-
భారత్కు మద్దతుగా.. అమెరికాపై రష్యా ఫైర్
మాస్కో: సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర విషయంలో అమెరికాపై రష్యా తీవ్ర విమర్శలు చేసింది. పన్నూ హత్య కుట్రలో భారతీయుల ప్రమేయం ఉన్నట్లు అమెరికా చేస్తున్న ఆరోపణలను రష్యా ఖండించింది. అమెరికా వద్ద ఎటువంటి విశ్వసనీయమైన సమాచారం, సాక్ష్యం లేదని మండిపడింది.భారత అంతర్గత రాజకీయాల్లో అస్థిరత కలిగించాలని, ప్రస్తుతం భారత్లో జరగుతున్న సాధారణ ఎన్నికలను ప్రభావితం చేయాలని అమెరికా ప్రయత్నాలు చేస్తోందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖారోవా ఆరోపణలు చేశారు.‘‘భారత దేశ మనస్తత్వం, చరిత్ర గురించి అమెరికాకు సరిగా తెలియదు. అందుకే అమెరికా.. మత స్వేచ్ఛపై తరచూ భారత్పై ఆరోపణులు చేస్తోంది. భారత్లోని అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాలన్న అమెరికా ప్రయత్నం స్పష్టంగా తెలుస్తోంది. పన్నూ హత్య కుట్ర విషయంలో అమెరికా దగ్గర ఎటువంటి ఆధారం లేదు. చదవండి: Gurpatwant Singh: భారత్- కెనడాల మధ్య చిచ్చుపెడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు?ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. అమెరికా భారత్ను గౌరవించటం లేదు. అంతర్జాతీయ అంశాల్లో అమెరికా జోక్యాన్ని ఊహించటమే చాలా కష్టంగా ఉంది’’ అని మరియా జఖారోవా అన్నారు. భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తోందని రష్యా మండిపడింది.గత నవంబర్లో పన్నూ హత్య కుట్రకు సంబంధించి భారత్కు చెందిన నిఖిల్గుప్తాకు ప్రమేయం ఉన్నట్లు యూఎస్ కోర్టు అభియోగాలు మోపిన విషయం తెలసిందే. అదేవిధంగా భారత్కు చెందిన రా(R&AW)అధికారికి పన్నూ హత్య కుట్రలో ప్రమేయం ఉందని, ఆయన పేరు.. విక్రమ్ యాదవ్ అని ఇటీవల న్యూయార్క్ పోస్ట్ ఓ కథనంలో వెల్లడించగా.. భారత్ తీవ్రంగా ఖండించింది. -
న్యూక్లియర్ డ్రిల్స్కు ఆదేశించిన పుతిన్
ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న తరుణంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్కు సమీపంలో రష్యన్ మిలటరీ, నేవి ఆధ్వర్యంలో అణ్వాయుధాల డ్రిల్స్ నిర్వహించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించినట్లు ఆ దేశ రక్షణ శాఖ సోమవారం ప్రకటించింది. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అణుయుద్ధానికి సంబంధించి పుతిన్ పలుసార్లు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.న్యూక్లియర్ డ్రిల్స్ చేస్తున్న సమయంలో నాన్ స్ట్రాటజిక్ న్యూక్లియర్ ఆయుధాలను ఉపయోగించటంపై శిక్షణ తీసుకోనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. నాన్ స్ట్రాటిజిక్ న్యూక్లియర్ ఆయుధాలను టెక్నికల్ వెపన్స్ అంటారు. యుద్ధ క్షేత్రాల్లో ఉపయోగించే మిసైల్స్ గుండా వీటిని ప్రయోగిస్తారు.కొన్ని పశ్చాత్య దేశాల నుంచి తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని సమీప భవిష్యత్తులో న్యూక్లియర్ డ్రిల్స్ చేపడతామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. అక్రమిత ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక బలగాలతో పాటు.. వైమానిక, నౌకా దళాలు న్యూక్లియర్ డ్రిల్స్ పాల్గొంటాయని పేర్కొంది. అమెరికాతో గతంలో చేసుకున్న ‘న్యూ స్టార్ట్ ఒప్పందం’నుంచి తాత్కాలికంగా తప్పుకొంటున్నామని గతేడాది రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా?
ఒక మహిళ గర్భం ధరించడం పిల్లలను కనడం అనేది అత్యంత కఠిన నియమాతో కూడిన పని. అయిన మాతృత్వపు మమకారంతో ప్రతి స్త్రీ సునాయాసంగా ఆ బాధ్యతను మోస్తుంది. అయితే ఎవరైనా మహా అయితే ఐదుగురు లేదా పది మంది వరకు కనడం గురించి విని ఉంటాం. ఏకంగా 69 మంది పిల్లలను కనడం గురించి విన్నారు. ఈ విషయాన్ని గుర్తించి గిన్నిస్ రికార్డుల్లో సైతం ఆ మహిళ పేరుని నమోదు చేశారు అధికారులు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఎక్కడ జరిగిందంటే..ఈ అరుదైన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. ఒకరు కాదు, నలుగురు కాదు, ఒక మహిళ ఏకంగా 27 సార్లు గర్భం దాల్చింది. ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచాన్నే ఆశ్చర్య పరిచింది. రష్యా నివాసి అయిన వాలెంటినా వాసిలీవ్ అనే మహిళ 1725 మరియు 1765 మధ్య 69 మంది పిల్లలకు జన్మనిచ్చింది. మాస్కోలోని స్థానిక ప్రభుత్వ నివేదిక ప్రకారం, రష్యన్ రైతు ఫియోడర్ వాసిలీవ్ భార్య వాలెంటినా వాసిలీవ్ సుమారు 27 ప్రసవాలతో 69 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. అందులో 16 మంది కవలలే ఉండటం విశేషం. అంటే ఏడు ప ఏడు ప్రసవాల్లో ట్రిపులెట్స్ని, నాలుగు ప్రసవాల్లో నలుగురు చొప్పున పిల్లలను ప్రసవించింది. చరిత్రలో జరిగిన ఈ వింతను వెలికితీసి గుర్తించడమే కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆ తల్లి పేరును అత్యంత ఫలవంతమైన తల్లిగా నమోదు చేసింది. రష్యాలోని కొన్ని చారిత్రక పుస్తకాల్లో దీని గురించి ఉంది. పైగా ప్రజలు కూడా ఈ విషయాన్ని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ రైతు ఫియోడర్ వాసిలీవ్ మరొక స్త్రీని కూడా వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా ఎనిమిది సార్లు గర్భవతి అయ్యి 18 మంది పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో వాసిలీవ్ మొత్తం 87 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. వారిలో 84 మంది మాత్రమే జీవించి ఉన్నారు. మిగిలిన ఏడుగురు పిల్లలు పుట్టిన కొద్ది రోజులకే చనిపోయినట్లు నివేదిక తెలిపింది. ఇదిలా ఉండగా..ఒక మహిళ అన్ని సార్లు గర్భం ధరించడం సాధ్యమేనా అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సంతాన సాఫల్య వైద్యుడు జేమ్స్ సెగర్స్ పరిశోధన చేశారు. ఆయన తన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇక్కడ వాలెంటినా 40 సంవత్సరాల వ్యవధిలో 27 గర్భాలకు తగినంత సమయం కలిగి ఉంటేనే ఇంతమంది పిల్లలను కనగలదని అన్నారు. అంతేగాదు ఒక స్త్రీ సైన్సు పరంగా మనం ఊహించిన దానికంటే ఎక్కువ మందిని కనగలదని చెప్పారు. మహిళలు సాధారణంగా 15 సంవత్సరాల వయస్సులో రుతుక్రమంలోకి వస్తారు. వారి అండాశయాలు ప్రతి 28 రోజులకు ఒక గుడ్డును విడుదల చేయడం ప్రారంభిస్తాయి. మెనోపాజ్లో గుడ్డు సరఫరా అయిపోయే వరకు ఈ అండోత్సర్గము కొనసాగుతుంది. ఈ అండోత్సర్గం తగ్గిపోయే మహిళ వయసు 51 ఏళ్లు అని తెలిపారు. ఇక్కడ ప్రసవాల సంఖ్య పెరిగే కొద్ది సంతానోత్పత్తి స్థాయి పడిపోతుంటుందని, ముఖ్యంగా 40 ఏళ్లు సమీపించేటప్పటికీ ప్రతి చక్రానికి బిడ్డ పుట్టే అవకాశం ఒక్క శాతంగానే ఉంటుందని అన్నారు. ఇక్కడ ఈ మహిళ వాలెంటినా 18 ఏళ్ల వరకు ప్రసవిస్తూనే ఉండి ఉండాలి. అలా ఆలోచిస్తే.. అన్ని సార్లు మహిళ గర్భం ధరించడం అనేది ఆమెకు బిడ్డకు చాలా ప్రమాదకమరమైనది, పైగా సాధ్యం కాదని అన్నారు జేమ్స్ సెగర్స్. (చదవండి: ఈ వ్యాయామాలతో కొవ్వు కరిగి స్లిమ్గా అవ్వుతారు!) -
రష్యా ప్రతినిధులతో మెగాస్టార్ భేటి.. ఎందుకంటే?
ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ రష్యా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మాస్కో నుంచి వచ్చిన రష్యా బృందం నేరుగా హైదరాబాద్లోని చిరంజీవికి ఇంటికి వెళ్లి కలిశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సహకారంపై వారితో చర్చించారు. రష్యాలో తెలుగు చిత్రాల షూటింగ్తో సహా తదితర అంశాలపై వారితో మాట్లాడారు. రష్యాలో తెలుగు సినిమాల షూటింగ్ను ప్రమోట్ చేయడానికి వారు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భారతీయ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ, రష్యా మధ్య సృజనాత్మక సహకారాలపై ప్రతినిధి బృందం చిరంజీవితో మాట్లాడారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మెగాస్టార్ను కలిసిన వారిలో మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధి బృందంలోని సినిమా సలహాదారు జూలియా గోలుబెవా, క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్ ఎకటెరినా చెర్కెజ్ జాడే, ఫెడరల్ ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ మాస్కో, యూనివర్సల్ యూనివర్శిటీ డైరెక్టర్ మరియా సిట్కోవ్స్కాయా ఉన్నారు. కాగా.. భోళాశంకర్ తర్వాత మెగాస్టార్ నటిస్తోన్న సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర. బింబిసార డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం వచ్చేఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న విడుదల కానుంది. A high level delegation of the Ministry Of Culture - Moscow has met #Chiranjeevi garu at his residence today Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/NPLmjrUo1q — Chiranjeevi Army (@chiranjeeviarmy) April 18, 2024 -
ఉత్తర కొరియా కిమ్ సంచలన వ్యాఖ్యలు
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో నెలకొన్న అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం తప్పదని అన్నారు. యుద్ధాన్నికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆయన బుధవారం దేశంలోనే కీలకమైన కిమ్ జోంగ్-ఇల్ మిలిటరీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ యూనివర్సిటీ కిమ్ తండ్రి పేరు మీద 2011లో స్థాపించారు. దేశంలో మిలిటరీ విద్యలో అత్యధికంగా సీట్లు ఉన్న యూనివర్సిటీ ఇది. యూనివర్సిటీ సందర్శన సమయంలో విద్యార్థులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు. ‘ఉత్తర కొరియా చుట్టూ.. అంతర్జాతీయంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో దేశంలో నెలకొన్న అస్థిరమైన పరిస్థితుల నడుమ యుద్ధం తప్పదు. శత్రు దేశాలు యుద్ధ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. ఎలాంటి సంకోచం లేకుండా యుద్ధం చేయడానికి నార్త్ కొరియా సిద్ధంగా ఉంది’ అని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇప్పటికే నార్త్ కొరియా రాజకీయంగా, ఆయుధ తయారీలో రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యూహాత్మక మిలిటరీ ప్రాజెక్టుల్లో నార్త్ కొరియా సాయం అందిస్తోంది. ఇటీవల కొరియా ఘన ఇందనంతో మధ్యశ్రేణి సూపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఇది ద్రవ ఇందనంతో పోల్చితే చాలా శక్తివంతమైందని నిపుణులు పేర్కొన్నారు. తరచూ అమెరికా, దక్షిణ కొరియా తమ సైనిక విన్యాసాలతో ఉత్తర కొరియాను కవ్విస్త్ను విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. -
Russia Floods: రష్యాలో భారీ వరదలు
మాస్కో: రష్యాలో వరదలు ముంచెత్తుతున్నాయి. ఉరల్ పర్వతాలు, సైబీరియా ప్రాంతాల్లో మంచు కరిగి నదుల్లోకి చేరడం వల్ల వరదలు పోటెత్తుతున్నాయి. కజకిస్తాన్ సరిహద్దులోని ఒరెన్బర్గ్ ప్రాంతం వరదల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నది. ఇక్కడ 10వేల ఇళ్ల దాకా నీటిలో మునిగాయి. పశ్చిమ సైబీరియాలోని కొన్ని ప్రాంతాల్లో అత్యవసర స్థితిని ప్రకటించారు. ఉరల్ నది ప్రమాదకర స్థాయిలలో ప్రవహిస్తోంది. దీంతో నది తీర ప్రాంతాల్లో ఉండే వారిని వేరే ప్రాంతాలకు తరలించారు. ఈ నది ఒరెన్బర్గ్ మీదుగా కజకిస్తాన్ వెళుతుంది. సమీపంలోని డ్యామ్ కొట్టుకుపోవడంతో ఒర్స్క్ నగరం పూర్తిగా నీటిమయమైంది. ఇదీ చదవండి.. దైవ కణం ఉందన్న శాస్త్రవేత్త కన్నుమూశాడు -
Russia-Ukraine war: జపొరిజియా అణు ప్లాంట్పై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
కీవ్: రష్యా ఆక్రమిత జపొరిజియా అణు విద్యుత్ ప్లాంట్పై డ్రోన్ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ప్లాంట్లోని ఆరో యూనిట్ డోమ్ సహా పలు చోట్ల ఉక్రెయిన్ మిలటరీ డ్రోన్లు ఆదివారం దాడి చేశాయన్నారు. అయితే ఎటువంటి నష్టం వాటిల్లలేదని, ఎవరూ చనిపోలేదని అన్నారు. ప్లాంట్లో అణుధారి్మకత స్థాయిలు కూడా సాధారణంగానే ఉన్నట్లు వివరించారు. దాడి సమాచారం తమకు అందిందని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) తెలిపింది. ఇటువంటి దాడులతో భద్రతాపరమైన ప్రమాదాలున్నాయని హెచ్చరించింది. యూరప్లోనే అతి పెద్దదైన జపొరిజియా అణు విద్యుత్కేంద్రం 2022 నుంచి రష్యా ఆ«దీనంలోనే ఉంది. ఇందులోని ఆరు యూనిట్లు కొద్ది నెలలుగా మూతబడి ఉన్నాయి. -
Russia-Ukraine war: రష్యా క్షిపణి దాడుల్లో 8 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్పైకి రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. శుక్రవారం రాత్రి నుంచి జరిపిన దాడుల్లో 8 మంది చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. రష్యా 32 ఇరాన్ తయారీ షహీద్ డ్రోన్లను, ఆరు క్షిపణులను ప్రయోగించగా 28 డ్రోన్లను, 3 క్రూయిజ్ మిస్సైళ్లను కూలి్చవేశామని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. తాజా దాడులపై రష్యా మిలటరీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. -
Russia-Ukraine war: రష్యాపై డ్రోన్లతో దాడి
కీవ్: రష్యా భూభాగంపై ప్రతి దాడులను ఉక్రెయిన్ ముమ్మరం చేసింది. శుక్రవారం సరిహద్దుల్లోని రష్యాకు చెందిన రోస్టోవ్ ప్రాంతంపైకి ఉక్రెయిన్ పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో మొరొజొవ్స్కీ ఎయిర్ ఫీల్డ్లోని ఆరు సైనిక విమానాలు ధ్వంసం కాగా, మరో ఎనిమిదింటికి నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ తెలిపింది. 20 మంది సిబ్బంది చనిపోయినట్లు ప్రకటించుకుంది. మొరొజొవ్స్కీ ప్రాంతంపైకి వచ్చిన 44 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. వైమానిక స్థావరంపై దాడి, యుద్ధ విమానాలకు జరిగిన నష్టంపై రష్యా స్పందించలేదు. దాడుల్లో ఒక విద్యుత్ ఉపకేంద్రం మాత్రం ధ్వంసమైందని పేర్కొంది. సరటోవ్, కుర్స్క్, బెల్గొరోడ్, క్రాస్నోడార్లపైకి వచ్చిన డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా ఆర్మీ తెలిపింది. -
యుద్ధం నీడలో ‘వైద్యం’ పూర్తి!
దేశంకాని దేశంలో ఎంబీబీఎస్ కోర్సు చదివేందుకు రెక్కలు కట్టుకొని వెళ్లారు.. ఓ కాలేజీలో తొలి సెమిస్టర్ పూర్తి చేసి రెండో సెమిస్టర్లోకి అడుగుపెట్టారు. అంతలోనే ఒక్కసారిగా దేశమంతా బాంబుల మోత, కాల్పుల శబ్దాలతో విలవిల్లాడారు.. కేంద్రం చొరవతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వదేశం చేరుకున్నా ఆగిన చదువును కొనసాగించాలన్న పట్టుదలతో తొలుత 2–3 నెలలు ఆన్లైన్ చదువులు చదివి.. ఆ తర్వాత కన్నవారిని, కేంద్రాన్ని ఒప్పించి మరో దేశంలోని కాలేజీలో కోర్సును పూర్తిచేసి స్వదేశానికి తిరిగొచ్చారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తాలూకు మనోవేదనను అధిగమించి.. అన్ని పరీక్షల్లోనూ విజయం సాధించిన 210 మంది వైద్య విద్యార్థుల విజయగాథ ఇది. లక్డీకాపూల్: ఉక్రెయిన్లోని జపోరిఝియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేపట్టిన ఎంబీబీఎస్ కోర్సును.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉజ్బెకిస్తాన్లోని బుఖారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో పూర్తిచేసిన 10 రాష్ట్రాలకు చెందిన 210 మంది విద్యార్థులకు మంగళవారం హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కన్నులపండువగా పట్టాల పంపిణీ జరిగింది. 86 మంది విద్యార్థినులు సహా మొత్తం 210 మంది ఉజ్బెకిస్తాన్ వెళ్లి కోర్సు పూర్తిచేశారు. అయితే జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) సూచనల మేరకు మొత్తం 210 మంది విద్యార్థులకు.. వారు ఎంబీబీఎస్ కోర్సు మొదలుపెట్టిన ఉక్రెయిన్లోని జపోరిఝియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచే పట్టాలు రావడం గమనార్హం. కాగా, ఎంబీబీఎస్ పాసైన విద్యార్థుల్లో 110 మంది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ) రాయగా 81 మంది తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులయ్యారు. వారిలోనూ 34 మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ విద్యార్థులది అపార కృషి: ఉజ్బెకిస్తాన్ రాయబారి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారత్లో ఉజ్బెకిస్తాన్ రాయబారి సర్దోర్ రుస్తంబేవ్ మాట్లాడుతూ విద్యార్థులంతా అపార కృషితోపాటు అడ్డంకులన్నింటినీ ఎదుర్కొని మరీ విజయం సాధించారన్నారు. వాళ్ల విజయంలో తమ దేశం పాత్ర ఉన్నందుకు గర్వపడుతున్నామని చెప్పారు. యుద్ధ కాలంలో విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చేలా చొరవ చూపడంతోపాటు తిరిగి వారిని ఉబ్జెకిస్తాన్ పంపడంలో కీలకపాత్ర పోషించిన నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండీ, ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖలో భారతీయ ప్రతినిధి డాక్టర్ దివ్యా రాజ్రెడ్డిని అభినందించారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తగిన అనుమతులు ఇచ్చిన కేంద్రానికి, జాతీయ మెడికల్ కౌన్సిల్కు కూడా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సంఘం చైర్మన్ పి. విజయబాబు, డాక్టర్ దివ్యారాజ్రెడ్డి, ఉజ్బెకిస్తాన్ ఎంబసీ ఫస్ట్ సెక్రటరీ ఎస్. సుయరొవ్, ఉజ్బెకిస్తాన్ ఎంబసీ కౌన్సిలర్ ఐ. సొలియెవ్, నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీఈఓ డాక్టర్ బీవీకే రాజ్, ఏఐజీ ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ సందీప్ సాహూ తదితరులు పాల్గొన్నారు. -
మిస్టరీ: అక్కడికి ఒంటరిగా వెళ్తే తిరిగిరారా? ప్రాణాలనే కోల్పోతారా?
ప్రపంచాన్ని వణికించే ప్రదేశాల్లో ‘దార్గాస్’ ఒకటి. రష్యాలోని ‘నార్త్ ఒసీషియా– అలానియా’ రిపబ్లిక్లో గిజెల్డన్ నది సమీపంలో ఉన్న ఓ చిన్న పర్వతం మీద ఉన్న దార్గాస్ గ్రామాన్ని ‘సిటీ ఆఫ్ ది డెడ్’ అని పిలుస్తారు. దీన్ని గ్రామం అనే కంటే శ్మశానాల దిబ్బ అనడమే కరెక్ట్. అక్కడి స్థానికులు పగటి పూట కూడా ఆ పర్వతం మీదకు ఒంటరిగా వెళ్లరు. ఆ దరిదాపుల్లో ఒంటరిగా తిరగరు. రాత్రి అయితే ఆ పర్వతం వైపు చూడను కూడా చూడరు. ‘నార్త్ ఒసీషియా–అలానియా’లో అత్యధికంగా నివసించే ఒసీషియన్ గిరిజన తెగకు చెందిన చరిత్రను చెబుతుంది ఈ ప్రాంతం. మధ్యయుగం నాటి ఒసీషియన్స్.. మరణించిన తమ కుటుంబసభ్యుల మృతదేహాలను ఇక్కడ పాతిపెట్టేవారట! ఇక్కడి శిథిల నిర్మాణాలు ఇంకెన్నో భయపెట్టే కథనాలతో బెదరగొడతాయి. దార్గాస్లో 99 సమాధులు చిన్నచిన్న ఇళ్ల మాదిరి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని దగ్గరదగ్గరగా.. ఇంకొన్ని దూరం దూరంగా.. మరికొన్ని ఒకదాని వెనుక ఒకటిగా.. కనిపిస్తాయి. వాటికి ఒకవైపు సుమారు నాలుగు అంతస్తుల ఎత్తులో ఒక పొడవాటి స్థూపం కూడా ఆకట్టుకుంటుంది. దాని లోపలికి దిగడానికి పెద్దపెద్ద నిచ్చెనలు ఏటవాలుగా ఉంటాయి. ఈ నిర్మాణాలన్నీ రాళ్లతో కట్టినవే! అక్కడ సుమారు 10 వేలకుపైనే అస్థిపంజరాలు ఉన్నాయని అంచనా వేశారు పరిశోధకులు. అయితే అక్కడున్న శవపేటికలు పడవ ఆకారంలో ఉన్నాయట. చనిపోయిన వారి ఆత్మ.. నదులను దాటుకుని స్వర్గానికి వెళ్లడానికి పడవ అవసరమని అక్కడి స్థానిక పురాణాలు చెబుతాయి. ఆ సమాధుల్లో వాళ్లకు ఇష్టమైన దుస్తులు, వస్తువులను కూడా ఉంచేవారు. అయితే దార్గాస్ పర్వతం మీదకు వెళ్లినవారు తిరిగిరారనే ప్రచారం కూడా ఉంది. కొందరు సాహసవంతులు ఆ పర్వతం మీదకెక్కి, అక్కడి సమాధుల మధ్యకు వెళ్లి, ఇక తిరిగి రాలేదట! దార్గాస్లో ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెబుతుంటారు. నిజానికి అక్కడ కేవలం 99 సమాధులే ఉన్నా, పదివేలకు పైగా అస్థిపంజరాలు ఎలా వచ్చాయి? అనే ప్రశ్నకు బదులుగా ఒక విషాదగాథ వినిపిస్తుంది. 18వ శతాబ్దంలో ఒసీషియాలో ప్లేగు వ్యాపించింది. ఆ సమయంలో ఆ వ్యాధి వ్యాప్తిని అరికట్టడం కోసం.. ఈ పర్వత సమాధుల మీదున్న నిర్మాణాలను పునరుద్ధరించి.. అక్కడ ప్లేగు వ్యాధిగ్రస్తులను ఉంచేవారట. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని.. వారికి కావాల్సిన ఆహారాన్ని, వస్తువులను అందించేవారట. వ్యాధి సోకిన వారు తిరిగి ఊళ్లోకి రావడానికి లేకుండా ఎన్నో ఆంక్షలు ఉండేవట. దాంతో ఆ పర్వతం మీదే ఎంతోమంది ప్రాణాలు విడిచారు. వారి మృతదేహాలు కనీసం ఖననానికి కూడా నోచుకోకపోవడంతో మిగిలిన వ్యాధిగ్రస్తులు కుళ్లిన మృతదేహాల పక్కనే జీవిస్తూ నరకం అనుభవించారని చరిత్ర చెబుతోంది. వరుస మరణాలతో నాటి పరిస్థితి చాలా ఘోరంగా గడిచిందట. నిజానికి దార్గాస్ పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఒక పక్క నది.. మరో పక్క ఎత్తయిన కొండలు, కొన్నిసార్లు నేలమీద దట్టంగా పేరుకున్న మంచు, మంచు కరిగినప్పుడు బయటపడే ఆకుపచ్చని గడ్డి నేల.. ఇలా కాలానికి తగ్గట్టుగా మారే దార్గాస్ ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడికి వెళ్లడానికి అందరూ సాహసించరు. కొందరు సాహసికులు మాత్రమే ఇక్కడికి Ðð ళ్లి.. ఫొటోలు, వీడియోలు తీసుకుని.. సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా రాత్రిపూట దార్గాస్ కొండల మీదకు వెళ్లేందుకు అనుమతి లేదు. మరి నిజంగానే అక్కడకి ఒంటరిగా వెళ్తే తిరిగిరారా? ప్రాణాలనే కోల్పోతారా? అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది.. -
ప్రపంచానికి మాస్కో పాఠం
ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. శుక్రవారం రాత్రి మాస్కో సమీపంలో క్రిక్కిరిసిన మాల్లోకి వచ్చి, ఓ సంగీత కార్యక్రమ హాలులోని జనంపై నలుగురు తీవ్రవాదులు జరిపిన విచక్షణారహితమైన దాడి ప్రపంచ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. గత రెండు దశాబ్దాల్లో రష్యాలో కనివిని ఎరుగని ఈ స్థాయి దాడిలో దాదాపు 140 మందికి పైగా అమాయకులు ప్రాణాలు విడిస్తే, కొన్ని పదుల మంది గాయాల పాలయ్యారు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ అయిదోసారి ఘనవిజయం సాధించిన కొద్ది రోజులకే ఈ దుశ్చర్య జరగడం గమనార్హం. యథేచ్ఛగా కాల్పులు జరిపి, భవనాన్ని తగులబెట్టిన దుండగులకు ఉక్రెయిన్తో లింకుందని రష్యా గూఢచర్య సంస్థల మాట. అయితే, 2022 నుంచి రష్యా యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్ మాత్రం తమకు సంబంధం లేదని ఖండించింది. కాగా, ఈ దాడి తామే చేసినట్టు తీవ్రవాద ‘ఐఎస్ఐఎస్’(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా) శాఖ అయిన ‘ఇస్లామిక్ స్టేట్ – ఖొరసాన్ ప్రావిన్స్’ (ఐఎస్ఐఎస్–కె) ప్రకటించడంతో కొత్త చర్చకు తెర లేచింది. జనబాహుళ్యం ప్రాంతాల్లో ఇస్లామిస్ట్ ఉగ్రదాడుల ప్రమాదం ఉందని అమెరికా మార్చి 7 నాటికే హెచ్చరించింది. అయినా, రష్యా పెడచెవిన పెట్టింది. అలా ఈ దాడులు మాస్కో స్వీయ భద్రతా వైఫల్యానికి అద్దం పట్టడమే కాక, ఆ దేశానికి తలవంపులయ్యాయి. మాస్కో శివారులోనే తీవ్ర వాదులు చులాగ్గా దాడి చేస్తుంటే, ఉక్రెయిన్పై యుద్ధంతో తీరిక లేని రష్యాకు తగిన ప్రత్యేక దళాలు అందుబాటులో లేకుండా పోయాయనే మాటా వినిపిస్తోంది. అయినా సరే, దేశంలో అసమ్మతిపై ఉక్కుపాదం మోపి, ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా 87.7 శాతంపైగా ఓట్లు తెచ్చుకొని, ఉక్రెయిన్పై యుద్ధానికి ప్రజామోదం ఉందని చెప్పుకుంటున్న రష్యా పాలకులు ఇప్పటికీ తప్పుడు దిశ వైపు చూస్తుండడం ఆశ్చర్యకరం. స్వయంకృతమని భావిస్తున్న తీవ్రవాద ముప్పుకూ పాశ్చాత్య ప్రపంచాన్నే నిందిస్తుండడం విచిత్రం. రెండు దశాబ్దాల పైగా ఉత్తర కాకసస్, చెచెన్యాలలో తీవ్రవాదంపై రష్యా తలపడుతోంది. సిరియా – ఇరాన్లతో దాని స్నేహం, మధ్యప్రాచ్యంలో దాని తీవ్రవైఖరి సరే సరి. ఇస్లామిజమ్ అణచివేతకూ దిగింది. దానికిప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోందని విశ్లేషణ. నిజానికి, ఇరాక్, సిరియా దేశాల యుద్ధక్షేత్రాల్లో అసలైన ఐఎస్ఐఎస్ చాలా వరకు ఓటమి పాలైంది. అయితే, ఆ మాతృసంస్థ తాలూకు రక్తసిక్త వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న ‘ఐఎస్ ఐఎస్ –కె’ పడగ విప్పి, బుసలు కొడుతోంది. అఫ్గానిస్తాన్ నుంచి పనిచేస్తున్నట్టుగా అందరూ భావిస్తున్న ఈ వర్గం నిదానంగా తన విషవృక్షపు ఊడలను విస్తరిస్తోంది. ఇప్పటికే అటు అఫ్గానిస్తాన్లోనూ, ఇటు పాకిస్తాన్లోనూ అది అనేక దాడులు జరిపింది. ఈ జనవరిలో సైతం ఇరాన్లోని కెర్మాన్లో ఇరానియన్ జనరల్ సంస్మరణ కార్యక్రమం సందర్భంగా అది జరిపిన బాంబు దాడుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజా మాస్కో దాడితో ఈ తీవ్రవాద గ్రూపు భౌగోళికంగా తన పరిధిని విస్తరించుకుంటున్నట్టు కనిపిస్తోంది. 2015 నాటి సిరియా అంతర్యుద్ధంలో రష్యా సేనలు అక్కడి అధ్యక్షుడు బషర్ అల్–అసద్ ఏలుబడిని సమర్థిస్తూ, ఐఎస్ వర్గానికి వ్యతిరేకంగా నిలిచాయి. సిరియాలో ప్రస్తుతం సద్దు లేనందున ‘ఐఎస్ఐఎస్–కె’ సారథ్యంలోని తీవ్రవాదులు అక్కడ తమ ఓటమికి ఇప్పుడిలా దాడి రూపంలో రష్యాపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించి ఉండవచ్చు. ఉక్రెయిన్తో యుద్ధంలో మునిగిన పుతిన్ ఈ తాజా తీవ్రవాద దాడిపై స్పందించే తీరు రానున్న రోజుల్లో ప్రపంచ శక్తి సంబంధాలపై ప్రభావం చూపడం ఖాయం. అసలు దాడికీ, ఉక్రెయిన్కూ సంబంధం ఉందన్న రష్యా మాట నమ్మశక్యంగా లేకపోగా, మధ్య ఆసియా ప్రాంతానికి విస్తరించాలని ‘ఐఎస్ఐఎస్–కె’ పడుతున్న ఆరాటానికి బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. తజిక్ వర్గాల్లో ఈ తీవ్రవాద వర్గానికి ఆకర్షణ పెరుగుతోందనీ, ఈ ప్రాంతానికి విస్తరించే సత్తా దానికి ఉందనీ జనవరిలోనే ఐరాస భద్రతా మండలి తన నివేదికలో హెచ్చరించడం గమనార్హం. గత రెండు దశాబ్దాల్లో వివి«ద రకాల తీవ్రవాద ఘటనలు చూసిన మాస్కో కళ్ళు తెరిచి నిద్ర నటించడం మానాలి. ప్రస్తుత పరిస్థితుల్లో శుష్క ఆరోపణలు మానేసి, సమస్య అసలు మూలాలపై దృష్టి పెట్టాలి. సొంత పెరట్లోనే ఈ తీవ్రవాద వర్గంతో పోరాటం చేస్తున్న అఫ్గానిస్తాన్ పాలకులతో కలసి కార్యాచరణ చేపట్టాలి. రష్యా ఘటన సాక్షిగా ఇప్పుడు కావాల్సిందల్లా... తీవ్రవాదంపై ప్రపంచ దేశాల మధ్య ఒక స్పష్టమైన అవగాహన, అంగీకారం. అంతర్జాతీయంగా ఐఎస్ఐఎస్–కె ఊడలు మరింత లోతుగా దిగక ముందే వివిధ ప్రపంచ దేశాలు నడుం బిగించాలి. మునుపు ఐఎస్ను మట్టి కరిపించడానికి కలసికట్టుగా కాలు కదిపినట్టే ఇప్పుడూ ముందుకు కదలాలి. ఐఎస్ఐఎస్–కె బలంగా వ్యతిరేకించే అఫ్గాన్ తాలిబన్తో అంతర్జాతీయ సమాజం సైతం సమన్వయం చేసుకోవాలి. సొంత గడ్డపై ఐఎస్ఐఎస్–కె, టీటీపీ లాంటి తీవ్రవాదుల కార్యకలాపాలను అనుమతించడం వల్ల చివరకు తమ దేశంతో పాటు, ఈ ప్రాంత భద్రతకే ప్రమాదమని అఫ్గానిస్తాన్ కూడా గ్రహించాలి. అందుకే, ఆ దేశం, దాని పొరుగునున్న ఈ తీవ్రవాద విషసర్పం కోరలు పీకే పనిలో ముందు వరుసలో నిలవాలి. ఇరాన్, చైనా, రష్యా, మధ్య ఆసియా దేశాలు కలిసొచ్చి, ప్రాంతీయంగా ముప్పుగా పరిణమిస్తున్న ఈ తీవ్రవాద భూతాన్ని నిర్వీర్యం చేయాలి. ఏకాగ్ర దృష్టితో సునిశితమైన కార్యాచరణకు దిగితేనే ఫలితాలుంటాయి. అప్పుడే అసువులు బాసిన అమాయకుల పక్షాన నిలిచి, దోషులను వెంటాడి వేటాడగలం. పొంచివున్న సరికొత్త తీవ్రవాద వర్గపు ప్రమాదం నుంచి ప్రపంచాన్ని కాపాడగలం. -
మాస్కో దాడి: ‘ఐసిస్ హస్తముందని అమెరికా నమ్ముతుందా?’
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో క్రాకస్ సిటీ హాల్లో శుక్రవారం అర్ధరాత్రి సంగీత కచేరి జరుగుతుండగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ మారణహోమంలో ఇప్పటివరకు 137కు మంది మృతి చెందారు. ఈ దారుణంలో 120 మందికి పైగా గాయపడ్డారు. అయితే దారుణాకి బాధ్యత వహిస్తూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఖోరసాన్) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని అమెరికా సైతం బహిరంగంగా ధృవీకరిస్తూ ప్రకటనలు చేయటం గమనార్హం. అయితే అమెరికా ప్రకటనలపై తాజాగా రష్యా స్పందించింది. ఉక్రెయిన్, ఆ దేశ అధ్యక్షడు వ్లాదిమిర్ జలెన్స్కీని రక్షించటం కోసమే అమెరికా.. ఈ దాడిని ఐసిస్పైకి నెడుతోందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖారోవా అన్నారు. తాను అమెరికా వైట్ హౌస్ను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. నిజంగా ఈ దాడికి పాల్పండింది ఐసిస్ అని మీరు (అమెరికా) ఖచ్చితంగా చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. ఇదే అభిప్రాయం మీద అమెరికా ఉండగలదా? అని నిలదీశారు. గతం మధ్య ప్రాచ్య దేశాలకు సంబంధించిన వ్యవహారాలపై అమెరికా జోక్యం చేసుకోవటం వల్ల రాడికల్, ఉగ్రవాదుల అధిపత్యం పెరిగిందని మండిపడ్డారు. ఉగ్రవాద సంస్థలు ఇప్పటికీ క్రీయాశీలకంగా ఉండటాని అమెరికా జోక్యమే కారణమన్నారు. ఇలా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవటం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషేధమని తెలిపారు. నియంత్రణ వైఖరితో ప్రపంచాన్ని ఉగ్రవాదులకు మద్దతుగా ఉండటం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఉక్రెయిన్లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించడానికి అమెరికా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తోందని మండిపడ్డారు. ఈ దాడికి సంబంధించి అమెరికా చేస్తున్న వ్యాఖ్యలపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే.. కాల్పుల ఘటనతో ఉక్రెయిన్కు సంబంధం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. పట్టుబడిన దుండుగుల్లో నలుగురు వ్యక్తులు ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్కు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. పుతిన్ ఆరోపణలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారుడైన మైఖైలో పొదొలాయిక్ స్పందిస్తూ.. మాస్కో మారణహోమంతో తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఉగ్రవాద పద్ధతులను పాటించే అలవాటు తమకు లేదన్నారు. -
ఉక్రెయిన్పై రష్యా మిసైళ్ల వర్షం.. అందుకు ప్రతీకారమే..!
కీవ్: ఉక్రెయిన్పై ఆదివారం(మార్చ్ 24)రష్యా తాజాగా మిసైళ్లతో విరుచుకుపడింది. కీవ్తో పాటు పశ్చిమ ఉక్రెయిన్లోని ఎల్వివ్పై రష్యా దాడులు చేసింది. కీవ్లో రష్యా దాడుల కారణంగా పలు చోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నాయని నగర మేయర్ విటాలి క్లిట్ష్కో తెలిపారు. అయితే ఈ దాడుల్లో ఎవరూ మృతి చెందలేదని, పెద్దగా నష్టమేమీ జరగలేదని కీవ్ చీఫ్ మిలిటరీ ఆఫీసర్ చెప్పారు. రష్యా మిసైళ్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసిందని తెలిపారు. ఇటీవల తమ దేశంలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఉక్రెయిన్ కావాలని దాడులు చేసిందని రష్యా ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే రష్యా తాజా దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడులపై రష్యా ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. రష్యా తాజా దాడులతో ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలండ్ అలర్ట్ అయింది. తమ ఆకాశంలోకి ఇతర దేశాల యుద్ధ విమానాలు ప్రవేశించకుండా నిఘా పెట్టింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం 2022 నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు -
మాస్కోలో మారణహోమం
మాస్కో/న్యూఢిల్లీ: రష్యా రాజధాని మాస్కోలో క్రాకస్ సిటీ హాల్లో చోటుచేసుకున్న మారణహోమంలో మృతుల సంఖ్య శనివారం 133కు పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి సంగీత కచేరి జరుగుతుండగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం తెలిసిందే. ఈ దారుణంలో 120 మందికి పైగా గాయపడ్డారు. వారిలో చాలామంది తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ వెల్లడించింది. వారిని పారిపోతుండగా పశి్చమ రష్యాలోని బ్రియాన్స్్కలో ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోనే బంధించినట్లు తెలిపింది. సరిహద్దు దాటి ఉక్రెయిన్ చేరాలన్న పన్నాగాన్ని భగ్నం చేసినట్లు స్పష్టం చేసింది. ఈ దాడికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఖోరసాన్) ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధికారులు మాత్రం ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ ముష్కరుల పనేనని ఆరోపిస్తున్నారు. కాల్పులకు తెగబడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనని అమెరికా నిఘా వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. తాజా పరిణామాలపై రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ చీఫ్ శనివారం రష్యా అధినేత పుతిన్తో సమావేశమయ్యారు. అనుమానితుల అరెస్టు తదితరాల గురించి తెలియజేశారు. రష్యాలో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల్లో పుతిన్ మరోసారి ఘన విజయం సాధించి ఆరేళ్లపాటు అధికారం దక్కించుకున్నారు. కొన్ని రోజులకే మాస్కోలో భీకర దాడి జరగడం, 133 మంది మరణించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. మోదీ దిగ్భ్రాంతి మాస్కో ఘోరకలిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అమానుష దాడిని భారత్ ఖండిస్తోందని పేర్కొన్నారు. విపత్కర సమయంలో రష్యా ప్రజలకు అండగా ఉంటామంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఉక్రెయిన్కు సంబంధం ఉంది: పుతిన్ కాల్పుల ఘటనతో ఉక్రెయిన్కు సంబంధం ఉందని పుతిన్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేసినట్లు తెలిపారు. పట్టుబడిన దుండుగుల్లో నలుగురు వ్యక్తులు ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్కు పారిపోయేందుకు ప్రయతి్నంచారని అన్నారు. మా పని కాదు: ఉక్రెయిన్ రష్యా కాల్పులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారుడైన మైఖైలో పొదొలాయిక్ స్పందించారు. మాస్కో మారణహోమంతో తమకు సంబంధం లేదని తేలి్చచెప్పారు. ఉగ్రవాద పద్ధతులను పాటించే అలవాటు ఉక్రెయిన్కు లేదన్నారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చేశారు ► కాల్పులు జరిగిన క్రాకస్ సిటీ హాల్ చాలా విశాలమైన కాంప్లెక్స్. ఇందులో మ్యూజిక్ హాల్తోపాటు షాపింగ్ సెంటర్ ఉంది. ► శుక్రవారం రాత్రి సంగీత కచేరి ప్రారంభం కావడానికి ముందు జనం సీట్లలో కూర్చున్నారు. మొత్తం 6,200 సీట్లూ నిండిపోయాయి. ► సంగీత కార్యక్రమం ప్రారంభం కాకముందే కాల్పుల మోత మొదలైనట్లు వీడియో ఫుటేజీని బట్టి తెలుస్తోంది. ► సైనిక దుస్తుల్లో వచి్చన ముష్కరులు అటోమేటిక్ రైఫిళ్లతో విరుచుకుపడ్డారు. ఉన్మాదుల్లాగా చెలరేగిపోయారు. జనంపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో గురిపెట్టి కాల్పులు జరిపారు. తూటా నుంచి రక్షణ కోసం పలువురు సీట్ల వెనుక దాక్కున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ► అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది. చాలామంది బయటకు పరుగులు తీసేందుకు ప్రయతి్నంచారు. తొక్కిసలాట జరిగింది. హాల్ కిక్కిరిసి ఉండడంతో తప్పించుకునే వీల్లేకుండా పోయింది. మృతుల సంఖ్య భారీగా పెరిగింది. లోపలంతా పొగ అలుముకుంది. ► ముష్కరులు గ్రెనేడ్లు, బాంబులు కూడా వేసినట్టు రష్యా మీడియా వెల్లడించింది. కాల్పులు, పేలుళ్ల ధాటికి హాల్లో మంటలు రేగాయి. పైకప్పు కూలిపోయింది. అగి్నమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. క్రాకస్ సిటీ హాల్లో కాల్పులు జరుపుతున్న దుండగులు -
Putin: ‘మాస్కోలో ఉగ్రదాడి.. ఉక్రెయిన్తో లింక్’
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారీ ఉగ్రదాడిపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. మాస్కోలో చోటు చేసుకున్న నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదలకు ఉక్రెయిన్తో సంబంధాలు ఉన్నాయని అన్నారు. ‘మాస్కోలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఉక్రెయిన్ వైపు పారిపోవడానికి యత్నించారు. తమకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఉక్రెయిన్-రష్యా సరిహద్దులను క్రాస్ చేసి ఉక్రెయిన్ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు’ పుతిన్ స్థానిక టెలివిజన్తో మాట్లాడుతూ ఆరోపించారు. ‘ఈ ఉగ్రదాడి వల్ల వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు దేశ వ్యాప్తంగా బాధకరమైన రోజు. ఈ దారుణమైన దాడికి పాల్పన వ్యక్తులు, ఉగ్రసంస్థలను శిక్షిస్తాం. వారు ఎవరైనా.. వారికి వెనక ఎవరున్నా కోరుకోం. ఉగ్రవాదుల వెనక ఎవరు ఉన్నారనే విషయాన్ని గుర్తిస్తాం. రష్యా ప్రజలకు వ్యతిరేకంగా దాడులకు ప్రణాళిక వేసిన వారిని గుర్తించి శిక్షిస్తాం’ అని పుతిన్ హెచ్చరించారు. మాస్కో దాడి వెనకాల ఉక్రెయిన్కు లింక్ ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ‘మాస్కో ఉగ్రదాడిలో ఉక్రెయిన్కు ఎటువంటి సంబంధం లేదు. ఆ ఉగ్రదాడికి మాకు లింక్ ఉందన్న ఆరోపణలు నిరాధారమైనవి’ అన ఉక్రెయిన్ మిలిటరీ స్పై ఏజెన్సీ స్పష్టం చేసింది. రష్యాలోని మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లోకి చొచ్చుకుని వచ్చిన పలువురు సాయుధులు బాంబులు విసురుతూ.. తుపాకులతో అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 133 మంది మరణించారు. వంలాది మంది గాయపడినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్విస్ వెల్లడించింది. మరోవైపు.. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ మాస్కో దాడి తమ పనే అని ప్రకటించుకుంది. రష్యా రాజధాని మాస్కో శివార్లలో.. మా సంస్థ పెద్ద గుంపుపై దాడి చేసింది. అంతేకాదు మా బృందం సభ్యులు దాడి తర్వాత సురక్షితంగా తమ స్థావరాలకు చేరుకున్నారు అని టెలిగ్రామ్ ద్వారా ఒక సందేశం విడుదల చేసింది. మరోవైపు రష్యా నేషనల్ గార్డు మాత్రం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. -
మాస్కో మారణకాండలో 115 చేరిన మృతుల సంఖ్య, 11 మంది అరెస్ట్
రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. క్రాకస్ సిటీ కన్టర్ట్ హాల్లో శుక్రవారం ఐసిస్ తీవ్రవాదులు ఒడిగట్టిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇప్పటి వరకు 115 చేరింది. 145 మంది గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి 11 మందిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రషన్స్ శాసనసభ్యుడు అలెగ్జాండర్ ఖిన్స్టెయిన్ మాట్లాడుతూ.. దాడి చేసిన వ్యక్తులు పారిపోయారని.. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో కారును వెంబడించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల కారులో పిస్టల్, అసాల్ట్ రైఫిల్కు సంబంధించిన మ్యాగజైన్, తజకిస్థాన్కు చెందిన పాస్పోర్ట్లు లభించాయని తెలిపారు. మరో ఇద్దరు నిందితులు కాలినడకన సమీపంలోని అడవిలోకి పారిపోయారని పేర్కొన్నారు. అనంతరం వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కాగా పశ్చిమ మాస్కోలోని కాన్సర్ట్ హాల్లోకి దుండగులు విరుచుకుపడి కాల్పులు జరిపిన జరిపిన సంగతి తెలిసిందే. కాల్పులతో పాటు బాంబులు విసిరి బిభత్సం సృష్టించారు. దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది. చదవండి: మాట మార్చిన మాల్దీవులు.. భారత్ ఎప్పుడూ మిత్రుడే అంటూ.. -
మాస్కోలో ఉగ్రదాడి.. రష్యాకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారీ ఉగ్రదాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లో ఐసిస్ ఉగ్రసంస్థ పాల్పడిన ఘాతుకాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. రష్యాకు, అక్కడి ప్రజలకు భారత్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ‘మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. మా ఆలోచనలు, ప్రార్ధనలు ఎప్పటికీ వారి కోసం ఉంటాయి. ఈ విషాద సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుంది’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా శుక్రవారం సైనిక దుస్తుల్లో కన్సర్ఠ్ హాల్లోకి చొచ్చుకొని వచ్చిన దుండగులు.. ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. కాల్పులతో పాటు బాంబులు విసిరి బిభత్సం సృష్టించారు. ఏం జరుగుతుందో తెలియక అక్కడున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది. ఈ భయంకర ఘటనలో ఇప్పటి వరకు 60 మంది మృతి చెందగా.. 150 మందికి పైగా గాయపడ్డారు. ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ‘ఫిక్నిక్’ సంగీత కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. చదవండి: మాస్కో దాడులు: ముందే హెచ్చరించిన అమెరికా ! We strongly condemn the heinous terrorist attack in Moscow. Our thoughts and prayers are with the families of the victims. India stands in solidarity with the government and the people of the Russian Federation in this hour of grief. — Narendra Modi (@narendramodi) March 23, 2024 -
గాజాలో కాల్పుల విరమణ.. ‘యూఎన్’లో వీగిన అమెరికా తీర్మానం
న్యూయార్క్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఐక్యారజ్యసమితి(యూఎన్) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. చైనా, రష్యా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లోని 15 సభ్య దేశాల్లో 11 తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. తీర్మానానికి అల్జేరియా వ్యతిరేకంగా ఓటు వేయగా గుయానా ఓటింగ్లో పాల్గొనలేదు. ఆకలితో అలమటిస్తున్న గాజా యుద్ధ బాధితులు మానవతా సాయం పొంందేందుకు వీలుగా ఆరు వారాల పాటు కాల్పుల విరణమణ పాటించాలని అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే దీనికి ప్రత్యామ్నాయ తీర్మానంపై ఓటింగ్ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శనివారం మళ్లీ సమావేశం కానుంది. తీర్మానంలోని చైనా, రష్యాలకు అభ్యంతరమున్న పదాలను మార్చినట్లు తెలుస్తోంది. రంజాన్ సందర్భంగా గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని తాజా తీర్మానంలో పొందుపరిచినట్లు సమాచారం. ఇదీ చదవండి.. మాస్కోలో ఐసిస్ మారణహోమం -
రష్యా మాస్కోలో ఐసిస్ ఉగ్రదాడి
-
Russia: మాస్కోలో ఐసిస్ భారీ ఉగ్రదాడి
మాస్కో: రష్యా రాజధానిలో ఉగ్రవాదులు(ISIS) నరమేధానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లోకి చొచ్చుకుని వచ్చిన పలువురు సాయుధులు బాంబులు విసురుతూ.. తుపాకులతో అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 60 మందికిపైగా మృతి చెందగా, వంలాది మంది గాయపడినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్విస్ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు ప్రకటించారు. మాస్కో శివారులోని క్రోకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ‘ఫిక్నిక్’ సంగీత కార్యక్రమం జరుగుతోంది. ఆ సమయంలో సైనిక దుస్తుల్లో కాన్సర్ట్హాల్లోకి వచ్చిన ఐదుగురు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. తుపాకుల మోత నడుమ.. ఏం జరుగుతుందో అర్థకాక తీవ్ర భయాందోళనలతో అక్కడున్న వారు సీట్ల మధ్య దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హాల్లో చిక్కకున్న పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారి కోసం భారీగా అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. అతి సమీపం నుంచి తుపాకులతో కాల్పులు జరిపిన దాడి వీడియోలు బయటికొచ్చాయి. Horrifying visuals of the terror attack coming out of Moscow. The carnage is unimaginable. Devastating to say the least. This world needs peace and sanity. pic.twitter.com/sWFc4mTjVK — Supriya Shrinate (@SupriyaShrinate) March 22, 2024 The scary footage where people are running during the attack.#Moscou #Moskou #CrocusCityHall #Moscow #Russia #terrorist pic.twitter.com/gJchCa8zrU — Reality Talks (@RealityTallk) March 23, 2024 Very sad to hear what happened in #Moscow Praying for them 💔 pic.twitter.com/UUMcl9RsmI — Follow Back (@FzlMah) March 22, 2024 దాడి సమాచారం అందుకున్న ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారాయన. దాడి వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని పుతిన్ పేర్కొన్నట్లు క్రెమ్లిన్ ఒక ప్రకటన విడుదల చేసింది. పుతిన్ దేశాధ్యక్షుడిగా తిరిగి ఎన్నికై సంబరాలు జరుపుకుంటున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రష్యాలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే అని చెబుతున్నారు. దాడి మా పనే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ISIS-Islamic State of Iraq and Syria) మాస్కో దాడి తమ పనే అని ప్రకటించుకుంది. రష్యా రాజధాని మాస్కో శివార్లలో.. మా సంస్థ పెద్ద గుంపుపై దాడి చేసింది. అంతేకాదు మా బృందం సభ్యులు దాడి తర్వాత సురక్షితంగా తమ స్థావరాలకు చేరుకున్నారు అని టెలిగ్రామ్ ద్వారా ఒక సందేశం విడుదల చేసింది. మరోవైపు రష్యా నేషనల్ గార్డు మాత్రం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. -
రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ప్రధాని మోదీ ఫోన్ కాల్..
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు, ఉక్రెయిన్ అధ్యక్షులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఫోన్లో మాట్లాడారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంపై శాంతి కోసం భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరూ ప్రధాని మోదీని తమ దేశానికి ఆహ్వానించారు. లోక్సభ ఎన్నికల తర్వాత తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రాధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో బుధవారం ఫోన్లో మాట్లాడారు. రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా అయిదోసారి ఎన్నికైనందుకు పుతిన్కు ప్రధాని అభినందనలు తెలిపారు. రష్యా ప్రజల శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఆకాంక్షించారు. రాబోయే కాలంలో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు. ఈ మేరకు ప్రధాని ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాగా ఇటీవల జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం సాధించారు. దాదాపు 88 శాతం ఓట్లతో ఆయన గెలుపొందారు. ఇప్పటికే 1999 నుంచి రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పుతిన్.. మరో ఆరేళ్లపాటు ఆ పదవిలో ఉండనున్నారు. దాంతో రష్యాకు ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన జోసెఫ్ స్టాలిన్ రికార్డును అధిగమించనున్నారు. మరో పోస్ట్లో.. భారత్-ఉక్రెయిన్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై జెలెన్స్కీ మాట్లాడినట్లు ప్రధాని మోదీ తెలిపారు. శాంతిని నెలకొల్పేందుకు చేసే అన్ని ప్రయత్నాలకు భారత్ నుంచి స్ధిరమైన మద్దతు లభిస్తుందని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అలాగే భారత్ నుంచి తమ ప్రజల కోసం మానవతా సహాయాన్ని అందించడం కొనసాగుతుందని పేర్కొన్నారు. చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం అదే! Spoke with President Putin and congratulated him on his re-election as the President of the Russian Federation. We agreed to work together to further deepen and expand India-Russia Special & Privileged Strategic Partnership in the years ahead. @KremlinRussia — Narendra Modi (@narendramodi) March 20, 2024 -
ఎన్నిక అపహాస్యమే అయినా...
అనుకున్నదే అయింది. ఫలితం ముందే నిర్ణయమై, అపహాస్యంగా మారిన రష్యా ఎన్నికల్లో అందరూ ఊహించినట్టే వ్లాదిమిర్ పుతిన్ అయిదో పర్యాయం అధ్యక్షుడయ్యారు. కంటితుడుపుగా సాగిన రిగ్గింగ్ ఎన్నికలన్న విమర్శకుల ఆరోపణలకు తగ్గట్టే ఆయన మునుపెన్నడూ, ఎవరికీ రానన్ని ఓట్లతో అఖండ విజయం సాధించారు. పుతిన్ గెలుపు ముందే నిశ్చయమైనా, సోమవారం అధికారిక వెల్లడింపుతో ఒక తంతు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో భిన్నాభిప్రాయాలకూ, రాజకీయ పోటీకీ కాసింత అవకాశమైనా ఇచ్చిన 71 ఏళ్ళ ఈ మాజీ గూఢచారి ఇప్పుడు అందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరని తేలిపోయింది. వెరసి, పుతిన్ హయాంలో రష్యాలో పాలన నిరంకుశత్వం నుంచి ఏకఛత్రాధిపత్యం, ఏకవ్యక్తి పాలన దిశగా వెళుతున్నట్టు ప్రపంచానికి ఖరారైంది. సోవియట్ పతనానంతర కాలంలో ఎన్నడూ లేనట్టు రష్యా ఎన్నికల్లో పుతిన్ అత్యధికంగా 88 శాతం దాకా ఓట్లు సాధించడం స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. ప్రధానిగా అయితేనేం, అధ్యక్షుడిగా అయితేనేం పాతికేళ్ళుగా పీఠంపై ఉన్న పుతిన్ ఇప్పుడిక రష్యాపై పూర్తిగా పట్టు బిగించారన్న మాట. అధ్యక్షుడిగా కొనసాగేందుకు వీలుగా ఇప్పటికే ఆయన రాజ్యాంగాన్ని మార్చేశారు. తాజా విజయంతో మరో ఆరేళ్ళు ఆ పదవి ఆయనదే. ఇలాగే, వచ్చే 2030లో సైతం పుతిన్ విజయం సాధిస్తే, కొత్త చరిత్ర ఆవిష్కృతమవుతుంది. అదే జరిగితే, 31 ఏళ్ళ పాటు అధికారం చలాయించిన స్టాలిన్ రికార్డును పుతిన్ తిరగరాసినట్టవుతుంది. పైపెచ్చు, పుతిన్ ఈసారి విజయం సాధిస్తూనే... అమెరికా సారథ్యంలోని ‘నాటో’ కూటమి గనక ఉక్రెయిన్లో బలగాలను మోహరిస్తే సహించబోమన్నారు. అదే గనక జరిగితే ‘పూర్తిస్థాయిలో మూడో ప్రపంచ యుద్ధమే’ అని హెచ్చరించడం గమనార్హం. నిజానికి, మార్చి 15 – 17 మధ్య జరిగిన తాజా ఎన్నికలు పెద్ద ప్రహసనం. అభ్యర్థులుగా అధి కారిక ఆమోదం పొందిన ప్రత్యర్థులు పేరుకు రంగంలో ఉన్నారు. కానీ, బరిలో నిలిచేందుకూ, పోటీలో గెలిచేందుకూ వారు ఇసుమంతైనా ప్రయత్నించలేదు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న మరో ఇద్దరు పాపులర్ వ్యక్తులు సైతం మొదట బరిలో ఉన్నారు. తీరా పుతిన్ విజ యంపై ఎంతో కొంత ప్రభావం చూపగల వారి అభ్యర్థిత్వాన్ని సాంకేతిక కారణాలతో తోసిపుచ్చారు. ఇక గత 2018 ఎన్నికల వేళ పుతిన్కు కంటిలో నలుసైన జనాకర్షక ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ గత నెల ఓ ఆర్కిటిక్ జైలులో అంతుచిక్కని రీతిలో మరణించారు. మాస్కో యుద్ధం సందర్భంగా రష్యా కలిపేసుకున్న నాలుగు ఉక్రెయిన్ ప్రావిన్సుల్లోనూ ఓటింగ్ జరిగింది. అయితే, సాయుధ బలగాల కనుసన్నల్లో బలవంతపు ఓటింగ్ వల్ల ఫలితం ఏమిటన్నది అర్థమై పోయింది. ఒకపక్క ఎన్నికలు జరుగుతుండగానే రష్యా భూభాగంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు కొనసాగాయి. కీవ్, దాని పాశ్చాత్య భాగస్వామ్య పక్షాల నుంచి మాస్కోకు ముప్పు తప్పదని తేల్చాయి. పుతిన్ అయిదోసారి గెలిచినా, ప్రజాక్షేత్రంలో అసమ్మతి పుష్కలం. ఫక్తు ఫార్సుగా మారిన ఎన్నికల్ని నిరసిస్తూ, కొందరు ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో రంగు పోశారు. అలాగే, నావల్నీ నివాళికి వేలాది రష్యన్లు హాజరవడం గమనార్హం. అయితే, దేశాన్ని పూర్తిస్థాయి ఏకవ్యక్తి పాలనగా మార్చేసేందుకు పుతిన్కు దక్కిన వరం – ఉక్రెయిన్తో యుద్ధం. ‘ప్రత్యేక సైనిక చర్య’గా స్వల్పకాలిక దాడితో ఉక్రెయిన్పై పైచేయి సాధించాలని ఆయన మొదట భావించారు. తీరా అది దీర్ఘకాలిక పోరై, నష్టా లకు దారి తీసింది. అయినా, అణచివేత కొనసాగిస్తూ, పాశ్చాత్య ప్రపంచంతో సుదీర్ఘ యుద్ధంలో అంతిమ విజయం మనదేనంటూ రష్యన్లతో పుతిన్ నమ్మబలికారు. సలహాదారుల మాట పెడచెవిన పెట్టి, యుద్ధాన్ని ప్రచారంలో ప్రధానాంశం చేశారు. యుద్ధంపై నిరసన నేరమంటూ, నిరసించే పౌరులంతా ‘విదేశీ ఏజెంట్లే’ అంటూ చట్టమే చేశారు. ఎవరేమనుకున్నా మళ్ళీ అధ్యక్షుడయ్యారు. దేశమంతా తన వెంటే ఉందని చాటేందుకు పుతిన్ ఈ ఎన్నికను అవకాశంగా వాడుకున్నారు. అణచివేత మాట అటుంచితే, రష్యాలో ఇప్పటికీ పాపులర్ నేతనని నిరూపించుకున్నారు. ఉక్రెయిన్తో పోరులోనూ మొదట కొద్దినెలలు గట్టి ఎదురుదెబ్బలు తగిలినా, అనూహ్యంగా ఇప్పటికీ పట్టు నిలుపుకొన్నారు. కఠినమైన ఆర్థిక ఆక్షలు ఎదురైనా, దేశ ఆర్థిక వ్యవస్థను అంచనాలను మించేలా నిలబెట్టగలిగారు. పాశ్చాత్య బ్రాండ్లు దేశం విడిచివెళ్ళినా, అదే విధమైన స్థానిక ఉత్పత్తులతో సామన్యులపై ప్రభావం పడకుండా చూసుకున్నారు. ముడి చమురు కొనుగోళ్ళకు యూరప్ అడ్డం తిరిగినా, భారత్, చైనా, టర్కీలతో ఆదాయం పుష్కలంగా కొనసాగేలా చూసుకున్నారు. రష్యాకు రాజకీయ, ఆర్థిక సుస్థిరత సమకూర్చినప్పటికీ, దేశాన్ని నిరంకుశ పాలనలోకి దింపడమే పెద్ద చిక్కు. అయితే, ఇష్టమున్నా, కష్టమైనా కనీసం మరో ఆరేళ్ళ పాటు రష్యా సారథి పుతినే. అమెరికా, దాని మిత్రపక్షాలు సహా అందరూ ఆ వాస్తవాన్ని గుర్తించాలి. ఎలాగోలా పుతిన్కు నచ్చజెబితే తప్ప ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పుడప్పుడే తెర పడే పరిస్థితి లేదని గమనించాలి. పుతిన్తో వైరం పెరిగినకొద్దీ అది తూర్పు ఐరోపాకే కాక మొత్తం ప్రపంచానికే తలనొప్పి అని గ్రహించాలి. పాశ్చాత్యప్రపంచం సైతం తన వైఖరిలోని తప్పులను ఆత్మపరిశీలన చేసుకోవాలి. రష్యాకు మిత్రదేశాలైన భారత్, చైనా లాంటివి ఈ శత్రుత్వ ధోరణి సద్దుమణిగేలా ప్రయత్నించాలి. 2022లో ఉక్రెయిన్పై పుతిన్ జరపదలచిన అణ్వస్త్రదాడిని ఆపింది భారత ప్రధాని, ఇతర నేతలేనంటూ వస్తున్న తాజా కథనాలు విస్మరించలేనివి. అమెరికా, రష్యాలు రెంటితోనూ బలమైన బంధమున్న భారత్ శాంతియుత పరిష్కారానికై కృషి చేయాలి. ఎందుకంటే, ఉక్రెయిన్ యుద్ధం మరింత కాలం కొనసాగడం మానవాళికి ఏమాత్రం మేలు కాదు! -
రష్యాకు కొత్త రాయబారి.. నియమించిన కేంద్రం
న్యూఢిల్లీ: విదేశీ వ్యవహరాల్లో నిపుణుడైన ఇండియన్ ఫారెన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి వినయ్కుమార్ను రష్యా రాయబారిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం(మార్చ్ 19) విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వినయ్కుమార్ 2021 నుంచి మయన్మార్లలో భారత రాయబారిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం రష్యా రాయబారిగా పనిచేస్తున్న పవన్కుమార్ ఇటీవలే విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. సాధారణంగా మాస్కో, వాషింగ్టన్, లండన్, టోక్యో, కాన్బెర్రా నగరాలు భారత ఐఎఫ్ఎస్ అధికారులకు కీలక పోస్టింగ్లుగా భావిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిత్ర దేశం రష్యాతో సంబంధాలు మరింత మెరుగుపరిచుకునేందుకు అనుభవజ్ఞుడైన వినయ్కుమార్ను నియమించినట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి.. రష్యాతో నాటో ఘర్షణకు దిగితే మూడో ప్రపంచ యుద్ధమే -
రష్యాతో నాటో ఘర్షణకు దిగితే... మూడో ప్రపంచ యుద్ధమే
మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మరుక్షణమే వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలకు యుద్ధ హెచ్చరికలు పంపారు. ‘‘అమెరికా సారథ్యంలోని నాటో కూటమి, రష్యా సైన్యం మధ్య ప్రత్యక్ష ఘర్షణలు జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. కానీ అంతటి దారుణ విపత్తును ఎవరూ కోరుకోరు’’ అన్నారు. ఉక్రెయిన్ సైన్యానికి తోడుగా కదనరంగంలోకి ఫ్రాన్స్ బలగాలను దింపే ఉద్దేశముందన్న ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్ వ్యాఖ్యలపై పుతిన్ ఇలా స్పందించారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధంలో వందలాది ఇంగ్లిష్, ఫ్రెంచ్ సైనికులు చనిపోయారు. ఇది సరికాదు’’ అన్నారు. చర్చలకు సదా సిద్ధం ఉక్రెయిన్ సైన్యం దాడులు ఇలాగే కొనసాగితే దాని చుట్టూ ఒక బఫర్ జోన్ను సృష్టిస్తామని పుతిన్ అన్నారు. ‘‘దాన్ని దాటి వైరి సైన్యం రష్యా భూభాగంలోకి అడుగుపెట్టడం అసాధ్యం. పూర్తిగా ఓటమి పాలయ్యేలోపు శాంతి బాట పట్టడం ఉత్తమం. చర్చలకు సిద్ధమని మేం మొదట్నుంచీ చెబుతున్నాం’’ అన్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగలేదన్న అమెరికా, పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. అమెరికాలోనే ఎన్నికలు సజావుగా జరగడం లేదని విమర్శించారు. ట్రంప్కు వ్యతిరేకంగా అధ్యక్షుడు బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 2030 దాకా అధ్యక్ష పీఠంపై రష్యా రాజకీయ వ్యవస్థపై పుతిన్ పట్టు మరోసారి రుజువైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. పోలైన ఓట్లలో 87.29 శాతం (7.6 కోట్ల) ఓట్లు ఆయనకు పడ్డట్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సోమవారం ప్రకటించింది. పుతిన్కు ఇన్ని ఓట్లు రావడం ఇదే తొలిసారి. ఆరేళ్లపాటు, అంటే 2030 దాకా పుతిన్ అధ్యక్షునిగా కొనసాగుతారు. ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల భాగస్వామ్యం మరింత సుధృఢంకావాలని అభిలషించారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఉత్తరకొరియా పాలకుడు కిమ్, హోండురాస్, నికరాగ్వా, వెనిజులా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాధినేతలూ పుతిన్కు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమదేశాలు మాత్రం ఈ ఎన్నికలు పెద్ద మోసమని విమర్శించాయి. నవాల్నీని వదిలేద్దామనుకున్నాం.. దివంగత విపక్ష నేత అలెక్సీ నవాల్నీ ప్రస్తావనను పుతిన్ తొలిసారిగా బహిరంగంగా తెచ్చారు. ‘‘ఖైదీల మార్పిడిలో భాగంగా నవాల్నీని విదేశాలకు అప్పగించి పశ్చిమదేశాల జైళ్ల నుంచి రష్యన్లను వెనక్కు తెద్దామని మా అధికారుల సలహాకు వెంటనే ఒప్పుకున్నా. ఆ లోపే ఆయన జైల్లో చనిపోయారు. కొన్ని అలా జరుగుతాయంతే. ఇదే జీవితం’’ అన్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- PK: 'పులుసు కారుతోంది'..!
- ఓటీటీకి వచ్చేసిన పుష్ప విలన్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
Advertisement