రైజ్ చేశాడు. ‘మావాళ్లు మొదటిసారి విమానంలో ప్రయాణిస్తున్నారు. ఇది నాకేంతో సంతోషంగా ఉంది. చిన్నప్పుడు తాత తన స్కూటర్పై నన్ను తిప్పేవాడు. ఇప్పుడు నా డ్రైవింగ్లో తాతను విమానంలో తీసుకెళ్తున్నా’ అంటూ టేకాఫ్కు ముందు విమానంలోని ప్రయాణికులకు ప్రత్యేక అనౌన్స్మెంట్ ద్వారా తన కుటుంబాన్ని పరిచయం చేశాడు. ఈ క్రమంలో పైలట్ తల్లి భావోద్వేగంతో కంటతడి పెట్టుకుంది. అనంతరం విమానంలో ప్రయాణికులందరూ చప్పట్లు కొట్టి ఆ కుంటుబానికి వెల్కమ్ చెప్పారు. View this post on Instagram A post shared by Pradeep Krishnan (@capt_pradeepkrishnan) -
పైలెట్ల రాజీనామా.. విస్తారా ఎయిర్లైన్స్ సేవల్లో అంతరాయం
విస్తారా-ఎయిరిండియా విలీన ప్రక్రియ నేపథ్యంలో వేతనాల సవరణ అంశంపై పైలట్లు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఫలింతగా విమాన సర్వీసులపై ప్రభావం పడుతోంది. పైలట్లు అందుబాటులో లేకపోవడంతో ఇవాళ మరో 38 విస్తారా విమాన సేవలు నిలిచిపోయాయి. ముంబయి నుంచి 15, దిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి 11 విమాన సర్వీసులు రద్దయినట్లు విస్తారా ప్రకటించింది. ఈ తరణంలో ఆ సంస్థకు చెందిన 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం విధులు నిర్వహిస్తున్నా, ఫిక్స్డ్ పరిహారం తగ్గించడంపై విస్తారా పైలట్లు ఆందోళన వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతకు ముందు వైడ్ బాడీ బోయింగ్ 787 విమానాల నిర్వహణ కోసం విస్తారా పైలెట్లు శిక్షణ పొందారు. ట్రైనింగ్ తర్వాత సుమారు సుమారు 800 మంది పైలట్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లు రాజీనామా చేయడంతో కలవరం మొదలైంది. 70 విమానాలతో ప్రతి రోజూ 300కి పైగా విమాన సర్వీసులు అందించే విస్తారా ఎయిర్లైన్స్లో ఇప్పుడు పైలెట్ల కొరత మరిన్ని ఇబ్బందులు గురి చేస్తోంది. -
Teena Goswami: ఆడపిల్లే అదృష్టదేవత
పైలట్ టీనా గోస్వామి ఆసక్తికరమైన వీడియోలను ‘పైలట్ మమ్మీ’ శీర్షికతో ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తుంటుంది. తాజాగా పోస్ట్ చేసిన ఒక బామ్మ వీడియో వైరల్గా మారింది. గ్రామీణత ఉట్టిపడే ఆహార్యంతో కనిపిస్తున్న ఒక బామ్మ అయోధ్యధామ్కు వెళ్లే విమానంలోకి మెట్లకు నమస్కరిస్తూ ఎక్కింది. విమానంలో కనిపించిన పైలట్ టీనా గోస్వామిని ఆ΄్యాయంగా పలకరించింది. ‘మన భారతీయ సనాతన సంస్కృతిలో ఆడపిల్ల.. మన లక్ష్మి’ అంటూ టీనాను ఆశీర్వదించింది. బామ్మ కాళ్లకు గౌరవంగా నమస్కరించింది టీనా. రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఈ వీడియో ముప్ఫై లక్షల వ్యూస్ దక్కించుకుంది. హృదయాన్ని హత్తుకునే ఈ వీడియో గురించి కామెంట్ సెక్షన్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. -
అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా పైలట్!
కమోరా ఫ్రీలాండ్ న్యూయార్క్ స్టేట్లో అతి పిన్న వయస్కురాలైన ఆఫ్రికన్ మహిళా పైలట్. 17 ఏళ్ల వయసులోనే పైలెట్గా లైసెన్స్ పొందిన మహిళగా రికార్డు సృష్టించింది. దీంతో న్యూయార్స్ ఏవియేషన్ ఆమెకు సుమారు 12 మంది ప్రయాణికులతో కూడిన విమానాన్ని నడిపేందుకు అనుమతిస్తూ లైసెన్స్ జారీ చేసింది. ఆమె ఎల్లప్పుడూ సముద్ర జీవశాస్త్రంపై దృష్టి పెట్టేది. అయితే అనుకోని విధంగా ఏవియేషన్ వైపుకి దృష్టి మళ్లించింది. ఆమె 15 ఏళ్ల వయసులోనే విమానం నడపడం నేర్చుకుంది. అయితే కమోరా తానెప్పుడూ పైలట్ కావాలని అనుకోలేదని చెబుతోంది. కానీ తొలిసారిగా విమానం నడిపాక కచ్చితంగా జీవనోపాధికి దీన్నే ఎంచుకోవాలని డిసైడ్ అయ్యాను అంటోంది కమోరా. 2019లో మిల్టన్ డేవిస్, క్లెట్ టైటస్ అనే అధికారులు ఈ యునైటెడ్ యూత్ ఏవియేటర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో విమాన శిక్షకులుగా 13 నుంచి 18 ఏళ్ల వారికి అవకాశం ఇస్తుంది. అయితే విమానం నడపేందుకు లైసెన్స్ మాత్రం 16 ఏళ్లు నిండితేనే ఇస్తారు. కమోరా కూడా ఈ కార్యక్రమంలో 12 ఏళ్ల వయసు నుంచే విమానా పాఠాలు నేర్చుకుంది. యూనైట్ యూత్ ఏవియేషన్ అధికారుల మాత్రం ఆమెకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడూ విమానం నడిపేందుకు అంగీకరించంది. చాలా చకచక వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం, కాక్పీట్లో ఎలాంటి తప్పులు చేయకూడదనే విషయాలపై అవగాహన ఏర్పరచుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు బెల్జియన్ సంతతి బ్రిటిష్ జాతీయుడు రూథర్ఫోర్డ్పై పేరిట ఉంది. ఆయన కేవలం 15 ఏళ్ల వయసులోనే పైలట్గా విమానం నడిపే లైసెన్స్ పొందాడు. ఇక కమోరా ఆ తర్వాత స్థానాన్ని దక్కించుకుంది. పైగా న్యూయార్క్ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కురాలైన పైలట్గా ఘనత సాధించింది. అంతేగాదు రూథర్ఫోర్డ్ మాదిరిగానే రెండు గంటల క్రాస్ కంట్రీ సోలో ఫ్లైట్ను కూడా పూర్తి చేసింది. ఈ మేరకు కమోరా మాట్లాడుతూ..ఈ ఘనత సాధించినందుకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఏదీ అసాధ్యం కాదని నమ్మండి. సాధించాలనే తప్పన ఉంటే ఎంతటి అడ్డంకినైనా అధిగమించొచ్చు అని పేర్కొంది కమోరా. ఇక్కడ కమోరా డ్రైవింగ్ లైసెన్స్ కంటే ముందే పైలట్గా లైసెన్స్ పొందడం విశేషం View this post on Instagram A post shared by United Youth Aviators (@united_youth_aviators) (చదవండి: ఇలాంటి తల్లలు కూడా ఉంటారా?..మాటలు కూడా రాని ఆ చిన్నారిని..) -
Sharmila Yadav: డ్రోన్ దీదీ
హరియాణాకు చెందిన షర్మిల యాదవ్ పెద్ద చదువులు చదువుకోవాలని కల కన్నది. అయితే ఇంటర్మీడియేట్ పూర్తికాగానే ‘ఇక చాలు’ అన్నారు తల్లిదండ్రులు. పెళ్లి అయిన తరువాత కుటుంబ బాధ్యతల్లో తలమునకలైనప్పటికీ షర్మిలకు చదువుపై ఉన్న ఇష్టం మాత్రం పోలేదు. ‘డ్రోన్ సిస్టర్’ ప్రోగ్రాంలో భాగంగా మహిళలకు డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇస్తున్నారని తెలుసుకున్న షర్మిల ట్రైనింగ్ కోర్సులో చేరింది. ఫస్ట్ టెస్ట్లో ఫెయిల్ అయింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ‘మరో ప్రయత్నం చెయ్యి’ అని ప్రోత్సహించారు. సెకండ్ టైమ్ టెస్ట్ పాస్ అయిన షర్మిల ఇప్పుడు సర్టిఫైడ్ డ్రోన్ పైలట్గా గుర్తింపు పొందింది. ఎలాంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మాస్టరింగ్ కంట్రోల్స్, హైట్ అండ్ స్పీడ్ రీడింగ్, స్మూత్ టేక్–ఆఫ్, ల్యాండింగ్స్...మొదలైన సాంకేతిక విషయాలపై అవగాహన ఏర్పర్చుకుంది. ఇప్పుడు ఆమెను అందరూ ‘డ్రోన్ దీదీ’ అని పిలుస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించిన పనుల్లో డ్రోన్ పైలట్గా చేతి నిండా పనితో మంచి ఆదాయన్ని అర్జిస్తోంది. వ్యవసాయ భూముల్లో షర్మిల యాదవ్ డ్రోన్ ఆపరేట్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
విమానంలో మహిళకు పురిటినొప్పులు.. డెలివరీ చేసిన పైలట్
విమానం గాల్లో ఉండగా పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు పైలెట్ డెలివరీ చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తైవాన్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న వీట్జెట్కు చెందిన విమానంలో చోటుచేసుకుంది. ఎంతో ధైర్యంగా. సమయస్పూర్తితో వ్యవహరించి గర్భిణీకి పురుడు పోసినపైలెట్ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నారు. వివరాలు.. వీట్ జెట్కు చెందిన విమానం తైపీ(తైవాన్) నుంచి థాయ్లాండ్లోని బ్యాంకాక్ వెళ్తోంది. విమానంలో ఓ గర్భిణి కూడా ఉంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఆమెకు పురిటి నొప్పులు రావడంతో బాత్రూమ్లో ఇబ్బంది పడుతున్న ఆమెను గమనించిన సిబ్బంది విషయాన్ని పైలట్ జకరిన్ సరార్న్రక్స్కుల్కు తెలియజేశారు. విమానం ల్యాండింగ్కు కూడా సమయంలో ఉండడంతో డెలివరీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కెప్టెన్ జకరిన్ తన బాధ్యతలను కో పైలట్కు అప్పగించి కాక్పిట్ నుంచి బయటకు వచ్చాడు. విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని అడిగాడు. కానీ సమయానికి వైద్యులు కూడా లేకపోవడంతో వేరే మార్గం లేక తానే రంగంలోకి దిగాడు. మొబైల్ ద్వారా వైద్యులను సంప్రదించి.. వారి సూచనలతో మహిళకు పురుడు పోశాడు. ఇదంతా గమనించిన విమానంలోని ప్రయాణికులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. క్లిష్ట సమయంలో ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించిన పైలెట్ను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. అనంతరం విమానం ల్యాండ్ అయ్యాక తల్లి, శిశువును ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బిడ్డకు ముద్దుగా స్కై బేబబీ’ అని పేరు పెట్టారు. మరోవైపు 18 ఏళ్లుగా పైలట్గా వ్యవహరిస్తున్న జాకరిన్ గతంలో ఎప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోలేదని తెలిపాడు. చదవండి: గర్భవతైన భార్యను, కూతురును వదిలి ఇజ్రాయెల్కు.. అంతలోనే -
Indigo: పైలట్ కళ్లలోకి లేజర్ లైట్.. గాల్లో 171 మంది ప్రాణాలు
కోల్కతా: బెంగళూరు నుంచి కోల్కతా వచ్చిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కోల్కతాకు చేరుకుని ల్యాండింగ్కు సిద్ధమైన సమయంలో అప్రోచ్ ఫన్నెల్ నుంచి విమానం కాక్పిట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు లేజర్ లైట్ వేశారు. ఈ కిరణాలు పైలట్ కళ్లలో పడ్డాయి. ఈ నెల 23న రాత్రి 7.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాసేపట్లో ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన ఆపరేషన్ చేస్తున్న సమయంలో పైలట్ కళ్లలో లేజర్ లైట్ పడటంతో అతడి కళ్లు కాసేపు కనిపించలేదు. దీంతో విమానం రన్ వే వైపు నిమిషానికి 1500 నుంచి 2000 అడుగుల వేగంతో కిందకు దూసుకువచ్చింది. ఈ సమయంలో విమానంలో 165 మంది ప్యాసింజర్లతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. చివరకు విమానం సేఫ్గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఇలాంటి ఘటనలు జరిగినపుడు విమానాన్ని ల్యాండ్ చేయకుండా మళ్లీ ఆకాశంలోకి తీసుకెళ్లి చక్కర్లు కొట్టాల్సి ఉంటుంది. ఈ ఘటనపై ఇండిగో సంస్థతో పాటు నేతాజీ సుభాష్చంద్రబోస్ ఎయిర్పోర్ట్ సిబ్బంది స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టేక్ఆఫ్, ల్యాండింగ్ సమయాల్లో పైలట్ల దృష్టి మరలితే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. గూడ్సు రైలు కలకలం.. డ్రైవర్ లేకుండానే ముందుకు వెళ్లి -
చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో విభేదాలు
-
పైలట్ తప్పిదం.. రన్వే అనుకొని నదిపై ల్యాండ్ అయిన విమానం
రష్యాలో ఘోర ప్రమాదం తప్పింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం రన్వే అనుకొని పొరపాటున గడ్డకట్టిన నదిపై ల్యాండ్ అయ్యింది. అయితే నదిలోని నీరంతా పూర్తిగా గడ్డుకట్టుకుపోవడంతో ఎవరికి ఏ ప్రమాదం జగరలేదు. ఈ ఘటన జిర్యాంగ ఎయిర్పోర్టు సమీపంలో జరిగింది. వివరాలు.. పోలార్ ఎయిర్లైన్స్కు చెందిన సోవియెట్ కాలం నాటి ఏఎన్-24 విమానం రష్యాలోని యాకుత్స్క్ నుంచి గురువారం బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం జిర్యాంక ఎయిర్పోర్టులో దిగాల్సి ఉంది. అయితే ఈ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మానాశ్రయంలోని రన్వేపై మంచు పేరుకుపోయింది. విపరీతమైన మంచు కారణంగా పక్కనే నది కూడా గడ్డకట్టి ఉంది. దీంతో పైలట్ గందరగోళానికి గురై ఎయిర్పోర్టు సమీపంలోని కోలిమా నదిపై విమానాన్ని ల్యాండ్ చేశాడు. విషయం తెలుసుకున్న ఎమర్జెన్సీ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పైలట్ తప్పిదం కారణంగానే విమానం నదిపై ల్యాండ్ అయ్యిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. గడ్డకట్టిన నదిపై విమానం ల్యాండ్ అవడం, అందులోని ప్రయాణికులను బయటకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. The AN-24 aircraft of Polar Airlines was flying on the route #Yakutsk - Zyryanka - Srednekolymsk. But, having arrived at Zyryanka airport, it landed on Kolyma river. There were 30 passengers and 4 crew members on board. No one was injured and the aircraft was not damaged.… pic.twitter.com/MFM85AKSJ6— WarMonitoreu (@WarMonitoreu) December 28, 2023 -
డ్యూటీలో కత్తి తీసుకెళ్తా: కోర్టుకెక్కిన ఇండిగో పైలట్
నాగ్పూర్: ఇండిగో ఎయిర్లైన్స్లో పనిచేసే సిక్కు పైలట్ ఆనంద్సింగ్ డ్యూటీలో తన వెంట కిర్పన్(చిన్నకత్తి)ని తీసుకెళ్లేందుకు అనుమతివ్వాలని కోర్టుకెక్కారు. కిర్పన్ను క్యారీ చేయడం సిక్కు సంప్రదాయంలో ఒక భాగమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కింద కిర్పన్ తీసుకెళ్లడం తన ప్రాథమిక హక్కు అని నాగ్పూర్ హైకోర్టు బెంచ్ ముందు వేసిన పిటిషన్లో తెలిపారు. ఈ మేరకు తనకు అనుమతిచ్చేలా కేంద్రప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని పైలట్ కోరారు. పిటిషన్ను విచారించిన జస్టిస్ నితిన్ సాంబ్రే, అభయ్ మంత్రిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేంద్రప్రభుత్వంతో పాటు ఇండిగో ఎయిర్లైన్స్కు నోటీసులు పంపింది. ‘విమానాల్లో కిర్పన్ను తీసుకెళ్లడానికి ప్రయాణికులకు అనుమతిస్తూ విమానయాన శాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఉద్యోగులకు మాత్రం కిర్పన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదని అందులో తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25కి విరుద్ధం’ అని పైలట్ న్యాయవాది చెప్పారు. సంప్రదాయంలో భాగంగా సిక్కులు ధరించే వాటిలో కిర్పన్ కూడా అతి ముఖ్యమైనది. చిన్న సైజులో ఉన్న కిర్పన్ను సిక్కులు తమ వెంటే ఉంచుకుంటారు. ఇదీచదవండి..గణతంత్ర వేడుకలకు బైడెన్ దూరం.. కారణం అదేనా? -
కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు? ఓడితే బాధ్యులెవరు?
రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తేలగా, కొన్నింటిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అయితే ఇప్పుడు గెలుపు ఓటములు రెండూ కాంగ్రెస్కు కొత్త సవాళ్లను సృష్టించనున్నాయి. గత కొన్నేళ్లుగా రాజస్థాన్లో కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ పోరుకు పునాది సీఎం కుర్చీ. ప్రస్తుత ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. రాజస్థాన్లో ఒకవేళ కాంగ్రెస్ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మరోమారు ముఖ్యమంత్రి పదవి కోసం యుద్ధం మొదలుకానున్నదని తెలుస్తోంది. దీనిని చూస్తుంటే మరోసారి 2018 ఎన్నికల ఫలితాల తరహా పరిస్థితి ఏర్పడవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. 2018లో రాజస్థాన్లో కాంగ్రెస్ గెలుపొందినప్పుడు పార్టీలోని ఒక వర్గం సచిన్ పైలట్కు మద్దతు ఇచ్చింది. అయితే పార్టీలో అశోక్ గెహ్లాట్ సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఆయనకు మరోమారు సీఎం అయ్యే అవకాశం కల్పించారు. ఈ నేపధ్యంలో ఆయన రెండున్నరేళ్ల పాటు సీఎంగా ఉండాలనే ఆప్షన్ను ఎంచుకోవచ్చనే వార్తలు కూడా వినిపించాయి. ఆ దిరిమిలా 2020లో సచిన్ పైలట్ తనను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ హైకమాండ్పై ఒత్తిడి తెచ్చి, తిరుగుబాటుకు దిగారు. ఈ నేపధ్యంలో పైలెట్ డిప్యూటీ సీఎం పదవిని కోల్పోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ గెహ్లాట్, పైలట్ల మధ్య టెన్షన్ కాస్త తగ్గినట్లు కనిపించినా, ఫలితాల వెల్లడి తర్వాత మళ్లీ సమస్యలు తలెత్తడం ఖాయం అని పలువురు అంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ ఓటమిపాలైనా గెహ్లాట్-పైలట్ అంశం కాంగ్రెస్కు పెద్ద తలనొప్పిగా మారనుంది. అప్పుడు ఆటంతా ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య తిరుగుతుంది. అలాంటి పరిస్థితిలో వీరిద్దరి మధ్య సంబంధాలు చెడిపోతే.. పార్టీ మళ్లీ వారిని బుజ్జగించే పని చేయాల్సి వస్తుంది. రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే కాంగ్రెస్కు 86 నుంచి 106 సీట్లు వస్తాయని, బీజేపీకి 80 నుంచి 100 సీట్లు వస్తాయని పలు మీడియా సంస్థలు అంచనా వేశాయి. ఇది కూడా చదవండి: ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం -
ట్రాఫిక్లో పైలట్.. ఫ్లైట్ లేట్..! వీడియో వైరల్
ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో నిర్వహణను తప్పుపట్టారు. ఇందుకు సంబంధించి శర్మ తన ఎక్స్ ఖాతాలో తాజాగా జరిగిన సంఘటన గురించి షేర్ చేశారు. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. నవంబర్ 29న చెన్నై నుంచి ముంబయి వెళ్లాల్సిన 6ఈ 5149 నంబర్ ఇండిగో విమానం దాదాపు గంటకుపైగా ఆలస్యంగా బయలుదేరింది. ఇది షెడ్యూల్ ప్రకారం రాత్రి 8:00 గంటలకు చెన్నై నుంచి బయలుదేరి రాత్రి 9:55 గంటలకు ముంబై చేరుకోవాలి. అయితే గూగుల్ ఫ్లైట్స్ డేటా ప్రకారం దాదాపు నాలుగు గంటలు ఆలస్యం అవుతుందని సూచిస్తూ విమాన బయలుదేరే సమయం నవంబర్ 30 ఉదయం 12:10కు మారింది. అప్పటికే అందులో ఎక్కిన ప్రయాణికులు దాదాపు 180 మంది ఆందోళన చేపట్టారు. వెంటనే సమస్యకు చర్య తీసుకోవాలని కోరినా మేనేజ్మెంట్ సరిగా స్పందించలేదని ఆయన తెలిపారు. ఆ ప్రయాణికుల్లో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఉన్నారని చెప్పారు. అయితే వారిని వేరే విమానం ఎక్కిస్తామని నమ్మించి మళ్లీ సెక్యూరిటీ వింగ్కు తరలించినట్లు చెప్పారు. విమానం ఆలస్యం అయినందుకు కారణం అడుగుతున్న ప్రయాణికులకు సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పైలట్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడంటూ ఇండిగో సిబ్బంది సమర్థించుకునే ప్రయత్నం చేశారంటూ తెలిపారు. ఇండిగో సీనియర్ అధికారితో మాట్లాడాలని కోరుతూ ఎయిర్లైన్ గ్రౌండ్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగిన వీడియోలను శర్మ ఎక్స్లో పోస్ట్ చేశారు. Dear @IndiGo6E first you made us wait in the bus for 50 minz, and now your team is saying pilot is stuck in traffic, what ? Really ? we supposed to take off by 8 pm n it’s 9:20, still there is no pilot in cockpit, do you think these 180 passengers will fly in indigo again ? Never… — Kapil Sharma (@KapilSharmaK9) November 29, 2023 ఇదీ చదవండి: సెల్ఫ్మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ 2023 లిస్ట్ విడుదల.. ఆయనే టాప్.. ‘ప్రియమైన ఇండిగో, మీరు మమ్మల్ని బస్సులో 50 నిమిషాలు వేచి ఉండేలా చేశారు. ఇప్పుడు మీ సిబ్బంది.. పైలట్ ట్రాఫిక్లో చిక్కుకున్నాడని అంటున్నారు. మేము రాత్రి 8 గంటలకు బయలుదేరాలి. ప్రస్తుతం రాత్రి 9:20 అవుతుంది. ఇప్పటికీ కాక్పిట్లో పైలట్ లేడు. ఈ 180 మంది ప్రయాణికులు మళ్లీ ఇండిగోలో ప్రయాణిస్తారని అనుకుంటున్నారా?’ అంటూ తన పోస్ట్లో తెలిపారు. Now they r de boarding all the passengers n saying we will send you in another aircraft but again we have to go back to terminal for security check 👏👏👏👏👏 #indigo👎 pic.twitter.com/NdqbG0xByt — Kapil Sharma (@KapilSharmaK9) November 29, 2023 People r suffering bcoz of you @IndiGo6E lying lying n lying, there r some old passengers on wheel chairs, not in a very good health condition. Shame on you #indigo 👎 pic.twitter.com/87OZGcUlPU — Kapil Sharma (@KapilSharmaK9) November 29, 2023 -
గుండెపోటుతో ఎయిర్ ఇండియా పైలట్ మృతి.. 100 రోజుల్లో మూడో ఘటన
న్యూఢిల్లీ: ఈ మద్య కాలంలో చాలా మంది గుండెపోటుతో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండే యువకులు సైతం సడెన్ హార్ట్ఎటాక్తో మృత్యుతపడటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఓ యువ పైలట్ గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన 37 ఏళ్ల పైలట్ హిమ్మనీల్ కుమార్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలోని టెర్మినల్ 3లోని ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ విభాగంలో శిక్షణ పొందుతున్నాడు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఉన్నట్టుండి ఛాతిలో నొప్పితో కుప్పకూలిపోయాడు. గమనించిన సహోద్యోగులు సీపీఆర్ చేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. పైలట్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, సీనియర్ కమాండర్ పైలట్ అయిన హిమ్మనీల్ కుమార్, పెద్దవైన బోయింగ్ 777 ఎయిర్క్రాఫ్ట్లను ఆపరేట్ చేసేందుకు అక్టోబర్ 3 నుంచి శిక్షణ పొందుతున్నట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. ఆగస్టు 23న జరిగిన వైద్య పరీక్షల్లో ఆరోగ్యపరంగా ఫిట్గా ఉన్నట్లు తేలిందని చెప్పారు. అయితే ఊహించని విధంగా ఆయన మరణించడంపై ఎయిర్ ఇండియా సంస్థ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా యువ పైలట్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. గత మూడు నెలలో ముగ్గురు పైలట్లు మృతువాతపడ్డారు. గత ఆగస్టులో ఇండిగో ఎయిర్లైన్కి చెందిన పైలట్ పూణేకు విమానం టేకాఫ్ అయ్యే ముందు నాగ్పూర్ ఎయిర్పోర్ట్ బోర్డింగ్ గేట్ వద్ద కుప్పకూలిపోయాడు. అతడికి ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించినా ప్రాణాపాయం నుంచి బయటపడలేకపోయారు. ఈ సంఘటనకు ఒక రోజు ముందు, ఖతార్ ఎయిర్వేస్లో పనిచేస్తున్న స్పైస్జెట్ కెప్టెన్ ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తుండగా విమానంలోనే మరణించాడు. చదవండి: సిద్దరామయ్య కుమారుడిపై మాజీ సీఎం సంచలన ఆరోపణలు.. -
యూట్యూబ్ కింగ్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? మళ్లీ ట్రెండింగ్లోకొచ్చేశాడు!
YouTuber Gaurav Taneja మలేషియాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థకు మాజీ పైలట్ గౌరవ్ తనేజా మరోసారి వార్తల్లో నిలిచాడు. మెట్రో రైల్లో పుట్టిన రోజు వేడుకలు జరిపిన బుక్కైన యూట్యూబర్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? యూట్యూబ్లో ఫ్లైయింగ్ బీస్ట్గా ఫిట్నెస్ పాఠాలు చెప్పే యూ ట్యూబర్ గౌరవ్ తన సంపాదన ఎంతో ఫ్యాన్స్కి చెప్పేశాడు. అంతేకాదు తన పాత సీఈవోతోపోలిస్తే సంపాదనలో కింగ్ని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకపుడు తనను తొలగించిన ఏయిర్ ఏసియా సీఈవో కంటే ఇపుడు తన సంపాదేన ఎక్కువ అంటూ ఇటీవల ఇన్ఫ్లుయెన్సర్ రాజ్ షమానీ హోస్ట్ చేసిన పోడ్కాస్ట్ సందర్భంగా వెల్లడించారు. బ్రాండ్ డీల్స్, యాడ్స్ ఆదాయం గురించి చెప్పమని అడిగినపుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. గౌరవ్ మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చాడు. నిర్దిష్టంగా ఇంత అనీ సంపాదన వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కానీ ఎయిర్ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ మిలియన్ డాలర్ల ఆస్తులను గుర్తుచేసుకుని తనేజా ఫ్యాన్స్ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. అదీ సీఈవో టోనీ లింక్డ్ఇన్ పోస్ట్తో విమర్శల పాలైన తరువాత కంపెనీ మాజీ పైలట్ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో మరింత వైరల్గా మారాయి. ఇంతకీ ఎవరీ గౌరవ్ తనేజా ♦ 2008లో ఐఐటీ ఖరగ్పూర్ పట్టభద్రుడైన గౌరవ్ తనేజా "సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, ప్రొఫెషనల్ బాడీబిల్డర్ , ఏవియేటర్ కూడా. ♦ ఇపుడు ఢిల్లీ యూనివర్శిటీనుంచి ఎల్ఎల్బీ చేస్తున్నాడు. ♦ మరో పైలట్ రీతూ రథీతో వివాహం. వీరికి ఇద్దరు కుమార్తెలు . ♦ భద్రతా సమస్యల్ని గురించిన మాట్లాడినందుకే తనను ఎయిర్ ఏసియానుంచి తొలగించారనేది గౌరవ్ వాదన. ♦ ఫ్లైయింగ్ బీస్ట్ కంటే ముందే 2016లో FitMuscle TVని లాంచ్ చేశాడు. దీనికి దాదాపు 30 లక్షల సబ్ స్క్రైబర్లున్నారు. ఇక 2020లో లాంచ్ చేసిన రాస్బరీ కే పాపాకి 12 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లున్నారు I was terminated from airasia for raising safety issues! Now, the same issues are raised by #DGCA to @AirAsiaIndian. Justice will prevail! #Sabkeliye — Gaurav Taneja (@flyingbeast320) June 28, 2020 కాగా 2020జూన్లో AirAsia ఇండియా గౌరవ్ను పైలట్గా విధులనుంచి తొలగించింది. అప్పటికే ప్రముఖ వ్లాగర్గా తనేజా ఫుట్ టైం కంటెంట్ క్రియేటర్గా, యూట్యూబర్గా కరియర్ స్టార్ట్ చేశాడు.ఫ్లైయింగ్ బీస్ట్, ఫిట్ మజిల్ టీవీ, రాస్బరీకే పాపా పేర్లతో యూట్యూబ్ ఖాతాలను నిర్వహిస్తున్నాడు. అలా సోషల్మీడియాలో పాపులర్ స్టార్గా మారిపోయాడు.ప్రస్తుతం, యూట్యూబ్లో 80 లక్షలకుపైగా సబ్స్క్రైబర్లు, ట్విటర్లో దాదాపు 900k, ఇన్స్టాలో 40 లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే అతని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. -
నిజం కాబోతున్న సినిమా కథ.. ప్రాణాలకు ముప్పు తప్పదా?
సినిమా అంటే ఎంటర్టైన్మెంట్. మన నిజ జీవితంలో జరగని వాటిని ఎక్కువగా సినిమాల్లో చూస్తూంటాం. ఎంజాయ్ చేస్తుంటాం. కమర్షియల్ చిత్రాలు కాకుండా మనం ఆశ్చర్యపోయేలా కొన్ని మూవీస్ వస్తుంటాయి. టెక్నాలజీ స్టోరీతో తీసే చిత్రాలన్నీ ఈ కేటగిరీలో ఉంటాయని చెప్పొచ్చు. అలా అప్పుడెప్పుడో 18 ఏళ్ల క్రితం ఓ హాలీవుడ్ మూవీ వచ్చింది. ఇందులోని స్టోరీని పోలినట్లు.. రియల్ లైఫ్ లో ఓ సంఘటన జరిగింది. ఇక్కడవరకు బాగానే ఉంది కానీ ఓ విషయం మాత్రం కాస్త భయపెడుతోంది. మన జీవితంలో టెక్నాలజీ అనేది ఇప్పుడు భాగమైపోయింది. ఫోన్, ఇంటర్నెట్ లేనిదే ఏ పని జరగట్లేదు. ఇక ఈ మధ్య ఏఐ (కృత్రిమ మేధ) అని కొత్తగా వచ్చింది. మనిషి అవసరం లేకుండా ఇది అన్ని పనులు చక్కబెట్టేస్తుంది. అయితే దీనివల్ల ప్రస్తుతానికైతే అంతా బాగానే నడుస్తోంది. కానీ భవిష్యత్తులో ఇలానే ఉంటుందా లేదా అనేది చూడాలి. సరే ఇదంతా పక్కనబెడితే అసలు విషయానికొచ్చేద్దాం. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్లో నిజమెంత?) 2005లో హాలీవుడ్లో 'స్టెల్త్' అనే సినిమా తీశారు. ఈ స్టోరీలో భాగంగా విమానాన్ని నడిపేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని తయారు చేస్తారు. దాన్ని యుద్ధ రంగాలోకి పంపిస్తారు. కానీ సిస్టమ్లో అనుకోని పొరపాట్ల వల్ల టార్గెట్తో పాటు సొంత మనుషులపైనా ఇది దాడి చేసి చంపేస్తుంది. చివరకు దీన్ని ఎలా ఆపారనేది సినిమా స్టోరీ. అయితే తాజాగా అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీ వాళ్లు.. ఏఐతో నడిచే కో-పైలెట్ని సృష్టించారు. సాధారణంగా ఓ విమానంలో ఇద్దరూ పైలెట్స్ ఉంటారు. ఒకవేళ ఏఐ పైలెట్ అందుబాటులోకి వస్తే.. ఓ మనిషి అవసరం తగ్గిపోతుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ టెక్నాలజీని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ 'స్టెల్త్' సినిమాలో జరిగినట్లు ఏఐ పైలెట్ ఏమైనా రివర్స్ అయితే మాత్రం ఘోర ప్రమాదం తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) -
యుద్ధ విమాన పైలెట్గా కంగనా.. ట్రైలర్ అదిరిపోయింది!
ఇటీవలే చంద్రముఖి-2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. తాజాగా మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం తేజస్. వైమానిక దళం పైలట్గా ఈ చిత్రంలో కంగనా కనిపించనున్నారు. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. తాజాగా తేజస్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఇవాళ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. (ఇది చదవండి: యుద్ధ విమానం నడిపే పైలెట్గా కంగనా.. ‘తేజస్’ వచ్చేస్తుంది!) ట్రైలర్ చూస్తే ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ ట్రైలర్లో కంగనా రనౌత్ని శక్తివంతమైన వైమానిక దళ పైలట్గా కనిపించారు. ఈ చిత్రంలో దేశం కోసం పోరాడుతూ వైమానిక దళంలో పని చేస్తున్న కంగనా వైమానిక యుద్ధ విన్యాసాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్రవాదంపై పోరాడే కథనే సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ను తలపిస్తోంది. ఈ చిత్రాన్ని సర్వేశ్ మెవారా దర్శకత్వంలో రూపొందించగా.. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో అన్షుల్ చౌహాన్, వరుణ్ మిత్ర, ఆశిష్ విద్యార్థి, విశాక్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 27, 2023న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆ యుద్ధ విమానాన్ని పైలెట్ గాలిలో ఎలా వదిలేశాడు? నిజంగా ఏం జరిగింది?
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫైటర్ జెట్ ఎఫ్-35 గత ఆదివారం తప్పిపోయింది. ఒక రోజు తర్వాత దాని ఆచూకీ లభ్యమయ్యింది. ఈ విషయాన్ని మిలటరీ అధికారులు ధృవీకరించారు. ఫైటర్ జెట్ అదృశ్యమైన తర్వాత దానిని కనుగొనేందుకు స్థానికులు సాయం చేయాలని సంబంధిత అధికారులు కోరారు. సౌత్ కరోలినాలోని నార్త్ చార్లెస్టన్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన తరువాత దాని జాడ తెలియరాలేదు. నివేదిక ప్రకారం విమానం ఎగురుతున్నప్పుడు దానిలో లోపం తలెత్తగా పైలట్ దానిని ఎజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఫైటర్ జెట్ నుండి పైలట్ తనను తాను ఎజెక్ట్ చేసినప్పుడు, అతను యుద్ధ విమానాన్ని ఆటో-పైలట్ మోడ్లో ఉంచాడు. విమానం నుంచి బయటకు వచ్చిన పైలట్ను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. అదే సమయంలో గాలిలో ఎగురుతున్న రెండవ ఎఫ్-35 సురక్షితంగా స్థావరానికి తిరిగి వచ్చింది. సైనిక అధికారులు అదృశమైన యుద్ధవిమాన శకలాలను గుర్తించారు. 100 మిలియన్ డాలర్ల విలువైన విమానానికి సంబంధించిన శకలాలు గ్రామీణ విలియమ్స్బర్గ్ కౌంటీలో లభ్యమైనట్లు మిలిటరీ అధికారులు తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునికతరహాలోని అమెరికాకు చెందిన మొట్టమొదటి స్టెల్త్ ఫైటర్ జెట్ విమానం. ఈ విమానం రహస్య మిషన్లను అత్యంత వేగంగా పూర్తి చేయగలదు. ఈ ఫైటర్ జెట్ పూర్తి పేరు ఎఫ్-35 లైట్నింగ్ 2. ఇది ఆల్-వెదర్ స్టీల్త్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. ఈ యుద్ధ విమానం అదృశ్యమైనప్పుడు, దాని భాగాలు అమెరికా శత్రు దేశాల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని అమెరికా అధికారులు ఆందోళన చెందారు. విమానాన్ని కనుగొనడంలో స్థానికుల సహాయాన్ని కోరుతూ, జాయింట్ బేస్ చార్లెస్టన్ ట్విట్టర్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. అయితే అతని విజ్ఞప్తి అనంతరం అతనిపై ఆన్లైన్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో ఆయన ఈ సంఘటన ఇంకా విచారణలో ఉంది. దర్యాప్తు ప్రక్రియ సమగ్రతను కాపాడటానికి మేము అదనపు వివరాలను అందించలేకపోతున్నామని తెలిపారు. BREAKING: The pilot ejected out of the $100 million F-35 jet that went missing due to "bad weather" according to the pilot (allegedly). One of the most advanced fighter jets in the world crashed because of bad weather... they think you are dumb. “He’s unsure of where his plane… pic.twitter.com/PNZShVok3M — Collin Rugg (@CollinRugg) September 20, 2023 కాగా ఎఫ్-35 జెట్ యుద్ధ విమానం ఖరీదు 100 మిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో 830 కోట్ల రుపాయలు. పైలెట్ తెలిపిన వివరాల ప్రకారం అననుకూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. పైలెట్ తాను నడుపుతున్న విమానం ఎక్కడ కూలిపోయిందో గుర్తించలేక పోయాడని, ఈ విషయాన్ని అతను చార్లెస్టన్ కౌంటీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కాల్లో చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలియజేసింది. కాగా అంతకుముందు ఆగస్టు చివరి వారంలో అమెరికాకు చెందిన రెండు విమానాలు కూలిపోయాయి. ఆగస్టు 27న ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న టీవీ దీవుల్లో శిక్షణ సమయంలో విమానం కూలి ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించారు. అంతకుముందు యూఎస్ మెరైన్ కార్ప్స్ ఎఫ్/A-18 హార్నెట్ ఫైటర్ జెట్ పైలట్ శాన్ డియాగో సమీపంలో ప్రమాదంలో మరణించాడు. ఇది కూడా చదవండి: మెన్స్ అండర్వేర్ విక్రయాలు ఎందుకు తగ్గాయి? మాంద్యంతో సంబంధం ఏమిటి? -
పాక్ బాంబు దాడికి బలైన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? ఆ రోజు ఏం జరిగింది?
ఆయన గుజరాత్ రెండో ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్ పితామహునిగానూ పేరొందారు. ఆయనే బల్వంత్ రాయ్ మెహతా. భారత్- పాక్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికుల చేతిలో హతమైన ఏకైక ముఖ్యమంత్రిగా ఆయన ఖ్యాతి గడించారు. 1965వ సంవత్సరంలో ఆయన మరణించారు. 1965, సెప్టెంబరు 19 న ఇండో-పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో నాటి గుజరాత్ సీఎం బల్వంత్రాయ్ మెహతా ప్రయాణిస్తున్న ఛాపర్ బీచ్క్రాఫ్ట్ భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లోని కచ్ మీదుగా వెళుతోంది. ఈ సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం సీఎం ప్రయాణిస్తున్న ఛాపర్పై బాంబు దాడి చేసింది. ఈ ప్రమాదంలో మెహతాతో పాటు మరో ఏడుగురు మరణించారు. వీరిలో ఆయన భార్య సరోజ్బెన్, ఒక జర్నలిస్టు కూడా ఉన్నారు. ఆ రోజు సీఎం బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న ఛాపర్ మిథాపూర్ నుండి కచ్కి బయలుదేరిన వెంటనే, దానిని పాకిస్తాన్ ఫైటర్ పైలట్ కైస్ హుస్సేన్ అడ్డగించాడు. పాకిస్తాన్ ఛాపర్ అడ్డగించడం చూసిన భారత పైలెట్ బీచ్క్రాఫ్ట్ ఫ్యాన్ రెక్కలను కదిలించాడు. ఇది దయ చూపించి, విడిచిపెట్టాలని కోరుతూ చేసిన సూచన. అయితే అప్పటికి పాక్ పైలట్ గాలిలోకి రెండుసార్లు కాల్పులు జరిపాడు. అవి బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న బీచ్క్రాఫ్ట్ను తాకాయి. అంతే.. హఠాత్తుగా బీచ్క్రాఫ్ట్ పేలిపోయి, నేల మీదకు ఒరిగిపోయింది. పలు నివేదికలలోని వివరాల ప్రకారం 25 ఏళ్ల వయసు కలిగిన పాకిస్తాన్ పైలెట్ హుస్సేన్ ఆ రోజు 20 వేల అడుగుల ఎత్తులో తన ఛాపర్తో భారత గగనతలంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో నాటి గుజరాత్ సీఎం ప్రయాణిస్తున్న బీచ్క్రాఫ్ట్ను గుజరాత్ ప్రభుత్వ చీఫ్ పైలట్ జహంగీర్ నడుపుతున్నారు. ఆయన భారత వైమానిక దళంలో పైలట్, కో-పైలట్గా పనిచేశారు. ఈ ఘటన జరిగిన 46 ఏళ్ల తర్వాత పాక్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ పైలెట్ హుస్సేన్ ఒక లేఖలో దివంగత సీఎం బల్వంత్ రాయ్ మెహతా కుమార్తెకు క్షమాపణలు తెలిపారు. ఈ లేఖకు ఆమె సమాధానమిస్తూ, తాను తన తండ్రి హంతకుడిని క్షమిస్తున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్కు రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన బల్వంత్ రాయ్ మెహతా 1963 జూన్ నుండి 1965 సెప్టెంబర్ 1965 వరకు పదవిలో ఉన్నారు. ఇది కూడా చదవండి: సౌరభ్ చంద్రకర్ ఎవరు? పెళ్లి నేపధ్యంలో ఈడీకి ఎందుకు చిక్కాడు? -
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ
దొండపర్తి(విశాఖ దక్షిణ): దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం అన్నారు. అందుకే నీతి ఆయోగ్ పైలట్ నగరాల జాబితాలో ముంబై, సూరత్, వారణాసితో పాటు విశాఖకు స్థానం కల్పించినట్లు చెప్పారు. మంగళవారం విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పరిశ్రమల శాఖ అధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడి సహజవనరులతో పాటు రైల్వే, పోర్టు కనెక్టవిటీలు, విమానాశ్రయం విశాఖపట్నం అభివృద్ధికి మరింత దోహదపడుతాయన్నారు. విజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, నగర అభివృద్ధి కోసం ఆర్థిక ప్రణాళికలు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ విశాఖ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. నగర ప్రణాళిక, పర్యాటకం, విద్య, ప్రజారోగ్యం, ఈ–గవర్నెన్స్ తదితర అంశాలపై సాధించిన ప్రగతిని తెలియజేశారు.బీఆర్టీఎస్ నెట్వర్క్, నగరవ్యాప్తంగా మంచినీటి సరఫరా వ్యవస్థ వివరాలను వివరించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా బీచ్ రోడ్డులో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పరిశ్రమలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల పరిస్థితులను తెలియజేశారు. విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు మాట్లాడుతూ.. ఒడిశా, తెలంగాణ, కర్ణాటకకు సంబంధించిన పలు ఎగుమతులు, దిగుమతులు కూడా విశాఖ కేంద్రంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులు పార్థసారధి, పరిశ్రమల శాఖ జీఎం సి.హెచ్.గణపతి, టూరిజం ఆర్డీ శ్రీనివాసరావు, సీపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రెండు చేతులూ లేవు..పైలట్గా రికార్డ్! ఈమె గురించి తెలిస్తే, గూస్బంప్స్ ఖాయం!
The Success Story Jessica Cox శరీరంలో ఏదైనా ఒక అవయవ లోపం ఉంటేనే కృంగిపోతారు చాలామంది. కానీ కొందరు మాత్రం ఎలాంటి లోపం ఉన్నాదాన్ని చాలెంజ్గా స్వీకరిస్తారు. అద్బుతమైన కృషితో పట్టుదలతో తామేంటే నిరూపించుకుంటారు. అలా రెండు చేతులు లేకపోయినా పైలట్గా రాణిస్తోంది. జెస్సికా ప్రపంచంలోనే తొలి చేతులు లేని లైసెన్స్ పొందిన తొలి పైలట్గా చరిత్ర సృష్టించింది.వండర్ విమెన్ అమెరికాకు చెందిన జెస్సికా కాక్స్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం. అరుదైన పుట్టుకతో వచ్చే లోపం కారణంగా జెస్సికాకు పుట్టుకతోనే నుండే రెండు చేతులు లేవు. అయినా ఆమె తల్లిదండ్రులు ఏమాత్రం బాధపడలేదు.అలాగే జెస్సికా కూడా రెండు చేతులు లేకపోయినా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. లేని చేతుల గురించి బాధపడుతూ కూర్చోలేదు. తన రెండు కాళ్లే చేతులుగా మార్చుకుంది.రెండు కాళ్లతో సాధారణ ప్రజలు ఎలాంటి పనులు చేసుకుంటారో అంతే సునాయాసంగా తానూ అలవాటు చేసింది. కొన్నాళ్లపాటు కృత్రిమ చేతులు ధరించినా ఆ తరువాత వాటిని కూడా తీసివేసింది. అరిజోనాలోని సియెర్రా విస్టాలో 1983లో జన్మించిన జెస్సికా తన పాదాలతో తన జీవితాన్ని గడపడం నేర్చుకుంది. చిన్నతనంలో, ఆమె తన సొంత పట్టణంలో నృత్యం అభ్యసించింది. 14 సంవత్సరాలు నృత్యం కొనసాగించింది. (ఉద్యోగానికి అప్లయ్ చేస్తే.. ఇదేందయ్యా ఇది, ఎక్కడా సూడ్లా!) 22 ఏళ్ల వయసులో పైలెట్గా శిక్షణ పొందింది. లెట్గా శిక్షణ పొందింది.కేవలం మూడు సంవత్సరాల్లో పైలెట్గా పూర్తి చేసింది. అంతేకాదు ఈత కొట్టడం, డ్రైవింగ్ చేయడం (కారు), విమానం నడపడంలో ప్రావీణ్యం సంపాదించింది. 2008, అక్టోబరు 10న జెస్సికా తన పైలట్ సర్టిఫికేట్ను పొందింది. ఆమె 10,000 అడుగుల ఎత్తులో తేలికపాటి క్రీడా విమానాన్ని నడిపేందుకు అర్హత పొందింది.2004లో, జెస్సికా మొదటిసారిగా రైట్ ఫ్లైట్ ద్వారా సింగిల్ ఇంజిన్ విమానాన్ని నడిపింది. రెండు ముఖ్యమైన అవయవాలు లేనప్పటికీ టైక్వాండోలో రెండు బ్లాక్ బెల్ట్లను కూడా సంపాదించింది. 2019లో, కాక్స్ నాల్గవ డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించింది. అమెరికన్ టైక్వాండో అసోసియేషన్లో బ్లాక్ బెల్ట్ సంపాదించిన చేతులు లేని తొలి వ్యక్తి. (మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్) జెస్సికా కాక్స్ అచీవ్ మెంట్స్ ♦ జెస్సికా యునైటెడ్ స్టేట్స్లోని అరిజోనా విశ్వవిద్యాలయం నుండి మనస్తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది. ♦బ్రాండ్లారేట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ పర్సనాలిటీ అవార్డు ♦AOPA LIVE పైలట్స్ ఛాయిస్ అవార్డ్ 2010: జెస్సికా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడిన మహిళా ఏవియేటర్గా మారింది. ♦ఫిలిపినో ఉమెన్స్ నెట్వర్క్: 2009లో అమెరికాలో టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన ఫిలిపినో మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. ♦ది సక్సెస్ స్టోరీ జెస్సికా కాక్స్ 2009లో రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్లో కూడా పబ్లిష్ అయింది. ఇదీ చదవండి: క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి! ♦ ఫిలిపినో అమెరికన్ జర్నల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ , 2008లో అత్యుత్తమ ఫిలిపినో అవార్డు లభించింది. ‘♦ ‘వైకల్యం అంటే అసమర్థత కాదు" అని రైట్ఫుటెడ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ మిషన్ను ప్రచారం చేయడానికి తాను విమానాన్ని ఉపయోగిస్తానని ఆమె పేర్కొంది ♦ 2015లో కాక్స్ తన జీవితంలో నేర్చుకున్న పాఠం ద్వారా స్వంత సవాళ్లను అధిగమించడానికి ప్రజలను ప్రేరేపించేలా డిసార్మ్ యువర్ లిమిట్స్ అనే పుస్తకాన్ని రచించారు. దాదాపు 26 దేశాల్లో మోటివేషనల్ స్పీకర్ కూడా -
చేతివాచీని పోగొట్టుకున్న పైలట్.. ఐదు నిముషాల్లో దక్కిందిలా!
హనా మొహ్సిన్ ఖాన్ అనే కమర్షియల్ పైలట్ ఇటీవల దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తన రిస్ట్వాచీని పోగొట్టుకున్నారు. అయితే దానిని సురక్షితంగా అందజేసిన ఎయిర్పోర్టు సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పంచుకున్నారు. హనా మొహ్సిన్ ఖాన్ దుబాయ్ నుంచి తిరుగు ప్రయాణంలో విమానాశ్రయంలోని డ్యూటీ ఫ్రీ షాపును సందర్శించారు. భద్రతా తనిఖీ సమయంలో తన చేతి గడియారాన్ని తీసినప్పుడు.. అక్కడే మరచిపోయారు. కొద్దిసేపటి తరువాత తన గడియారం మిస్సయిన సంగతి గ్రహించారు. తన గడియారం పోయినట్లేనని, ఇక దొరకదని మొదట్లో అనుకున్నారు. అయితే మిస్సయిన చేతివాచీ కోసం ఒకసారి ప్రయత్నిద్దామనే ఉద్దేశంతో ఆమె దుబాయ్లోని గ్రౌండ్ స్టాఫ్ను సంప్రదించారు. దుబాయ్ ఎయిర్పోర్ట్లోని లాస్ట్ అండ్ ఫౌండ్ డిపార్ట్మెంట్కి ఈ-మెయిల్ పంపారు. ఈ నేపధ్యంలో ఆ డిపార్ట్మెంట్ బృందం ఆమె రిస్ట్వాచీని కనుగొంది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో ఆమె తన వాచీని తిరిగి తీసుకోగలిగారు. దీంతో లాస్ట్ అండ్ ఫౌండ్ డిపార్ట్మెంట్ బృందాన్ని ఆమె అభినందించారు. దుబాయ్ విమానాశ్రయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె తన పోస్ట్ను ముగించారు. ఈ పోస్టును చూసిన యూజర్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తాము మిస్సయిన, తిరిగి పొందిన వస్తువుల గురించిన వివరాలను షేర్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: గాలి తగిలితే వణుకు, నీటిని చూస్తే భయం.. రేబిస్తో 14 ఏళ్ల బాలుడు మృతి! Last month while operating a Dubai back flight I had gone to the duty free. During the security check I had taken my watch off and forgot to pick it up. I had thought it was forever lost when I was flying back and discovered that I no longer had it. I contacted my ground staff in… pic.twitter.com/GDP2vpBcsO — Hana Mohsin Khan | هناء (@girlpilot_) September 4, 2023 -
30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ రాఖీ వేడుక: వీడియో వైరల్
రక్షా బంధన్ అనేది తోబుట్టువుల మధ్య ప్రత్యేకమైన బంధానికి సంబంధించిన వేడుక. ఈ శుభ సందర్భాన్ని దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే చాలా మంది సోదర సోదరీమణులు ఒకరికొకరు ఈ రోజు కలవడం కుదరకపోవచ్చు. వృత్తి పరమైన ఇబ్బందులతోపాటు అనేక కారణాల రీత్యా తమ సోదరులను మిస్ అవుతూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో ఈ పండుగ రోజున అనూహ్యంగా కలుసుకొని, రాఖీ వేడుక చేసుకుంటారు. అలాంటి సంఘటన ఒకటి ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. ఇండిగో ఎయిర్లైన్స్ క్యాబిన్ క్రూ మెంబర్ అయిన శుభకు అలాంటి అదృష్టం వరించింది. ఇండిగో విమాన పైలట్గా ఉన్న తన సోదరుడు గౌరవ్తో కలిసి రక్షాబంధన వేడుక జరుపుకోవడం ముచ్చటగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. (రక్షాబంధన్ అందరిదీ..అపోలో టైర్స్ యాడ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో) విమానం టేకాఫ్కి ముందు ప్రయాణికులకు శుభ ప్రత్యేక ప్రకటనతో వీడియో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం పండుగలు, ప్రత్యేక క్షణాలను జరుపుకోవడం అన్ని సార్లూ సాధ్యపడదు. ముఖ్యంగా మాకు..ఎందుకంటే మీ ప్రియమైన వారితో కలిసి వేడుకు జరపుకునేలా మిమ్మల్ని ఇంటికి తిరిగి తీసుకెళ్లడం ముఖ్యం కాబట్టి అంటూ ఫ్లైట్ ఇంటర్ఫోన్ సిస్టమ్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ రోజు నాకు అన్నకెప్టెన్ గౌరవ్కు చాలా ప్రత్యేకమైన రోజు, చాలా ఏళ్ల తర్వాత కలిసి రక్షా బంధన్ జరుపుకుంటున్నాం అని ప్రకటించారు. అందరి అన్నాచెల్లెళ్లలాగానే మేమూ కొట్టుకుంటాం,తిట్టుకుంటాం,నవ్వుకుంటాం..ఏడుస్తాం... కానీ నాకు మాత్రం నా అన్న రాక్, నా బెస్ట్ ఫ్రెండ్, నాకు పెద్ద ఆలంబన అంటూ అంటూ శుభ సోదరుడికి రాఖీ కట్టి, అన్న ఆశీర్వాదం తీసుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో ప్రయాణీకులు అందరూ ప్రయాణికులు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు. 30వేల అడుగల ఎత్తున ఉన్నా, భూమి మీద ఉన్న ఎక్కడున్నా బ్రదర్ అండ్ సిస్టం బాండింగ్ స్పెషల్ అంటూ ఈ వీడియోను ఇండిగో చేసిన ట్వీట్ చేసింది. At 30,000 feet or on the ground, the bond of a brother and sister remains special. A heartwarming moment on board today as our Check Cabin Attendant Shubha celebrates Rakhi with her brother Capt. Gaurav. #HappyRakshaBandhan2023 #HappyRakhi #goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/WoLgx8XoIa — IndiGo (@IndiGo6E) August 30, 2023 -
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘోరప్రమాదం తప్పింది
ఢిల్లీ: బుధవారం మధ్యాహ్నాం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘోరప్రమాదం తప్పింది. విస్తారా ఎయిర్లైన్స్కే చెందిన రెండు విమానాలు ఒకే రన్వేలో ఎదురెదురుగా వచ్చాయి. కాస్తుంటే అవి రెండూ ఢీ కొట్టుకుని పెను విషాదం చోటు చేసుకునేది. అయితే ఓ విమానంలోని మహిళా పైలట్ అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి చేరిన విస్తారా విమానం.. బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పర్యవేక్షణలో పార్కింగ్ బే వైపు చేరుకునేందుకు సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో ఢిల్లీ-బాగ్డోగ్రా(పశ్చిమ బెంగాల్) విస్తారా విమానానికి అదే రన్వే నుంచి టేకాఫ్కు అనుమతిచ్చారు. అయితే రెండు విమానాలు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉండగా.. అహ్మదాబాద్-ఢిల్లీ ఫ్లైట్లో ఉన్న కెప్టెన్ సోనూ గిల్(45) జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను అప్రమత్తం చేశారు. దీంతో.. ఘోర ప్రమాదం తప్పింది. ఆ వెంటనే టేకాఫ్ రద్దు చేసి.. ఢిల్లీ-బాగ్డోగ్రా విమానాన్ని తిరిగి పార్కింగ్ వైపు మళ్లించారు. రెండు విమానాల్లో కలిపి 300 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు.. అది ఈ మధ్యే ప్రారంభమైన రన్వే. ఒకవేళ ఆమె(సోనూ గిల్) గనుక అప్రమత్తం చేయకుండా ఉండి ఉంటే ఘోర ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు అంటున్నారు. ఏటీసీ అధికారి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని డీజీసీఏ(పౌర విమానయాన శాఖ) ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు సంబంధిత అధికారిని విధుల నుంచి తప్పించినట్లు ప్రకటించింది. A potentially catastrophic incident was narrowly averted at #Delhiairport on Wednesday morning when a #Vistara Airlines plane was cleared for take-off while another aircraft was in process of landing. The incident involved Flight UK725 en route from #Delhi to #Bagdogra,… pic.twitter.com/5GnT7RixLF — Thomas Nahar (@Thomasnahar_gfx) August 23, 2023 -
వరుసగా మృతిచెందుతున్న పైలట్లు.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: మియామి నుండి చిలీ ప్రయాణిస్తున్న విమానంలో పైలెట్ బాత్రూమ్లో కుప్పకూలి మృతి చెందిన సంఘటన మరువక ముందే రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ పైలట్లు రెండు వేర్వేరు సంఘటనల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ శాఖ డైరెక్టరేట్ జనరల్ ధృవీకరించారు. మృతి చెందినవారిలో ఒకరు ఇండిగో ఎయిర్ లైన్స్ కెప్టెన్ కాగా మరో పైలట్ ఖతార్ ఎయిర్ లైన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇండిగో కెప్టెన్ ఈరోజు నాగ్పూర్ నుండి పూణే విమాన సర్వీసు నడిపించాల్సి ఉండగా నాగ్పూర్ బోర్డింగ్ గేటు వద్దే స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించాయి ఆసుపత్రి వర్గాలు. ఈయన రెండు సెక్టార్లు ఆపరేట్ చేశారని ఉదయం 3 గంటల నుండి 7 గంటల వరకు ట్రివేండ్రం నుండి పూణే మీదుగా నాగ్పూర్ చేరుకున్నారని అనంతరం 27 గంటల విరామం తర్వాత ఈరోజు నాలుగు సెక్టార్లు ఆపరేట్ చేయాల్సి ఉందని సివిల్ ఏవియేషన్ శాఖ వెల్లడించింది. కానీ అంతలోనే ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు నాగ్పూర్ విమానాశ్రయంలోని బోర్డింగ్ గేటు వద్ద కుప్పకూలి మృతి చెందారు. ఖతార్ ఎయిర్ లైన్స్ పైలట్ మాత్రం నిన్న అదనపు సిబ్బందిగా ఢిల్లీ దోహా ఫ్లైట్లో పాసింజర్ క్యాబిన్ లో ప్రయాణిస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. అంతకు ముందు ఈయన స్పైస్ జెట్, అలయన్స్ ఎయిర్, సహారా ఎయిర్ లైన్స్ కు పనిచేశారు. ఇలా వరుస రోజుల్లో పైలట్లు గుండెపోటుతో మృతి చెందడంతో సివిల్ ఏవియేషన్ వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు..
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement