-
ఐపీఎల్ మ్యాచ్ స్ట్రీమింగ్ వివాదం... చిక్కుల్లో తమన్నా!
మిల్కీ బ్యూటీ తమన్నా చిక్కుల్లో పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 మ్యాచ్లను ‘ఫెయిర్ ప్లే’ యాప్లో స్ట్రీమింగ్ చేసినందుకుగాను మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎల్ 2023 మ్యాచ్లను ‘పెయిర్ ప్లే’ యాప్లో స్ట్రీమింగ్ చేయడం కారణంగా తమకు రూ. కోట్లలో నష్టం జరిగిందని ప్రసార హక్కులను సొంతం చేసుకున్న ‘వయాకామ్’ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే ఈ యాప్లో ఐపీఎల్ మ్యాచ్లను చూడాలంటూ తమన్నా, సంజయ్ దత్తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు, గాయకులు ప్రచారం చేశారు. ఇదే కేసులో ఈ మధ్యే సంజయ్ దదత్కి కూడా సమన్లు జారీ అయ్యాయి. ఆయన ఈ ఏప్రిల్ 23న విచారణకు రావాల్సి ఉండగా.. గైర్హాజరయ్యారు. ప్రస్తుతం తాను ముంబైలో లేనని.. వాంగ్మూలం ఇచ్చేందుకు మరో తేది కేటాయించాలని పోలీసులను కోరారు. ఈ కేసు విచారణలో భాగంగానే తాజాగా తమన్నాకు నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఫెయిర్ ప్లే యాప్పై గతంలోనూ మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ యాప్ మహదేవ్ ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్కు అనుబంధ సంస్థ. ఆన్లైన్ బెట్టింగ్ ముసుగులో మనీలాండరింగ్కి పాల్పడినట్లు ఈడీ గుర్తించి సదరు సంస్థపై కేసు నమోదు చేసింది. ఈ యాప్లో ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేయడానికి అధికారికంగా ఎలాంటి బ్రాడ్ కాస్టింగ్ హక్కులు లేవు. అయినప్పటకిఈ గతేడాది నిబంధనలకు విరుద్దంగా కొన్ని ఐపీఎల్ మ్యాచ్లను స్ట్రీమింగ్ చేశారు. వాటిని చూడలంటూ తమన్నా.. సంజయ్ దత్, జాక్వెలిన్ ఫెర్నాండెస్ లాంటి అగ్రతారలు ప్రచారం చేశారు. ఫలితంగా వయాకామ్కు రూ.కోట్లల్లో నష్టం రావడంతో ఆ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. -
వారం ఆలస్యంగా...
సుందర్ .సి కీలక పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘అరణ్మనై 4’. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీని ‘బాక్’ పేరుతో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండటం వలన విడుదలను వాయిదా వేశామని మేకర్స్ ప్రకటించారు. వారం ఆలస్యంగా మే 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘వెన్నెల’ కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, ఢిల్లీ గణేశ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: హిప్హాప్ తమిళ, కెమెరా: కృష్ణమూర్తి. -
తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ బ్లాస్ట్.. పాటలో డోస్ పెంచిన బ్యూటీస్
దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం అరణ్మణై–4. ఇంతకుముందు ఈయన తెరకెక్కించిన అరణ్మణై 1, 2, 3 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో అరణ్మణై–4 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్కుమార్కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా, యోగిబాబు, కోవై సరళ, వి.టీవీ గణేష్ ముఖ్యపాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేశారు మేకర్స్..అందులో తమన్నా, రాశీఖన్నా అందాల ప్రదర్శనతో పోటీ పడ్డారు అని చెప్పవచ్చు. హిప్ హాప్ ఆది అందించిన మ్యూజిక్కు వారిద్దరూ గ్లామర్తో మ్యాజిక్ చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన మూడు సీక్వెల్స్ భారీ హిట్ను అందుకున్నాయి. ఇప్పుడు నాలుగో పార్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో తమన్నా, రాశీఖన్నాలే హైలైట్. అందాలు ఆరబోయడంలో ఒకరితో ఒకరు పోటీపడినట్లు కనిపిస్తోంది. తెలుగులో 'బాక్' అనే పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అరణ్మణై 4 నిజానికి ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సింది. పలు కారణాల రీత్యా వాయిదా పడింది. ఫైనల్గా ఏప్రిల్ 26న ఈ చిత్రం కోలీవుడ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల కానుంది. -
సూపర్ హిట్ మూవీ.. 12 ఏళ్ల తర్వాత రీరిలీజ్
హీరో కార్తీ సూపర్ హిట్ చిత్రాల్లో పైయ్యా ఒకటి. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి లింగుసామి దర్శకత్వం వహించారు. తిరుపతి బ్రదర్స్ ఫిలిం మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుభాష్చంద్రబోస్ నిర్మించారు. మది ఛాయాగ్రహణం, యువన్ శంకర్రాజా సంగీతం అందించారు. రోడ్ ట్రావెల్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం 2010లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఇందులోని పాటలన్నీ సూపర్హిట్ అయ్యాయి. ఇది తెలుగులో ఆవారాగా రిలీజై ఇక్కడ కూడా హిట్ అందుకుంది. 12 ఏళ్ల తర్వాత రీరిలీజ్ తాజాగా పైయ్యా చిత్రాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 11వ తేదీన తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయడానికి తిరుపతి బ్రదర్స్ సంస్థ అధినేత సుభాష్ చంద్రబోస్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ చేయనున్నట్లు దర్శకుడు లింగుసామి ఇంతకు ముందే చెప్పారన్నది గమనార్హం. తాజాగా పైయ్యా చిత్రం రీ రిలీజ్ గురించి ఆయన మాట్లాడుతూ.. కార్తీకి ఒక హోటల్లో కథ చెప్పడం మొదలు పెట్టిన కొద్ది సేపటికే చాలా బాగుంది.. మనం చిత్రం చేస్తున్నాం అని చెప్పారన్నారు. ఆయనకు కథలపై చాలా నాలెడ్జ్ ఉందన్నారు. కెమిస్ట్రీ వర్కౌట్ అయింది సినిమాలో లవ్, యాక్షన్, చేజింగ్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు బాగా కుదిరాయన్నారు. కార్తీ, తమన్నాల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందన్నారు. ఇకపోతే పైయ్యా చిత్రానికి సీక్వెల్ చేస్తానని, కథ కూడా సిద్ధం చేశానన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. అయితే దీనికంటే ముందు ఒక పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నట్లు చెప్పారు. ఇది మహాభారతంలోని శ్రీకృష్ణుడు, అర్జునుడు పాత్రల నేపథ్యంలో ఉంటుందని చెప్పారు. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని లింగుసామి పేర్కొన్నారు. చదవండి: హీరోయిన్ అరుంధతి ప్రస్తుతం ఎలా ఉందో చెప్పిన సోదరి -
గ్లామర్కే ఓటేస్తున్న తమన్నా.. కారణం ఇదేనట!
గ్లామరస్గా నటించాలంటే నేటి కథానాయికల్లో తమన్నా తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. సుమారు 20 ఏళ్ల క్రితం చాంద్ సా రోషన్ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తరువాత దక్షిణాది చిత్రాలపై దృష్టి పెట్టారు. హిందీలో పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయినా, తెలుగు, తమిళం భాషల్లో అగ్రనటిగా రాణిస్తున్నారు. అయితే ఆది నుంచి తమన్నా గ్లామర్నే నమ్ముకున్నారని చెప్పవచ్చు. నువ్వు కావాలయ్యా.. అలాగని ఈ అమ్మడిలో నటించే సత్తా లేదని చెప్పలేం. బాహుబలి వంటి చిత్రాల్లో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. అయినా గ్లామర్ క్వీన్గానే ముద్ర వేసుకున్నారు. ఇటీవల జైలర్ చిత్రంలో నువ్వు కావాలయ్యా పాటలో తనదైన స్టైల్లో అందాలను ఆరబోసారు. ఈ పాట ఇప్పటికీ వాడవాడల్లో మారు మోగుతోందంటే అతిశయోక్తి కాదు. తమన్నా తమిళంలో నటించిన తాజా చిత్రం అరణ్మణై –4. ఇందులో అభినయం, అందాలతో ప్రేక్షకులను అలరించడానికి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మైండ్సెట్ మారాలి ఈ సందర్బంగా ఈ చిత్రంలో ఎక్కువ గ్లామరస్గా నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. దీనిపై మిల్కీ బ్యూటీ స్పందిస్తూ.. గ్లామర్ను ప్రదర్శించడం, అలాంటి పాటల్లో నటించడం అనేది ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమేనన్నారు. ఇంకా చెప్పాలంటే పాటల్లో గ్లామర్ను ప్రదర్శించడం తప్పేమీ కాదన్నారు. ఈ విషయంలో ప్రేక్షకుల మైండ్సెట్ మారాలన్నారు. జైలర్ చిత్రంలో కావాలయ్యా పాటను చూసిన కొందరు చాలా దారుణంగా కామెంట్స్ చేశారని, అది తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు. చదవండి: అవార్డును వేలం వేసిన విజయ్ దేవరకొండ.. దక్కించుకున్నది ఎవరంటే? -
మళ్లీ వచ్చేస్తున్న హారర్ మూవీ.. ట్రైలర్ చూశారా?
దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం అరణ్మణై–4. ఇంతకుముందు ఈయన తెరకెక్కించిన అరణ్మణై 1, 2, 3 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో అరణ్మణై–4 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్కుమార్కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా, యోగిబాబు, కోవై సరళ, వి.టీవీ గణేష్ ముఖ్యపాత్రలు పోషించారు. అప్పట్లో ఆ ఆలోచనే లేదు హిప్ హాప్ ఆది సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని శనివారం చైన్నెలోని నిర్వహించారు. హీరో సుందర్ సి మాట్లాడుతూ.. అరణ్మణై చిత్రం తొలిభాగం తన కెరీర్లో చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. దానికి సీక్వెల్స్ రూపొందించాలన్న ఆలోచన తనకు అప్పట్లో లేదన్నారు. మంచి ఐడియాలు రావడం వల్లే సీక్వెల్స్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. వేరే చిత్రానికి సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నప్పుడు తన కోరైటర్ ఒక విషయాన్ని చెప్పారన్నారు. రాజులే భయపడ్డారు అది కొత్తగా ఉండడంతో ఈ అరణ్మణై –4 చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమైనట్లు చెప్పారు. 'ఇండియాలోని పలు భాగాలను పాలించడానికి అప్పట్లో పలువురు రాజులు దండెత్తి వచ్చారు. అయితే వారెవరూ ఈస్ట్ భాగంలోని బ్రహ్మపుత్ర నదిని దాటి వెళ్లడానికి సాహసించలేదు. అందుకు పలు కారణాలు ఉండగా.. అందులో ఒకటి దెయ్యం! ఆ ప్రాంతంలో బాగ్ అనే మానవశక్తిని మించిన శక్తి కలిగిన దెయ్యం ఉందనేది కథలు, కథలుగా చెప్పుకునేవారు. ఆ అంశాన్ని కథగా మలుచుకుని రూపొందించిన చిత్రమే అరుణ్మణై–4' అని చెప్పారు. ఇప్పటి వరకు గ్లామర్, యాక్షన్ పాత్రల్లో చూసిన తమన్నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చదవండి: సాధారణ వ్యక్తి ప్రేమలో 'పూజా హెగ్డే'.. ఫోటోలు వైరల్ -
Tamannaah Latest Photos: తమన్నా బ్యూటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు (ఫోటోలు)
-
Tamannaah Bhatia: ముంబై ఎయిర్పోర్ట్లో మిల్కీ బ్యూటీ (ఫొటోలు)
-
సినిమా ఏదైనా గ్లామర్ ఉండాల్సిందే!
సినిమా జానర్ ఏదైనా గ్లామర్ తప్పని సరిగా మారుతోందిప్పుడు. దర్శకుడు సుందర్.సీ చిత్రాల్లో కామెడికీ, గ్లామర్కు కొదవే ఉండదు. అలా సుందర్.సీ ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం అరణ్మణై చిత్రం. దీన్ని ఆయన సతీమణి, నటి కుష్బూ నిర్మించారు. హారర్ కామెడీ జానర్లో రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో వరుసగా మరో రెండు సీక్వెల్స్ను తెరకెక్కించారు. అవీ హిట్ కావడంతో తాజాగా నాలుగో సీక్వెల్ను తెరకెక్కించారు. దీని పేరు అరణ్మణై 4. హారర్ + కామెడీ సుందర్.సీతో పాటు తమన్నా, రాశీఖన్నా, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో కోవైసరళ, గరుడ రామ్, దర్శకుడు కేఎస్.రవికుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. హిహ్ హాప్ తమిళా సంగీతం, ఇ.కృష్ణస్వామి ఛాయాగ్రహణం అందించారు. దీనికి బెంజ్ మీడియా అధినేత ఏసీఎస్ అరుణ్కుమార్ సమర్పకులుగా వ్యవహరించారు. ఇది కూడా గత సీక్వెల్స్ మాదిరిగానే హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందడం విశేషం. ఆ ఇద్దరే హైలైట్ ఈ మూవీలో తమన్నా, రాశీఖన్నాలే హైలైట్. అందాలు ఆరబోయడంలో ఒకరితో ఒకరు పోటీపడినట్లు కనిపిస్తోంది. మరో విషయం ఏమిటంటే తమిళంలో ప్రస్తుతం వీరి చేతిలో ఉన్న ఒకే ఒక్క చిత్రం ఇదే. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అరణ్మణై 4 నిజానికి ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సింది. పలు కారణాల రీత్యా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. Some say this Mansion is very chill, and some say it is very chilling 👻 This April #Aranmanai4 is coming to give your summer a nice dose of laughter and a whole lot of chills and thrills... So are you ready? A Film by #SundarC A @hiphoptamizha Musical@khushsundar… pic.twitter.com/jUXWUssujV — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 27, 2024 చదవండి: చిరంజీవి, మోహన్బాబు మధ్య గొడవ.. వాళ్లకు ఎప్పుడూ అదే పని.. -
తమన్నా.. పెళ్లి ఎప్పుడు?
-
పింక్ డ్రస్లో మిల్కీ బ్యూటీ..ధర వింటే షాకవ్వుతారు!
మిల్కీబ్యూటీ తమన్నా భాటియాకి ఇప్పటికీ టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. కానీ బాహుబలి తర్వాత ఆమెకు సరైన హిట్ పడలేదు. ఒకప్పుడూ ఆమె టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్. ఆ టైంలో ఓ పక్క స్టార్ హీరోలతో నటిస్తూనే యంగ్ హిరోలతో కూడా నటించేది ఈ భామ. అయితే ఆమె కెరీర్లో హిట్ల కంటే ప్లాప్లే ఎక్కువ ఉన్నాయి. అయితేనేం ఆమె అందం, పర్సనల్ ఇమేజ్తో ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ పెంచి వివిధ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. ప్రస్తుతం స్పీడ్ తగ్గించి బాలీవుడ్ వెబ్ సిరీస్లపై దృష్టిపెట్టింది. ఈమధ్య ప్రతి రోజూ ఓ డిఫరెంట్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ తో కనిపిస్తోంది తమన్నా భాటియా. ముఖ్యంగా బాలీవుడ్, వెబ్ సిరీస్లతో బిజీ అయిన తర్వాత తమన్నా తన గ్లామర్ డోసు అమాంతం పెంచేసింది. తాజాగా పింక్ డ్రెస్లో అభిమానుల మనసులు గెలుచుకుంటోంది. తమన్నా ధరించిన ఈ డ్రెస్ లగ్జరీ వర్సెచె బ్రాండ్కి చెందింది. డ్రస్ ధర ఏకంగా రూ. 4.2 లక్షలు. ఈ పింక్ కలర్ లగ్జరియస్ డ్రెస్లో బార్బీ బొమ్మలా మెరిసిపోయింది. ఇన్స్టాగ్రాంలో అందుకు సంబంధించని ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులకు ట్రీట్ ఇస్తోంది. వీటికి ఓన్లీ ఫ్లవర్ ఎమోజీలతో క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేసింద. ఈ పింక్ డ్రస్లో తమన్నా ఫోటోలకు ఇచ్చిన ఫోజులు అదిరిపోయాయి. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) (చదవండి: రైల్లో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలో తెలుసా?) -
తమన్నా..పెళ్లెప్పుడో?
తమిళసినిమా: అందం తిన్నానండీ అందుకే ఇట్టా ఉన్నానండీ.. అంటూ నటి తమన్నా ఓ చిత్రంలో ఐటమ్ సాంగ్కు ఆడిపాడిన విషయం తెలిసిందే. ఆ పాటకు తగ్గట్టుగానే 36 ఆరేళ్ల వయస్సు మీద పడినా తరగని అందాలతో యువత గుండెల్ని కొల్లగొడుతున్న నటి తమన్నా. ఇటీవల జైలర్ చిత్రంలో నువ్వు కా వాలయ్యా అంటూ ఆడి దుమ్మురేపిన ఈ మిల్కీబ్యూటీకి ప్రస్తుతం అవకాశాలు తగ్గినా క్రేజ్ మాత్రం అలాగే మెయిన్టైన్ చేస్తోంది. ప్రస్తుతానికి అరణ్మణై 4 చిత్రం మాత్రమే తమిళంలో ఈమె చేతిలో ఉంది. అయితే హిందీలో అవకాశాలు వరిస్తున్నాయట. ఇకపోతే బాలీవుడ్ నటుడు, నిర్మాత విజయ్వర్మ ప్రేమలో మునిగి తేలుతున్న తమన్నా ఆయనతో డేటింగ్లో ఉన్నారు. అయితే పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. కాగా తాజాగా పెళ్లి కూతురులా తయారైన ఫొటోలను ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చాలా అందంగా ఉన్నారు, పెళ్లి కూతురులా ఉన్నారు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి కొందరైతే అంతా బాగానే ఉంది గానీ పెళ్లెప్పుడో? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. -
ఆ డెరెక్టర్పై మిల్కీ బ్యూటీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ.. కొత్త ఏడాదిలో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తోంది. గతంలో ఓటీటీలో రిలీజైన ఓదెల రైల్వేస్టేషన్ సూపర్ హిట్గా నిలిచింది. దీంతో మేకర్స్ సీక్వెల్గా ఓదెల-2 తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్ సంపత్ నంది చేసిన ట్వీట్పై స్పందించింది. ఇలాంటి వ్యక్తిని తన 19 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు చూడలేదంటూ ప్రశంసలు కురిపించింది. టీమ్లోని ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించి మెచ్చుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. ఇటీవల రిలీజైన తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్కు విశేష స్పందన రావడంపై డైరెక్టర్ సంపత్ నంది ట్విటర్ వేదికగా కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి తమన్నా పర్సనల్ స్టాఫ్ను సైతం మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతనిపై తమన్నా ప్రశంసలు కురిపించింది. కాగా.. సంపత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గతంలో సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కించిన రచ్చ బెంగాల్ టైగర్, సీటీమార్ చిత్రాల్లో తమన్నా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. Thankyou for your kind words @IamSampathNandi , it means a lot✨ I have always strongly believed that filmmaking is a collaborative effort. Even if it begins with one person’s vision, it’s the fusion of each team member’s perspective that matters and Sampath truly understands… https://t.co/SVcRFRMt6O — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 10, 2024 -
Odela 2: నాగ సాధువుగా తమన్నా!
తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్ హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్గా ఈ మూవీ రూపొందుతోంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లపై డి. మధు నిర్మిస్తున్నారు. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో కనిపించారు తమన్నా. ‘‘ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా కాపాడారు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అత్యధిక బడ్జెట్తో బహు భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కాశీలో జరుగుతోంది. శివ శక్తి పాత్ర కోసం తమన్నా పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. యూనివర్సల్ అప్పీల్ ఉండే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు మేకర్స్. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహ, యువ, నాగ మహేశ్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూ΄ాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్. ఎస్, సంగీతం: అజనీష్ లోక్నాథ్. -
మిల్కీ బ్యూటీపై అలాంటి పోస్ట్.. మొత్తానికి రియాక్ట్ అయిందిగా!
తమన్నా పేరు కంటే.. మిల్కీ బ్యూటీ అంటే ప్రేక్షకులు ఠక్కున గుర్తు పట్టేస్తారు. అంతలా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది ముద్దుగుమ్మ. గతేడాది జైలర్ మూవీలో స్పెషల్ సాంగ్తో తన గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. జైలర్ సూపర్ హిట్ కావడంతో పారితోషికం అమాంతం పెంచేసిందంటూ టాక్ కూడా వినిపించింది. దీంతో బాలీవుడ్లో లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్లోనూ మెరిసింది. ఇందులో తన బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి నటించింది. ఇదలా ఉంచితే తమన్నా 2005లోనే తన కెరీర్ ప్రారంభించింది. ఓకే ఏడాదిలో తెలుగు, హిందీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్లో శ్రీ మూవీతో అడుగుపెట్టింది. ఆ తర్వాత హ్యాపీ డేస్, బద్రినాథ్, 100% లవ్, రచ్చ, బాహుబలి సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. అయితే తమన్నా తన కెరీర్ ప్రారంభించి ఇప్పటికీ 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ అభిమాని తమన్నా సినిమాల్లో చేసిన పాత్రలతో ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసిన తమన్నా అభిమాని ట్వీట్కు స్పందించింది. తనపై చూపిస్తున్న ప్రేమకు అతనికి ధన్యవాదాలు తెలిపింది. ఇలాంటి ఫోటోలు మరిన్నీ వస్తాయంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒక అభిమాని ట్వీట్కు తమన్నా రిప్లై ఇవ్వడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Thank you 🫶🏻 Many more to come 💕 https://t.co/TNMr1ChANd — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 5, 2024 -
జైలర్ హిట్ అయ్యింది నావల్లే.. తమన్నా సంచలనం
-
'జైలర్' హిట్ నా వల్లే.. నిర్మాతలకు తమన్నా కొత్త డిమాండ్
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. ఇందులో నటి తమన్న ఒక్క పాట, కొన్ని సన్నివేశాల్లో మాత్రమే నటించారు. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్ను కూడా తెరకెక్కించడానికి నెల్సన్ రెడీ అవుతున్నారు. కాగా నటి తమన్న తన పారితోషికాన్ని విపరీతంగా పెంచేసినట్టు టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఇటీవల ఈమె ఒక భేటీలో పేర్కొంటూ జైలర్ చిత్రం అంత సంచలన హిట్కు కారణం రజనీకాంత్ కాదని, తానేనని పేర్కొన్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నిజం చెప్పాలంటే ఆ చిత్రంలో తమన్న నటించిన నువ్వు కావాలయ్యా అనే పాట పెద్ద హిట్ అయ్యింది. ఆమె అందాల ప్రదర్శన కర్రకారును విపరీతంగా అలరించింది. చిత్రం విడుదలైన తరువాత ఎక్కడ విన్నా 'నువ్వు కావాలయ్యాస పాటనే. అయితే ఆ పాట హిట్ అయినా, తమన్నకు మాత్రం ఇక్కడ మరో అవకాశం రాలేదు. ప్రస్తుతానికి హిందీ చిత్రాలతోనే సరి పెట్టుకుంటున్న ఈ మిల్కీబ్యూటీకి తాజాగా ఒక తెలుగు చిత్రంలో నటించే అవకాశం వరించింది. అది మినహా దక్షిణాదిలో ఒక్క చిత్రం కూడా లేదు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో మునిగి తేలుతున్న తమన్న త్వరలో అతగాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ విషయం అలా ఉంచితే ఈ అమ్మడు తన పారితోషికాన్ని ఏకంగా రూ. 5 కోట్లకు పెంచేసిందని సమాచారం. అదేమంటే జైలర్ చిత్రం హిట్కు ప్రధాన కారణం తానేనని చెప్పుకుంటోందట. మరి దీనిపై జైలర్ చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. -
Odela 2 Movie: ‘ఓదెల 2’లో మిల్కీ బ్యూటీ.. కాశీలో గ్రాండ్ గా ఓపెనింగ్ (ఫోటోలు)
-
కాశీలో క్లాప్
ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి ఏ విధంగా రక్షిస్తాడు? అనే ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల 2’. 2022లో డైరెక్ట్గా ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకు సీక్వెల్గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. ఇందులో తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్ పై డి. మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది క్రియేటర్గా ఉన్న ఈ సినిమా ప్రారంభోత్సవం కాశీలో జరిగింది. రెగ్యులర్ షూటింగ్ని కూడా కాశీలోనే ఆరంభించారు. తొలి సీన్కి సంపత్ నంది క్లాప్ కొట్టారు. ‘‘ఓదెల 2’ గ్రామం చుట్టూ కేంద్రీకృతమై, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షిస్తాడనే అంశాలతో ఈ చిత్రకథ ఉంటుంది. క్యాస్టింగ్, కథ, వీఎఫ్ఎక్స్.. టోటల్గా మేకింగ్ పరంగా ఈ చిత్రం పెద్దగా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్నాథ్, కెమెరా: సౌందర్ రాజన్. ఎస్. -
బాహుబలిలో నన్ను ఎందుకు తీసుకున్నారో..?
-
పేరు మార్చుకోవడంపై తమన్నా కామెంట్స్.. కారణం అదేనంటూ!
మిల్కీ బ్యూటీ తమన్నా రచ్చ లేపుతోంది. వయసు పెరుగుతున్నా సరే గ్లామర్ మెంటైన్ చేయడంలో వారెవ్వా అనిపిస్తోంది. నటిగా కెరీర్ ప్రారంభించి దాదాపు 20 ఏళ్లు పూర్తి కావొస్తుంది. అయితేనేం ఇప్పటికీ సినిమాలు-సిరీసులు లాంటవి చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే తమన్నా పేరు ఇది కాదని, మార్చుకుందని మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఆ విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీక్రెట్ బయటపెట్టింది. తమన్నా అంటే 'కోరిక' అని అర్థమట. 8-9 ఏళ్ల వయసున్నప్పుడే నటి కావాలని ఈ ముద్దుగుమ్మ ఫిక్సయిందట. అప్పుడు అనుకోవడం ఏమో గానీ టీనేజ్లోకి వచ్చేసరికి మోడలింగ్లో అడుగుపెట్టింది. 2005లో ఒకేసారి తెలుగు, హిందీ సినిమాలతో హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత తమిళ, కన్నడలోనూ నటించింది. అయితే తమన్నా.. తెలుగులోనే కొన్నేళ్ల పాటు వరస చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. (ఇదీ చదవండి: డైరెక్ట్గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) సినిమాల్లో ఎంట్రీ ఇద్దామని తమన్నా అనుకున్నప్పుడు.. ఒకాయన ఈమెని కలిసి పేరులో మార్పు చేసుకోమని చెప్పాడు. ఇంగ్లీష్లో అదనంగా a,h జోడీంచమని సలహా ఇచ్చాడు. అలానే నా పేరు Tamannaah అయిందని ఈ బ్యూటీ చెప్పింది. ఈ పేరు మార్పు అనేది తనలో ఓ పాజిటివ్ ఫీలింగ్ తీసుకొచ్చిందని, కెరీర్ పరంగానూ కలిసొచ్చిందని తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇకపోతే తమన్నా.. నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోంది. గత రెండేళ్ల నుంచి వీళ్లిద్దరూ జంటగా చాలాసార్లు కనిపించారు. పెళ్లి గురించి సరిగా క్లారిటీ ఇవ్వడం లేదు గానీ ఈ ఏడాది తమన్నా-విజయ్ ఒక్కటైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇదీ చదవండి: రెండో పెళ్లి.. కళ్యాణ మండపంలోనే ఏడ్చేసిన నటి) -
'విజయ్' సినిమాను ఏకి పారేసిన తమన్నా
చిత్రాల జయాపజయాలను ఎవరు ఊహించలేరు. తమ చిత్రాలు హిట్ అవ్వాలని అందరూ కోరుకుంటారు. అయితే ఫలితం మాత్రం ప్రేక్షకులు ఇచ్చే తీర్పు పైనే ఉంటుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను వారు ఆదరిస్తూనే ఉంటారు. అదేవిధంగా ఒక్కోసారి మంచి కథ అనుకున్న చిత్రాలు కూడా ఆదరణకు దూరం అవుతుంటాయి. కర్ణుడి చావుకు కారణాలు పదివేలు అన్న చందంగా చిత్రాల జయాపజయాలకు కారణాలు చాలానే ఉంటాయి. అలానే నటుడు విజయ్ నటించిన సురా చిత్రం విడుదలై ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇది ఆయన నటించిన 50వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో నటి తమన్నా కథానాయకిగా నటించారు. అందులో విజయ్ సరసన నటించే అవకాశం రావడంతో చంకలు గుద్దుకున్న ఈ బ్యూటీ చిత్రం పరాజయం పొందడంతో చాలా రోజుల తర్వాత దానిపై విమర్శలు గుప్పించారు. అదొక చిత్రమా అంటూ హేళనగా మాట్లాడారు. ఆ చిత్రంలో నటించి తాను పెద్ద తప్పు చేశాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సురా చిత్రం వర్కౌట్ కాదన్న విషయాన్ని తాను ముందే గ్రహించానని చెప్పారు. అయినా అందులో నటించాల్సిన పరిస్థితి అని తమన్నా అన్నారు. దక్షిణాదిలో టాప్ మోస్ట్ హీరోయిన్గా వెలిగిపోయిన తమన్నా ఇక్కడ విజయ్, అజిత్, సూర్య, ధనుష్, కార్తీ వంటి స్టార్ హీరోలతో జత కట్టారు. ఇక ఇటీవల సూపర్స్టార్ రజనీకాంత్తో కలిసి జైలర్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఆమె పాత్ర పరిధి తక్కువే అయినా నువ్వు కావాలయ్యా అన్న ఒక్కపాటతో ఆ చిత్రాన్ని కమ్మేశారు. అయినా ఆ తర్వాత తమన్నాకు ఇక్కడ అవకాశాలు దక్కకపోవడం గమనార్హం. -
టెంపుల్స్ చుట్టూ తిరుగుతున్న తమన్నా
-
పెళ్లికి రెడీ అయిపోయిన తమన్నా.. అందుకే ఇలా కనిపించిందా?
తెలుగు హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నాది ప్రత్యేక స్థానం. ఎందుకంటే చిన్న చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించింది.. తన టాలెంట్తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ బోలెడంత ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం అటు సినిమాలు.. ఇటు ఓటీటీల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు సడన్గా పూర్తి భక్తి మోడ్లో కనిపించింది. దీంతో ఈమె పెళ్లిపై మరోసారి పుకార్లు మొదలయ్యాయి. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్ నన్ను కావాలనే కొట్టింది.. బాడీపై 30 చోట్ల గాయాలు: శ్రద్ధా దాస్) 'హ్యాపీడేస్' సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలందరితోనూ పనిచేసింది. హీరోయిన్ అనే కాకుండా స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. గతేడాది రిలీజైన 'జైలర్'లో ఈమె చేసిన కావాలయ్యా పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంతో పోలిస్తే ఈమెకు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. ఓ తమిళ చిత్రం మాత్రమే చేస్తోంది. మరోవైపు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో చాలాకాలంగా ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఇటీవల ఈమెనే స్వయంగా వెల్లడించింది. అయితే పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం తమన్నా క్లారిటీగా చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం దేవాలయాల సందర్శనలో బిజీగా ఉంది. తాజాగా గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని.. తన తల్లిదండ్రులతో కలిసి సందర్శించింది. అక్కడ స్పెషల్ పూజలు నిర్వహించింది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖమంతా కుంకుమ పూసుకుని పూలమాలతో చేతిలో పూజా సామగ్రితో ఈమె.. తమన్ననేనా అన్నంతగా కనిపించింది. అయితే ఇవన్నీ కూడా పెళ్లి కోసమే చేస్తుందని, త్వరలోనే ఆ శుభవార్త వినిపించనుందని సమాచారం. (ఇదీ చదవండి: పూర్ణతో సంబంధం అంటగడుతున్నారు.. దర్శకుడి ఆవేదన) -
అలాంటి డ్రస్లో విష్ణుప్రియ.. తమన్నాని ఇలా చూస్తే అంతే!
వయ్యారంగా చూస్తూ టెంప్ట్ చేస్తున్న హీరోయిన్ రష్మిక హాట్ లుక్తో పిచ్చెక్కిస్తున్న మిల్కీబ్యూటీ తమన్నా చాలీచాలని డ్రస్లో టెంపరేచర్ పెంచేస్తున్న నిక్కీ తంబోలీ సిల్క్ డ్రస్లో అందంగా మెరిసిపోతున్న యాంకర్ విష్ణుప్రియ బికినీలో బోటుపై కేక పుట్టిస్తున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బ్లాక్ డ్రస్లో జిగేలు మంటున్న 'యానిమల్' బ్యూటీ తృప్తి దిమ్రి చీరలో మహాలక్ష్మిలా అందంగా కనిపిస్తున్న రాశీఖన్నా జీన్స్ ప్యాంట్లో ఉంగరాల జుత్తు చిన్నది.. చూస్తే తట్టుకోలేరు! View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Anukreethy Vas (@anukreethy_vas) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam)
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
భారత్లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement