-
ఇయర్ రౌండప్ 2022: హిట్ బొమ్మలివే...
దాదాపు 275 (స్ట్రెయిట్, డబ్బింగ్) చిత్రాలు... 20 శాతం హిట్స్తో 2022 ముగియనుంది. గత ఏడాది కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ పడింది. ఈ ఏడాది థియేటర్స్కి లాక్ పడలేదు. అయితే కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అనే సందేహం నడుమ సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ప్రేక్షకులు సినిమా పట్ల తమకు ఉన్న ప్రేమను నిరూపించుకున్నారు. కానీ విజయాల శాతం మాత్రం ఇరవైకి అటూ ఇటూగానే ఉంది. కాగా స్ట్రెయిట్ చిత్రాలే కాదు.. అనువాద చిత్రాలూ మంచి వసూళ్లు రాబట్టాయి. భారీ అంచనాల నడుమ రిలీజైన కొన్ని చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. 2022 ‘హిట్ బొమ్మ’ (చిత్రాలు)లను చూద్దాం. బంగార్రాజుల సందడి వాసివాడి తస్సాదియ్యా... అంటూ సంక్రాంతికి పెద్ద బంగార్రాజు (నాగార్జున), చిన్న బంగార్రాజు (నాగచైతన్య) జనవరి 14న ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చారు. కల్యాణŠ కృష్ణ దర్శకత్వంలో దాదాపు రూ. 25 కోట్ల బడ్జెట్తో నాగార్జున నిర్మించిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ నెల దాదాపు 17 చిత్రాలు వచ్చాయి. టిల్లుగాడు.. దంచి కొట్టాడు ఫిబ్రవరిలో ఇరవై చిత్రాలు విడుదలైతే విజయం శాతం రెండు అనే చెప్పాలి. దాదాపు రూ. 5 కోట్లతో రూపొంది, 30 కోట్ల వరకూ వసూళ్లను దంచి కొట్టాడు ‘డీజే టిల్లు’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇదే నిర్మాత దాదాపు రూ. 80 కోట్లతో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా సాగర్ Mð.. చంద్ర దర్శకత్వంలో నిర్మించిన ‘భీమ్లా నాయక్’ 150 కోట్లకు పైగా రాబట్టింది. ఇంకా రవితేజ ‘కిలాడి’, మోహన్బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’తో పాటు మరికొన్ని చిత్రాలొచ్చాయి. ఆర్ఆర్ఆర్... రికార్డ్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న వచ్చింది. దాదాపు రూ. 550 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సుమారు 1150 కోట్ల వసూళ్ల రికార్డుని సాధించింది. ఇదే నెలలో ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’తో పాటు మరో పది చిత్రాల వరకూ రిలీజయ్యాయి. నిరాశతో ఆరంభమైన వేసవి ఏప్రిల్లో దాదాపు 15 సినిమాలు విడుదలైతే ప్రేక్షకుల మెప్పు పొందిన చిత్రాలు పెద్దగా లేవు. అలా వేసవి నిరాశతో ఆరంభమైంది. వరుణ్ తేజ్ ‘గని’, తండ్రీకొడుకులు చిరంజీవి– రామ్చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి. సర్కారుకీ.. ఫన్కీ విజయం మహేశ్బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారువారి పాట’ మే 12న విడుదలైంది. దాదాపు రూ. 60 కోట్లతో మహేశ్బాబు, అనిల్ సుంకర, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సుమారు 200 కోట్లు వసూ లు చేసింది. ఇక వినోద ప్రధానంగా వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ‘ఎఫ్ 3’ మే 27న రిలీజైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దాదాపు రూ. 70 కోట్లతో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా సుమారు 130 కోట్లు రాబట్టింది. మేలో మరో 7 చిత్రాలు రిలీజయ్యాయి. ‘మేజర్’ హిట్తో.. ఒక్క ‘మేజర్’ హిట్తో జూన్ సరిపెట్టుకుంది. హీరో అడివి శేష్ టైటిల్ రోల్లో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో మహేశ్బాబు ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. దాదాపు రూ. 30 కోట్లతో రూపొంది, 65 కోట్ల వసూళ్లు రాబట్టింది. జూన్లో దాదాపు 20 చిత్రాలు రిలీజయ్యాయి. హిట్ లేని నెల జూలైలో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’, రామ్ ‘వారియర్’, రవితేజ ‘రామారావు: ఆన్ డ్యూటీ’... ఇలా దాదాపు 20 సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు హిట్ చేసిన సినిమాలు ఏవీ లేకుండా పోయాయి. . అదిరింది ఆగస్ట్ ఆగస్టులో వచ్చిన ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ 2’ బంపర్హిట్స్గా నిలిచాయి. కల్యాణ్రామ్ హీరోగా నటించగా, ‘బింబిసార’తో వశిష్ఠ దర్శకుడిగా పరిచయమయ్యారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్తో నందమూరి కల్యాణ్రామ్, కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం 70 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. దాదాపు రూ. 30 కోట్లతో రూపొందిన పీరియాడికల్ ప్రేమకథా చిత్రం ‘సీతారామం’ 100 కోట్ల వసూళ్లకు చేరువలో నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో సి. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్తో అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘కార్తికేయ 2’ 120 కోట్లు రాబట్టింది. ఒక్క హిందీ భాషలోనే ఈ చిత్రం సుమారు 50 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ఇదే నెలలో విడుదలైన నితిన్ ‘మాచర్ల నియోజకగర్గం’, విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రాల వసూళ్లు తడబడ్డాయి. ఒకే ఒక్క విజయం... ఇక సెప్టెంబరులో విడుదలై ప్రేక్షకుల మనసు గెలుచుకున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో దాదాపు రూ. 15 కోట్ల బడ్జెట్తో ఎస్ఆర్. ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్బాబు నిర్మించిన ఈ చిత్రం 25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందన్నది ట్రేడ్ వర్గాల మాట. ఇంకా ఈ నెలలో దాదాపు పాతిక చిత్రాలు రిలీజయ్యాయి. స్వాతిముత్యానికి విజయం అక్టోబర్ నెలలో వచ్చిన ‘స్వాతిముత్యం’ హిట్గా నిలిచింది. దాదాపు రూ. 8 కోట్లతో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా 25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బెల్లంకొండ గణేష్ హీరోగా, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం అక్టోబరు 5న విడుదలైంది. ఇదే నెలలో రిలీజైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఫర్వాలేదనిపించింది. నాగార్జున ‘ది ఘోస్ట్’ కూడా ఇదే నెల వచ్చింది. ఇదే నెల 21న విడుదలైన మంచు విష్ణు ‘జిన్నా’, విశ్వక్సేన్ ‘ఓరి..దేవుడా..’ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ లెక్కల్లో తడబడ్డాయి. చిన్న సినిమాకి పెద్ద విజయం సమంత టైటిల్ రోల్ చేసిన ‘యశోద’ నవంబరు 11న విడుదలైంది. హరి–హరీష్ దర్శకత్వంలో దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్తో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 35 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక చిన్న సినిమా ‘మసూద’ రూ. 10 కోట్ల బడ్జెట్లోపు రూపొంది, 20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సంగీత, తిరువీర్ ముఖ్య తారలుగా సాయికిరణ్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబరులో విడుదలైన దాదాపు 20 సినిమాల్లో అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో..’, అల్లరి నరేశ్ చేసిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీ కం’లకు ప్రేక్షకులు పాస్ మార్కులు వేశారు. ‘హిట్’కి హిట్ జూన్లో ‘మేజర్’ హిట్ అందుకున్న అడివి శేష్కు డిసెంబరులో ‘హిట్ 2’ రూపంలో మరో హిట్ లభించింది. శైలేష్ కొలను దర్శకత్వంలో దాదాపు రూ. 12 కోట్లతో నాని నిర్మించిన ఈ చిత్రం 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ‘రామారావు: ఆన్ డ్యూటీ’, ‘ఖిలాడి’ చిత్రాల తర్వాత ఈ ఏడాది రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ ఈ నెల 23న విడుదలైంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అలాగే ‘కార్తికేయ 2’తో హిట్ అందుకున్న నిఖిల్ హీరోగా నటించిన మరో చిత్రం ‘18 పేజెస్’ డిసెంబరు 23నే విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం వసూళ్ల లెక్క రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇంకా నెలాఖరున ఆది సాయికుమార్ ‘టాప్ గేర్’తో పాటు మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అనువాదం అదిరింది ఈ ఏడాది డబ్బింగ్ చిత్రాల జోరు కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఆ చిత్రాల విశేషాల్లోకి వెళితే... వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి ముఖ్య తారలుగా సుమారు రూ. 20 కోట్లతో రూపొందిన ‘ది కశ్మీరీ ఫైల్స్’ అన్ని భాషల్లో దాదాపు 350 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిందని టాక్. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్తో రూపొందిన ‘కేజీఎఫ్ 2’ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1000 కోట్లు సాధించిందని టాక్. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సీనియర్ నటుడు కమల్హాసన్ నటించిన ‘విక్రమ్’ సుమారు 100 కోట్లతో రూపొంది, దాదాపు 450 కోట్లు వసూలు చేసిందని భోగట్టా. అలాగే కె. కిరణ్ రాజ్ దర్శకత్వంలో రూ. 20 కోట్లతో రూపొంది, 100 కోట్లకుౖ పెగా వసూళ్లు సాధించింది ‘777 చార్లి’. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ రూ. 16 కోట్లతో రూపొంది, 450 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇవన్నీ ప్రపంచవ్యాప్త లెక్కలు కాగా తెలుగులో లాభాలిచ్చిన చిత్రాలుగా నిలిచాయి. (వసూళ్ల వివరాలన్నీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం) -
అది నిర్మాతల నిర్ణయం.. కాస్త భయంగా ఉంది: ‘స్వాతిముత్యం’డైరెక్టర్
బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘స్వాతిముత్యం’. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్. లక్ష్మణ్ కె. కృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో లక్ష్మణ్ చెప్పిన విశేషాలు. ► సినిమాలంటే ఆసక్తితో ఇంజనీరింగ్ పూర్తి కాకుండానే ఇండస్ట్రీకి వచ్చేశాను. ‘లాస్ట్ విష్’, ‘కృష్ణమూర్తిగారింట్లో..’ అనే షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ‘కృష్ణమూర్తిగారింట్లో..’కి మంచి ఆదరణ లభించింది. దీంతో ఓ సినిమా అవకాశం వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ఆ నెక్ట్స్ నేను ‘సదా నీ ప్రేమలో..’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను. ఆ తర్వాత ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేయాలనుకుని ‘స్వాతిముత్యం’ కథ రాశాను. ► ‘స్వాతిముత్యం’లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన బాలమురళీ కృష్ణగా బెల్లంకొండ గణేష్ నటించారు. బాలమురళీ కృష్ణ ప్రభుత్వోద్యోగం సంపాదిస్తాడు. ఆ తర్వాత కుటుంబసభ్యులు అతనికి పెళ్లి చేయాలనుకుంటారు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అన్నదే కథ. మా చుట్టుపక్కల గ్రామాల్లోని ఘటనలను కూడా పొందుపరిచాను. ► ఈ సినిమాకు ‘స్వాతిముత్యం’ టైటిల్ను నిర్మాత చినబాబుగారు సూచించారు. ఎక్కువగా అమాయక పాత్రలు ఉన్నాయి కాబట్టి ఈ టైటిల్ అయితే బాగుంటుందని భావించారాయన. ► చిరంజీవిగారికి నేను వీరాభిమానిని. ఆయన ‘గాడ్ ఫాదర్’ విడుదలవుతున్న రోజునే నా దర్శకత్వంలోని సినిమా రిలీజ్ అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. చిరంజీవి, నాగార్జున గార్లు వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న సమయంలో మా సినిమాను రిలీజ్ చేయడం అనేది నిర్మాతల నిర్ణయం. కానీ నాకు కాస్త భయంగానే ఉంది. మా సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో.. ఫెస్టివల్కు రిలీజ్ అయితే బాగుంటుందని మేం భావించాం. -
డుం డుం డుం.. మోగింది మేళం.. ఆకట్టుకుంటున్న పెళ్లి పాట
గణేష్ ,వర్ష బొల్లమ్మ జంటగాప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వెడ్డింగ్ సాంగ్ని విడుదల చేశారు మేకర్స్. ‘డుం డుం డుం డుం డుం మోగింది మేళం’ ....అంటూ మొదలయ్యే ఈ పాటకి సాహిత్యాన్ని కె కె అందించగా, మహతి స్వర సాగర్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చాడు. దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ..‘చిత్ర కథాంశం ప్రకారం నాయక, నాయికల పెళ్లి గీతం ఇది. వీరి నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకూ జరిగే వివిధ వ్యవహారాలు,సందర్భాలు, సన్నివేశాల సమాహారం ఈ పాట. పట్టణం నేపథ్యంలో చిత్రీకరించిన దీనిని రచయిత కె కె ఎంతో చక్కగా రచించారు. ప్రేక్షకుడు కూడా సహజంగా అనుభూతి చెందేలా చిత్రీకరించడం జరిగింది’ అన్నారు. దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు "స్వాతిముత్యం" ను అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. -
కళాతపస్వి కె. విశ్వనాథ్కు ఆత్మీయ సత్కారం..
K Viswanath Honoured For Swati Mutyam Movie Completing 36 Years: కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రం ‘స్వాతిముత్యం’ విడుదలై నేటికి (ఆదివారం) 36 ఏళ్లు. కమల్హాసన్, రాధిక, సోమయాజులు, గొల్లపూడి మారుతీరావు ముఖ్య తారలుగా ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో అమాయకుడు శివయ్య పాత్రలో కమల్, లలిత పాత్రలో రాధిక కనబర్చిన అభినయాన్ని అంత సులువుగా మరచిపోలేం. ఈ చిత్రానికి తోటపల్లి సాయినాథ్ అందించిన మాటలు, ఇళయరాజా సంగీతం, ఆత్రేయ, సినారె, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిల సాహిత్యం అదనపు ఆకర్షణలు. అంతేకాకుండా ‘స్వాతిముత్యం’ ఆస్కార్ ఎంట్రీ సైతం దక్కించుకుంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాలకు నంది అవార్డులు వచ్చాయి. ఈ చిత్రానికి 36 ఏళ్లవుతున్న సందర్భంగా కె. విశ్వనాథ్ నివాసంలో శుభోదయం మీడియా శనివారం ఆత్మీయ వేడుకను నిర్వహించి, ఆయన్ను సత్కరించింది. తోటపల్లి సాయినాథ్, శుభోదయం గ్రూప్ అధినేత కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్, నృత్యకళాకారిణి స్వర్ణ శ్రీ పాల్గొన్నారు. -
'స్వాతిముత్యం'లో అమ్మ పోయిన సీన్ చూస్తే కన్నీళ్లాగవు
‘అది మా పుట్టింటివాళ్లు ఇచ్చిన మరచెంబురా, బుజ్జిముండకి ఎన్ని సొట్టలు పడ్డాయో ఏంటో... అంటూ మనింటి బామ్మగా తెలుగువారికి చేరువయ్యారు. వేసేయండ్రా తలుపులు అంటూ... రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్గా విలనిజమూ చేశారు.. తల్లి లేని పిల్లలకు బామ్మగా నటిస్తూ, మనవలకు చేరికయ్యారు... సినిమాలలో ఎంత సింపుల్గా ఉంటారో, నిజ జీవితంలోనూ అంతే సింపుల్గా ఉంటుంది అమ్మ అంటున్నారు జి. నిర్మలమ్మ (రాజమణి) ఏకైక కుమార్తె కవిత. 1927, నవంబరు నెల, దీపావళి వెళ్లిన ఏడో రోజున అంటే సప్తమి తిథి నాడు తొమ్మిదో సంతానంగా బందరులో పుట్టింది అమ్మ. తాతయ్య కోటయ్య, అమ్మమ్మ గంగమ్మ. అమ్మను వాళ్ల పెద్దక్కయ్యే పెంచి పెద్ద చేశారు. అమ్మ మూడో తరగతి వరకే చదువుకుంది. చిన్నప్పటి నుంచి ఆటపాటలలో చాలా చలాకీగా ఉండేదట. అమ్మకి డాన్స్, నాటకాలంటే ప్రాణమని చెప్పేది. వేదాంతం రాఘవయ్య గారితో కలిసి డాన్స్ చేసిందట అమ్మ. అమ్మకి ఏడు సంవత్సరాల వయసులో ‘మార్కండేయ’ సినిమాలో, చిత్రపురి నారాయణమూర్తి గారి ద్వారా నాటకాలలో నటించడానికి అవకాశం వచ్చింది. నాటకాలలో నటిస్తూ, మంచి నటన నేర్చుకోవచ్చనుకుంది అమ్మ. తన పద్నాలుగో ఏట ‘భక్త ప్రహ్లాద’ నాటకంలో ప్రహ్లాదుడిగా నటించింది. మంచి తెలుగు వచ్చు కాబట్టి, పద్యాలు చాలా చక్కగా చదవగలిగానని అమ్మ చెప్పేది. ‘సక్కుబాయి’ నాటకం చూసి బాగుందని మెచ్చుకున్నారట కానీ, ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదట. చిన్నగా, సన్నగా ఉన్నావు. కొంచెం ఒళ్లు రావాలి, అలాగే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి అన్నారట. పద్యాలు, పాటలు సాధన చేస్తూ, సినిమా అవకాశాల కోసం ఎదురుచూసిందట అమ్మ. ఘంటసాల బలరామయ్యగారు అమ్మ ఫొటోలు చూసి ‘గరుడ గర్వభంగం’ చిత్రంలో సత్యభామ చెలికత్తె వేషం ఇచ్చారట. క్రమేపీ పుల్లయ్య గారు, గూడవల్లి రామబ్రహ్మం గారు, బి. ఎన్. రెడ్డిగారు... వీరందరి పరిచయాలతో అమ్మకు సినిమాలలో మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఎత్తుకు పై ఎత్తు, మనుషులు మారాలి... వరసగా 900 కు పైగా చిత్రాలలో నటించింది. ఒక సంవత్సరంలో 19 సినిమాలు చేసిన రికార్డు అమ్మది. 70 సంవత్సరాలు వచ్చాక కూడా చేసింది. హిందీ, తమిళ చిత్రాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. సినీ పరిశ్రమలో అమ్మని అందరూ సొంత తల్లిలా భావించేవారు. అమ్మనాన్నలను అక్క – బావ అని పిలిచేవారు. ప్రోత్సహిస్తేనే వివాహం.. అమ్మకు 19 సంవత్సరాల వయసు వచ్చేసరికి వివాహం చేసుకోమని అమ్మమ్మ అడిగిందట. అందుకు అమ్మ, ‘నన్ను కళాకారిణిగా ప్రోత్సహించేవారినే చేసుకుంటాను’ అని నిక్కచ్చిగా చెప్పిందట. కళల పట్ల ఆసక్తి ఉన్న జి. వి. కృష్ణారావు గారితో అమ్మ వివాహం జరిగింది. పెళ్లయిన నాటి నుంచి ఇద్దరిదీ ఒకే మాట, ఒకటే బాట. ఉదయిని థియేటర్ స్థాపించి, ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ఏ పోటీకి వెళ్లినా అమ్మకు బహుమతి తప్పనిసరి. ఆంధ్రకళాపరిషత్తులో మూడు సార్లు వరసగా బహుమతులు రావటంతో, నిర్వాహకులు ‘అమ్మా! ఇక నుంచి మీరు బహుమతులకు దూరంగా ఉండండి’ అన్నారట. ఆ విషయం అమ్మ ఎంతో సంబరంగా చెప్పేది. పెద్దల ప్రశంసలు... అమ్మ ఒకసారి ‘కరవు రోజులు’ నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు ఆ నాటకానికి ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు పృ«థ్విరాజ్ కపూర్ హాజరయ్యారట. ఆ నాటకంలో అమ్మ స్టేజ్ మీద పావుగంట సేపు శవంలా ఉంటుంది. నాటకం పూర్తయ్యాక ఆయన, ‘శవం బాగా నటించింది’ అని చమత్కరిస్తూ అమ్మను అభినందించారని అమ్మ ఎంతో సంతోషంగా చెప్పేది. అలాగే ‘ఎంతో ప్రావీణ్యం ఉంటేనే కానీ రేడియో నాటకాలలో నటించలేం. నాలుగు గోడల మధ్య మైకు ముందర నిలబడి, అందరికీ కళ్ల ముందు కనిపిస్తున్నట్లు నటించాలి. నాకు రేడియో నాటకాలంటే మక్కువ’ అనేది. విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన వేయిపడగలు, ఏకవీర నాటకాలలో నటించింది. ‘వేయిపడగలు’ లో గిరిక పాత్ర విని, ఆయన స్వయంగా ‘పిచ్చి తల్లీ! నిన్ను తక్కువ అంచనా వేశాను. ఎంత బాగా నటించావో’ అని ఆశీర్వదించారుట. అన్నీ పద్ధతిగా ఉండాలి... అన్ని పనులు చాలా చురుగ్గా చేసుకునేది. తాను సెలబ్రిటీని అనే భావన ఏ కోశానా ఉండేది కాదు. వంట స్వయంగా చేసుకుంటేనే ఇష్టం అమ్మకు. వంటవాళ్లతో చేయించుకోవటం ఇష్టం లేదు. ఉలవచారు, చేపల పులుసు.. అన్నీ చాలా శ్రద్ధగా చేసేది. ముక్కలు తరిగితే... ఒక ముక్క పెద్దది, ఒక ముక్క చిన్నది అయితే ఒప్పుకునేది కాదు. ఆవకాయ ముక్కలు సైతం పెద్ద కత్తి పీట మీద తరిగేది. బయట వాళ్లు రకరకాల సైజుల్లో కట్చేస్తారని అమ్మకు నచ్చేది కాదు. గోంగూర ఆరబెట్టి, శుభ్రం చేసి పచ్చడి తయారుచేసేది. పెసరపప్పు అప్పడాలు బాగా ఒత్తేది. అడిగిన వారికే కాదు, అడగని వారికి కూడా సీసాలలో పచ్చళ్లు ఇచ్చేది. నలుగురికీ పెట్టడమంటే అమ్మకి చాలా ఇష్టం. అమ్మ వంట చేసి షూటింగ్కి క్యారియర్ తీసుకువెళ్లేది. ఔట్డోర్ షూటింగ్కి వెళ్లినప్పుడు అక్కడ సొంతంగా వంట చేసేది. ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్లమనేది. పూల జడ వేసేది... నా చిన్నప్పుడు అమ్మ చెన్నై నుంచి హైదరాబాద్ సారథి స్టూడియోకి షూటింగ్స్ కోసం వచ్చేది. షావుకారు జానకి, అమ్మ మంచి స్నేహితులు. షూటింగ్ అయిపోయాక, అమ్మవాళ్లు షాపింగ్ చేసేవారు. లక్క పిడతలు, బట్టలు, గాజులు తీసుకువచ్చేది. వేసవి కాలంలో మల్లె పూలను, ఎంతో పొందికగా గుచ్చి చాలా అందంగా వంకీల జడ కుట్టేది. నా పుట్టినరోజు వస్తే ఇంట్లో పండగే. నాన్న హైదరాబాద్ నుంచి ఫ్రాక్స్ తెచ్చేవారు. ఆడపిల్లను చక్కగా అలంకరించి, అందంగా చూసుకోవటం నాన్నకు చాలా ఇష్టం. అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసేవారు. బొమ్మల కొలువు పెట్టించేది. అట్ల తద్ది నోము, ఉపవాసాలు చేయించేది. పెళ్లయ్యాక వరలక్ష్మీవ్రతం చేయించింది. మా పిల్లలకు నలుగు పిండి కోసం బావంచాలు, కచ్చూరాలు తెప్పించి మర పట్టించేది. వాళ్లకి నలుగు పెట్టి స్నానం చేయించి, ఆ తరవాత అమ్మ సాన్నం చేసి, షూటింగ్కి రెడీ అయ్యేది. షూటింగ్ నుంచి రాగానే శుభ్రంగా స్నానం చేసి, మళ్లీ పిల్లల దగ్గరకు వచ్చి వారిని, మురిపెంగా చూసుకునేది. వాళ్లు కొంచెం పెద్దవాళ్లయ్యాక హైదరాబాద్ నుంచి ద్రాక్షపళ్లు, మామిడి పండ్లు తెచ్చేది. ఇబ్బంది పెట్టేది కాదు... షూటింగ్కి వెళ్లాలంటే తెల్లవారుజామునే లేచి, కాఫీ తాగి, అన్ని పనులు ముగించుకుని, సిద్ధంగా ఉండేది. ఒక్క రూపాయి కూడా ఎవ్వరిదీ తీసుకోలేదు. దర్శకులంటే చాలా గౌరవం. వాళ్లు చెప్పింది చేసేది. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టేది కాదు. డబ్బింగ్ కూడా కాల్షీట్ ప్రకారం వెళ్లి చెప్పేది. అమ్మ అప్పట్లో చాలా బిజీగా ఉండేది. అమ్మనాన్న ఇద్దరూ రాత్రి షూటింగ్స్కి వెళ్తుంటే బాగా ఏడ్చేసేదాన్ని. నన్ను మా పెద్దమ్మ కూతురు సుబ్బులక్క దగ్గరకు తీసుకుని ఓదార్చేది. తనే నన్ను తల్లిలా పెంచింది. నాకు జ్వరం వస్తే మాత్రం అమ్మ నా పక్క నుంచి కదిలేది కాదు. చాలా సాధారణంగా... అమ్మ ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలే ధరించేది. రెండు చేతులకు చెరో గాజు, మెడలో ఒక గొలుసు, చెవులకు దుద్దులు... అంతే. సినిమాలలో కూడా ఇలాగే ఉండేది. మేకప్ వేసుకునేది కాదు. ఎండల్లో షూటింగ్ చేయటం వల్ల ముఖం మీద చిన్న మచ్చ వచ్చింది. ఆ మచ్చకు మాత్రం రంగు వేసేది. వేలి ముడి, సాదా సీదా చీరలు ఇష్టపడేది. ఎక్కువగా మల్మల్ చీరలు, ఆర్గండీ చీరలు కట్టుకునేది. తలకు ఎన్నడూ రంగు వేసుకోలేదు. అమ్మకి పూల మొక్కలు, చెట్లు, కూరగాయ మొక్కలంటే చాలా ఇష్టం. విరజాజి పూలు, ఉసిరి, నిమ్మ, సీతాఫలం, జామ, మామిడి చెట్లు, సపోటా, పనస అన్నీ కడియం నుంచి తెప్పించింది. మొక్కలకు స్వయంగా నీళ్లు పోసేది. కుక్కలంటే చాలా ఇష్టం. చాలా కుక్కల్ని పెంచింది. కాటుక ఇంట్లోనే చేసేది అమ్మ. పుస్తకాలు బాగా చదివేది. బ్రహ్మంగారి చరిత్ర, ఈశ్వరమ్మగారి చరిత్ర చదివి మాకు వినిపించేది. తెలుగు అంటే చాలా ఇష్టం. సాటి నటీనటులు ఒత్తులు పలక్కపోతే చాలా కోపం వచ్చేది. చెన్నైలో స్కూల్లో తెలుగు ఉండేది కాదు. అందువల్ల మా అబ్బాయికి తెలుగు అమ్మ నేర్పటమే కాకుండా, కాకరాల గారి దగ్గర కూడా నేర్పించింది. నాకు కడుపులో నొప్పిగా ఉంటే, పొట్టంతా నూనె రాసేది. ఆదివారం వస్తే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలని నేర్పింది. బట్టలు కూడా బాగా సర్దుకుంటేనే కానీ ఒప్పుకునేది కాదు. వస్తువు విలువ తెలియాలనేది. అమ్మకు కోపం చాలా ఎక్కువ. క్రమశిక్షణలో తేడా వస్తే కొట్టేది. నేను సౌమ్యంగా ఉంటూ, అమ్మ చెప్పినట్లు వినేదాన్ని. పెద్దవాళ్ల దగ్గర నుంచి అమ్మ నేర్చుకున్న పనులన్నీ నాకు నేర్పింది. డిగ్రీ వరకు చదివించింది. మాస్టర్ వేణుగారి దగ్గర సితార్ నేర్పించింది. అమ్మనాన్నలు బాగా బిజీగా ఉంటూ, అష్టకష్టాలు పడ్డారు. నేను అలా కష్టపడకూడదనే ఉద్దేశంతో నన్ను గృహిణిగానే ఉంచారు. అమ్మను మించిన దైవం లేదు, ఆవిడ వల్లే నేను ఈరోజు హాయిగా ఉన్నాను. చాలామంది కళాకారుల పిల్లల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో తెలిసిందే. నన్ను ఒక గృహిణిలా, భర్తకు భార్యగా, పిల్లలకు తల్లిగా పెంచారు. మా అమ్మాయికి లక్ష్మీ నిర్మల అని అమ్మ పేరు, అబ్బాయికి జయకృష్ణ అని నాన్న పేరు పెట్టాం. అల్లుడిని కొడుకులా చూసుకున్నారు. అమ్మానాన్నలకు మా వారే తలకొరివి పెట్టారు. స్వాతిముత్యం సినిమాలో అమ్మ పోయిన సీన్ చూస్తుంటే ఇప్పటికీ ఏడుపు వస్తుంది. అని భావోద్వేగానికి లోనైంది కవిత. సంభాషణ: వైజయంతి పురాణపండ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్ల కోసం పాక్ జట్టు ప్రకటన.. ప్రపంచకప్ జట్టులో కూడా వీరే..!
ఆయన్ను ముసుగేసి కొడితే రూ.10 వేలిస్తా: రాజమౌళి
ఓటీటీలో సినిమాల జాతర.. ఒక్క రోజే 8 చిత్రాలు స్ట్రీమింగ్!
AP High Court: జనసేనకు ఈసీ ఝలక్
మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం
అమెరికావాళ్ళ మర్యాదలు అతిక్రమిస్తే కష్టాలు !
YSRCP స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే
తృణమూల్లో మమతా vs అభిషేక్ బెనర్జీ?
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?
తప్పక చదవండి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
Advertisement