-
కన్నప్ప సెట్స్లో...
వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకెళుతున్న హీరో ప్రభాస్ తాజాగా ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు. విష్ణు మంచు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు ఈ సినిమా నిర్మిస్తున్నారుపాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్కుమార్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్కుమార్ తమ పాత్రలకు సంబంధించిన చిత్రీకరణలను పూర్తి చేశారు. తాజాగా ప్రభాస్ ‘కన్నప్ప’ సెట్స్లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకి సాదర స్వాగతం పలికింది యూనిట్. ‘‘విష్ణు మంచు కలల ప్రాజెక్టుగా ‘కన్నప్ప’ రూపొందుతోంది. శివ భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నాం.ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథా కథనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ వంటి వారు ‘కన్నప్ప’కి పని చేస్తున్నారు. -
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
మంచువిష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ప్రముఖులు నటిస్తోన్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఓ అతిథి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.కన్నప్పలో ప్రభాస్అయితే కన్నప్ప షూటింగ్లో ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతారనే విషయంపై నెట్టింట టాక్ నడుస్తోంది. ది రాజాసాబ్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్.. కన్నప్ప కోసం కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. మే సెకండ్ వీక్లో ప్రభాస్ పాల్గొననున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అక్షయ్ కుమార్ తన సీన్లకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని విష్ణు మంచు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.అయితే మొదట శివుడి పాత్రలో ప్రభాస్ను తీసుకోవాలనుకున్నారు. కానీ అక్షయ్ ఎంట్రీతో ప్రభాస్ నందీశ్వరుడి పాత్ర పోషించనున్నాడు. దీంతో ప్రభాస్తో షూటింగ్ పూర్తి చేయడానికి ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాను మంచు విష్ణు భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్ కూడా కీలకపాత్రలు పోషించనున్నారు. ఇక సినిమాలో పార్వతిగా అనుష్క శెట్టి నటిస్తోంది. -
తలైవా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు అప్డేట్!
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం వేట్టైయాన్. ఈ చిత్రాన్ని జైభీమ్ చిత్రం పేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రజినీకాంత్ మాజీ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తలైవా నటిస్తోన్న 170వ చిత్రం. ఈ మూవీ తర్వాత రజినీకాంత్ 171వ చిత్రంలో నటించనున్నారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది.అయితే ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ ఈ సినిమాపై అసత్య ప్రచారం ఎక్కువైందనే చెప్పాలి. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్, టైటిల్ ప్రకటన, టీజర్ను వరుసగా విడుదల చేయడంతో ఈ చిత్రానికి సంబంధించి ప్రచారం హోరెత్తుతోంది. దీంతో అంతకు ముందే ప్రారంభం అయిన రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రం వేట్టైయాన్ చిత్రం మరుగున పడిందనే చెప్పాలి.కాగా.. తాజాగా వేట్టైయాన్ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వెలువడింది. ఈ చిత్రం షూటింగ్ 100 రోజులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ నెలలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని.. ఈ ఏడాది అక్టోబర్లో చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు లైకా సంస్థ నిర్వాహకులు ఎక్స్(ట్విటర్) ద్వారా వెల్లడించారు. దీంతో ఇకపై వేట్టైయాన్ చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వంటి ప్రమోషన్ కార్యక్రమాలకు చిత్ర వర్గాలు రెడీ అవుతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో దుషారా విజయన్, అమితాబ్బచ్చన్, ఫాహత్ ఫాజిల్, రానా, మంజువారియర్, రితికాసింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 100 days of #Vettaiyan shooting 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥#Jailer | #Rajinikanth | #superstar @rajinikanth | #Coolie | #VettaiyanFromOctober | #ThalaivarNirandharam | #SuperstarRajinikanth | #Hukum | #CoolieDisco | #Jailer2 | #ThalaivarNirandharam | #CoolieTitleTeaser pic.twitter.com/psri6cXUtQ— Suresh balaji (@surbalutwt) April 27, 2024 -
షూటింగ్లో భారత్కు 21వ ఒలింపిక్ బెర్త్
పారిస్ ఒలింపిక్స్ చివరి క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నీలో భారత మహిళా స్కీట్ షూటర్ మహేశ్వరి చౌహాన్ రజత పతకం సాధించింది. దాంతో భారత్కు 21వ ఒలింపిక్ బెర్త్ ఖరారైంది. దోహాలో ఆదివారం జరిగిన స్కీట్ ఈవెంట్ ఫైనల్లో మహేశ్వరి ‘షూట్ ఆఫ్’లో 3–4తో ఫ్రాన్సిస్కా క్రొవెట్టో (చిలీ) చేతిలో ఓడిపోయింది. నిర్ణీత 60 షాట్ల తర్వాత ఇద్దరూ 54–54తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. -
షూటింగ్లో భారత్కు 20వ ఒలింపిక్ బెర్త్
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లో భారత్కు 20 బెర్త్ ఖరారైంది. రియో డి జనీరోలో జరుగుతున్న చివరి ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ పలక్ గులియా కాంస్య పతకం సాధించింది. తద్వారా భారత్కు ఒలింపిక్ బెర్త్ను అందించింది. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, 18 ఏళ్ల హరియాణా అమ్మాయి పలక్ 217.6 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. భారత్కే చెందిన మరో షూటర్ సంయమ్ 176.7 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. -
షూటింగ్లు మానేసి ప్రజాసేవకు సిద్ధమా?
కిర్లంపూడి: ముఖానికి రంగు వేసుకునే వారిని ప్రజలు నమ్మరని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం విమర్శించారు. షూటింగ్లు మానేసి, హైదరాబాద్లోని ఆస్తులు పూర్తిగా అమ్మేసి, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధం కావాలని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఎన్టీ రామారావును మాత్రమే ప్రజలు విశ్వసించారన్నారు. తన కుమారుడికి సీఎం పీఠం కట్టబెట్టడానికే చంద్రబాబు ప్రజాగళం యాత్ర తప్ప మరొకరికి అధికారం ఇవ్వడానికి కాదన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వివిధ సామాజికవర్గాల నేతలు ముద్రగడను, యువనేత ముద్రగడ గిరిబాబును కిర్లంపూడిలోని వారి నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ముద్రగడ నాయకత్వంలో పిఠాపురంలో వైఎస్సార్ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని ఆ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు చెప్పారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ అఖండ మెజార్టీతో మరోసారి గెలిచి, ముఖ్యమంత్రిగా మరో 30 ఏళ్ల పాటు రామరాజ్యం స్థాపిస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీలో అన్నివర్గాలకు సముచిత స్థానం ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ, బీసీలకు సముచిత స్థానం కల్పించి, పదవులు ఇ చ్చిన ఏకైక ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్దేనని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ సముచిత స్థానం కల్పిస్తున్న వైఎస్సార్ సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకుని రావాలని కోరారు. ముద్రగడ పద్మనాభం మద్దతుగా నిలవడంతో వైఎస్సార్ సీపీకి మరింత బలం చేకూరిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమికి అధికారం అప్పగిస్తే రాష్ట్ర భవిష్యత్తు నియంతల చేతిలోకి పోతుందని హెచ్చరించారు. -
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫోటోలు లీక్.. స్టార్ డైరెక్టర్ కఠిన నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ సినిమాకు తెలుగు వర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కు అప్పగించినట్లు సమాచారం. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి , రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్ప్రీత్సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పార్ట్-2 వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. గోరేగావ్ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరలయ్యాయి. గత రెండు రోజులుగా షూటింగ్ విజువల్స్ విస్తృతంగా బయటకొచ్చాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ ఫోటోలు నెట్టిం లీక్ అవ్వడంతో దర్శకుడు నితీష్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారని బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి షూటింగ్ సెట్స్లో నో ఫోన్ పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల సోషల్ మీడియాలో లీకైన చిత్రాలలో కైకేయిగా లారా దత్తా, దశరథ్గా అరుణ్ గోవిల్ కనిపించారు. దీంతో ఆగ్రహానికి గురైన నితీశ్.. నో-ఫోన్ విధానం అమలు చేయనున్నారు. చిత్రీకరణ సమయంలో అదనపు సిబ్బంది సెట్కు దూరంగా ఉండాలని ఆదేశించారు. కేవలం సన్నివేశంలో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే సెట్లోకి అనుమతించబడతారు. కాగా.. రామాయణం కోసం రూ.11 కోట్లతో సెట్ను నిర్మించారు. త్వరలోనే రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సెట్స్లో జాయిన్ కానున్నారు. యష్ జూలైలో షూటింగ్లో పాల్గొననున్నారు. Ramayana set 😻💥#RanbirKapoor #niteshtiwari pic.twitter.com/SuUzwwjyUX — Ranbir Kapoor 👑❤️ (@Khushali_rk) April 3, 2024 Shoot for The BIGGEST movie of Indian Cinema - RAMAYANA has started. 💥 Casting is already looking 🔥, I have high hopes from this one directed by very talented Nitish Tiwari 🤞#ArunGovil #LaraDutta #Ramayana #RanbirKapoor #Yash #SaiPallavi #Ramayan 🚩 pic.twitter.com/HAmguvmmFc — αbhι¹⁸ (@CricCineHub) April 4, 2024 -
హైదరాబాద్లో తండేల్
నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ‘ప్రేమమ్, సవ్యసాచి’ వంటి చిత్రాల తర్వాత నాగచైతన్య, డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘తండేల్’. ‘లవ్ స్టోరీ’ వంటి హిట్ మూవీ తర్వాత నాగచైతన్యతో రెండోసారి ‘తండేల్’లో నటిస్తున్నారు సాయి పల్లవి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్పై ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ తాజా షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా షూట్ డైరీస్ పేరుతో సెట్స్లోని కొన్ని ఫొటోలను విడుదల చేశారు మేకర్స్. ‘‘దేశభక్తి అంశాలతో కూడిన రస్టిక్ లవ్ స్టోరీ ‘తండేల్’. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. పాత్రలకు అనుగుణంగా నాగచైతన్య–సాయిపల్లవి డీ –గ్లామర్గా కనిపిస్తారు. నటీనటుల గెటప్, క్యాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, యాసలతో సహా ప్రతిదీ పర్ఫెక్ట్గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చందు మొండేటి’’ అని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శ్యామ్దత్. -
USA: ఫ్లోరిడాలో కాల్పుల కలకలం
ఫ్లోరిడా: అమెరికా ఫ్లోరిడాలోని జాక్సెన్ విల్లా బీచ్ నగరం డౌన్ టౌన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాల్పులు జరిగిన డౌన్టౌన్ ప్రాంతంలో ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. జాక్సన్ విల్లే బీచ్లో 24వేల మంది జనాభా ఉంటారు. కాగా, అమెరికాలో చిన్న చిన్న గొడవలకు కాల్పులు జరపడం సర్వసాధారణంగా మారింది. ఇటీవలి కాలంలో కాల్పుల ఘటనల్లో పలువురు మృతి చెందారు. దేశంలో వేళ్లూనుకుపోయిన గన్ కల్చర్ ప్రస్తుతం జరుగుతున్న అమెరికా అధ్యక్షల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి.. అమెరికాకు స్పేస్ ఎక్స్ నిఘా ఉపగ్రహాలు -
Pune:హోటల్లో దారుణం.. పాయింట్ బ్లాంక్లో కాల్చి హత్య
పుణె: మహారాష్ట్రలోని పుణె సమీపంలో దారుణం జరిగింది. పుణె-సోలాపూర్ నేషనల్ హైవే పక్కన ఉన్న ఒక రెస్టారెంట్లో అవినాష్ దాన్వే అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి కస్టమర్లలా వచ్చిన ఇద్దరు వ్యక్తులు నేరుగా స్నేహితులతో కూర్చున్న దాన్వే వద్దకు వెళ్లి తలపై పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టి కాల్చారు. తలపై కాల్చగానే దాన్వే కిందపడిపోయాడు. అతని స్నేహితులు రెస్టారెంట్ నుంచి పారిపోయారు. ఇంతటితో ఆగకుండా మరో నలుగురైదుగురు దుండగులు రెస్టారెంట్ లోపలికి వచ్చి కాల్పులకు గురై పడిపోయిన దాన్వేను కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. ఈ దారుణ హత్య హోటల్ సీసీ టీవీ కెమెరాల్లో నమోదైంది. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి.. గుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి -
హైదరాబాద్లో పాకిస్తాన్ జైలు!
హైదరాబాద్లో పాకిస్తాన్ జైలు ఏంటి? అనే సందేహం తలెత్తడం ఖాయం. ఇంతకీ విషయం ఏంటంటే.. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ సినిమా కోసం హైదరాబాద్లో పాకిస్తాన్ జైలు సెట్ వేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఆ జైలు సెట్లోనే జరుగుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్పై బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. చేపల వేటలో భాగంగా పోరపాటున పాకిస్తాన్ సముద్రంలోకి వెళ్లి పట్టుబడిన కొందరు మత్స్యకారుల వాస్తవ ఘటనలతో ‘తండేల్’ రూపొందుతోంది.పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించిన వారిలో ఓ వ్యక్తిపాత్రలో నాగచైతన్య నటిస్తున్నారు. ఈ మూవీ కోసం హైదరాబాద్లోపాకిస్తాన్ జైలు సెట్ వేశారు. ప్రస్తుతం ఈ సెట్లో షూటింగ్ జరుగుతోంది. హీరో, హీరోయిన్, ఇతర ముఖ్య తారాగణంపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అలాగేపాకిస్తాన్ జైలు నుంచి విడుదలై భారతదేశానికి వచ్చిన మత్స్యకారులు ఒక రైల్వే స్టేషన్లో దిగే సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారట మేకర్స్. హైదరాబాద్లోని రైల్వేస్టేషన్లో ఈ సీన్స్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. -
డ్యాన్సింగ్ మూడ్లో స్టార్ హీరోలు.. 1997 తర్వాత 'చిరు' మళ్లీ ఇలా
ఫ్యామిలీ సాంగ్ ఆనందోత్సాహలతో ఫ్యామిలీ పాట పాడుతున్నాడట ‘విశ్వంభర’. చెల్లెళ్లు, ప్రేయసితో కలిసి హాయిగా డ్యాన్స్ చేస్తున్నాడట. ఈ ఫ్యామిలీ సెలబ్రేషన్ సాంగ్కు కారణమైన హ్యాపీ మూమెంట్స్ ఏంటో ‘విశ్వంభర’ సినిమాలో చూడాలి. చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకుడు. ‘స్టాలిన్’ తర్వాత అంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత ‘విశ్వంభర’ కోసం చిరంజీవితో జోడీ కట్టారు త్రిష. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర భీమవరం దొరబాబు అని, కథ రీత్యా దొరబాబుకు ఐదుగురు చెల్లెళ్లు ఉంటారనే ప్రచారం సాగుతోంది. చిరంజీవి చెల్లెళ్లుగా మీనాక్షీ చౌదరి, మృణాల్ ఠాకూర్, ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి కనిపిస్తారని భోగట్టా. కాగా ‘విశ్వంభర’ తాజా షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. ముందుగా కొంత టాకీ పార్ట్ చిత్రీకరించారు. ఇటీవల ఫ్యామిలీ సాంగ్ చిత్రీకరణ ఆరంభించారని తెలిసింది. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ అడ్వెంచరస్ ఫ్యాంటసీ ఫిల్మ్ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి స్వరకర్త. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘హిట్లర్’ (1997) సినిమాలో హీరో చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్లు. ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇన్నేళ్లకు చిరంజీవి మళ్లీ ఐదుగురు చెల్లెళ్లతో ‘విశ్వంభర’ చేస్తున్నారు. రొమాంటిక్ కల్కి ఇటలీ బీచ్లో ప్రేమ పాట పాడుతున్నారు ప్రభాస్. ఈ రొమాంటిక్ పాట ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న మైథాలజీ అండ్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఇది. ఇందులో దీపికా పదుకోన్, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్ కీలక పాత్రధారులు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ఇటలీలో ప్రారంభమైంది. ప్రభాస్, దిశా పటానీల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్తో పాటు ఓ మెలోడీ లవ్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్తో ‘కల్కి 2898ఏడీ’ సినిమా మేజర్ చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. పుష్పరాజ్ పాట మంచి ఫైర్ మీద ఉన్నాడు పుష్పరాజ్. తన సత్తా ఏంటో పాట రూపంలో మరోసారి చెబుతున్నాడు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లోని ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలో ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ ఓ మాస్ సాంగ్ ఉంటుంది. ఈ తరహా సాంగ్ ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’లోనూ ఉందట. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ సాంగ్ను హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడి యోలో చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ పాటకు ప్రేమ్రక్షిత్ కొరియోగ్రఫీ చేస్తున్నారట. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిన్నారు. తొలి భాగంలో శ్రీవల్లి పాత్రలో ప్రేయసిగా నటించిన హీరోయిన్ రష్మికా మందన్నా మలి భాగంలో భార్యగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఇలా ప్రస్తుతం సెట్స్లో పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
మెగా డాటర్ రీ ఎంట్రీ.. షూటింగ్ ప్రారంభం!
మలయాళ హీరో షాన్ నిగమ్, కలైయరసన్, నిహారిక, ఐశ్వర్య దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం మెడ్రాస్ కారన్. చాలా ఏళ్ల తర్వాత మెగా డాటర్ నిహారిక ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ నిహారిక కొణిదెల కూడా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు పాన్రామ్ మాట్లాడుతూ దర్శకుడు వాలిమోహన్ దాస్ మంచి మిత్రుడు అని పేర్కొన్నారు. తాము ప్రతి చిత్ర షూటింగ్కు ముందు స్క్రీన్పై గురించి చర్చించుకుంటామని చెప్పారు. ఆయన మంచి ప్రతిభావంతుడని అన్నారు. ఈయన ఎదుగుదల తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. షాన్ నిగమ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. నటుడు కలైయరసన్ తనకు మంచి స్నేహితుడని అన్నారు. ఈ టీమ్ కలిసి చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. మెడ్రాస్ కారన్ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని దర్శకుడు పొన్రామ్ అన్నారు. మెడ్రాస్ కారన్ మంచి యాక్షన్, డ్రామా కథా చిత్రంగా ఉంటుందని చిత్ర దర్శకుడు వాలిమోహన్దాస్ పే ర్కొన్నారు. చిత్ర షూటింగ్ చైన్నె, మదురై, కొచ్చి ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ బ్రాంక్స్ సబ్వే స్టేషన్లో సోమవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా అయిదుగురు గాయపడ్డారు. కాల్పుల్లో చనిపోయిన వ్యక్తిని 25 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. ఇద్దరు టీనేజర్ల మధ్య వాగ్వాదమే కాల్పులకు కారణమని పోలీసులు తెలిపారు. అయితే ఏ విషయమై వారి మధ్య వాగ్వాదం జరిగిందో తెలియదని చెప్పారు. మొత్తం 10 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత నెంబర్ 4 రైలులో ప్రారంభమైన గొడవ రైలు మౌంట్ ఈడెన్ ఎవెన్యూ స్టేషన్ చేరుకున్న తర్వాత పెద్దదైందని, ఇంతలో ఒక వ్యక్తి తుపాకీ తీసి కాల్పులు జరిపాడని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. Watch as @NYPD1stDep Tania Kinsella makes a law enforcement announcement on an ongoing investigation in The Bronx within the confines of the @NYPD44Pct. https://t.co/YiOCsvt1FI — NYPD NEWS (@NYPDnews) February 13, 2024 ఇదీ చదవండి.. ఇండోనేషియాలో ఒకే రోజు ఐదు ఎన్నికలు -
తండ్రి, కొడుకుల బంధమే 'లవ్ యువర్ ఫాదర్'!
శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం 'లవ్ యువర్ ఫాదర్'. ఈ చిత్రాన్ని పవన్ కేతరాజు దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ నిర్మాతలుగా మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం మల్లారెడ్డి కాలేజీలో చాలా ఘనంగా జరిగింది. ఈ మూవీకి మెంబర్ ఆఫ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కామకూర శాలిని కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. సిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గోపాల్ రెడ్డి క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ..'గతంలో కో డైరెక్టర్గా చాలా సినిమాలకు వర్క్ చేశా. కిషోర్ రాఠీ నన్ను పిలిచి ఈ సినిమా ఇవ్వడం జరిగింది. సూర్య ది గ్రేట్, దర్యాప్తు, యమలీల, మాయలోడు, వినోదం లాంటి ఎన్నో మంచి హిట్ సినిమాలు అందించిన మనిషా ఫిలిమ్స్ బ్యానర్పై అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ ఈ సినిమా. ఈ సినిమాను కచ్చితంగా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత మహేష్ రాఠీ మాట్లాడుతూ.. '1983 నుంచి ఇప్పటివరకు మా నిర్మాణ సంస్థ సక్సెస్పుల్గా రన్ అవుతూనే ఉంది. ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ చూపించే విధంగా ఉంటుంది. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించడం జరిగింది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. హీరో శ్రీహర్ష మాట్లాడుతూ..' ఇదే నా మొదటి సినిమా. వందశాతం కష్టపడి అందరికీ నచ్చే విధంగా చేస్తా. మీ సపోర్ట్ ఎప్పుడు నాపై ఉండాలని కోరుకుంటున్నా' అన్నారు.ఈ చిత్రంలో ఎస్పీచరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, అంజన్ శ్రీవాస్తవ్, అమన్ వేమ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. -
అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
అమెరికాలోని డెన్వర్లోని నివాస ప్రాంతంలో ఆదివారం ఉదయం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతులలో ఒక యువకునితో పాటు ఒక బాలుడు ఉన్నట్లు పోలీసుశాఖ అధికార ప్రతినిధి సీన్ టోవెల్ మీడియాకు తెలిపారు. Two people have died following an early morning shooting on February 4 in a residential area of #Denver that left four other people injured, police said.https://t.co/dma1vdrviA — The Hindu (@the_hindu) February 5, 2024 ఈ ఘటనలో గాయపడిన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. గ్రీన్ వ్యాలీ రాంచ్ ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు సోషల్ మీడియా పోస్ట్లో ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. కాల్పులలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఉదయం ఆరు గంటల సమయంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. -
ISSF World Cup: సోనమ్ మస్కర్కు రజత పతకం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్కు ఐదో పతకం లభించింది. కైరోలో జరుగుతున్న ఈ టోరీ్నలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో సోనమ్ మస్కర్ రజత పతకం సాధించింది. మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల సోనమ్కు ఇదే తొలి ప్రపంచకప్ టోర్నీ కావడం విశేషం. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో సోనమ్ 252.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అనా జాన్సెన్ (జర్మనీ; 253 పాయింట్లు) స్వర్ణం, అనెటా స్టాన్కివిజ్ (పోలాండ్; 230.4 పాయింట్లు) కాంస్యం గెలిచారు. -
కారైకుడిలో మిస్టర్ బచ్చన్
కారైకుడికి వెళ్లారు ‘మిస్టర్ బచ్చన్’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పనోరమా స్టూడియోస్, టీ–సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కాగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ తమిళనాడులోని కారైకుడిలో ప్రారంభమైంది. రవితేజతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరకర్త. -
Chicago: ఉన్మాది కాల్పుల్లో ఏడుగురి మృతి!
స్ప్రింగ్ఫీల్డ్: తుపాకీ సంస్కృతి తమకు వద్దే వద్దంటూ అమెరికన్లు గళమెత్తుతున్నా.. యువత మాత్రం వదలడం లేదు. తాజాగా మరోసారి గన్కల్చర్ పంజా విసింది. సోమవారం చికాగో నగరంలో ఓ దుండగుడు రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. ఆయుధాలతో పరారీలో ఉన్న ఆ ఉన్మాది కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇల్లానాయిస్ స్టేట్ చికాగో జోలియట్ ప్రాంతంలోని 2200 block of West Acres Roadలో సోమవారం ఈ ఘోరం జరిగింది. బాధిత కుటుంబాల ఇళ్లలోకి చొరబడి మరీ ఆ వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనల్లో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక మీడియా ఛానెల్స్ చెబుతుండగా.. స్థానిక పోలీసులు మాత్రం మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు. ACTIVE INCIDENT (UPDATED) JANUARY 22, 2024 3:00 PM At this moment, Detectives and Officers are conducting an active homicide investigation after Officers located multiple deceased individuals who had sustained gunshot wounds in two homes in the 2200 block of West Acres Road. pic.twitter.com/zOTKSjs0RC — Joliet Police Department (@JolietPolice) January 22, 2024 మరోవైపు నిందితుడిని 23 ఏళ్ల రోమియో నాన్స్గా ప్రకటించిన పోలీసులు.. బాధిత కుటుంబాలకు అతనికి పరిచయం ఉందని భావిస్తున్నారు. ఘటన తర్వాత కారులో ఆ యువకుడు పరారు అయ్యాడు. మరింత నరమేధం జరపకమునుపే అతన్ని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయతిస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు ఎఫ్బీఐ సంబంధిత టాస్క్ఫోర్స్ ఆ ఉన్మాది కోసం గాలింపు చేపట్టాయి. -
‘పుష్ప’ మళ్లీ షురూ
మళ్లీ యాక్షన్ షురూ చేశాడు పుష్పరాజ్. తనకు ఎదురొచ్చిన శత్రువుల బెండు తీస్తున్నాడు. అది ఏ రేంజ్లో అనేది ఆగస్టు 15న థియేటర్స్లో చూడాలి. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’కి మలి భాగంగా ‘పుష్ప: ది రూల్’ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరించారు. కాగా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో ప్రారంభమైందని తెలిసింది. పదిహేను రోజులకు పైగా ఈ షెడ్యూల్ సాగుతుందట. అల్లు అర్జున్ పాల్గొనగా ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్లోనే కొన్ని కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారట. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
‘అర్జున’ అందుకున్న ఇషా
సాక్షి, న్యూఢిల్లీ: భారత మహిళా షూటింగ్ రైజింగ్ స్టార్, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 2023 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను బుధవారం అందుకుంది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ అవార్డును ఇషా సింగ్కు బహూకరించారు. ఈనెల 9న రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అయితే అదే సమయంలో ఇషా జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతుండటంతో ఆమె హాజరుకాలేకపోయింది. ఇషాకు ‘అర్జున’ అందించిన అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇషా పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. -
పాపం లక్ష్య.. పతకం సాధించినా దక్కని ఒలింపిక్స్ బెర్త్
ఆసియా ఒలింపిక్ షాట్గన్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ లక్ష్య షెరోన్ కాంస్య పతకం సాధించాడు. కువైట్ సిటీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల ట్రాప్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో లక్ష్య మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో లక్ష్య పతకం సాధించినప్పటికీ పారిస్ ఒలింపిక్స్ బెర్త్ సంపాదించలేకపోయాడు. ఒలింపిక్స్ బెర్త్ను లక్ష్య తృటిలో కోల్పోయాడు. ఆరుగురు షూటర్లు ఎలిమినేషన్ పద్ధతిలో పోటీపడ్డ ఫైనల్లో 25 ఏళ్ల లక్ష్య 33 పాయింట్లు స్కోరు చేశాడు. ఇరాన్కు చెందిన 15 ఏళ్ల కుర్రాడు మొహమ్మద్ బెరాన్వంద్ స్వర్ణం, 32 ఏళ్ల చైనా షూటర్ గువో యుహావో రజతం సాధించి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించారు. -
Asia Olympic Qualifiers: భారత షూటర్ల పసిడి వేట
జకార్తాలో జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్లు పతకాల వేటను కొనసాగిస్తున్నారు. ఆదివారం భారత షూటర్ల ఖాతాలోకి రెండు స్వర్ణ పతకాలు చేరాయి. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ యోగేశ్ సింగ్ (572 పాయింట్లు) పసిడి పతకం నెగ్గాడు. యోగేశ్, అమిత్, ఓం ప్రకాశ్లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1690 పాయింట్లతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. -
భారత్కు మరో ఒలింపిక్ బెర్త్ ఖరారు.. షూటర్ నంబర్ 17
జకార్తా: పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్నుంచి మరో బెర్త్ ఖాయమైంది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఈవెంట్లో విజయ్వీర్ సిద్ధూ ఈ కోటాను ఖాయం చేశాడు. దీంతో భారత్ నుంచి పాల్గొనే షూటర్ల సంఖ్య 17కు పెరిగింది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో విజయ్వీర్ శనివారం రజత పతకం గెలుచుకున్నాడు. అయితే పతకం గెలుచుకోవడానికి ముందే అతనికి ఒలింపిక్ బెర్త్ ఖాయమైంది. క్వాలిఫయింగ్ దశలో 577 పాయింట్లు సాధించిన విజయ్వీర్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఫైనల్కు చేరిన ఆరుగురిలో నలుగురికి ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశం ఉండగా అతనికి ఈ చాన్స్ లభించింది. చండీగఢ్కు చెందిన 21 ఏళ్ల వీర్ గత ఏడాది హాంగ్జూ ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు. మరో వైపు మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ వ్యక్తిగత విభాగంలో భారత్కు 2 పతకాలు లభించాయి. ఈ ఈవెంట్లో సిఫ్ట్కౌర్ రజతం గెలుచుకోగా, ఆషి చౌక్సీకి కాంస్యం దక్కింది. -
అఖిల్ పసిడి గురి
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం భారత షూటర్లు రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం సొంతం చేసుకున్నారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో అఖిల్ షెరోన్ పసిడి పతకం నెగ్గగా... ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. అఖిల్, ఐశ్వర్య ప్రతాప్, స్వప్నిల్ కుసాలేలతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో బంగారు పతకం దక్కించుకుంది. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో అఖిల్ 460.2 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఐశ్వర్య ప్రతాప్ 459 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందగా... తోంగ్ఫాఫుమ్ (థాయ్లాండ్; 448.8 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచాడు. అఖిల్, ఐశ్వర్య ప్రతాప్, స్వప్నిల్ బృందం టీమ్ విభాగంలో 1758 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచింది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కాంగ్రెస్లోకి ఆత్మారాంనాయక్
రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదు
ఎన్నికలకు పటిష్ట భద్రత
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
న్యూస్రీల్
నకిలీ విత్తు.. ఎంచుకుంటే ముప్పు!
‘మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి’
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
నిరంతర విద్యుత్ సరఫరాకు కృషి
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్.. క్రికెట్కు గుడ్బై చెప్పిన స్టార్ క్రికెటర్
తప్పక చదవండి
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement