-
షారుఖ్ ఖాన్ చర్యతో ఆశ్చర్యపోయిన గంగూలీ.. వెంటనే..
కోల్కతా నైట్ రైడర్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.అంతేకాదు.. ఆప్యాయంగా దాదాను ముద్దాడి అభిమానం చాటుకున్నాడు. షారుఖ్ చర్యతో తొలుత ఆశ్చర్యపోయిన గంగూలీ.. తర్వాత అతడిని హత్తుకుని హర్షం వ్యక్తం చేశాడు.ఐపీఎల్-2024లో భాగంగా సోమవారం నాటి మ్యాచ్లో కేకేఆర్- ఢిల్లీ తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కేకేఆర్ బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్కతా బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(3/16) అద్భుత బౌలింగ్తో ఆకట్టుకోగా.. పేసర్లలో మిచెల్ స్టార్క్(1/43), వైభవ్ అరోరా(2/29), హర్షిత్ రాణా(2/28), స్పిన్ ఆల్రౌండర్ సునిల్ నరైన్(1/24) రాణించారు.వీరిలో స్టార్క్ ఒక్కడు ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ధనాధన్ ఇన్నింగ్స్(33 బంతుల్లో 68) సొంతగడ్డపై ఢిల్లీ మీద ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ వెనుక నుంచి వెళ్లి ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీని హత్తుకున్నాడు. వెంటనే బుగ్గ మీద ముద్దు పెట్టి ఆప్యాయత ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. the way Shah Rukh Khan ran up to Sourav Ganguly to hug and kiss him, such a wholesome moment, KKR reunion 💜 pic.twitter.com/9I0yenj0V4— sohom (@AwaaraHoon) April 29, 2024 కాగా ఐపీఎల్-2024లో కేకేఆర్కు తొమ్మిదింట ఇది ఆరో విజయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ పదకొండింటికి ఐదు మాత్రమే గెలిచి ఆరో స్థానంలో ఉంది. A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
చరిత్ర సృష్టించిన సాల్ట్.. గంగూలీ రికార్డు బ్రేక్
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పరుగుల వరద పారించాడు. విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.మిగతా బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బందిపడిన చోట.. సాల్ట్ 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో ఏకంగా 68 పరుగులు రాబట్టాడు. తద్వారా ఢిల్లీ విధించిన 154 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేకేఆర్ 16.3 ఓవర్లలోనే ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.ఇక తన అద్భుత ఇన్నింగ్స్ ద్వారా ఫిలిప్ సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా నిలిచాడు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న రికార్డును సాల్ట్ బద్దలు కొట్టాడు. ఢిల్లీ డైరెక్టర్గా ఉన్న గంగూలీ ముందే సాల్ట్ ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు1. ఫిలిప్ సాల్ట్- ఆరు ఇన్నింగ్స్లో 344 రన్స్- 20242. సౌరవ్ గంగూలీ- ఏడు ఇన్నింగ్స్లో 331 రన్స్- 20103. ఆండ్రీ రసెల్- ఏడు ఇన్నింగ్స్లో 311 రన్స్- 20194. క్రిస్ లిన్- తొమ్మిది ఇన్నింగ్స్లో 303 రన్స్- 2018.కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్లువేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్కతా, సోమవారంటాస్: ఢిల్లీ.. బ్యాటింగ్ఢిల్లీ స్కోరు: 153/9 (20)కేకేఆర్ స్కోరు: 157/3 (16.3)ఫలితం: ఢిల్లీపై ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి(కేకేఆర్)- 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు.టాప్ స్కోరర్ ఆఫ్ ది మ్యాచ్: ఫిలిప్ సాల్ట్(68).A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
రోహిత్తో కలిసి అతడే ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్-2024 కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, అదే సమయంలో యశస్వి జైస్వాల్ కూడా రేసులో ఉన్నాడనే విషయం కూడా మర్చిపోద్దని దాదా పేర్కొన్నాడు. కాగా వరల్డ్కప్ జట్టు ఎంపికకు ఐపీఎల్-2024 ప్రదర్శన కీలకం కానుందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్-2022 తర్వాత సుదీర్ఘకాలం టీ20 జట్టుకు దూరమైన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ఇటీవల స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో మెగా టోర్నీలో వీరిద్దరు ఓపెనర్లుగా దిగనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్లో కోహ్లి ఎనిమిది మ్యాచ్లలో కలిపి 379 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికే ఓ సెంచరీ(113 నాటౌట్) కూడా ఉంది. మరోవైపు.. రోహిత్ శర్మ కూడా శతకంతో చెలరేగాడు. ఎనిమిది మ్యాచ్లలో కలిపి 303 పరుగులతో ప్రస్తుతం టాప్-5లో ఉన్నాడు. వీరిద్దరు ఇలా ఫామ్లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఇక రాజస్తాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరంభంలో తడబడ్డా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో అజేయ సెంచరీ(104)తో దుమ్ములేపి రేసులోకి దూసుకువచ్చాడు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘టీమిండియాలో ప్రతిభకు కొదవలేదు. 40 బంతుల్లోనే సెంచరీ చేయగల సత్తా విరాట్ కోహ్లికి ఉంది. వెళ్లి హిట్టింగ్ ఆడటమే పనిగా పెట్టుకోవాలి. 5-6 ఓవర్ల తర్వాత ఫలితం అదే కనిపిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం వరల్డ్కప్లో రోహిత్- విరాట్ కలిసి ఓపెనింగ్ చేయాలి. సెలక్టర్ల మనసులో ఏముందో మనం అంచనా వేయలేం. కానీ నేను మాత్రం ఇది బాగుంటుందనే అనుకుంటున్నా. అలా అని యశస్వి జైస్వాల్ పేరును సెలక్టర్లు మర్చిపోతారని భావించడం లేదు. అతడొక ప్రత్యేకమైన ఆటగాడు. నిలకడైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఏదేమైనా యువ, అనుభవజ్ఞులైన జట్టుతో టీమిండియా వరల్డ్కప్ బరిలోకి దిగాలి’’ అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. కాగా మే 26న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడనుంది. చదవండి: T20 Captain: ‘రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే.. ఎనీ డౌట్?’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC 2024: వరల్డ్కప్ జట్టులో రిషభ్ పంత్?
ఐపీఎల్-2024 ద్వారా పునరాగమనం చేసిన టీమిండియా స్టార్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అద్బుత ఆట తీరు కనబరుస్తున్నాడు. గతంలో మాదిరి తనదైన శైలిలో షాట్లు బాదుతూ అభిమానులను అలరిస్తున్నాడు. బ్యాటర్గా, వికెట్ కీపర్గా పూర్తి స్థాయిలో ఢిల్లీ క్యాపిటల్స్కు సేవలు అందిస్తున్నాడు ఈ కెప్టెన్ సాబ్. ఇక ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్లో ప్రదర్శన ఆధారంగా టీమిండియా వరల్డ్కప్ బెర్తులు ఖరారు కానున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ ఇప్పటికే రేసులో ముందు వరుసలో ఉండగా.. పంత్ సైతం తానేమీ తక్కువ కాదన్నట్లు వరుస హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ వరల్డ్కప్ సెలక్షన్ గురించి బీసీసీఐ మాజీ బాస్, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్కప్ జట్టులో పంత్? వరల్డ్కప్ జట్టులో పంత్ చోటు దక్కించుకోగలడా అన్న ప్రశ్నకు బదులిస్తూ..‘‘ఇంకొన్ని మ్యాచ్లు పూర్తి కానివ్వండి. ప్రస్తుతం అతడు బాగా ఆడుతున్నాడు. బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. No look Pant 🫨#IPLonJioCinema #TATAIPL #DCvKKR pic.twitter.com/OLhLl28aAn — JioCinema (@JioCinema) April 3, 2024 సూపర్ ఫామ్లో ఉన్నాడు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్లలో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరోవారం గడిస్తే గానీ నేను ఈ ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వలేను. సెలక్టర్లు పంత్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడే అంచనా వేయలేను. ప్రస్తుతానికి పంత్ పూర్తి ఫిట్గా ఉన్నాడు’’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఆటగాడిగా రాణిస్తున్నా.. కెప్టెన్ విఫలం! కాగా డిసెంబరు, 2022లో పంత్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అతడు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడగా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ ఈ ఉత్తరాఖండ్ క్రికెటర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా దాదాపు ఏడాదిన్నర పాటు అతడు ఆటకు దూరమయ్యాడు. ఇక రీఎంట్రీలో ఆటగాడిగా రిషభ్ పంత్ రాణిస్తున్నా కెప్టెన్గా మాత్రం విజయాలు అందుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. మూడింటిలో ఓడిపోయింది. తదుపరి ఆదివారం నాటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో ఢిల్లీ తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హార్దిక్ది తప్పు కాదు.. దయ చేసి హేళన చేయవద్దు: గంగూలీ
ఐపీఎల్-2024లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ఇరు జట్లకు చాలా కీలకం. ఢిల్లీ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించగా.. ముంబై అయితే ఇంకా బోణే కొట్టలేదు. దీంతో ఇరు జట్లు ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తిరిగి గాడిలో పడాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గోన్న ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ నూతన సారథి హార్దిక్ పాండ్యాకు గంగూలీ మద్దతుగా నిలిచాడు. ఢిల్లీతో జరిగే మ్యాచ్లో హార్దిక్ పాండ్యాను ఎవరూ హేళన చేయవద్దని అభిమానులను దాదా కోరాడు. కాగా రోహిత్ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్గా హార్దిక్ ఎంపికైనప్పటి నుంచి అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. ముంబై సొంత గ్రౌండ్ వాంఖడేలో సైతం హార్దిక్కు ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. హార్దిక్ ఎక్కడ కన్పించిన రోహిత్ రోహిత్ అంటూ అభిమానులు బోయింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది సీజన్లో హార్దిక్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోవడం కూడా అతడి కష్టాలను రెట్టింపు చేసింది. వెంటనే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు. "దయచేసి అభిమానులు హార్దిక్ పాండ్యాను బూయింగ్(హేళన) చేయవద్దు. అది కరెక్ట్ కాదు. ముంబై ఫ్రాంచైజీ హార్దిక్ను తమ కెప్టెన్గా నియమించింది. అటువంటిప్పుడు అతడేం తప్పు చేశాడు. ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయానికి హార్దిక్ను తప్పుబట్టడం సరికాదు. క్రీడల్లో కెప్టెన్సీ మార్పు సహజం. భారత జట్టుకైనా కావచ్చు ఫ్రాంచైజీలకైనా ఏ ఆటగాడు తన ఇష్టానుసారం కెప్టెన్ కాలేడు. అది మెనెజ్మెంట్ నిర్ణయం. రోహిత్ శర్మ వరల్డ్ క్లాస్ ఆటగాడు. అతని పెర్ఫార్మెన్స్ వేరే స్ధాయిలో ఉంటుంది.కెప్టెన్గా ఒక ఆటగాడిగా రోహిత్ ఒక అద్బుతమని" ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో గంగూలీ పేర్కొన్నాడు. -
‘రోహిత్ శర్మ ఆటగాళ్లను అందుకే తిడతాడు’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ ప్రశంసలు కురిపించాడు. అతడొక అద్భుతమైన నాయకుడని.. జట్టును ముందుకు నడిపించడంలో తనకు తానే సాటి అని కొనియాడాడు. సౌరవ్ గంగూలీ లాంటి క్రమక్రమంగా వాళ్లు పటిష్ట జట్టు నిర్మిస్తే.. రోహిత్ శర్మ తనకు తానుగా జట్టును క్రియేట్ చేసుకున్న ఘటికుడని పేర్కొన్నాడు. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల మేళవింపుతో కూడిన టీమ్ను సమర్థవంతంగా నడిపిస్తున్న తీరు అమోఘమని ప్రశంసించాడు. రన్మెషీన్ విరాట్ కోహ్లి నుంచి భారత కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్లలో దుమ్ములేపాడు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో టీమిండియాను తిరుగులేని జట్టుగా మార్చాడు. కానీ.. టీ20 వరల్డ్కప్-2022 టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. అంతేకాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోనూ రోహిత్ శర్మ సేనకు పరాభవం తప్పలేదు. ఇక వన్డేల్లోనూ అదే తరహా దురదృష్టం వెంటాడింది. ద్వైపాక్షిక సిరీస్లో సత్తా చాటడం సహా సొంతగడ్డపై అపజయమన్నది ఎరుగక వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ దాకా వెళ్లినా.. రన్నరప్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వచ్చినా.. జట్టును నడిపించిన తీరు బాగుందని ప్రవీణ్ కుమార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. ‘‘సౌరవ్ గంగూలీ జట్టును నిర్మించాడు. కానీ రోహిత్ తనకంటూ కొత్త జట్టును క్రియేట్ చేసుకున్నాడు. సహచర ఆటగాళ్లతో తనొక స్నేహితుడిలా మెలుగుతాడు. వాళ్లు తప్పుచేసినప్పుడు మాత్రమే తిడతాడు. మళ్లీ వెంటనే వెళ్లి ఆత్మీయంగా హత్తుకుంటాడు కూడా! కెప్టెన్గా వాళ్లకు ఆదేశాలు ఇస్తూనే మైదానంలో స్వేచ్ఛగా కదిలే వెసలుబాటు కూడా కల్పిస్తాడు’’ అని ప్రవీణ్ కుమార్ రోహిత్ కెప్టెన్సీ తీరును ప్రశంసించాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్తో రోహిత్ శర్మ బిజీగా ఉన్నాడు. కోహ్లి, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ వంటి సీనియర్లు లేకుండానే ఇప్పటికే ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1తో గెలిచాడు. చదవండి: IPL 2024: లక్నో అభిమానులకు గుడ్న్యూస్.. కెప్టెన్ వచ్చేశాడు! -
అతడిని ధోనితో పోల్చడమేంటి? : గంగూలీ
టీమిండియా నయా సంచలనం ధ్రువ్ జురెల్ను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడే అతడిని మహేంద్ర సింగ్ ధోని వంటి దిగ్గజ ఆటగాడితో పోల్చకూడదని సరికాదన్నాడు. కాగా ఇంగ్లండ్తో తాజా టెస్టు సిరీస్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. రాజ్కోట్ మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో అరంగేట్ర మ్యాచ్లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో పాటు.. 46 పరుగులతో ఆకట్టుకున్నాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్. అయితే, రాంచి వేదికగా జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జురెల్ విశ్వరూపం ప్రదర్శించాడు. టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన వేళ తొలి ఇన్నింగ్స్లో అత్యంత విలువైన 90 పరుగులు చేయడంతో పాటు.. రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే జట్టు సిరీస్ను 3-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ధ్రువ్ జురెల్ టీమిండియాకు మరో ధోని అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ మాత్రం భిన్నంగా స్పందించాడు. రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోని విభిన్నమైన ఆటగాడు. ధ్రువ్ జురెల్ టాలెంట్ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అయితే, ఇప్పుడే అతడిని ధోనితో పోల్చడం సరికాదు. అతడిని స్వేచ్ఛగా ఆడనిస్తే మంచిది. ధోని ఎంఎస్ ధోని అనే బ్రాండ్ సంపాదించుకోవడానికి దాదాపు 20 ఏళ్లు పట్టింది. ఏదేమైనా జురెల్ స్పిన్, పేస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం సానుకూల అంశం. అంతేకాదు.. ఒత్తిడిలోనూ నిలకడగా ఆడటం అతడి ప్రతిభ, పట్టుదలకు నిదర్శనం’’ అని సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇక డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్ గురించి ప్రస్తావన రాగా.. అతడు మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటగల క్రికెటర్ అని గంగూలీ కితాబులిచ్చాడు. -
అచ్చం దాదా మాదిరే.. మరో గంగూలీ అవుతాడు!
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. యశస్వి బ్యాటింగ్ తీరు చూస్తే తనకు సౌరవ్ గంగూలీ గుర్తుకువస్తాడని తెలిపాడు. దాదా మాదిరే ఆఫ్ సైడ్ ఆడటంలో ఈ ముంబై బ్యాటర్ దిట్ట అంటూ కొనియాడాడు. కాగా వెస్టిండీస్ గడ్డపై శతకంతో అంతర్జాతీయ క్రికెట్ను మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్.. ఇటీవలే తొలి డబుల్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా వైజాగ్లో జరిగిన రెండో మ్యాచ్లో ద్విశతకంతో చెలరేగి.. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తదుపరి రాజ్కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానున్న మూడో టెస్టుకు యశస్వి జైస్వాల్ సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో యశస్వి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ సిరీస్లో నేను ఎవరి ఆట కోసమైనా ఎదురుచూస్తున్నానంటే అది యశస్వి జైస్వాల్ మాత్రమే! ఐపీఎల్లో అతడు ఎలా ఆడతాడో మనమంతా చూశాం. అత్యద్భుతమైన ఆటగాడు. దాదా మాదిరే ఆఫ్ సైడ్ గేమ్ చితక్కొడతాడు. నిజానికి తనను ఆఫ్ సైడ్ రారాజు అని పిలవొచ్చు. ఒకవేళ వచ్చే పదేళ్ల పాటు అతడు జట్టులో కొనసాగితే.. తప్పకుండా దాదా మాదిరే ప్రభావం చూపగలడు. మనం ఇప్పుడు దాదా గురించి మాట్లాడుకుంటున్నట్లుగానే యశస్వి గురించి కూడా మాట్లాడుకోవడం ఖాయం. అంతర్జాతీయ క్రికెట్లో ద్విశతకం బాది తన సత్తా ఏమిటో యశస్వి మరోసారి నిరూపించుకున్నాడు. మున్ముందు కూడా మరింత మెరుగ్గా ఆడతాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 22 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఆరు టెస్టులాడి 637 పరుగులు, 17 టీ20లలో 502 పరుగులు సాధించాడు. టెస్టు ఫార్మాట్లో టీమిండియా మొదటి ప్రాధాన్య ఓపెనర్గా.. కెప్టెన్ రోహిత్ శర్మ జోడీగా కొనసాగుతున్నాడు. చదవండి: IPL 2024- SRH: తెలివైన నిర్ణయం.. సన్రైజర్స్ కెప్టెన్గా అతడే! -
అలాంటి పిచ్లు అవసరమా అన్న గంగూలీ.. ద్రవిడ్ కౌంటర్!
Ind vs Eng- Dravid Comments On Pitch: ఇటీవల కాలంలో టెస్టు మ్యాచ్లు ఐదురోజుల పాటు పూర్తిగా జరిగిన సందర్భాలు అరుదు. ఒక్కోసారి ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్లు ముగిసిపోవడం వల్ల పిచ్ల తయారీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా- ఇంగ్లండ్ తాజా సిరీస్పై క్రికెట్ దిగ్గజాల దృష్టి పడింది. భారత్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన గత సిరీస్లో పిచ్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సహా ఇతర మాజీ క్రికెటర్లు వ్యంగ్యస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుకు మాత్రమే ఉపయోగపడేలా వికెట్ రూపొందించారంటూ విమర్శించారు. ఈ క్రమంలో తాజా సిరీస్లో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్లు నాలుగు రోజుల పాటు సాగాయి. బుమ్రా అద్భుత ప్రదర్శన హైదరాబాద్ టెస్టులో విజయంతో ఇంగ్లండ్ సిరీస్ ఆరంభిస్తే... విశాఖపట్నంలో టీమిండియా గెలుపొంది సిరీస్ను 1-1తో సమం చేసింది. రెండు మ్యాచ్లు కూడా రసవత్తరంగానే సాగడం విశేషం. ముఖ్యంగా టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా వికెట్లు తీసిన తీరు ముచ్చటగొలిపింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. భారత్లో స్పిన్తో పాటు పేస్కూ అనుకూలించే పిచ్లు రూపొందించాలని విజ్ఞప్తి చేశాడు. కేవలం టర్న్ అయ్యే పిచ్లు మనకు అవసరమా అని ఈ సందర్భంగా కామెంట్ చేశాడు. ఈ క్రమంలో.. తాజాగా ఈ విషయంపై టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం స్పందించాడు. When I see Bumrah Sami Siraj Mukesh bowl . I wonder why do we need to prepare turning tracks in india ..my conviction of playing on good wickets keeps getting stronger every game .. They will get 20 wickets on any surface with ashwin jadeja Kuldeep and axar .. batting quality… — Sourav Ganguly (@SGanguly99) February 3, 2024 విశాఖ మ్యాచ్లో భారత్ గెలుపు నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. తామెప్పుడూ పూర్తి స్పిన్ పిచ్ తయారు చేయాలని కోరలేదని స్పష్టం చేశాడు. పిచ్ల రూపకల్పన క్యూరేటర్ల పని అని.. అందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశాడు. టర్న్ అయ్యే పిచ్లే కావాలని మేము కోరలేదు ‘‘పిచ్లను క్యూరేటర్ తయారు చేస్తారు. పూర్తిగా టర్నింగ్ పిచ్లు మాత్రమే కావాలని మేము అడగము. ఇండియాలో సహజంగానే వికెట్లు స్పిన్కు అనుకూలిస్తాయి. అయితే, అవి ఎంత వరకు టర్న్ అవుతాయి? ఎంత తక్కువ టర్న్ అవుతాయి? అన్న విషయాలు మనకు తెలియవు. నేనేమీ పిచ్ నిపుణుడిని కాదు. ఇండియాలో పిచ్లు నాలుగు- ఐదు రోజుల ఆట కోసమే రూపొందిస్తారు. మళ్లీ చెప్తున్నా ఇక్కడి పిచ్లు టర్న్ అవుతాయి. అంతేగానీ.. టర్న్ అవుతూనే ఉండవు. ఒక్కోసారి మూడో రోజు.. ఒక్కోసారి నాలుగో రోజు.. ఒక్కో సారి రెండోరోజే టర్న్ అవుతాయి. పిచ్ స్వభావం ఎలా ఉండబోతుందన్న అంశంపై ఎవరికీ పూర్తి అవగాహన ఉండదు. ఏ పిచ్పై అయినా మా ఆట తీరు ఎలా ఉంటుందనేదే ముఖ్యం. తదుపరి మేము రాజ్కోట్కు వెళ్తున్నాం. అక్కడి పిచ్ ఎలా ఉంటుందో మాకు ఐడియా లేదు. ఎలాంటి వికెట్పై అయినా మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడమే మాకు ప్రథమ ప్రాధాన్యం’’ అని రాహుల్ ద్రవిడ్ కుండబద్దలు కొట్టాడు. గంగూలీకి కౌంటర్గానేనా? ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నెటిజన్లు.. గంగూలీ లాంటి వాళ్లకు ద్రవిడ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా గంగూలీ బీసీసీఐ బాస్గా ఉన్న సమయంలోనే తన సహచర ఆటగాడు ద్రవిడ్ను హెడ్కోచ్గా నియమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్లో మూడో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: IPL 2024: అందుకే రోహిత్ను ముంబై కెప్టెన్గా తప్పించాం.. కోచ్పై రితిక ఫైర్ -
కేవలం ఇలాంటి పిచ్లు మనకు అవసరమా: గంగూలీ
India vs England, 2nd Test: భారత్లో పిచ్లు కేవలం స్పిన్కు మాత్రమే కాకుండా.. పేస్కు కూడా అనుకూలించేలా తయారు చేస్తే బాగుంటుందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ తదితరుల బౌలింగ్ చూసినపుడల్లా తనకు ఇలాంటి ఆలోచన వస్తుందని పేర్కొన్నాడు. పిచ్లు బాగుంటే ఆట మరింత రసకందాయకంగా ఉంటుందని.. ఐదు రోజులపాటు సాగే టెస్టును కూడా గెలిచే సత్తా టీమిండియా సొంతమని గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా ఉపఖండంలో పిచ్లు స్పిన్కు ఎక్కువగా అనుకూలిస్తాయన్న విషయం తెలిసిందే. అయితే, విదేశాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. ఫాస్ట్బౌలర్లకు అనుకూలించే పిచ్లు ఉంటాయక్కడ. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా టెస్టు మ్యాచ్లు రెండు.. మూడు రోజుల్లోనే.. ఒక్కోసారి ఒకటిన్నర రోజుల్లోనే ముగిసిపోతున్న తరుణంలో.. పిచ్ల రూపకల్పనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టర్నింగ్ ట్రాకులు మాత్రమే ఎందుకు? ఈ విషయంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘బుమ్రా, షమీ, సిరాజ్, ముకేశ్ బౌలింగ్ చేయడం చూసినపుడు.. ఇండియాలో ఇంకా టర్నింగ్ ట్రాక్ల తయారీకే మనం ఎందుకు పరిమితం కావాలి అనిపిస్తుంది. మంచి వికెట్ తయారు చేస్తే ప్రతి ఆట మరింత రసవత్తరంగా ఉంటుంది కదా! అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్ పటేల్(స్పిన్నర్లు)లతో కలిసి మన పేసర్లు కూడా ఇక్కడి పిచ్లపై 20 వికెట్లు తీయగలరు. నిజానికి సొంతగడ్డపై.. స్పిన్కు అనుకూలించే పిచ్ల మీద గత ఆరేడేళ్లుగా మన బ్యాటింగ్లో నాణ్యత లోపించడం చూస్తూనే ఉన్నాం. నాణ్యమైన వికెట్లు తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఐదు రోజుల మ్యాచ్ను గెలవగల సత్తా ఇంకా టీమిండియాకు ఉంది’’ అని గంగూలీ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇంగ్లండ్పై ఆరేసిన బుమ్రా కాగా టీమిండియా ప్రస్తుతం సొంతగడ్డ మీద ఇంగ్లండ్తో టెస్టులు ఆడుతోంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో రోహిత్ సేన ఓడిపోయింది. ఈ క్రమంలో విశాఖపట్నం వేదికగా శుక్రవారం రెండో మ్యాచ్ మొదలుపెట్టింది. శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా ఆరు వికెట్లతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో గంగూలీ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకోవడం గమనార్హం. చదవండి: ఇలాంటి బాల్ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్ బౌల్డ్.. రియాక్షన్ వైరల్ When I see Bumrah Sami Siraj Mukesh bowl . I wonder why do we need to prepare turning tracks in india ..my conviction of playing on good wickets keeps getting stronger every game .. They will get 20 wickets on any surface with ashwin jadeja Kuldeep and axar .. batting quality… — Sourav Ganguly (@SGanguly99) February 3, 2024 -
T20 WC 2024: టీమిండియా కెప్టెన్గా అతడే సరైనోడు: గంగూలీ
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాకు రోహిత్ శర్మనే కెప్టెన్గా ఉండాలని భారత జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ అన్నాడు. రోహిత్తో పాటు విరాట్ కోహ్లి కూడా ఐసీసీ టోర్నీలో ఆడితే భారత్ అనుకున్న ఫలితాలు రాబట్టవచ్చని బీసీసీఐ మాజీ బాస్ అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 వరల్డ్కప్-2022 తర్వాత కేవలం వన్డేలు, టెస్టులకే పరిమితమైన రోహిత్ శర్మ, కోహ్లి.. అఫ్గనిస్తాన్తో స్వదేశంలో టీ20 సందర్భంగా పునరాగమనం చేయనున్నారు. ఏడాది తర్వాత టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో బరిలోకి దిగనున్నారు. రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గాయాల కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో విరాహిత్ ద్వయం రీఎంట్రీ ప్రాధాన్యం సంతరించుకుంది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. రోహిత్- కోహ్లితో చర్చించి అంతర్జాతీయ టీ20లలో మళ్లీ బరిలోకి దిగేలా ఒప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరిద్దరు ప్రపంచకప్ ఈవెంట్లోనూ ఆడటం దాదాపుగా ఖాయమైనట్లే!! ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం తర్వాత పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇస్తున్న వీరి ఫామ్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ రూపంలో పొట్టి ఫార్మాట్లో టచ్లోనే ఉన్నా.. టీమిండియా తరఫున స్థాయికి తగ్గట్లు రాణిస్తారా? వీరి రాక వల్ల యువ ఆటగాళ్ల పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘టీ20 వరల్డ్కప్లో రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండాలి. విరాట్ కోహ్లి కూడా జట్టుతో పాటే ఉండాలి. విరాట్ అత్యద్భుతమైన ఆటగాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. ఇక చాలా కాలం తర్వాత నేరుగా జట్టులోకి వస్తున్నారంటూ కోహ్లి- రోహిత్ల గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేయడం సరికాదన్న గంగూలీ.. జట్టుకు ఇలాంటి అనుభవజ్ఞుల అవసరం ఉందని నొక్కివక్కాణించాడు. కాగా అఫ్గన్తో సిరీస్ ద్వారా విరాహిత్ ద్వయం టీ20 జట్టుతో చేరనుండగా.. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మలకు జట్టులో చోటిచ్చారు. అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కోహ్లి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. -
రూ. 10 కోట్లదాకా వెళ్తామని గంగూలీ మాటిచ్చారు.. ఇలా అనుకోలేదు!
IPL 2024 Auction: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ వల్ల వెలుగులోకి వచ్చిన యువ క్రికెటర్లు ఎందరో ఉన్నారు. దేశవాళీ క్రికెట్, సెలక్షన్ క్యాంపులలో అసాధారణ ప్రతిభాపాటవాలతో ఆకట్టుకున్న ఆటగాళ్లకు ఫ్రాంఛైజీలు భారీ మొత్తం చెల్లించేందుకు కూడా సిద్ధపడతాయన్న విషయం తెలిసిందే. తమ జట్టుకు సదరు ఆటగాడు ఉపయోగపడతాడని భావిస్తే కనీస ధరతో సంబంధం లేకుండా కోట్ల వర్షం కురిపించిన దాఖలాలు కోకొల్లలు. ఐపీఎల్-2024 వేలం సందర్భంగా ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు ఓ అన్క్యాప్డ్ ప్లేయర్. రూ. 20 లక్షల కనీస ధరతో ఆక్షన్లోకి వచ్చి ఏకంగా రూ. 7.20 కోట్లు కొల్లగొట్టాడు. అతడి పేరు కుమార్ కుషాగ్ర. ఢిల్లీ క్యాపిటల్స్ అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్తో పోటీ పడి మరీ ఈ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అయితే, దీనంతటికి క్యాపిటల్స్ మెంటార్ సౌరవ్ గంగూలీనే కారణం అంటున్నాడు కుషాగ్ర తండ్రి శశికాంత్. ధోనిలా వికెట్ కీపింగ్ చేస్తున్నాడంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ట్రయల్స్ సందర్భంగా గంగూలీ కుషాగ్రతో మాట్లాడారు. నీకోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 10 కోట్ల వరకు ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడుతుందని కుషాగ్రకు చెప్పారు. నిజానికి ట్రయల్స్లో భాగంగా కుషాగ్ర సిక్సర్లు బాదడం చూసి గంగూలీ ముచ్చటపడ్డారు. వికెట్ కీపింగ్ నైపుణ్యాలు కూడా అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. అంతేకాదు.. కుషాగ్ర మహేంద్ర సింగ్ ధోని మాదిరే బెయిల్స్ను హిట్ చేస్తున్నాడంటూ కొనియాడారు. ఉత్సాహపరిచేందుకు చెప్తున్నారనుకున్నా గానీ.. ఇలా అనుకోలేదు వేలంలో కుషాగ్రను ఢిల్లీ కనీస ధరకే కొనుగోలు చేస్తుందని భావించాం. అయితే, ఆ తర్వాత అద్భుతాలు జరిగాయి. గంగూలీ మాట ఇచ్చినట్లుగానే ఇతర జట్లతో పోటీ పడీ మరీ మా వాడిని కొనుగోలు చేసేలా చేశారు. జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ కుషాగ్రకు ఐదేళ్ల వయసు నుంచే క్రికెట్ అంటే ఇష్టం పెరిగింది. తను ఇక్కడిదాకా చేరుకోవడం గర్వంగా ఉంది’’ అని శశికాంత్ పేర్కొన్నారు. కాగా జార్ఖండ్కు చెందిన 19 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్ర. గతేడాది రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఏకంగా 266 పరుగులు సాధించి వెలుగులోకి వచ్చాడు. రంజీ చరిత్రలో ఓ మ్యాచ్లో 250కి పైగా రన్స్ చేసిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ, దేళవాళీ టీ20 క్రికెట్లోనూ సత్తా చాటాడు. తద్వారా ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించి కాసుల వర్షంలో తడిశాడు. చదవండి: తండ్రిది పాన్ షాప్.. గ్లవ్స్ కొనేందుకు కూడా డబ్బులు లేవు! ఇప్పుడు ఏకంగా రూ.5 కోట్లు -
ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా కలవలేదు.. సల్మాన్ నా ఫేవరెట్: గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు స్వాగతం పలికాడు. సల్మాన్ తన అభిమాన నటుడన్న దాదా.. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆయనను కలవలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నాడు. ఏదేమైనా కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా సల్లూ భయ్యాను కలుసుకోవడం సంతోషంగా ఉందని గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. కాగా కోల్కతా వేదికగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి మంగళవారం తెరలేచింది. పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా కోల్కతాకు విచ్చేసిన బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, మహేశ్ భట్, శత్రుఘ్న సిన్హా, సోనాక్షి సిన్హా తదితరులకు ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో వేదికపైకి వచ్చిన సౌరవ్ గంగూలీ సల్మాన్ ఖాన్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నా అభిమాన నటుడు మిస్టర్ సల్మాన్ ఖాన్కు కోల్కతా తరఫున స్వాగతం. వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవడం ఇదే తొలిసారి. LATEST: #SouravGanguly on #Salmankhan Salman is Huge Name in Indian Cinema And famous in other countries also Legendary Megastar@BeingSalmanKhan | #Tiger3 pic.twitter.com/LROpHCWN1Q — FIGHTя (@SalmanzFighter_) December 5, 2023 ఇన్నేళ్లుగా మిమ్మల్ని ఒక్కసారి కూడా ప్రతక్ష్యంగా కలుసుకోలేకపోయాను. ఒకరకంగా చెప్పాలంటే నిజంగా ఇది దురదృష్టకరమే. అయితే, ఇప్పుడు ఆ లోటు తీరింది’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ స్టార్లతో పాటు సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా బెంగాల్ తరఫున టీమిండియాకు ఆడిన సౌరవ్ గంగూలీ దూకుడైన కెప్టెన్గా పేరొందిన విషయం తెలిసిందే. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగానూ తన మార్కు చూపించాడీ బెంగాలీ బ్యాటర్. #WATCH | Kolkata: West Bengal CM Mamata Banerjee, Film Director Mahesh Bhatt, former Indian cricketer Sourav Ganguly, actors Salman Khan, Anil Kapoor and Sonakshi Sinha shake a leg at the Kolkata International Film Festival (KIFF). (Source: KIFF Social Media) pic.twitter.com/EHOKtK9g3B — ANI (@ANI) December 5, 2023 చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! Latest - Former president of BCCI #Souravganguly about Megastar #Salmankhan. ' Our very favourite my favourite, Salman Khan welcome to Kolkata, we have never met before. But I'm his huge fan ' 🙌❤️pic.twitter.com/12FENf5TTa — YOGESH (@i_yogesh22bakup) December 5, 2023 -
కోహ్లి కెప్టెన్సీ ఎపిసోడ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గంగూలీ
విరాట్ కోహ్లి కెప్టెన్సీ ఎడిసోడ్పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని తాను కెప్టెన్సీ నుంచి తప్పించలేదని దాదా మరోసారి వివరణ ఇచ్చాడు. కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్ మొత్తం నుంచి తప్పుకోవాలని మాత్రమే తాను సూచించానని పేర్కొన్నాడు. అది కూడా కోహ్లి మంచికోసమే తాను చెప్పానని తెలిపాడు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ గంగూ భాయ్ ఈ వివరణ ఇచ్చాడు. కాగా, 2021లో అనూహ్య పరిణామాల నడుమ విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తొలుత పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న రన్ మెషీన్ ఆతర్వాత కెప్టెన్సీ నుంచి పూర్తిగా వైదొలిగాడు. తనను సంప్రదించకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని అప్పట్లో కోహ్లి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంలో నాటి బీసీసీఐ బాస్ గంగూలీ కీలకపాత్ర పోషించాడని కోహ్లి పరోక్షంగా వ్యాఖ్యానించాడు. వన్డే సారధ్య బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు తనకు ఫోన్ ద్వారా మాత్రమే సమాచారం ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తదనంతరం కూడా ఈ విషయంపై కోహ్లి-గంగూలీ మధ్య పరోక్ష యుద్దం జరిగింది. వీరిద్దరూ ఒకరికొరకు ఎదురుపడినప్పుడు కూడా పలకరించుకునేవారు కాదు. ఐపీఎల్ 2023 సందర్భంగా వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కోహ్లి కెప్టెన్సీ నుంచి దిగిపోయాక తదనంతర పరిణామాల్లో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్గా ఎంపికయ్యాడు. అతని సారథ్యంలోనే టీమిండియా ఇటీవల వన్డే ప్రపంచకప్ ఆడింది. ఈ మెగా టోర్నీలో భారత్ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అప్పటివరకు అజేయ జట్టుగా ఉన్న టీమిండియా ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలై మూడోసారి ప్రపంచకప్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. -
అప్పటిదాకా అతడే టీమిండియా కెప్టెన్గా ఉండాలి: గంగూలీ
Sourav Ganguly Comments: మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మనే ఉండాలని మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ముగిసేంత వరకు హిట్మ్యాన్ను కొనసాగిస్తేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలరని అభిప్రాయపడ్డాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరం కానున్నాడనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఈనెలలో మొదలుకానున్న సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా రోహిత్.. పొట్టి సిరీస్కు అందుబాటులో ఉండటం లేదు. వన్డేలకు కూడా దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాల్సి ఉండగా.. అతడు ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో జట్టును ముందుండి నడిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్నే సఫారీలతోనూ కెప్టెన్గా కొనసాగించనున్నారు. ఇక వన్డే కెప్టెన్సీని కేఎల్ రాహుల్కు అప్పగించారు. అయితే, టెస్టు సిరీస్లో మాత్రం రోహిత్ శర్మ జట్టుతో కలువనున్నాడు. ఈ పరిణామాలపై సౌరవ్ గంగూలీ స్పందిస్తూ మేనేజ్మెంట్కు కీలక సూచనలు చేశాడు. ‘‘చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవడం సమస్యగా పరిణమించింది. సూర్య టీ20 కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయితే, వన్డేల్లో అతడి స్థానం విషయంలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కాబట్టి 50 ఓవర్ల క్రికెట్కు మరో కెప్టెన్ అంటే ఈసారి కేఎల్ రాహుల్ వస్తున్నాడు. ఇక రోహిత్ టెస్టులు ఆడాలనుకుంటున్నాడు కాబట్టి తనే సారథిగా ఉంటాడు. నిజానికి.. రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో ఆడాలి. వన్డే వరల్డ్కప్లో అతడి సారథ్యంలో టీమిండియా అద్భుతంగా ఆడింది. అతడు గొప్ప నాయకుడు. టీ20 వరల్డ్కప్-2024 ముగిసేంత వరకు అతడు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్గా ఉండాలి’’ అని సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కాగా సౌతాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్కు రోహిత్తో పాటు విరాట్ కోహ్లి కూడా దూరంగా ఉండనున్నాడు. చదవండి: రాహుల్కు వన్డే పగ్గాలు.. రుతురాజ్కు లక్కీఛాన్స్ -
అదంతా చూస్తూ జడేజా కచ్చితంగా ఏడ్చే ఉంటాడు: గంగూలీ
ICC WC 2023: వన్డే ప్రపంచకప-2023లో అఫ్గనిస్తాన్ మునుపెన్నడూ లేని విధంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్కు కూడా సాధ్యం కాని రీతిలో సెమీస్ రేసులో నిలిచి మేటి జట్లకు సవాల్ విసిరింది. స్పిన్ మాత్రమే అఫ్గన్ బలం అనుకున్న వాళ్లకు బ్యాటింగ్లోనూ తాము తక్కువేం కాదంటూ యువ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది నిరూపించారు. ఓపెనర్గా బరిలోకి దిగిన జద్రాన్ అఫ్గన్ తరఫున వరల్డ్కప్లో తొలి సెంచరీ బాదిన బ్యాటర్గానూ చరిత్ర సృష్టించాడు. లీగ్ దశలో ఆడిన మొత్తం తొమ్మిది మ్యాచ్లలో నాలుగింట జట్టును గెలిపించి హష్మతుల్లా సైతం సారథిగా తన ముద్ర వేయగలిగాడు. అయితే, అఫ్గన్ విజయాల వెనుక టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా పాత్ర కీలకం అన్న విషయం తెలిసిందే. మెంటార్గా జట్టుకు మార్గదర్శనం చేసి ఈస్థాయిలో నిలిపిన ఘనత అతడి దక్కుతుంది. ఇదిలా ఉంటే.. వరల్డ్కప్-2023లో మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంకలను మట్టికరిపించిన అఫ్గనిస్తాన్.. ఐదుసార్లు జగజ్జేత అయిన ఆస్ట్రేలియాను కూడా ఓడించేలా కనిపించింది. ఆస్ట్రేలియాపై అద్భుతంగా బ్యాటింగ్ చేసి ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా 291 పరుగులు సాధించిన హష్మతుల్లా బృందం.. ఆరంభంలోనే వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. ఈ క్రమంలో అజయ్ జడేజాతో పాటు అఫ్గనిస్తాన్ శిబిరం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ డ్రెస్సింగ్రూంలో కదలికల వల్ల సైట్స్క్రీన్ డిస్టర్బెన్స్గా ఉందంటూ ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ కంప్లైంట్ చేశాడు. దీంతో అతడిని కవ్వించేలా జడేజా డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. మాక్సీ వచ్చాక సీన్ రివర్స్ కానీ గ్లెన్ మాక్స్వెల్ రాకతో సీన్ మారిపోయింది. అప్పటిదాకా అఫ్గనిస్తాన్ చేతిలో ఉందనుకున్న మ్యాచ్ చేజారిపోయింది. మిస్ఫీల్డ్, క్యాచ్డ్రాప్ల మూలంగా మాక్సీకి లైఫ్ దొరకగా.. అతడు ఏకండా అజేయ ద్విశతకం బాదాడు. అఫ్గన్ బౌలింగ్ను చిత్తు చేస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టుకు అనూహ్య రీతిలో విజయం అందించి సెమీస్ చేర్చాడు. జడేజా ఏడ్చే ఉంటాడు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మాక్స్వెల్ క్రీజులో పాతుకుపోయినపుడు అఫ్గనిస్తాన్ బౌలర్లు ఎక్కువగా స్ట్రెయిట్ బౌలింగే చేశారు. అప్పటికే అతడు గాయపడ్డాడు అయినా కూడా పరుగులు రాబట్టేందుకు అవకాశం ఇచ్చారు. ఇదంతా చూస్తూ అజయ్ జడేజా కచ్చితంగా ఏడ్చే ఉంటాడు. మాక్సీ నిలబడి ఉన్నచోటే బౌండరీలు, సిక్సర్లు బాదాడు. అసలు మాక్స్వెల్ను అవుట్ చేయాలని ఏమాత్రం ప్రయత్నం చేసినట్లుగా అనిపించలేదు. ఏదేమైనా వన్డేల్లో ఇది అత్యంత గొప్ప ఇన్నింగ్స్గా మిగిలిపోతుంది’’ అని కోల్కతా టీవీతో ముచ్చటిస్తూ గంగూలీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. చదవండి: పాక్కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయి.. ఆ ముగ్గురు కీలకం: బాబర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
కోహ్లి కెప్టెన్సీ వదిలేసిన తర్వాత రోహిత్తో నేను చెప్పిందిదే: గంగూలీ
Rohit Sharma- ViratKohli- Team India Captaincy: వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఎనిమిది మ్యాచ్లలో అజేయంగా ఉండి సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. టైటిల్ దిశగా ఒక్కో అడుగు వేస్తూ సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడాలనే లక్ష్యంతో ఉంది. ఇక ఈ ఐసీసీ టోర్నీ కంటే ముందు రోహిత్ సేన ఆసియా వన్డే కప్-2023 నెగ్గిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఓపెనర్ రోహిత్ శర్మ గెలిచిన తొలి టైటిల్ ఇది. దీంతో.. ద్వైపాక్షిక సిరీస్లలో మాత్రమే గెలుస్తాడంటూ అప్పటి వరకు రోహిత్ను విమర్శించిన వాళ్లకు గట్టిగా బదులిచ్చినట్లయింది. ఈ క్రమంలో స్వదేశంలో ప్రపంచప్లో టీమిండియా జైత్రయాత్ర సాగిస్తున్న తీరు, రోహిత్ కెప్టెన్సీపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించడం విశేషం. కోహ్లి కెప్టెన్సీ వదిలేసిన తర్వాత నేనే.. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. రోహిత్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మేరకు... ‘‘విరాట్ తర్వాత మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ చేపట్టేందుకు రోహిత్ శర్మ సిద్ధంగా లేడు. ఈ విషయం గురించి ఎన్నోసార్లు తనతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నేను మరింత చొరవ తీసుకోవాల్సి వచ్చింది. ‘‘నువ్వు సరే అంటావా? లేదంటే నాకు నేనుగా దీని గురించి ప్రకటన చేయాలా? అప్పుడు నువ్వు అవునన్నా కాదన్నా బాధ్యతలు చేపట్టక తప్పదు’’ అని తనతో కాస్త గట్టిగానే మాట్లాడాను. ఇదంతా నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు ఎందుకంటే తను జట్టును విజయవంతంగా ముందుకు నడపగల సమర్థుడని నాకు తెలుసు. నిజానికి విరాట్ కోహ్లి కెప్టెన్సీ వదిలేసిన తర్వాత టీమిండియాను నడిపించే అత్యుత్తమ వ్యక్తి అతడే అని అందరూ నమ్మారు. అందుకే ఇప్పుడు జరుగుతున్నదంతా నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు’’ అంటూ రోహిత్పై ప్రశంసలు కురిపించాడు. కోల్కతా టీవీతో సంభాషిస్తూ గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా టీ20 వరల్డ్కప్-2021 తర్వాత విరాట్ కోహ్లి టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత అనూహ్య రీతిలో వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటన(2022, జనవరి)లో ఉండగానే తాను టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి వైదులుగుతున్నట్లు ప్రకటించి కోహ్లి షాకిచ్చాడు. దీంతో రోహిత్ శర్మ కేవలం పరిమిత ఓవర్ల కెప్టెన్గానే కాకుండా టెస్టు జట్టుకు కూడా సారథి అయ్యాడు. అయితే, కోహ్లి మాదిరే రోహిత్ కూడా వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ గెలవడంలో విఫలమయ్యాడు. ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా తదుపరి నెదర్లాండ్స్తో మ్యాచ్ ఆడనుంది. దీంతో లీగ్ దశను ముగిస్తుంది. చదవండి: బాగా ఎంజాయ్ చేశారనుకుంటా.. బై బై! మీ స్థాయికి తగునా భయ్యా? View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
అది క్రీడా స్పూర్తి అంటే.. గ్రేమ్ స్మిత్ కూడా షకీబ్లా ఆలోచించి ఉంటే..!
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ ఓ ఆటగాడు టైమ్ ఔట్ కావడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించి మాథ్యూస్ను ఔట్గా ప్రకటించాలని అంపైర్పై ఒత్తిడి తీసుకురావడాన్ని యావత్ క్రీడా ప్రపంచం వ్యతిరేస్తుంది. ఈ విషయంలో షకీబ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఆ సందర్భంలో ప్రత్యర్ధి కెప్టెన్ క్రీడాస్పూర్తిని చాటుకుని, బ్యాటర్ టైమ్ ఔట్ కాకుండా కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. 2007 జనవరి 5న భారత్-సౌతాఫ్రికా మధ్య కేప్టౌన్లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో టీమిండియా ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆరు నిమిషాలు ఆలస్యంగా క్రీజ్లోకి వచ్చాడు. అయితే, ప్రత్యర్థి జట్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్ టైమ్ ఔట్ నిబంధనను అమలు చేయకూడదని అంపైర్ను కోరి క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) టైమ్ ఔట్ విషయంలో బ్యాటర్ ఆలస్యానికి సరైన కారణాలు ఉన్నాయని విశ్వసిస్తే, టైమ్ ఔట్ నిబంధనను విస్మరించమని అంపైర్ను అభ్యర్థించే విచక్షణ ప్రత్యర్థి కెప్టెన్ ఉంటుంది. ఆ సందర్భంలో గ్రేమ్ స్మిత్ తన విచక్షణను ఉపయోగించి, క్రీడాస్పూర్తిని చాటుతూ గంగూలీ ఔట్ కాకుండా సాయపడ్డాడు. నాడు గ్రేమ్ స్మిత్ చేసిన పనికి క్రికెట్ ప్రపంచం జేజేలు కొట్టింది. అయితే నిన్నటి మ్యాచ్లో షకీబ్.. అందుకు భిన్నంగా వ్యవహరించి జనాల చీత్కారాలకు గురవుతున్నాడు. ఒకవేళ ఆ రోజు గ్రేమ్ స్మిత్ కూడా షకీబ్లాగే పట్టుబట్టి గంగూలీని టైమ్ ఔట్గా ప్రకటించాలని అంపైర్పై ఒత్తిడి తెచ్చి ఉంటే, అంతర్జాతీయ క్రికెట్లో టైమ్ ఔట్ అయిన తొలి ఆటగాడిగా గంగూలీ రికార్డుల్లోకి ఎక్కి ఉండేవాడు. On January 5, 2007, Indian cricketer Sourav Ganguly nearly made history by being the first player to be declared 'timed out' in international cricket. He took six minutes to reach the batting crease. However, Graeme Smith, the opposing team's captain, chose not to enforce this… pic.twitter.com/JMhhs5Yaa5 — Anjula Hettige (@AnjulaHettige) November 6, 2023 నిన్నటి మ్యాచ్లో ఏం జరిగిందంటే..? శ్రీలంక ఇన్నింగ్స్ 24 ఓవర్ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో రెండో బంతికి సమరవిక్రమ ఔటయ్యాడు. వెంటనే ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ సరైన హెల్మెట్ను తీసుకురాలేదు. క్రీజులో గార్డ్ తీసుకోనే సమయంలో తన హెల్మెట్ బాగో లేదని మాథ్యూస్ గమనించాడు. దీంతో వెంటనే డ్రెస్సింగ్ రూమ్వైపు కొత్త హెల్మెట్ కోసం సైగలు చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) వెంటనే సబ్స్ట్యూట్ కరుణరత్నే పరిగెత్తుకుంటూ వచ్చి హెల్మెట్ను తీసుకువచ్చాడు. అయితే ఇదంతా జరగడానికి మూడు నిమషాల పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్ధి బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టైమ్ ఔట్కు అప్పీలు చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు చర్చించుకుని మాథ్యూస్ను ఔట్గా ప్రకటించారు. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రస్తుత ప్రపంచకప్లో ఇదివరకే ఎలిమినేట్ అయిన బంగ్లాదేశ్కు ఇది కంటితుడుపు విజయం. ఈ మ్యాచ్లో ఓటమితో శ్రీలంక కూడా బంగ్లాదేశ్లా సెమీస్కు చేరకుండానే ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుత వరల్డ్కప్ ఎడిషన్లో బంగ్లాదేశ్, శ్రీలంకలతో పాటు ఇంగ్లండ్ కూడా ఇదివరకే ఎలిమినేట్ కాగా.. భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్కు చేరుకున్నాయి. సెమీస్ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం పోటీ నడుస్తుంది. చదవండి: మాథ్యూస్ టైమ్ ఔట్.. అలా జరిగినందుకు బాధ లేదు.. రూల్స్లో ఉన్నదే చేశా: షకీబ్ -
న్యూజిలాండ్తో మ్యాచ్.. సౌరవ్ గంగూలీ రికార్డుపై కన్నేసిన జో రూట్
వన్డే ప్రపంచకప్-2023కు సర్వం సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా మరో కొన్ని గంటల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానంది. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం కానుంది. కాగా కివీస్తో తొలి మ్యాచ్కు ముందు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో రూట్ మరో 20 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 15వ ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఇప్పటివరకు 428 ఇన్నింగ్స్లు ఆడిన రూట్.. 18555 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అధిగమిస్తాడు. గంగూలీ తన అంతర్జాతీయ కెరీర్లో 18575 పరుగులు సాధించాడు. అదేవిధంగా ఈ వరల్డ్కప్ టోర్నీలో 445 పరుగులు చేస్తే 19000 పరుగుల మైలు రాయిని అందుకుంటాడు. రూట్ తన వన్డే కెరీర్లో 6246 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఐసీసీ వన్డే వరల్డ్కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఇంగ్లండ్ క్రికెటర్గా రూట్(758 పరుగులు) కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ తుది జట్టు(అంచనా): జానీ బెయిర్స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, లివింగ్స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ చదవండి: గంభీర్ ఓ యోధుడు.. చాలా మంది అపార్ధం చేసుకున్నారు: అశ్విన్ -
గంగూలీ కీలక వ్యాఖ్యలు.. కోహ్లినే కరెక్ట్ అన్న ఏబీడీ! ఇష్టం ఉన్నా లేకపోయినా..
Asia Cup 2023: మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానం విషయంలో టీమిండియాలో అనిశ్చితి నెలకొన్న మాట వాస్తవమేనని కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే అంగీకరించాడు. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ రిటరైన తర్వాత ఎవరూ కూడా అక్కడ నిలదొక్కుకోలేకపోయారని వ్యాఖ్యానించాడు. దీంతో చాలా కాలంగా నంబర్ 4 సమస్య భారత జట్టును వెంటాడుతోందని హిట్మ్యాన్ చెప్పుకొచ్చాడు. వాళ్లిద్దరు దూరంగా ఉన్న కారణంగా కాగా గత కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో రాణిస్తున్నప్పటికీ ఆరేడు నెలలుగా గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. ఇక కేఎల్ రాహుల్దీ ఇలాంటి పరిస్థితే. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో మిడిలార్డర్ స్టార్లు ఇద్దరూ ఇలా ఆటకు దూరంగా ఉండటం మేనేజ్మెంట్కు కలవరపాటుకు గురిచేస్తోంది. గంగూలీ, రవిశాస్త్రి వ్యాఖ్యలకు మద్దతుగా ఏబీడీ! ప్రాక్టీస్లో పర్వాలేదనిపిస్తున్నప్పటికీ అసలు సమయంలో ఎలా రాణిస్తారనేది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిల్లియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీల అభిప్రాయాన్ని సమర్థిస్తూ.. టీమిండియా మేనేజ్మెంట్కు కీలక సూచన చేశాడు. కోహ్లి కరెక్ట్.. ఇష్టం ఉన్నా లేకపోయినా ‘‘బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానానికి విరాట్ కోహ్లి.. సరిగ్గా సరిపోతాడు. మిడిలార్డర్లో ఇన్నింగ్స్ను చక్కదిద్దగల బాధ్యత తను తీసుకోగలడు. కోహ్లిని నంబర్ 4లో బ్యాటింగ్కు పంపాలన్న ఆలోచనను నేను నూటికి నూరు శాతం సమర్థిస్తా. కోహ్లికి ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడం ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు గానీ.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కొన్నిసార్లు తప్పక బాధ్యతలు భుజాన వేసుకోవాల్సి ఉంటుంది. అంతిమంగా జట్టు సమతూకంగా.. పటిష్టంగా ఉండటమే ముఖ్యం కదా’’ అని ఏబీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఆసియా కప్-2023, ప్రపంచకప్-2023 టోర్నీల్లో వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లిని నాలుగో స్థానంలో పంపాలన్న రవిశాస్త్రి, గంగూలీ వ్యాఖ్యలకు ఈ మేరకు వత్తాసు పలికాడు. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా వన్డే కప్ ఆరంభం కానుండగా.. సెప్టెంబరు 2న భారత్ పాకిస్తాన్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. నంబర్ 4లో కోహ్లి రికార్డు ఇలా.. వన్డేల్లో కోహ్లి ఇప్పటి వరకు 42 మ్యాచ్లలో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. సగటున 55.21 పరుగులతో 1767 రన్స్ సాధించాడు. ఇందులో ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో నంబర్ 4లో స్థిరంగా బ్యాటింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ 20 మ్యాచ్లలో 805 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు ఫిఫ్టీలు ఉన్నాయి. చదవండి: Asia Cup: కోహ్లి కాదు.. యో- యో టెస్టులో అతడే టాప్! స్కోరెంతంటే? -
WC 2023: మొన్న అలా.. ఇప్పుడిలా! మాట మార్చిన దాదా.. పాపం
World Cup 2023- Sourav Ganguly Picks His Squad: వన్డే వరల్డ్కప్-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన జట్టును ప్రకటించాడు. ఈ ఐసీసీ ఈవెంట్కు తన అభిప్రాయాలకు అనుగుణంగా 15 మంది సభ్యులతో కూడిన టీమ్ను ఎంపిక చేసుకున్నాడు. ఆసియా వన్డే టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో రెండు మార్పులతో దాదా ముందుకు వచ్చాడు. ఇద్దరు యువ ఆటగాళ్లను మినహాయించి మిగతా అంతా సేమ్ టూ సేమ్ అనేలా తన టీమ్ను సెలక్ట్ చేసుకున్నాడు. అయితే, గత కొంతకాలంగా తను బలంగా వినిపిస్తున్న పేరును మాత్రం గంగూలీ విస్మరించడం గమనార్హం. అందుకే చహల్పై వేటు! టీమిండియా పరిమిత ఓవర్ల మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్కు ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. కుల్దీప్ యాదవే తమ మొదటి ప్రాధాన్యం అని, ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లకు చోటు లేనందునే యుజీని పక్కనపెట్టామని జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. దీంతో అనుభవజ్ఞుడైన చహల్ను పక్కనపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. గతంలో గంగూలీ మాట్లాడుతూ చహల్తో పాటు యువ సంచలనం యశస్వి జైశ్వాల్లను తప్పక ఐసీసీ ఈవెంట్లో ఆడించాలని అభిప్రాయపడ్డాడు. తిలక్ వర్మకు నో ఛాన్స్ కానీ, తాజాగా తను ప్రకటించిన ప్రపంచకప్ జట్టులో మాత్రం ఈ ఇద్దరికీ చోటు ఇవ్వలేదు. ముఖ్యంగా చహల్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ అతడికి స్థానమివ్వాలన్న దాదా ఇప్పుడిలా తనను పక్కనపెట్టాడు. ఇక ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్న సంచలన ఆటగాడు, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మతో పాటు కర్ణాటక యువ పేసర్ ప్రసిద్ కృష్ణను కూడా దాదా తప్పించాడు. అయితే, మిడిలార్డర్ బ్యాటర్ గాయపడితే తిలక్ వర్మ, పేసర్ ఎవరైనా గాయం కారణంగా దూరమైతే ప్రసిద్, స్పిన్నర్ గాయపడితే చహల్లను తీసుకోవాలని.. వాళ్లను ఇంజూరీ రిజర్వ్లుగా పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 ఆరంభం కానుంది. వన్డే వరల్డ్కప్-2023కి సౌరవ్ గంగూలీ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. చదవండి: WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్ Asia Cup: షెడ్యూల్, జట్లు, ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే -
అంతా వాళ్ల మీదే ఆధారపడి ఉంది.. అలా అయితేనే ట్రోఫీ గెలుస్తాం: గంగూలీ
ICC ODI World Cup 2023: పుష్కర కాలం తర్వాత టీమిండియా సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్ ఆడనుంది. అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా మొదలుకానున్న ఐసీసీ ఈవెంట్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్తో తమ ప్రయాణం ఆరంభించనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా అక్టోబరు 8న తమ తొలి మ్యాచ్లో ఆసీస్తో తలపడనుంది. ఇక స్వదేశంలో మెగా టోర్నీ జరుగనున్న తరుణంలో రోహిత్ సేన హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుందనడంలో సందేహం లేదు. 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేస్తూ.. ఈసారి కూడా భారత్ ట్రోఫీని ముద్దాడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ప్రధాన బలం అదే భారత జట్టుకు ప్రధాన బలం బ్యాటింగ్ అని.. బ్యాటర్లు రాణిస్తేనే భారత్ టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఆసియా కప్ ఫలితంతో ప్రపంచకప్ ఈవెంట్కు సంబంధం ఉండదని దాదా పేర్కొన్నాడు. ‘‘ఆసియా కప్.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో వన్డే సిరీస్... వరల్డ్కప్.. దేనికదే ప్రత్యేకం. ఒకదానితో మరొకదానికి సంబంధం లేదు. ప్రతి టోర్నమెంట్లోనూ ఆడే విధానం భిన్నంగా ఉంటుంది. భారత్ పటిష్ట జట్టు. ఒకవేళ మన బ్యాటర్లు రాణిస్తే కచ్చితంగా వరల్డ్కప్ ట్రోఫీ గెలుస్తాం. కాబట్టి మొత్తమంతా మన బ్యాటర్లు ఎలా ఆడుతారన్న అంశం మీదే ఆధారపడి ఉంది’’ అని గంగూలీ అభిప్రాయపడ్డాడు. పాక్ బౌలింగ్ దళం పటిష్టం ఇక పాకిస్తాన్ జట్టు సైతం మెరుగ్గా ఉందన్న దాదా.. ‘‘పాక్ బౌలింగ్ దళం పటిష్టంగా ఉంది. నసీం షా, షాహిన్ ఆఫ్రిది, హారిస్ రవూఫ్ రాణిస్తున్నారు. మొత్తానికి పాక్ టీమ్ సమతూకంగా కనిపిస్తోంది. అయితే, టీమిండియాతో పోటీ ఎలా ఉంటుందనేది చెప్పలేం. మ్యాచ్ రోజు ఎవరు బాగా ఆడతారో విజయం వాళ్లనే వరిస్తుంది. అందులో రాకెట్ సైన్స్ ఏమీ లేదు’’ అని దాయాదుల పోరులో ఫేవరెట్ జట్టు ఏదీ లేదని చెప్పకనే చెప్పాడు. కాగా అక్టోబరు 14న పాక్తో అహ్మదాబాద్ వేదికగా రోహిత్ సేన మ్యాచ్ ఆడనుంది. ఇక వరల్డ్కప్ కంటే ముందు ఆసియా కప్లో సెప్టెంబరు 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొట్టనుంది. చదవండి: WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్ Asia Cup: షెడ్యూల్, జట్లు, ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే -
కోహ్లిపై షోయబ్ అక్తర్ వ్యాఖ్యలు.. కొట్టిపారేసిన గంగూలీ! ఏమన్నాడంటే?
Sourav Ganguly disagreed with Shoaib Akhtar’s suggestion: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కెరీర్ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలను భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ కొట్టిపారేశాడు. కోహ్లి తనకు నచ్చినన్ని రోజులు నచ్చిన తీరుగా ఆడతాడని వ్యాఖ్యానించాడు. కాగా ఆగష్టు 18, 2008లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లి.. అంతర్జాతీయ క్రికెట్లో శుక్రవారం నాటితో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. వరల్డ్కప్ తర్వాత గుడ్బై చెబితే! ఈ సందర్భంగా రన్మెషీన్పై ప్రశంసల వర్షం కురిపించిన షోయబ్ అక్తర్.. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్కు కోహ్లి వీడ్కోలు పలికితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సెంచరీ సెంచరీల రికార్డు బద్దలు కొట్టాలంటే విరాట్ ఇకపై పూర్తిగా టెస్టు క్రికెట్పైనే దృష్టి సారించాలని సూచించాడు. ఈ మేరకు.. ‘‘ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత కోహ్లి 50- ఓవర్ల క్రికెట్ ఎక్కువగా ఆడకపోతేనే మంచిది. టీ20ల విషయంలోనూ ఆలోచించాలి. కనీసం ఇంకా ఆరేళ్లపాటు కోహ్లి క్రికెట్ ఆడాలి. అప్పుడే సచిన్ టెండుల్కర్ రికార్డు బ్రేక్ చేయగలడు. అక్తర్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన దాదా వరల్డ్కప్ తర్వాత అతడు పూర్తిగా టెస్టు క్రికెట్పై దృష్టి సారించాలి’’ అని రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ రెవ్స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు. అయితే, అక్తర్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా గంగూలీని కోరగా.. ‘‘ఎందుకు? విరాట్ కోహ్లి తనకు ఎన్నాళ్లు ఆడాలనిపిస్తే అన్నాళ్లు ఆడతాడు. నాడు వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి అది కూడా తనకిష్టమైన ఫార్మాట్లో ఆడతాడు. ఎందుకంటే ఇప్పటికీ తను మంచి ప్రదర్శనలు ఇస్తున్నాడు’’ అని బదులిచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత కోహ్లి పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్బై చెప్పగా.. నాడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ప్రోద్బలంతోనే వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించినట్లు వార్తలు వచ్చాయి. కోహ్లిని అడిగిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని గంగూలీ చెప్పగా.. అసలు తనను ఎవరూ సంప్రదించలేదని ప్రెస్మీట్ పెట్టి మరీ కోహ్లి దాదా వ్యాఖ్యలను ఖండించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా.. గంగూలీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: ఐర్లాండ్తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్ -
దూకుడు నేర్పిన దాదా.. భారత క్రికెట్కు స్వర్ణయుగం.. అగ్రశ్రేణి జట్లకు వణుకు
సౌరవ్ చండీదాస్ గంగూలీ.. ఈ పేరు తెలియని భారత క్రికెట్ అభిమాని ఉండడు. ఇతన్ని అందరూ ముద్దుగా దాదా (బెంగాలీలో అన్న అని అర్ధం) అని పిలుచుకుంటారు. 90వ దశకంలో (1992) అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగపెట్టి, దాదాపు 16 ఏళ్ల పాటు (2008) దిగ్విజయంగా కెరీర్ను కొనసాగించిన ఈ కోల్కతా ప్రిన్స్.. అత్యుత్తమ బ్యాటర్గా, ఆల్రౌండర్గా, అత్యుత్తమ కెప్టెన్గా నీరాజనాలు అందుకున్నాడు. 1992లో విండీస్తో వన్డేతో ఇంటర్నేషనల్ కెరీర్ ప్రారంభించిన దాదా.. ఆ మ్యాచ్లో విఫలం కావడంతో దాదాపు నాలుగేళ్ల పాటు భారత జట్టుకు ఆడలేకపోయాడు. అనంతరం 1996 ఇంగ్లండ్ పర్యటనలో రెండో టెస్ట్తో టెస్ట్ అరంగేట్రం చేసిన గంగూలీ.. తానాడిన తొలి రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి, సెన్సేషన్గా మారాడు. అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోని గంగూలీ భారత క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్గా కొనసాగాడు. టీమిండియాలో ఓ పక్క సచిన్ హవా నడుస్తున్నా, బ్యాటర్గా గంగూలీ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను ఏర్పరచుకున్నాడు. దూకుడే మంత్రంగా గంగూలీ తన బ్యాటింగ్ను కొనసాగించాడు. అప్పటివరకు గంగూలీలా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన భారత బ్యాటర్లు లేరు. 1997లో శ్రీలంకపై తొలి వన్డే శతకాన్ని బాదిన దాదా.. ఆ తర్వాతి కాలంలో వన్డే క్రికెట్లో దాదాగిరి కొనసాగించాడు. 1998లో పాక్తో జరిగిన సహారా కప్లో 5 మ్యాచ్ల్లో 4 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న గంగూలీ, ఆ సిరీస్తో తనలోని బౌలర్ను ప్రపంచానికి పరిచయం చేశాడు. 1999 వరల్డ్కప్లో గంగూలీ బ్యాటింగ్ శిఖరాగ్ర స్థాయికి చేరింది. ఆ మెగా టోర్నీలో అతను ఎన్నో రికార్డులను సాధించాడు. ప్రపంచ క్రికెట్పై మొదలైన దాదాగిరి.. అనూహ్య పరిణామాల మధ్య 2000 సంవత్సరంలో భారత జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన గంగూలీ.. కెప్టెన్గా తన కెరీర్ను ఘనంగా ప్రారంభించాడు. ఆట పరంగా, వ్యక్తిగతంగా దూకుడు స్వభావి అయిన గంగూలీ అదే మంత్రాను కెప్టెన్గానూ కొనసాగించాడు. అదే దూకుడును భారత జట్టుకు కూడా నేర్పించాడు. అప్పట్లో ఆటతో పాటు మాటకు కూడా పని చెప్పే ఆస్ట్రేలియన్లతో సై అంటే సై అన్నాడు. అప్పటిదాకా నిదానంగా ఉండిన టీమిండియా ఆటగాళ్లలో ధైర్యాన్ని నూరిపోశాడు. గంగూలీ నేతృత్వంలో భారత జట్టు డిఫెన్సివ్ మోడ్ నుంచి అటాకింగ్ మోడ్కు గేర్ మార్చింది. దీని ఫలితంగా టీమిండియా ఎన్నో అపురూప విజయాలు సాధించింది. ఆ సమయంలో భారత జట్టు తిరుగులేని జట్టుగా చలామణి అయ్యింది. ప్రపంచ క్రికెట్లోని అగ్రశ్రేణి జట్లన్నీ టీమిండియా దెబ్బకు గడగడలాడాయి. భారత క్రికెట్కు అది స్వర్ణయుగంగా చెప్పవచ్చు. మహేంద్రసింగ్ ధోని, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి ఆటగాళ్లు దాదా హయాంలో వెలుగులోకి వచ్చారు. ఓరకంగా చెప్పాలంటే వారు దాదా అండర్లోనే రాటుదేలారు. ఆతర్వాత ప్రపంచ స్థాయి క్రికెటర్లుగా పేరొందారు. ఈ క్రమంలోనే దాదా సారధ్యంలో భారత్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. అప్పటివరకు విదేశాల్లో అడపాదడపా విజయాలు సాధించిన టీమిండియా గంగూలీ నేతృత్వంలో ఆసీస్ లాంటి జట్టును వారి స్వదేశంలోనే ఓడించి చరిత్ర సృష్టించింది. అదే దాదాగిరితో 2002లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2003 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరింది. Making us believe in our abilities with pride & passion, he turned us into "Overseas Tigers". We've had many great leaders & will keep having them. But the foundation you built at the time of crisis will never ever be forgotten. HBD @SGanguly99 "Dada" ❤pic.twitter.com/WzN9yQGIob — North Stand Gang - Wankhede (@NorthStandGang) July 8, 2023 2002లో ఇంగ్లండ్లో జరిగిన నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలిచాక గంగూలీ షర్ట్ విప్పి చేసుకున్న సంబురాలు భారత క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు. ఆటగాడిగా, కెప్టెన్గా అత్యన్నత శిఖరాలు అధిరోహించిన గంగూలీ.. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అత్యుత్తమ కెప్టెన్లలో ప్రథముడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచ క్రికెట్పై దాదాగిరి చేసిన గంగూలీ భారత క్రికెట్ రూపురేఖలను మార్చాడని వేనోళ్ల కీర్తించబడ్డాడు. గంగూలీ నేతృత్వంలో భారత జట్టు అత్యుతన్న శిఖరాలను అధిరోహించిందని, కెప్టెన్గా గంగూలీ జమానా భారత క్రికెట్కు స్వర్ణయుగం లాంటిదని విశ్లేషకులు సైతం అభివర్ణిస్తారు. -
ఆరోజు గంగూలీతో నేను చెప్పాను.. కానీ ధోని విషయంలో అలా: మాజీ సెలక్టర్
Ex-Selector Comments On MS Dhoni: ‘‘ఎంఎస్ ధోని.. రంజీ ట్రోఫీ సెకండ్ సీజన్లో ఆడుతున్నపుడు తనను తొలిసారి కలిశాను. అప్పుడు అతడు బిహార్ జట్టుకు ఆడుతూ ఉండేవాడు. బ్యాటింగ్ చేయడంతో పాటు కీపర్గానూ వ్యవహరించేవాడు. స్పిన్నర్ అయినా పేసర్ అయినా దూకుడుగానే బ్యాటింగ్ చేసేవాడు. కానీ.. వికెట్ కీపర్గా తన ఫుట్వర్క్ విషయంలో మెరుగుపడాల్సి ఉందనుకున్నాను. అదే విషయాన్ని అతడితో చర్చించాను. నాడు నేర్చుకున్న పాఠాలను నేటికీ ధోని పాటిస్తున్నాడు. ధోని కెరీర్లో అదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు’’ అని టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం అన్నాడు. కెరీర్ తొలినాళ్లలో వికెట్ కీపింగ్ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డ ధోని.. ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి కీపర్లలో ఒకడిగా ఎదిగాడని పేర్కొన్నాడు. భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి జియో సినిమా షోలో పలు ఆసక్తికర విషయాలను మాజీ వికెట్ కీపర్ సబా కరీం పంచుకున్నాడు. ‘‘కెన్యాలో ఇండియా-ఏ, పాకిస్తాన్-ఏ, కెన్యా- ఏ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్ ధోని కెరీర్లో రెండో టర్నింగ్ పాయింట్. దినేశ్ కార్తిక్ జాతీయ జట్టుకు ఆడుతున్న క్రమంలో ధోనికి ఈ సిరీస్ ఆడే అవకాశం వచ్చింది. అక్కడ తను వికెట్ కీపర్గా సేవలు అందించాడు. ఇక బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! అత్యద్భుతంగా బ్యాటింగ్ చేసి మా నమ్మకాన్ని నిలబెట్టాడు’’ అని సబా కరీం.. ధోనిపై ప్రశంసలు కురిపించాడు. నేను గంగూలీకి చెప్పాను.. కానీ.. ఇక 2004లో ధోని పాకిస్తాన్ టూర్ మిస్సవడానికి గల కారణాన్ని కూడా సబా కరీం ఈ సందర్భంగా బయటపెట్టాడు. ‘‘కెన్యాలో అద్భుత ప్రదర్శన తర్వాత అతడి పేరు మారుమ్రోగిపోయింది. అప్పుడు నేను కలకత్తాలో ఉన్నాను. నాడు సౌరవ్ గంగూలీ కెప్టెన్గా ఉన్నాడు. ఒక వికెట్ కీపర్ ఉన్నాడు.. అతడు అద్భుత నైపుణ్యాలు కలిగి ఉన్నాడని గంగూలీతో చెప్పాను. జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని కూడా అన్నాను. కానీ దురదృష్టవశాత్తూ.. ఎందుకో సౌరవ్ అప్పుడు అప్కమింగ్ ఆటగాడిపై నమ్మకం ఉంచలేకపోయాడు. ధోనిని మేము అప్పుడు జాతీయ జట్టుకు సెలక్ట్ చేయలేదు. అయితే, ఆ తర్వాత వెంటనే టీమిండియాలోకి వచ్చాడు’’ అని సబా కరీం చెప్పుకొచ్చాడు. కాగా 2004లో బంగ్లాదేశ్ టూర్కు ఎంపికైన ధోని.. తొలి మ్యాచ్లో నిరాశపరిచినా అనతికాలంలోనే కెప్టెన్గా ఎదిగాడు. ఇక మిగిలిందంతా చరిత్రే!! చదవండి: వారణాసి అమ్మాయి.. వెస్టిండీస్ క్రికెటర్ భార్య! భోజ్పురీలో మాట్లాడగలదు.. ఇంకా!
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- 5% దిగువనే రిటైల్ ద్రవ్యోల్బణం
- చీరాలలో టీడీపీ, కాంగ్రెస్ బరితెగింపు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- Lok Sabha Election 2024: మహిళలకు ‘మహాలక్ష్మి’ గ్యారెంటీ: సోనియా
- నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
- పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
- వెచ్చని హృదయ రాగ సందేశం
- Lok Sabha Election 2024: రాయ్బరేలీ కోసం మేము.. అదానీ, అంబానీ కోసం మోదీ
Advertisement