-
శబరి: తల్లి ప్రేమను గుర్తుచేసే సాంగ్ రిలీజ్
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'అనగనగా ఒక కథలా ఓ చందమామా.. కడవరకు కరగదులే ఈ అమ్మ ప్రేమ' పాటను ఆస్కార్ విన్నర్, గేయరచయిత చంద్రబోస్ విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ సతీమణి సుచిత్ర నృత్య రీతులు సమకూర్చారు. సాంగ్ చాలా ప్రత్యేకంగా..పాటను విడుదల చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ... 'గోపీసుందర్ గారి సంగీతంలో రెహమాన్ గారు రాశారు. ఈ పాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ సాంగ్ విడుదల కంటే ముందు నేను విన్నాను. నా భార్య సుచిత్ర కొరియోగ్రఫీ చేయడం కోసం ఇంటికి సాంగ్ తీసుకు వచ్చింది. సాంగ్ విని సాహిత్యం చదువుతానని తీసుకున్నా. చదువుతుంటే నాకు చాలా సంతోషం కలిగింది. ఈ పాట తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. చిత్ర గారు ఈ పాటకు తన గాత్రంతో జీవం పోశారు'' అని చెప్పారు. చదవండి: లావైపోయా.. సడన్గా అన్నీ మారిపోయాయి.. బాధేసింది! -
త్వరలో వరలక్ష్మి పెళ్లి.. విశాల్ రియాక్షన్ ఇదే!
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లికూతురిగా ముస్తాబు కానుంది. ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. తన పెళ్లి తనకే సర్ప్రైజింగ్గా ఉందని.. ఏదేమైనా ఈ ఏడాదిలోనే మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పింది. తాజాగా దీనిపై హీరో విశాల్ స్పందించాడు. వరలక్ష్మి పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. సినిమాల్లో తనను తాను నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడింది. సంతోషంగా ఉంది అలాంటిది తను అనుకున్నది సాధించి తెలుగు చిత్రపరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. తను ఎంతో మంచి వ్యక్తి.. ఆమె తల్లిని నేను కూడా అమ్మ అనే పిలుస్తాను. పర్సనల్ లైఫ్లో సెటిలవుతున్న వరలక్ష్మికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నాడు. కాగా గతంలో వరలక్ష్మి, విశాల్ ప్రేమించుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఓ కార్యక్రమంలో లక్ష్మీకరమైన అమ్మాయితో ఏడడుగులు వేస్తానన్నారు. స్నేహితులమే.. దీంతో అతడు వరలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం ఊపందుకుంది. కానీ తమ మధ్య స్నేహం తప్ప ప్రేమకు చోటు లేదని విశాల్ క్లారిటీ ఇచ్చాడు. ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండే విశాల్ - వరలక్ష్మి 2019లో నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శత్రువులుగా మారిపోయారు. తన తండ్రి శరత్ కుమార్ గురించి విశాల్ అడ్డగోలుగా మాట్లాడాడని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది. ఆ సమయంలో విడిపోయిన వీరిద్దరూ ఇప్పుడు మళ్లీ ఫ్రెండ్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది. చదవండి: హీరోయిన్ చెల్లితో భర్త ఎఫైర్.. ఒక్క దెబ్బతో పక్షవాతం.. చివరికి..! -
వరలక్ష్మి అమ్మ కాలేకపోయింది ఎందుకు?
తమిళసినిమా: దక్షిణాదిలో సంచలన నటిగా ముద్రవేసుకున్న వరలక్ష్మీ శరత్కుమార్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి పాత్రనైనా, ఏ భాషలోనైనా నటించి సత్తా చాటగలిగిన నటి ఈ భామ. నటుడు శరత్కుమార్ వారసురాలైన వరలక్ష్మి నిజానికి 18 ఏళ్ల వయసులోనే కథానాయకిగా సినీ రంగప్రవేశం చేయాల్సిందట. ఈ సమయంలో శంకర్ దర్శకత్వంలో బాయ్స్, కాదల్ చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశాలు రాగా చాలా చిన్న వయసు ఇప్పుడే సినిమాలు వద్దు అని తండ్రి శరత్కుమార్ హితబోధ చేశారట. దీని గురించి వరలక్ష్మీ శరత్కుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 2012లో ధనుష్ హీరో నటించిన పోడాపోడీ చిత్రం ద్వారా ఈమె కథానాయకిగా తెరంగేట్రం చేశారు. ఆ విధంగా నటిగా పుష్కరకాలం పూర్తి చేసుకున్నారు. విగ్నేష్ శివన్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం కమర్షియల్గా ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో వరలక్ష్మికి వెంటనే అవకాశాలు రాలేదు. దీంతో తెలుగు, కన్నడం భాషల్లో దృష్టి సారించి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నటిగా నిరూపించుకున్నారు. ఆ తరువాత బాలా దర్శకత్వంలో తారై తప్పట్టై చిత్రంలో నాయకిగా నటించే అవకాశం రావడం, ఆ చిత్రంలో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అయినప్పుటికీ కథానాయకిగానే నటించకుండా, ప్రతినాయకి పాత్రల్లోనూ నటిస్తూ విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఈమెకు ఇప్పుడు 38 ఏళ్లు. గత నెలలోనే వివాహ నిశ్చితార్థం జరిగింది. ముంబైకి చెందిన నిక్కోలాయ్ సచ్దేవ్తో పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ముంబైలో ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్న ఈయనకిది రెండో పెళ్లి. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. విశేషం ఏమిటంటే ఈయన వరలక్ష్మీ శరత్కుమార్కు 14 ఏళ్లుగా స్నేహితుడట. వరలక్ష్మి ఇంటర్వ్యూ పేర్కొంటూ తన సినిమా, వ్యక్తిగత జీవితం గానీ చేసుకున్న ప్లాన్ ప్రకారం జరగలేదని చెప్పారు. తాను పోడాపోడీ చిత్రంలో నటించినప్పుడు తన వయసు 22 ఏళ్లు అని, ఎలాగైనా 28 ఏళ్లలోపు స్టార్ నటిగా ఎదగాలని భావించానన్నారు. అదేవిధంగా 32 ఏళ్లలో పెళ్లి చేసుకుని 34 ఏళ్లలో పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకున్నానని, అయితే తన వయసు ఇప్పుడు 38 ఏళ్లు అని పేర్కొన్నారు. అలా తన సినీ, వ్యక్తిగత జీవితాల్లో వేసుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదని అన్నారు. పోడాపోడీ చిత్రం తరువాత పర్సనల్ జీవితంపై ఎక్కువగా దృష్టి పెట్టానని, అదే తాను చేసిన పెద్ద తప్పు అని పేర్కొన్నారు. అందువల్ల తన సినీ జీవితం బాధించిందన్నారు. అప్పుడే తాను సినిమాలపై దృష్టి సారించి ఉంటే ఎక్కువ చిత్రాలు చేసి ఉండేదానినని అన్నారు. అయితే అపజయాలే తనను దృఢపరిచాయని వరలక్ష్మీ శరత్కుమార్ పేర్కొన్నారు. -
జైలుకు వెళ్లనున్న హనుమాన్ నటి? స్పందించిన వరలక్ష్మి
టాలీవుడ్లో లేడీ విలన్గా పేరు తెచ్చుకుంది నటి వరలక్ష్మి శరత్కుమార్. ఇటీవలే ఆమె పెళ్లికి సిద్ధమైంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నికోలై సచ్దేవ్తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. త్వరలోనే అతడితో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఇకపోతే గతేడాది డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్కుమార్ పేరు మార్మోగిపోయింది. ఆమె దగ్గర ఫ్రీలాన్స్ మేనేజర్గా పని చేసిన ఆదిలింగం డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. దీంతో ఆమెకు కూడా ఏమైనా సంబంధాలున్నాయేమోనని ఎవరికి వారు అనుమానించారు. ఇష్టారీతిన తప్పుడు ప్రచారం తాజాగా ఈ డ్రగ్స్ కేసులో వరలక్ష్మికి సమన్లు అందాయని, ఆమెను విచారణకు హాజరవాలని అధికారులు ఆదేశించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. కొందరైతే ఏకంగా ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారంటూ ఇష్టారీతిన ప్రచారం చేస్తున్నారు. దీంతో సదరు వార్తలపై ఘాటుగా స్పందించింది నటి. ఇన్స్టాగ్రామ్ వేదికగా తప్పుడు ప్రచారంపై మండిపడింది. 'ఈ మీడియాకు నేను తప్ప ఎవరూ దొరకడం లేదేమో.. మళ్లీ పాత ఫేక్ న్యూస్నే ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా అసలైన జరల్నిజం అంటే ఏంటో తెలుసుకోండి. బయట ఇంకా చాలా సమస్యలున్నాయ్ సెలబ్రిటీలుగా మేము నటిస్తాం, నవ్విస్తాం.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాం.. మాలో లొసుగులు వెతకడం మానేసి మీ పని మీరు సరిగా చేయండి.. లోకంలో ఇంకా చాలా పెద్ద సమస్యలున్నాయి. వాటిపైన ఫోకస్ చేయండి. మా నిశ్శబ్ధాన్ని వీక్నెస్గా చూడకండి. మీకు తెలీదేమో.. పరువునష్టం దావా అనేది కూడా ఈ మధ్య ట్రెండ్ అవుతోంది. కాబట్టి అసత్య ప్రచారాలు, అబద్ధపు రాతలు మానేసి నిజమైన జర్నలిజాన్ని బయటకు తీయండి' అని చురకలంటించింది. It’s so sad that our talented media has no news than to start circulating old #fakenews. Our dear journalists especially the self proclaimed news sites and your articles, why don’t you actually start doing some real journalism! Stop finding flaws with your celebtrities, we are… — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) March 14, 2024 చదవండి: శ్రీకాంత్ మేనకోడలితో లవ్.. డైరెక్ట్గా అడగలేక ఆ నటుడితో రాయబారం.. -
లేడీ విలన్ వరలక్ష్మీ శరత్ కుమార్ బర్త్ డే (ఫొటోలు)
-
హనుమాన్ నా బాధ్యత పెంచింది
‘‘హనుమాన్’ సినిమా విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ అందరి రుణం ‘జై హనుమాన్’ సినిమాతో తీర్చుకోబోతున్నాను. ‘హనుమాన్’కి వంద రెట్లు ఎక్కువగా ‘జై హనుమాన్’ ఉంటుంది’’ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకుడు. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలైంది. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ–‘‘హనుమాన్’కి వచ్చిన స్పందన చూసిన తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది నాపై ఇంకా బాధ్యత పెంచింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కి వచ్చే చిత్రాలను బాధ్యతగా తీస్తాను’’ అన్నారు. ‘‘మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు పాదాభివందనం’’ అన్నారు తేజ. ‘‘హనుమాన్’ని హిట్ చేసిన ఆడియన్స్కి థ్యాంక్స్’’ అన్నారు నిరంజన్ రెడ్డి. -
Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ
టైటిల్: హను-మాన్ నటీనటులు: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు నిర్మాణ సంస్థ: ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాత: కె.నిరంజన్ రెడ్డి దర్శకత్వం: ప్రశాంత్ వర్మ సంగీతం: గౌరహరి,అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర ఎడిటర్: ఎస్.బి. రాజు తలారి విడుదల తేది: జనవరి 12, 2024 ఈ సంక్రాంతి బరిలో మూడు బడా హీరోల సినిమాలు ఉన్నాయి. వాటికి పోటీగా అన్నట్లు ‘హను-మాన్’ దిగాడు. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రచార చిత్రాలు విడుదలయ్యాక ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి చర్చించుకున్నారు. ఇక ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘హను-మాన్’పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( జనవరి 12) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా అంజనాద్రి అనే ఫిక్షనల్ విలేజ్ చుట్టూ తిరుగుతుంది. అడవి ప్రాంతంలో ఉండే ఆ ఊర్లో అంజనమ్మ(వరలక్ష్మీ శరత్ కుమార్), తన సోదరుడు హనుమంతు(తేజ సజ్జ)తో కలిసి నివాసం ఉంటుంది. హనుమంతు ఓ చిల్లర దొంగ.ఊర్లో చిన్న చిన్న వస్తువులను దొంగలిస్తూ చిల్లరగా తిరుగుతుంటారు. ఆ ఊరి బడి పంతులు మనవరాలు మీనాక్షి(అమృత అయ్యర్) అంటే హనుమంతుకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓ రోజు బందిపోట్లు మీనాక్షిపై దాడి చేసేందుకు యత్నించగా.. హనుమంతు ఆమెను రక్షించబోయి జలపాతంలో పడిపోతాడు. అక్కడ హనుమంతుడి రక్త ధారతో ఏర్పడి రుధిర మణి హనుమంతుని చేతికి చిక్కుతుంది. అప్పటి నుంచి అతనికి సూపర్ పవర్స్ వస్తాయి. ఇదిలా ఉంటే.. చిన్నప్పటి నుంచి సూపర్ హీరో కావాలని కలలు కంటున్న మైఖేల్(వినయ్ రాయ్)..ఆ శక్తుల కోసం సొంత తల్లిదండ్రులను చంపేస్తాడు. ప్రపంచంలో తనకు మాత్రమే సూపర్ పవర్స్ ఉండాలని, ఆ దిశగా ప్రయోగాలు సైతం చేయిస్తుంటాడు. ఈ క్రమంలో హనుమంతుకి వచ్చిన శక్తుల గురించి తెలుస్తుంది. దీంతో మైఖేల్ తన అనుచరులతో అంజనాద్రి గ్రామానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? హనుమంతుకి ఉన్న శక్తులను సొంతం చేసుకునేందుకు మైఖేల్ పన్నిన పన్నాగం ఏంటి? అసలు ఆ శక్తులు హనుమంతుకు మాత్రమే ఎందుకు వచ్చాయి? హనుమంతుకి ఆపద వచ్చినప్పుడలా రక్షిస్తున్న స్వామిజీ(సముద్రఖని) ఎవరు? ఎందుకు రక్షిస్తున్నాడు? హనుమంతుకి ఉన్న శక్తులు ఉదయం పూట మాత్రమే ఎందుకు పని చేస్తాయి? అంజనాద్రిని కాపాడుకోవడం కోసం హనుమంతు ఏం చేశాడు? అసలు మీనాక్షి-హనుమంతుల ప్రేమ సంగతి ఏమైంది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హీరోకి సూపర్ పవర్స్ రావడం.. ఆ శక్తిని మంచి కోసం ఉపయోగించడం.. విలన్ దాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నించడం.. హీరో అతని ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ఆ శక్తిని లోక కల్యాణం కోసం వాడడం.. ఈ తరహా కాన్సెప్ట్తో హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ లాంటి సూపర్ హీరోలు అందరికి పరిచయమే. అయితే ఈ కథలన్నింటికి మూలం మన పురాణాలే. మన ఇండియాకు ఆంజనేయ స్వామిజీనే ఓ సూపర్ మ్యాన్ అని పురాణాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ హను-మాన్ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏది లేదు. ఈ తరహా కాన్సెప్ట్తో తెలుగులోనూ సినిమాలు వచ్చాయి కానీ.. నేటివిటీ కామెడీని టచ్ చేస్తూ.. తనదైన స్క్రీన్ప్లేతో మాయ చేశాడు ప్రశాంత్ వర్మ. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ తెలుగు నేటివిటీ మిస్ అవ్వకుండా కామెడీతో పాటు క్యూరియాసిటీని చివరి వరకు కంటిన్యూ చేశాడు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కథను తీర్చి దిద్దాడు. కేవలం సూపర్ పవర్స్ కాన్సెప్ట్నే కాకుండా సిస్టర్ సెంటిమెంట్, ప్రేమ కథను కూడా ఇందులో జోడించాడు. అయితే అంతగా ఆకట్టుకోలేదు. అలా అని అనవసరంగా జోడించినట్లు కూడా లేవు. కథ రొటీన్గా సాగుతుందనే ఫీలింగ్ కలిగేలోపు ఆంజనేయ స్వామి తాలుకు కథను తీసుకురావడం..గూస్బంప్స్ తెప్పించే సీన్స్ పెట్టడంతో చూస్తుండగానే సినిమా అయిందనే భావన కలుగుతుంది. హను-మాన్ కథ ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. విలన్ ఎందుకు సూపర్ పవర్స్ కావాలనుకునేది ప్రారంభ సన్నివేశాల్లోనే చూపించాడు. ఆ తర్వాత కథంతా అంజనాద్రి చుట్టూ తిరుగుతుంది. కోతికి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం..హీరో గురించి ఆ కోతి చెప్పే మాటలు నవ్వులు పూయిస్తాయి. హీరో హీరోయిన్ల లవ్స్టోరీ రొటీన్గా ఉంటుంది. హీరోకి ఎప్పుడైన సూపర్ పవర్స్ వస్తాయో అప్పటి నుంచి కథనం ఆసక్తిరంగా సాగుతుంది. రాకేష్ మాస్టర్ గ్యాంగ్తో హీరో చేసే ఫైట్ సీన్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మరోవైపు సత్య, గెటప్ శ్రీను కామెడీ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్లో కథ సింపుల్గా, ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలోనే అసలు కథంతా ఉంటుంది. సూపర్ పవర్స్ కోసం విలన్ ప్రయత్నించడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయి. హీరోకి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ కూడా విజుల్స్ వేయిస్తాయి. ఓ సందర్భంలో పెద్ద బండరాయిని కూడా ఎత్తేస్తాడు. అయినా కూడా అది అతిగా అనిపించడు. మరో యాక్షన్ సీన్లో చెట్టు వేర్లతో హెలికాప్టర్ని ఆపేస్తాడు..అయినా కన్విన్సింగ్గానే అనిపిస్తుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. విఎఫెక్స్ అద్భుతంగా ఉన్నాయి. చిన్న చిన్న లోపాలు ఉన్నా ఇంత తక్కువ బడ్జెట్(రూ. 25 కోట్లు అని సమాచారం)లో ఇలాంటి సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మను నిజంగా అభినందించాల్సిందే. రాముడికి ఆంజనేయ స్వామి ఇచ్చిన మాట ఏంటి ? అనే ఆసక్తికర ప్రశ్నతో సీక్వెల్ని ప్రకటించాడు. మరి ఆంజనేయ స్వామి ఇచ్చిన హామీ ఏంటి అనేది 2025లొ విడుదలయ్యే ‘జై హను-మాన్’లో చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. తేజ సజ్జకు నటన కొత్తేమి కాదు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించి, తనదైన నటనతో మెప్పించాడు. హీరోగాను మంచి మార్కులే సాధించాడు. ఇక హనుమాన్ కోసం మరింత కష్టపడినట్లు తెలుస్తోంది. కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. కామెడీ, ఎమోషన్తో పాటు యాక్షన్ సీన్స్ని కూడా ఇరగదీశాడు. కావాల్సిన చోట మాత్రమే హీరోయిజాన్ని చూపించాడు. సాధారణ మనిషిగా.. సూపర్ పవర్స్ ఉన్న హను-మాన్గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన తేజ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్్ చూపించి ఆకట్టుకున్నాడు. హీరో సోదరి అంజనమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు కూడా ఇందులో ఓ యాక్షన్స్ సీన్ ఉంది. అమృత అయ్యర్ తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్రఖని పోషించిన పాత్రలోని సస్పెన్స్ని తెరపై చూడాల్సిందే. వినయ్ రాయ్ స్టైలీష్ విలన్గా మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. తనదైన బీజీఎంతో గౌరహరి సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ని చాలా రిచ్గా తెరకెక్కించాడు. వీఎఫెక్స్ వర్క్ అబ్బురపరిచేలా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
రాజకీయాలతో సంబంధం లేదు
‘‘ప్రస్తుత రాజకీయాలకు, ‘కోటబొమ్మాళి పీఎస్’ సినిమా కథకు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఈ మూవీలో ఎన్నికల గురించి, ఓటు విలువ గురించి చర్చించాం. వ్యవస్థ, మనం ఎలా అవినీతిమయమై ఉన్నాం అనేది ఈ చిత్రంలో చెబుతున్నాం. ఈ మూవీకి ఏ పొలిటికల్ ఎజెండా లేదు’’ అని డైరెక్టర్ తేజా మార్ని అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్’. ‘బన్నీ’ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా తేజా మార్ని మాట్లాడుతూ– ‘‘వ్యవస్థలో ఉన్న వాళ్లు అదే వ్యవస్థకు బలైతే ఎలా ఉంటుంది? అనే కథని జనాలకు చెప్పాలనిపించింది. కోటబొమ్మాళి అనే ఊరిలో ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఏం జరిగింది? అది ముగ్గురు పోలీస్ అధికారుల జీవితాలను ఎలా మార్చింది? అనేది ఈ చిత్ర కథ. మలయాళ హిట్ ‘నాయట్టు’ కి ఇది తెలుగు రీమేక్ అయినా తెలుగుకి తగ్గట్టు మార్పులు చేశాం. శ్రీకాంత్, వరలక్ష్మిగార్ల పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. రాహుల్, శివాని చక్కగా నటించారు. నిర్మాతలు వాసు, విద్యగార్లు ఎక్కడా రాజీపడలేదు. ‘లింగిడి లింగిడి..’ పాట వల్లే మా సినిమా గురించి అందరికీ తెలిసింది’’ అన్నారు. -
నటుడికి సంతృప్తి అనేది ఉండదు
‘‘ఈ మధ్య కాలంలో నేను పూర్తి స్థాయి పాత్ర చేసిన చిత్రం ‘కోట బొమ్మాళి’. నటనకి చాలా స్కోప్ ఉన్న పాత్ర. అంతకు ముందు నేను చేసిన సినిమాల్లో పాటలు, ఫైట్స్.. ఇలా వాణిజ్య అంశాలు ఉన్నాయి. ‘కోట బొమ్మాళి’లో చక్కటి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది’’ అని శ్రీకాంత్ అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ చెప్పిన విశేషాలు. ► ‘కోట బొమ్మాళి’ వైవిధ్యమైన కథ. ఎక్కడైనా క్రిమినల్స్ని ΄ోలీసులు వెంటాడి పట్టుకుంటారు. ఈ సినిమాలో ΄ోలీసులే ΄ోలీసులను వెంటాడటం ఆసక్తిగా ఉంటుంది. రాజకీయ నాయకులు ΄ోలీసులను ఎలా వాడుకుంటారు? దాని వల్ల ΄ోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? తమ ఓట్ల కోసం కులాలను, మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు? అనేది ఈ చిత్రం ప్రధాన కథాంశం. ఈ సినిమాలో ఎలాంటి పొలిటికల్ సెటైర్ ఉండదు. అయితే ప్రస్తుతం వ్యవస్థలో జరుగుతున్నది చూపించాడు దర్శకుడు తేజ. ►ఓ మధ్య తరగతి హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటుందన్నది ఈ మూవీలో ఆసక్తిగా ఉంటుంది. నేను హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్ర చేశాను. నా పాత్ర, రాహుల్, శివాని.. మా ముగ్గురి పాత్రల మధ్య కథ తిరుగుతుంటుంది. మా పై అధికారి వరలక్ష్మి మమ్మల్ని పట్టుకోవడానికి వేసే ఎత్తులకు నేను వేసే పై ఎత్తులు ఆసక్తిగా ఉంటాయి. ►దాదాపు 32 ఏళ్ల కెరీర్లో ఎన్నో పాత్రలు చేశాను. ఎన్ని చేసినా ఓ నటుడికి సంతృప్తి ఉండదు.. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయాలనే ఆరాటం ఉంటుంది. ప్రస్తుతం రామ్చరణ్తో ‘గేమ్ చేంజర్’, ఎన్టీఆర్తో ‘దేవర’, మోహన్లాల్, మా అబ్బాయి రోషన్ నటిస్తున్న ‘వృషభ’ సినిమాల్లో కీ రోల్స్ చేస్తున్నాను. -
ప్రమాదం జరిగి, కాలికి దెబ్బ తగిలింది..నన్ను రీప్లేస్ చేస్తారేమో అనుకున్నా
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, శ్రీకాంత్ ప్రధాన పాత్రధారులుగా, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో రాహుల్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కానిస్టేబుల్ రవి పాత్రలో నటించాను. ఎస్ఐ రామకృష్ణగా శ్రీకాంత్గారు, కానిస్టేబుల్ కుమారిగా శివానీ రాజశేఖర్ నటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కోట బొమ్మాళి అనే ఊర్లోని పోలీస్స్టేషన్లో ఏం జరిగింది? అన్నది ఈ సినిమా కాన్సెప్ట్. మలయాళ చిత్రం ‘నాయట్టు’కు ‘కోట బొమ్మాళి పీఎస్’ రీమేక్. అయితే నా పాత్రపై ఏ ప్రభావం ఉండకూడదని ‘నాయట్టు’ పూర్తి చిత్రం నేను చూడలేదు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా స్క్రీన్ప్లే రేసీగా ఉంటుంది. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇక ఈ సినిమాలోని ‘లింగిడి..’ పాటకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ పాటతోనే మరింత మందికి మేం చేరువ అయ్యాం. గీతా ఆర్ట్స్ బ్యానర్లో మా నాన్నగారు (ఫైట్ మాస్టర్ విజయ్) అసిస్టెంట్ ఫైట్ మాస్టర్గా, ఫైట్ మాస్టర్గా చేశారు. అదే బ్యానర్లో నేను హీరోగా చేయడం పట్ల ఆయన హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ సినిమా సమయంలో నాకు ప్రమాదం జరిగి, కాలికి దెబ్బ తగిలింది. దీంతో నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో నన్ను రీప్లేస్ చేస్తారేమో? అనుకున్నాను. కానీ ‘బన్నీ’ వాసు, విద్యాగార్లు నన్ను సపోర్ట్ చేశారు. ఇలాంటి సంస్థలో వర్క్ చేయడం నాకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఆర్కా మీడియాలో ఓ షో కమిట్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చారు. -
తొలిసారి అలాంటి సీన్ చేశా!
‘‘నేనిప్పటివరకూ ఏ సినిమాలోనూ సిగరెట్ తాగే సన్నివేశంలో నటించలేదు. ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా కథకు అవసరం కావడంతో తొలిసారి స్మోకింగ్ సన్నివేశం చేశాను. అందుకే ఈ చిత్రం నాకు సవాల్గా అనిపించింది’’ అని నటి వరలక్ష్మీ శరత్కుమార్ అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన విశేషాలు. ∙నేను కథే హీరోగా భావిస్తాను. నా కెరీర్లో తమిళంలో ఎక్కువగా పోలీస్ పాత్రలు చేశాను. కానీ తెలుగులో మాత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’ నా తొలి మూవీ. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలకు క్రేజ్ ఉంటోంది. ∙‘కోట బొమ్మాళి పీఎస్’లో శ్రీకాంత్గారు, నేను పోలీస్ ఆఫీసర్స్. ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది? పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? అన్నది ఈ చిత్రకథ. పిల్లి మరియు ఎలుక ఆటలా థ్రిల్ చేసేలా ఉంటుంది. ఓటు గురించి అవగాహన కల్పించే లైన్ కూడా ఉంటుంది. ఎన్నికల టైమ్లో వస్తున్న మా సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ∙‘వరలక్ష్మి చాలా వైవిధ్యంగా చేసింది’ అని ప్రేక్షకులు అనుకునేలా మంచి పాత్రలు చేయడమే నా లక్ష్యం. లేడీ ఓరియంటెండ్ సినిమాలతో పాటు పాత్ర నచ్చితే ఎలాంటి మూవీలోనైనా నటించడానికి రెడీ. తెలుగులో నేను నటించిన ‘హనుమాన్’ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. కన్నడలో సుదీప్తో ‘మ్యాక్స్’ చిత్రంలో నటిస్తున్నాను. -
లింగి లింగిడి..!
శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల అవుతోంది. రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘లింగి లింగిడి..’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేయగా, 30 మిలియన్ వ్యూస్ను పూర్తి చేసుకుంది. ‘‘ఈ పాటలానే మా చిత్రానికి ప్రేక్షకులు విజయం అందిస్తారనే నమ్మకం ఉంది’’ అని హైదరాబాద్లో నిర్వహించిన సెలబ్రేషన్స్లో ‘బన్నీ’ వాసు అన్నారు. -
Kota Bommali Ps Teaser Launch: 'కోట బొమ్మాళి పి.ఎస్' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'గన్ కన్నా.. ఫోన్ బాగా పేలుతుంది సార్'
శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'కోట బొమ్మాళి పి.ఎస్'. ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: అందుకే ఆ హీరోను దూరం పెట్టేశా.. అనసూయ క్రేజీ కామెంట్స్!) టీజర్ చూస్తే ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పోలీసులు, రాజకీయ నాయకుల మధ్య జరిగే సన్నివేశాలే కథాంశంగా తీసినట్లు కనిపిస్తోంది. సస్పెన్స్తో పాటు క్రైమ్ థ్రిల్లర్ను తలపించే యాక్షన్ సీన్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. అసలు ఈ కోట బొమ్మాళి పీఎస్ కథేంటో తెలియాలంటే ఈనెల 24 వరకు ఆగాల్సిందే. Haunting tale from the rustic lands of Srikakulam 🔥🔥#KotabommaliPS teaser out now! - https://t.co/GrvWpLzMBL Grand release worldwide on November 24th ❤🔥@actorsrikanth #BunnyVass #VidyaKoppineedi @GA2Official @DirTejaMarni @varusarath5 @bhanu_pratapa @Rshivani_1… pic.twitter.com/TG1Pq39zV3 — GA2 Pictures (@GA2Official) November 6, 2023 -
బొమ్మాళి డేట్ ఫిక్స్
శ్రీకాంత్ మేకా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రల్లో, వరలక్ష్మీ శరత్కుమార్ ప్రత్యేక పాత్రలో నటించారు. తేజ మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న రిలీజ్ కానుంది. ‘‘ఓ పోలీస్ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పవర్ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్గా ఈ మూవీ ఉంటుంది. ఈ చిత్రం మోషన్ పోస్టర్కు మంచి స్పందన వచ్చింది. అలాగే ‘లింగి లింగిడి..’ పాట కొన్ని కోట్ల వ్యూస్ సాధించింది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్, సహనిర్మాతలు: భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ ్రపొడ్యూసర్: అజయ్ గద్దె. -
భలేగా బ్యాలెన్స్!
సినిమాలను, వెబ్ సిరీస్లను భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారు వరలక్ష్మీ శరత్కుమార్. కథను బట్టి మెయిన్ లీడ్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తుంటారు. ఇప్పటికే తెలుగు ఆంథాలజీ సిరీస్ ‘అద్దం’తో డిజిటల్ వ్యూయర్స్కు దగ్గరైన వరలక్ష్మి తాజాగా మరో తెలుగు వెబ్ సిరీస్ ‘మాన్షన్ 24’లో మెయిన్ లీడ్ రోల్ చేశారు. హారర్ బ్యాక్డ్రాప్లో రూ΄÷ందిన ఈ సిరీస్లో అవికా గోర్, బిందు మాధవి, నందు, మానస్, అయ్యప్ప పి. శర్మ, రావు రమేష్ ఇతర ΄ాత్రధారులు. ‘రాజుగారి గది’ ఫ్రాంచైజీ ఫేమ్ ఓంకార్ ఈ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించారు. ‘‘ఒకవైపు సినిమాల్లో నెగటివ్, ΄ాజిటివ్ షేడ్స్ ఉన్న ΄ాత్రలు చేస్తున్నాను. వెబ్ సిరీస్లలో కూడా మంచి ΄ాత్రలు చేస్తున్నాను’’ అన్నారు వరలక్ష్మి. -
తెలుగోడి జానపదం దమ్ము చూపించింది
‘‘ఒక పాట హిట్ అయితే సక్సెస్ మీట్ చేయడం మాకు తెలిసి ఇదే తొలిసారి. మా ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమాలోని ‘లింగి లింగి లింగిడి...’ పాట తెలుగోడి జానపదం దమ్ము చూపించింది. ఈ పాటకి పి. రఘు సాహిత్యం అందించడంతో పాటు పాడారు’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, శ్రీకాంత్ మేక, వరలక్ష్మీ శరత్కుమార్ నటిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘లింగి లింగి లింగిడి...’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకి అద్భుతమైన స్పందన వస్తోందంటూ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘చాలా కాలం తర్వాత మంచి సినిమా చేశాననే అనుభూతి ఉంది’’ అన్నారు. ‘‘నా జీవితంలో గుర్తుండిపోయే పాట వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు రాహుల్ విజయ్. ‘‘ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో సినిమా కూడా అలాగే ఉంటుంది’’ అన్నారు శివానీ రాజశేఖర్. ‘‘నా సినిమాలో జానపదం పాట పెట్టాలనే కల ఈ చిత్రంతో నెరవేరింది’’ అన్నారు తేజ మార్ని. -
ఓటీటీల్లోకి ఆ రెండు మూవీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
జనాలకు ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. థియేటర్లలో కంటే వీటినే ఎక్కువగా ఆదరిస్తున్నారు. అయితే ఒకప్పుడు చోటామోటా యాక్టర్స్ ఓటీటీల కోసం మూవీస్ చేసేవారు. ఇప్పుడు ఏకంగా స్టార్స్ నటించిన సినిమాలు కావొచ్చు, వెబ్ సిరీసులు కావొచ్చు నేరుగా ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అలా స్టార్ హీరోయిన్స్ నటించిన ఓ మూవీ, ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. (ఇదీ చదవండి: తెలుగు యువ హీరో తల్లిపై పోలీస్ కేసు.. ఏం జరిగింది?) మలయాళ బ్యూటీ నిత్యామేనన్ ఎవరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ కమ్ సింగర్ అయిన ఈమె.. క్యూట్ యాక్టింగ్తో పలు సినిమాలు చేసింది. స్టార్ హీరోలతోనూ కలిసి పనిచేసింది. అయితే ఈమెకు రానురాను తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఓటీటీల్లోనూ నటిస్తూ బిజీ అయిపోయింది. అలా ఈమె ప్రధాన పాత్రలో నటించి 'కుమారి శ్రీమతి'.. ఈ సెప్టెంబరు 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. Get ready to laugh, cry and cheer as Srimathi takes on life’s challenges head-on. 🏡#KumariSrimathiOnPrime streaming from September 28th on @PrimeVideoIN.#KumariSrimathi @MenenNithya @Sri_Avasarala @gomtesh_upadhye @iamThiruveer @PatnaikPraneeta @ItsActorNaresh… pic.twitter.com/EzHzY648rE — Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2023 తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి చాలామందికి తెలుసు. ఒకప్పుడు హీరోయిన్గా చేసింది కానీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉంది. ఈమె ప్రధాన పాత్రలో, ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ తీసిన హారర్ వెబ్ సిరీస్ 'మ్యాన్షన్ 24'. దీన్ని త్వరలో హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. వినాయక చవితి సందర్భంగా ప్రకటించిన ఈ రెండూ లేడీ ఓరియెంటెడ్ మూవీ/వెబ్ సిరీస్ కావడం విశేషం. (ఇదీ చదవండి: పెళ్లికి ముందే అత్తారింట్లో మెగా కోడలు సందడి) So excited for this one..My next release#Mansion24 Watch at your own risk ⚠️#Mansion24OnHotstar coming soon..!!#DisneyPlusHotstar. @avika_n_joy @thebindumadhavi @vidyuraman @ActorNandu #MeenaKumari @ActorMaanas @actor_amardeep @shraddhadangara @jois_archie @mgabhinaya… pic.twitter.com/uWRdqFwbRo — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) September 18, 2023 -
పోలీసులే నిందితులైతే...
సాధారణంగా హత్యలకు కారణమైన దోషులకు శిక్ష పడేలా బాధ్యతగా విధులు నిర్వర్తిస్తుంటారు పోలీసులు. అయితే ఓ హత్య కేసులో పోలీసులే నిందుతులు అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసు కుంటాయి? అన్న కథాంశంతో ఓ చిత్రం రూపొందుతోంది. తేజా మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, వరలక్ష్మీ శరత్కుమార్ లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ఇది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, విద్య నిర్మిస్తున్నారు. బుధవారం (జూన్ 7) రాహుల్ విజయ్ బర్త్ డే ఈ సందర్భంగా ఈ సినిమాలో ఎస్. రవి పాత్రను రాహుల్ విజయ్ చేస్తున్నట్లుగా వెల్లడించి, పోస్టర్ రిలీజ్ చేశారు. శివానీ రాజశేఖర్, పవన్ తేజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: మిధున్ ముకుందన్. -
బుల్లెట్ బండి నడిపిన వరలక్ష్మి శరత్కుమార్.. వీడియో వైరల్
దక్షిణాది హీరోయిన్లలో నటి వరలక్ష్మి శరత్కుమార్ ది మాత్రం డేరింగ్ అండ్ డైనమిక్ రూట్ అనే చెప్పాలి. అర్ధరాత్రి పోలీసునే చెంపలు వాయించిన రఫ్ బ్యూటీ ఈమె. ఈ విషయాన్ని ఆమె తండ్రి, నటుడు శరత్కుమార్నే స్వయంగా ఇటీవల ఒక వేదికపై చెప్పారు. ఇక నటిగా వరలక్ష్మి శరత్కుమార్ గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. దక్షిణాది సినీ ప్రేక్షకులకు బాగా తెలుసు. పాత్ర ఏదైనా ఈమెకు మోల్డ్ అయిపోతారు. పోడా పోడీ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్కుమార్ ఆ తరువాత తనకు నచ్చినట్లు కాకుండా ప్రేక్షకులు మెచ్చేటట్లు నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు దక్షిణాదిలో కథానాయకి పాత్రలను అటుంచితే ఛాలెంజింగ్తో కూడిన విలనిజం పాత్ర అయితే ఈ విలక్షణ నటిని వెతుక్కుంటూ రావాల్సిందే. ఆ మధ్య సర్కార్ చిత్రంలో అలాంటి పాత్రలోనే విజయ్ను ఢీకొన్న వరలక్ష్మి శరత్కుమార్ ఇటీవల తెలుగులో వీరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణకు పోటీ ఇచ్చారు. ఈమెలో మొండి ధైర్యం కూడా ఉంది. నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్న వరలక్ష్మి శరత్కుమార్ ఇప్పటి వరకు కొన్ని కారణాల వల్ల సైకిల్ తొక్కడం లాంటి వాటి జోలికి పోలేదట. అయితే ఇప్పుడు ఏకంగా బుల్లెట్ ఎక్కేవారు. సైకిల్ నుంచి స్టెప్ బై స్టెప్ బుల్లెట్ నడపడం వరకు నేర్చేసుకున్నారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది తెగ వైరల్ అవుతోంది. దీని గురించి ఆమె పేర్కొంటూ బాల్యంలో కొన్ని కారణాల వల్ల తనకు బైక్ తోలడానికి ఇంట్లో అనుమతి ఇవ్వలేదన్నారు. అయితే బైక్ నడపడానికి భయాన్ని పోగొట్టడానికి ఇది సరైన టైమ్ అని భావించానన్నారు. దీంతో గత వారం బైక్ నడపడానికి తొలి మెట్టు అయిన సైకిల్ తొక్కడం నేర్చుకున్నానని, ఆ తరువాత స్క్రూటీ, ఇప్పుడు బుల్లెట్ కూడా నడుపుతున్నానని చెప్పారు. మొదట్లో కొంచెం కష్టం, బాధ అనిపించినా, భయాన్ని పోగొట్టడానికి ఇదంతా చేసినట్లు చెప్పారు. ఇక్కడ తాను కింద పడ్డాను అన్నది ముఖ్యం కాదని ఎలా లెగిశాను అన్నదే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. -
నాన్న వల్ల వచ్చిన అవకాశాలు పోయాయి : వరలక్ష్మీ శరత్కుమార్
చాలెంజింగ్ పాత్రలకు కేరాఫ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె సుప్రీమ్ స్టార్ శరత్ కుమార్ వారసురాలు అన్న విషయం తెలిసిందే. అయితే స్వశక్తితోనే నటిగా ఎదిగి తనకంటూ ఒక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఈమె రాకింగ్ నటన ప్రేక్షకులను థ్రిల్లింగ్కు గురి చేస్తుంది. నాయకి, ప్రతినాయకి ఇలా ఏ తరహా పాత్రకైనా రెడీ అంటారు. కథానాయకిగా రంగ ప్రవేశం చేసినా, ప్రతినాయకిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో శింబుకు జంటగా పోడాపొడి చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో తదుపరి అవకాశాల కోసం కొంతకాలం ఎదురు చూడాల్సి వచ్చింది. అలా బాలా దర్శకత్వంలో నటించిన తారై తప్పటై చిత్రంలో నటనతో సినీ పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆపై వరలక్ష్మి నటిగా వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ముఖ్యంగా నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన సర్కార్, విశాల్ హీరోగా నటించిన సండై కోళీ 2 వంటి చిత్రాల్లో ప్రతి నాయకిగా తనదైన శైలిలో అదరగొట్టారు. చదవండి: శరత్బాబు-రమాప్రభ లవ్స్టోరీ వెనుక ఇంత కథ నడిచిందా? ఆ తర్వాత ఈమె ఎక్కువగా ఆ తరహా పాత్రల్లోనే నటిస్తున్నారు. మధ్య మధ్యలో కథానాయిక పాత్రలనూ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలా దశాబ్దం పాటుగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. ఇటీవల ఈమె ఒక భేటీలో పేర్కొంటూ శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ చిత్రంలో జెనీలియా పాత్రలో తాను నటించాల్సి ఉందని చెప్పారు. దర్శకుడు శంకర్ నుంచి తనకు పిలుపు వచ్చిందన్నారు. ఆడిషన్, స్క్రీన్ టెస్ట్ కూడా జరిగిందన్నారు. ఆ చిత్రంలో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్న సమయంలో తాను నటించడానికి తన తండ్రి అనుమతించలేదని చెప్పారు. ఆ తర్వాత బాలాజీ శక్తి వేల్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రంలోనూ కథానాయికగా నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. దాన్ని నాన్న వద్దన్నారని చెప్పారు. ముందు చదువు పూర్తి చెయ్యి ఆ తర్వాత నటన గురించి ఆలోచిద్దామని చెప్పారన్నారు. అలా తన తండ్రి వల్ల చాలా అవకాశాలు మిస్ అయ్యానని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొన్నారు. -
మరోసారి గొప్ప మనుసు చాటుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్
కోలీవుడ్లో ధైర్యం, సాహసం, సాయం, సేవా వంటి గుణాలు కలిగిన అతి తక్కువ నటీనటుల్లో వరలక్ష్మి శరత్కుమార్ ఒకరు. శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన స్వసక్తితోనే ఎదిగారు. నటిగా దక్షిణాదిలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. పోడా పోడి చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్లో తెరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత రకరకాల పాత్రల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు. తెరపై విలన్గా భయపెట్టే వరలక్ష్మిలో సేవ గుణం ఎక్కువే అనే విషయం తెలిసిందే. చదవండి: ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి.. తరచూ ఆమె సామాజిక సేవలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆమె మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. క్యాన్సర్ బాధిత కుటుంబాలకు నిత్యవసర వస్తువులను సాయం చేసి అండగా నిలిచారు. కాగా శనివారం తన పుట్టిన రోజును స్థానిక ఎగ్మోర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్లో హాస్పిటల్లో వైద్యులు, క్యాన్సర్ బాధితుల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జాయ్ ఆఫ్ షేరింగ్ పేరుతో శివశక్తి సంకల్ప్ బ్యటిఫుల్ వరల్డ్ సేవా సంస్థలు నిర్వహించాయి. ఈ సందర్భంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. అనేకమంది క్యాన్సర్ బాధితులను కాపాడుతున్న వైద్యుల మధ్య తన పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మన సన్నిహితులు, దగ్గరి వారు మాత్రమే క్యాన్సర్ బాధితులైనప్పుడు వ్యాధి గురించి ఆలోస్తున్నామని అభిప్రాయపడ్డారు. చేతిలో ఉన్న పది రూపాయలు సాయం చేసినా బాధితుల జీవితాల్లో పెద్ద మార్పు వస్తుందన్నారు. అలాగే దేశమంత సైకిల్ యాత్ర చేస్తూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్న చెన్నైకి చెందిన శివ రవి, జై అశ్వాణిలపై ఆమె ప్రశంసలు కురిపించారు. చదవండి: తీవ్రమైన గుండెపోటు నుంచి కాపాడింది అదే: సుస్మితాసేన్ కాగా క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కలిగించే విధంగా శివ రవి అనే 26 ఏళ్ల వ్యక్తి, జై అశ్వాణి అనే 18 ఏళ్ల యువకుడు కలిసి చెన్నై నుంచి కోల్కత్తా వరకూ 1746 కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు అదే విధంగా అనేకమంది క్యాన్సర్ బాధితులను కాపాడుతున్న సంకల్ప్ సేవా సంస్థ, వైద్యుల చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా నటి వరలక్ష్మి క్యాన్సర్ బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను సాయంగా అందించారు. అదేవిధంగా సైకిల్ యాత్రతో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రవన్ని చేపట్టిన యువకులకు జ్ఞాపికలను అందజేశారు. -
వరలక్ష్మికి తండ్రిగా గర్వపడుతున్నా!: శరత్ కుమార్
తమిళసినిమా: నటిగా వరలక్ష్మీ శరత్కుమార్ ఎదుగుదల అనూహ్యం అనే చెప్పాలి. తొలి చిత్రం పోడాపోడీ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో వరలక్ష్మీ కెరీర్ ఇక అంతే అనే ప్రచారం జరిగింది. అదేవిధంగా ఆ తరువాత అవకాశాలు రావడానికి చాలా కాలమే పట్టింది. అలాంటి పరిస్థితిని వరలక్ష్మీ శరత్కుమార్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కథానాయకిగానే నటిస్తానని ఒక చట్రంలో ఇరుక్కోకుండా ప్రతినాయకిగానూ చాలెంజింగ్ పాత్రల్లో నటించడానికి సిద్ధమయ్యారు. అలాంటి పాత్రల్లో నటించి విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్నారు. చదవండి: మంచు వారి ఇంట పెళ్లి సందడి షురూ? ఆమెతో మనోజ్ పెళ్లి ఫిక్స్! బహుభాషా నటిగానూ రాణిస్తున్న వరలక్ష్మీ శరత్కుమార్ చాలా గ్యాప్ తరువాత కథానాయకిగా తమిళంలో నటించిన చిత్రం కొండ్రాల్ పావమ్. నటుడు సంతోష్ ప్రతాప్ కథానాయకుడిగా నటించిన ఇందులో దర్శకుడు సుబ్రమణ్యం శివ, నటుడు చార్లీ, సెండ్రాయన్,మనోబాల, నటి ఈశ్వరిరావు ముఖ్య పాత్రలు పోషించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి దయాళ్ పద్మనాభన్ దర్శకత్వం వహించారు. కన్నడంలో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన ఈయన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయం అవుతున్నారు. ప్రదాప్ కృష్ణ, మనోజ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. నటుడు శరత్కుమార్ ట్రైలర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వేదికపై అందరూ నటి వరలక్ష్మీ శరత్కుమార్ను నటి విజయశాంతితో పోలుస్తున్నారని, అది నిజమేనని అన్నారు. అయితే మొదట్లో వరలక్ష్మీ నటిస్తానని చెబితే వద్దు అనలేదు గానీ, ముంబై యూనివర్సిటీలో ఎంఏ చదివి సినిమాల్లో నటించడం అవసరమా? అని అన్నానన్నారు. అయితే తను మాత్రం నటించడానికే సిద్ధమయ్యారని, అయితే ఈ స్థాయికి రావడానికి కారణం తనే అన్నారు. చదవండి: అభిమాని నుంచి అలాంటి ప్రశ్న, మండిపడ్డ బిగ్బాస్ బ్యూటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా స్వశక్తితోనే ఎదిగిందని చెప్పారు. వరలక్ష్మీ బోల్డ్ అండ్ బ్రేవ్ ఉమెన్ అని పేర్కొన్నారు. ఒక రోజు రాత్రి ఒక పోలీస్స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. ఏమిటని అడిగితే మీ అమ్మాయి పోలీస్స్టేషన్లో ఉందని, వరలఓఇ్మ ఇద్దరు వ్యక్తుల్ని కొట్టినట్లు తెలిసిందన్నారు. ఆ వ్యక్తులు వరలక్ష్మి కారును ఢీకొట్టి అల్లరి చేయడంతో తను వారిని చితక బాధినట్లు తెలిసిందన్నారు. అలాంటి ధైర్యశాలి వరలక్ష్మి అని అన్నారు. ఆమె తండ్రిగా తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. ఇక కొండ్రాల్ పావం చిత్ర విషయానికి వస్తే కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. తానీ చిత్రాన్ని ప్రేక్షకుల మధ్య థియేటర్లోనే చూస్తానని శరత్కుమార్ చెప్పారు. -
రివ్యూవర్స్పై వరలక్ష్మి అసహనం, అసలు మీరెవరంటూ మండిపడ్డ నటి
డేరింగ్ అండ్ బోల్డ్ నటి వరలక్ష్మి శరత్కుమార్ సోషల్ మీడియా రివ్యూవర్స్పై అసహనం వ్యక్తం చేసింది. ఆమె నటించిన లేటెస్ట్ తమిళ్ మూవీ ‘కొండ్రల్ పావమ్’. తెలుగులో చిత్రం ‘అనగనగా ఓ అతిథి’కి రీమేక్ ఇది. ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందంతో కలిసి ఆమె మూవీ ప్రమోషన్స్లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఓ తమిళ చానల్తో ముచ్చటించిన ఆమె సోషల్ మీడియాలో సినిమాలపై రివ్యూ ఇచ్చే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. రివ్యూ చేప్పేవాళ్లకు కనీసం ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలంది. ‘ఈ మధ్య ఇలా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయో లేదో అలా సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. చదవండి: ఆమిర్ ఖాన్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన! ఆయనకు ఏమైంది? ఇంకా చెప్పాలంటే కొన్ని రిలీజ్ కాకముందే ట్రైలర్, టీజర్లు చూసి వాళ్లకు అనిపించింది చేప్పేస్తున్నారు. అలా అర్థంపర్థంలేని రివ్యూలు ఇస్తూ ప్రేక్షకుడిని తప్పుదొవ పట్టిస్తున్నారు. అసలు రివ్యూలు ఇవ్వడానికి వాళ్లు ఎవరు. మూవీ ఈ సినిమాలో ఇది బాగోలేదు, ఆ సినిమాలో అది బాగోలేదు, అసలు మూవీలో సందేహమే లేదంటూ ఇష్టం వచ్చినట్లు రివ్యూలు చెప్పేస్తున్నారు. అలాంటి వాళ్లందరిని నేను ఒక్కటే అడుగుతున్నా. అసలు మీరూ ఎలాంటి సినిమా ఆశిస్తున్నారు?’ అని ప్రశ్నించింది. అనంతరం ‘మొదట్లో అందరూ సినిమాని వినోదం కోసం చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎంజాయ్ చేయడం మర్చిపోయి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: అందుకే సినిమాలు చేయడం మానేశా: నటి హేమ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది ఎక్కువ అయిపోయింది. అసలు సినిమా హిట్టు లేదా ఫ్లాప్ అని చెప్పడానికి వాళ్లేవరు. అది ప్రేక్షకుల నిర్ణయం. మూవీ బాగుందా? లేదా అని చెప్పేది ఆడియన్స్ మాత్రమే. ప్రేక్షకులను సినిమా చూసి ఆనందించనివ్వండి. చెత్త రివ్యూలతో వాళ్లను తప్పుదొవ పట్టించకండి. ఇదొక్కటే నా విన్నపం’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అనంతరం మాట్లాడుతూ.. అలాగే కొంతమంది సినిమా కలెక్షన్స్ గురించి వాగ్వాదాలకు దిగుతున్నారని, ఇవన్నీ ఎందుకు? జీవితం చాలా చిన్నది దాన్ని ఎంజాయ్ చేయండంటూ రివ్యూవర్స్కి ఆమె సూచించింది. దీంతో ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతొంది. అంతేకాదు ఆమె మాట్లాడిని వీడియోను వరలక్ష్మి తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. -
ఆ సీన్ చూసి నన్ను చంపేస్తారేమోనని భయపడ్డా: వరలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు
డేరింగ్ అండ్ బోల్డ్ నటి వరలక్ష్మి శరత్కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పోడా పోడీ అనే తమిళ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే వెండితెరపై తన బౌండరిలను చేరిపేసుకుని నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంది. ఈ నేపథ్యంలో డిగ్లామర్స్ రోల్స్కే కాదు విలన్ పాత్రలకు సైతం సై అంటుంది. అలా సినిమాల్లో లేడీ విలన్గా విజృంభిస్తోంది. ప్రస్తుతం వరలక్ష్మి తెలుగు, తమిళం, మలయాళంలో విపరీతమైన క్రేజ్ను సంపాదించుకుంది. చదవండి: సావిత్రి గారి వల్లే నేను సక్సెస్ అయ్యాను: లలితా జువెల్లర్స్ ఎండీ ఇక రీసెంట్గా ఆమె తెలుగులో బాలకృష్ణ వీర సింహారెడ్డి చిత్రంలో నటించింది. ఇందులో సొంత అన్నయ్యను చంపే చెల్లెలిగా ప్రతినాయకి పాత్రలో మెప్పించింది. ఇందులో తన నటనకు ఆమె ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఈ సినిమా తర్వాత తనని చంపేస్తారని మూవీ షూటింగ్ సమయంలో భయాందోళనకు గురయ్యానంది. తాజాగా జరిగిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్లో వరలక్ష్మి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ సినిమాలో బాలయ్యను పొడిచి చంపే సీన్ చేస్తున్నప్పుడు చాలా భయపడ్డాను. చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు ఆ సీన్ చూశాక.. బాలయ్య అభిమానులు నాపై పగ పెంచుకుని చంపుతారేమో అని ఆందోళనకు గరయ్యా. షూటింగ్లో ఈ సీన్ చేసేటప్పుడు నేను భయంతో ఇబ్బంది పడ్డాను. అది చూసి బాలయ్య నాలో ధైర్యం నింపారు. ఈ సీన్ చేస్తున్నప్పుడు నేను భయపడుతుంటే ‘ఎందుకు భయం?’ అని అడిగారు. ఇది చూశాక మీ ఫ్యాన్స్ నెగిటివ్గా తీసుకుంటారేమో, నాపై విరుచుకుపడతారమో అని ఆయనతో అన్నాను. దీనికి బాలయ్య స్పందిస్తూ.. ‘నెగెటివ్గా ఏం తీసుకోరని.. పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటారు’ అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మీరందరూ ఆ సీన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నందకు ధన్యవాదాలు’’ అంటూ చెప్పుకొచ్చింది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటేసిన సీఎం జగన్
'ఆమె ధర్మపత్ని'! గృహస్థాశ్రమ వైశిష్ట్యం!!
పోలింగ్ ప్రారంభం.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు..
నాలుగో దశ ఎలక్షన్స్.. ఆసక్తికర విషయాలు
మన లక్ష్యం ఏమిటి? అందుకు చేయవలసిన పనేమిటి?
అందరూ తప్పకుండా ఓటు వేయండి..సీఎం జగన్ ట్వీట్
చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని వినియోగించుకోవాలి..
ఉత్తరప్రదేశ్లో పోలింగ్ ప్రారంభం.. బారులు తీరిన ఓటర్లు!
మేం ఓటేశాం.. మరి మీరో?(ఫొటోలు)
గూగుల్కు ఓటింగ్ శోభ!
తప్పక చదవండి
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- ఈసీ ద్వంద్వ వైఖరి
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement