-
తక్కువ అంచనా వెయ్యొద్దు!
నెగటివ్ క్యారెక్టర్స్లో తనదైన విలనిజాన్ని పండించిన సోనూ సూద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫతే’. ఈ చిత్రానికి సోనూయే దర్శకత్వం వహించడంతో పాటు ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. రచయిత కూడా సోనూనే కావడం విశేషం. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ని ‘వచ్చేస్తున్నా’ అంటూ శనివారం విడుదల చేశారు సోనూ సూద్. సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని టీజర్ స్పష్టం చేస్తోంది. కాగా.. టైటిల్కి ట్యాగ్లైన్గా ‘నెవర్ అండర్ఎస్టిమేట్ ఎ నోబడీ’ అని పెట్టారు. అంటే.. ఎవర్నీ తక్కువ అంచనా వేయొద్దు అని అర్థం. ఈ యాక్షన్ థ్రిల్లర్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్. భారతదేశానికి చెందినవారితో పాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. సైబర్ క్రైమ్లో ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. -
శనివారమే 'నాని' వేట!
‘‘కోపాలు రకరకాలుగా ఉంటాయి.. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కొక్కలా ఉంటుంది.. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే ఎవరినైనా చూశారా.. నేను చూశాను’’ అంటూ నటుడు ఎస్జె సూర్య చెప్పే డైలాగ్స్తో విడుదలైంది ‘సరిపోదా శనివారం’ టీజర్. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ఆగస్ట్ 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. శనివారం (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు సందర్భంగా టీజర్ని విడుదల చేశారు. నాని చేస్తున్న సూర్య పాత్ర ఒకే ఒక్క రోజు (శనివారం) మాత్రమే కోపం చూపిస్తుందని టీజర్ ద్వారా స్పష్టం చేశారు. వారంలో జరిగే ఘటనలను పేపర్ పై రాసుకుని, తనని ఇబ్బందిపెట్టేవారిని శనివారం వేటాడతాడు సూర్య. ఇక నాని హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు దానయ్య తెలిపారు. -
Yatra 2 Teaser: ఆకట్టుకుంటున్న 'యాత్ర 2' టీజర్
‘ఏన్నా.. ఇంత రాత్రి అయినా నిద్ర పోకుండా ఈడ ఏం చేస్తున్నావన్నా’ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రధారి జీవా డైలాగ్తో ‘యాత్ర 2’ టీజర్ విడుదలైంది. ‘యాత్ర’ వంటి హిట్ మూవీకి సీక్వెల్గా మహి వి. రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్తో కలసి శివ మేక నిర్మిస్తున్న ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ని శుక్రవారం రిలీజ్ చేశారు. ‘మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట.. ఆయన కోసం ఎదురు చూస్తున్నానన్నా’ (వైఎస్ఆర్ అభిమాని), ‘కాదన్నా.. మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి మీ ముందు నిల్చున్నా మీకు కనపడదు కదా అన్న’ (జీవా), ‘నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకు కనపడతా కదా అన్న, నాలాంటోళ్లు ఆయన వెనకాల ఉన్నామని తెలియడానికే నేను ఇక్కడున్నానన్నా’ (వైఎస్ఆర్ అభిమాని), ‘నా రాజకీయ ప్రత్యర్థినైనా, శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ, మీ నాయకుడిలాగా వాళ్ల నాశనం కోరుకోనయ్యా’ (వైఎస్ఆర్ పాత్రధారి మమ్ముట్టి) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మహి వి. రాఘవ్. మహేశ్ మంజ్రేకర్, సుజానె బెర్నెర్ట్, కేతకీ నారాయణన్, ‘శుభలేఖ’ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, సంగీతం: సంతోష్ నారాయణన్. -
చిత్రం చూడర...
వరుణ్ సందేశ్, శీతల్ భట్ హీరో హీరోయిన్లుగా, ‘నేనింతే’ ఫేమ్ అదితీ గౌతమ్ ఓ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా ‘చిత్రం చూడర..’. ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మీ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ విడుదల చేశారు. యాక్షన్ అండ్ సస్పెన్స్ అంశాలతో సినిమా కథనం ఉంటుందని టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాకు సంగీతం: రధన్, కెమెరా: జవహర్ రెడ్డి, సహనిర్మాత: ధన తుమ్మల. -
‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’సినిమా టీజర్ ఈవెంట్ (ఫొటోలు)
-
అంబాజీపేట బ్యాండు
సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’. దుశ్యంత్ కటికినేని దర్శకుడు. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్పై నిర్మించారు. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా టీజర్ విడుదలలో దర్శకులు మారుతి, హను రాఘవపూడి, శైలేష్ కొలను, సాయి రాజేశ్, సందీప్ రాజ్, ప్రశాంత్, మెహర్ రమేశ్, భరత్ కమ్మ, నిర్మాతలు ఎస్కేఎన్, శరత్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘నాలాంటి కొత్త డైరెక్టర్కు చాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్, ‘బన్ని’ వాసు, వెంకటేష్ మహాగార్లకు, సుహాస్కి థ్యాంక్స్’’ అన్నారు దుశ్యంత్ కటికినేని. ‘‘నా కెరీర్లో ఈ మూవీ మైలురాయిగా నిలుస్తుంది’’అన్నారు సుహాస్. సినిమాటోగ్రాఫర్ వాజిద్ బేగ్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడారు. -
‘నేనే సరోజ’ విజయం సాధించాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్
శాన్వీ మేఘన, కౌశిక్ బాబు జంటగా శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేనే సరోజ: ఉరఫ్ కారం చాయ్’. గాళ్స్ సేవ్ గాళ్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఎస్ 3 క్రియేషన్స్ పతాకంపై రచయిత డా. సదానంద్ శారద నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేసిన శాసన సభ్యులు ముఠా గోపాల్ మాట్లాడుతూ– ‘‘ఉన్మాదులను ఎదిరించే కాలేజీ విద్యార్థిని పాత్రలో శాన్వీ మేఘన పవర్ఫుల్గా నటించారు.ఓ సామాజిక అంశాన్ని తీసుకుని ఈ తరహా సినిమాను నిర్మించిన దర్శక–నిర్మాతలను అభినందిస్తున్నాను. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ఆడపిల్ల మీద దాడి చేసే ఉన్మాదులకు, వివక్ష చూపించేవారికి తాగిస్తాం కారం చాయ్ అంటూ గుణపాఠం చెప్పేలా సరోజ పాత్ర ఉంటుంది. కుటుంబసమేతంగా చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు శ్రీమాన్ గుమ్మడవెల్లి. ‘‘ఆలోచనాత్మక సంభాషణలు.. శాన్వి వీరోచిత పోరాటాలు, ఆర్. ఎస్. నంద హాస్యం.. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు’’ అన్నారు రచయిత, నిర్మాత సదానంద్ శారద. -
గూఢచారి 111
‘వెన్నెల’ కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ హీరో హీరోయిన్లుగా, మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్న స్పై యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘చారి 111’. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితీ సోనీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమాను ప్రకటించడంతో పాటు, కాన్సెప్ట్ టీజర్ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా టీజీ కీర్తీ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఓ సిటీలో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ కనిపిస్తారు. అలాగే ఆయన పాత్రలో ఓ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం వినోదభరితంగా ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘స్పై జానర్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది. కథలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు అదితీ సోనీ. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్. -
సినిమాలో స్పార్క్ ఉందనిపిస్తోంది – మంత్రి జగదీశ్వర్ రెడ్డి
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఏ సినిమానైనా విమర్శనాత్మక కోణంలో చూసే వ్యక్తిని నేను. ‘స్పార్క్’ టీజర్ప్రారంభం చూడగానే నాకు ‘శివ’ సినిమా గుర్తొచ్చింది. విక్రాంత్లో, ఈ సినిమాలో స్పార్క్ ఉందనిపిస్తోంది. ఈ సినిమా కొత్త ట్రెండ్ని క్రియేట్ చేయడంతో పాటు విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘యూఎస్లో చదువుకుని, అక్కడే జాబ్ చేసినా సినిమాలపై ప్రేమ పెరిగిందే కానీ తగ్గలేదు. ఆ ప్రేమతోనే ‘స్పార్క్’ కథ రెడీ చేసుకున్నాను. నేను ప్రేమతో చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు ప్రేమతో హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు విక్రాంత్. తుంగతుర్తి ఎమ్మేల్యే కిశోర్, రచయిత అనంత శ్రీరామ్, ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ మాట్లాడారు. -
సాఫ్ట్గా ఉండకు.. ఆడుకుంటారు
‘కుర్రాళ్ళంటే ఈ వయసులో ఇలాగే ఉంటార్రా. నువ్వేం కంగారు పడకు’ అనే డైలాగ్తో మొదలైంది ‘రంగబలి’ టీజర్. నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ‘అయ్య బాబోయ్.... రేపట్నుంచి చూత్తారుగా.. మా డెడికేషన్ చూస్తే మీకు జ్వరం వచ్చేస్తది (నాగశౌర్య)’, అయినా.. నువ్వేం అంత సాఫ్ట్గా ఉండకు.... ఆడుకుంటారు (యుక్తి తరేజ)’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రంలో బీ ఫార్మసీ చదివిన యువకుడి ΄ాత్రలో నాగశౌర్య, డాక్టర్ ΄ాత్రలోయుక్తి తరేజ నటించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సత్య, సప్తగిరి, షైన్ టామ్ చాకో కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: పవన్ సీహెచ్. -
'కొట్టర కొట్టు.. బొక్కలు చూర అయ్యేటట్టు..' అదిరిపోయిన టీజర్
‘నీ స్టేటు దాటలేనన్నావ్... దాటా!’, ‘నీ గేటు దాటలేనన్నావ్... దాటా!’, నీ పవర్ దాటలేనన్నావ్...దాటా!’, ‘ఇంకేంటి దాటేది...!’ అనే డైలాగ్స్తో విడుదలైంది రామ్ కొత్త సినిమా టీజర్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పవన్ కుమార్, జీ స్టూడియోస్ సౌత్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. సోమవారం (మే 15) హీరో రామ్ బర్త్ డే సందర్భంగా ‘ఫస్ట్ థండర్’ పేరుతో ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. సదర్ ఉత్సవాల నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్ విజువల్స్లో ‘కొట్టర కొట్టు... నరాలు కట్టు! బొక్కలు చూర అయ్యేటట్టు..’ అనే బ్యాక్గ్రౌండ్ సాంగ్ టీజర్లో వినిపించింది. ‘‘మా హీరో రామ్ మేకోవర్, యాక్టింగ్, బోయపాటి శ్రీనుగారి డైరెక్షన్, తమన్ రీ రికార్డింగ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో టైటిల్, ఇతర వివరాలు వెల్లడిస్తాం. దసరా సందర్భంగా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
అలాంటి సినిమాలంటే చాలా ఇష్టం
‘‘డైరెక్టర్ ఆనంద్, నేను మంచి స్నేహితులం. ‘ఊరు పేరు భైరవకోన’ లాంటి సినిమాని ఆయన నాతో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి ఫాంటసీ, అడ్వెంచర్ సినిమాలంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ–‘‘నా పుట్టినరోజున(ఆదివారం) ఈ మూవీ టీజర్ విడుదల కావడం స్పెషల్ మూమెంట్. తొలిసారి చండీయాగం చేసి టీజర్ రిలీజ్ చేయడం చాలా పాజిటివ్గా ఉంది. అనిల్ సుంకరగారు లేకపోతే ఈ సినిమా ఇక్కడి వరకూ వచ్చేది కాదు’’ అన్నారు. ‘‘టైగర్’ సినిమా నుంచి సందీప్, నాకు స్నేహం మొదలైంది. మరోసారి కలసి సినిమా చేస్తే ఇంకా గ్రాండ్గా ఉండాలని ‘ఊరు పేరు భైరవకోన’ చేశాం’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ఈ సినిమా సందీప్ కెరీర్లో మరచిపోలేని బహుమతి అవుతుందని మాట ఇస్తున్నా’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘మహాచండీ యాగంతో టీజర్లాంచ్ చేయడం ఇండస్ట్రీలో ఇదే తొలిసారి. ఈ ఐడియా ఇచ్చిన సందీప్గారికి థ్యాంక్స్’’ అన్నారు రాజేష్ దండా. హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: రాజ్ తోట. -
"మళ్ళీ పెళ్లి" టీజర్ లో రచ్చ..
-
భారత్లో విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ కారు - ఇదే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ ఈ ఏడాది భారత్లో విడుదల చేయనున్న చిన్న ఎస్యూవీకి ఎక్స్టర్గా నామకరణం చేసింది. ఈ మేరకు టీజర్ను విడుదల చేసింది. జూలైలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఆగస్ట్ నుంచి మార్కెట్లో అడుగు పెట్టనుందని సమాచారం. దక్షిణ కొరియాతోపాటు పలు దేశాల్లో అమ్ముడవుతున్న ఏఐ3 (క్యాస్పర్) మోడల్కు స్వల్ప మార్పులతో ఇక్కడ ప్రవేశపెట్టనున్నారు. ఈ వాహనం భారత్ కోసం తయారు చేస్తున్నారు. భవిష్యత్లో పొరుగున ఉన్న దేశాలకూ ఎగుమతి చేస్తారు. గ్రాండ్ ఐ10 నియోస్ ప్లాట్ఫామ్పై దీనిని అభివృద్ధి చేస్తున్నారు. 1.0 లీటర్ టీ–జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లతో తయారు కానుంది. -
కాలర్ ఎగరేసుకునే సమయం ఇది
సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రంజిత్ జయకొడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మైఖేల్’. దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. నారాయణ్దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను గురువారం విడుదల చేశారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ–‘‘నాకు నేను పెట్టుకున్న అతి పెద్ద పరీక్ష మైఖేల్. మూడుసంవత్సరాల క్రితం ‘మైఖేల్’ వర్క్ను స్టార్ట్ చేశాం. ఈ సినిమా కోసం దాదాపు 24 కేజీల బరువు తగ్గాను. సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు నంబరవన్ అని నంబర్స్ చెబుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునే సమయం ఇది’’ అన్నారు. ‘‘మైఖేల్’ చేసేందుకు ఒప్పుకున్న సందీప్ కిషన్, విజయ్ సేతుపతిలతో పాటు నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు రంజిత్. ‘‘మైఖేల్’ పట్ల హ్యాపీగా ఉన్నాం’’ అన్నారు రామ్మోహన్ రావు, భరత్ చౌదరి. -
పునీత్ రాజ్కుమార్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్.. దేవుడి పాత్రలో..
Lucky Man Teaser Released: కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ (Puneeth Rajkumar) మరణం సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టింది. ఇక ఆయన కుటుంబీకులకు, అభిమానులకు ఎనలేని శోకాన్ని మిగిల్చింది. ఇప్పటికీ ఆయన్ను తలచుకోని అభిమాని లేడు. తన ప్రియతమ హీరోను వెండితెరపై చూడలేమన్న నిజాన్ని తట్టుకోలేకపోయారు. అయితే పునీత్ రాజ్కుమార్ మరణం కన్నా ముందు కమిట్ అయి, చిత్రీకరించిన సినిమాలు ఉన్నాయి. వాటిలో 2022, మార్చి 17న విడుదలైన 'జేమ్స్' ప్రేక్షకులను అలరించింది. పునీత్ రాజ్కుమార్ను వెండితెరపై చూసుకున్న అభిమానులు కంటతడిపెట్టారు. తర్వాత ఆయన్ను మళ్లీ చూస్తామో లేదో అని కుమిలిపోయారు. అయితే పునీత్ రాజ్కుమార్ అభిమానులకు త్వరలోనే సర్ప్రైజ్ దక్కనుంది. మరోసారి పునీత్ రాజ్కుమార్ను వెండితెరపై చూసే అదృష్టం కలగనుంది. పునీత్ మరణం కంటే ముందు ఆయన ఒప్పుకుని, నటించిన చిత్రాల్లో 'జేమ్స్'తోపాటు 'లక్కీ మ్యాన్' కూడా ఉంది. పునీత్ రాజ్కుమార్ గెస్ట్ రోల్ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది చిత్రబృందం. రొమాంటిక్ కామెడిగా తెరకెక్కిన ఈ చిత్రంలో పునీత్ రాజ్ కుమార్ భగవంతుడి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పునీత్ రాజ్కుమార్ చేసే డ్యాన్స్ ఫ్యాన్స్తో పాటు ఆడియెన్స్ను ఆకట్టుకునేలా ఉంది. నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డార్లింగ్ కృష్ణ, సంగీత శృంగేరి, రోషిణి ప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటించారు. చదవండి: పరువు పోయింది, చనిపోవాలనుకున్నా: సింగర్ కల్పన లెక్క తప్పిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు -
'మనసు తప్ప ఏదైనా వెతికి పెడతా' అంటున్న షణ్ముఖ్ జశ్వంత్..
Shanmukh Jaswanth Agent Anand Santosh Teaser: యూట్యూబ్ స్టార్గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్ బిగ్బాస్ ఎంట్రీతో మరింత పాపులర్ అయ్యాడు. తనదైన ఆట తీరుతో బిగ్బాస్ ఐదో సీజన్లో చివరకు నిలిచి, రన్నరఫ్గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అనేకమంది అభిమానులకు కూడా సంపాదించుకున్నాడు. అయితే అదే సమయంలో ఇదే షో.. తన ప్రేయసితో విడిపోవడానికి కారణమైంది. ఇదిలా ఉంటే బిగ్బాస్, బ్రేకప్ తర్వాత తన కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టాడు షణ్ముఖ్ జశ్వంత్. ఈ క్రమంలోనే 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' సిరీస్ చేస్తున్నట్లు ఇది వరకు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ను డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. 'ఇంతకీ నువ్ ఏం చేస్తుంటావ్ ? నెలకు నీ జీతం ఎంత వస్తుంటుంది ? అసలు ఎంత ఖర్చవుతుంది ? ఎంత మిగులుతుంది ?' అంటూ షణ్ముఖ్ను ప్రశ్నలు అడగడంతో ప్రారంభమవుతుంది ఈ టీజర్. ఈ ప్రశ్నలకు నేను ఒక డిటెక్టివ్ ఏజెంట్ను సర్ అని షణ్ముఖ్ ఇచ్చే సమాధానం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వెబ్ సిరీస్పై ఆసక్తి కలిగించారు. ఇందులో షణ్ముఖ్ జశ్వంత్ స్టైలిష్గా కనిపించాడు. 'మనసు తప్ప.. ఫిజికల్గా, లిక్విడ్గా ఏదైనా వెతికి పెడతా' అని చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సిరీస్కు అరుణ్ పవర్ దర్శకత్వం వహించగా, సుబ్బు స్క్రిప్ట్ అందించారు. ఈ వెబ్ సిరీస్ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల కానుంది. చదవండి: నితిన్కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ ధనుష్ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్ దర్శకులు.. నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ -
ఒక్కరి మనసునైనా దొంగలించామా మామ.. ఆసక్తిగా టీజర్
Kiran Abbavaram Nenu Miku Kavalsinavadini Teaser: వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ జోష్లో ఉన్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ హీరో ఇటీవలే 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో కొత్త సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. శ్రీధర్ గాదే దర్శకత్వంలో యూత్ఫుల్, ఫ్యామిలీ కథాంశంతో రెడీ అవుతోన్న సినిమా 'నేను మీకు కావాల్సిన వాడిని'. ఈ సినిమాలో సోనూ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం. 'డ్రైవర్వి డ్రైవర్లా ఉండూ' అనే డైలాగ్తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. 'పదిసార్లు ప్రేమలో ఓడిపోయినా సరే.. సిగ్గు లేకుండా పదకొండోసారి ప్రేమకోసం పరితపించే ప్రేమికుల మధ్య బతుకుతున్నాం' అంటూ కిరణ్ అబ్బవరం చెప్పే డైలాగ్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ మూవీలో ప్రముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మాస్టర్, కిరణ్ అబ్బవరం మధ్య వచ్చే సీన్లు నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు కిరణ్ అబ్బవరమే స్క్రీన్ప్లే, సంభాషణలు అందించడం విశేషం. -
రణ్బీర్ వీరోచిత పోరాటం.. ఆసక్తిగా 'షంషేరా' టీజర్
Shamshera Teaser: Ranbir Kapoor Battle With Sanjay Dutt For His Tribe: బాలీవుడ్ లవర్ బాయ్ తన ప్రియసఖి, క్యూటీ అలియా భట్ను వివాహం చేసుకుని పెళ్లిపుస్తకం తెరిచాడు. ఇక తన సినీ కెరీర్పై ఫోకస్ పెట్టాడు రణ్బీర్. ఇటీవల 'బ్రహ్మాస్త్ర' సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకోగా మరో సినిమాకు సంబంధించిన అప్డేట్ ఆసక్తికరంగా ఉంది. యశ్రాజ్ ఫిల్మ్స్ పతాకంపై రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం 'షంషేరా'. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే నెట్టింట వైరల్ అయి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ను బుధవారం (జూన్ 22) విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్ చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్ సీక్వెన్స్తో ఆద్యంతం ఆసక్తిగా ఉంది. పోరాట యోధుడిగా, ఆపదల్లో చిక్కుకున్న తన వర్గాన్ని కాపాడుకునే వీరుడిగా రణ్బీర్ యాక్టింగ్, రగ్గ్డ్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీలో సంజయ్ దత్ విలన్గా అలరించనున్నాడు. జులై 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ట్రైలర్ను శుక్రవారం (జూన్ 24) రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అలాగే ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. 'ఐ లవ్ యూ సాన్' అంటూ సూసైడ్ నోట్ -
రానున్న 'కాఫీ విత్ కరణ్' షో 7వ సీజన్.. టీజర్ రిలీజ్
Karan Johar Announces Koffee With Karan Show 7 Season Teaser: అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఇటీవల ఈ షోను ఇక కొనసాగించనని కరణ్ జోహార్ ప్రకటించి అభిమానులను షాక్గు గురిచేశాడు. కానీ తాజాగా ఆదివారం (జూన్ 19) ఈ షో 7వ సీజన్ను టెలీకాస్ట్ చేస్తున్నట్లు ఓ వీడియో విడుదల చేసి ఆశ్చర్యపరిచాడు కరణ్ జోహార్. ఈ వీడియోలో రణ్బీర్ కపూర్, రణ్వీర్ సింగ్, సైఫ్ అలీ ఖానా, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్ తదితరులు ఉన్నారు. అలాగే ఈ టీజర్లో 'ఇప్పుడు రాబోయే సీజన్ మరింత పెద్దది, మెరుగైనది, ఇంకా మరింత అందమైనది' అని కరణ్ జోహార్ ఉత్సాహంగా చెప్పడం మనం చూడొచ్చు. కాపీ విత్ కరణ్ సీజన్ 7 ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో జులై 7 నుంచి ప్రసారం కానుంది. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
పాయల్తో ఆది సాయి కుమార్ రొమాన్స్.. ఆసక్తిగా 'తీస్ మార్ ఖాన్' టీజర్
Aadi Sai Kumar Tees Maar Khan Teaser Released: 'ప్రేమ కావాలి' సినిమాతో హీరోగా పరిచయమైన ఆది సాయి కుమార్ లవ్లీ, సుకుమారుడు వంటి చిత్రాలతో అలరించాడు. ఇటీవల 'బ్లాక్' మూవీతో సందడి చేసిన ఆది సాయి కుమార్ అంతగా మెప్పించలేకపోయాడు. అయితే జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలతో ముందుకు పోతున్నాడు ఆది. ప్రస్తుతం ఆది సాయి కుమార్ చేతిలో తీస్ మార్ ఖాన్, టాప్ గేర్, క్రేజీ ఫెలో తదితర చిత్రాలు ఉన్నాయి. తాజాగా 'తీస్ మార్ ఖాన్' మూవీ టీజర్ రిలీజ్ అయింది. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో ఆది తీస్ మార్ ఖాన్ అనే పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నాడు. 'రాక్షసుడికి రక్షకుడంటే ఏంటో చూపించాలి' అంటూ డైలాగ్తో వచ్చే ఆది ఎంట్రీ బాగుంది. ఇందులో అనూప్ సింగ్ ఠాకూర్ విలన్గా అలరించనున్నాడు. విజన్ సినిమాస్ బ్యానర్పై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు 'నాటకం' ఫేమ్ కల్యాణ్ జి గొగణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటిస్తోంది. సునీల్, పూర్ణ, కబీర్ సింగ్ కీలక పాత్రు పోషిస్తున్నారు. చదవండి: ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ సైలెంట్గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. -
లావణ్య త్రిపాఠీ 'హ్యాపీ బర్త్డే'.. ఇంటింటికీ గన్ను, ఎదురు లేని ఫన్ను..
'అందాల రాక్షసి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠీ. గతేడాది 'చావు కబురు చల్లగా' సినిమాతో అలరించిన లావణ్య ప్రస్తుతం 'హ్యాపీ బర్త్డే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మత్తు వదలరా ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ బ్లాక్ కామెడీ థ్రిల్లర్గా అలరించనుంది. ఇందులో నరేశ్ అగస్త్య హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ ఆద్యంతం ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఉంది. ఇంటింటికి గన్ను.. ఎదురులేని ఫన్ను.. వంటి పలు డైలాగ్లు నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మూవీ జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై చెర్రీ, హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మించారు. చదవండి: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్.. ఒక్క ఏడాదిలో ఏకంగా 20 సినిమాలు ఒప్పుకున్న స్టార్ హీరో ! -
O2 Teaser: ఇంకో 12 గంటల వరకు బతికి ఉండవచ్చు..
Nayanatara O2 Movie Teaser Released Will Stream On Disney Plus Hotstar: స్టార్ హీరోయిన్ నయన తార గ్యాప్ లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తోంది. అనామిక, కర్తవ్యం వంటి హీరోయిన్ సింట్రిక్ పాత్రల్లో మెప్పించిన నయన్ ఇటీవల 'కణ్మనీ రాంబో ఖతీజా' మూవీతో ప్రేక్షకులను నవ్వించింది. తాజాగా 'ఓ2' (O2) సినిమాతో ఆడియెన్స్ను థ్రిల్కు గురి చేయనుంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్ను మంగళవారం (మే 17) విడుదల చేశారు. నయనతార, ఇతర ప్రయాణికులు కలిసి కొచ్చిన్కు వెళ్తున్న బస్సు లోయలో పడిపోతుంది. అందులో ఉన్న ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏం చేశారనేదే సినిమా కథగా తెలుస్తోంది. అయితే ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించని ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా, జీఎస్ వెంకటేశ్ దర్శకత్వం వహించారు. కాగా నయనతార ప్రస్తుతం చిరంజీవి 'గాడ్ ఫాదర్', 'గోల్డ్' తదితర చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్ సంచలన వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్ సినిమా.. ఎప్పుడు ? ఎక్కడంటే ?
Keerthy Suresh Selva Raghavan Chinni Movie Release Date: 'ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏంటీ ? ఎవరైనా మన మీద రాయి విసిరితే.. తిరిగి మనమూ విసరాలి. మనమీద ఉమ్మేస్తే.. మనమూ ఉమ్మేయ్యాలి. మనల్ని కొడితే మనమూ కొట్టాలి' అని ఆవేశంగా అంటోంది కీర్తి సురేష్. 'మహానటి' కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తుంది. 'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్కు ఏ మూవీ అంతగా సక్సెస్ను ఇవ్వలేదు. ఇప్పుడు తన తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది కీర్తి సురేష్. 'సర్కారు వారి పాట' చిత్రం మే 12న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందే కీర్తి సురేష్ మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడదల కానుంది. కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం 'సాని కాయిదమ్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'చిన్ని' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మే 6న 'చిన్ని' మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ శుక్రవారం (ఏప్రిల్ 22) విడుదల చేశారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్తోపాటు ధనుష్ అన్న, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పగ, ప్రతీకారం నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. టీజర్లో కీర్తి సురేష్ ఎమోషనల్గా చెప్పిన డైలాగ్లు ఆకట్టుకుంటున్నాయి. చదవండి: ఆ పాట ఓ ప్రయోగంలా అనిపించింది: కీర్తి సురేష్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'లేడీ థోర్' వచ్చేసింది.. ఆసక్తిగా 'థోర్: లవ్ అండ్ థండర్' టీజర్
Chris HemsworthThor Love And Thunder Teaser Released: మార్వెల్ సినిమాటిక్ యూనివర్సిటీ (ఎమ్సీయూ) నుంచి వచ్చిన చిత్రాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. మార్వెల్ నుంచి వచ్చిన సినిమాల కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఆ ఎదురుచూపులను పటాపంచలు చేస్తూ క్రిస్ హేమ్స్వర్త్ నటించిన 'థోర్: లవ్ అండ్ థండర్' సినిమా అప్డేట్ను ఇచ్చారు. ఈ సినిమా టీజర్ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్ను ప్రకటించారు. థోర్ సిరీస్లో నాలుగో చిత్రంగా ఈ మూవీ రానుంది. టీజర్ విడుదల చేసి మూవీ ప్రియులకు మరింత ఆసక్తిని పెంచారు. ఈ చిత్రానికి అంతకుముందు వచ్చిన 'థోర్: రాగ్నరోక్' డైరెక్టర్, ఆస్కార్ విజేత తైకా వైటిటి దర్శకత్వ వహించారు. ఈ మూవీ కథ 'ది అవేంజర్స్: ఎండ్గేమ్' తర్వాత నుంచి కొనసాగడం టీజర్లో చూపించారు. థోర్ (క్రిస్ హేమ్స్వర్త్) గార్డియన్స్ అయిన పీటర్ క్విల్ (క్రిస్ ప్రాట్), అతని బృందంతో నివసిస్తుంటాడు. గాడ్ ఆఫ్ థండర్ కవచాన్ని వదిలేసి మళ్లీ ఎప్పటిలా తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. తర్వాత థోర్ ఎప్పుడూ ఎదుర్కోలేని సంఘటనలు ఫేస్ చేసినట్లు చూపించారు. అలాగే ఇందులో థోర్ మాజీ ప్రేయసీ జేన్ ఫోస్టర్ (నటాలీ పోర్ట్మన్) లేడీ థోర్గా అలరించనుంది. ఇందులో 'ది డార్క్ నైట్' హీరో క్రిస్టియన్ బాలే కూడా ఉండటం విశేషం. టీజర్లో మూవీకి సంబంధించిన క్లూలను వదిలి చిత్రంపై అనేక అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ మూవీ ఇండియాలో జూలై 8న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కుప్పంలో విజయం నాదే
ఓటు హక్కు వినియోగించుకున్నతర్వాత సీఎం జగన్ రియాక్షన్
అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్
గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
ఓటేసిన సీఎం జగన్
'ఆమె ధర్మపత్ని'! గృహస్థాశ్రమ వైశిష్ట్యం!!
పోలింగ్ ప్రారంభం.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు..
నాలుగో దశ ఎలక్షన్స్.. ఆసక్తికర విషయాలు
మన లక్ష్యం ఏమిటి? అందుకు చేయవలసిన పనేమిటి?
తప్పక చదవండి
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- ఈసీ ద్వంద్వ వైఖరి
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement