-
శ్రీలంక 531 ఆలౌట్
చట్టోగ్రామ్: బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్లో 159 ఓవర్లలో 531 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 314/4తో రెండో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక మరో 217 పరుగులు సాధించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు దినేశ్ చండీమల్ (59; 5 ఫోర్లు, 2 సిక్స్లు), ధనంజయ డిసిల్వా (70; 6 ఫోర్లు, 2 సిక్స్లు), కామిందు మెండిస్ (92 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. ఓవరాల్గా లంక ఇన్నింగ్స్లో ఆరుగురు బ్యాటర్లు అర్ధ సెంచరీలు చేశారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్లో ఒక్క సెంచరీ నమోదు కాకుండా అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా శ్రీలంక రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు భారత జట్టు (1976లో కాన్పూర్లో న్యూజిలాండ్పై 524/9 డిక్లేర్డ్) పేరిట ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది. -
BAN VS SL 2nd Test: ఏకంగా మూడు చేతులు మారి, చివరికి..!
చట్టోగ్రామ్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఫీల్డర్లు నవ్వులు పూయించారు. ఓ క్యాచ్ను ఏకంగా ముగ్గురు పట్టుకునేందుకు ప్రయత్నించి చివరికి విజయవంతంగా నేలపాలు చేశారు. శ్రీలంక ఇన్నింగ్స్ 121వ ఓవర్ చివరి బంతికి లంక ఆటగాడు ప్రభాత్ జయసూర్య కవర్స్ దిశగా డ్రైవ్ చేసే ప్రయత్నం చేయగా బంతి ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. అయితే ఇక్కడే డ్రామా మొదలైంది. Dropped x 3🫥pic.twitter.com/PucY2gbLRV — CricTracker (@Cricketracker) March 31, 2024 తొలుత తొలి స్లిప్లో ఉన్న ఫీల్డర్ చేతుల్లో నుంచి జారిపోయిన బంతి.. ఆతర్వాత సెకెండ్ స్లిప్ ఫీల్డర్ చేతుల్లో నుంచి, ఆ తర్వాత మూడో స్లిప్లో ఉన్న ఫీల్డర్ చేతుల్లో నుంచి జారిపోయి విజయవంతంగా నేలపాలైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట నువ్వులు పూయిస్తుంది. కాగా, ఇదే మ్యాచ్లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో క్లియర్గా బ్యాట్కు తాకిన బంతికి ఎల్బీ కోసం రివ్యూకి వెళ్లి నవ్వుల పాలయ్యాడు. What just happened? 👀 . .#BANvSL #FanCode #CricketTwitter pic.twitter.com/sJBR5jMSov — FanCode (@FanCode) March 30, 2024 ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో పర్యాటక శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు అర్దసెంచరీలు సాధించారు. నిషన్ మధుష్క (57), కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (93), చండీమల్ (59), ధనంజయ డిసిల్వ (70), కమిందు మెండిస్ 92 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ మెహమూద్ 2, ఖలీద్ అహ్మద్, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
శ్రీలంక 314/4
చట్టోగ్రామ్: బంగ్లాదేశ్తో మొదలైన రెండో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 314 పరుగులు సాధించింది. టాపార్డర్ బ్యాటర్లు నిశాన్ మదుష్కా (57; 6 ఫోర్లు), దిముత్ కరుణరత్నే (86; 8 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ (93; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. నిశాన్, కరుణరత్నే తొలి వికెట్కు 96 పరుగులు జోడించారు. నిశాన్ అవుటయ్యాక కుశాల్ మెండిస్తో కలిసి కరుణరత్నే రెండో వికెట్కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రస్తుతం దినేశ్ చండీమల్ (34 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), కెపె్టన్ ధనంజయ డిసిల్వా (15 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. నాలుగు నెలల తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్ స్టార్ షకీబ్ అల్ హసన్ 18 ఓవర్లు వేసి 60 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. -
బుమ్రాకు విశ్రాంతి!
రాజ్కోట్: భారత ప్రధాన పేపర్ జస్ప్రీత్ బుమ్రాకు నాలుగో టెస్టులో విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఐదు టెస్టుల ఈ సిరీస్లో సీనియర్ సీమర్ బుమ్రా రెండో టెస్టును ఒంటిచేత్తో గెలిపించాడు. మూడు మ్యాచ్లు ముగిసిన ఈ సిరీస్లో అతను 17 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మూడు మ్యాచ్ల్లో 80.5 ఓవర్లు వేశాడు. ఈ నేపథ్యంలో అతనికి రెస్ట్ ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. బోర్డుకు ఇది కొత్తేం కాదు. ఆటగాళ్లపై పనిఒత్తిడి తగ్గేంచేందుకు బోర్డు కొంతకాలంగా ఇలాంటి వైఖరి అవలంభిస్తోంది. వైజాగ్లో జరిగిన రెండో టెస్టులో హైదరాబాద్ స్పీడ్స్టర్ సిరాజ్కు విశ్రాంతినిచ్చి తిరిగి మూడో టెస్టు ఆడించింది. ‘టీమిండియా మంగళవారం రాంచీకి బయలుదేరుతుంది. ఈ మ్యాచ్ నుంచి బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడు. తొడ కండరాల గాయం నుంచి కోలుకుని వందశాతం ఫిట్నెస్తో ఉన్న కేఎల్ రాహుల్ మ్యాచ్కు అందుబాటులో ఉంటాడు’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు చెప్పారు. ధర్మశాలలో మార్చి 7 నుంచి జరిగే ఆఖరి టెస్టులో బుమ్రా తాజాగా బరిలోకి దిగేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని బోర్డు భావిస్తోంది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తొలి టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ప్రత్యర్థి స్పిన్ ఉచ్చుతో భారత్ ఓడిపోయింది. పాతగాయం తిరగబెట్టడంతో రెండో టెస్టు నుంచి తప్పించారు. మూడో మ్యాచ్కు ఎంపిక చేసినప్పటికీ ఫిట్నెస్ సంతరించుకోకపోవడంతో మళ్లీ జాతీయ క్రికెట్ అకాడమీకి పంపించారు. భారత్, ఇంగ్లండ్ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది. -
రసపట్టులో రెండో టెస్టు.. గెలుపు తలుపు తట్టేదెవరు!
విశాఖ స్పోర్ట్స్: నేడో రేపో ఫలితం గ్యారంటీ! ఎలాంటి ‘డ్రా’ మలుపులు లేకుండా ఈ టెస్టును బౌలర్లు నడిపిస్తున్నారు. నాలుగో రోజు కూడా బౌలింగ్ కుదిరితే భారత్ గెలుపు తలుపు తట్టడం ఖాయమవుతుంది. అలాగని టెస్టుల్లో ఇంగ్లండ్ ‘బజ్బాల్’ ఆటతీరును తక్కువ అంచనా వేస్తే మాత్రం హైదరాబాద్లో ఎదురైన చేదు ఫలితం తప్పదు. ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే ఇంగ్లండ్ స్పిన్ మ్యాజిక్తో ఎలాగైతే భారత రెండో ఇన్నింగ్స్ను బోల్తా కొట్టించిందో... మన స్పిన్నర్లు అదే మాయాజాలంతో దెబ్బకుదెబ్బ తీయాల్సిందే! వికెట్ల వేట భారత్ను గెలిపిస్తుందా... లేదంటే ఇంగ్లండ్ పరుగుల బాట లక్ష్యానికి చేరుస్తుందా అనేది నాలుగో రోజే తేలుతుంది. రెండు రోజుల ఆతిథ్య జట్టు ఆధిపత్యానికి ఎట్టకేలకు మూడో రోజు బ్రేక్ పడింది. భారత రెండో ఇన్నింగ్స్ను ఇంగ్లండ్ బౌలర్లు సమష్టిగా దెబ్బ తీశారు. చేతిలో 10 వికెట్లున్న టీమిండియా మరో భారీ స్కోరు చేస్తుందనుకుంటే పర్యాటక బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. ఇంగ్లండ్ స్పిన్ సవాలుకు ఎదురు నిలిచిన ఒకే ఒక్కడు శుబ్మన్ గిల్ (147 బంతుల్లో 104; 11 ఫోర్లు, 2 సిక్స్లు) శతకం సాధించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో 78.3 ఓవర్లలో 255 పరుగుల వద్ద ఆలౌటైంది. మిగతా వారిలో అక్షర్ పటేల్ (84 బంతుల్లో 45; 6 ఫోర్లు) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఏమాత్రం అనుభవం లేని స్పిన్త్రయం టామ్ హార్ట్లీ (4/77), రేహన్ అహ్మద్ (3/88), షోయబ్ బషీర్ (1/58) భారత్ను ఇబ్బందుల్లో పడేయడం ఇక్కడ పెద్ద విశేషం. వెటరన్ సీమర్ అండర్సన్ 2 వికెట్లు తీశాడు. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 143 కలుపుకొని ప్రత్యర్థి ముందు టీమిండియా 399 పరుగుల కఠిన లక్ష్యాన్ని నిర్దేశించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 14 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. అశ్విన్ బౌలింగ్లో ‘లోకల్ బాయ్’ కేఎస్ భరత్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్తో డకెట్ (28; 6 ఫోర్లు) పెవిలియన్ చేరగా... క్రాలీ (29 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్), రేహన్ (9 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి 332 పరుగుల దూరంలో ఉంది. శుబ్మన్ పోరాటం ఓవర్నైట్ స్కోరు 28/0తో ఆదివారం ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా రెండు పరుగుల వ్యవధిలోనే ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. పేసర్ అండర్సన్ ఈ రెండు వికెట్లు తీశాడు. అండర్సన్ వేసిన అద్భుత బంతికి రోహిత్ శర్మ (13; 3 ఫోర్లు) బౌల్డ్ అవ్వగా... యశస్వి (17; 3 ఫోర్లు) రూట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కష్టాలతో మొదలైన రెండో ఇన్నింగ్స్ను శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ (29; 2 ఫోర్లు ) కాసేపు ఆదుకున్నారు. జట్టు స్కోరు వంద దాటాక అయ్యర్, రజత్ పటిదార్ (9) స్పిన్ ఉచ్చులో పడ్డారు. కుదురుగా ఆడుతున్న గిల్ అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా 130/4 స్కోరు వద్ద తొలి సెషన్ ముగిసింది. రెండో సెషన్లో శుబ్మన్, అక్షర్ పటేల్ భాగస్వామ్యం ఊరటనిచ్చింది. ఇద్దరు కలిసి ఐదో వికెట్కు 89 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 200 దాటగా... శుబ్మన్ శతకాన్ని సాధించాడు. చక్కగా సాగిపోతున్న ఈ జోడీని బషీర్... గిల్ వికెట్ తీసి విడగొట్టాడు. కాసేపటికే అక్షర్ను హార్ట్లీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. టీ విరామానికి 227/6 స్కోరుతో ఉన్న భారత్ ఆఖరి సెషన్లో స్పిన్కు దాసోహమైంది. అనూహ్యంగా 14.3 ఓవర్లలోనే మిగిలున్న 4 వికెట్లను కోల్పోయి కష్టంగా 28 పరుగులు మాత్రమే చేసింది. సొంతగడ్డపై రెండో ఇన్నింగ్స్లోనూ భరత్ (6) నిరాశపరిచాడు. కుల్దీప్ (0), బుమ్రా (0) ఖాతా తెరువకపోయినా... అశ్విన్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్) వల్లే భారత్ 250 పైచిలుకు స్కోరు చేయగలిగింది. వైజాగ్లో మంచి శకునములే గతంలో వైజాగ్లో ఆడిన రెండు టెస్టుల్లోనూ భారత జట్టే గెలిచింది. ఈ రెండు సందర్భాల్లోనూ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి భారీ విజయాలు నమోదు చేసింది. 2016లో ఇంగ్లండ్పై 246 పరుగుల తేడాతో... 2019లో దక్షిణాఫ్రికాపై 203 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 396; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 253; భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) రూట్ (బి) అండర్సన్ 17; రోహిత్ (బి) అండర్సన్ 13; గిల్ (సి) ఫోక్స్ (బి) బషీర్ 104; అయ్యర్ (సి) స్టోక్స్ (బి) హార్ట్లీ 29; పటిదార్ (సి) ఫోక్స్ (బి) రేహన్ 9; అక్షర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హార్ట్లీ 45; భరత్ (సి) స్టోక్స్ (బి) రేహన్ 6; అశ్విన్ (సి) ఫోక్స్ (బి) రేహన్ 29; కుల్దీప్ (సి) డకెట్ (బి) హార్ట్లీ 0; బుమ్రా (సి) బెయిర్స్టో (బి) హార్ట్లీ 0; ముకేశ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 3; మొత్తం (78.3 ఓవర్లలో ఆలౌట్) 255. వికెట్ల పతనం: 1–29, 2–30, 3–111, 4–122, 5–211, 6–220, 7–228, 8–229, 9–255, 10–255. బౌలింగ్: అండర్సన్ 10–1–29–2, బషీర్ 15–0–58–1, రేహన్ 24.3–5–88–3, రూట్ 2–1–1–0, హార్ట్లీ 27–3–77–4. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బ్యాటింగ్) 29; డకెట్ (సి) భరత్ (బి) అశ్విన్ 28; రేహన్ (బ్యాటింగ్) 9; ఎక్స్ట్రాలు 1; మొత్తం (14 ఓవర్లలో వికెట్ నష్టానికి) 67. వికెట్ల పతనం: 1–50. బౌలింగ్: బుమ్రా 5–1–9–0, ముకేశ్ 2–0– 19–0, కుల్దీప్ 4–0–21–0, అశ్విన్ 2–0–8–1, అక్షర్ 1–0–10–0. -
బుమ్రా కూల్చేశాడు
విశాఖ స్పోర్ట్స్: హైదరాబాద్లో మన స్పిన్ కుదర్లేదు. మ్యాచ్ చేతికందలేదు. కానీ వైజాగ్లో మాత్రం ఆల్రౌండ్ ప్రదర్శన ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. మ్యాచ్లో పట్టు సాధించేందుకు ఉపయోగపడుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (290 బంతుల్లో 209; 19 ఫోర్లు, 7 సిక్సర్లు) కెరీర్లో తొలి ద్విశతకం సాధించడంతో... ఓవర్నైట్ స్కోరు 336/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 112 ఓవర్లలో 396 పరుగుల వద్ద ఆలౌటైంది. అశ్విన్ (20; 4 ఫోర్లు) ఏడో వికెట్గా పెవిలియన్ చేరగా, డబుల్ సెంచరీ పూర్తయ్యాక జైస్వాల్ నిష్క్రమించాడు. కాసేపటికే బుమ్రా (6), ముకేశ్ (0)లు నిష్క్రమించడంతో భారత్ ఇన్నింగ్స్కు తెరపడింది. అనంతరం ఇంగ్లండ్ను బుమ్రా పేస్ (15.5–5–45–6) రెండు సెషన్లలో కూల్చేసింది. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 55.5 ఓవర్లలో 253 పరుగుల వద్ద ఆలౌటైంది. జాక్ క్రాలీ (76; 11 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ స్టోక్స్ (47; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తొలి ఇన్నింగ్స్లో భారత్కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేయడంతో టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 171కి చేరింది. బ్యాట్ వదిలేసి... చేతులెత్తేశాడు! తొలి సెషన్లో ఇంగ్లండ్ కేవలం 6 ఓవర్లే ఆడింది. కానీ ఓపెనర్లు క్రాలీ, డకెట్ ఎదురుదాడికి దిగడంతో చకచకా 32/0 స్కోరు చేసింది. రెండో సెషన్ మొదలైన కాసేపటికి డకెట్ (21)ను కుల్దీప్ అవుట్ చేయడంతో 59 పరుగుల తొలివికెట్ భాగస్వామ్యం ముగిసింది. జట్టు స్కోరు వంద దాటేవరకు క్రాలీ, ఒలీ పోప్ (23; 2 ఫోర్లు) చక్కగా బ్యాటింగ్ చేశారు. బుమ్రా పేస్కు ఎదురునిలిచి వన్డేను తలపించే ఇన్నింగ్స్ ఆడిన క్రాలీని అక్షర్ బోల్తా కొట్టించాడు. అక్కడి నుంచి బుమ్రా పేస్ ఆటను మలుపు తిప్పింది. రివర్స్స్వింగ్తో రూట్ (5), బుల్లెట్లా దూసుకెళ్లిన యార్కర్తో ఒలీ పోప్లను బుమ్రా అవుట్ చేయడంతో ఒకదశలో 114/1తో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ టీ బ్రేక్కు 155/4తో ఆత్మరక్షణలో పడింది. ఆఖరి సెషన్లో కుల్దీప్ స్పిన్ జత కలవడంతో ఇంగ్లండ్ కుదేలైంది. బుమ్రా ఇన్స్వింగర్కు బెయిర్స్టో (25; 4 ఫోర్లు) వికెట్ సమర్పించుకోగా... ఫోక్స్ (6), రేహన్ (6) కుల్దీప్ ఉచ్చులో పడ్డారు. చివరి సెషన్లో కెప్టెన్ స్టోక్స్ వికెట్ హైలైట్గా నిలిచింది. బుమ్రా ఆఫ్స్టంప్ దిశగా వేసిన కట్టర్ను స్టోక్స్ డిఫెన్స్ ఆడలేక క్లీన్బౌల్డయ్యాడు. ఆ క్షణంలో బ్యాట్ వదిలేసి చేతులెత్తేయడం చూస్తే ఆ బంతినెదుర్కోవడం స్టోక్స్ వల్ల కాలేదని స్పష్టమవుతుంది. ఈ వికెట్ల పరంపరలో బుమ్రా... హార్ట్లీ (21), అండర్సన్ (6)లను పడేశాడు. యశస్వి గ్రే ‘టెస్ట్’ ఇన్నింగ్స్.... తొలిరోజు కెప్టెన్ రోహిత్తో భారత ఇన్నింగ్స్ను ఓపెన్ చేసిన 22 ఏళ్ల యశస్వి రెండో రోజు డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత్ చేసిన స్కోరు 396 అయితే... అతనిదొక్కడిదే 209! అంటే సగానికిపైగా పరుగులు జైస్వాలే చేశాడు. ఇంకా చెప్పాలంటే మిగతా పది మందిలో ఏ ఒక్కరు కనీసం అర్ధసెంచరీ అయినా చేయలేదు. అయినాసరే తనతో జోడీకట్టిన బ్యాటర్తో తన డబుల్ సెంచరీని సాకారం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్లోకి వచ్చిన ఏడు నెలల్లోనే ద్విశతకాన్ని ఓ పటిష్టమైన ప్రత్యర్థిపై సాధించడం విశేషం. వినోద్ కాంబ్లీ (21 ఏళ్లు), సునీల్ గావస్కర్ (21 ఏళ్లు) తర్వాత పిన్న వయసులోనే ద్విశతకం చేసిన మూడో భారత బ్యాటర్ జైస్వాల్. తక్కువ ఇన్నింగ్స్ (10వ)ల్లో డబుల్ సెంచరీ బాదిన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో కరుణ్ నాయర్ (3), కాంబ్లీ (4), మయాంక్ (8), పుజారా (9) ముందున్నారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 396; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: జాక్ క్రాలీ (సి) అయ్యర్ (బి) అక్షర్ 76; డకెట్ (సి) రజత్ (బి) కుల్దీప్ 21; పోప్ (బి) బుమ్రా 23; రూట్ (సి) గిల్ (బి) బుమ్రా 5; బెయిర్స్టో (సి) గిల్ (బి) బుమ్రా 25; స్టోక్స్ (బి) బుమ్రా 47; ఫోక్స్ (బి) కుల్దీప్ 6; రేహన్ (సి) గిల్ (బి) కుల్దీప్ 6; హార్ట్లీ (సి) గిల్ (బి) బుమ్రా 21; అండర్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 6; బషీర్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 9; మొత్తం (55.5 ఓవర్లలో ఆలౌట్) 253. వికెట్ల పతనం: 1–59, 2–114, 3–123, 4–136, 5–159, 6–172, 7–182, 8–229, 9–234, 10–253. బౌలింగ్: బుమ్రా 15.5–5–45–6, ముకేశ్ కుమార్ 7–1–44–0, కుల్దీప్ 17–1– 71–3, అశ్విన్ 12–0–61–0, అక్షర్ పటేల్ 4–0–24–1. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (బ్యాటింగ్) 15; రోహిత్ శర్మ (బ్యాటింగ్) 13; మొత్తం (5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 28. బౌలింగ్: అండర్సన్ 2–0–6–0, బషీర్ 2–0–17–0, రేహన్ 1–0–5–0. -
ఒకే ఒక్కడు.. భారీ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్
తొలి రోజు 336 పరుగులు చేసిన తర్వాత కూడా జట్టు కాస్త అసంతృప్తికి గురి కావడం సాధారణంగా కనిపించదు... కానీ శుక్రవారం భారత్ పరిస్థితి దాదాపు అలాగే ఉంది. చక్కగా బ్యాటింగ్కు బాగా అనుకూలిస్తున్న పిచ్పై తమకు లభించిన ఆరంభాలను బ్యాటర్లు భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అయితే ఇలాంటి సమయంలో ఒకే ఒక్కడు యశస్వి జైస్వాల్ అద్భుత బ్యాటింగ్తో శిఖరాన నిలిచాడు. మైదానం నలుమూలలా చూడముచ్చటైన స్ట్రోక్లు కొట్టడంతో పాటు పదునైన డిఫెన్స్ను ప్రదర్శిస్తూ భారీ శతకం బాదాడు. మరో వైపు ఆరు వికెట్లు తీసిన ఇంగ్లండ్ ఆనందంగా ఆటను ముగించింది. మిగిలింది బౌలర్లే కాబట్టే యశస్వి, అశ్విన్ జోడి రెండో రోజు భారత్ స్కోరును 400 వరకు తీసుకెళుతుందా లేక ఇంగ్లండ్ ఆలోపు నిలువరిస్తుందా చూడాలి. విశాఖ స్పోర్ట్స్: ఇంగ్లండ్తో ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజును భారత్ చెప్పుకోదగ్గ ప్రదర్శనతో ముగించింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 93 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (257 బంతుల్లో 179 నాటౌట్; 17 ఫోర్లు, 5 సిక్స్లు) అద్భుత ఆటతో ఒంటరి పోరాటం చేస్తూ ద్విశతకానికి చేరువయ్యాడు. యశస్వి మినహా మిగతా బ్యాటర్లంతా ప్రభావం చూపలేకపోయారు. ప్రస్తుతం యశస్వితో పాటు అశ్విన్ (5 నాటౌట్) క్రీజ్లో ఉన్నాడు. మూడు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు... భారత్ ఇన్నింగ్స్లో వరుసగా 40, 49, 90, 70, 52, 29 పరుగుల భాగస్వామ్యాలు ఉన్నాయి. చూస్తే మెరుగ్గానే అనిపిస్తున్నా... ఇందులో ఒక్కటీ భారీ భాగస్వామ్యంగా మారలేకపోయింది. ఒకే ఒక్కడు యశస్వి ఒంటి చేత్తో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా మిగతా బ్యాటర్ల స్కోర్లన్నీ 14నుంచి 34 పరుగుల మధ్య ఉండటం పరిస్థితిని చూపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ (14) తన సహజశైలికి భిన్నంగా జాగ్రత్తగా ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. అయితే 41 బంతుల్లో ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయిన అతను లెగ్స్లిప్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అరంగేట్ర బౌలర్ బషీర్ ఖాతాలో ఈ వికెట్ చేరింది. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న శుబ్మన్ గిల్ (46 బంతుల్లో 34; 5 ఫోర్లు) ఒక దశలో ఆరు బంతుల వ్యవధిలో నాలుగు ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించాడు. అయితే అండర్సన్ చక్కటి బంతికి అతను అవుటయ్యాడు. లంచ్ తర్వాత కుదురుకునేందుకు ప్రయత్నించిన శ్రేయస్ అయ్యర్ (59 బంతుల్లో 27; 3 ఫోర్లు) కూడా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడలేక కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం యశస్వికి రజత్ పటిదార్ (72 బంతుల్లో 32; 3 ఫోర్లు), ఆపై అక్షర్ పటేల్ (51 బంతుల్లో 27; 4 ఫోర్లు) అండగా నిలిచారు. టీ విరామ సమయానికి భారత్ స్కోరు 225/3. అయితే చివరి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు మూడు వికెట్లు తీయడంలో సఫలమయ్యారు. రేహన్ బౌలింగ్లో తన బ్యాట్ను తాకి వికెట్ల వైపు వెళుతున్న బంతిని ఆపడంలో విఫలమైన పటిదార్ పెవిలియన్ చేరాడు. అయితే ఆట ముగియడానికి కొద్ది సేపు ముందు భారత్ అనూహ్యంగా రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్ చెత్త షాట్తో వెనుదిరగ్గా...సొంత మైదానంలో సత్తా చాటేందుకు వచ్చిన అరుదైన అవకాశాన్ని కేఎస్ భరత్ (23 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్) వృథా చేసుకున్నాడు. ఈ టెస్టు కోసం భారత తుది జట్టులో మూడు మార్పులు జరిగాయి. గాయాలతో దూరమైన రాహుల్, జడేజా స్థానాల్లో పటిదార్, కుల్దీప్ యాదవ్ రాగా...సిరాజ్కు బదులు ముకేశ్ను ఎంపిక చేశారు. ఇటీవల ఎక్కువ క్రికెట్ ఆడిన సిరాజ్కు విరామం ఇస్తూ జట్టునుంచి విడుదల చేశామని...అతను తర్వాతి టెస్టుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. జైస్వాల్ అలవోకగా... రూట్ తొలి ఓవర్లో 2 ఫోర్లతో బౌండరీల ఖాతా తెరిచిన యశస్వి చివరి వరకు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ అదే జోరును కొనసాగించాడు. బషీర్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4 కొట్టిన యశస్వి 89 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాతా అతడిని ఇబ్బంది పెట్టడంతో ఇంగ్లండ్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. హార్ట్లీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టి ఆధిక్యం ప్రదర్శించిన భారత ఓపెనర్ కొద్ది సేపటికే కెరీర్లో రెండో శతకం (151 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. హార్ట్లీ బౌలింగ్లో లాంగాన్ మీదుగా కొట్టిన భారీ సిక్సర్తో సెంచరీని అందుకోవడం విశేషం. యశస్వి చక్కటి షాట్లకు ఇంగ్లండ్ బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. ఈ క్రమంలో రేహన్ ఓవర్లో భారీ సిక్స్తో అతను టెస్టుల్లో తన అత్యధిక స్కోరును నమోదు చేశాడు. ఇండోర్కు చెందిన రజత్ పటిదార్ ఈ మ్యాచ్తో టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టాడు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 310వ ఆటగాడిగా రజత్ నిలిచాడు. ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఇంగ్లండ్ తరఫున టెస్టులు ఆడిన 713వ క్రికెటర్గా నిలిచాడు. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (నాటౌట్) 179; రోహిత్ (సి) పోప్ (బి) బషీర్ 14; గిల్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 34; శ్రేయస్ (సి) ఫోక్స్ (బి) హార్ట్లీ 27; రజత్ (బి) రేహన్ 32; అక్షర్ (సి) రేహన్ (బి) బషీర్ 27; భరత్ (సి) బషీర్ (బి) రేహన్ 17; అశ్విన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 1; మొత్తం (93 ఓవర్లలో 6 వికెట్లకు) 336. వికెట్ల పతనం: 1–40, 2–89, 3–179, 4–249, 5–301, 6–330. బౌలింగ్: అండర్సన్ 17–3–30–1, రూట్ 14–0–71–0, హార్ట్లీ 18–2–74–1, బషీర్ 28–0–100–2, రేహన్ 16–2–61–2. -
మన గెలుపు హోరు వినిపించేనా!
కోహ్లి లేడు... కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరమయ్యారు. గిల్, శ్రేయస్ బ్యాటింగ్లో తడబాటు కనిపిస్తోంది. తొలి టెస్టులో అనూహ్య ఓటమి జట్టు ఆత్మవిశ్వాసాన్ని కాస్త దెబ్బ తీసిన పరిస్థితి. స్పిన్ మన బలం అనుకుంటే గత మ్యాచ్లో అరంగేట్ర స్పిన్నర్కే ఆటను అర్పించేశాం. ప్రత్యర్థిని చూస్తే దేనికైనా సిద్ధం అన్నట్లుగా దూకుడుతో ‘సై’ అంటోంది. రెండో టెస్టుకు ముందు భారత్ పరిస్థితి ఇది. ఇలాంటి సమయంలో విశాఖ తీరాన మన జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ‘బజ్బాల్’కు చెక్ పెట్టి ‘భారత్ బాల్’తో సత్తా చాటాల్సి ఉంది. 2016లో భారత్లో ఇంగ్లండ్ సిరీస్... తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆధిక్యం ప్రదర్శించగా మ్యాచ్ ‘డ్రా’ అయింది. తర్వాతి నాలుగు టెస్టులు గెలిచి భారత్ చివరకు సిరీస్ను 4–0తో గెలుచుకుంది. 2021లో భారత్లో ఇంగ్లండ్ సిరీస్... తొలి టెస్టులో భారత్ ఓటమి. తర్వాతి మూడు టెస్టులు గెలిచి భారత్ 3–1తో సిరీస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు 2024లో భారత్లో ఇంగ్లండ్ సిరీస్... భారత్ తొలి టెస్టు మ్యాచ్లో ఓడిపోయింది. గత రెండు సిరీస్ల తరహాలోనే టీమిండియా ఈసారీ కోలుకొని తగిన రీతిలో సమాధానమిస్తూ ముందంజ వేస్తుందా! సాక్షి, విశాఖపట్నం: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో 0–1తో వెనుకబడిన భారత జట్టు పోరును సమం చేసే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. హైదరాబాద్లో తొలి మ్యాచ్లో ఓడిన టీమిండియా రోహిత్ శర్మ నేతృత్వంలో ప్రతీకారానికి సిద్ధమైంది. మరోవైపు తమ జోరును కొనసాగిస్తూ సిరీస్లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని స్టోక్స్ బృందం పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో వైజాగ్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీసీ–వీడీసీఏ స్టేడియంలో నేటి నుంచి జరిగే రెండో టెస్టు మ్యాచ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్తో పోలిస్తే ఇరు జట్లలోనూ మార్పులు ఖాయమయ్యాయి. పటిదార్ అరంగేట్రం! తొలి టెస్టు ఓటమి తర్వాతి ఇప్పుడు రెండో టెస్టుకు తుది జట్టు ఎంపిక కూడా భారత్ టీమ్ మేనేజ్మెంట్కు పరీక్ష పెడుతోంది. గాయాలతో దూరమైన రాహుల్, జడేజా స్థానాల్లో రెండు మార్పులు తప్పనిసరి. రాహుల్ స్థానంలో ఒక బ్యాటర్ స్థానం కోసం రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నారు. గురువారం టీమ్ ప్రాక్టీస్, ఇతర అంశాలను బట్టి చూస్తే రజత్ వైపే ఎక్కువగా మొగ్గు ఉంది. భారత్ తరఫున పటిదార్ ఒకే ఒక వన్డే ఆడాడు. అశ్విన్, అక్షర్ మళ్లీ కీలకం కానుండగా జడేజా స్థానంలో మరో మాటకు తావు లేకుండా కుల్దీప్ మైదానంలోకి దిగుతాడు. అయితే కుల్దీప్ వస్తే బ్యాటింగ్ బలహీనంగా మారిపోతుంది. ఇలాంటి స్థితిలో ఇంగ్లండ్ తరహాలో ఒకే ఒక పేసర్ను ఆడించి బ్యాటింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకోవడం అవసరం. అలా చేస్తే సిరాజ్ స్థానంలో సర్ఫరాజ్ అరంగేట్రం చేయవచ్చు. అయితే వీటన్నింటికంటే టాప్–4 బ్యాటింగ్ కీలకం కానుంది. ఓపెనర్లు రోహిత్, యశస్వి కాస్త ఓపిగ్గా ఆడితే భారీ స్కోరుకు కావాల్సిన శుభారంభం లభిస్తుంది. గిల్, అయ్యర్ ఇప్పటికైనా తమకు లభిస్తున్న వరుస అవకాశాలకు న్యాయం చేయాల్సి ఉంది. బరిలోకి బషీర్... ఇంగ్లండ్ తమ తుది జట్టును గురువారమే ప్రకటించింది. గాయపడ్డ స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లోకి అడుగు పెడుతున్నాడు. గత మ్యాచ్లో భారత్ను దెబ్బ కొట్టిన హార్ట్లీ మళ్లీ చెలరేగేందుకు సిద్ధంగా ఉండగా... అన్నింటికి మించి ఏకైక పేసర్ గా సీనియర్ బౌలర్ అండర్సన్ పునరాగమనం చేస్తుండటం విశేషం. వుడ్ స్థానంలో అతడిని ఇంగ్లండ్ ఎంపిక చేసింది. తొలి టెస్టులో ఎప్పటిలాగే తమ దూకుడైన బ్యాటింగే ఇంగ్లండ్ను గెలిపించింది. ఓపెనర్లు క్రాలీ, డకెట్ ధాటిగా ఆడుతుండగా పోప్ ఆట ఎలాంటిదో గత మ్యాచ్ చూపించింది. స్టార్ బ్యాటర్ రూట్ అటు బౌలింగ్లోనూ ప్రధానపాత్ర పోషించడం జట్టు బలాన్ని పెంచింది. అటు బ్యాటింగ్తో, ఇటు కెపె్టన్సీతో స్టోక్స్ విలువైన ఆటగాడు. ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లు ఈసారి భారత్ను ఎలా నిలువరిస్తారనేది ఆసక్తికరం. అండర్సన్ @184 41 ఏళ్లు దాటిన పేసర్ అండర్సన్ తన కెరీర్లో 184వ టెస్టులో బరిలోకి దిగుతున్నాడు. అతనికి ఇది అంతర్జాతీయ క్రికెట్లో 22వ ఏడాది కానుండడం విశేషం. తను అరంగేట్రం చేసినప్పుడు ఇంకా పుట్టని రేహన్, బషీర్లతో కలిసి అండర్సన్ బౌలింగ్ చేయబోతున్నాడు. ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ తొలిసారి తన సొంత గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. వైజాగ్కే చెందిన వికెట్కీపర్ భరత్కు 6 టెస్టుల స్వల్ప కెరీర్ తర్వాతే ఈ అవకాశం దక్కడం విశేషం. ఈ టెస్టులో జట్టు అవకాశాల గురించి భరత్ మాట్లాడుతూ... ‘అన్ని ప్రణాళికలతో మేము సిద్ధంగా ఉన్నాం. తొలి టెస్ట్ మ్యాచ్లో జరిగిన తప్పులపై చర్చించాం. స్వీప్ షాట్లపై సాధన చేశాం. మేం అలాంటి షాట్లన్నీ ఆడగలం. అయితే పరిస్థితిని బట్టే బ్యాటర్లు దానిని అమలు చేస్తారు. గత ఓటమి తర్వాత మేమేం ఆందోళనకు గురి కాలేదు. జట్టులో అంతా బాగుంది. సుదీర్ఘ సిరీస్ కాబట్టి కోలుకునే అవకాశం ఉందని మాకు తెలుసు’ అని అన్నాడు. పిచ్, వాతావరణం మంచి బ్యాటింగ్ వికెట్. కాస్త బౌన్స్తో పాటు మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్కు అనుకూలిస్తుంది. ఇక్కడ జరిగిన రెండు టెస్టుల్లోనూ భారీ స్కోర్లు నమోదు చేసిన భారత్ రెండు మ్యాచ్లూ (ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలపై) గెలుచుకుంది. వర్ష సూచన లేదు. తుది జట్లు భారత్ (అంచనా): రోహిత్ (కెప్టెన్), యశస్వి, గిల్, శ్రేయస్, పటిదార్, భరత్, అశ్విన్, అక్షర్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్. ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్స్టో, ఫోక్స్, హార్ట్లీ, రేహన్, బషీర్, అండర్సన్. -
ఇంగ్లండ్తో రెండో టెస్ట్.. అరుదైన రికార్డులపై కన్నేసిన అశ్విన్
విశాఖ వేదికగా రేపటి నుంచి (ఫిబ్రవరి 2) ప్రారంభంకాబోయే (ఇంగ్లండ్తో) రెండో టెస్ట్కు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర రవిచంద్రన్ అశ్విన్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్లో యాష్ మరో 4 వికెట్లు తీస్తే టెస్ట్ల్లో 500 వికెట్ల మైలురాయిని తాకిన తొమ్మిదో పురుష క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 496 వికెట్లు (96 మ్యాచ్లు) ఉన్నాయి. ఈ రికార్డుతో పాటు రెండో టెస్ట్లో అశ్విన్ మరిన్ని రికార్డులు కూడా సాధించే అవకాశం ఉంది. ఇంగ్లండ్పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా.. ఇంగ్లండ్తో టెస్ట్ల్లో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా.. భారత్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా.. అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత బౌలర్గా పలు రికార్డులు నెలకొల్పుతాడు. ఇంగ్లండ్పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా.. టెస్ట్ల్లో ఇంగ్లండ్పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ రికార్డు భగవత్ చంద్రశేఖర్ పేరిట ఉంది. చంద్రశేఖర్ ఇంగ్లండ్తో 23 మ్యాచ్లు ఆడి 95 వికెట్లు పడగొట్టాడు. రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్లో అశ్విన్ (20 టెస్ట్ల్లో 93 వికెట్లు) మరో 3 వికెట్లు తీస్తే ఇంగ్లండ్పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కుతాడు. 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా.. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ల్లో ఇప్పటివరకు ఏ భారత బౌలర్ కూడా 100 వికెట్లు తీయలేదు. రేపటి నుంచి మొదలయ్యే రెండో టెస్ట్లో అశ్విన్ మరో 7 వికెట్లు తీస్తే.. ఇంగ్లండ్పై 100 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్గా రికార్డు నెలకొల్పుతాడు. ఇరు జట్ల మధ్య టెస్ట్ల్లో ఇప్పటివరకు జేమ్స్ ఆండర్సన్ (139 వికెట్లు) మాత్రమే 100 వికెట్ల మైలురాయిని దాటాడు. భారత్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా.. అశ్విన్ భారత గడ్డపై ఇప్పటివరకు 56 టెస్ట్ మ్యాచ్లు ఆడి 343 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ రెండో టెస్ట్లో మరో 8 వికెట్లు తీస్తే భారతగడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అనిల్ కుంబ్లే (350) రికార్డును బద్దలు కొడతాడు. అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత బౌలర్గా.. కెరీర్లో ఇప్పటివరకు 34 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించిన అశ్విన్.. ఇంగ్లండ్తో రెండో టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో ఐదు వికెట్ల ఘనతలు సాధిస్తే, అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు (భారత్ తరఫున అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు) బద్దలవుతుంది. వైజాగ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో అశ్విన్ పై పేర్కొన్న రికార్డులన్నీ ఇదే మ్యాచ్లో సాధించినా అశ్చర్యపోనక్కర్లేదు. -
Visakha Test Match: రోహిత్ పైనే భారం
విశాఖ స్పోర్ట్స్: ఒకవైపు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తదితర కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం... మరోవైపు అనుభవంలేని యువ ఆటగాళ్లు... తొలి టెస్టులో ఊహించని పరాజయం... ఈ నేపథ్యంలో వైజాగ్లోని వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో శుక్రవారం నుంచి ఇంగ్లండ్తో జరిగే రెండో టెస్టులో భారత ప్రదర్శన ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొని ఉంది. ఈ వేదికపై భారత జట్టు ఇప్పటి వరకు రెండు టెస్టులు ఆడింది. ఆ రెండింటిలోనూ భారత జట్టే గెలిచింది. కోహ్లి కెప్టెన్సీలో 2016 నవంబర్ 17 నుంచి 21 వరకు ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో టీమిండియా 246 పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం 2019 అక్టోబర్ 2 నుంచి 6 వరకు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో కోహ్లి సారథ్యంలోనే భారత జట్టు 203 పరుగుల తేడాతో విజయం సాధించింది. క్రితంసారి ఇక్కడ ఆడిన భారత టెస్టు జట్టు నుంచి కేవలం రోహిత్ , అశ్విన్ మాత్రమే ఈసారి ఆడుతున్నారు. నాటి టెస్టులో రోహిత్ రెండు సెంచరీలతో (తొలి ఇన్నింగ్స్లో 176; రెండో ఇన్నింగ్స్లో 127) అదరగొట్టాడు. ఫలితంగా బ్యాటింగ్ విషయంలో ఈసారీ రోహిత్ శర్మపైనే అధిక భారం పడనుంది. మరోసారి రోహిత్ మెరిసి... యశస్వి, అయ్యర్ ఇతర ఆటగాళ్లు కూడా రాణిస్తే విశాఖపట్నంలో భారత జట్టు ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంటుంది. సంయమనం అవసరం: కోచ్ రాథోడ్ యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని భారత్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నారు. ఒకట్రెండు మ్యాచ్లతో వారి సత్తాపై అంచనాకు రావొద్దని ఆయన కోరారు. బుధవారం ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మర సాధన చేశారు. ప్రాక్టీస్ సెషన్ అనంతరం విక్రమ్ రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ప్రస్తుత భారత జట్టులోని శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ ఎక్కువ టెస్టు మ్యాచ్లు ఆడలేదు. వారి విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు. వారిపట్ల సంయమనంతో వ్యవహరించాలి. అయ్యర్ త్వరలోనే ఫామ్లోకి వస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నా. పిచ్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడటం అలవాటు చేసుకోవాలి. పరుగులు చేసేందుకు అవకాశాలు ఉంటే వాటిని సది్వనియోగం చేసుకోవాలి. షాట్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి’ అని రాథోడ్ వ్యాఖ్యానించారు. -
ఇంగ్లండ్తో రెండో టెస్ట్.. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్న టీమిండియా..?
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగనున్న రెండో టెస్ట్లో (ఫిబ్రవరి 2 నుంచి) టీమిండియా భారీ ప్రయోగాల బాట పట్టనున్నట్లు తెలుస్తుంది. స్పిన్కు అనుకూలించే వైజాగ్ ట్రాక్పై భారత్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుందని సమాచారం. రెగ్యులర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా గాయపడిన నేపథ్యంలో అశ్విన్తో పాటు అక్షర్ పటేల్ భారత స్పిన్ విభాగాన్ని లీడ్ చేస్తాడని.. వీరిద్దరితో పాటు జడ్డూకు రీప్లేస్మెంట్గా వచ్చిన వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉంటారని సోషల్మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. సుందర్, కుల్దీప్ తుది జట్టులో చేరే క్రమంలో తొలి టెస్ట్లో ఆశించినంత ప్రభావం చూపలేకపోయిన మొహమ్మద్ సిరాజ్పై వేటు పడే అవకాశం ఉంది. వైజాగ్ లాంటి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్పై నలుగురు స్పిన్నర్లు, ఓ పేసర్ (బుమ్రా) ఐడియా సబబేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా స్పందించాడు. టీమిండియా ఈ ప్రయోగం చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించాడు. 1970, 80 దశకాల్లో భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు (బిషన్ సింగ్ బేడీ, బీఎస్ చంద్రశేఖర్, ఎర్రపల్లి ప్రసన్న, శ్రీనివాస్ వెంకట్రాఘవన్) కలిసి ఆడిన సందర్భాలను ప్రస్తావించాడు. స్పిన్ వంద శాతం సహకరించే ట్రాక్పై నలుగురు స్పిన్నర్ల ఐడియా వర్కౌటవుతుందని అభిప్రాయపడ్డాడు. మరోవైపు రెండో టెస్ట్లో టీమిండియా బ్యాటింగ్ విభాగంలోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది. గతకొంతకాలంగా పేలవ ప్రదర్శనతో విసుగు తెప్పిస్తున్న శుభ్మన్ గిల్పై వేటు పడవచ్చు. గిల్ స్థానంలో రజత్ పాటిదార్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. గాయం కారణంగా రెండో టెస్ట్కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులోకి వచ్చే ఛాన్సస్ మెరుగ్గా ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే రెండో టెస్ట్లో టీమిండియాలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. రెండో టెస్ట్కు భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ -
మళ్లీ స్పిన్ పిచ్కు సిద్ధమే!
విశాఖపట్నం: రెండో టెస్టులోనూ స్పిన్ పిచ్పై సమరానికి సిద్ధమని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. స్పిన్నర్ టామ్ హార్లీ మాయాజాలంతో హైదరాబాద్ టెస్టులో గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్లో 1–0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరీస్లో మరో పూర్తిస్థాయి స్పిన్ ట్రాక్ ఎదురైనా... తమ దళంలో అందుబాటులో ఉన్న నలుగురు స్పిన్నర్లతో దీటుగా ఎదుర్కొంటామని కోచ్ చెప్పారు. ‘ఒకవేళ తొలి టెస్టులాగే వైజాగ్లోని పిచ్ కూడా స్పిన్కే అనుకూలిస్తే భయపడం. జట్టులోని స్పిన్నర్లు దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. షోయబ్ బషీర్ అబుదాబిలో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆడే సిరీస్లోనూ రాణించే నైపుణ్యం అతనికి ఉంది. తప్పకుండా ఇక్కడ కూడా అతను ప్రభావం చూపుతాడు’ అని మెకల్లమ్ అన్నాడు. వైజాగ్ చేరుకున్న ఇరుజట్లు భారత్, ఇంగ్లండ్ జట్లు మంగళవారం సాయంత్రం వైజాగ్ చేరుకున్నాయి. నేరుగా హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఇరుజట్ల ఆటగాళ్లు అక్కడి నుంచి బస చేసే హోటల్కు వెళ్లిపోయారు. అనంతరం ఆటగాళ్లంతా ప్రయాణ బడలిక దృష్ట్యా పూర్తిగా హోటల్ గదులకే పరిమితమయ్యారు. ఫిబ్రవరి 2 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్టు జరుగుతుంది. -
IND VS ENG 2nd Test: సర్ఫరాజ్ ఎంట్రీ గ్యారెంటీ..?
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్తో జరుగబోయే రెండో టెస్ట్లో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఎంట్రీ దాదాపుగా ఖరారైపోయింది. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడిన నేపథ్యంలో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ రెండో టెస్ట్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగే అవకాశం ఉంది. సర్ఫరాజ్ ఎంట్రీతో శుభ్మన్ గిల్పై వేటు పడనుంది. శుభ్మన్ గిల్ ఇటీవలి కాలంలో వరుసగా విఫలవుతుండటంతో అతనికి ఇచ్చిన అవకాశాలు చాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. గిల్ స్థానంలో వన్డౌన్ ఆటగాడిగా రజత్ పాటిదార్ను బరిలోకి దించనున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు రెండో టెస్ట్లో వాషింగ్టన్ సుందర్ కూడా బరిలోకి దిగడం ఖాయమని సమాచారం. కండరాల సమస్యతో బాధపడుతున్న రవీంద్ర జడేజా స్థానంలో సుందర్ బరిలోకి దిగేందకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. విశాఖ టెస్ట్లో భారత్ ఈ మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్, రజత్ పాటిదార్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. మేనేజ్మెంట్ ఏదైనా సాహసం చేయాలని భావిస్తే తప్ప వీరిద్దరి ఎంట్రీని ఎవరూ అడ్డుకోలేరు. దేశవాలీ క్రికెట్లో సత్తా చాటుతున్న సర్ఫరాజ్ దేశవాలీ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్న ఈ ఇద్దరూ చాలాకాలంగా టీమిండియాలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. కీలక ఆటగాళ్లు గాయపడంతో ఎట్టకేలకు వీరి కలలు సాకారాం కానున్నాయి. 26 ఏళ్ల సర్ఫరాజ్ 2014, 2016 అండర్ వరల్డ్కప్లలో మెరిసి దేశవాలీ క్రికెట్లో స్టార్గా ఎదిగాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇతనికి ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో సర్ఫరాజ్ 66 ఇన్నింగ్స్ల్లో 69.85 సగటున 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 3912 పరుగులు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఇక ఐపీఎల్లోనూ సర్ఫరాజ్ తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పటి దాకా మొత్తంగా 37 ఇన్నింగ్స్ ఆడి 585 పరుగులు చేశాడు. గత సీజన్లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించాడు. పాటిదార్ ఇలా మరోవైపు పాటిదార్కు కూడా దేశీవాళీ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు అతను ఆడిన 55 మ్యాచ్ల్లో 45.97 సగటున 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీల సాయంతో 4000 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించారు. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్ కూడా వీరు సెంచరీలతో కదంతొక్కారు. 30 ఏళ్ల పాటిదార్ ఇటీవలే వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. గతేడాది చివర్లో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో పాటిదార్ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
IND vs ENG: టీమిండియాకు సంకటం!
హైదరాబాద్: సొంతగడ్డపై ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఎదురైన పరాజయం నుంచి కోలుకోకముందే... భారత్కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు. ఇప్పటికే తొలి రెండు టెస్టుల నుంచి సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా కీలకమైన ఇద్దరు ఆటగాళ్లు కూడా రెండో టెస్టుకు దూరమవడం జట్టుకు ప్రతికూలంగా పరిణమించనుంది. అయితే దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న, ఐపీఎల్లో అడపాదడపా మెరిపిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు ఎట్టకేలకు టీమిండియాలో చోటు దక్కింది. రెండో టెస్టు కోసం కొత్తగా సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్ ఆల్రౌండర్ సౌరభ్ కుమార్లను తీసుకోగా... తమిళనాడు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను కూడా ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేశారు. ఆదివారం నాలుగోరోజు ఆటలో పరుగు తీసే ప్రయత్నంలో జడేజా తొడ కండరాలు పట్టేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్లో కేవలం పూర్తిస్థాయిలో బ్యాటింగ్ పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ కుడి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. గత ఐపీఎల్లో కూడా రాహుల్ ఇదే విధమైన గాయంతో నాలుగు నెలలు ఆటకు దూరమయ్యాడు. ‘గాయపడిన జడేజా, రాహుల్ ఇద్దరు వచ్చే నెల 2 నుంచి విశాఖపట్నంలో జరిగే రెండో టెస్టులో పాల్గొనడం లేదు. బోర్డు మెడికల్ టీమ్ ఇద్దరి పరిస్థితిని సమీక్షిస్తోంది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సర్ఫరాజ్ గుర్తున్న క్రికెటరే కానీ..! ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ భారత సీనియర్ జట్టుకు కొత్త ముఖమై ఉండొచ్చు కానీ... క్రికెట్ అభిమానులకు తెలియని పేరేమీ కాదు. ఎందుకంటే ఐపీఎల్లో కోహ్లి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున మెరిపించాడు. అతని మెరుపులకు ఒకానొక సందర్భంలో ఫిదా అయిన కోహ్లి... సర్ఫరాజ్ అవుటై పెవిలియన్కు చేరుతుంటే రెండు చేతులు జోడించి మరీ జేజేలు పలికాడు. సర్ఫరాజ్ రెండు ఐసీసీ అండర్–19 ప్రపంచకప్ (2014, 2016)లలో ఆడాడు. భారత్ ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగాడు. రంజీల్లోనూ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. అయితే ఇదంతా కూడా అతని ఆటతీరుకు నిదర్శనమైతే... నోటిదురుసుతో సెలక్షన్ కమిటీ పరిశీలనకు అతని పేరు అదేపనిగా దూరమైంది. గత పదేళ్లుగా దేశవాళీ క్రికెట్లో ఆడుతున్న 30 ఏళ్ల సౌరభ్ ఇప్పటి వరకు 68 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 2061 పరుగులు సాధించడంతోపాటు 290 వికెట్లు పడగొట్టాడు. -
నిప్పులు చెరుగుతున్న కీమర్ రోచ్.. విలవిలలాడుతున్న ఆస్ట్రేలియా
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో వెస్టిండీస్ వెటరన్ పేసర్ కీమర్ రోచ్ నిప్పులు చెరుగుతున్నాడు. రోచ్తో పాటు మరో పేసర్ అల్జరీ జోసఫ్ కూడా చెలరేగడంతో ఆతిథ్య ఆస్ట్రేలియా విలవిలలాడిపోతుంది. వీరిద్దరి ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రోచ్.. స్టీవ్ స్మిత్ (6), కెమరూన్ గ్రీన్ (8), ట్రవిస్ హెడ్లను (0) పెవిలియన్కు పంపగా.. అల్జరీ జోసఫ్ లబూషేన్ (3), మిచెల్ మార్ష్లను (21) ఔట్ చేశాడు. 13.2 ఓవర్ల తర్వాత ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 67/5గా ఉంది. ఉస్మాన్ ఖ్వాజా (15), అలెక్స్ క్యారీ (8) క్రీజ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 266/8 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించి, 311 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్, అరంగేట్రం ఆటగాడు కెవిన్ సింక్లెయిర్ (50) అర్ధసెంచరీ చేసి, విండీస్ పైచేయి సాధించేలా చేశాడు. అతనికి ఆఖర్లో కీమర్ (8), షమార్ జోసఫ్ (3 నాటౌట్) కాసేపు సహకరించారు. దీనికి ముందు మిచెల్ స్టార్క్ (4/82) చెలరేగడంతో విండీస్ టాపార్డర్ పేకమేడలా కూలింది. స్టార్క్ ధాటికి విండీస్ 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మిడిలార్డర్ బ్యాటర్లు కవెమ్ హాడ్జ్ (71), వికెట్కీపర్ జాషువ డసిల్వ (79) విండీస్ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 149 పరుగులు జోడించి విండీస్ పతనాన్ని అడ్డుకున్నారు. విండీస్ టాపార్డర్ యధాతథంగా తమ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. కెప్టెన్ బ్రాత్వైట్ 4, చంద్రపాల్ 21, మెక్కెంజీ 21, అథనాజ్ 8, జస్టిన్ గ్రీవ్స్ 6 పరుగుల చేసి ఔటయ్యారు. హాడ్జ్, డసిల్వతో పాటు బౌలర్ అల్జరీ జోసఫ్ (32) రాణించి విండీస్ పరువు కాపాడారు. హాజిల్వుడ్ 2, కమిన్స్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. -
ఆసీస్తో రెండో టెస్ట్.. విండీస్ను ఆదుకున్న లోయర్ ఆర్డర్ బ్యాటర్లు
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో పర్యాటక విండీస్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మిడిలార్డర్ బ్యాటర్లు కవెమ్ హాడ్జ్ (71), వికెట్కీపర్ జాషువ డసిల్వ (79) విండీస్ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 149 పరుగులు జోడించి విండీస్ పతనాన్ని అడ్డుకున్నారు. ఈ మ్యాచ్లోనూ విండీస్ టాపార్డర్ యధాతథంగా తమ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. కెప్టెన్ బ్రాత్వైట్ 4, చంద్రపాల్ 21, మెక్కెంజీ 21, అథనాజ్ 8, జస్టిన్ గ్రీవ్స్ 6 పరుగుల చేసి ఔటయ్యారు. హాడ్జ్, డసిల్వతో పాటు బౌలర్ అల్జరీ జోసఫ్ (32) రాణించి విండీస్ పరువు కాపాడారు. 16 పరుగులతో కెవిన్ సింక్లెయిర్ క్రీజ్లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాశించగా.. హాజిల్వుడ్ 2, కమిన్స్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. -
కోవిడ్ ఉందని తెలిసినా ఆడించడమెందుకు.. ఇలా దూరం పెట్టడమెందుకు..?
క్రికెట్ ఆస్ట్రేలియా తమ చర్యల కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది. కోవిడ్ ఉందన్న కారణంగా సొంత ఆటగాడిపైనే వివక్ష చూపించింది. వివరాల్లోకి వెళితే.. విండీస్తో రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ కెమరూన్ గ్రీన్ కోవిడ్తో బాధపడుతున్నట్లు తెలిసింది. విషయం తెలిసి కూడా క్రికెట్ ఆస్ట్రేలియా విండీస్తో మ్యాచ్లో గ్రీన్ను బరిలోకి దించి పెద్ద సాహసమే చేసింది. ఇంత వరకు అంతా బాగానే ఉంది. కోవిడ్కు సంబంధించి ఎలాంటి అంక్షలు లేకపోవడంతో ఆస్ట్రేలియా బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చు. అయితే గ్రీన్కు కోవిడ్ ఉందన్న కారణంగా అతన్ని మిగతా ఆటగాళ్ల నుంచి దూరంగా ఉంచి క్రికెట్ ఆస్ట్రేలియా పెద్ద తప్పిదమే చేసింది. మ్యాచ్కు ముందు జాతీయ గీతాలాపన సందర్భంగా గ్రీన్ సహచరులతో పాటు లైన్లో నిలబడకుండా దూరంగా నిల్చున్నాడు. Hazlewood shoos away the Covid-positive Green! 🤪 #AUSvWI pic.twitter.com/iQFbbKfpwV— cricket.com.au (@cricketcomau) January 25, 2024 కోవిడ్ ఉందన్న కారణంగా గ్రీన్ విషయంలో సామాజిక దూరం పాటించాలని ఆసీస్ మేనేజ్మెంట్ తెలిపినట్లు సమాచారం. గ్రీన్ సహచర ఆటగాళ్ల నుంచి దూరంగా నిలబడ్డ ఫోటో నెట్టింట వైరలవుతుంది. ఈ ఫోటోను చూసి నెటిజన్లు ఆసీస్ మేనేజ్మెంట్పై దుమ్మెత్తిపోస్తున్నారు. కోవిడ్ ఉందని తెలిసినా ఆడించడమెందుకు... ఆడించాక పక్కకు పెట్టడమెందుకంటూ విరుచుకుపడుతున్నారు. మొత్తానికి ఈ చర్య వల్ల ఆసీస్ మేనేజ్మెంట్ విమర్శలపాలవుతుంది. కాగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రస్తుతం కోవిడ్ కోరలు చాచింది. ప్రతి పది మందిలో ముగ్గురు కోవిడ్ బారినపడుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇటీవలే న్యూజిలాండ్కు చెందిన పలువురు క్రికెటర్లు కూడా కోవిడ్ బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. ఆసీస్ జట్టులో గ్రీన్తో పాటు హెడ్ కోచ్ మెక్ డోనాల్డ్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆసీస్-విండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 14 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 38/1గా ఉంది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ 4 పరుగులు చేసి హాజిల్వుడ్ బౌలింగ్లో ఔట్ కాగా.. తేజ్నరైన్ చంద్రపాల్ (17), కిర్క్ మెక్కెంజీ (17) క్రీజ్లో ఉన్నారు. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. -
కేప్టౌన్ పిచ్పై ‘అసంతృప్తి’
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జరిగిన కేప్టౌన్లోని న్యూలాండ్స్ పిచ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐదు సెషన్లలోనే ముగిసిన ఈ మ్యాచ్లో వాడిన పిచ్ సంతృప్తికరంగా లేదని అభిప్రాయ పడింది. ఈ టెస్టుకు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ తన నివేదికను ఐసీసీకి అందించారు. దీని ప్రకారం న్యూలాండ్స్ పిచ్కు ఒక డీ మెరిట్ రేటింగ్ ఇచ్చారు. -
అదే మా కొంపముంచింది.. మార్క్రమ్ బ్యాటింగ్ తీరు అత్యద్భుతం: సౌతాఫ్రికా కెప్టెన్
కేప్టౌన్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో చిత్తైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇరు జట్ల పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. అంతిమంగా భారత పేసర్లదే పైచేయిగా నిలిచింది. సిరాజ్ (6/15) విశ్వరూపం ప్రదర్శించడంతో తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆతర్వాత భారత్ను 153 పరుగులకే పరిమితం చేసి తిరిగి మ్యాచ్లోకి వచ్చింది. అనంతరం మార్క్రమ్ కఠినమైన పిచ్పై నమ్మశక్యంకాని రీతిలో బ్యాటింగ్ విన్యాసాలు ప్రదర్శించి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మరపురాని ఇన్నింగ్స్ (106) ఆడాడు. మార్క్రమ్ రెచ్చిపోతుండటంతో ఓ సమయంలో సౌతాఫ్రికా మ్యాచ్పై పట్టు సాధించేలా కనిపించింది. అయితే బుమ్రా (6/60) మరో ఎండ్లో ఎవరినీ కుదురుకోనీయకపోవడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్కు 176 పరుగుల వద్ద తెర పడింది. ఫలితంగా దక్షిణాఫ్రికా టీమిండియా ముందు స్వల్ప లక్ష్యాన్ని (79) ఉంచింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఆడుతూపాడుతూ ఛేదించి, రెండు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమంగా ముగించింది. కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఇలా అన్నాడు. తొలి ఇన్నింగ్స్లో చావుదెబ్బ (55 పరుగులకు ఆలౌట్) తినడం మా విజయావకాశాలను దెబ్బతీసింది. మార్క్రమ్ చిరస్మరణీయ శతకంతో తిరిగి మమ్మల్ని మ్యాచ్లోకి తెచ్చాడు. భారత పేసర్లు పరిస్థితులను సద్వినియోగం చేసుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ ఓటమిని జీర్జించుకోవడం కాస్త కఠినమే. 2-0 తేడాతో సిరీస్ను గెలిచుంటే బాగుండేది. అయినా పర్లేదు. గెలుపు కోసం మా వంతు పోరాటం చేశాం. మా కుర్రాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. సిరీస్ ఆధ్యాంతం పేసర్లు బౌలింగ్ చేసిన తీరు.. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో మార్క్రమ్ బ్యాటింగ్ చేసిన తీరు అత్యద్భుతం. ఈ పిచ్పై ఫలితం అందరి ఊహలకు విరుద్దంగా వచ్చింది. దురదృష్టవశాత్తూ మేమే బాధితులమయ్యాము. ఈ ఫలితం ఓ గుణపాఠం లాంటిది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడంపై స్పందిస్తూ.. రోహిత్ శర్మ సైతం అదే పని చేసేవాడు. అంతిమంగా చూస్తే తొలి రోజు తొలి సెషనే మా కొంపముంచిందని ఎల్గర్ అన్నాడు. -
భారత్-సౌతాఫ్రికా రెండో టెస్ట్ విశేషాలు, రికార్డులు..
కేప్టౌన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ పలు రికార్డులకు వేదికైంది. ఈ మ్యాచ్లో భారత్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, రెండు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. దీనికి ముందు సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేప్టౌన్ టెస్ట్ రికార్డులు.. 2024లో తొలి టెస్ట్ కేవలం ఒకటిన్నర రోజుల్లో ముగిసింది (నాలుగున్నర సెషన్లు) భారత్.. సౌతాఫ్రికాను కేప్టౌన్లో తొలిసారి ఓడించింది కేప్టౌన్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు కేప్టౌన్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ జట్టుగా భారత్ రికార్డు ధోని తర్వాత సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ను డ్రా చేసుకున్న రెండో కెప్టెన్గా హిట్మ్యాన్ రికార్డు అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ తర్వాత టెస్ట్ల్లో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్ (55, తొలి ఇన్నింగ్స్) టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు (భారత్) పరుగులేమీ (153 పరుగుల వద్ద) చేయకుండా తమ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. 2024లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా మార్క్రమ్ రికార్డు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) ముగిసిన టెస్ట్ మ్యాచ్ (642 బంతుల్లో) టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి రోజు అత్యధిక వికెట్లు (23) పడిన రెండో మ్యాచ్గా రికార్డు. మ్యాచ్ విశేషాలు.. సిరాజ్ చెలరేగడంతో (6/15) తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది ఒకే స్కోర్ వద్ద (153, తొలి ఇన్నింగ్స్) టీమిండియా చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. కెరీర్లో తొమ్మిదో ఐదు వికెట్ల ప్రదర్శనతో (6/61) సౌతాఫ్రికా నడ్డివిరిచిన బుమ్రా సౌతాఫ్రికా తరఫున టెస్ట్ల్లో అత్యంత వేగవంతమైన ఆరో సెంచరీ (99 బంతుల్లో) చేసిన మార్క్రమ్ సౌతాఫ్రికా తరఫున ఓ పూర్తయిన టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక శాతం (60.22) పరుగులు చేసిన ఆటగాడిగా మార్క్రమ్ రికార్డు సౌతాఫ్రికా తాత్కలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ టెస్ట్ కెరీర్ ముగిసింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్-సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్- డీన్ ఎల్గర్, బుమ్రా స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా- 55 (వెర్రిన్ 15, సిరాజ్ 6/15), 176 (మార్క్రమ్ 106, బుమ్రా 6/61) భారత్- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్ 28, జన్సెన్ 1/15) 7 వికెట్ల తేడాతో భారత్ విజయం -
చరిత్ర తిరగరాసిన భారత్-సౌతాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్
కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ పలు రికార్డులను కొల్లగొట్టింది. కేవలం ఒకటిన్నర రోజుల్లోనే (నాలుగున్నర సెషన్లు) ముగిసిన ఈ మ్యాచ్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగియగా.. గత రికార్డు 656 బంతులుగా ఉండింది. 1932లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్ ఈ మ్యాచ్కు ముందు వరకు టెస్ట్ల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్గా ఉండింది. ఈ జాబితాలో వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య 1935లో జరిగిన మ్యాచ్ మూడో స్థానంలో (672 బంతుల్లో) ఉండగా.. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్ నాలుగో స్థానంలో (788), ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్ (లార్డ్స్) ఐదో స్థానంలో (792) ఉన్నాయి. ఇదిలా ఉంటే, కేప్టౌన్ టెస్ట్లో పేసర్లు విజృంభించడంతో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్ (9-3-15-6) విజృంభణ ధాటికి తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకు కుప్పకూలగా... భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు పరిమితమైంది. అనంతరం బుమ్రా (6/61) చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్లో 176 పరుగులకు ఆలౌటై, భారత్ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. -
కఠినమైన పిచ్పై అద్భుత శతకం.. మార్క్రమ్ ఖాతాలో అరుదైన రికార్డు
కేప్టౌన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో సౌతాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ అద్బుత శతకంతో (103 బంతుల్లో 106; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) అలరించిన విషయం తెలిసిందే. మార్క్రమ్ ఈ సెంచరీని ఎంతో కఠినమైన పిచ్పై సాధించడం విశేషం. ప్రత్యర్ధి బ్యాటర్లతో పాటు సొంత బ్యాటర్లు సైతం ఒక్కో పరుగు చేసేందుకు ఇబ్బందిపడ్డ పిచ్పై మార్క్రమ్ చిరస్మరణీయ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. పేసర్లకు స్వర్గధామంగా ఉన్న పిచ్పై సెంచరీ చేయడమే అద్భుతమనుకుంటే మార్క్రమ్ ఈ సెంచరీని కాస్త సౌతాఫ్రికా తరఫున టెస్ట్ల్లో అత్యంత వేగవంతమైన ఆరో సెంచరీగా (99 బంతుల్లో) మలిచాడు. అలాగే మార్క్రమ్ కేప్టౌన్లో సెంచరీ చేసిన తొలి ప్రొటిస్ బ్యాటర్గానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డులతో పాటు మార్క్రమ్ మరో రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున ఓ పూర్తయిన టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక శాతం (60.22) పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్లో (సెకెండ్) సౌతాఫ్రికా 176 పరుగులు చేయగా.. మార్క్రమ్ ఒక్కడే 103 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్గా ఓ పూర్తయిన టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక శాతం పరుగుల రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు చార్లెస్ బ్యానర్మ్యాన్ పేరిట ఉంది. 1877లో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ ఇన్నింగ్స్లో అతను జట్టు స్కోర్లో 67.34 శాతం పరుగులు సాధించాడు. ఆ ఇన్నింగ్స్లో ఆసీస్ 245 పరుగులు చేయగా.. బ్యానర్మ్యాన్ ఒక్కడే 165 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ విభాగంలో ఆసీస్ ఆటగాడు మైఖేల్ స్లేటర్ (66.84), టీమిండియా సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ (63.98) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, మార్క్రమ్ సెంచరీతో చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 176 పరుగుల వద్ద ముగిసింది. టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు. ముకేశ్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. టీమిండియా టార్గెట్ 79 పరుగులుగా ఉంది. అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులు చేయగా.. భారత్ తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు ఆలౌటైంది. -
చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం
South Africa Vs India 2nd Test 2024 Day 2 Updates- కేప్టౌన్: చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పేసర్లు విజృంభించడంతో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్ (9-3-15-6) విజృంభణ ధాటికి తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకు కుప్పకూలగా... భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు పరిమితమైంది. అనంతరం బుమ్రా (6/61) చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్లో 176 పరుగులకు ఆలౌటై, భారత్ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా- 55 (వెర్రిన్ 15, సిరాజ్ 6/15), 176 (మార్క్రమ్ 106, బుమ్రా 6/61) భారత్- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్ 28, జన్సెన్ 1/15) 7 వికెట్ల తేడాతో భారత్ విజయం మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కోహ్లి ఔట్ 75 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. జన్సెన్ బౌలింగ్లో కోహ్లి (12) ఔటయ్యాడు. భారత్ లక్ష్యానికి ఇంకా నాలుగు పరుగుల దూరంలో ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్ ఔట్ 57 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (10) ఔటయ్యాడు. భారత్ గెలుపుకు ఇంకా 22 పరుగుల దూరంలో ఉంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. జైస్వాల్ ఔట్ 44 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. బర్గర్ బౌలింగ్లో జైస్వాల్ (28) ఔటయ్యాడు.భారత్.. దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రక గెలుపుకు ఇంకా 35 పరుగుల దూరంలో ఉంది. దూకుడుగా ఆడుతున్న జైస్వాల్.. లక్ష్యంగా దిశగా దూసుకుపోతున్న టీమిండియా 79 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా దూకుడుగా ఆడుతుంది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ టీ20 తరహాలో విరుచుకుపడుతున్నాడు. అతను కేవలం 21 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేశాడు. రోహిత్ 6 పరుగులతో అతని జతగా క్రీజ్లో ఉన్నాడు. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 35/0గా ఉంది. 176 పరుగులకు ఆలౌటైన సౌతాఫ్రికా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..? సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 176 పరుగుల వద్ద ముగిసింది. మార్క్రమ్ అద్భుతమైన సెంచరీ సాధించిన అనంతరం సౌతాఫ్రికా వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఆఖరి వికెట్ (ఎంగిడి (8)) కూడా బుమ్రాకే దక్కింది. దీంతో బుమ్రా ఖాతాలో ఆరు వికెట్లు చేరాయి. తొలి ఇన్నింగ్స్లో రెండు, ఈ ఇన్నింగ్స్లో ఆరు కలుపుకుని బుమ్రా ఖాతాలో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడ్డాయి. బుమ్రాతో పాటు ముకేశ్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా టార్గెట్ 79 పరుగులుగా ఉంది. మ్యాచ్కు లంచ్ విరామం ప్రకటించారు. భారత పేసర్ల విజృంభణ.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 32.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్గా వెనుదిరిగిన రబడ(2) ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 31.4: సిరాజ్ బౌలింగ్లో సెంచరీ హీరో మార్క్రమ్ అవుట్ సెంచరీ పూర్తి చేసిన మార్క్రమ్.. 60 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా ఓపెనర్గా బరిలోకి దిగిన మార్క్రమ్ అత్యంత కఠినమైన పిచ్పై అద్బుత సెంచరీతో (99 బంతుల్లో 102 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. టెస్ట్ల్లో సౌతాఫ్రికా తరఫున ఇది ఆరో వేగవంతమైన సెంచరీ కూడా కావడం విశేషం. ఐదేసిన బుమ్రా.. పట్టుబిగించిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 62 పరుగుల స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా.. బుమ్రా ధాటికి తొలి సెషన్లోనే మరో 4 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా బుమ్రా ఈ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో (5/59) చెలరేగడంతో సౌతాఫ్రికా 30 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 60 పరుగుల ఆధిక్యంలో ఉంది. మార్క్రమ్ (102 నాటౌట్) అద్భుత శతకంతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. అతనికి జతగా రబాడ (2) క్రీజ్లో ఉన్నాడు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు సౌతాఫ్రికా డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. -
IND VS SA 2nd Test Day 1: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా తమ చివరి ఆరు వికెట్లను ఒకే స్కోర్ వద్ద (153) కోల్పోయి అనవసరమైన చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు పరుగులేమీ చేయకుండా ఇలా తమ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఇన్నింగ్స్ 34వ ఓవర్ తర్వాత 153/4గా ఉన్న భారత్ స్కోర్ 11 బంతుల తర్వాత 153 ఆలౌట్గా మారింది. భారత ఇన్నింగ్స్లో ఏకంగా ఆరుగురు డకౌట్లు కాగా.. రోహిత్ శర్మ (39), శుభ్మన్ గిల్ (36), విరాట్ కోహ్లి (46) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్ కార్డు చూస్తే అన్నీ సున్నాలే దర్శనమిస్తాయి. బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం టీమిండియా ఆటగాళ్ల స్కోర్లు ఇలా (0, 39, 36, 46, 0, 8, 0, 0, 0, 0, 0 నాటౌట్) ఉన్నాయి. భారత ఇన్నింగ్స్ ఆఖర్లో తొలుత ఎంగిడి (6-1-30-3), ఆతర్వాత రబాడ (11.5-2-38-3) నిప్పులు చెరిగారు. వీరికి నండ్రే బర్గర్ తోడయ్యాడు. అంతకుముందు భారత పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (9-3-15-6), ముకేశ్ కుమార్ (2.2-2-0-2), జస్ప్రీత్ బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. భారత పేస్ త్రయం ధాటికి సఫారీల ఇన్నింగ్స్ లంచ్ విరామంలోపే (23.2 ఓవర్లలో) ముగిసింది. సఫారీల ఇన్నింగ్స్లో బెడింగ్హమ్ (12), వెర్రిన్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత ఇన్నింగ్స్లా కాకుండా సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో కేవలం ఒక్కరు మాత్రమే డకౌటయ్యాడు. మిగతా బ్యాటర్లు కనీసం ఒక్క పరుగైనా చేయగలిగారు. తొలి రోజు ఆటలో ఇరు జట్ల తొలి ఇన్నింగ్స్లు 59.3 ఓవర్లలోనే ముగిసాయి. అంటే 60 ఓవర్లలోపే ఇరు జట్లు 20 వికెట్లు కోల్పోయాయి. భారత తొలి ఇన్నింగ్స్ అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసి జాగ్రత్తగా ఆడుతుంది. డీన్ ఎల్గర్ 7, మార్క్రమ్ 14 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్ను ఇంకా 76 పరుగులు వెనకపడి ఉంది. తొలి రోజు ఆటలో ఇంకా 20 ఓవర్ల ఆట మిగిలి ఉంది. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో సౌతాఫ్రికా తొలి టెస్ట్ గెలిచిన విషయం తెలిసిందే. -
55 పరుగులకే ఆలౌట్.. టెస్ట్ క్రికెట్ను అవమానించినందుకు తగిన శాస్తి జరిగింది..!
స్వదేశంలో జరిగే టీ20 లీగ్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసి టెస్ట్ క్రికెట్ను ఘోరంగా అవమానించిన క్రికెట్ సౌతాఫ్రికాకు రోజుల వ్యవధిలోనే తగిన శాస్తి జరిగింది. ఆ జట్టు స్వదేశంలో భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో తొలి రోజే 55 పరుగులకు ఆలౌటై, 135 ఏళ్ల కిందటి చెత్త రికార్డును తిరగరాసుకుంది. 1889 (ఇంగ్లండ్పై 84 పరుగులు) తర్వాత స్వదేశంలో టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేస్తూ సౌతాఫ్రికా చేసిన అత్యల్ప స్కోర్ ఇదే. ఈ మ్యాచ్లో భారత పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (9-3-15-6), ముకేశ్ కుమార్ (2.2-2-0-2), జస్ప్రీత్ బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరుగుతూ, టెస్ట్ క్రికెట్ను అవమానించినందుకు సఫారీలపై ప్రతీకారం తీర్చుకున్నారు. భారత పేస్ త్రయం ధాటికి సఫారీలు లంచ్ విరామంలోపే (23.2 ఓవర్లలో) కుప్పకూలారు. అప్పటివరకు పటిష్టంగా కనిపించిన సౌతాఫ్రికా టెస్ట్లను అవమానించిన తర్వాత ఇలా కుప్పకూలడంతో టెస్ట్ క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్లంటే గౌరవం లేని వారికి ఇలాంటి శాస్తి జరిగి తీరాల్సిందేనని శాపనార్థాలు పెడుతున్నారు. And this was the Test they actually cared about 😳 Karma strikes as days after disrespecting cricket, South Africa is bowled out before lunch for a 135-year worst >> https://t.co/WRU2aJihX8 pic.twitter.com/zYnjeVrh9W — Fox Cricket (@FoxCricket) January 3, 2024 కాగా, ఫిబ్రవరిలో న్యూజిలాండ్లో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా (CSA) సీనియర్లను కాదని ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. స్వదేశంలో జరిగే లీగ్లో (SA20) సీనియర్లను ఆడించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా ఈ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ పర్యటన కోసం CSA ఏడుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు, కొత్త కెప్టెన్తో కూడిన జట్టును ఎంపిక చేసింది. క్రికెట్ సౌతాఫ్రికా చేసిన ఈ పని టెస్ట్ క్రికెట్ను అవమానించడమేనని మాజీ క్రికెటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంపై క్రికెట్ సర్కిల్స్లో దుమారం రేగుతుండగానే సౌతాఫ్రికా ఇలా 55 పరుగులకు ఆలౌట్ కావడం చర్చనీయాశంగా మారింది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే ఆలౌట్ చేసిన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు టీ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (20), కేఎల్ రాహుల్ (0) క్రీజ్లో ఉన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వరికోత మిషన్ను తరలిస్తున్న డీసీఎం బోల్తా
కారు, బైక్ ఢీ.. భర్త మృతి
ఒకదానికొకటి ఢీకొన్న మూడు కార్లు
దేవుడి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్
మట్టి తరలిస్తున్న వారిపై కేసు
అధిక వడ్డీ ఆశచూపి మోసం
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
ఓటేసి వస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
24న కృషి విజ్ఞాన కేంద్రంలో వరి విత్తన మేళా
తప్పక చదవండి
- అద్దెకివ్వడమే శాపమయ్యింది! ఏకంగా ప్రియుడితో కలిసి..
- బిల్ కలెక్టర్ రాసలీలలు
- ‘వర్జిన్ ఓటర్’గా మిగలకండి!
- ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం
- పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. నడిరోడ్డుపైనే చితకబాదారు
- అందుకే ఓడిపోయాం!.. వరుస వైఫల్యాలు.. ఇకనైనా: సంజూ
- Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
- యూకే పార్లమెంట్ బరిలో తెలుగు బిడ్డ
Advertisement