-
గీతాంజలికి న్యాయం జరగాలి.. ‘జల్సా’ తో కట్టుకథ అల్లారు: పూనమ్ కౌర్
టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పేరిట ఇంటి పట్టా ఇచ్చారని, పిల్లలను చదించడానికి అమ్మఒడి పథకం కింద డబ్బులు అందించారని, ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ వైఎస్సార్సీపీయే గెలుస్తుదని ఆమె చెప్పిన మాటలు వైరల్ కావడంతో.. ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు గీతాజంలిపై అసత్యాలను ప్రచారం చేశారు. ఆమెను ట్రోల్ చేస్తూ మానసికంగా హింసించారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకల దాడికి తట్టుకోలేక గీతాంజలి రైలు కిందపడి చనిపోయింది. ఈ విషాదాకర ఘటనపై నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ.. గీతాంజలికి న్యాయం జరగాలని డిమాండ్ చేసింది. అలాగే ‘జల్సా’ సినిమా సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై కూడా స్పందించింది. గీతాంజలికి న్యాయం జరగాలి ‘గీతాంజలికి న్యాయం జరగాలి. అసలు ఆమె విషయంలో ఏం జరిగింది? గీతాంజలి ఎందుకు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది? ఓ పార్టికి చెందిన ఆన్లైన్ ట్రోలర్స్ కారణంగానే ఆమె చనిపోయిందా? అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం వారికి బాగా అలవాటు. దయచేసి వారిని శిక్షించండి. ఆ పసి పిల్లలకు న్యాయం చేయండి’ అని పూనమ్ ట్వీట్ చేసింది. అవన్నీ పుకార్లు మాత్రమే సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారనే ఎక్కువ పాపులర్ అయ్యారు పూనమ్ కౌర్. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్లపై ఆమె చేసే ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. వీరిద్దరి బాగోతాలను నిర్భయంగా బయటపెట్టే ఏకైక నటి పూనమ్ మాత్రమే. అందుకే పవన్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తుంటారు. అంతేకాదు ఆమెపై ఓ కట్టుకథను కూడా అల్లారు. జల్సా సినిమాలో అవకాశం అడిగే ఇవ్వలేదని.. అందుకే ఆమె వారిద్దరిని టార్గెట్ చేసిందని ప్రచారం చేశారు. (చదవండి: సోషల్ మీడియా సైకోలు.. గీతాంజలి చేసిన తప్పేంటి?) తాజాగా దీనిపై స్పందించింది పూనమ్ కౌర్. అవన్నీ పూకార్లు మాత్రమేనని.. తాను ఇంత వరకు ఎవ్వరినీ కూడా అవకాశాలు అడుక్కోలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు నటన మీద మాత్రమే ఆదారపడకుండా ఎప్పుడూ ప్రత్యామ్నాయ జీవన మార్గాల కోసం వెతుకుతుంటానని చెప్పింది. తాను నటించిన సినిమాల కంటే తిరస్కరించిన సినిమాలే ఎక్కువని, దయచేసి అలాంటి రూమర్స్ నమ్మకండి అని మరోసారి తన అభిమానులను కోరింది పూనమ్. #JusticeForGeetanjali , I was confused about who led her to committing suicide , whether it’s online trollers of a particular party who are truly capable of physiologically abusing a woman or a volunteer who seems to go invisible. Please punish . Young girl kids deserve justice. — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 12, 2024 -
పూనమ్ కౌర్ ట్వీట్.. సీఎం జగన్ సాయం మరోసారి తెరపైకి
నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటుంటారు. సామాజిక, రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో ఆమె స్పందిస్తూ ఉంటారు. కరోనా సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై కొద్దిరోజుల క్రితం ఆమె ప్రసంశించారు. 'కోవిడ్ మహామ్మారి విజృభించిన సమయంలో చేనేత కార్మికులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతగానో అండగా నిలిచిందని ఆమె కొనియాడారు. చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా తాను ఈ మాటలు చెబుతున్నానని ఆమె తన ఎక్స్ పేజీలో పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఏపీ ప్రభుత్వం ఆదుకున్న తీరుపై నెటిజన్లు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికలయిపోయి, బంపర్ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాదిలోనే కోవిడ్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఏడాదిలోనూ పూర్తిగా కోవిడ్ ఆంక్షల మధ్యనే ఆయన పాలన సాగింది. అలా రెండేళ్ల పాటు కరోనాపై ఏపీ ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాల ఆర్థిక స్థితిగతులు తలక్రిందులయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాత్రం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎనలేని మేలు చేశాయి. ఆ పరిస్థితుల్లో ఎందరో ఉపాధి కోల్పోయి లక్షల మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. పనిచేస్తున్న చోట కరోనా పేరుతో జీతాలలో కోతలు పడటమే కాకుండా ఉన్న ఉద్యోగాలను కూడా కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో అనేక మందికి సీఎం జగన్ ఇస్తున్న ఈ పథకాలు ఎంతో లబ్ధిని చేకూర్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రైతులు, అమ్మ ఒడి లబ్ధిదారులు, చేతి వృత్తుల వాళ్లు, కుల వృత్తుల వాళ్లు, ఆటోలు నడుపుకునే వాళ్లు, పూజారులు, పాస్టర్లు, ఇమామ్ లు.. ఇలా వాళ్లూ వీళ్లూ అనే తేడాలు లేవు. కులాల వారీగా కూడా సంక్షేమ పథకాలు వేరే! ప్రజల క్షేమం కోరుకున్న ఆయనపై ప్రతి పక్షాల నుంచి విమర్శలు వచ్చినా, పంచుడు కార్యక్రమాలు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నా.. సీఎం జగన్ తన దారిలో వెనక్కు తగ్గలేదు. అప్పు చేసైనా సరే ముందుగా ప్రజల ఆకలి తీర్చాలని జగన్ భావించారు. కరోనా సమయంలో కేవలం రేషన్ సరకులు పంపించి కేంద్రం చేతులు దులుపుకుంది. అలాంటి పరిస్థితిలో కూడా ప్రతి సామాజిక వర్గానికి ఏదో ఒక రూపంలో నగదు బదిలీ చేస్తూ ఆర్థికంగా ఆదుకున్నారు. అలాంటి సమయంలో వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి అండగా నిలిచింది. అప్పుడు ఆ వ్యవస్థ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాల్లో పరిపాలన, సంక్షేమ పథకాలు కుంటుపడగా.. ఏపీలో మాత్రం ఇంటింటికి సంక్షేమ ఫలాలు, రేషన్, పింఛన్లు క్రమం తప్పకుండా అందాయి. దీనంతటికి కారణం సీఎం జగన్ తీసుకున్న డైనమిక్ నిర్ణయాలు అని చెప్పవచ్చు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థపై దేశవ్యాప్తంగా అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. కరోనా కష్టకాలంలో ఎవరు ఏంటి? అనే విషయం అప్పట్లో క్లియర్గా తేలిపోయింది. రోగానికి భయపడి చంద్రబాబు, పవన్ హైదరాబాద్కే పరిమితం అయ్యారు. కానీ సీఎం జగన్ మాత్రం తన మంత్రుల సమీక్షలతో ప్రజలకు నిత్యం టచ్లో ఉన్నారు. అలాంటి కష్ట-నష్ట కాలంలో కూడా ప్రజల బాగోగులు పట్టించుకున్న ఏకైక సీఎంగా రికార్డులకెక్కారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో పారాసెట్మాల్ వేసుకోమని జగన్ గారు చెబితే ప్రతిపక్ష నేత చంద్రబాబు కామెడీ చేశారు, కరోనాతో సహజీవనం చేయాల్సిందేనంటే ఎకసెక్కాలాడారు. అలా నోరు చేసుకున్నోళ్లంతా చివరకు సీఎం జగన్ చెప్పిన సూత్రాలనే ప్రపంచవ్యాప్తంగా పాటించారు. కోవిడ్ సమయంలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న దశలోనూ ఎలాగైనా ప్రజలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఆయన అనునిత్యం తపనపడ్డారు. మరోవైపు కరోనా కట్టడిపై ఏపీని దేశానికే ఆదర్శంగా మార్చారు జగన్. అత్యథిక వ్యాధి నిర్థారణ పరీక్షలు జరిపిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించిందంటే ఆ ఘనత జగన్ది కాక ఇంకెవరిది. కనీసం తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ టీకాలు కూడా దొరకకపోవడంతో బార్డర్ దగ్గరగా ఉన్న ప్రజలు ఏపీలోకి వచ్చి టీకాలు తీసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని తమ ఇంటికి సంతోషంగా వెళుతున్న సమయంలో రూ. 2000 వారి జేబులో పెట్టి పంపించారు. లాక్డౌన్ సమయంలో వాహనాలు లేకపోవడంతో కాలినడక ద్వార తమ గమ్యానికి చేరుకోవాలని ఎందరో రోడ్డు బాట పట్టారు. వారిలో కొందరికి కనీసం చెప్పులు కూడా లేని పరిస్థితి. అలాంటి వారి కోసం పలు చోట్ల చెప్పుల స్టాండ్లను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏదేమైనా పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది లాగే సీఎం జగన్ కూడా అసలైన కరోనా వారియర్ అని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేసేవారు. కరోనా కష్ట సమయంలో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ప్రజల పట్ల చూపిన అంకిత భావాన్ని పూనమ్ తాజాగా కొనియాడటంతో మరోసారి నెటిజన్లు కూడా ఆనాటి రోజులను ఇలా గుర్తు చేసుకుంటున్నారు. #ysrcp has done the best job for weavers during pandemic and I am as an activist extremely greatfull for this . — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 6, 2024 -
సీఎం జగన్ పై నటి పూనమ్ ప్రశంసలు
-
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై హీరోయిన్ పూనమ్ కౌర్ ప్రశంసలు
కరోనా సమయంలో చాలా రాష్ట్రాలు పేద ప్రజలకు ఇచ్చే పథకాలు అన్నీ ఆపేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమం ఆపకుండా ప్రజలకు అందించారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ అధిక ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త పడ్డారు. కోవిడ్ బారిన పడిన వారికి మెరుగైన చికిత్సను అందించి..దేశానికే ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు కోవిడ్–19 , బ్లాక్ ఫంగస్ చికిత్సలనూ ఆరోగ్య శ్రీలోకి చేర్చి లక్షల మంది పేదల బతుకుల్ని ఆర్థిక మహమ్మారి కాటేయకుండా కాపాడారు. కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం చేసిన కృషి పట్ల దేశ ప్రధానితో పాటు పలు రాష్ట్రాల సీఎంలు ప్రశంసలు కురిపించారు. తాజాగా కరోనా సమయంలో వైఎస్సార్సీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ సీఎం జగన్ ను ప్రశసించారు. ‘కోవిడ్ మహామ్మారి విజృభించిన సమయంలో చేనేత కార్మికులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. వారి కోసం చాలా మంచి పనులు చేసింది. చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా చెబుతున్నా ఇది చాలా గొప్ప విషయం’ అని పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పూనమ్ కౌర్ విషయానికొస్తే.. . మాయాజాలం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొన్నేళ్లుగా అడపాదడపా చిత్రాలు మాత్రమే చేస్తున్నారు. అయితే సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారనే ఆమె ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్, హీరో ను ఉద్దేశిస్తూ పూనమ్ పెట్టే పోస్టులు నెట్టింట తెగ వైరలవుతుంటాయి. #ysrcp has done the best job for weavers during pandemic and I am as an activist extremely greatfull for this . — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 6, 2024 -
తెలుగు హీరోయిన్ టీనేజ్ ఫోటో.. ఎవరో గుర్తుపట్టారా?
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్.. సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయింది. పూనమ్ తండ్రి సరబ్జిత్ సింగ్ పంజాబీ కాగా తల్లి సుఖ్ ప్రీత్ మాత్రం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా. హైదరాబాద్లో జన్మించిన పూనమ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడే జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తిచేసింది. తాజాగా పూనమ్ కౌర్ తన కాలేజ్ డేస్లోని యంగ్ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఆ ఫోటోలో తన అమ్మగారు కూడా ఉండటం విశేషం. నేడు తన తల్లి పుట్టినరోజు కావడంతో ఆ మధుర క్షణాలు గుర్తు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపింది. రేర్ ఫోటోను షేర్ చేసిన పూనమ్ ఇలా చెప్పుకొచ్చింది. 'అమ్మా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ మీద ఏదో ఒక రోజు పుస్తకం రాస్తాను.నీకు మహాసముద్రాలంటే ఇష్టం, నీ బలం శిఖరం లాంటిది. నాలో ఉన్న మంచి అంతా నీ నుంచే వచ్చింది. ఎందుకంటే నిన్ను చూస్తూనే పెరిగాను కాబట్టి. నువ్వు ఎంత బలంగా, అందంగా ఉంటావో నీకు తెలియదు. "కర్మ" సిద్ధాంతం నిజమైతే మిమ్మల్ని బాధపెట్టిన వారందరూ కూడా నరకంలోని చీకట్లలో కుళ్ళిపోతారు. దానిని మీరు కూడా చూస్తారని నేను ఆశిస్తున్నాను. అని పూనమ్ తెలిపింది. మొత్తానికి పూనమ్ కుటుంబం కొందరి వల్ల ఇబ్బందుల్లో పడటమో లేదా వారి వల్ల బాధించడమో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా తన అమ్మగారితో ఉన్న ఫోటోను పూనమ్ షేర్ చేయడంతో నెట్టింట్ వైరల్ అవుతుంది. యంగ్ ఏజ్లో పూనమ్ మరింత అందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. 2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్న పూనమ్, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలంతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) -
మంతెన ఆశ్రమంలో చేరిపోయిన పూనమ్ కౌర్ ఆమెకేమైంది..?
-
రెండేళ్లుగా ఆ వ్యాధితో ఇబ్బందులు.. ప్రముఖ డాక్టర్ను కలిసిన పూనమ్ కౌర్
ప్రముఖ సినీనటి పూనమ్ కౌర్ను ఫైబ్రోమైయాల్జీయా వ్యాధి గత రెండేళ్లుగా ఇబ్బంది పెడుతుంది. 2022 సమయంలో ఆమెకు వెన్ను నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం కేరళ వెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆమెకు ఫైబ్రో మయాల్జియా వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని గతంలో ఆమె కూడా తెలిపింది. 2022 నుంచి ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్న పూనమ్ అప్పటి నుంచి చికిత్స కూడా తీసుకుంటుంది. కేరళలోని ఓ ఆయుర్వేద ఆస్పత్రిలో కూడా చికిత్స తీసుకుంది. తాజాగా పూనమ్ తన ఆరోగ్యంపై తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. నేచురోపతి వైద్యంలో ఎంతో గుర్తింపు పొందిన డా.మంతెన సత్యనారాయణ రాజును ఆమె కలుసుకున్నట్లు తెలిపింది. ఆయన్ను కలవడం ఎంతో ఆనందాన్ని కలిగించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఫైబ్రోమైయాల్జియా వైద్యానికి సంబంధించి ఆయన ఇచ్చిన సూచనలు ఎంతో అమూల్యం. మంచి మనసుగల వ్యక్తితో ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాధి గురించి చర్చించే అవకాశం కలగడం తన అదృష్టమని ఆమె పేర్కొంది. ఫైబ్రోమైయాల్జియా వ్యాధితో చాలా ఇబ్బంది పడినట్లు పూనమ్ తెలిపింది. కనీసం దుస్తువులు కూడా వేసుకోలేకపోయానని అవి ధరిస్తున్నప్పుడు కూడా పెయిన్స్ వచ్చేవని వాపోయింది. దీంతో ఎప్పుడూ వదులుగా ఉన్న దుస్తువులే ధరించాల్సి వచ్చేదని చెప్పింది. ఫైబ్రోమైయాల్జియా లక్షణాలు ఫైబ్రోమైయాల్జియాతో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు నిద్రలేమితో భాదపడుతుంటారు. అలసటతో పాటుగా శరీరం మొత్తం విపరీతమైన నొప్పిని కలిగి ఉంటుంది. మెడ, భుజాలు, ఛాతీ, వీపు వద్ద ఎక్కువ పెయిన్ ఉంటుంది. జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటుగా డిప్రెషన్, ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. ఫైబ్రోమైయాల్జియా కోసం ఒకే పరిమాణానికి సరిపోయే మందులు లేవని వైద్యులు చెబుతున్న మాట. కానీ జీవనశైలి మార్పులతో దీనిని కంట్రోల్ చేయవచ్చని వారు చెబుతున్నారు. -
గురూజీ ఏదైనా చేయగల సమర్థుడు: హీరోయిన్
సూపర్ స్టార్ మహేశ్బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా అంటే బొమ్మ బ్లాక్బస్టరే! వీరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా మంచి ఆదరణ పొందాయి. ముచ్చటగా మూడోసారి వీరి కాంబోలో ఓ సినిమా వస్తోంది. అదే గుంటూరు కారం.. రిలీజ్కు ముందే మంటెక్కిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. ఆ విషయంలో సమర్థుడు అయితే ఈ సినిమా కథ త్రివిక్రమ్ ఒరిజినల్గా రాసుకోలేదని, యద్దనపూడి సులోచనారాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవలను కాపీ కొట్టాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించింది. 'ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ఆయనకు బాగా తెలుసు. తన తప్పుడు పనులు ప్రజలకు కనబడకుండా జాగ్రత్తపడే నైపుణ్యం ఉన్నవాడు. కొందరు గుడ్డిగా ఆయన్ను నమ్మేస్తారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుకు రాని గత ప్రభుత్వం ఆయనకు మాత్రం బాగా సాయం చేసింది. అదెందుకో నాకిప్పటికీ అర్థం కాదు మరి' అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. చివరగా సినిమాలో కనిపించింది అప్పుడే! ఈ ట్వీట్కు గురూజీ థింగ్స్ అన్న హ్యాష్ట్యాగ్ జత చేసింది. ఇకపోతే మాయాజాలం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది పూనమ్ కౌర్. ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం ఇలా అనేక చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. చదవండి: ఫుడ్ పాయిజన్ తర్వాతే ఇలా.. క్రికెట్ ఆడేటప్పుడు అలా అవడంతో -
నాకెలాంటి సంబంధం లేదు.. పైశాచిక ఆనందం కోసమే: టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్ హీరోయిన్, సామాజిక కార్యకర్త పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. ఎప్పుడో ఏదో విషయంలో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. అయితే తాజాగా పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆమె ఓ లేఖ విడుదల చేశారు. రాజకీయాల పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని.. ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదని అన్నారు. కొందరు కావాలనే వారి సొంత ప్రయోజనాల కోసం ఓ పావుగా వాడుకోవాలని చూస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. (ఇది చదవండి: 'గురువు' పేరుతో పూనమ్ కౌర్ సంచలన పోస్ట్) లేఖలో పూనమ్ కౌర్ రాస్తూ.. 'నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను. సమస్య ఆధారంగానే నేను స్పందిస్తుంటాను. ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం నన్ను ఓ పావుగా వాడాలనుకుంటున్నారు. గత ఎన్నికలలో కూడా ఇలాంటి వికృత చేష్టలు చేశారు. వీటి ద్వారా మరికొందరు పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు. ఒక మహిళపై ఇలాంటి కుట్రలు తగవు. నాయకులు సానుభూతి పేరుతో నాకు, నా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తున్నారు. నేను సిక్కుబిడ్డను. మాకు త్యాగాలు తెలుసు. పోరాటాలు తెలుసు. దయచేసి నన్ను మీ రాజకీయాల కోసం నన్ను లాగొద్దు. ప్రస్తుతం నేను చేనేత కళాకారుల కోసం పనిచేస్తున్నా. చేనేత, మహిళా ఉద్యమాలను జాతీయస్థాయిలో నిర్మించే క్రమంలో ఉన్నా. నా వైపు నుండి ఏదైనా అప్డేట్ ఉంటే నేనే స్వయంగా తెలియజేస్తా.' అని అన్నారు. (ఇది చదవండి: మళ్లీ రతిక ఎక్స్ గురించి రచ్చ.. నామినేషన్స్లో ఎవరెవరున్నారంటే?) -
పవన్కు అహం ఎక్కువ.. పూనమ్ కౌర్ టాపిక్పై రాజు రవితేజ కామెంట్
రాజు రవితేజ అంటే టక్కున ఎవరనే సందేహం రావడం సహజం. జనసేన, పవన్ అభిమానులకు మాత్రం ఆయన పేరు సుపరిచయమే. రాజు రవితేజ గతంలో పవన్కు అత్యంత సన్నిహితుడు, జనసేన మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. దాదాపు 12 ఏళ్ల పాటు పవన్తో రాజు రవితేజ నడిచారు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019లో పార్టీకి గుడ్బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన జనసేనలోకి మళ్లీ వెళ్లడం వంటి విషయాలతో పాటు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ జనసేనలోకి వెళ్లే ఆలోచన లేదని రాజు రవితేజ పేర్కొన్నారు. పవన్ కూడా రమ్మని పిలవడని చెబుతూనే మరొకరితో ఆహ్వానం పంపుతాడని చెప్పారు. తన విషయంలో కూడా ఇదే జరిగిందని తెలిపారు. పవన్ ఒక అహంకారి అని చెబుతూ ఆయనలో టూ మచ్ అహం ఉందని రాజు రవితేజ చెప్పారు. చెప్పింది చేయడం.. చేసేది చెప్పడం ఈ రెండూ పవన్లో లేవన్నారు. పూనమ్ కౌర్ గొడవలో నేను లేను పూనమ్ కౌర్- పవన్ వివాదం మధ్యలో ఒక మీడియేటర్గా ఉన్నానని తనను చాలా మంది అనుకున్నారని రాజు రవితేజ చెప్పారు. కానీ అందులో నిజం లేదని, వారిద్దరి టాపిక్లోకి తాను ఎంట్రీ కాలేదని ఆయన తెలిపారు. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో కూడా పూర్తిగా తెలియదని ఒకే ఒక్కసారి ఈ విషయంపై పవన్తో చర్చించానని చెప్పుకొచ్చారు. అప్పుడు జరిగిన విషయం ఏంటో పవన్ తనకు చెప్పారని.. కానీ అది వ్యక్తిగత విషయం కాబట్టి ఇప్పుడు బహిరంగంగా చెప్పకపోవడమే మంచిదని రాజు రవితేజ దాటవేశారు. కానీ పూనమ్ కౌర్తో వ్యక్తిగతంగా తాను ఇప్పటి వరకు మాట్లడనే లేదని తనతో ఎలాంటి పరిచయం కూడా లేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరియర్ ఇదే ఏపీ రాజకీయాలపై రాజు రవితేజ పలు వ్యాఖ్యలు ఇలా చేశారు. 'పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఉన్న ధోరణితో వెళ్తే రాజకీయాల్లో సక్సెస్ అవడం కష్టం. ఎందుకంటే ఏపీ పొలిటికల్ రేస్లో పవన్ థర్డ్ రన్నర్. మొదటి స్థానంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ఒకవేళ ఈ పొలిటికల్ రేసులోకి జూనియర్ ఎన్టీఆర్, ఎవరైనా వస్తే పవన్ నాలుగో స్థానంలో ఉంటారు. పోలింగ్ రోజున మీరు సెంటర్కు వెళ్లి చూస్తే.. ఓటు వేసేందుకు భారీగా లైన్ ఉంటుంది. అందులో లేడీస్, ఫ్యామిలీ మెంబర్స్, యువకులు, ముసలి వారు, పేదలు ఇలా అందరూ ఉంటారు. కానీ ఆ లైన్లో పవన్ ఫ్యాన్స్ మాత్రం ఉండరు. వాళ్లు జెండాలు పట్టుకొని బైకులలో ఎక్కడో తిరుగుతుంటారు. వాళ్లతో పవన్కు ఏం లాభం ఉండదు. వాళ్లతో పవన్ ఈగో మాత్రమే సంతృప్తి చెందుతుంది. ఇది ఆయనలో మరింత అహంకారాన్ని పెంచుతుందే కానీ వాళ్లతో రియల్గా వచ్చేది ఏం లేదు. రియల్గా ఓటేసేది ఫ్యామిలీస్, పేదలు మాత్రమే. వాళ్ల జీవితాలను ఎవరైతే మారుస్తారో.. ఆ నమ్మకం ఎవరైతే కలిగిస్తారో వారికే ఓట్ వేస్తారు. పవన్ స్పీచ్కు, రియాలిటీకి సంబంధం ఉండదు. అని రాజు రవితేజ అన్నారు. వలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు తప్పు వలంటీర్లపై పవన్ అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు అని రాజు రవితేజ అన్నారు. వాళ్లు కూడా ఈ సమాజంలో భాగమే కదా.. వాళ్లు కూడా సమాజం కోసమే పని చేస్తున్నారు. వలంటీర్లను పవన్ ఎందుకు శత్రువులుగా భావిస్తున్నారో తెలియదు. వాళ్లపై అంత ద్వేషం ఎందుకు ఉందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. పవన్ ఫ్యాన్స్లో కూడా ఇలాంటి ద్వేషమే కనిపిపిస్తుంది. వారికి నచ్చకపోతే బూతులతోనే విరుచుకుపడుతారు. పార్టీని వీడి ఇన్ని రోజులు అయినా తనపై బూతు కామెంట్లు చేస్తూనే ఉన్నారని రాజు రవితేజ పేర్కొన్నారు. (ఇదీ చదవండి: బేబీ రనౌత్ రాక కోసం వెయిటింగ్: కంగనా రనౌత్) -
ఆ లీడర్లను నమ్మొద్దు.. ఏపీ పాలిటిక్స్పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్
నటి పూనమ్ కౌర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటిగా కంటే కూడా సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పలు వ్యాఖ్యలతో ఎక్కువగా పాపులర్ అయ్యారు. సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయ వ్యవహరాలపై స్పందిస్తూ ఆమె చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి భారీగానే దుమారం రేపుతూ ఉంటాయి. వాటి వల్ల ఆమె కూడా ట్రోలింగ్కు కూడా గురవుతుంటారు కూడా.. తాజాగా పూనమ్ ఏపీ పాలిటిక్స్పై ఇలా ట్వీట్ చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. (ఇదీ చదవండి: లిప్లాక్,బోల్డ్ సీన్స్పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్) ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కొందరు ఫేక్ లీడర్లు మహిళల మీద ఎక్కడా లేని అభిమానాన్ని చూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వాళ్లను నమ్మోద్దు. మహిళలకు ఎదో జరిగిపోతుందని వారికి అంతగా అందోళన ఉంటే ఢిల్లీలో రెజ్లర్లు చాలా రోజుల పాటు నిరసన దీక్ష చేశారు. కనీసం వారికి అనుకూలంగా ఒక్కమాటైనా వీరు మాట్లడలేకపోయారే. వాళ్ల సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఏపీలో ఈ నకిలీ లీడర్లు ఎక్కడా లేని ప్రేమను కురిపిస్తున్నారు. ఇలాంటి లీడర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అంటూ నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఆమె ఏ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి చేశారనేది పేరు మాత్రం తెలుపలేదు. కానీ ఆమె ట్వీట్ కింద కొందరు బూతు పదాలతో పలు కామెంట్లు చేస్తున్నారు. మా నాయకుడు పవన్ కల్యాణ్ను అంటున్నావ్ కదా అంటూ.. కొందరు జనసేన, పవన్ ఫోటోలను డీపీలుగా పెట్టుకుని బూతు పదాలతో రెచ్చిపోతున్నారు. కొందరైతే ఏకంగా రాయలేని భాష ఉపయోగిస్తూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇంకోసారి ఇలాంటి కామెంట్లు పెడితే ఏం జరుగుతుందో కూడా ఊహించలేవంటూ పూనమ్కు వార్నింగ్ ఇస్తూ పవన్ ఫోటోను డీపీగా పెట్టుకుని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ఆమె ఇన్స్టాలో మరో ట్వీట్ చేశారు. 'మీరందరూ నా గురించి ఒకటి గుర్తుపెట్టుకోండి. నా పేరు 'కౌర్' అని మీరు మర్చిపోతున్నారు. సూమారుగా 5 ఏళ్లు అవుతుంది. కొంచెం ఆలోచించండి.' అని పోస్ట్ చేశారు. The people who are shouting at the top of their voice about women issues , as if they are highly concerned are the one who did not speak a word for #Wrestlers , beware of fake leaders who concern when it’s to their benefit and convenience.#AndhraPradesh — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 16, 2023 -
కంచె భామ స్టన్నింగ్ లుక్స్.. మరింత బొద్దుగా తయారైన పూర్ణ!
►హీరోయిన్ పూనమ్ కౌర్ బ్యూటిఫుల్ లుక్స్! ►కంచె భామ ప్రగ్యా జైశ్వాల్ స్టన్నింగ్ పోజులు! ►కలర్ఫుల్ శారీలో యాంకర్ లాస్య లుక్స్! ►మరింత బొద్దుగా తయారైన హీరోయిన్ పూర్ణ! View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) -
'గురువు' పేరుతో పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. సినీ పరిశ్రమలో తనని పంజాబీ అమ్మాయినని వెలివేస్తున్నారని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున, గవర్నర్ తమిళిసై ముందే కంటతడి పెట్టారు. తెలంగాణాలో పుట్టిన బిడ్డనని.. ఇక్కడే పెరిగానంటూ ఈ బ్యూటీ చేసిన వైరల్ కామెంట్లు అప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అవి మరిచిపోక ముందే సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: బాలీవుడ్ కింగ్ షారుఖ్ను ఢీ కొడుతున్న ప్రభాస్..) తాజాగా నటి పూనమ్ కౌర్ ఒక స్టోరీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. గురుపూర్ణిమ సందర్భంగా ఇలా షేర్ చేశారు. 'మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.. టామ్, డిక్ అండ్ హారీ అని ప్రతి ఒక్కరినీ గురువు అని పిలవద్దని... నీతులు చెప్పి స్టేజ్ మీద జీవితాలతో ఆడుకునే వాడు 'గురువు' కాదు, మీకు దారి చూపించేవారు 'గురువు' అవుతారు. గురువు మీ శ్వాస కావచ్చు, మీ హృదయ స్పందన కావచ్చు లేదా మీ విముక్తి కావచ్చు.' అని ఆమె రాసుకొచ్చింది. దీంతో ఆమె ఎవరి గురించి రాశారు..? ఎవరికి సలహాలిస్తున్నారు..? అంటూ పూనమ్ పోస్ట్పై రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. గతేడాదిలో 'నాతిచరామి' అనే చిన్న సినిమాలో నటించారు. ప్రస్థుతానికి పూనమ్ కౌర్ సినిమాలకు దూరంగా ఉన్నారు. View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) (ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్లాక్ చేసేదాన్ని:నటి) -
అజ్ఞానివా, మూర్ఖుడివా పవన్
-
పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద భగత్ సింగ్ పేరు...!
-
అహంకారమా? అజ్ఞానమా? పవన్ పోస్టర్పై పూనమ్ ఫైర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. ఇటీవల ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. అందులో పవన్ కల్యాణ్ కాళ్ల కింద ఉస్తాద్ భగత్ సింగ్ పేరు పెట్టారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది హీరోయిన్ పూనమ్ కౌర్. ఇది కచ్చితంగా భగత్ సింగ్ను కించపరచడమేనని, భగత్ సింగ్ యూనియన్కు దీన్ని రిపోర్ట్ చేయండని ట్వీట్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ నీకేం పనీపాటా లేదా? మధ్యలో ఎందుకు దూరుతున్నావని ఫైర్ అయ్యారు. తాజాగా పూనం కౌర్ మరో ట్వీట్ చేసింది. 'స్వాతంత్య్ర సమరయోధులను గౌరవించకపోయినప్పటికీ కనీస మర్యాద ఇవ్వాలి. అంతేకానీ ఇలా కించపర్చకూడదు. సినిమా పోస్టర్లో ఆయన పేరును నీ కాలి కింద పెట్టుకుంటావా? ఇది అహంకారమా? లేక అజ్ఞానమా?' అని మండిపడింది. ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ కాంట్రవర్సీలు క్రియేట్ చేసి వార్తల్లో ఉందామనుకుంటున్నావా? అని మండిపడుతున్నారు. అసలు నీకు, పవన్ కల్యాణ్కు ఉన్న గొడవేంటి? అని ప్రశ్నిస్తున్నారు. నీ మీదకు దృష్టి మళ్లాలనే కదా ఇంత రాద్ధాంతం చేస్తున్నావంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు. మొత్తానికి పూనమ్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. @ratnadeeep_ report this to #BhagatSingh union - this is such an insult to the name of revolutionary- huh !!! — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 11, 2023 When u cannot respect revolutionaries atleast don’t insult them - a recent poster release for a movie - insults the name #bhagatsingh by placing it below foot - ego or ignorance ? — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 11, 2023 చదవండి: పెళ్లికి ముందు నా భర్తకు, నాకు వేరేవాళ్లతో ఎఫైర్స్ ఉన్నాయి: హీరోయిన్ -
నేను తెలంగాణ బిడ్డనే.. వెలివేయకండి: పూనమ్ కౌర్ ఎమోషనల్
హీరోయిన్ పూనమ్ కౌర్.. సినిమాల కంటే వివాదాలతో ఎక్కువ ఫేమస్ అయింది. మాయాజాలం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమా విషయాలతో పాటు రాజకీయ అంశాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తరచూ ట్రోలింగ్కు గురవుతుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ స్టేజీపై కన్నీళ్లు పెట్టుకుంది. తనను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారంటూ ఎమోషనల్ అయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాజ్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పూనమ్ కౌర్ పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన మతం ద్వారా తనను వేరు చేసి చూస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘నేను తెలంగాణలోనే పుట్టాను. ఇక్కడే పెరిగాను. కానీ నేను పంజాబీని అని, సిక్కు అని మతం పేరుతో దూరం చేస్తున్నారు. నన్ను తెలంగాణ నుంచి దూరం చేయకండి. మతం పేరుతో నన్ను వెలివేయకండి. నేను తెలంగాణ బిడ్డనే’అంటూ పూనమ్ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నేను తెలంగాణ బిడ్డనే.. పూనమ్ కౌర్ కంటతడి..#Poonamkaur#telangana #RajBhavan #poonamKaurCryingpic.twitter.com/gwagW0ipNE — yousaytv (@yousaytv) March 7, 2023 -
అరుదైన వ్యాధి.. ఈ పోరాటంలో విజయం మాదే అంటున్న అందాల తారలు
సమంతకు ‘మయోసైటిస్’.. పూనమ్ కౌర్కి ‘ఫైబ్రోమయాల్జియా’.. ఇది అందరికీ తెలిసిన విషయమే. మంగళవారం నాడు మమతా మోహన్దాస్ తాను చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘ఈ కష్టాన్నీ దాటేస్తాను’ అనే నమ్మకాన్ని వ్యక్తపరిచారామె. ఇక సమంత తన అనారోగ్యం గురించి చెప్పినప్పుడు ‘నాలానే ఎంతోమంది పోరాడుతున్నారు. మేం గెలుస్తాం’ అన్నారు. ఇదే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచిన పూనమ్, మమతా.. ఈ మధ్యకాలంలో తమ అనారోగ్యం గురించి పేర్కొన్న కొందరు తారల గురించి తెలుసుకుందాం. గత ఏడాది అక్టోబర్లో సమంత తాను మయోసైటిస్ వ్యాధి (ఎక్కువ పని చేయలేకపోవడం, కండరాల నొప్పి, త్వరగా అలసిపోవడం వంటివి)తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. ఆస్పత్రి బెడ్పై ఉండి ఆమె ‘యశోద’ సినిమాకి డబ్బింగ్ చెప్పారు కూడా. ‘‘జీవితంలో మంచి రోజులతో పాటు చెడ్డ రోజులు కూడా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో (మయోసైటిస్ని ఉద్దేశించి) ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపించింది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంతదూరం వచ్చానా అనిపించింది. అందుకే పోరాడతా. నాలానే చాలామంది పోరాడుతున్నారు. మేం గెలుస్తాం’’ అని పేర్కొన్నారు సమంత. ఇక సమంత తనకు మయోసైటిస్ అని ప్రకటించిన తర్వాత పియా బాజ్పాయ్ (‘రంగం’ సినిమా ఫేమ్) కూడా గతంలో తాను ఇదే వ్యాధితో బాధపడ్డాననే విషయాన్ని బయటపెట్టారు. అయితే ఇంట్లోవాళ్లు భయపడతారని తనకు మయోసైటిస్ అనే విషయాన్ని చెప్పలేదన్నారు పియా. కుటుంబ సభ్యులతో ఢిల్లీలో ఉంటున్న పియా వ్యాధి చికిత్స నిమిత్తం ముంబైలో ఉన్నారు. ఇంట్లోవాళ్లకు తెలియకుండా చికిత్స చేయించుకుని, కోలుకున్నాక చెప్పానని పియా పేర్కొన్నారు. ఇటీవల ‘లాస్ట్’ అనే హిందీ చిత్రంలో నటించారామె. ఇక సమంత తన అనారోగ్యం విషయం బయటపెట్టిన రెండు నెలలకు డిసెంబర్లో పూనమ్ కౌర్ తనకు ‘ఫైబ్రోమయాల్జియా’ అనే విషయాన్ని బయటపెట్టారు. కండరాల నొప్పి, అలసట, నిద్రలేమితో ఈ వ్యాధి బాధపెడుతుంటుంది. రెండేళ్లుగా ఈ వ్యాధితో తాను బాధపడుతున్నట్లు తెలిపారు పూనమ్. కేరళలో ఆయుర్వేద చికిత్స మొదలుపెట్టిన ఆమె త్వరలోనే కోలుకుంటానని ఈ వ్యాధి గురించి ప్రకటించినప్పుడు తెలిపారు. మరోవైపు గత ఏడాది నవంబర్లో బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ తాను ‘ఎపిలెప్సీ’ (మూర్ఛ రోగం)తో బాధపడుతున్నట్లు తెలిపారు. అయితే తన వ్యాధి విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగా ఉంచడానికి కారణం ఇతరులు తనను బలహీనురాలు అనుకోకూడదని, ఒకవేళ అందరికీ తెలిస్తే తనకు పని ఇవ్వడానికి వెనకాడతారనే భయాలే అని పేర్కొన్నారు ఫాతిమా. కానీ ఇప్పుడు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తన విషయం బయటపెట్టానని స్పష్టం చేశారు. ‘‘నేను షూటింగ్ చేస్తున్నప్పుడు మా యూనిట్లో ఒకరికి మూర్ఛ వచ్చింది. నేను ఆ వ్యక్తికి సహాయం చేశాను. నాకలా జరిగినప్పుడు ఇతరుల సహాయం కావాలి. అయితే ఇదేం తప్పు కాదు... దాచేయడానికి. అందుకే చెప్పాలనుకున్నాను. నా నిర్మాతలకు నా పరిస్థితి చెబుతుంటాను. లొకేషన్లో నాకు మూర్ఛ వచ్చిన సందర్భాలున్నాయి. ఆ టైమ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందే చెప్పడం హెల్ప్ అయింది’’ అన్నారు ఫాతిమా. ఆమిర్ ఖాన్ కూతురుగా ‘దంగల్’లో ఫాతిమా మల్ల యోధురాలుగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు ఫాతిమా. ఇక 2010లో మమతా మోహన్దాస్ కేన్సర్ బారిన పడ్డారు. ఆ విషయాన్ని బాహాటంగా చెప్పి, ధైర్యంగా చికిత్స చేయించుకున్నారామె. కేన్సర్పై అవగాహన కలిగించడానికి పలు విషయాలను పంచుకున్నారు కూడా. అయితే 2013లో మళ్లీ కేన్సర్ అని తెలిసినప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకుని, కోలుకున్నారు. ఇప్పుడు మంగళవారం (17.01.) నాడు తాను చర్మ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని పంచుకున్నారు మమతా మోహన్దాస్. ‘విటిలిగో’ అనే చర్మ వ్యాధి సోకిందని పేర్కొన్నారామె. చర్మంపై మచ్చలు, చర్మం రంగు మారడం ఈ వ్యాధి లక్షణాలన్నారు. ఇంకా ‘‘ప్రియమైన సూర్యుడా.. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు నిన్ను హత్తుకోవాలనుకుంటున్నాను. నా చర్మం రంగుని కోల్పోతున్నాను. నువ్వు ఉదయించక ముందే నీకోసం నేను నిద్రలేచి పొగమంచులో నీ తొలి కిరణాన్ని చూడటానికి వేచి చూస్తున్నాను. నీ వెచ్చదనాన్నంతా నాకు ఇచ్చెయ్. ఎందుకంటే నాకు అది ఎంతో మేలు చేస్తుంది. అందుకే నీకెప్పటికీ రుణపడి ఉంటాను’’ అని మమతా మోహన్దాస్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ‘మీరు పెద్దవే దాటి వచ్చారు. ఇది చిన్న విషయం. ఇందులోంచీ బయటపడతారు’ అని ఫ్యాన్స్ పోస్ట్ చేశారు. అనారోగ్యం అనే విషయాన్ని బయటపెట్టడానికి ధైర్యం కావాలి. దాన్ని ఎదుర్కొని, కోలుకోవడానికి ఇంకా ధైర్యం కావాలి. ఈ చాలెంజ్లో ‘గెలుపు ఖాయం’ అని నమ్మడంతో పాటు ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన ఈ స్టార్స్ నిజమైన ‘స్టార్స్’. -
సినీ నటి పూనమ్ కౌర్ కు అరుదైన వ్యాధి
-
అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్? కేరళలో చికిత్స!
హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్ అయిన పూనమ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఫైబ్రో మైయాల్జియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్న పూనమ్ ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటుందట. ఈ వ్యాధి కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు పడుతుందట.చదవండి: పెళ్లి ఫోటోల్లో లావుగా ఉందంటూ హీరోయిన్పై ట్రోల్స్ గత రెండేళ్ల నుంచి పూనమ్ ఈ వ్యాధితో బాధపడుతుందని ప్రస్తుతం దీన్నుంచి బయటపడేందుకు కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటుందట. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇక ఇటీవలె సమంత మయోసైటిస్ వ్యాధి బారినపడినట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ పూనమ్ అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటుందని సమాచారం. కాగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో మాయాజాలం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన పూనమ్ ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి వంటి సినిమాల్లో నటించింది. చదవండి: డీజే టిల్లు-2 సెట్స్లో అనుపమ-సిద్ధూ గొడవపడ్డారా? -
రాహుల్ గాంధీ చేయి పట్టుకుని నడవడంపై పూనమ్ వివరణ
రాహుల్ గాంధీ, పూనమ్కౌర్ ఫోటోపై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో నటి పూనర్ కౌర్ పాల్గొన్న విషయం తెలిసిందే. చేనేత కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చేనేత చీరలో మెరిసిపోతూ రాహుల్ చేతిలో చేయి వేసి పట్టుకొని కొద్ది దూరం నడిచారు. అయితే యాత్రలో నడుస్తుండగా రాహుల్తో పూనమ్కౌర్ చేయిపట్టుకున్న ఫోటోపై చర్చ నడుస్తోంది. పూనమ్ కౌర్ చేయిపట్టుకొని రాహుల్ గాంధీ నడవడంపై పలువురు ట్రోల్ చేస్తున్నారు. This is absolutely demeaning of you , remember prime minister spoke about #narishakti - I almost slipped and toppled that’s how sir held my hand . https://t.co/keIyMEeqr6 — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 29, 2022 తాత అడుగు జాడల్లో నడుస్తున్నాడని బీజేపీ నేత ప్రీతి ట్వీట్ చేశారు. దీనిపై వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు స్పందిస్తున్నారు. మోదీ మహిళలతో ఉన్న ఫోటోలను రీట్వీట్ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై పూనమ్ కౌర్ ఘాటుగా స్పందించారు. ‘ఇది నిన్ను నువ్వే తక్కువగా చేసుకుంటున్నట్టుగా ఉంది. మన ప్రధాని నారీ శక్తి గురించి చెబుతుంటారు కాదా. నేను జారిపడబోతుంటే రాహుల్ గాంధీ నాచేయిపట్టుకున్నారు’ అని పూనమ్ కౌర్ వివరణ ఇచ్చారు. చదవండి: డ్రగ్స్ నిషా.. రెండురోజులు లేవలేదు, ఇంట్లోవాళ్లు ఒకటే ఏడుపు! -
జోడో యాత్రలో సినీనటి పూనమ్ కౌర్ సందడి
సాక్షి, హైదరాబాద్: జోడో యాత్రలో సినీనటి పూనమ్ కౌర్ సందడి చేశారు. వన్టౌన్ చౌరస్తా సమీపంలో రాహుల్తో కలిసి కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈరవత్రి అనిల్, ఆలిండియా చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు కాండగట్ల స్వామి, నాయకులు పద్మశ్రీ గజం అంజయ్యతో కలిసి చేనేత కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చేనేత పైన కేంద్ర ప్రభుత్వం వేసిన 5శాతం జీఎస్టీ ఎత్తివేయాలని, నేతకు సంబంధించిన ముడి సరుకులపై పన్నులు తొలగించాలని, గ్యాస్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని,ఈ మేరకు పార్లమెంట్లో మాట్లాడాలని కోరగా.. రాహుల్ సానుకూలంగా స్పందించినట్లు పూనమ్ కౌర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. సీతక్క, భట్టి, కళాకారులతో రాహుల్ దరువు భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మహబూబ్నగర్లోని అవంతి హోటల్ వద్ద ఖమ్మం తదితర జిల్లాలకు చెందిన ఆదివాసీలు ప్రదర్శించిన కొమ్ము, కోయ నృత్యాలను రాహుల్ ఆసక్తిగా తిలకించారు. కేసీ వేణుగోపాల్, భట్టి, సీతక్క, సంపత్ కుమార్, కళాకారులతో కలిసి లయబద్ధంగా స్టెప్పులేశారు. ఈ సందర్భంగా ఆదివాసీల కళారూపాల గురించి రాహుల్కు భట్టి విక్రమార్క వివరించారు. -
ఆ ఫొటో చూసి పెళ్లయిందా? అంటూ ప్రశ్నల వర్షం, క్లారిటీ ఇచ్చిన పూనమ్
నటి పూనమ్ కౌర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటిగా కంటే కూడా వివాదస్పద వ్యాఖ్యలతో ఆమె ఎక్కువగా పాపులర్ అయ్యారు. సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయ వ్యవహరాలపై స్పందిస్తూ ఆమె చేసే వ్యాఖ్యలు నిత్యం వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా పూనమ్ తన తీరుతో మరోసారి వార్తల్లోకెక్కింది. నార్త్ ప్రజలు భర్తల క్షేమం కోరుతూ చేసే ప్రత్యేక పూజ కర్వాచౌత్ (Karwa Chauth). పెళ్లయిన మహిళలు స్పెషల్గా జరుపుకునే ఈ పండగను శుక్రవారం పూనమ్ సెలబ్రెట్ చేసుకుంది. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఫొటోను తన ట్విటర్లో షేర్ చేస్తూ అందరికి కర్వాచౌత్ శుభాకాంక్షలు తెలిపింది. చదవండి: వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్లుక్ రిలీజ్ దీంతో ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘పెళ్లి కానీ మీరు కర్వాచౌత్ ఎలా జరపుకుంటారు?’, ‘అంటే ఇప్పుటికే మీకు పెళ్లయిపోయిందా? లేదా పెళ్లి చేసుకోబోతున్నారా?’ అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక నెటిజన్ల ప్రశ్నలపై ఆమె కాస్త ఘాటుగా స్పందించింది. ‘ఈ ఆర్టికల్స్ రాజకీయంగా ప్రేరేపించబడ్డాయో లేక మిషనరీల ఆలోచన విధానంతో సంధించబడ్డాయో నాకు తెలియదు. కానీ కర్వాచౌత్ పండుగను పెళ్లి కాని అమ్మాయిలు కూడా జరపుకోవచ్చు. తమ కాబోయే భర్తల కోసం జరుపుకుంటారు. పెళ్లయిన వాళ్లు చంద్రుని ఆరాధిస్తే.. పెళ్లికాని అమ్మాయిలు చంద్రునికి బదులుగా చుక్కలను ఆరాధిస్తారు. అంతేకాదు మహా శివుడుని కూడా కోలుస్తారు’ అంటూ ఆమె వివరణ ఇచ్చింది. చదవండి: అందుకే సినిమాలకు గ్యాప్ తీసుకున్నా: నటుడు అజయ్ I don’t know if the articles revolving around today are politically motivated or motivated by missionaries way of thinking - educate yourself - #omnamahshivya ( vasudeva Kutumbakam is what u need to learn . pic.twitter.com/BlQ1mq0qHJ — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 14, 2022 -
హీరోయిన్ పూనమ్ కౌర్కు పెళ్లయిందా? ఆ ఫోటో వైరల్
సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది హీరోయిన్ పూనమ్ కౌర్. గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ పంజాబి ముద్దుగుమ్మ నెట్టింట చేసే రచ్చ అంతా ఇంత కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పూనమ్ నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది. కర్వాచౌత్ (Karwa Chauth)శుభాకాంక్షలు చెబుతూ చేతిలో జల్లెడను పట్టుకొని చంద్రుడిని చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను పూనమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పడు దీనిపైనే తెగ చర్చ నడుస్తుంది. ఎందుకంటే తమ భర్త క్షేమాన్ని కోరుతూ కర్వాచౌత్ను పెళ్లయిన మహిళలే జరుపుకుంటారు. నార్త్లో ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. భర్త పేరు మీద ఉపవాసం చేసి… జల్లెడలో చంద్రుడిని చూసిన వెంటనే భర్త ముఖాన్ని చూసి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాంటిది పెళ్లికాని పూనమ్ కర్వాచౌత్ ఫోటోను షేర్ చేయడంపై నెటిజన్లు సందేహాలు లేవనెత్తుతున్నారు. మీకు ఇదివరకే పెళ్లయిందా? లేదా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ పూనమ్ పోస్టుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) -
ఇప్పటికైనా నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి : పూనమ్ కౌర్
సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది హీరోయిన్ పూనమ్ కౌర్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పూనమ్ నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటోపై తెగ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలతో ఫోటో దిగిన పూనమ్ దీనికి హ్యాపీనెస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో క్షణాల్లోనే ఆ పోస్ట్ వైరల్గా మారి పూనమ్కు పెళ్లయి, పిల్లలున్నారంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ వార్తలపై పూనమ్ కౌర్ స్పందించింది. 'ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్ చాలు, వాళ్లు నా బెస్ట్ ఫ్రెండ్ పిల్లలు. సోషల్ మీడియాకు థ్యాంక్స్. నేను క్లారిటీ ఇవ్వగలుగుతున్నాను. నన్ను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి' అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. దీంతో పుకార్లకు చెక్ పెట్టినట్లయ్యింది. Enough unbearable damage has been done , these are my best friends kids. Thankful to social media , that I can give clarity. 🙏 Let me breathe🙏 pic.twitter.com/4yyCPMuRDn — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 4, 2022
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
యాదాద్రి భువనగిరి: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం
20 ఏళ్ల క్రితం నాటా.. ఇప్పుడు చూస్తే : రాఘవ లారెన్స్
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్కు ప్రమాదం
Indraja Sankar: విజిల్ నటి బర్త్డే సెలబ్రేషన్స్.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్బీఐ ఏం చెబుతోంది?
పంజాబ్పై ఘన విజయం.. సెకెండ్ ప్లేస్కు ఎస్ఆర్హెచ్
అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement