-
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
ఇండియన్ సినిమాలో 'పుష్ప: ది రైజ్' చెరిగిపోని ముద్ర వేసింది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2021లో విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ టాలీవుడ్కు పరిచయం అయ్యాడు. పుష్పలో SP భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో అదరగొట్టేశాడు. ఈ సినిమాకు ముందే మలయాళ ఇండస్ట్రీలో ఆయనొక స్టార్ యాక్టర్గా ఉన్నారు. పుష్పతో ఫహాద్ ఫాజిల్ రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో చేరుకుంది. అయితే ఈ సినిమా వల్ల తనకు పెద్దగా ఒరిగిందేమి లేదని ఒక ఇంటర్వ్యూలో ఓపెన్గానే చెప్పేశాడు.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహాద్ ఫాజిల్కు ఒక ప్రశ్న ఎదురైంది. పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా నటుడిగా మారారని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కదా.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంది.'పుష్ప సినిమా నా కెరీర్కు పెద్దగా ఉపయోగపడలేదు. ఆ చిత్రం వల్ల నేను ఎలాంటి లాభాన్ని పొందలేదు. ఇదే విషయం సుకుమార్ సార్కు కూడా చెప్పాను. ఇందులో నేను దాచడం లేదు. అబద్దం చెప్పడం లేదు. ఆ సినిమా తర్వాత నేను ఎక్కువగా మలయాళ సినిమాల్లోనే నటించాను. అయితే, మలయాళం భాష తెలియని వారు కూడా నా సినిమాలు చూస్తున్నారు. అదొక్కటే నాలో సంతోషాన్ని నింపింది. నేను ఏ ప్రాంతాన్ని, ఎవరినీ అగౌరపరచడం లేదు. అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు.' అని ఆయన అన్నారు. ఏదేమైనా పాన్ ఇండియా రేంజ్లో తనను పుష్ప చేర్చలేదని ఫహాద్ఫాజిల్ పేర్కొన్నాడు. -
పుష్ప స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. బన్నీ రిప్లై అదిరిపోయింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప-2: ది రూల్. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన బ్లాక్బస్టర్ పుష్పకు సీక్వెల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసన మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్తో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ను ఇటీవలే రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. పుష్ప.. పుష్ప.. పుష్ప.. అంటూ సాగే పాట ఆడియన్స్ను ఊర్రూతలూగిస్తోంది. అయితే ఈ సాంగ్లో బన్నీ చేసిన షూ డ్రాప్ స్టెప్ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటోంది. ఈ స్టెప్ వేస్తున్న వీడియోను చూసిన పుష్ప వీరాభిమాని డేవిడ్ వార్నర్ రిప్లై ఇచ్చారు. ఓ డియర్.. ఎంత బాగా చేశావ్.. ఇప్పుడు నేను కూడా ఆ స్టెప్ ప్రాక్టీస్ కోసం కొంత వర్క్ చేయాలి' అంటూ కామెంట్ చేశాడు.అయితే డేవిడ్ వార్నర్ కామెంట్కు బన్నీ కూడా రిప్లై ఇచ్చాడు. మనిద్దరం కలిసినప్పుడు తప్పకుండా హుక్ స్టెప్ నేర్పిస్తానని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. 'ఇది చాలా సులభం...మనం కలిసినప్పుడు ఎలా చేయాలో నీకు చూపిస్తా' అని కామెంట్స్లో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్ నెట్టింట తెగ వైరల్గా మారింది. కాగా.. పుష్ప సినిమా నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. అల్లు అర్జున్కు నటనకు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి బన్నీకి వీరాభిమాని అయిపోయారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పుష్ప డైలాగ్స్తో అలరిస్తుంటారు. కాగా.. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
Pushpa2 The Rule : ‘పుష్ప2’ మూవీ స్టిల్స్
-
పుష్ప-2 ఫస్ట్ సింగిల్.. రిలీజ్ టైమ్ ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్గా సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా పుష్ప-2 మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ను రిలీజ్ డేట్ అండ్ టైమ్ను ప్రకటించారు మేకర్స్.మే 1వ తేదీన ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయన్నట్లు ప్రకటించారు. ఏకంగా ఆరు భాషల్లో ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ ప్రత్యేక పోస్టర్ను షేర్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేసింది.కాగా.. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎర్రచందన సిండికేట్ నేపథ్యంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. S̶e̶n̶s̶a̶t̶i̶o̶n̶a̶l̶ s̶u̶r̶p̶r̶i̶s̶e̶Sensational song ✅🔥🔥#Pushpa2FirstSingle out tomorrow at 5.04 PM in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam & Bengali.#PushpaPushpa chant all the way 💥💥A Rockstar @ThisIsDSP Musical 🎵#Pushpa2TheRule Grand release worldwide on… pic.twitter.com/3fuyv9GFlA— Mythri Movie Makers (@MythriOfficial) April 30, 2024 -
పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్
అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘పుష్ప–2 ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ‘పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్...’ అంటూ సాగే టైటిల్ సాంగ్ తొలి లిరికల్ వీడియో ్రపోమోను విడుదల చేశారు మేకర్స్. పూర్తి పాటని మే 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప: ది రైజ్’ (2021) పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే.ఈ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఈ మూవీకి సీక్వెల్గా రూపొందుతోన్న ‘పుష్ప–2 ది రూల్’పై ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ నెల 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. సునీల్, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సీఈఓ: చెర్రీ. -
పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. పుష్ప పుష్ప అంటూ సాగిపోయే ఈ సాంగ్ ప్రోమోను బుధవారం (ఏప్రిల్ 24) రిలీజ్ చేశారు. కొద్దిరోజుల క్రితమే బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఫ్యాన్స్కు మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. పుష్ప పుష్ప అంటూ సాగిపోయే పూర్తి పాటను కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పుష్ప చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న ఈ చిత్రం బన్నీ మార్కెట్ స్థాయిని పెంచేలా ఉంది. ఈ సినిమా సుమారు రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బాలీవుడ్ థియేట్రికల్ హక్కులు రూ. 200 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. నార్త్లో ఇంతటి భారీ మొత్తానికి అమ్ముడుపోయిన తొలి సినిమాగా పుష్ప రికార్డ్ క్రియేట్ చేసింది.పుష్ప ది రైజ్ చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ.. తగ్గేదే లే అంటూ ప్రపంచవ్యాప్తంగా తన బ్రాండ్ను విస్తరిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే రెండో భాగాన్ని తెరకెక్కించారు మేకర్స్ . ఈ చిత్రం కోసం సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ను మైత్రీ మూవీ మేకర్స్ వారు పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రధాన బలమని చెప్పవచ్చు. -
బాలీవుడ్లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిన 'పుష్ప'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప : ది రూల్’ బాలీవుడ్లో ప్రారంభమైంది. సినిమా విడుదలకు ముందే అక్కడ రికార్డ్ బద్దల కొడుతుంది. ఇండియన్ సినిమా మార్కెట్ను షేక్ చేస్తూ ఈ సినిమా రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. పార్ట్-1 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పుష్పగాడి టార్గెట్ గ్లోబల్ మార్కెట్పై కూడా పడింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప : ది రూల్’ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.200 కోట్ల రూపాయలకు ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ థడానీ కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇది బాలీవుడ్లో ఆల్ టైమ్ రికార్డ్ డీల్ అని చెప్పవచ్చు. నాన్ హిందీ సినిమాను బాలీవుడ్లో అంత భారీ దక్కించుకోడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. పుష్ప సినిమా కోసం ఓటీటీలో కూడా గట్టిపోటీ ఉంది. ఎలాగైనా ఈ సినిమాను దక్కించుకోవాలని నెట్ఫ్లిక్స్ రూ.250 కోట్ల వరకు కోట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే డిజిటల్ హక్కుల్లో కూడా పుష్పనే టాప్ అవుతుంది. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ రైట్స్ కోసం రూ. 170 కోట్లు పెట్టారు. దేశవ్యాప్తంగా పుష్ప చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో మార్కెట్ స్థాయి కూడా అదే రేంజ్లో పెరిగిందని చెప్పవచ్చు. సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. -
ఐపీఎల్లో సన్రైజర్స్ రికార్డులు.. పుష్ప టీమ్ స్పెషల్ ట్వీట్!
అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన పుష్ప కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్గా కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్గా పుష్ప-2 రూపొందిస్తున్నారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా పుష్ప టీమ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్ను పుష్ప సినిమాతో పోలుస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ టీమ్ తన రికార్డ్ను తానే అధిగమించింది. ముంబయిపై 277 పరుగుల అత్యధిక స్కోరు చేసిన ఎస్ఆర్హెచ్.. మరోసారి బెంగళూరుపై 287 రన్స్ చేసి తన రికార్డ్ను తానే బద్దలు కొట్టింది. దీంతో మొదటి మ్యాచ్ను పుష్ప పార్ట్-1గా.. రెండో మ్యాచ్ను పుష్ప-2గా పోలుస్తూ పోస్ట్ చేసింది. రెండుసార్లు అత్యధిక స్కోరు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కు అభినందనలు తెలిపింది. దీంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది చూసిన కొందరు అభిమానులు పుష్ప డైలాగ్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రపంచలో ఎక్కడా లేని సరకు మన దగ్గరే ఉండాది అనే డైలాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ఏ టీమ్ సాధించని రికార్డ్ను రెండుసార్లు సన్రైజర్స్ అధిగమించడం ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోనుంది. HUPPPP!!! 💥💥 277/3 - SRH: The Rise 😎 287/3 - SRH: The Rule 🤙 Congratulations on scoring the Highest-ever IPL team totals twice in this season! 🔥 @SunRisers https://t.co/kcfJBj5E0Z pic.twitter.com/co0o1zIw7T — Pushpa (@PushpaMovie) April 16, 2024 -
జిమ్లో పుష్ప డైరెక్టర్ భార్య.. పెద్ద సాహసమే!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప-2 ది రూల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా ఆడియన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప-2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే పలు రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు 138 గంటల పాటు యూట్యూబ్లో నంబర్వన్ ప్లేస్లో ట్రెండ్ అయింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది. అయితే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత గురించి చాలామందికి తెలియదు. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటున్నారు. సినిమాలతో పాటు ఎక్కడికెళ్లినా ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఆమె జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. జిమ్లో కసరత్తులు చేస్తూ తబిత కనిపించారు. ఆమె వర్కవుట్స్ సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) -
తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. మరో క్రేజీ రికార్డ్ సొంతం!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవల్లిగా తెలుగు ప్రేక్షకుల అభిమానం దక్కించుకున్న రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. పుష్ప-2 టీజర్ను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 8న విడుదలైన పుష్ప-2 యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. అతి తక్కువ టైమ్లో మిలియన్ల వ్యూస్ సాధించిన టీజర్.. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగిన టీజర్గా నిలిచింది. ఇప్పటివరకు పుష్ప-2 టీజర్కు 110 మిలియన్లకు పైగా వ్యూస్, 1.55 మిలియన్ల లైక్స్తో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని పుష్ప టీం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. #Pushpa2TheRuleTeaser becomes the first teaser to be 𝗧𝗥𝗘𝗡𝗗𝗜𝗡𝗚 #𝟭 on YouTube for a record 138 HOURS ❤🔥 Takes over the nation with 𝟏𝟏𝟎𝐌+ 𝐕𝐈𝐄𝐖𝐒 & 𝟏.𝟓𝟓𝐌+ 𝐋𝐈𝐊𝐄𝐒 🔥🔥 ▶️ https://t.co/5Mvmxzyfrp Grand release worldwide on 15th AUG 2024 💥💥… pic.twitter.com/LderAMGCRg — Pushpa (@PushpaMovie) April 14, 2024 -
నా కంటే అందమైన వాళ్లున్నారు.. కానీ: రష్మిక ఆసక్తికర కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది యానిమల్ మూవీతో మరో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. అంతే కాదు భారతీయ సినిమాలోనే అత్యధికంగా అభిమానులను అలరించిన నటిగానూ మొదటి స్థానంలో ఉన్నారు. రష్మిక పలు భాషలు, పలు చిత్రాల్లో నటించినా తెలుగు చిత్రం పుష్ప ఈమె కెరీర్కు పెద్ద టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఈ చిత్రం తరువాతనే బాలీవుడ్ ఎంట్రీ యానియల్ సినిమాతో హిట్ కొట్టింది. కాగా ఇటీవల రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకంటే అందం, ప్రతిభ కలిగిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారన్నది తనకు తెలుసన్నారు. అయితే తనకు మంచి అవకాశాలు రావడంతో ఆ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. ఇందుకు తాను నిజంగా కృతజ్ఞతురాలినై ఉంటానన్నారు. జీవితంలో సంతోషాన్ని, మీరు పొందిన విజయాన్ని సాధారణంగా భావించరాదన్నారు. గత కొద్ది కాలంగా తాను నేర్చుకున్నది ఇదేనని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ పుష్ప -2: ది రూల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత చావ అనే ఒక హిందీ చిత్రం, రెయిన్బో అనే ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు), ది గర్ల్ ఫ్రెండ్ అనే తెలుగు చిత్రం రష్మిక చేతిలో ఉన్నాయి. -
ఎన్టీఆర్ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్!
ఆర్ఆర్ఆర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో దేవరతో పాటు బాలీవుడ్లో వార్-2లోనూ నటిస్తున్నాడు. అయితే దేవర సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వార్-2 సెట్స్పైకి వెళ్తాడాని అంతా భావించారు. ఎన్టీఆర్ ప్లాన్ కూడా అదేనట. కానీ కొన్ని కారణాల వల్ల దేవర షూటింగ్ని నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ వార్-2 సెట్స్పైకి వెళ్లాడు. అటు దేవరతో పాటు ఇటు వార్-2ని కూడా కంప్లీట్ చేసి.. వేరే సినిమాపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నాడట ఎన్టీఆర్. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్ రూటునే ఫాలో అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. (చదవండి: నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి) బన్నీ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్తోనూ మరో సినిమా చేయాబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు బన్నీ తన ప్లాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి అటు అట్లీ, ఇటు త్రివిక్రమ్ సినిమాల్లో నటించాలనుకుంటున్నాడట. (చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?) త్వరలోనే అట్లీ సినిమాను సెట్స్పైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ కూడా ఇప్పుడు తన ఫోకస్ అంతా అల్లు అర్జున్ సినిమా మీదనే పెట్టాడు. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. పుష్ప 2 తర్వాత ఈ రెండు సినిమాల షూటింగ్స్లో పాల్గొని.. వచ్చే ఏడాదిలో రెండింటిని విడుదల చేసేలా బన్నీ ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాదిలో బన్నీ రెండు సినిమాలలో అభిమానులను అలరిస్తాడు. -
ప్రకంపనలు సృష్టిస్తున్న పుష్ప-2 టీజర్
-
పుష్ప టీజర్: ఆ సీన్ కోసం అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డారో తెలిస్తే..
ఇకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా పుష్ప:ది రూల్ సినిమా టీజర్ విడుదలైంది. యూట్యూబ్లో పుష్ప గాడి సునామీ కొనసాగుతుంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ అంటూ పార్ట్-1 లో పిచ్చెక్కించిన బన్నీ తాజాగా విడుదలైన తన చీరకట్టుతో దుమ్మురేపాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, సునీల్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తిరుపతిలో ఏటా ఘనంగా జరిగే గంగమ్మ జాతర నేపథ్యంలో పుష్ప టీజర్ సాగింది. ఆ వీడియోలో ఊచకోత తర్వాత బన్నీ తన చీర కొంగు నడుముకు చుట్టుకున్నట్లు చూపించారు. డైలాగ్ లేకుండా దేవీ శ్రీ బీజీఎమ్తో తెరకెక్కిన ఈ సీన్.. టన్నుల కొద్ది జోష్ అల్లు అర్జున్ ఫ్యాన్స్లో కనిపించింది. టీజర్ను చూసిన అందరూ ఈ సీన్కు ఫిదా అవుతున్నారు. అయితే ఈ సీన్ అంత ఈజీగా రాలేదని తెలుస్తోంది. ఐదు క్షణాల సీన్ కోసం బన్నీ పడిన కష్టం గురించి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ ఒక్క షాట్ కోసం బన్నీ ఏకంగా 51 టేకులు తీసుకున్నాడట. ఆ చీర కొంగు కట్టే విధానం స్క్రీన్పై బాగా రావాలని ఆయన పట్టు పట్టారట. ఇదే విషయాన్ని సౌండ్ డిజైనర్ రసూల్ చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. సినిమా కోసం తమ హీరో ఎంత డెడికేట్గా పనిచేస్తారో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పుష్ప:ది రూల్ టీజర్ ఇప్పటి వరకు 40 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. ఆగష్టు 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
పుకార్లకు చెక్.. 'పుష్ప 2' తర్వాత బన్నీ సినిమా ఫిక్స్
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఫిక్సయిపోయిందా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం 'పుష్ప 2'తో బన్నీ ఫుల్ బిజీగా ఉన్నాడు. పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. మంచి హై ఇచ్చే విజువల్స్.. అభిమానులకు కిక్ ఇస్తున్నాయి. ఇప్పుడు బన్నీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ 'పుష్ప' మూవీని 2021 చివర్లో కేవలం తెలుగు వరకే రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ పెద్దగా ప్రమోషన్ లేకుండానే పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అయితే తెలుగులో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఉత్తరాదిలో మాత్రం ప్రేక్షకులు 'పుష్ప' దెబ్బకు మెంటలెక్కిపోయారు. ఫలితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) దీంతో 'పుష్ప 2' కాస్త లేట్ అయింది. ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అయితే దీని తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఏంటనేది ఇంకా సస్పెన్స్ గానే ఉండిపోయింది. త్రివిక్రమ్, అట్లీ, బోయపాటి శ్రీను.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు 'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా చేస్తాడనిపిస్తోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఈ మూవీ క్యాన్సిల్ అయిందనే పుకార్లకు చెక్ పడినట్లయింది. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చిన త్రివిక్రమ్ ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. మరి అల్లు అర్జున్ తో తీయబోయే సినిమా ఏం చేస్తాడోనని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా) Wishing an amazing actor with great perseverance & dedication to achieve anything on and off screen, the stylish Icon Star of Indian cinema and National Award winner, Our @alluarjun garu a very Happy Birthday ❤️#HappyBirthdayAlluArjun 🌟 Can't wait to work with you again, sir.… pic.twitter.com/BhLfbaynwB — Haarika & Hassine Creations (@haarikahassine) April 8, 2024 -
Pushpa 2 Teaser Photos: చీర కట్టులో పుష్ప రాజ్ విశ్వరూపం
-
Pushpa 2 Teaser: పుష్పరాజ్ మాస్ జాతర చూస్తారా?
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ.., నీ యవ్వ తగ్గేదేలే.. ఈ డైలాగులకు రికార్డులు తగలబడిపోయాయి. అల్లు అర్జున్ చిత్తూరు యాసలో మాట్లాడుతుంటే జనాలకు భలే గమ్మత్తుగా అనిపించింది. అభిమానులకైతే సినిమా చూసిన తర్వాత ఎక్కిన మత్తు అంత ఈజీగా దిగలేదు. ఇప్పుడు మరోతూరి అందర్నీ పిచ్చెక్కించేందుకు రెడీ అయిపోయాడు పుష్ప. నేడు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప:ది రూల్ సినిమా టీజర్ను చెప్పిన టయానికి టంచనుగా రిలీజ్ చేశారు. అమ్మోరు గెటప్లో బన్నీ పుష్పగాడు సిండికేట్ అయ్యాక తన రేంజే పెరిగింది. శ్రీవల్లి ఒంటినిండా నగలతో మెరిసిపోయినట్లు పోస్టర్స్లో చూపించారు. టీజర్లో మాత్రం హీరో అమ్మోరు గెటప్లో కనిపించారు. ఊచకోత తర్వాత చీర కొంగు నడుముకు చుట్టుకున్నట్లు చూపించారు. డైలాగ్ మాత్రం లేదు. టీజర్ నిడివి కేవలం ఒక్క నిమిషమే ఉంది. అయినా సరే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. పుష్పరాజ్ను చూస్తుంటే పాత రికార్డులు పాతరేసి.. గంగమ్మ జాతర జరిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనబడ్తా ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ ఈపారికి టీజర్తో కడుపు నింపేసుకుంటామంటున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, సునీల్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. బాక్సాఫీస్ను రూల్ చేసేందుకు పుష్ప ఆగస్టు 15న రాబోతున్నాడు. చదవండి: అల్లు అర్జున్ గురించి ఈ విషయాలు తెలిస్తే.. ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాల్సిందే -
Allu Arjun: అల్లు అర్జున్ గురించి ఈ విషయాలు తెలిస్తే.. ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాల్సిందే
'గంగోత్రి'తో ఒక నదిలా ఇండస్ట్రీలో 'పరుగు'లు పెడదామని ఎంట్రీ ఇస్తే.. 'ఎవడు' రా వీడు అంటూ వచ్చిన విపరీతమైన ట్రోల్స్ను 'హ్యాపీ'గా భరించి.. 'జులాయి' అనుకున్న వాడే 'దేశముదురు'లా మారి బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల 'రేసుగుర్రం' అయ్యాడు. 'రుద్రమదేవి'కి తోడుగా గోన గన్నా రెడ్డిగా అవతారమెత్తి ఇండస్ట్రీకి 'సరైనోడు' వచ్చాడు రా అని చాటిచెప్పాడు. నేడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్న టాప్ హీరోలతో పోటీ పడుతూ నీ యవ్వ తగ్గేదేల్యా అని 'పుష్ప' గాడి రూలింగ్ ప్రారంభించాడు. వారు మరెవరో కాదు అల్లు అర్జున్.. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కథనం. అల్లు అర్జున్ ఈ పేరు వింటే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టైలిష్ స్టార్ గుర్తుకొస్తాడు.. మల్లు అర్జున్ ఈ పేరు వింటే కేరళలో అభిమానులు ఊగిపోతారు. వీడు హీరో ఎంటి రా..? అనే స్థాయి నుంచి హీరో అంటే వీడు రా అనే రేంజ్కు చేరుకున్నారు బన్నీ. అగ్ర నిర్మాత తనయుడిగా.. అగ్ర కథానాయకుడికి మేనల్లుడిగా ఒక బరువు బాధ్యతలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అహర్నిశలు శ్రమించి సినీ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నటుడు అల్లు అర్జున్. 'ఆడా ఉంటా.. ఈడా ఉంటా' అంటూ.. అటు క్లాస్ ఆడియన్స్ను, ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉన్న హీరోగా బన్నీ గుర్తింపు పొందారు. ట్రోల్స్కు భయపడకుండా గట్టి సమాధానం ఇచ్చాడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్- నిర్మల దంపతులకు 1982 ఏప్రిల్ 8న చెన్నైలో పుట్టిన అల్లు అర్జున్ 18 ఏళ్ల వరకు అక్కడే పెరిగాడు. ప్రాథమిక విద్య కూడా అక్కడే ముగిసింది. తాత స్టార్ కమెడియన్ (రామలింగయ్య), మామయ్య స్టార్ హీరో (చిరంజీవి), నాన్న స్టార్ ప్రొడ్యూసర్.. ఈ నేపథ్యంలో బన్నీ తెరంగేట్రం సులువుగా జరిగింది. 2003లో 'గంగోత్రి' సినిమాతో దర్శకుడు రాఘవేంద్రరావు బన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరో కావడం అప్పటికే విజేత, స్వాతిముత్యంలో బాల నటుడిగా కనిపించడమే కాకుండా చిరంజీవి సినిమా 'డాడీ'లో డ్యాన్స్ చేసి మెప్పించడం వంటి అంశాలు బన్నీకి బాగా కలిసి వచ్చాయి. దీంతో గంగోత్రి విడుదల సమయంలో థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇందులో ఆయన నటనకు ఎవరూ పేరు పెట్టలేదు కానీ లుక్ పరంగా బారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. వాటిని సంతోషంగా స్వీకరించడమే కాకుండా తనను తాను మార్చుకున్నాడు. అలా 'ఆర్య'తో గట్టి సమాధానమిచ్చాడు. తొలి చిత్రంలో సింహాద్రిగా కనిపించిన ఆ కుర్రాడేనా..? ఈ 'ఆర్య' అంటూ తెలుగు సినీ ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయేలా చేశాడు. మరో హీరో అయితే ఈ సినిమా చేసేవాడు కాదేమో టాలీవుడ్ బెస్ట్ డాన్సర్ గా అప్పట్లోనే చిరంజీవితో ప్రశంసలు అందుకున్నాడు బన్నీ. గంగోత్రి,ఆర్య,బన్నీ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. తొలి మూడు సినిమాలతో వరస హిట్లు అందుకున్న అతికొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఆపై వెంటనే హ్యాపీ నిరాశ పరిచినా.. దేశముదురుతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరోగా చరిత్ర సృష్టించాడు బన్నీ. ఆ మరుసటి ఏడాది పరుగుతో తన నటనను చూపించాడు. వరుడు, వేదం, బద్రీనాథ్,జులాయి,దువ్వాడ జగన్నాథం,రుద్రమదేవి లాంటి సినిమాలతో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించడం ఆయనకే చెల్లింది. ఫలానా సినిమాలో క్లైమాక్స్లో మీ పాత్ర చనిపోతుంది నటిస్తారా?’ అని ఏ స్టార్ హీరోనైనా అడిగితే వెనకడుగేస్తుంటారు. కానీ, ఆ విషయంలో 'వేదం' కోసం బన్నీ ముందడుగేశాడు. 'రుద్రమదేవి' సినిమా చిక్కుల్లో ఉందని తెలుసుకున్న అర్జున్ పారితోషికం తీసుకోకుండానే గోనగన్నారెడ్డి పాత్ర పోషించి. ఆ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేశాడు. దీంతో తనలోని మరో కోణాన్ని చూపించాడు. అల్లు అర్జున్ రూమ్లో వారిద్దరి ఫోటోలు అల్లు అర్జున్కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం. ఆయన రూమ్లో కేవలం ఇద్దరు ఫోటోలు మాత్రమే ఉంటాయని, ఒకటి మైకేల్ జాక్సన్ది, మరొకటి చిరంజీవిదని, వాళ్లిద్దరినీ చూస్తూ తాను డ్యాన్స్ నేర్చుకున్నానని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మైకేల్ జాక్సన్ అంటే ఆయనకు ప్రాణం. మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటలో చెప్పు జారిపోయే స్టెప్ చూడ్డానికి సింపుల్గా ఉంటుంది. కానీ అది ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్ల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఆ స్టెప్ను అనుకరిస్తూ లెక్కలేనన్ని వీడియోలు చేశారు. అలా దాదాపు ప్రతి సినిమాలో సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి. ప్రయోగాలతో పాటు కష్టపడేతత్వం ప్రతి సినిమాలో ప్రయోగాలకు అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారు. కథ, కథనం నచ్చితే పాత్ర పరిధి, నిడివి తక్కువైనా చేసేందుకు వెనుకాడరు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కథకు చాలా ముఖ్యం. కానీ అతిథి పాత్ర. అయినా అల్లు అర్జున్ చేశారు. క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో వచ్చిన 'వేదం' సినిమాలో కేబుల్ రాజు పాత్ర పోషించి.. విభిన్నమైన కథ ఉంటే చేయడానికి తాను సిద్ధమని సంకేతాలిచ్చారు. ప్రయోగం ఫలించని సందర్భమూ లేకపోలేదు. 'నా పేరు సూర్య' వైఫల్యమే దీనికి ఉదాహరణ. సినిమా కోసం బన్నీలా కష్టపడేంత నటులు ఈ రోజుల్లో అరుదని ప్రముఖ దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అందుకు ఉదాహరణలు కూడా ఉన్నాయి. పుష్ప సినిమా కోసం దాదాపు ఏడాది పాటు చిత్తూరు యాసను అల్లు అర్జున్ సాధన చేశారు. 'బద్రినాథ్' సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తియుద్ధం నేర్చుకున్నారు. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ శైలిలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు. అల్లు లెగసీ మెగా కాంపౌండ్ హీరో నుంచి తన సొంత కష్టంతో అల్లు హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడు. అలాగనే ఎన్నడూ మెగా అభిమానులను ఆయన తక్కువ చేయలేదు. అర్జున్కి అభిమానులు మలయాళం ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. గతంలో కానీ, ప్రస్తుతం కానీ.. ఏ హీరోకి లేని క్రేజ్ మలయాళంలో బన్నీ సొంతం. అక్కడ అంతా ఆయనని మల్లు అర్జున్ అని పిలుస్తారు. 'పుష్ప'తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాధించుకున్నాడు. ఆ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా ఖండంతరాలను దాటింది. సినిమా రంగంతో పాటు క్రికెట్, పాలిటిక్స్లో ఉండే సెలబ్రిటీల సైతం ఏదో ఒక సందర్భంలో.. 'నీయవ్వ తగ్గేదే లే' అని అల్లు అర్జున్ డైలాగ్ ఉపయోగించే ఉంటారు. అలా ఆయన పేరు మరింత వేగంగా జనాల్లోకి చొచ్చుకుని పోయింది. ఇంత రేంజ్కు ఆయన చేరుకోవడానికి ఆయన ప్రధాన బలం టాలెంట్. కంటెంట్తో పాటు టాలెంట్ ఉన్నోడికి ఎక్కడైన తిరుగులేదని అల్లు అర్జున్ జీవితం తెలుపుతుంది. ఫ్యామిలీ మ్యాన్ సినిమాలు, షూటింగ్లతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు అల్లు అర్జున్. ఎంత బిజీగా ఉన్నా సరే వీలు కల్పించుకొని మరీ భార్యాపిల్లలతో గడిపేందుకు ఆయన సమయం కేటాయిస్తారు. ఇలా మంచి భర్త, మంచి తండ్రి, మంచి కొడుకు అని అనిపించుకునే బన్నీ సమయం వచ్చినప్పుడు తన కుటుంబానికి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తాడో కూడా చూపిస్తాడు. తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదో అభిమానుల ప్రేమ కూడా అలాంటిదే అని చెప్పిన బన్నీ.. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది. నా జీవితంలో నేను సాధించిన అతిపెద్ద ఆస్తి అభిమానులే అని ఓ ఇంటర్య్వూలో ఆయన చెబుతూ ఉప్పొంగిపోయాడు. అల్లు అర్జున్ గురించి ఈ విషయాలు తెలుసా ► దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డ్ ► రెండు సైమా అవార్డులతో పాటు ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ► ఇన్స్టాలో అల్లు అర్జున్ ఫాలోవర్స్ ఏకంగా 25 మిలియన్లు ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్ను కలిగి ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ కావడం విశేషం ► 'పుష్ప' సినిమాతో తన నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్. ఈ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ► టాలీవుడ్లో 'దేశ ముదురు' సినిమాతో సిక్స్ప్యాక్ పరిచయం చేసింది అల్లు అర్జున్నే ► బన్నీకి నటి ఐశ్వర్యరాయ్ అంటే అభిమానం. ఆవిడకు పెళ్లయినప్పుడు చాలా బాధపడ్డాడట ► అల్లు అర్జున్కు బాగా నచ్చే సినిమాలు టైటానిక్, ఇంద్ర.. ఇప్పటికే చాలాసార్లు ఆ సినిమాలు చూశారట ► 2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా పుష్ప: ది రైజ్ రికార్డ్ క్రియేట్ చేసింది ► 'బద్రినాథ్' సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తియుద్ధం నేర్చుకున్న బన్నీ ► 'రుద్రమదేవి' సినిమా సమస్యల్లో ఉందని తెలుసుకున్న అర్జున్.. ఆ ప్రాజెక్ట్కు తనలాంటి స్టార్ అవసరమనుకున్నాడు. అందుకే పారితోషికం తీసుకోకుండా గోనగన్నారెడ్డి పాత్ర పోషించాడు. 👉: ప్రతి పాత్రా ప్రత్యేకం.. వెండితెర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేకం (ఫొటోలు) -
Allu Arjun HD Images: ప్రతి పాత్రా ప్రత్యేకం.. వెండితెర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేకం (ఫొటోలు)
-
తండ్రి కష్టాలను తాను మోస్తూ.. పోరాటం కొనసాగించిన 'రష్మిక మందన్న'
రష్మిక మందన్నా.. నిజానికి కన్నడ నటి. నేడు 28వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. మోడల్గా కెరీర్ ప్రారంభించిన రష్మిక 'కిరిక్ పార్టీ' చిత్రంతో కన్నడ సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 'ఛలో' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప,యానిమల్ చిత్రాలతో నేషనల్ క్రష్గా వెలిగిపోతుంది. తనపట్ల పలు రకాలుగా రూమర్స్, డీప్ ఫేక్ వీడియోలు వంటివి ఎదురైనా బలంగా నిలబడింది. అందుకే నేడు ఆమె పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతూ చరిత్రలో తనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకుంది. రష్మిక విద్యాభ్యాసం వివరాలు రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్పేట్లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న రష్మిక.. చదువును నిర్లక్ష్యం చేస్తూ నటి కావాలని కలలు కనలేదు. చదువులో అగ్రస్థానంలో నిలిచిన రష్మిక మొదట మోడలింగ్ షోలలో పనిచేయడం ప్రారంభించింది. అలా ఒక షోలో ఆమెను చూసిన రక్షిత్ శెట్టి 'కిరిక్ పార్టీ' సినిమాలో ఎలాంటి ఆడిషన్ లేకుండానే ఛాన్స్ ఇచ్చాడు. అద్దె ఇంట్లో జీవితం ప్రారంభం రష్మిక చిన్నప్పుడు తమ కుటుంబం మొత్తం ఓ అద్దె ఇంట్లో ఉండేవారమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆర్థిక కష్టాల కారణంగా రెంట్ కట్టలేకపోవడంతో పదే పదే ఇల్లు మారాల్సి వచ్చేదని చెబుతూ ఆ సమయంలో కంటతడి పెట్టుకుంది. తల్లిదండ్రులు చివరికి తనకి ఆడుకోవడానికి ఒక బొమ్మని కూడా కొనివ్వలేకపోయారని వాపోయింది. పాఠశాల రోజుల్లో తన కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఆపై వ్యాపారాల్లో నష్టం వచ్చి తన నాన్నగారు బాధపడిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఎలాగైనా ఆ పరిస్థితిని మార్చాలని రష్మిక బలంగా కోరుకుంది. అందుకు తగ్గట్లు కష్టపడింది. తన తల్లిదండ్రులకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు.. అయినా ధైర్యంగా ఇందులో అడుగుపెట్టింది. ఇప్పుడు తను రెండుజేతులా ఆర్జిస్తూ తండ్రికి బిజినెస్లో ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తోంది. అలానే ఓ పెద్ద ఇల్లుని కూడా పేరంట్స్కి గిప్ట్గా ఇచ్చింది. ఛలో టూ పుష్ప కిరిక్ పార్టీ సినిమా విజయంతో రష్మిక మందన్నకు ఛలో సినిమాలో ఛాన్స్ దక్కింది. కేవలం రంగుల కలలు కని సినిమాల్లోకి తను రాలేదు. ఈ వృత్తిలో ఉండే సాధకబాధకాల గురించి ముందే తెలుసుకుంది. అయితే ప్రతి వృత్తిలో ఉన్నట్లే సినిమారంగంలో కూడా ఒడిదొడుకులు, ఎగుడుదిగుళ్లు ఉంటాయనేది కూడా బాగా తెలుసు అందుకే ఆమెపై ఎన్ని రూమర్స్ వచ్చినా బలంగా తట్టుకుని నిలబడింది. సరైన అవకాశం కోసం ఎదురుచూసింది. ఆ సమయం పుష్ప సినిమాతో వచ్చింది. దీంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం పుష్ప2 తో అంతకు మించి ఇమేజ్ ను సాధించడానికి రెడీగా ఉంది రష్మిక. ఫస్ట్ రెమ్యునరేషన్ కిరిక్ పార్టీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక రూ. 1.50 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఆ తర్వాత ఛలో సినిమాకు రూ. 50 లక్షలు అందుకున్నారని టాక్. టాలీవుడ్ తర్వాత కోలీవుడ్లోకి అడుగుపెట్టింది రష్మిక. తమిళంలో కార్తీ సరసన నటించిన ఆమె ఆ తర్వాతి సినిమాలోనే తలపతి విజయ్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుని కోలీవుడ్ మార్కెట్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్న రష్మిక యానిమల్ సినిమాకు మాత్రం రూ. 7 కోట్ల వరకు తీసుకున్నట్లు టాక్. పేదరికం నుంచి కోట్లలో సంపద చిన్నతనంలో నాన్న పడుతున్న కష్టాన్ని తన కళ్లతోనే చూసింది. ఎలాగైనా తన కుటుంబ పరిస్థితిని మార్చాలని కోరుకుంది. అందుకే సంపాదించిన ప్రతి రూపాయి ఇప్పటికి కూడా తన తండ్రికి అప్పజెప్పుతుంది. ప్రస్తుతం సినిమా రెమ్యునరేషన్తో పాటు ఆమె పలు ప్రకటనల్లో కూడా కనిపిస్తుంది. ఒక్కో ప్రకటనకి డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట. అలా ఇప్పటి వరకు మొత్తంగా రూ. 70 కోట్ల వరకు రష్మిక సంపాధించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న మాట. 23 ఏళ్లకే కోటీశ్వరురాలిగా మారిన రష్మికకు బెంగళూరు, కూర్గ్, గోవా, హైదరాబాద్, ముంబై సహా నగరాల్లో ఇళ్లు ఉన్నాయట. ఇందులో రష్మిక బెంగళూరులోని లగ్జరీ ఇంటి విలువ 10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రష్మికకు కార్లంటే చాలా ఇష్టం మరియు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. టయోటా ఇన్నోవా, ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్, హ్యుందాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఆమె గ్యారేజీలో వరుసలో ఉన్నాయి. ముఖ్యంగా ఆమె సినిమాల్లో సంపాదించని డబ్బును తన తండ్రి ద్వారా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతందని సమాచారం. దాంతో తన ఆస్తులతో పాటు.. సంపద కూడా భారీగా పెరుగుతూ వస్తోందట. చిన్నప్పుడు తన తల్లిదండ్రులను గర్వించేలా చేయాలని బలంగా కోరుకున్న రష్మిక అనుకున్నట్లు గానే సాధించింది. చిన్నతనంలోనే తన జీవితం గురించి ఏ విధంగా అయితే కలలుకనిందో వాటిని నిజం చేసుకుంది. అయినా జీవితంలో ఇంకా సాధించాల్సింది చాలానే ఉందంటున్న రష్మిక.. అవన్నీ నెరవేరాలని కోరుకుంటూ నేషనల్ క్రష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. -
Rashmika Mandanna: పుష్పరాజ్ సతీమణి శ్రీవల్లీ లుక్ చూశారా..?
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'పుష్ప: ది రూల్'. ఈ చిత్రంలో శ్రీవల్లీగా 'రష్మిక మందన్న' నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా తాజాగా పార్ట్-2 సంబంధించిన లుక్ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. మొదటి భాగంలో చాలా సింపుల్గా కనిపించిన శ్రీవల్లీ పార్ట్-2లో మాత్రం చాలా రిచ్గా కనిపిస్తోంది. ఒంటి నిండా బంగారు నగలతో మెరిసిపోతుంది. ఇప్పటి వరకు చూసిన శ్రీవల్లీ ఓ లెక్క ఇకనుంచి చూడబోయే శ్రీవల్లీ మరో లెక్క అన్నట్లు ఆ పోస్టర్ ఉంది. రష్మిక పుట్టినరోజు సందర్భంగా తాజాగా విడుదలైన ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పార్ట్-1 సమయంలో విడుదల చేసిన లుక్తో.. ఇప్పుడు విడుదల చేసిన లుక్ను పోలుస్తూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. రష్మిక మరింత పవర్ఫుల్గా ఇందులో కనిపించబోతుందని వారు చెప్పుకొస్తున్నారు. మొదటిభాగం చివర్లో పుష్పరాజ్కు శ్రీవల్లితో పెళ్లి అయినట్లు చూపిన సంగతి తెలిసిందే.. ఇక రెండో పార్ట్లో పుష్పకు భార్యగా ఆమె కనిపించనుంది. ఈ సీక్వెల్లో ఆమె పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుందని మరోసారి మేకర్స్ ప్రకటించారు. Wishing the 𝒏𝒂𝒕𝒊𝒐𝒏'𝒔 𝒉𝒆𝒂𝒓𝒕𝒕𝒉𝒓𝒐𝒃 'Srivalli' aka @iamRashmika a very Happy Birthday 🫰🏻#Pushpa2TheRuleTeaser on April 8th 🔥#PushpaMassJaathara 💥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024. Icon Star @alluarjun @aryasukku #FahadhFaasil… pic.twitter.com/AnsbEXZqJT — Pushpa (@PushpaMovie) April 5, 2024 -
అందం + అభినయం +అల్లరి.. హ్యాపీ బర్త్డే రష్మిక మందన (ఫొటోలు)
-
అల్లు అర్జున్ బర్త్డే నాడు సూపర్ హిట్ సినిమా రీ-రిలీజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8 కోసం ఆయన అభిమానులతో పాటు సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆరోజే ఆయన కొత్త చిత్రం 'పుష్ప 2' టీజర్ విడుదల కానుంది. ఈమేరకు ఇప్పటికే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేశారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. బన్నీ పుట్టినరోజున మరో కానుక కూడా ఉంది. తన కెరియర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన 'జులాయి' మళ్లీ మీ ముందుకు రానుంది. అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ బాణీల్లో రూపొందిన పాటలు కూడా భలేగా అలరించాయి. ఈ సినిమా వచ్చి ఇప్పటికి 12 ఏళ్లు దాటింది. అయినా కూడా పాటలు, మాటలతో మెప్పించిన ‘జులాయి’ని ఇప్పుడు చూసినా మంచి కిక్ ఇస్తుంది. అందుకే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న కొన్ని థియేటర్లలో మాత్రమే బన్నీ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 8న బన్నీ నుంచి మరో కానుక వచ్చే అవకాశం ఉంది. స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా ప్రకటన కూడా రానుందని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏప్రిల్ 8న రావచ్చిన తెలుస్తోంది. తాజాగా అట్లీ భార్య ప్రియా సైతం 'ఏ6' కథా చర్చలు అంటూ ఓ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీంతో వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. -
అల్లు అర్జున్ పుష్ప-2.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ -1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఇటీవలే వైజాగ్లో పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అంతే కాకుండా యాగంటి క్షేత్రంలోనూ రష్మిక మందన్నాపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ పుష్ప-2 అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్తో వచ్చారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో టీజర్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 టీజర్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని పుష్ప స్టైల్లో దుబాయ్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి దక్షిణాది నటుడిగా బన్నీ నిలిచారు. #Pushpa2TheRule Teaser out on April 8th, 2024!!! pic.twitter.com/ivTN2CJZBh — Allu Arjun (@alluarjun) April 2, 2024 Let the #PushpaMassJaathara begin 💥 𝗧𝗛𝗘 𝗠𝗢𝗦𝗧 𝗔𝗪𝗔𝗜𝗧𝗘𝗗 #Pushpa2TheRuleTeaser out on April 8th ❤️🔥❤️🔥 He is coming with double the fire 🔥🔥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024. Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/gCPRAxqoPh — Pushpa (@PushpaMovie) April 2, 2024 -
టీజర్ రెడీ
‘పుష్ప : ది రూల్’ సినిమా టీజర్కు రంగం సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తోంది. హీరో అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న ‘పుష్ప: ది రూల్’ సినిమా టీజర్ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త. ‘పుష్ప: ది రూల్’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఇక ‘పుష్ప’ సినిమా ఫ్రాంచైజీలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ సినిమా సక్సెస్ కావడంతో మలి భాగం ‘పుష్ప: ది రూల్’పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్, మరో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలతో అల్లు అర్జున్ సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల అప్డేట్స్ కూడా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న వచ్చే అవకాశం ఉంది. ఇంకా అల్లు అర్జున్–దర్శకుడు అట్లీ కాంబినేషన్లోని కొత్త సినిమా ప్రకటన కూడా రావొచ్చనే ప్రచారం జరుగుతోంది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఆలస్యం చేయొద్దు.. కదలండి ఓటేయండి.. (ఫొటోలు)
ఓటు వేసిన వైఎస్సార్సీపీ నేతలు (ఫొటోలు)
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హేమంత్ సోరేన్కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్సిబల్
Election 2024 Voters Selfie Photos: ఓటు హక్కు వజ్రాయుధం (ఫొటోలు)
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement