-
ఖరీదైన బంగ్లాలోకి హీరోయిన్ పూజాహెగ్డే.. రేట్ తెలిస్తే మైండ్ బ్లాకే!
పూజా హెగ్డే.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా వరస సినిమాలు చేసింది. కానీ వరస ఫ్లాపుల దెబ్బకు పూర్తిగా ఈమెకు ఇక్కడ పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయాయి. ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఫామ్ లో లేనప్పటికీ కోట్లు ఖరీదు చేసే బంగ్లాలోకి మారనున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య) మోడల్ గా కెరీర్ ప్రారంభించిన పూజాహెగ్డే.. తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. 'ముకుంద' అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'డీజే', 'అరవింద సమేత', 'అల వైకుంఠపురములో' తదితర చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టింది. స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. తర్వాత వరస ఫ్లాప్స్ దెబ్బకు టాలీవుడ్ నుంచి సైడ్ అయిపోయింది. ప్రస్తుతం హిందీలో దేవా, శంకీ అనే చిత్రాలు చేస్తున్న పూజా.. ముంబయిలోని బాంద్రాలో దాదాపు రూ.45 కోట్లు విలువ చేసే మేన్షన్ లోకి మారనుందట. ఇది సమద్రం ఫేసింగ్ తో ఉండటంతో పాటు దాదాపు 4000 S.ft విస్తీరణం ఉంది. ఇంకా చాలా సదుపాయాలే ఉన్నాయట. అయితే పూజా హెగ్డే.. దీన్ని కొనేసిందా? అద్దె ప్రాతిపదికన తీసుకుందా అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: పెంపుడు కుక్క కోసం కోర్టు మెట్లెక్కిన ప్రముఖ హీరోయిన్) -
సాధారణ వ్యక్తి ప్రేమలో 'పూజా హెగ్డే'.. ఫోటోలు వైరల్
రెండేళ్ల క్రితం వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్ పూజా హెగ్డే (33).. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అగ్ర హీరోలతో నటించి మెప్పించిన ఈ పొడుగు కాళ్ల సుందరి ఇప్పుడు మరోసారి సినిమాలతో బిజీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఫస్ట్ టైం తన బాయ్ ఫ్రెండ్తో కెమెరా కంటికి చిక్కింది ఈ బ్యూటీ. గతేడాది, పూజా హెగ్డే ఒక క్రికెటర్తో డేటింగ్లో ఉందని, త్వరలో అతనితో పెళ్లి చేసుకోనుందని ఊహాగానాలు వచ్చాయి. కొంత కాలం తర్వాత ఆ ఊహాగానాలు కేవలం పుకార్లు మాత్రమే అని తేలింది. దీంతో ఆమె అభిమానులకు ఉపశమనం కలిగింది. అయితే, పూజా హెగ్డే రొమాంటిక్ లైఫ్ గురించి ఇప్పుడు తాజాగా మళ్లీ పుకార్లు వ్యాపించాయి. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న ప్రకారం.. బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో (33) ఆమె డేటింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిద్దరూ కలిసి కారులో ప్రయాణిస్తున్న దృశ్యాలతో పాటుగా ముంబైలోని హోటల్లు, రెస్టారెంట్లకు తరచూ వెళ్లడం కనిపించిందని చెబుతున్నారు. రోహన్ మెహ్రా కూడా ఇది వరకే స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 ఫేమ్ 'తారా సుతారియా'తో రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికీ వారిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. అతను ఇప్పుడు పూజా హెగ్డేతో ప్రేమాయణం సాగిస్తున్నాడని ఆరోపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త పూజా హెగ్డేను అభిమానించే వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరీ రోహన్ మెహ్రా ఉత్తరాంచల్కు చెందిన రోహన్ మెహ్రా ఇంకా బాలీవుడ్లో చెప్పుకోదగిన సినిమాల్లో నటించలేదు. అతని నటించిన రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. కానీ 200 కంటే ఎక్కువ టీవీ వాణిజ్య ప్రకటనలతో పాటు ప్రింట్ యాడ్స్ చేశాడు. హిందీ బిగ్ బాస్ 10వ సీజన్లో సెలబ్రిటీ కంటెస్టెంట్గా ప్రవేశించిన రోహన్ 5వ స్థానంలో నిలిచాడు. ఆయన ఎక్కువగా టీవీ షోల వరకే పరిమితం అయ్యాడు. అలా బాలీవుడ్లో మంచి గుర్తింపు పొందాడు. అంతటి సాధారణ వ్యక్తిని పూజా హెగ్డే ప్రేమించడం జరగదని ఆమె అభిమానులు తెలుపుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పూజా హెగ్డే స్పందించలేదు. మరి అతను నిజంగానే బుట్టబొమ్మ బాయ్ ఫ్రెండా? లేక వారిద్దరూ జస్ట్ ఫ్రెండ్సా అనేది పూజా రివీల్ చేస్తే కానీ ఎవరికీ తెలియదు. సల్మాన్తో రిలేషన్.. అప్పుడు పూజా రియాక్షన్ ఇదే బాలీవుడ్ బడా హీరో సల్మాన్ఖాన్తో పూజా హెగ్డే ప్రేమలో ఉందంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.. వాటిపై గతేడాది ఆమె ఇలా రియాక్ట్ అయింది. 'నా గురించి తరచూ ఎన్నో వార్తలు వస్తుంటాయి. వాటన్నింటినీ నేను చదువుతూనే ఉంటాను. వాటిని పెద్దగా పట్టించుకోను. ప్రస్తుతానికి నేను సింగిల్నే. నాకు సింగిల్గా ఉండటమే ఇష్టం. అలాగే, నా ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది. వేర్వేరు భాషల్లో మరెన్నో చిత్రాల్లో నటించాలని ఉంది. అదే నా లక్ష్యం. ఇలాంటి వదంతులపై స్పందించే సమయం కూడా నాకు లేదు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను.' అని ఆమె స్పష్టం చేశారు. #Poojahegde with her boy friend 💔pic.twitter.com/JhtUYaISm8 — Kolly Censor (@KollyCensor) March 31, 2024 -
పదేళ్ల తర్వాత...
హీరో నాగచైతన్య, హీరోయిన్ పూజా హెగ్డే మరోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. 2014లో విడుదలైన ‘ఒక లైలా కోసం’ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటించనున్నారని టాక్. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు నాగచైతన్య. ఆ తర్వాతి చిత్రాన్ని ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేయనున్నారట. నాగచైతన్య కోసం మిస్టరీ, పౌరాణిక, థ్రిల్లర్ అంశాలతో కథ రెడీ చేస్తున్నారట కార్తీక్ దండు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన పూజా హెగ్డేని కథానాయికగా తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారని భోగట్టా. ఇక 2022లో విడుదలైన ‘ఆచార్య’ సినిమా తర్వాత (‘ఎఫ్ 3’లో ప్రత్యేక పాట చేశారు) మరో తెలుగు సినిమా కమిట్ కాలేదు పూజాహెగ్డే. నాగచైతన్యతో నటించే తాజా చిత్రం ఆమెకు తెలుగులో పెద్ద కమ్బ్యాక్ అవుతుందని టాక్. ప్రస్తుతం బాలీవుడ్లో ‘దేవా’ అనే సినిమా చేస్తున్నారు పూజా హెగ్డే. -
బుట్టబొమ్మకు నయనతార ఎఫెక్ట్ !
-
మూడోసారి తెలుగు స్టార్ హీరోతో జోడీ?
హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే ముచ్చటగా మూడోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవునంటోంది ఫిల్మ్నగర్ సర్కిల్. ఈ ఇద్దరూ ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’ (2019), ‘అల వైకుంఠపురములో’ (2020) వంటి చిత్రాల్లో జంటగా నటించి, హిట్ పెయిర్గా నిలిచారు. ఇక 2002లో విడుదలైన ‘ఆచార్య’ తర్వాత మరో తెలుగు చిత్రంలో హీరోయిన్గా నటించలేదు పూజా హెగ్డే. అయితే ‘ఎఫ్ 3’ సినిమాలో వెంకటేశ్, వరుణ్ తేజ్లతో కలిసి ప్రత్యేకపాటలో కనిపించారు. ఇప్పుడు కథానాయికగా అల్లు అర్జున్ సినిమాకి చాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఆ తర్వాత ఆయన పని చేయనున్న దర్శకుల జాబితాలో త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, అట్లీ కుమార్, సందీప్ రెడ్డి వంగా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అట్లీతోనే తన తర్వాతి చిత్రం చేయనున్నారట అల్లు అర్జున్. ఈ చిత్రంలోనే పూజాహెగ్డే హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. మరి.. అల్లు అర్జున్తో మూడోసారి హీరోయిన్గా నటించే అవకాశం పూజా హెగ్డేకి దక్కిందా అనే విషయంపై స్పష్టత రావాలంటే వేచి చూడాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement