-
అత్యంత ఖరీదైన టీకప్పు..ధర వింటే షాకవ్వుతారు!
ఎన్నో విలాసవంతమైన వస్తువులను చూసుంటాం. వాచ్ల దగ్గర నుంచి హ్యండ్ బ్యాగ్లు, వ్యాలెట్ వరకు అత్యంత ఖరీదు పలికిన బ్రాండ్లు చూశాం. ఓ సాధారణ టీ కప్పు అత్యంత ఖరీదైనదిగా ఉంటుందంటే నమ్ముతారా. మహా అయితే రూ. 30 వేల నుంచి రూ. లక్ష రూపాయాల విలవు చేసే ప్రత్యేకమైన మెటీరియల్తో చేసి ఉండొచ్చు. అంతేగానీ మరీ ఇంత రేంజ్లో ధర ఉండదు. అంత ఖరీదైన టీకప్పు ఎక్కడ ఉందంటే.. జపనీస్ డిపార్ట్మెంట్ స్టోర్ చైన్ తకాషిమయాలో అత్యంత ఖరీదైన టీ కప్పు ఉంది. దీని ధర ఏకంగా రూ. 56 లక్షలు. దీన్ని స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారంలో తయారు చేశారట. అమ్మకానికి వివిధ బంగారు వస్తువులను ప్రదర్శనగా ఉంచగా ఈ టీకప్పు దురదృష్టవశాత్తు అపహరణకు గురయ్యింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈ వస్తువుని జేబులో వేసుకుని పారిపోతున్నట్లు వీడియో ఫుటేజ్లో కనిపించింది. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. ఈ ప్రదర్శనలో దాదాపు వెయ్యికి పైగా టీవేర్ టేబుల్ వేర్ వంటి కళఖండాలు ఉన్నాయని, వాటిల్లో ఈ టీ కప్పు త్యంత ఖరీదైనదని అన్నారు తకాషిమయా స్టోర్ ప్రతినిధి. "తాము ఆ వస్తువులను అమ్మకానికి పారదర్శకమైన అన్లాక్ పెట్టేలో ఉంచామని, దీన్ని పసిగట్టిన కస్టమర్లు సులభంగా బయటకు తీసి ఉండొచ్చు. సీసీఫుటేజ్లో ఓ వ్యక్తి టీ కప్పుని తన బ్యాగ్లో వేసుకుని పారిపోతున్నట్లు మేము చూశాం. ప్రస్తుతం పోలీసులు సదరు వ్యక్తి కనిపెట్టే పనిలో ఉన్నారు. అయినప్పటకీ తమ స్టోర్ అమ్మకాల ప్రదర్శన నిరాటకంగా కొనసాగుతుందని, పైగా భద్రతను కూడా మరింత పటిష్టం చేస్తామని చెప్పారు." స్టోర్ ప్రతినిధులు. (చదవండి: చిచ్చర పిడుగు!..తొమ్మిదేళ్లకే ఏకంగా 75 కిలోలు..!) -
చీరలు కొన్న వాటిలానే ఉండాలంటే ఇలా చేయండి!
చీరలు వాడుతున్న కొద్దీ కొన్నప్పుడూ ఉన్నట్టు కనపించవు. కలర్ తగ్గిపోయి కట్టుకున్న నలిగిపోతున్నట్లు ఉంటుంది. కొత్త ఉన్నంత షైన్గా కనిపించదు. దీంతో ఈ షాపు మంచిది, అది మంచిది అంటూ షాపులు మార్చుతుంటాం. ఎన్ని చోట్లకు తిరిగి కొన్నా అదే తీరులో చీరలు ఉంటాయి. అలా కాకుండా చీరలు కొన్న ప్పుడే ఏ రేంజ్లో మెరుస్తూ కనిపిస్తున్నాయో అలానే ఉండాలంటే కొన్న చిట్కాలు పాటిస్తే చాలు ఎప్పటికీ కొన్న వాటిలానే ఉంటాయి. ఇక్కడ చీరలు మెయింటైయిన్ చేయడమపైనే ట్రిక్ అంతా దాగి ఉంది. ఆ ట్రిక్ ఏంటంటే.. ముందుగా చీరలను ఎలా పడితే అలా మడతలు పెట్టొద్దు. అలాగే మడత పెట్టి ఎక్కువ రోజులు ఉంచొద్దు. ఇలా చేస్తే రంగు మారుతుంది. పైగా చీన ముడతలు ముడతలుగా అయిపోతుంది. ముడతలు పడకుండ మధ్యలో ఒకసారి తీసి తిరిగి మడతపెట్టాలి. వాటిని వెలుతురు పడని ప్రదేశాల్లోనే పెట్టాలి. చీరను ఉతికేటప్పుడూ కూడా జాగ్రత్త పాటించాలి. చీరలు అన్నింటిని ఒకే విధంగా ఉతికితే త్వరగా పాడవుతాయి. వాషింగ్ మిషన్ లో చీరలన్నింటిని ఉతక్కూడదు. కొన్నింటిని మినహాయించాలి. ఎందుకంటే? కొన్ని వాషింగ్ మిషన్లో ఉంటే కలర్ దిగిపోయే అవకాశం చీర పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి చీరలను చేత్తో నానబెట్టకుండా ఉతుక్కోవడం మంచిది. ఇంకొన్ని చీరలను ఉతక్కుండా డ్రైక్లీనింగ్కు ఇవ్వాలి. అలాగే కొన్ని లైట్ వైట్ చీరలను కొనేటప్పుడే ఎలా ఉతకాలి ఏంటన్నది అడిగి తెలసుకోవాలి. అలాగే ఐరన్ చేయడం వల్ల చీరలకు మంచి లుక్ వస్తుంది కాబట్టి ఐరన్ తప్పనిసరి. ఎక్కువ వేడి మీద అసలు ఐరన్ చేయొద్దు. ఇలా చేస్తే తొందరగా పాడవుతాయి. సిల్క్, పట్టు చీరలు ఐరన్ చేసేటప్పుడు కాటన్ క్లాత్ వేసి ఐరన్ చేస్తే ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా ఉంటుంది కాబట్టి ఈ చిట్కాను తప్పక గుర్తించుకోవాలి ఎంత మంచిగా మెయింటెన్ చేసినా కూడా చీరలపై మరకలు, మడతలు అలాగే ఉంటాయి. దీంతో ఎలా పడితే అలా కాకుండా.. మరకను మాత్రమే క్లీన్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వెనిగర్, నిమ్మరసం, సబ్బుతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని చీరలకు వర్క్ మరికొన్ని చీరలకు స్టోన్స్, ముత్యాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని విడివిడిగా ఉతకాలి. చీర నాణ్యతను బట్టి ఉతకే విధానంలో మార్పులు చేయాలి. లేదంటే అంత కష్టబడి డబ్బులు పెట్టి మరీ చేయించుకున్న వర్క్ పాడయ్యే పోయే ప్రమాదం ఉంటుంది. (చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ డెజర్ట్గా భారతీయ స్వీట్! ఎన్నో స్థానంలో నిలిచిందంటే..) -
Kajal Aggarwal: హైదరాబాద్లో ఫ్యాషన్ స్టోర్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
-
ఫ్రిజ్లో పెట్టిన కర్రీ తింటే డేంజరా?
రిఫ్రిజ్రేటర్లు వచ్చిన తర్వాత నుంచి వేస్ట్ అంటూ ఏమి ఉంచకుండా ప్రతీదీ దాంట్లోకే తోసేస్తున్నాం. ప్రతీ కూర మూడు నుంచి వారం రోజులకు పైనే ఫ్రిజ్లో పెట్టుకుని తింటున్నాం. ఇలానే తమిళనాడుకు చెందిన చిన్నారి ఫ్రిజ్లో పెట్టిన చికెన్ కర్రీ తిని మృతి చెందింది. ఆమె కుటుంబసభ్యులు కొద్ది పాటి అనారోగ్యానికి గురయ్యారు. ఇంతకీ ఫ్రీజ్లో పెట్టిన కూరలు తినొచ్చా? ఎన్ని రోజుల వరకు ఉంచి తింటే మంచిది? తమిళనాడులోని అరియలూరుకి చెందిన గోవిందరాజులు అనిర్బసి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. వాళ్లు కోడిమాంసం తెచ్చుకుని వండుకుని తినగా మిగిలింది ఫ్రిజ్లో పెట్టి మరుసటి రోజు తిన్నారు. అంతే ఇంటిల్లపాది ఆస్పత్రి పాలయ్యారు. కానీ చిన్న కుమార్తె పరిస్థితి విషమించి మృతి చెందింది. ఫుడ్ పాయిజ్ కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఇంతకీ వాళ్లు సరిగా నిల్వ చేయలేదా? మరేదైనా అనేది తెలియాల్సి ఉంది. ఇలా అందరం సర్వసాధారణంగా చేస్తాం. కానీ పలు సందర్భాల్లో ఇలాంటి దిగ్భ్రాంతికర ఘటనలు తలెత్తుతున్నాయి. అసలు ఇంతకీ ఫ్రిజ్లో ఎలా నిల్వచేయొచ్చు. ఎన్ని రోజుల వరకు ఏ కూర అయినా ఉంచొచ్చు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందాం!. కూరల్లో సాధారణంగా టమాట, కొబ్బరి, మసాలా దినుసులు జోడించి ఎక్కువసేపు ఉడికిస్తాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అయితే మనకు నిల్వ ఉండాలనుకుంటే తక్కువ సేపట్లోనే ఉడికిపోయేలా వండుకోవాలి. ముఖ్యంగా నాన్వెజ్కి సంబంధించిన బటర్ చికెన్, వంటివి ఎక్కువసేపు మంటపై వండకూడదు. తక్కువ టైంలోనే వండేసి, ప్రిజ్లో పెట్టాలనుకున్న దాన్ని వేరుగా గాలి చొరబడిన బాక్స్లో వేసి ఫ్రిజలో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పైగా రుచి పాడవ్వదు. అలాగే కూర వండిన రెండు గంటల్లోపే ఫ్రిజ్లో నిల్వ ఉంచేలా చేస్తే మంచిది. అలాగే బట్టర్ చికెన్ వంటి కూరలు వండటానికి ముందే చికెన్ని మసాల, కారం పొడులతో చక్కగా మారినేట్ చేసుకుని ఫ్రిజ్ నాలుగు నుంచి ఐదు గంటలు ఉంచి వండుకోండి. అదికూడా జస్ట్ 30 నిమిషాలకు మించి ఉడకనివ్వకండి. అలాగే మటన్ వంటి కొన్ని రకాల నాన్వెజ్లు ఉడకటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అలాంటి వాటిని ప్రెజర్ కుక్కర్ వంటి వాటిల్లో వండుకోండి. త్వరితగతిన ఉడికిపోతాయి. పైగా ఫ్రిజ్లో ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. అలాగే ఫ్రిజ్లో పెట్టాలనుకున్న కర్రీలను మంచి టైట్ బాక్స్లో ఉంచి పెట్టడం మంచిది. అలాగే ఫ్రిజ్ని కూడా ఎప్పటికప్పుడూ నీటిగా క్లీన్ చేసి ఉంచుకుంటే ఎలాంటి బ్యాక్టీరియాలు దరిచేరవు. ఫుడ్ పాయిజన్లు అవ్వడం జరగదు. ఏదైనా గానీ నిల్వ చేసుకోవాలనుకుంటే మాత్రం చల్లటి నీళ్లు పడకుండా ముందుగా వేరొక పాత్రలో తీసుకుని వెంటనే ఫ్రిజ్లో పెట్టేయండి. అంతేగానీ ఇష్టం వచ్చినట్లు కర్రీలో గరిటలు పెట్టి వాడేసి, ఆ తర్వాత మిగిలింది కదా అని ఫ్రిజ్లో పెట్టేస్తారు. ఆ తర్వాత రెండు మూడు రోజలుకు గానీ ఆ విషయం గుర్తుకు రాదు. అప్పటికే అది పాడైపోయి ఉంటుంది. ఇక పడేయ్యడం ఇష్టం లేక తిని ఆస్పత్రి పాలవ్వుతారు. దయచేసి ఇలాంటి పనులు అస్సలు చేయకండి. వంటకు సంబంధించిన విషయాల్లో కాస్త జాగురకతతో వ్యవహరించండి. (చదవండి: నలభైలో కూడా 20లా కనిపించాలంటే..! ఇలా చేయండి!) -
మసాలా దినుసులు ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!
మన వంటింట్లో పప్పు తాలింపులకు ఉపయోగించే ఆవాలు, జీలకర్ర దగ్గర నుంచి నాన్వెజ్ లేదా బిర్యానీలు చేసేటప్పుడు ఉపయోగించే మసాలలన్నింటిని నిల్వ చేయడం కాస్త ఇబ్బంది. అందులోనూ రకరకాల సీజన్లు ఉండే మన ప్రదేశాల్లో మరింత కష్టం. అలాంటప్పుడూ వాటి రుచి పాడవకుండా ఎక్కువ కాలం వచ్చేలా స్టోర్ చేయాలంటే ఈ అద్భుతమైన టెక్నిక్స్ ఫాలోకండి. రుచి పోదు, తాజగా వాడుకోవచ్చు కూడా. మసాలా దినుసులు సరిగా నిల్వ చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులు.. గాలి చొరబడిన కంటైనర్లు మీ సుగంధ ద్రవ్యాలను నిల్వ చేయడానికి గాలి చొరబడని కంటైనర్లో జాగ్రత్తగా నిల్వ చేయాలి. అలాగే సుగంధ ద్రవ్యాల్లో తేమ లేకుండా బాగా ఎండలో ఆరనిచ్చి జాగ్రత్తగా భద్రపర్చాలి. గాలి చొరబడి మూతలు ఉన్న జాడీ లేదా కంటైనర్లే మేలు. ఇలాంటివి అయితే సుగంధ ద్రవ్యాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. కూల్ స్టోరేజ్ గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేయడం ఎంత ముఖ్యమో అలాగే చల్లటి ప్రదేశంలో ఉంచడం అంతే ప్రధానం. సుగంధ ద్రవ్యాలు చాలాకాలం పాటు తాజాగా రుచిగా ఉంచాలనుకుంటే వేడిపొయ్యిలు, ఓవెన్లు, సూర్యరశ్మీకి దూరంగా ఉంచడం వంటివి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తేమ లేకుండా.. వర్షాకాలం లాంటి సీజన్లో వాటిని గాలి చొరబడని కంటైనర్లో ఉంచినప్పటికీ అట్టలు కట్టనట్లు అయిపోతాయి. వాటి రుచిలో కూడా మార్పు వస్తుంది. అలాంటప్పుడూ తేమను పీల్చుకునే ప్యాకెట్లలో నిల్వ చేసేంఉదకు ప్రయత్నించాలి. ఈ మసాలా దినులు గాలి లేదా తేమను ఆకర్షించే గుణం ఉంది కాబట్టి నిల్వ చేసుకునేటప్పుడు కాస్త జాగుకతతో ఉండాలి. లేబుల్ ఈ మసాల దినులు స్టోర్ చేసుకునే కంటైనర్లపై అవి ఎప్పుడు కొన్నారనే దాన్ని లేబుల్ చేయండి. దీని వల్ల అవి ఎంతకాలం వరకు తాజగా ఉంటాయో మీకు తెలిసేందుకు ఉపయోగపడుతుంది. ఒకవేళ వాడే ముందు బాగున్నాయా లేదా అన్న సందేహం వచ్చినప్పుడే ముందుగా దాన్ని లేబుల్ చేసి రాసి ఉంటారు కాబట్టి అది చూస్తే సరిపోతుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. పరిమిత స్థలం లేదా తేమ వాతావరణం వంటగదిలో పరిమిత స్థలమే ఉండి నిల్వచేసుకోవడం ఇబ్బందిగా మారినా లేదా ఎప్పటికీ తేమ వాతావరణమే అయితే మసాల దినుసులు నిల్వ చేయడం అంత ఈజీ కాదు. అలాంటప్పుడు కొద్ది మొత్తంలో వాటిని స్టోర్ చేసి మిగతా వాటిని గ్రైండ్ చేసి నిల్వ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పొడి చేసుకుంటే కూరల్లో కూడా సులభంగా వాడుకోవచ్చు. ఇది మిస్ చేశాం అనే సమస్య కూడా ఉండదు. తేమ వాతావరణంలో ఉండే వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. (చదవండి: అత్యంత ఖరీదైన కాఫీ! సర్వ్ చేసే విధానం చాలా వెరైటీగా ఉంటుంది!) -
Geetha Madhuri Latest Photos: ‘లాఫ్లోర్’ క్లినిక్ని ప్రారంభించిన గీతా మాధురి (ఫొటోలు)
-
నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!
మన ఇంట్లో ఎక్కువగా వాడే నిమ్మపండు లాంటి సిట్రస్ జాతి పళ్లను ఎక్కువ రోజులు తాజగా ఉంచడం కాస్త సమస్యగా ఉంటుంది. అలాగే పాయాసం, లేదా కిచిడీలో డేకరేషన్కి లేదా రుచి కోసం ఉపయోగించే సగ్గుబియ్యం లాంటివి హడావిగా ఆఫీస్కి వెళ్లేటప్పడూ వీటిని ఉపయోగించలేక ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వాడటానికి ముందు ఆ సగ్గబియ్యాన్ని కొంచెంసేపు నీటిలో నాననివ్వాల్సి ఉంటుంది. బిజీబీజీ లేఫ్లో ఇలాంటి వాటి ఎన్నింటికో మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి వెంటనే ఫాలోకండి సత్వరమే ఆ ఇబ్బంది నుంచి బయటపడండి. సులువుగా వండేసుకోండి, కూరగాయాలు కూడా మంచిగా నిల్వ చేసుకోండి. ఈజీ చిట్కాలు శుభ్రంగా కడిగి తుడిచిన నిమ్మకాయలకు కొద్దిగా నూనె రాసి టిష్యూపేపర్ వేసిన బాక్స్లో పెట్టి రిఫ్రిజిరేటర్లో పెడితే ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటాయి. గ్లాసు నీళ్లలో కొద్దిగా వెనిగర్ వేసి టూత్బ్రష్లను నానబెట్టాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే టూత్బ్రష్లు శుభ్రపడతాయి. సగ్గుబియ్యం చక్కగా నానిన తరువాత నీటిని వడగట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. ఇవి నాలుగైదు రోజులపాటు తాజాగా ఉంటాయి. అప్పటికప్పుడు సగ్గుబియ్యం నానపెట్టుకోకుండా ఇలా నిల్వచేసిన సగ్గుబియ్యాన్ని తీసుకుని వెంటనే కిచిడి, పాయసం, ఇడ్లీ, దోశల్లోకి వాడుకోవచ్చు. (చదవండి: ప్లాస్టిక్ మంచిదికాదని స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా?) -
24 గంటలూ ఓపెన్... సిబ్బంది మాత్రం నిల్!
మార్కెట్లో రకరకాల దుకాణాలు వచ్చేస్తున్నాయి. ఈ ఏఐ పుణ్యమా అన్ని సాంకేతికతో కూడాన ఆధునిక స్టోర్లు మన ముందు ప్రత్యక్షమవుతున్నాయి. పైగా అన్నీ మన ఒడిలోకే వంచి వాలిపోయేలా పనులు చకచక అయిపోతున్నాయి. అయితే అదే తరహాలో ఇక్కడొక విలక్షణమైన స్టోర్ ఉంది. 24 గంటలు తెరిచే ఉంటుంది. కానీ ఒక్క సిబ్బంది కూడా ఉండరు. మరీ ఎలా పనిచేస్తుంది?. కస్టమర్లు ఎలా కొనుక్కుంటారు? అనే కదా డౌటు..!. అలాంటి వెరైటీ స్టోర్ సియోల్లో ఉంది. దీనిపేరు రామెన్ స్టోర్. దీనిలో మనకు కావల్సిన అన్ని వస్తువులు ఉంటాయి. మనం అక్కడే కొనుక్కుని ఎంచక్కా వండకుని తినేసి రావొచ్చు. మరీ బిల్ ఎలా పే చేయాలంటే..మనకు మనమే స్వతహాగా పే చేయడమే. అలాగైతే ఎవరైనా ఈజీగా వస్తువులన్నీ ఎత్తుకుపోవచ్చు కదా అంటారా..! అంతా ఈజీ కాదు. ఎందుకంటే..? అడగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. మీరు నచ్చిన వస్తువులను తీసుకుని దాని పక్కనే ఉన్న బిల్పే చేసే ఆటోమెటిడ్ మెషిన్లో ఎంటర్ చేసి మనీ పే చేస్తే చాలు. ఒకరకంగా చెప్పాలంటే సెల్ఫ్ పేయింగ్ అన్నమాట!. ఈ మేరకు ఫుడ్ వ్లోగర్ లిల్లీ హ్యూన్ అనే ఆమె ఆ స్టోర్కి సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది. అందులో ఆమె తనకు నచ్చిన న్యూడిల్స్, ప్రిపరేషన్కి కావాల్సిన పదార్థాల తోపాటు సైడ్ డిష్లను తాను ఎలా తీసుకుని బిల్ పే చేసిందో వివరించింది. ఆ తర్వాతా ఆమె అక్కడే ఎలా ఎంచక్కా వండుకుని తినేసిందో కూడా చెప్పింది. అక్కడ మనం కావల్సింది వండుకోవడమే గాక అందుకు కావాల్సిన సైడ్ డిష్లు కూడా ఉంటాయి. వాటికి మాత్రం బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. అవి ఫ్రీ. ఐతే ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఇది రియల్? ఆ..! అని ఆశ్చర్యపోయారు. చాలామంది ఇది వర్క్ ఔట్ అవ్వడం కష్టం అని అంటున్నారు. ఎందుకంటే ఆ సీసీటీవీలను కూడా పాడు చేసి ఎత్తుకుపోవడం వంటివి జరుగుతాయంటూ కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Lily Huynh (@biteswithlily) (చదవండి: ఫ్రూట్ ఇడ్లీ గురించి విన్నారా? తయారీ విధానం చూస్తే..షాకవ్వుతారు!) -
Meenakshi Choudhary: బంజారాహిల్స్లో సందడి చేసిన నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
Nita Ambani: రిలయన్స్ ‘స్వదేశ్ స్టోర్’ లాంఛ్. సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
120 మీటర్ల ఎత్తులో ఉన్న కొండను ఆనుకుని ఓ కొట్టు..ఎక్కడంటే
కొండ బండను ఆనుకొని ఉన్న ఈ చెక్క నిర్మాణం అధిరోహకులను రెస్క్యూ చేయడానికేమో అని అనుకుంటే అచ్చంగా పొరపాటే! అదో కొట్టు. చైనాలోని హునాన్ ప్రావిన్స్లోని షినియుజాయ్ అనే సుందరమైన ప్రాంతం అది. అక్కడ 120 మీటర్ల ఎత్తులో కొలువై ఉన్న కొండను ఎక్కే అధిరోహకులకు.. ఆహారం, మంచినీరు, విశ్రాంతి వంటి కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వం ఓ కొట్టు తెరిచింది. దాని పేరు ‘హ్యాంగింగ్ కన్వీనియెన్స్ స్టోర్. ’ ఈ ఫొటోలో కనిపిస్తున్నదదే! అందులో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఉండి.. పర్యాటకులకు సేవలు అందిస్తుంటాడు. అవసరమయ్యే వస్తువులన్నిటినీ తాడుతో కింది నుంచి పైకిలాగి ఈ కొట్టులో స్టోర్ చేస్తారు. కొన్నాళ్ల కిందటి వరకు కూడా మౌంటెనీర్సే తమకు అవసరమయ్యే వస్తువులన్నిటినీ మోసుకెళ్లేవారు. ఆ అవస్థ చూసే ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. ఇప్పుడు మౌంటెనీర్స్కి కావలసిన వస్తువులన్నీ తక్కువ ధరకే ఈ కొట్టులో లభిస్తున్నాయి. దాంతో మౌంటెనీరింగ్ ఈజీ అయింది.. ఆ కొట్టు వ్యాపారమూ జోరుగా సాగుతోంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా మూతపడ్డ ఈ స్టోర్ను తిరిగి తెరవడంతో విషయం వైరల్ అయింది. (చదవండి: ఒకప్పుడు అది ఉప్పుగని! కానీ ఇప్పుడు..) -
ప్రముఖ డిజైనర్ అనూషరెడ్డి కలెక్షన్స్ స్టోర్లో సందడి చేసిన పాయల్ రాజ్పుత్ (ఫొటోస్)
-
144 ఏళ్ల మెడికల్ స్టోర్ ఎలా బయటపడింది? దానిలో ఏమేమి ఉన్నాయి?
చరిత్రకు సంబంధించిన పలు అంశాలు ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా 114 ఏళ్ల క్రితం నాటి మెడికల్ స్టోర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 1880లో ప్రారంభమైన ఈ స్టోర్ 1909 వరకూ సవ్యంగానే నడిచింది. ఈ స్టోర్ను బ్రిటన్లో విలియం వైట్ అనే వ్యక్తి నిర్వహించేవాడు. అతని మరణానంతరం ఈ స్టోర్ మూతపడింది. ఇన్నాళ్ల తరువాత ఈ స్టోర్ తలుపులు తెరవగానే లోపల ఆశ్చర్యం కలిగించే పలు వస్తువులు కనిపించాయి. మెట్రో యూకే తెలిపిన వివరాల ప్రకారం ఈ మెడికల్ స్టోర్ గురించి 80 ఏళ్ల క్రితమే వెల్లడయ్యింది. అయితే విలియం వైట్ మనుమడు 1987లొ దీని గురించి బహిరంగంగా తెలియజేశాడు. తరువాత దీనిని ప్రజల సందర్శనార్థం తెరిచాడు. ఈ స్టోర్లో లిక్విడ్ మెడిసిన్తో నిండిన జార్లు, స్కేళ్లు, వైట్ రైటర్ మొదలైనవి లభ్యమయ్యాయి. విలియం వైట్ మరణానంతరం అతని ఇంటిని విక్రయించే సమయంలో ఈ రహస్య గదిని కనుగొన్నారు. అప్పుడు వైట్ కుమారుడు చార్లెస్ ఈ స్టోర్ను మూసివేశాడు. ఒక పరిశోధకుడు చెప్పిన దాని ప్రకారం స్టొర్లోని సామాను పరిశీలించి చూస్తే, విలియం ఒక కెమిస్ట్ అని తెలుస్తోంది. అలాగే అతను గ్రోసరీ సామాను కూడా భద్రపరిచేవాడు. అయితే నాటి వస్తువులు ఇప్పుడు ప్రమాదకరంగా పరిణమించాయి. ఈ దుకాణంలో కొన్ని వనమూలికలు కూడా లభించాయి. ఈ దుకాణాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఇది కూడా చదవండి: హిట్లర్ విషాహార భయాన్ని ఎలా దాటాడు? చివరికి ఎలా మరణించాడు? -
గూగుల్, యాపిల్ ఆధిపత్యానికి చెక్! రంగంలోకి ఫోన్పే..
గూగుల్ (Google), యాపిల్ (Apple) ఆధిపత్యానికి చెక్ పెడుతూ మరో కొత్త యాప్ స్టోర్ రాబోతోంది. వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే (PhonePe) తన మొబైల్ యాప్ స్టోర్ను డెవలపర్ల కోసం తెరుస్తోంది. ఇండస్ యాప్స్టోర్ (Indus Appstore) అనే పేరుతో మొబైల్ యాప్ మార్కెట్ ప్లేస్ ప్లాట్ఫామ్లో తమ యాప్లను ప్రచురించడానికి ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లను ఆహ్వానిస్తోంది. ఈ యాప్స్టోర్లో యాప్లను ఉంచడానికి కానీ, డౌన్లోడ్ చేసుకునేందుకు కానీ ఎటువంటి రుసుము ఉండదని తెలుస్తోంది. (High Severity Warning: ఐఫోన్లు, యాపిల్ ప్రొడక్ట్స్కు హై సివియారిటీ వార్నింగ్!) ఇండస్ యాప్స్టోర్ డెవలపర్ ప్లాట్ఫామ్ను ప్రారంభించినట్లు ఫోన్పే ధ్రువీకరించింది. ప్లాట్ఫామ్లోని యాప్ లిస్టింగ్లు మొదటి సంవత్సరం ఉచితంగా ఉంటాయని, ఆ తర్వాత నామమాత్రపు వార్షిక రుసుము వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇండస్ యాప్ స్టోర్లో డెవలపర్లు తమ యాప్లను ఇంగ్లిష్ కాకుండా మరో 12 భారతీయ భాషల్లో లిస్ట్ చేయవచ్చు. అలాగే ఆయా భాషల్లోని తమ యాప్ లిస్టింగ్లకు ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేయవచ్చు. యాప్లకు సంబంధించి తలెత్తే సమస్యల పరిష్కారానికి గూగుల్, యాపిల్ యాప్ స్టోర్ల లాగే ఇండస్ యాప్ స్టోర్ కూడా భారత్ కేంద్రంగా ఈ-మెయిల్ లేదా చాట్బాట్ ద్వారా 24x7 అంకితమైన సపోర్ట్ వ్యవస్థను అందిస్తున్నట్లు పేర్కొంది. యాప్స్టోర్ ప్రారంభానికి సంబంధించిన సమాచారాన్ని తాజాగా ఇండస్ యాప్స్టోర్ తమ వైబ్సైట్లో ప్రచురించింది. ఇండస్ యాప్స్టోర్ యూజర్లకు ఎలా అందుబాటులోకి రానున్నదో కూడా చూపించింది. అయితే ఈ యాప్స్టోర్ ఎప్పుడు లాంచ్ అవుతుందన్న దానిపై ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు. -
సుప్రీంకోర్టు లాయర్ హత్య.. భర్తే చంపి స్టోర్ రూంలో..
లక్నో: ఉత్తరప్రదేశ్ నోయిడాలో దారుణం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన తన భార్యను భర్తే హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని బాత్రూంలో దాచి, తాను ఇంటి స్టోర్రూమ్లో తలదాచుకున్నాడు. బాధితురాలి సోదురుడు ఫోన్ చేసినప్పటికీ కాల్ లిఫ్ట్ చేయకపోయే సరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రేణు సిన్హా(61), అజయ్ నాథ్లు భార్యభర్తలు. అజయ్ నాథ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ మాజీ ఉద్యోగి. రేణు సిన్హ సుప్రీంకోర్టు లాయర్గా పనిచేశారు. వారు నోయిడాలో సొంత ఇంట్లో నివసిస్తున్నారు. అయితే.. ఆ ఇంటిని అజయ్ నాథ్ రూ.4 కోట్లకు అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. అడ్వాన్స్ కూడా కొనుగోలుదారుని వద్ద తీసుకున్నాడు. కానీ బంగ్లా అమ్మడానికి రేణు సిన్హా అంగీకరించలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో అజయ్ నాథ్.. రేణు సిన్హాను హత్య చేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి స్టోర్ రూమ్లో తలదాచుకున్నాడు. రేణు సిన్హా కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆమె సోదరుడు అనుమానంతో ఇంటికి వచ్చి చూశాడు. అటు అజయ్ నాథ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి ఇంటికి వచ్చిన పోలీసులు.. బాత్రూంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అన్ని రూంలలో చెక్ చేయగా.. స్టోర్ రూంలో నిందితున్ని పట్టుకున్నారు. నిందితున్ని ప్రశ్నించగా.. హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితున్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రేణు సిన్హ ఇటీవలే క్యాన్సర్ నుంచి కోలుకున్నట్లు ఆమె సోదరుడు తెలిపారు. రేణు సిన్హ, అజయ్ నాథ్ల మధ్య ఎప్పటి నుంచో వివాదాలు కొనసాగుతున్నట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: లేడీ అనురాధ డ్రగ్స్ దందా -
‘అయ్యయ్యో.. లోపలుండిపోయానే’.. మసాజ్ మిషన్లో నుంచి కేకలు..
పెద్దపెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్స్లో మసాజ్ చైర్లు కనిపిస్తుంటాయి. ఇక్కడకు షాపింగ్కు వచ్చిన వినియోగదారులు ఒక్కోసారి ఇటువంటి చైర్లలో సేదతీరుతుంటారు. అయితే ఈ విధంగా మసాజ్చైర్లో కూర్చున్న వ్యక్తికి వింత అనుభవం ఎదురయ్యింది. ఈ ఉదంతం జపాన్లో చోటుచేసుకుంది. ఒక వినియోగదారు మసాజ్ చైర్లో సేద తీరుతూ నిద్రపోయాడు. రాత్రి కావడంతో స్టోర్ బంద్ అయిపోయింది. ఆ వ్యక్తి ఫోనులో ట్వీట్ ద్వారా సాయం అడినప్పుడు ఈ విషయం వెలుగుచూసింది. @_Asphodelus అనే పేరు కలిగిన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ వ్యక్తి ట్వీట్ చేశాడు. చీకటితో కూడిన ఒక ఫొటోను షేర్ చేసిన ఆయన ‘అయ్యయ్యో.. లోపలుండిపోయానే’ అని రాశాడు. కేఎస్ అనే పేరు కలిగిన స్టోర్ బంద్ అయి ఉండటాన్ని ఫోటోలో చూడవచ్చు. కాగా అనంతరం ఆ వ్యక్తి స్టోర్లోని అలారం మోగించగా పోలీసులకు ఈ సమాచారం అందింది. వెంటనే వారు స్టోర్ యజమానికి ఈ విషయాన్ని తెలియజేశారు. మొత్తం 10 మంది పోలీసు అధికారులు స్టోర్లో నుంచి అతనిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అతనిని దొంగ కాదని నిర్ధారించుకున్నారు. కాగా స్టోర్కు తాళాలు వేసిన సిబ్బంది మసాజ్ చైర్లో ఉండిపోయి ఇబ్బందిపడిన వ్యక్తిని క్షమాణలు కోరారు. అయితే ఈ స్టోర్లో ఆ వ్యక్తి ఎంతసేపు బందీ అయిపోయారన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పోస్టుకు 39 వేలకుపైగా షేర్లు వచ్చాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్ ‘డిపార్ట్మెంటల్ స్టోర్లో బంద్కావడం అనేది తన చిన్నప్పటి కల అని అన్నారు. మరొక యూజర్ తాను అలా బందీ అయితే ‘ఎస్కేప్ ది రూమ్’ స్టయిల్ గేమ్స్ ఆడుకుంటానని అన్నారు. ఇది కూడా చదవండి: ‘ఏంట్రా ఇదంతా’..‘ఎవర్రా మీరు’.. ‘ఇదేందిది’.. వీటికి బాప్ ఈ వీడియో! え…… pic.twitter.com/AalynpL1PB — こばたつ (@afdc1257) August 15, 2016 -
అన్లిమిటెడ్ స్టోర్లలో 60% వరకు ఆఫర్లు
హైదరాబాద్: అరవింద్ లైఫ్స్టైల్ గ్రూప్ అనుబంధ సంస్థ అన్లిమిటెడ్ సోర్ట్ అన్ని రకాల బ్రాండెడ్ వస్త్రాలపై 60% వరకు ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని అన్లిమిటెడ్ స్టోర్లలో ఆగస్టు మూడో తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది. అన్ని వయస్సుల వారికి సరిపడే సరికొత్త డిజైన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. కొత్త డిజైన్లను కస్టమర్లు ఇష్టపడతారని, నాణ్యమైన ఉత్పత్తులు ఆకర్షిస్తాయని పేర్కొంది. -
మణిపూర్లో జవాన్ వికృత చేష్టలు.. మహిళను బయటకు లాగి..
ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో రోజుకో అమానవీయ ఘటన వెలుగులోకి వస్తోంది. కెమెరా సాక్షిగా జవాన్ చేతిలో ఓ మహిళ ఇబ్బందులను ఎదుర్కొంది. కిరాణ స్టోర్ నుంచి ఓ మహిళను బీఎస్ఎఫ్ జవాను విచక్షణా రహితంగా బయటకు లాగి పడేశాడు. మహిళ మెడపై జవాన్ చేతితో గట్టిగా పట్టుకోగా.. ఆ పట్టుబిగువుకు ఆమె విలవిల్లాడింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన జులై 20న జరగగా.. సదరు జవాన్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. నిందితునిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీసీటీవీ వీడియో ప్రకారం.. ఓ బీఎస్ఎప్ జవాను రైఫిల్ను ధరించి ఉన్నాడు. ఓ కిరాణ స్టోర్ నుంచి ఓ మహిళను విచక్షణా రహితంగా బయటకు లాగాడు. జులై 20న ఈ ఘటన జరగగా.. నిందితునిపై కేసు నమోదు చేశారు. విధుల నుంచి తప్పించారు. నిందితున్ని సతీష్ ప్రసాద్గా గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇద్దరు మహిళలను నగ్నంగా రోడ్డుపై ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే కాక ఇప్పటికే అక్కడి పోలీసు స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. చాలా స్టేషన్లలో జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కానీ వాటిపై ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. అలాగే ఫేక్ సోషల్ మీడియా పోస్టులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్ సెల్ విభాగం దీనిపై ప్రత్యేకంగా పనిచేస్తోంది. ఇదీ చదవండి: మణిపూర్ అల్లర్లు.. అమరుని కుటుంబాన్ని రక్షించిన బీఎస్ఎఫ్.. -
వైజాగ్లో స్టార్బక్స్.. నోరూరించే మెనూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాఫీ విక్రయాల్లో ఉన్న టాటా స్టార్బక్స్ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో స్టోర్ను తెరిచింది. దీంతో దేశవ్యాప్తంగా సంస్థ కేంద్రాలున్న నగరాల సంఖ్య 45కు చేరుకుంది. ఏపీలో ఇప్పటికే కంపెనీకి విజయవాడలో ఔట్లెట్ ఉంది. టాటా కంజ్యూమర్ ప్రొడక్ట్స్ సంయుక్త భాగస్వామ్యంలో 2012లో భారత్లో ప్రవేశించిన స్టార్బక్స్కు దేశవ్యాప్తంగా 350 స్టోర్లు ఉన్నాయి. ఈ స్టోర్లో అనుకూలమైన ఎంపికల శ్రేణిని టాటా స్టార్బక్స్ పరిచయం చేస్తోంది. కొత్త పిక్కో కప్ సైజుతో సహా, కాఫీ ప్రియులకు ఫేవరెట్ పానీయాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఫిల్టర్ కాఫీ, మసాలా చాయ్, ఏలకుల చాయ్, మిల్క్షేక్లు, శాండ్విచ్లను ఆకర్షణీయమైన ఆఫర్లతో అందిస్తోంది. -
కూకట్పల్లిలో వస్త్ర దుకాణం ప్రారంభోత్సంలో మోడల్స్ సందడి (ఫొటోలు)
-
యాపిల్ స్టోర్స్లో సేల్స్పర్సన్లకు అదిరిపోయే జీతాలు!
అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ ఇటీవల భారత్లో రెండు రీటైల్ స్టోర్లను ప్రారంభించింది. ముంబై, ఢిల్లీ నగరాల్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లలో పనిచేసే సేల్స్ పర్సన్లకు, మేనేజర్లకు యాపిల్ భారీగా చెల్లిస్తోంది. ఈ స్టోర్లలో పనిచేసే వారు ఉన్నత విద్యావంతులు. ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ ఉన్నత కోర్సులు అభ్యసించినవారు. ఇదీ చదవండి: ఐఫోన్ 14పై అక్షయ తృతీయ ఆఫర్.. ఏకంగా రూ.21 వేలు తగ్గింపు! వీరిలో కొందరు కేంబ్రిడ్జ్, గ్రిఫిత్ వంటి విశ్వవిద్యాలయాల్లో చదివినవారూ ఉన్నారు. యూరప్, మిడిల్ ఈస్ట్లోని యాపిల్ స్టోర్లలో పని చేస్తున్న కొంతమంది భారతీయులను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ ఉద్యోగులందరికీ రీటైల్ అనుభవం ఉందని ఎకనమిక్స్ టైమ్స్ నివేదించింది. యాపిల్ కంపెనీ ముంబై , న్యూఢిల్లీ స్టోర్లలో 170 మంది సిబ్బంది నియమించింది. వీరికి గ్లోబల్ స్టాండర్డ్స్తో శిక్షణ ఇచ్చింది. ముంబై యాపిల్ స్టోర్లోని ఉద్యోగులు మొత్తం 25 భాషల్లో మాట్లాడగలరు. అలాగే ఢిల్లీ స్టోర్ సిబ్బంది 15 భాషలు మాట్లాడగలరు. స్టోర్కు విచ్చేసే కస్టమర్లతో భాష సమస్య రాకుండా యాపిల్ జాగ్రత్త పడుతోంది. అందుకే దాదాపు అన్ని ప్రముఖ భారతీయ భాషలు మాట్లాడే సిబ్బందిని తమ స్టోర్లలో నియమించింది. తమ స్టోర్లలో పనిచేసే సిబ్బందికి మంచి జీతంతో పాటు బీమా ప్రయోజనాలు, చెల్లింపు సెలవులు, స్టాక్ గ్రాంట్లు, యాపిల్ ఉత్పత్తులపై తగ్గింపులు, విద్య కోసం ఆర్థిక సహాయం వంటి సదుపాయాలు కల్పిస్తోంది. భారతదేశంలో ఆర్గనైజ్డ్ రిటైల్ ఉద్యోగులకు రూ. 25,000 నుంచి రూ. 30,000 దాకా జీతం లభిస్తోంది. అయితే యాపిల్ మాత్రం తమ రిటైల్ ఉద్యోగులకు నెలకు రూ. 1 లక్షకు పైగా చెల్లిస్తోంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
యాపిల్ స్టోర్ ముందు బారులుతీరిన కస్టమర్లు
ఢిల్లీలోని సాకేత్లో ఉన్న సెలెక్ట్ సిటీవాక్ మాల్లో గురువారం (ఏప్రిల్ 20) యాపిల్ రెండో స్టోర్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు యాపిల్ సీఈవో టిమ్కుక్ ప్రారంభించారు. స్టోర్ తెరవకముందే తెల్లవారుజాము నుంచే కస్టమర్లు, ఢిల్లీ నగరవాసులు పెద్దఎత్తున తరలి వచ్చారు. స్టోర్ బయట క్యూలో నిలబడ్డారు. (Apple Retail Store In Delhi: రెండో యాపిల్ స్టోర్ను ప్రారంభించిన టిమ్కుక్) యాపిల్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో స్టోర్ ప్రారంభానికి ముందే కస్టమర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాపిల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. ఉత్పత్తుల కొనుగోలు కంటే స్టోర్ను సందర్శాలనే ఉద్దేశంతో చాలా మంది తరలివచ్చారు. #WATCH | People stand in queues at Delhi's Select City Walk Mall in Saket to witness the opening of India’s second Apple Store. pic.twitter.com/9mwk5gZmlu — ANI (@ANI) April 20, 2023 కాగా ముంబై స్టోర్ తర్వాత ఢిల్లీలో ప్రారంభించిన ఈ యాపిల్ స్టోర్ భారత్లో రెండోది. యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్లు, ఐప్యాడ్లకు కస్టమర్ల నుంచి అధిక డిమాండ్ ఉంది. అలాగే యాపిల్ టీవీలు, వాచ్లు, మొబైల్కు సంబంధించిన యాక్సెసరీలను ఈ స్టోర్లో కస్టమర్లకు అందుబాటులో ఉంచారు. ఇదీ చదవండి: apple saket: యాపిల్ ఢిల్లీ స్టోర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయింది! -
రెండో యాపిల్ స్టోర్ను ప్రారంభించిన టిమ్కుక్
భారత్లో యాపిల్ రెండో స్టోర్ ఢిల్లీలోని యాపిల్ సాకేత్ (apple saket)ను సీఈవో టిక్కుక్ గురువారం (ఏప్రిల్ 20) ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు కస్టమర్లు, నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా టిమ్కుక్ కస్టమర్లకు అభివాదం చేసి స్వాగతం పలికారు. పలువురిని పలకరించారు. కస్టమర్లు కూడా చప్పట్లు కొడుతూ, బిగ్గరగా అరుస్తూ తమ మద్దతు తెలియజేశారు. ఇదీ చదవండి: apple saket: యాపిల్ ఢిల్లీ స్టోర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయింది! #WATCH | Apple CEO Tim Cook meets customers visiting India’s second Apple Store at Delhi's Select City Walk Mall in Saket. pic.twitter.com/ZeEubKU92w — ANI (@ANI) April 20, 2023 ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో రెండు రోజుల ముందే తమ మొదటి స్టోర్ను స్టోర్ను యాపిల్ ప్రారంభించింది. ఢిల్లీలో ప్రారంభించిన ఈ యాపిల్ సాకేత్ స్టోర్ భారత్లో రెండవది. కాగా పరిమాణంలో ఢిల్లీ స్టోర్.. ముంబై స్టోర్ కంటే చిన్నది. స్టోర్ ప్రారంభానికి ముందే కస్టమర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇదీ చదవండి: Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్ -
యాపిల్ ఢిల్లీ స్టోర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయింది!
యాపిల్ భారత్లో తన రెండవ స్టోర్ గురువారం (ఏప్రిల్ 20) ప్రారంభమవుతోంది. యాపిల్ సాకెట్ (apple saket)గా పిలుస్తున్న ఈ స్టోర్ను సీఈవో టిమ్ కుక్ ప్రారంభిస్తున్నారు. అధికారిక ప్రారంభానికి ఒక రోజు ముందు యాపిల్ తన ఢిల్లీ స్టోర్కు సంబంధించిన వివరాలను, చిత్రాలను వెబ్సైట్లో ప్రచురించింది. యాపిల్ ఉత్పత్తులను షాపింగ్ చేయడానికి, సేవలను పొందేందుకు యాపిల్ సాకెట్ కస్టమర్లకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని, ఇక్కడి సిబ్బంది కస్టమర్లకు అన్ని విధాలుగా సహకరిస్తారని కంపెనీ ఈ సందర్భంగా పేర్కొంది. అలాగే యాపిల్ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి స్టోర్లో ‘టుడే’ పేరుతో ఉచిత సెషన్లు ఏర్పాటు చేసింది. భారతదేశంలో తమ రెండవ స్టోర్ యాపిల్ సాకెట్ను ప్రారంభించడం ద్వారా ఢిల్లీలోని తమ కస్టమర్లకు ఉత్తమమైన సేవలు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నామని యాపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెయిర్డ్రే ఓబ్రియన్ పేర్కొన్నారు. వెబ్సైట్ ఉంచిన ఫొటోల ప్రకారం.. యాపిల్ సాకెట్ స్టోర్లో ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శించేందుకు వైట్ ఓక్ టేబుల్లతో స్టోర్ ముందు భాగాన్ని సుందరంగా రూపొందించారు. భారత్లో తయారు చేసిన ఫీచర్ వాల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. మరోవైపు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఈ స్టోర్లో డెలివరీ పొందే సౌకర్యం ఉంది. ఇందుకోసం ప్రత్యేకమైన పికప్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇతర అన్ని యాపిల్ స్టోర్ల మాదిరిగానే ఢిల్లీలోని యాపిల్ సాకెట్ స్టోర్ కూడా 100 శాతం పునరుత్పాదక ఇంధన శక్తితో నడుస్తుంది. ఈ స్టోర్లో 70 కంటే ఎక్కువ మంది నైపుణ్యం కలిగిన రిటైల్ టీమ్ ఉంది. దేశంలోని 18 రాష్ట్రాలకు వారు 15 కంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు. డివైజ్ సెటప్ చేయడం, Apple IDని రికవరీ చేయడం, యాపిల్ కేర్ ప్లాన్ను ఎంచుకోవడం, సబ్స్క్రిప్షన్లను సవరించడం వంటి అన్ని విషయాలలో కస్టమర్లకు సహాయం చేసేందుకు ఇక్కడ జీనియస్ బార్ పేరుతో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: Mukesh Ambani Birthday: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? -
Neha Shetty Latest Photos: కొంపల్లిలో సందడి చేసిన నేహా శెట్టి (ఫొటోలు)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సాక్షి ఆఫీస్లో టీ20 ట్రోఫీ.. పీయూష్ చావ్లా సందడి (ఫొటోలు)
ఆప్ను అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: సీఎం కేజ్రీవాల్
విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్
రాష్ట్రపతి భవనంలో గదులెన్ని? లోపల ఏ విద్యాలయం ఉంది?
Play Offs లోకి ఆర్సిబీ
‘ఖర్గే చెప్పినా.. నా పోరాటం ఆగదు’
ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
తప్పక చదవండి
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement