-
చీకట్లోనూ స్పష్టంగా చూపిస్తుంది..
రాత్రివేళ చీకట్లో దగ్గరగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా చూడటం సాధ్యం కాదు. చీకట్లో భూతద్దాలను ఉపయోగించినా ఫలితం ఉండదు. ఈ బైనాక్యులర్ చేతిలో ఉంటే మాత్రం చీకట్లోనూ దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడటం సాధ్యమవుతుంది. జపాన్కు చెందిన కెమెరాల తయారీ కంపెనీ ‘యాషికా’ ఇటీవల ఈ నైట్విజన్ బైనాక్యులర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల రీచార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులోని ఫిక్స్డ్ ఆప్టికల్ జూమ్ను ఉపయోగిస్తే, దూరంగా ఉన్న వస్తువులు మూడురెట్లు దగ్గరగా కనిపిస్తాయి. డిజిటల్ ఆప్టికల్ జూమ్ను ఉపయోగిస్తే, ఐదురెట్లు దగ్గరగా కనిపిస్తాయి. డిజిటల్ కెమెరాల మాదిరిగానే దీనికి నాలుగు అంగుళాల హై డెఫినిషన్ డిస్ప్లే ఉంటుంది. దీని ద్వారా చీకట్లో 600 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుల రంగులను సైతం స్పష్టంగా చూడవచ్చు. ఇందులోని 512 జీబీ ఎక్స్టర్నల్ మెమరీకార్డ్లో చూసిన దృశ్యాలను రికార్డు చేసుకోవచ్చు. ఇది బైనాక్యులర్గా మాత్రమే కాకుండా, వీడియో కెమెరాగా కూడా పనిచేస్తుంది. దీని ధర 169 డాలర్లు (రూ. 14,050) మాత్రమే! ఇవి చదవండి: మొక్కల నుంచి వచ్చే సంగీతాన్ని వినొచ్చు తెలుసా! -
'బుల్లెట్ అలా ఎలా బయటికి వస్తుంది బ్రో'.. ఆ సీన్పై సైంధవ్ డైరెక్టర్ క్లారిటీ!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైంధవ్. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. వెంకటేశ్ నటిస్తోన్న 75వ మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 13న విడుదలవుతోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెంచేసింది. ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ చిత్రంగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ట్రైలర్లో ప్రతి సీన్లో బుల్లెట్ల వర్షం కురిపించారు వెంకీమామ. ఇందులో ఓ సీన్ అయితే ఏకంగా పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. బుధవారం మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సీన్స్ను తలపించింది. అయితే ఒక్క సెకన్ కూడా చూపించని ఆ సీన్ పైనే ఇప్పుడు చర్చ మొదలైంది. ట్రైలర్లో ఓ రౌడీ నోట్లో తుపాకీ పెట్టిన వెంకటేశ్ అతన్ని కాల్చగా.. ఆ బుల్లెట్ ఏకంగా అతని మలద్వారం నుంచి బయటకు వచ్చినట్లు చూపించారు. తల వెనుక భాగం నుంచి రావాల్సిన బుల్లెట్ అలా ఎలా వెళ్లిందటూ నెటిజన్స్ షాకింగ్కు గురయ్యారు. అంతే కాకుండా ఆ సీన్పై మీమ్స్ ఇక చెప్పాల్సిన పనిలేదు. గ్రాఫిక్స్ చేసి మరీ సీన్స్ వైరల్ చేస్తున్నారు. అయితే తాజాగా నెట్టింట వస్తున్న డైరెక్టర్ శైలేశ్ కొలను స్పందించారు. ఆ వీడియోను చూసిన ఆయన చాలా ఫన్నీగా ఉందంటూ ట్వీట్ చేశారు. బుల్లెట్ మలద్వారం నుంచి బయటకు వచ్చే విషయమై పూర్తి వివరణ ఇచ్చారు. శైలేశ్ తన ట్వీట్లో రాస్తూ.. 'హాహ్హా.. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఏ విషయమైనా చెప్పడానికి నేను ఇష్టపడతా. మామూలుగా నోట్లో తుపాకీ పెట్టి కాలిస్తే బుల్లెట్ తల వెనుక వైపు నుంచి బయటకు వస్తుంది. కానీ ఒక వ్యక్తిని ఒక కచ్చితమైన దిశలో కూర్చోబెట్టి.. గన్ బ్యారెల్ను వీలైనంతగా అతడి నోటి లోపలికి పెట్టి.. సుమారు 80 డిగ్రీల కోణంలో కాలిస్తే.. అతని అవయవాలను చీల్చుకుంటూ బుల్లెట్ బయటకు వస్తుంది.' అని రాసుకొచ్చారు. అంతే కాకుండా.. 'మీరు ఆ బొమ్మలో చూపించినట్లు బుల్లెట్ శ్వాస కోశం, అన్నవాహిక, కాలేయం, పాంక్రియాస్, కొన్నిసార్లు గుండెను గాయం చేస్తుంది. ఆ తర్వాత పెద్ద, చిన్న ప్రేగులను చీల్చుకుంటూ మలద్వారం నుంచి బయటకు వస్తుంది. ఇలా షూట్ చేయడానికి చాలా నేర్పు కావాలి. సైకో స్పెషల్ స్కిల్ ఇది. థియేటర్లో ప్రేక్షకులను అలరించేందుకు మాత్రమే ఈ మాస్ మూమెంట్ క్రియేట్ చేశాం. కానీ మీరు షేర్ చేసిన వీడియో చాలా ఫన్నీగా ఉంది బ్రదర్..' అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరోవైపు డైరెక్టర్ శైలేశ్ వివరణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Hahaha this is funny af. Since I like explaining things, let me start this, generally if you shoot someone in the mouth the bullet should exit from the back of the head, but if you make the person sit in a specific angle and shove the barrel of the gun enough into the mouth and… https://t.co/BLrZXrK7Da — Sailesh Kolanu (@KolanuSailesh) January 4, 2024 -
సందీప్ రెడ్డి యానిమల్.. ఆ సీన్ కూడా కాపీనేనా?
రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం ‘యానిమల్’. డిసెంబర్ 1న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఈ మూవీపై మొదట చాలామంది విమర్శలొచ్చాయి. అయితే విమర్శలతో పాటు ప్రశంసలు కూడా అదేస్థాయిలో వచ్చాయి. అయితే ఈ చిత్రంలో ఫైట్ సీన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. (ఇది చదవండి: 'యానిమల్' సినిమా చూసి నా కూతురు ఏడ్చేసింది.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్) అయితే తాజాగా బాబీ డియోల్, రణ్బీర్ కపూర్ క్లైమాక్స్ ఫైట్ సీన్పై కాపీ విమర్శలు వైరలవుతున్నాయి. 2001లో వచ్చిన ఆషిక్ మూవీలోని సీన్ను కాపీ కొట్టారంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆషిక్ మూవీ వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు. నేను పొరపాటున రాంగ్ యానిమల్ మూవీ సీన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఆషిక్ చిత్రంలో బాబీ డియోల్ హీరోగా నటించారు. అయితే గతంలోనూ యానిమల్పై కాపీ ఆరోపణలు వచ్చాయి. యానిమల్ ట్రైలర్ను విడుదలైన వెంటనే హువా మైన్ పాటలో రష్మిక, రణబీర్ ఫ్లైట్ సీన్ను 50 షేడ్స్ ఆఫ్ గ్రే చిత్రం కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అంతే కాకుండా మరో ఫైట్ సీక్వెన్స్ కొరియన్ చిత్రం నుండి కాపీ చేశారంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలు ఎదురైనా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రీ, శక్తి కపూర్, సురేష్ ఒబెరాయ్, ప్రేమ్ చోప్రా బాలీవుడ్ తారలు నటించారు. #Animal#AnimalReview #AnimalMovie #RanbirKapoor𓃵 #SandeepReddyVanga Ranbir and Bobby Fight Scene Glimpse 🔥🔥🔥🔥 pic.twitter.com/ylMpVhIZov — ASHISH kushwaha (@ASHISHk18033956) December 2, 2023 -
త్రిషపై సంచలన కామెంట్స్.. లియో నటుడిపై సినీతారల ఆగ్రహం!
నటి త్రిషై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్పై కోలీవుడ్ తారలు ఫైరవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలసుకుందాం. విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం లియో. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో మన్సూర్ అలీ ఖాన్ కీలకపాత్రలో కనిపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మన్సూర్ త్రిషపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అతను చేసిన అసభ్యకరమైన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. 'లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటించా. కానీ సినిమాలో ఒక్క బెడ్రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నా. నేను ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను బెడ్రూమ్కు తీసుకెళ్తానని అనుకున్నా. ఇంతకుముందు సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. సినిమాల్లో ఇది నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్లో త్రిషను కనీసం నాకు చూపించలేదు.' అంటూ కామెంట్స్ చేశారు. దీంతో మన్సూర్ అలీ ఖాన్పై పలువురు తారలు మండిపడుతున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి సినిమాల్లో ఎందుకు అవకాశాలిస్తున్నాంటూ నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. The thing about men like Mansoor Ali Khan - they have always been talking like this. Never been condemned, with other men in power, money and influence laughing along; eeyy aamaa da macha correct ra maccha sorta thing. Robo Shankar said something on how he wants allowed to touch… pic.twitter.com/ZkRb2qxmMl — Chinmayi Sripaada (@Chinmayi) November 18, 2023 -
బెడ్ రూమ్ సీన్.. కుదరదని మొహం మీదే చెప్పేశా: హీరోయిన్
టాలీవుడ్లో మీకు మాత్రమే చెప్తా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ భా వాణి భోజన్. అయితే ఈ మూవీతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత నటించిన తమిళ చిత్రం ఓ మై కడవలేతో గుర్తింపు తెచ్చుకుంది. మొదట బుల్లితెర నటిగా 2010లో కెరీర్ ప్రారంభించిన వాణి ప్రస్తుతం హీరోయిన్గా బిజీ అయిపోయింది. ఇప్పటివరకు ఈ అమ్మడుకు పెద్ద హిట్ పడలేదు. (ఇది చదవండి: అలా కనిపించడం చాలా కొత్తగా అనిపించింది: సీతారామం బ్యూటీ) కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ కోలీవుడ్లో మంచి సక్సెస్ కోసం పోరాడుతోంది. మధ్యలో సరైన అవకాశాలు లేకపోవడంతో వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపింది. దాదాపుగా స్టార్ హీరోయిన్ హోదా కోసం 13 ఏళ్లుగా కష్టపడుతోంది. ప్రస్తుతం కోలీవుడ్పైనే దృష్టి సారించింది భామ. తాజాగా ఆమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మరో చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా.. వాణిభోజన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఆమె మాట్లాడుతూ కథకు అవసరం లేకపోయినా కొన్ని సన్నివేశాల్లో నటించాలని ఒత్తిడి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఒక చిత్రంలో అనవసరంగా బెడ్రూం సన్నివేశంలో నటించాలని చెప్పారని వివరించింది. అదీ ముందుగా ఎలాంటి సమాచారం లేకుండా చేయమని అడిగాగు. దీంతో తాను అలాంటి సన్నివేశంలో నటించనని మొహం మీదే చెప్పేశానని తెలిపింది. తనకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదని.. నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేయడమే ముఖ్యమని పేర్కొంది. అయితే తరచూ గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ హల్ చల్ చేస్తోంది. గతంలో ఈ ముద్దుగుమ్మ ఇదివరకే ఒక నటుడితో ప్రేమ, సహజీవనం అంటూ రూమర్స్ కూడా వచ్చాయి. (ఇది చదవండి: ఓటీటీలోకి 'భగవంత్ కేసరి' సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్?) -
రామ్-బోయపాటి స్కంద మూవీ.. యాక్షన్ ఓకే.. రీ ఎంట్రీ ఎలా?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. జీ స్టూడియోస్తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే ఇటీవలే ఓటీటీలో వచ్చిన స్కంద మూవీ ప్రేక్షకుల ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. నవంబర్ రెండో తేదీ నుంచే డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: రాహుల్ సిప్లిగంజ్తో లవ్.. రతికా పేరేంట్స్ ఏమన్నారంటే?) సినిమా అన్నాక చిన్న చిన్న పొరపాట్లు జరగడం చూస్తుంటాం. ఎడిటింగ్లో అప్పుడప్పుడు కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతుంటాయి. ప్రస్తుతం రామ్ నటించిన స్కంద చిత్రంలోనూ అలాంటిదే జరిగింది. అయితే ఈ మూవీలోని ఓ సీన్ విషయంలో జరిగిన అతిపెద్ద పొరపాటు తాజాగా బయటకొచ్చింది. ఓటీటీలో సినిమా చూసిన ఓ ప్రేక్షకుడు.. ఆ సీన్ను కట్ చేసి ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే ఆ సీన్లో జరిగిన ఆ పెద్ద పొరపాటు ఏంటో తెలుసుకుందాం. సినిమా కథలో భాగంగా ఏపీ సీఎం కూతురిని (అజయ్ పుర్కర్) తీసుకురావడానికి.. తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి(శరత్ లోహితస్వ) వద్దకు రామ్ వెళ్తాడు. అదే సమయంలో ఫుల్ మాస్ యాక్షన్ సీన్ ఫైట్ జరుగుతుంది. అక్కడ రామ్ పవర్ఫుల్ డైలాగ్ కూడా చెబుతాడు. అయితే ఆ సీన్లో ఓ ముసలోడి పిస్టల్ తీసుకుని.. నిన్ను వదలను.. చంపేస్తా అంటూ రామ్ వైపు తుపాకి గురి పెడతాడు. అయితే రామ్ అదే తుపాకితీ అతన్ని కాల్చి పడేస్తాడు. కానీ ఆ తర్వాత వచ్చే సీన్లో చనిపోయిన ముసలోడు సీఎం వెనుక కనిపిస్తాడు. అదేంటి చనిపోయిన వ్యక్తి మళ్లీ సినిమాలో కనిపించడమేంటి? ఈ చిన్న మిస్టేక్ బోయపాటి గమనించలేకపోయాడా? అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత భారీ యాక్షన్ చిత్రంలో ఇలాంటి పొరపాటు ఏంటని సోషల్ మీడియా వేదికగా బోయపాటిని ఆడేసుకుంటున్నారు. (ఇది చదవండి: అంత అందంగా లేనన్నారు, వంక పెట్టారు: హీరోయిన్) స్కంద కాదు ఇది బోయపాటి గాడి బొంద🤦♂️ pic.twitter.com/p49ggMdbMQ — ఇవివి పంచ్ లు🤙 (@evvpunchlu333) November 2, 2023 -
టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్కు అన్ని రోజులు పట్టిందా?
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తోన్న చిత్రం టైగర్-2. టైగర్ ఫ్రాంచైజీలో ఏక్తా టైగర్ వంటి సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన మరో చిత్రం టైగర్- 3. యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పణలో మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబరు 12న విడుదల కానుండడంతో మేకర్స్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్లో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ను చూపించారు. ఇందులో కత్రినా కైఫ్ కూడా భారీ యాక్షన్ సీన్స్లలో అదరగొట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తుండటం విశేషం. అయితే ఈ ట్రైలర్లో చూపించిన బాత్ టవల్ ఫైట్ హైలెట్గా కనిపించింది. (ఇది చదవండి: ప్రముఖ నిర్మాతను రెండో పెళ్లి చేసుకోనున్న నటి ప్రగతి) తాజాగా మూవీ ప్రమోషన్స్ ఆ సీన్తోనే షురూ చేసింది చిత్రబృందం. ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోన్న ఆ సీన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఈ సీక్వెన్స్తో రూ.1000 కోట్లు ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫైట్ చేసింది ఆమెనే.. అయితే ఈ బాత్ టవల్ ఫైటింగ్ సీక్వెన్స్లో.. కత్రినాతో ఫైట్ చేసింది ప్రముఖ హాలీవుడ్ నటి మిచెల్ లీ. తాజాగా ఆమె ప్రత్యేకంగా దీని గురించి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఈ సీన్ కోసం తామిద్దరం ఎంతో కష్టపడినట్లు చెప్పుకొచ్చింది. తామిద్దరు కలిసి రెండు వారాల పాటు ప్రాక్టీస్ చేసినట్లు ఆమె తెలిపింది. బాడీ కవర్ అయ్యేలా టవల్స్ను హ్యాండిల్ చేయడం బిగ్ ఛాలెంజ్గా అనిపించిందని పేర్కొంది. (ఇది చదవండి: గయ్యాళి గుండమ్మకు వందేళ్లు.. నమ్మినవాళ్లే మోసం చేయడంతో..!) అంతే కాకుండా ఓ చిన్న సీన్ భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడం, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడంపై ఆశ్చర్యం కలగలేదని చెప్పింది మిచెల్. ఇలా జరుగుతుందని తాను ముందే ఊహించానని తెలిపింది. అసలీ ఫైట్ సీక్వెన్స్ సన్నివేశాన్ని ఎలా చేయాలి, కొత్తగా ఎలా చేస్తే ప్రేక్షకులకు మరింత బాగా కనెక్ట్ అవుతుందనే దానిపై రెండు వారాల పాటు రీసెర్చ్ కూడా చేసినట్లు చెప్పింది. ఈ టైగర్-3 దీపావళి కానుకగా నవంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. Katrina’s Towel fight is gonna get #Tiger3 1000CR. 💥💥💥💥 #Tiger3Trailer #KatrinaKaif #SalmanKhan pic.twitter.com/mBIv6LPG3J — SuperNest (@supernest_) October 16, 2023 -
అది శృంగార సీన్ ఎలా అవుతుంది?.. మండిపడ్డ మెహ్రీన్
కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మెహ్రీన్ పీర్జాదా. తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ టాలీవుడ్ స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించింది. గతేడాది ఎఫ్3 సినిమాతో ప్రేక్షకులను అలరించిన మెహ్రీన్.. ఈ ఏడాదిలో ఓటీటీలోనూ అరంగేట్రం చేసింది. ఇటీవలే ఆమె నటించిన సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సిరీస్లో కనిపించింది. అయితే ఈ సిరీస్లో ఆమె ఓ అత్యాచార సన్నివేశంలో నటించింది. అయితే ఈ సీన్ ప్రస్తుతం వివాదానికి దారితీసింది. ఆ సన్నివేశాన్ని కొందరు శృంగార సీన్గా అభివర్ణించడంపై మెహ్రీన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా రాయడం తనకు తీవ్ర బాధ కలిగించిందని ట్వీట్ ద్వారా వెల్లడించింది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!) మెహ్రీన్ ట్వీట్లో రాస్తూ.. 'ఢిల్లీ సుల్తాన్లో వైవాహిక అత్యాచారాన్ని చిత్రీకరించే ఓ సన్నివేశం ఉంది. మనదేశంలో ఇది తీవ్రమైన సమస్య. ఇలాంటి సమస్యను మీడియాలో చాలా మంది శృంగార సీన్గా అభివర్ణించడం నాకు బాధ కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలకు ఇది తీవ్రమైన సమస్య. ఈ విషయాన్ని ఇలా చెప్పడం సమస్యను చిన్నదిగా చూపించినట్లు అవుతుంది. సోషల్ మీడియాలోని వ్యక్తులు ఇలా చేయడం నన్ను కలవరపెడుతోంది. ఇలాంటి వారు తమకు సోదరీమణులు, కుమార్తెలు కూడా ఉన్నారన్న విషయం అర్థం చేసుకోవాలి. వారు తమ నిజ జీవితంలో అలాంటి బాధను ఎప్పటికీ ఎదుర్కోవద్దని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. మహిళలపై ఇలాంటి క్రూరత్వం, హింస అనే ఆలోచన చాలా అసహ్యకరమైనది.' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా నటుడిగా ఆ పాత్రకు న్యాయం చేయడం నా పని అని తెెలిపింది. మిలన్ లుథ్రియా సర్ నేతృత్వంలోని సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ బృందం చాలా కష్టతరమైన సన్నివేశాల షూటింగ్ సమయంలో నటులుగా మేం చాలా ప్రొఫెషనల్గా ఉన్నామని పేర్కొంది. నేను చేసే పాత్ర మహాలక్ష్మి అయినా, సంజన అయినా, హనీ అయినా నా ఫ్యాన్స్ కోసం ప్రతి పాత్రలోనూ ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించింది. (ఇది చదవండి: అలాంటి పాత్రల్లో నటించను.. అదే నా కోరిక : మృణాల్ ఠాకూర్) Recently I made my OTT Debut in the web series, “Sultan of Delhi” on Disney Hotstar. I hope my fans have enjoyed watching the series. Sometimes scripts demand certain actions which might go against your own morals. As a professional actor who considers acting an art and at the… — Mehreen Pirzada👑 (@Mehreenpirzada) October 17, 2023 -
బాహుబలి కంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ చేశాను – సత్యరాజ్
‘‘వెపన్’లాంటి సినిమా తీయాలంటే డైరెక్టర్,ప్రొడ్యూసర్స్, సినిమాటోగ్రాఫర్, వీఎఫ్ఎక్స్.. ఇలా సాంకేతిక నిపుణులే కీలకం. వాళ్ల తర్వాత యాక్టర్స్కు ప్రాధాన్యత అని నా అబిప్రాయయం. ‘బాహుబలి’ కంటే ‘వెపన్’లో ఎక్కువ యాక్షన్ సీన్స్ చేశా. గుహన్ సరికొత్త విజన్తో తీశారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు సత్యరాజ్. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వెపన్’. మన్సూర్ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్ను రిలీజ్ చేశారు. ‘‘సరికొత్త సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్తో ఈ చిత్రం రూపొందింది’’ అన్నారు వసంత్ రవి. ‘‘మా బ్యానర్లో వస్తోన్న తొలి చిత్రమిది’’ అన్నారు మన్సూర్. ‘‘ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులున్నాయి’’ అన్నారు గుహన్ సెన్నియప్పన్. -
ఇటీవల యాక్షన్ షూట్లో దెబ్బతిన్న హీరోస్ వీళ్లే..
స్క్రీన్పై విలన్లను హీరో రఫ్ఫాడిస్తుంటే ఫ్యాన్స్కి కిక్కో కిక్కు.. కానీ ఆ యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు స్టార్స్కి తగిలే గాయాలు ఒక్కోసారి ఆపరేషన్కి దారితీస్తాయి. ఇక ఇటీవల యాక్షన్ షూట్లో పరేషాన్ అయిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. టైగర్కి గాయం ఐదు కేజీల డంబెల్ని అమాంతంగా ఎత్తగలిగే సల్మాన్ ఖాన్కి ఇటీవల ఐదు కేజీల కన్నా తక్కువ బరువు ఉన్న వస్తువులు ఎత్తడం కష్టమైంది. దానికి కారణం ‘టైగర్ 3’ సినిమా. ఈ చిత్రం కోసం నెలన్నర క్రితం ఓ రిస్కీ యాక్షన్ సీన్ చేస్తుండగా సల్మాన్ గాయపడ్డారు. ‘‘ప్రపంచాన్నే మన భుజం మీద మోస్తున్న ఫీలింగ్లో ఉన్నప్పుడు.. ఆ ప్రపంచాన్ని వదలండి.. ఇప్పుడు కనీసం ఐదు కిలోల డంబెల్ ఎత్తడం కూడా కష్టమవుతోంది’’ అని భుజానికి అయిన గాయం తాలూకు నొప్పిని తగ్గించే పట్టీ వేయించుకుని ఉన్న ఫొటోను షేర్ చేశారు సల్మాన్. అంతే.. ‘టైగర్ (సల్మాన్ని ఉద్దేశించి)కి ఏమీ కాదు... తగ్గిపోతుంది’ అంటూ ఫ్యాన్స్ స్పందించారు. కింగ్ ఖాన్.. నోస్ సర్జరీ షారుక్ ఖాన్ని ఆయన ఫ్యాన్స్ కింగ్ ఖాన్ అని పిలుచుకుంటారు. ఈ కింగ్ ఖాన్ ఫ్యాన్స్కి కిక్ ఇవ్వడానికి రిస్కీ ఫైట్స్ చేస్తుంటారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ఓ చిత్రం కోసం యాక్షన్ సీన్ చేస్తూ, గాయపడ్డారు షారుక్. ముక్కుకి బలమైన గాయం కావడంతో సర్జరీ జరిగిందనే వార్త మంగళవారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో శస్త్ర చికిత్స జరిగిన అనంతరం షారుక్ ముంబై చేరుకున్నారట. ‘‘రక్త స్రావం ఆగడానికి ముక్కుకి చిన్నపాటి శస్త్ర చికిత్స చేశాం. కంగారుపడాల్సిన అవసరంలేదు’’ అని షారుక్ వ్యక్తిగత సిబ్బందికి డాక్టర్లు తెలియజేశారని బాలీవుడ్ టాక్. విక్రమ్.. రిస్కీ పోరాటమ్ విలక్షణ పాత్రలకు చిరునామా విక్రమ్. తాజాగా విక్రమ్ ఓ కొత్త లుక్లో నటిస్తున్న చిత్రం ‘తంగలాన్’. ఈ చిత్రం కోసం రిస్కీ ఫైట్ షూట్లో పాల్గొనే ముందు విక్రమ్ రిహార్సల్స్ చేశారు. అప్పుడు జరిగిన ప్రమాదంలో ఆయన పక్కటెముక విరిగింది. వెంటనే విక్రమ్ను ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల క్రితం ఈ ప్రమాదం జరిగింది. కోలుకున్నాక ఆయన తిరిగి షూట్లో పాల్గొనడంతో సినిమా పూర్తయింది. పృథ్వీ.. మూడు నెలల విశ్రాంతి మలయాళ పరిశ్రమలో ఓ స్టార్ హీరోగా, దర్శకుడిగా దూసుకెళుతున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విలయత్ బుద్ధ’. పది రోజుల క్రితం ఈ సినిమా కోసం ఒక యాక్షన్ సీన్ని ఆర్టీసీ బస్సులో చిత్రీకరిస్తున్నప్పుడు పృ«థ్వీరాజ్ కింద పడటంతో దెబ్బ తగిలింది. బలమైన గాయం కావడంతో కాలికి సర్జరీ చేయాలని వైద్యులు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స అనంతరం దాదాపు మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని పృథ్వీరాజ్కి సూచించారు. వరుణ్.. మూడు వారాల విశ్రాంతి వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది కానిస్టేబుల్’. ఈ చిత్రం కోసం ఇటీవల ఓ ఫైట్ సీన్ తీస్తున్న సమయంలో గాయపడ్డారు వరుణ్ సందేశ్. ఈ ప్రమాదంలో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయింది. దీంతో ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. చికిత్స అనంతరం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలంటూ వరుణ్కి సూచించారు వైద్యులు. వరుణ్ సందేశ్ గాయపడటంతో ‘ది కానిస్టేబుల్’ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. -
షేన్ వార్న్ బయోపిక్ రొమాంటిక్ సీన్ షూట్లో ఏం జరిగిందో చూడండి..!
-
అప్సర కేసులో పోలీసులు కీలక నిర్ణయం సాయి కృష్ణను..!
-
అలాంటి సీన్స్ చూసి నా భార్య ఫీలైంది: మనోజ్ భాజ్పేయి
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయి తెలుగువారికి కూడా సుపరిచితమే. అల్లు అర్జున్ హీరోగా నటించిన హ్యాపీ సినిమాతో తన హావభావాలతో అదరగొట్టాడు. టాలీవుడ్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం తాను నటించిన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హైని మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మనోజ్ తన భార్య గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (ఇది చదవండి: అమ్మా, నాన్న చనిపోతే.. వారే అంతా పంచుకున్నారు: తేజ) అయితే తన భార్య షబానా తన సినిమా చూసి అవమానంగా భావించిందని మనోజ్ తెలిపారు. తెరపై హీరోయిన్లతో రొమాన్స్ చేసే సీన్స్ చేయడం తనకు ఇష్టం లేదని.. డబ్బు కోసం సినిమాలు చేయడం మానేయండని సలహా కూడా ఇచ్చిందని వెల్లడించారు. తన భార్య సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్లగా.. కొంతమంది అమ్మాయిలు ఇదొక చెత్త సినిమా అన్నారని చెబుతూ బాధపడిందన్నారు. (ఇది చదవండి: అవార్డులు కొల్లగొట్టిన ఆలియా భట్ మూవీ..!) దయచేసి మీరు ఇలాంటి పాత్రలు చేయవద్దని.. కేవలం మంచి పాత్రలనే ఎంచుకోవాలని సూచించింది. కాగా.. మనోజ్ సత్యమేవ జయతే, బాఘీ 2 వంటి చిత్రాలలో కూడా కనిపించాడు. సత్యమేవ జయతే సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో తన ఫన్నీ క్యారెక్టర్ చూసి భార్య నవ్విందని మనోజ్ చెప్పుకొచ్చారు. -
'దసరా' డిలీటెడ్ సీన్.. కీర్తి సురేశ్ దడ పుట్టించేసిందిగా!
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ దసరా. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీలో కీర్తి, నాని నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సినీ ప్రముఖులు సైతం వీరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కీర్తి సురేశ్ పాత్రలో జీవించింది. అచ్చ తెలంగాణ యాసలో తన మాటలతో అభిమానులను కట్టిపడేసింది. ఈ చిత్రంలో తనకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషం. అయితే తాజాగా కీర్తి సురేశ్ తన ఇన్స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియో తనపాత్రకు తానే డబ్బింగ్ చెబుతూ కనిపించింది. ఈ సీన్ సినిమా నుంచి తొలగించినట్లు కీర్తి వెల్లడించింది. కీర్తి తన ఇన్స్టాలో రాస్తూ..' దసరా మూవీలో తొలగించిన సీన్ ఇది. ఆ సీన్కు నేనే డబ్బింగ్ చెప్పా. డబ్బింగ్ చెబుతున్నప్పుడు నన్ను చూసి అంతా టెన్షన్ పడ్డారు. డబ్బింగ్ ఒక అద్భుతమైన కళ.' అంటూ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో కీర్తి సురేశ్ తెలుగు డబ్బింగ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అచ్చ తెలుగులో.. అది తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పిన మహానటి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
సీన్ మధ్యలో సిబ్బంది.. అలా కూడా తీస్తారా?
సినిమాల్లో తప్పులు దొర్లడం మనం సాధారణంగా చూస్తుంటాం. కొన్ని సీన్లలో అనుకోకుండా పొరపాట్లు చేస్తుంటారు. అలాగే ఓ హాలీవుడ్లో వెబ్సిరీస్లోనూ అదే జరిగింది. ఓ సీన్ చిత్రీకరించేటప్పుడు సిబ్బంది కూడా ఆ సీన్లో కనిపించారు. అది గమనించని మేకర్స్ ఎపిసోడ్ను అలాగే రిలీజ్ చేశారు. ఇది గమనించిన ఫ్యాన్స్ ఆ సీన్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. హెచ్బీవో వారి ది లాస్ట్ ఆఫ్ అస్ వెబ్ సిరీస్ ఇప్పటికే భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రెండో సీజన్ కొనసాగుతోంది. అయితే ఆదివారం రిలీజైన కొత్త ఎపిసోడ్లో కొన్ని సన్నివేశాల్లో ఏకంగా సిబ్బంది కనిపించారు. ఓ అభిమాని వాటిని గుర్తించి ఆ సీన్ ఫోటోలు, వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు. అవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఏంటీ ఇలా కూడా సీన్స్ తెరకెక్కిస్తారా? అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ది లాస్ట్ ఆఫ్ అస్ కొత్త ఎపిసోడ్ - 'కిన్లో' జోయెల్ (పెడ్రో పాస్కల్), ఎల్లీ (బెల్లా రామ్సే), జోయెల్ సోదరుడు టామీ (గాబ్రియేల్ లూనా)తో తిరిగి కలుసుకుంటారు. ఈ ఎపిసోడ్కు మంచి ఆదరణ లభించగా.. ఇందులో అనేక మంది సిబ్బంది ఉన్నట్లు ఒక టిక్టాక్ యూజర్ గుర్తించాడు. ఈ సీన్లో జోయెల్, ఎల్లీ మంచుతో కప్పబడిన వంతెనపై నడుస్తున్నప్పుడు అక్కడ మిగతా సిబ్బంది కూడా కనిపించారు. జూమ్ చేసినప్పుడు ఆ సంఖ్య ఎక్కువగా కనిపించింది. Did NOT notice this until I saw the story on CNET and this tweet. Not a massive "flub" like a Starbucks cup in GoT. Actually I was more focused on how did they get this shot and the shot before this. (Drone?? If so, it was a very cool super steady shot.) #tlou #TheLastOfUsHBO pic.twitter.com/Xx6lopZULR — AC (@ACinPhilly) February 22, 2023 -
స్టార్ నటుడు చెంప చెళ్లుమనిపించిన జయప్రద? క్లారిటీ ఇచ్చిన దలీప్ తాహిల్
నటి జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటోంది. ఇదిలా ఉంటే ఆమె స్టార్ నటుడు దలీప్ తాహిల్ చెంప చెళ్లుమనిపించిందంటూ తరచూ బాలీవుడ్లో వార్తల చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ వార్తలపై తాజాగా నటుడు దలీప్ తాహిల్ స్పందించాడు. ఈ సందర్భంగా జయప్రద తనని కొట్టినట్లు వస్తున్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చాడు. 1986లో అమితాబ్ బచ్చన్-జయప్రద జంటగా ‘ఆఖ్రే రాస్తా’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో దలిప్ తాహిర్ విలన్గా చేశాడని, ఇందులో ఆయన జయప్రదను అత్యాచారం చేసే ఓ సన్నివేశం ఉందట. ఈ సీన్ షూటింగ్ సమయంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో జయప్రద ఆయనను చెంప దెబ్బ కొట్టినట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. తాజాగా దీనిపై ఆయన వివరణ ఇచ్చాడు. ‘‘జయప్రదతో కలిసి ఓ అభ్యంతరకర సన్నివేశంలో నటించానని, ఆ సీన్ షూటింగ్ సమయంలో ఆమె నన్ను కొట్టినట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను నేను కూడా విన్నాను. నేను కొంచెం దూకుడుగా వెళ్లానని, ఆమె నా చెంప చెళ్లు మనిపించినట్టు అందులో ఉంది. అసలు నేను జయప్రదతో కలిసి ఏ సినిమాలోనూ నటించనేలేదు. ఇది వాస్తవం. ఆమెతో కలిసి నటించాలనే ఆసక్తి ఉన్నా, ఆ అవకాశం మాత్రం రాలేదు. అలాంటప్పుడు ఇక అలాంటి సీన్ చేసే అవకాశమే లేదు కదా? ఈ కథనాలు రాసే వ్యక్తి పట్ల నాకు శత్రుత్వం లేదు. కానీ ఆ సీన్ చూపిస్తే సంతోషిస్తాను. సోషల్ మీడియాలో అసలు లేనివి కూడా పుట్టిస్తున్నారు’’ అంటూ దలీప్ తాహిల్ అసహనం వ్యక్తం చేశాడు. చదవండి: నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి నాన్నా: మహేశ్ ఎమోషనల్ ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్ -
అరుంధతి మూవీలో సీన్ను రీ కనస్ట్రక్ట్ చేసి మరీ... ఆత్మహత్యా యత్నం
తాగుడికి, మత్తుపదార్థాలకు అడిక్ట్ అవ్వడం గురించి విన్నాం. అలాగే సినిమాలకు అడిక్ట్ అయ్యే వాళ్లు గురించి కూడా తెలుసు. చాలావరకు హిరో లేదా హిరోయిన్ మాదిరిగా ప్రవర్తించడం వంటి పిచ్చి చేష్టలు చేస్తారని తెలుసు. కానీ ఆ సినిమాలో కథనాయిక ఎలా చనిపోయాడో అలా చనిపోవాలని మాత్రం అనుకోరు. ఐతే ఈ వ్యక్తి మాత్రం తన చూసిన సినిమాలో కథనాయకి ఎలా చనిపోయిందో అలానే చనిపోవాలని నిర్ణయించుకుని కన్నవాళ్లకు తీరని వేదన మిగల్చాడు.. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....కర్ణాటకలోని ఓ గ్రామంలోని 23 ఏళ్ల రేణుకా ప్రసాద్ అనే వ్యక్తి పదోతరగతి వరకు బాగా చదువుకున్నాడు. ఆ తర్వాత అతనికి సినిమాలంటే మోజు ఎలా పెరిగిందో తెలియదు గానీ దానికి అడిక్ట్ అయిపోయాడు. ఎంతలా అంటే ఆ సినిమాలో వాళ్లు ఏం చేస్తే అలా చేసేయాలనేంతగా వ్యామోహం పెంచేసుకున్నాడు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి ఇంటర్ కూడా చదవడం మానేశాడు. అతనికి అరుంధతి సినిమా అంటే మహా ఇష్టమట. ఏకంగా 15 సార్లు ఆ సినిమాని చూశాడని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఐతే ఆ సినిమాలో అనుష్క విలన్ పశుపతి నుంచి తన సంస్థానంలోని మనుషులను కాపాడుకోవడానికి ఎలా అయితే సాధువుల వద్దకు వెళ్లి ఎలా తనకు తానుగా చనిపోతుందో అలా తాను చనిపోవాలనుకున్నాడు. ఈ విషయం గురించి తన తల్లిదండ్రులతో పదే పదే చెప్పేవాడు కూడా. దీంతో వాళ్లు అతన్ని అది సినిమాని నిజంగా అలా చేయడం కుదరదని పలుమార్లు వారించారు కూడా. ఈ మేరకు సదరు వ్యక్తి తాను చెప్పినట్టుగానే సినిమా కథానియికిలా 20 లీటర్లు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటాడు. తాను చనిపోతున్న దాన్ని కూడా వీడియో తీసి మరీ వివరించాడు. అయితే స్థానికులు అతను మంటల్లో కాలిపోవడం చూసి రక్షించి ఆస్పత్రికి తరలించారు. కానీ సదరు వ్యక్తి 60 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో పోరాడుతూ.. ఆస్పత్రిలోనే మరణించాడని పోలీసులు తెలిపారు. (చదవండి: భార్య గర్భవతి.. మరో అమ్మాయితో టచ్లో భర్త.. చివరకు..) -
రామారావు ఆన్డ్యూటీ సీన్స్ లీక్...
-
అనంతపురంలో బ్లఫ్ మాస్టర్ సీన్
-
సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు
-
ఆకాశంలో వింత దృశ్యాలు.. నిమిషాల వ్యవధిలోనే
బత్తలపల్లి(అనంతపురం జిల్లా): సోమవారం తెల్లవారుజామున బత్తలపల్లి పరిసరాల్లో ఆకాశంలో వింత దృశ్యాలు గోచరించాయి. తూర్పున కాంతి వంతంగా కనిపించిన ఓ దృశ్యం కాసేపటికి రూపం మారి అదృశ్యమైంది. అలాగే దక్షిణాన శక్తివంతమైన వెలుగుతో మరో దృశ్యం గోచరించింది. తొలుత చిన్నదిగా కనిపించినా... నిమిషాల వ్యవధిలోనే పెద్దదిగా మారి మాయమైంది. ఈ దృశ్యాలను స్థానికులు సెల్ఫోన్లలో చిత్రీకరించారు. చదవండి: ఎక్కువరోజులు ఉండలేను.. హైదరాబాద్ వచ్చేస్తా.. సీన్ కట్ చేస్తే.. -
షూటింగ్ : అలాంటి సీన్లు చేయడానికి నో పర్మిషన్
ముంబై : మహారాష్ట్రలో అంతకంతకూ కరోనా కేసులు పెరుగుతూ, సినిమా షూటింగులు ఆగిపోతున్న నేపథ్యంలో అక్కడి సినీ కార్మికుల సమాఖ్య సరికొత్త షూటింగ్ మార్గదర్శకాలను జారీ చేసింది. అవి కచ్చితంగా అమలయ్యేలా చూసేందుకు ఓ పర్యవేక్షక బృందాన్ని కూడా ఏర్పాటుచేసింది. షూటింగ్లో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, గుంపులతో కూడిన దృశ్యాల చిత్రీకరణ ఆపేయడం లాంటి కోవిడ్–19 షూటింగ్ నియమావళిని కచ్చితంగా అమలయ్యేలా ఈ బృందం చూస్తుంది. మహారాష్ట్రలో, మరీ ముఖ్యంగా ముంబయ్లో కరోనా కేసులతో సినీ, టీవీ రంగంపై పెను ప్రభావం పడడంతో పశ్చిమ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఎఫ్.డబ్లు్య.ఐ.సి.ఇ) ఈ నిర్ణయం తీసుకుంది. అక్షయ్ కుమార్,ఆలియా భట్, విక్కీ కౌశల్, భూమి ఫెడ్నేకర్ సహా పలువురు ముఖ్యతారలు కరోనా బారిన పడడంతో ఇప్పటికే ‘రామ్ సేతు’, ‘గంగూబాయ్ కాఠియావాడీ’, ‘మిస్టర్ లేలే’ లాంటి పలు చిత్రాల షూటింగులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎఫ్.డబ్లు్య.ఐ.సి.ఇ. కార్యనిర్వాహక సభ్యులు శుక్రవారం నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో సమావేశమయ్యారు. ప్రభుత్వం పేర్కొన్న జాగ్రత్తలను సినీ, టీవీ పరిశ్రమ బాధ్యతాయుతంగా అనుసరిస్తుందంటూ హామీ ఇచ్చారు. ఈ నెలాఖరు దాకా అమలులో ఉండే సరికొత్త షూటింగ్ మార్గదర్శకాల ప్రకారం ఇకపై జనసమూహంతో కూడిన సన్నివేశాలనూ, పెద్ద సంఖ్యలో డ్యాన్సర్లున్న పాటలనూ చిత్రీకరించరాదు. అలాగే, ప్రీ–ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్–ప్రొడక్షన్లలో పాల్గొనేవారంతా జాగ్రత్తలు పాటించాలి. సమాఖ్యకు చెందిన పర్యవేక్షక బృందం షూటింగ్ లొకేషన్లు, పోస్ట్–ప్రొడక్షన్ స్టూడియోలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ, మార్గదర్శకాలను పాటిస్తున్నదీ, లేనిదీ చూస్తుంది. వ్యక్తులు కానీ, సంస్థలు కానీ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్య తీసుకుంటారు. అలాగే, ప్రతి శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం దాకా మహారాష్ట్ర సర్కార్ వారాంతపు లాక్డౌన్ పెట్టినందు వల్ల ఇకపై అక్కడ షూటింగులన్నీ మిగతా రోజుల్లోనే చేయనున్నారు. -
దేవతలు పంపిన రాయబారి!
కెంపరాజ్ నిర్మాణ, దర్శకత్వంలో భానుమతి ప్రధాన పాత్ర పోషించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘నారద మునీంద్రులకు నమస్కారం. విశేషములు ఏమైనా కలవా?’’ నారదుడిని అడిగారు అగ్నిదేవుడు, వరుణదేవుడు, దేవేంద్రుడు, యమధర్మరాజు. ‘‘త్రిభువనసుందరి, విదర్భ రాజకుమారి స్వయంవరమే ఒక అపూర్వవిశేషం. ఆమె రూపలావణ్యాల ముందు రంభ, ఊర్వశీ, మేనక దిగదుడుపు’’ అని చెప్పాడు నారదుడు. ‘‘అయితే నేను ఆమెను వివాహమాడతాను’’ అన్నారు ఆ నలుగురిలో ఒకరు. ‘‘అదిమాత్రం సాధ్యం కాదు’’ అని చెప్పాడు నారదుడు. ‘‘ఎందువల్ల?’’ మూకుమ్మడిగా అడిగారు ఆ నలుగురు. ‘‘ఆమె ఏనాడో నలసార్వభౌముడిని మనసారా ప్రేమించి అతనినే వివాహమాడాలని త్రికరణశుద్ధిగా నిర్ణయించుకుంది’’ అసలు విషయం చెప్పాడు నారదుడు. ‘‘మునీంద్రా! స్వయంవరంలో నా ముఖం చూసిన తక్షణం నన్నే వరిస్తుంది’’ ధీమాగా అన్నాడు యమధర్మరాజు. ‘‘ఆమె దృఢసంకల్పం మార్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు’’ తనకు తెలిసిన సత్యాన్ని చెప్పాడు నారదుడు. ‘‘మాకంటే అతడే ఎక్కువా?’’ నలమహారాజును దృష్టిలో పెట్టుకొని అడిగాడు దేవేంద్రుడు. ‘‘ఎక్కువో తక్కువో మీరే నిశ్చయించుకోండి’’ అని ఆ బాధ్యత వారి భుజాల మీదే పెట్టి అక్కడి నుంచి కదిలాడు నారదుడు. అగ్నిదేవుడు, వరుణదేవుడు, దేవేంద్రుడు, యమధర్మరాజులు నలమహారాజు ముందు ప్రత్యక్షమయ్యారు. ‘‘తాము ఎవరో తెలుసుకోవచ్చా?’’ అడిగాడు నలుడు. ‘‘వీరు వరుణదేవుడు’’ ‘‘వీరు అగ్నిదేవుడు’’ ‘‘వీరు దేవేంద్రుడు’’ ‘‘వీరే యమధర్మరాజు’’ పరిచయాలు పూర్తయ్యాయి. ‘‘ఆహా! దేవతామూర్తులా... అనేక జన్మల పుణ్యఫలం వల్ల కూడా లభించని మీ దర్శనభాగ్యంతో నా జన్మ చరితార్థం అయింది. ఏ సేవలు చేసి మిమ్మల్ని రంజింప చేయాలో ఆజ్ఞాపించండి’’ సంతోషంగా అడిగాడు నలమహారాజు. ‘‘నలరాజా! నీవల్ల మాకో ఉపకారం కావాలి’’ అడిగాడు దేవేంద్రుడు. ‘‘కామధేనువు, కల్పవృక్షం పెరట్లో ఉన్న మీకు సామాన్య మానవుడి వల్ల కావలసిన ఉపకృతి ఏముంటుంది స్వామి! నన్ను పరీక్షిస్తున్నారా? పరిహసిస్తున్నారా!’’ అడిగాడు నలమహారాజు. ‘‘పరీక్ష కాదు పరిహాసం కాదు. చేస్తానని వాగ్దానం చెయ్యి’’ అడిగాడు యమధర్మరాజు. ‘‘ఎందుకా సందేహం? ఇక ఆనతి ఇవ్వండి’’ అని అడిగాడు నలమహారాజు. ‘‘చక్రవర్తీ! నువ్వు దమయంతిని చూశావా?’’ అడిగాడు దేవేంద్రుడు. ‘‘లేదు స్వామి!’’ అని బదులిచ్చాడు నలుడు. ‘‘నిన్నే వరించి వివాహమాడబోతున్నదట’’ ఒకింత ఈర్ష్యతో అన్నాడు వరుణుడు. ‘‘అయితే నేను చాలా అదృష్టవంతుడిని. ఆమె అనురాగానికి పాత్రుడిని కావడం తమవంటి అమరుల ఆశీర్వాద ఫలితం. నా జన్మ పావనం అయింది’’ అని సంతోషంలో తేలిపోయాడు నలమహారాజు. ‘‘చక్రవర్తీ! సంతోషంతో మైమరచిపోతున్నావు. మరచిపోవాల్సింది దమయంతిని’’ కఠినంగా అన్నాడు యమధర్మరాజు. ‘‘దమయంతి సౌందర్యం గురించి మేము ఆలకించాం. ఆమెను వరించాలనుకుంటున్నాం. ఆమెను సమీపించి మాలో ఏ ఒకరినైనా వరించమనే సందేశం అందించాలి. చెప్పి ఒప్పించాలి’’ అన్నాడు దేవేంద్రుడు. ‘‘స్వామీ! ఏమిటీ పరీక్ష? నేను దమయంతిని గాఢంగా ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నన్ను ఈ కార్యభారానికి వినియోగించడం సమంజసమా?’’ బాధగా అన్నాడు నలమహారాజు. ‘‘వాగ్దానం చేశావు. మాట నిలుపుకోవడం నీవంతు’’ గుర్తు చేశాడు యమధర్మరాజు. ‘‘దమయంతిపై మరులుగొన్న చక్రవర్తికి తన వాగ్దానం జ్ఞాపకం ఉంటుందా?’’ వెటకారంగా నవ్వాడు దేవేంద్రుడు. ‘‘హరిశ్చంద్రునితోనే సత్యం స్వర్గానికి వేంచేసింది’’ అంటూ దేవేంద్రుడి వెటకారానికి శ్రుతి కలిపాడు వరుణదేవుడు. ‘‘క్షమించండి. ఆడి తప్పే అధముడిని కాదు’’ అన్నాడు నలమహారాజు. ఈ మాటతో దేవతల కళ్లు సంతోషంతో వెలిగాయి. ‘‘కానీ అంతఃపురంలో నివసించే రాకుమారిని ఏకాంతంలో సందర్శించడం ఎలా సాధ్యం?’’ తన మనసులోని సందేహాన్ని దేవతల ముందు పెట్టాడు నలుడు. అప్పుడు వారు అతని చేతిలో ఒక ముద్రిక పెట్టి.... ‘‘ఇదిగో శంబరీ ముద్రిక. దీనిని ధరించి అదృశ్యరూపుడవై అంతఃపురంలో ప్రవేశించు. నీ ధర్మం, మా వాంఛ నెరవేరుతుంది’’ చెప్పారు దేవతలు. శంబరీ ముద్రిక సహాయంతో దమయంతి ఏకాంత మందిరంలోకి ప్రవేశించాడు నలమహారాజు. అతడిని చూసి ‘‘ఎవరు మీరు?’’ అని ఆశ్చర్యపోయింది దమయంతి. ‘‘నేను దేవదూతను. నీతో ఏకాంతంగా సంభాషించడానికి రాచమర్యాదను ఉల్లంఘించాను’’ చెప్పాడు నలుడు. ‘‘ఏకంత ప్రసంగమా? ఏమది?’’ అడిగింది దమయంతి. ‘‘ఈ కమనీయ విగ్రహం, చందమామలాంటి ముఖం, అందాలు చిందే నీ చిరునవ్వులు అపూర్వం, అనిర్వచనీయం. సురలకు కూడా అలభ్యమైన ఈ సుందరాకృతి, సుగుణసంపత్తి...’’ చెప్పుకుపోతున్నాడు నలుడు. ‘‘చాలించండి మీ వర్ణన’’ మధ్యలోనే ఆపేసింది దమయంతి. ‘‘ఈ వర్ణన విని ఇంద్రుడు, అగ్ని, యముడు, వరణుడు ముగ్ధులై మైమరిచి...’’ అంటుండగానే మళ్లీ అడ్డుపడి– ‘‘మీరు మైమరచిపోతున్నారే’’ అన్నది దమయంతి. ‘‘వారు మైమరచిపోయి నీ ప్రేమభిక్ష కోరుతున్నారు. వారి వలపు వేడుకోలు విన్నవించమని నన్ను రాయబారిగా పంపారు. మహత్తరశక్తులు కలిగిన దేవతలు బలాత్కారంగా నిన్ను తీసుకువెడితే చేయగలిగింది ఏముంది?’’ అన్నాడు నలుడు. ‘‘ప్రాణత్యాగం చేస్తాను. నా మనసును ఏనాడో ఆ నలసౌర్వభౌమునికే అర్పించాను’’ దృఢంగా చెప్పింది దమయంతి. ‘‘ఒకవేళ నలసార్వభౌముడే నీ ప్రేమను నిరాకరిస్తే?’’ ఆమె కళ్లలోకి చూస్తూ సూటిగా అడిగాడు నలుడు. -
తోట రాసుకున్న కమ్మని కవితలే ఈ పూలట!
కళను గుండెకు హత్తుకున్న సినిమాలోని దృశ్యాలు ఇవి.కవిత్వం పైరగాలితో కలిసి గజ్జెకట్టిన ఈ సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం.. పచ్చని పొలాల దగ్గర కూర్చొని రాసుకుంటున్నాడు కాశీ.అక్కడికి కీర్తన వచ్చింది.‘‘నేను కొన్ని స్వరాలు రాశాను. నువ్వు నాట్యం చేయాలి’’ అన్నాడు కీర్తనను చూస్తూ.‘‘ఏ రాగం?’’ అని అడిగింది ఆమెచిలిపిగా.‘‘అనురాగం’’ అన్నాడు అంతకంటే చిలిపిగా.‘‘తెలిసో తెలియకో ఏదో రాసుకుంటే రాగం అడుగుతావా?’’ అంటూనే స్వరాలవీణ మీటాడు కాశీ.పచ్చని పంటపొలాలు ప్రేక్షకులయ్యాయి. గాలికి తలలు ఊపుతూ బ్రహ్మాండం అంటున్నాయి.‘‘వండర్ఫుల్. బ్యూటిఫుల్. ఈ ఏకాంత ప్రదేశంలో మీ నాట్యం చాలా బాగుంది. గోదావరి ప్రవాహంలాస్పాంటేనియస్ ఉంది’’ అన్నాడు అతడు.అతడు కాశీ కాదు...శ్రావణ్!శ్రావణ్ గొప్ప చిత్రకారుడు.కళ ఉన్న వాళ్లను నెత్తిన మోసే మంచివాడు.‘‘ఈవిడ కీర్తన. పరమేశ్వరశాస్త్రిగారి అమ్మాయి’’ అని ఒకవైపు కీర్తనను పరిచయం చేస్తూనే ‘‘నా పేరు కాశీ’’ అని పరిచయం చేసుకున్నాడు.కొన్ని మాటలైన తరువాత ‘‘కమాన్ లెట్స్ గో. రండి’’ అని తన ఇంటికి ఆ ఇద్దరిని తీసుకెళ్లాడు శ్రావణ్.‘‘దిసీజ్ మై వరల్డ్. నేను అమెరికాలో ఉండగా ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద వ్యాసాలు రాశాను’’ అని చెప్పుకొని పోతున్నాడు శ్రావణ్. గోడకు ఉన్న శ్రావణ్ చిత్రాలను చూస్తూ, ఆ తన్మయంలో...‘‘రంగుల కవితల్లాగా ఉన్నాయి’’ అన్నాడు కాశీ.‘‘మీకు పోయెట్రీ అంటే ఇష్టమా?’’ కాశీ మాటల ధోరణిని గమనిస్తూ అడిగాడు శ్రావణ్.‘‘ఇష్టమా? ప్రాణం! ఇవి చూడండి’’ అంటూ కాశీ చేతులోని కాగితాలను శ్రావణ్కు ఇచ్చింది కీర్తన.‘వానవేణి తోటినీలవీణ మీటినీలినింగి పాటే ఈ చేలట!కాళిదాసులాంటిఈ తోట రాసుకున్నకమ్మని కవితలే ఈ పూలట!’‘‘ఫెంటాస్టిక్...కవి జీవితాన్ని రెండు ముక్కల్లో చెప్పారు. యస్, కళాకారుడికి కావల్సింది ఇన్స్పిరేషన్ ప్లస్ అభినందన’’ అని పులకరించిపోయాడు శ్రావణ్.‘‘కాశీ ప్రతి పలుకులో కవిత్వం ఉంటుంది.కానీ అది తానొక్కడికే పరిమితం’’ అన్నది కీర్తన.‘‘ఇట్స్ ఏ క్రైమ్. ప్రపంచం కవిని గుర్తించకపోవడం ఎంత నేరమో... కవి ప్రపంచాన్ని పట్టించుకోకపోవడం అంతే నేరం’’ హితబోధలాంటిది చేశాడు శ్రావణ్.‘‘ఏదో ఆవేశం వచ్చినప్పుడు గుండె గొంతుకలో పుట్టిన మాటే పాటైపోతుంది. దానికి ప్రేరణ ఇస్తుంది కీర్తన’’ అని తనను తాను తగ్గించుకున్నాడు కాశీ.‘‘ఈజ్ ఇట్. డిఫెనిట్గా అలాంటి ఎంకరేజ్మెంట్ ఉండాలి. నాకు అలాంటి తోడు లేకపోవడం వల్లే ఇన్నాళ్లు నా ఘోషను కన్నీటిరంగుల్లో కలిపి కాన్వాస్ ఎక్కించాను’’ మనసులో మాట చెప్పాడు శ్రావణ్. సముద్రపు ఒడ్డున ఆశ్రమంలాంటి ఇల్లు అది.‘‘అమ్మా’’ అంటూ ఇంట్లోకి వచ్చాడు కాశీ.అమ్మ పలక లేదు. అలిగింది!‘‘ఇప్పుడు సముద్రం కూడా నీలాగే గంభీరంగా ఉంటే నవ్వు గుర్తొచ్చి వచ్చేశాను.కొంతసేపటికి నీలాగే తాడంత పైకి లేచి వెంటనే తగ్గిపోయింది. గంగమ్మ తల్లికి కోపం వస్తే దండం పెడితే తగ్గిపోతుంది. మరి మా అమ్మకో!’’ అని అమ్మను ఐసు చేసే ప్రయత్నం చేశాడు కాశీ.‘‘అన్నం పెడతావా! నువ్వు తిన్నావా?’’ అని అడిగాడు.‘‘ఆ...కడుపు నిండిపోయింది’’ అంటూ అలకను కంటిన్యూ చేసింది ఆ తల్లి.‘‘నువ్వు తినలేదని నాకు తెలుసులే. నేనొక్కడినే తినేస్తా. అయినా నీ కోపం ఎంతసేపు’’ అంటూ అటు వెళ్లి తినడం మొదలుపెట్టాడు.రాగం తీస్తున్నప్పుడు గొంతుకేదో అడ్డం పడి దగ్గాడు.అంతే...ఆ తల్లి కొడుకు దగ్గరికి పరుగెత్తుకు వచ్చింది.‘‘గొంతుకు అడ్డం పడితే ప్రమాదం రా. ఇదిగో నీళ్లు తాగు’’ అని గ్లాసు చేతికి ఇచ్చింది.‘‘తల్లివి నువ్వుండగా ఆ యముడు కూడా అడ్డం పడలేడు’’ అని నవ్వాడు కాశీ. యముడు అమ్మను తీసుకెళ్లాడు.‘‘అమ్మనే కాదు నా జీవితాన్నే తీసుకెళ్లాడు’’ అని దుఃఖంలో మునిగిపోయాడు కాశీ.పక్కన కూర్చొని ధైర్యం చెబుతున్నాడు శ్రావణ్...‘‘చూడు కాశీ... జీవితం అశాశ్వతం.అంతా ఒకప్పుడు పోవాల్సిందే అనే చెత్త ఫిలాసఫీని నేను మాట్లాడను. ఎందుకంటే అది ఫ్యాక్ట్ కాబట్టి. నువ్వు ఒక కళాకారుడివి. నీ బాధనంతా ఆర్ట్లో ట్రాన్స్ఫార్మ్ చేసి ప్రజలకు వినిపించు.వాళ్లనిస్పందింపజెయ్. నీ రాతలు తమకు అర్థం కాకపోయినా ఆ రాతలన్నీ గొప్పవని, నవ్వు గొప్పవాడివవుతావని నీ తల్లి కలలు కన్నది. ఆ కలను నిజం చెయ్’’కాశీలో ఎలాంటి చలనం లేదు.మౌనం, నిర్లిప్తత, కొండంత నిరాశ.... అతడి పక్కన పీఠ వేసుకొని కూర్చున్నాయి.దూరంగా పిల్లలు సముద్రమంత సంతోషాన్ని కళ్లలో నింపుకొని ఇసుకలో ఆడుకుంటున్నారు.‘‘వాళ్లను చూస్తే నాకు ఆనందంగా ఉంది. ఎప్పుడూ సముద్రంలా సంతోషంగా ఉండాలి’’ కాశీలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశాడు శ్రావణ్.అప్పుడు కాశీ ఇలా అన్నాడు:‘‘సముద్రం ఎప్పుడూ ఉప్పొంగుతుంది. కానీ అది సంతోషమో, విషాదమో తెలుసుకోవడం కష్టం’’ -
అచ్చోసిన అబద్ధం!
ఇవ్వాళ ఒక అబద్ధం చెప్పడానికి అలవాటు పడినవాడు...రేపు వంద అబద్ధాలు చెప్పడానికైనా వెనకాడడు. వ్యసనాల బారిన పడ్డవాడు మొదట సుఖంగా ఉన్నట్లు అనిపించినా ఆ తరువాత అతడి జీవితం ఎలా కష్టాలమయమవుతుందో చెప్పే చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇవి. సినిమా పేరు చెప్పుకోండి చూద్దాం... ఆ కుర్రాడు రిటైర్డ్ జడ్జీగారి చిన్న కొడుకు.దేవుని ఎదుట ప్రమాణం చేసినా చేయకపోయినా....అన్నీ అబద్ధాలే చెబుతాడు.నమ్మినవాళ్లకు నమ్మినన్ని అబద్ధాలు!ఈ కుర్రాడు ఒక్క రోజూ కూడా కాలేజీకి డుమ్మా కొట్టడు. కారణం చదువు మీద శ్రద్ధ కాదు. అమ్మాయిల మీద శ్రద్ధ!అందుకే ఈ కుర్రాడు మరియు అతని అనుచరగణం ఎప్పుడు బయటికి వెళతారో అని చూస్తుంటాడు లెక్చరర్.అదిగో ఆ క్లాస్ వైపు చూడండి...‘‘అందరికీ ప్రెజెంట్ అని వేశాను’’ అన్నారు లెక్చరర్గారు అప్పుడే వచ్చిన ఆ కుర్రగ్యాంగ్ను చూస్తూ.‘‘థ్యాక్సండీ’’ అని లెక్చరర్గారికి కృతజ్ఞతలు చెప్పి స్నేహితుల వైపు తిరిగి..‘‘అటెండెన్స్ అయిపోయింది. ఇక మనం వెళదాం’’ అని పిలుపునిచ్చారు అబ్బయిగారు.‘‘అటెండెన్స్ అయిపోగానే అదృశ్యమైపోతే మాస్టారుగారు రోదిస్తారురా’’ వెక్కిరింపు గొంతుతో అన్నాడు ఆ గుంపులో ఒకడు.‘‘ఆయనేం ఫీల్ అవ్వరురా. హాయిగా పండగలా ఫీలై పాఠాలు చెబుతారు’’ అసలు నిజాన్ని ఆవిష్కరించాడు మరొకడు.‘‘నిజంగానా, అయితే రాండ్రా వెళ్లిపోదాం’’ అని అమాయకపు ముఖం పెట్టాడు జడ్జిగారి అబ్బాయి.ఒకడు వెళుతూ వెళుతూ లెక్చరర్గారిని ఇలా ఆశీర్వదించాడు...‘‘పాఠాలు బాగా చెప్పి మంచి పేరు సంపాదించుకోండి. అప్పుడే ప్రమోషన్ వచ్చి ప్రిన్సిపల్ అవుతారు’’‘‘వెళ్లొస్తాం సార్’’ అన్నాడు ఒకడు లెక్చరర్కి నమస్కరిస్తూ.‘‘మీదే ఆలస్యం’’ అన్నారు లెక్చరర్.గుంపు క్లాస్ విడిచి బయటికి వెళ్లింది. ‘హమ్మయ్య’ అనుకున్నారు లెక్చర్గారు మరియు విద్యార్థులు.వాళ్లు కాలేజీ నుంచి సరాసరి క్లబ్బుకు వెళ్లారు.ఏ అర్ధరాత్రో ఇంటికి తిరిగొచ్చారు అబ్బాయిగారు.‘‘అదేనమ్మా నడిరోడ్డు మీద లారీ కొట్టీ బామ్మ రోడ్డు మీద రక్తంలో మెడ తెగిన కోడిలా గిలగిలా కొట్టుకుంటుంటే’’‘‘శివా శివా... ఇక చెప్పకురా బాబు. ఆ ఘోరాన్ని వినలేను. ఇంతకీ ఆమె ప్రాణాలతో ఉందా?’’ అడిగింది పార్వతి.‘‘నేనే లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది. అర్ధరాత్రి అయినా అమ్మ తిట్టినా సరే అని బామ్మగారిని హాస్పిటల్లో చేర్పించాను. రక్తం తక్కువైతే నా రక్తం ఇచ్చా. దేవతలాంటి ఈ తల్లి రక్తం పంచుకు పుట్టాను. ఇందులో కాస్త అమ్మకు ఇవ్వాలనుకున్నాను. తప్పంటావా అమ్మ?’’ నాటకీయంగా మెలికలు తిరిగారు అబ్బాయిగారు.ఆ పిచ్చితల్లి నిజంగానే నమ్మింది!‘‘తప్పేముంది బాబూ! ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడం లక్ష పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఒకటే. కానీ నువ్వు ఇలా ఆలస్యంగా వచ్చావని మీ నాన్నకు తెలిస్తే కారణం ఏమైనా సరే ఆయన మండిపడతారు’’ ఒకవైపు కొడుకును మెచ్చుకుంటూనే రాబోయే ప్రమాదాన్ని గురించి చెప్పింది పార్వతి.ఆ ప్రమాదం దగ్గరికి రానే వచ్చింది.‘‘మండిపడతారు కాదు పడుతూనే ఉన్నాను’’ అన్నారు తల్లికొడుకుల దగ్గరికి వచ్చిన జడ్జిగారు చుట్టకాలుస్తూ.‘‘కాలం విలువ తెలియకుండా వీడు తిరగడం, ఏంట్రా అని అడిగే లోపల ఏదో హరికథ, బుర్రకథ వినిపించడం నువ్వు నమ్మడం’’ అంటూ భార్యపై కన్నెర్రచేశారు జడ్జిగారు.‘‘బుర్రకథ ఏమిటండీ! ఎవరో బామ్మ చనిపోబోతుంటే..’’ అని ఆ పార్వతమ్మ అమాయకంగా అంటుంటే...పుత్రుడుగారు అందుకున్నారు... ‘‘అదేనమ్మా...బామ్మగారి బుర్ర బద్దలైపోయింది కదా. అందుకే బుర్రకథ అంటున్నారు నాన్నాగారు’’‘‘నోర్ముయ్. నువ్వు చెప్పే అబద్ధాలు మీ అమ్మలాగే నేను నమ్ముతాననుకుంటున్నావా?’’ అంతెత్తున లేచారు జడ్జిగారు. ‘‘దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను.అబద్ధం చెప్పను. నిజంగా ఒక బామ్మగారికి యాక్సిడెంట్ జరిగింది’’ నాన్నను నమ్మించబోయాడు కొడుకు.‘‘ఛస్తే నమ్మను’’ అన్నారు ఆయన ముఖం అదోలా పెట్టి.‘‘రిటైర్డ్ జడ్జిగారు కదమ్మా. కోర్టులో ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పే సాక్షులను చూసీ చూసీ నాదీ అబద్ధమే అనుకుంటున్నారు’’ అని లేని బాధను తెచ్చుకున్నారు అబ్బాయిగారు. అమ్మ చేతిని తన చేతిలో తీసుకొని...‘‘అమ్మా...అన్నం పెడుదువుగాని రా’’ అన్నాడు.‘‘వాడికి పెట్టాల్సింది అన్నం కాదు గడ్డి. చదువు, సంధ్య వదిలి, పరువు మర్యాద మరిచి పశువులా తిరిగేవాడికి గడ్డి పెట్టాలి గడ్డి’’ అని ఉరిమారు జడ్జిగారు.‘‘అర్ధరాత్రి ఇంటికి వచ్చిన బిడ్డను తిండి తిన్నావా? లేదా? అని అడగడం మానేసి ఇంతసేపు చీవాట్లు పెట్టడం చాలక గడ్డిపెట్టాలట. పాపం పసివాణ్ణి చేసి అస్తమానం మాటలు అనడమే మీ పని’’ అంటూ పార్వతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.‘‘ఊరుకోమ్మా...ప్రపంచంలో ప్రతి మహాత్ముడు మొదట్లో పదిమంది చేత ఇలా మాటలు పడ్డవారే. వీటిని పట్టించుకోకు’’ అంటూ తనకు తానే మహాత్ముడి హోదా ఇచ్చేసుకున్నారు అబ్బాయిగారు.‘‘ఛీ...నువ్వెందుకు పట్టించుకుంటావురా. అసలు నీకు సిగ్గు, అభిమానం ఉండి ఛస్తేగా’’ అని కొడుకును తిట్టి ఆ తిట్లలో సగం భార్యకు ఇలా పంచారు జడ్జిగారు.‘‘పసివాడు పసివాడు అని గారాబం చేసి పనికిమాలినవాడిని తయారుచేశావు’’పెద్దకొడుకు, రెండో కొడుకును గుర్తు తెచ్చుకుంటూ ఇలా అన్నారు...‘‘ఆ పెద్దవాళ్లిద్దరూ నా పెంపకంలో పెరిగారు కాబట్టి పరువు దక్కించే పద్ధతిలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. మరి వీడు?’’‘‘అవుతాడు నాన్నాగారు అవుతాడు. వీడు గొప్పవాడవుతాడు. తొందరపడవద్దు’’ అన్నారు అబ్బాయిగారు.‘‘నువ్వా! నాకు కొరివి పెట్టేలోగా నా పేరు ప్రతిష్ఠలకు నిప్పెడతావు. నేను బూడిదయ్యేలోగా ఈ ఇంటిపేరు మట్టిపాలు చేస్తావు’’ అని గట్టిగా అరిచారు జడ్జిగారు.‘‘అబ్బా! వేళాపాళా లేకుండా ఏమిటండీ ఆ అపశకునపు మాటలు’’ అని భర్తను సముదాయించడానికి ప్రయత్నించింది పార్వతమ్మ.
Pagination
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Fact Check: చంద్రబాబుకోసమే... రామోజీ నేలబారు రాతలు!
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ
అభివృద్ధి లేదంటూ అసత్య ప్రచారం.. కారణం ఇదే..
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
కిక్కిరిసిన కర్నూల్
డైరెక్ట్గా ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్ష్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
"కూటమి కట్టినా ఓటమి తప్పదు"
చెలరేగిన కోహ్లి, పటిదార్ 60 పరుగులతో బెంగళూరు ఘనవిజయం (ఫొటోలు)
తప్పక చదవండి
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- అది పెత్తందార్ల కూటమి: సీఎం జగన్
Advertisement