-
ఇసుక వాహనాలపై టార్పాలిన్ కవర్ తప్పనిసరి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇసుక రవాణా చేసే ప్రతి వాహనంపైనా టార్పాలిన్ కవర్ కప్పడాన్ని హైకోర్టు తప్పనిసరి చేసింది. ఇసుక రవాణా సమయంలో ఏర్పడుతున్న వాయు కాలుష్యం, రోడ్లపై సంచరించే పాదచారులు, వాహనదారులు పడుతున్న తీవ్ర ఇబ్బందుల నివారణకు హైకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇసుక తవ్వకాల అనుమతులు పొందిన జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతిమ ఇన్ఫ్రా లిమిటెడ్, వారి అసైనీలను ఆదేశించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎంత జరిమానా విధించాలి, ఇసుక రవాణా చేయాల్సిన సమయాలను తదుపరి విచారణలో తేలుస్తామని తెలిపింది. జరిమానా విషయంలో అడ్వొకేట్ జనరల్, కోర్టు సహాయకారి సలహాలు ఇవ్వొచ్చునంది. తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలంటూ హైకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం ఇటీవల ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు పొడిగించింది. టార్పాలిన్ కవర్ విషయంలో తాము కూడా లీజుదారులకు తగిన ఆదేశాలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ కోర్టుకు నివేదించారు. ఇసుక రవాణా విషయంలో హైకోర్టు ఎటువంటి షరతులు విధించినా పాటిస్తామని తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాల విషయాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కే వదిలేయాలని ఏజీ శ్రీరామ్, అమికస్ క్యూరీ నోర్మా అల్వరీస్ విన్నవించారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, ఇసుక విషయంలో మరికొన్ని అంశాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇసుక రవాణాకు వేళలు నిర్ణయించాల్సిన అవసరం ఉందని అమికస్ క్యూరీ తెలిపారు. రవాణా ప్రాంతాల్లో కాలుష్యం స్థాయిలను పర్యవేక్షించి, పరిమితులను దాటితే ఆ ప్రాంతాల్లో ఇసుక వాహనాల రాకపోకలను తగ్గించాలని, అవసరమైతే రవాణా మార్గాన్ని మార్చాలని సూచించారు. -
టాప్గేర్లో వాహనాల స్పీడు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి ఈ ఏడాది ఫిబ్రవరిలో 20,29,541 యూనిట్ల వాహనాలు రోడ్డెక్కాయి. 2023 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 17,94,866 యూనిట్లు నమోదైంది. రిటైల్ విక్రయాలు గత నెలలో 13 శాతం పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) గురువారం తెలిపింది. ‘భారత్లో ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు రిటైల్లో 12 శాతం దూసుకెళ్లి 3,30,107 యూనిట్లు నమోదైంది. ద్విచక్ర వాహనాలు 13 శాతం ఎగసి 14,39,523 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 5 శాతం అధికమై 88,367 యూనిట్లు, త్రీవీలర్లు ఏకంగా 24 శాతం పెరిగి 94,918 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్ల విక్రయాలు 11 శాతం ఎగసి 76,626 యూనిట్లుగా ఉంది. ప్యాసింజర్ వాహనాలు 2024 ఫిబ్రవరి నెలలో గరిష్ట విక్రయాలను నమోదు చేశాయి’ అని ఎఫ్ఏడీఏ వివరించింది. ‘కొత్త ఉత్పత్తుల వ్యూహాత్మక పరిచయం, మెరుగైన వాహన లభ్యత ప్యాసింజర్ వాహనాల అమ్మకాల జోరుకు కారణమైంది. టూవీలర్ల విషయంలో గ్రామీణ మార్కెట్లు, ప్రీమియం మోడళ్లకు డిమాండ్, విస్తృత ఉత్పత్తి లభ్యత, వెల్లువెత్తిన ఆఫర్లు వృద్ధిని నడిపించాయి. -
పర్యావరణ హితం ప్రధానం! నాలుగేళ్లలో సగానికిపైగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ఆధారిత ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు భారత్లో జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 46 శాతం వృద్ధితో 48,714 యూనిట్లు రోడ్డెక్కాయి. 2023 జనవరిలో ఈ సంఖ్య 33,334 యూనిట్లు నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్య దేశవ్యాప్తంగా రిటైల్లో సీఎన్జీ ప్యాసింజర్ వాహనాలు 3,64,528 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య 4,75,000 యూని ట్లు దాటవచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. 2022– 23లో 39 శాతం వృద్ధితో 3,27,820 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. తొలి స్థానంలో మారుతి.. దేశంలో సీఎన్జీ ఆధారిత ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో మారుతి సుజుకి 69 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ ఏకంగా 13 మోడళ్లలో సీఎన్జీ వేరియంట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,51,620 యూనిట్లను విక్రయించింది. 14 శాతం వాటా కలిగిన టాటా మోటార్స్కు నాలుగు సీఎన్జీ మోడళ్లు ఉన్నాయి. 2023–24 ఏప్రిల్–జనవరిలో 64,972 యూనిట్లు కస్టమర్లకు చేరాయి. మూడు సీఎన్జీ మోడళ్లతో హ్యుండై మోటార్ ఇండియా 41,806 యూనిట్లు విక్రయించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రస్తుతం మూడు మోడళ్లలో సీఎన్జీని ఆఫర్ చేస్తోంది. జనవరితో ముగిసిన 10 నెలల కాలంలో ఈ కంపెనీ 6,064 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. నాలుగేళ్లలో సగానికిపైగా.. 2014–15లో సీఎన్జీ ప్యాసింజర్ వాహనాలు దేశవ్యాప్తంగా 1,48,683 యూనిట్లు పరుగుతీశాయి. 2019– 20లో కరోనా కారణంగా పరిశ్రమ 7 శాతం క్షీణించింది. 2021–22 నుంచి వీటి అమ్మకాల్లో 30 శాతంపైగా వృద్ధి నమోదవుతూ వస్తోంది. ఇప్పటి వరకు 21,16,629 యూనిట్ల సీఎన్జీ ఆధారిత కార్లు, ఎస్యూవీలు కస్టమర్ల చేతుల్లోకి చేరాయి. ఇందులో గడిచిన నాలుగేళ్లలో 52 శాతం యూనిట్లు రోడ్డెక్కాయంటే వీటికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్, డీజిల్తో పోలిస్తే సీఎన్జీ వాహనాలతో ఖర్చు తక్కువ కాబట్టే వినియోగదార్లు వీటికి మొగ్గు చూపుతున్నారు. రెండేళ్లలో సీఎన్జీ స్టేషన్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 4,500 నుంచి 8,000 కేంద్రాలకు చేర్చాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. టాటా నుంచి పోటీ.. సీఎన్జీకి ఊతమిచ్చేలా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో టియాగో హ్యాచ్బ్యాక్, టిగోర్ కాంపాక్ట్ సెడాన్ సీఎన్ జీ వేరియంట్లను టాటా మోటార్స్ జనవరి 24న పరిచయం చేసింది. ఫ్యాక్టరీలో ఫిట్ అయిన కిట్తో సీఎన్ జీ వాహనాలు ఆటోమేటిక్ గేర్ బాక్స్తో రావడం దేశంలో ఇదే తొలిసారి. సంస్థ మొత్తం అమ్మకాల్లో సీఎన్జీ వాటా 2026 నాటికి 25 శాతానికి చేర్చాలని టాటా లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా నెక్సన్ సీఎన్జీ వేరియంట్ తీసుకొస్తోంది. 2022–23 ఏప్రిల్–జనవరిలో టాటా మోటార్స్ 36,963 యూని ట్ల అమ్మకాలను సాధించి మూడవ స్థానంలో ఉంది. 2024 జనవరితో ముగిసిన 10 నెలల్లో 64,972 యూనిట్లతో రెండవ స్థానానికి దూసుకు వచ్చింది. పర్యావరణహిత వాహనాలపై కంపెనీల దృష్టి భారత్ మొబిలిటీ ఎక్స్పోలో వెల్లడి దేశీయంగా ఆటోమొబైల్ దిగ్గజాలు పర్యావరణహిత వాహనాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 ఎగ్జిబిషన్లో పలు వాహనాలను ప్రదర్శించాయి. వీటిలో సీఎన్జీ, హైబ్రిడ్స్ మొదలుకుని ఎలక్ట్రిక్ వరకు వివిధ రకాల వాహనా లు ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోట ర్ ఇండియా, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, బీఎండబ్ల్యూ మొదలైన దిగ్గజాలు వీటిని ప్రదర్శించాయి. మారుతీ సుజుకీ ఇండియా తమ కాన్సెప్ట్ ఈవీఎక్స్, ఫ్లెక్స్–ఫ్యూయల్ వ్యాగన్ఆర్, హైబ్రీడ్ గ్రాండ్ విటారా.. జిమ్నీ, స్కైడ్రైవ్ ఈ–ఫ్లయింగ్ కారు మొదలైనవి ప్రదర్శించింది. ఈ ఏడాది తమ తొలి పూర్తి ఎలక్ట్రిక్ ఈవీఎక్స్ ఎస్యూవీని ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ఈడీ రాహుల్ భారతి తెలిపారు. భారతీయ మొబిలిటీ రంగ ప్రాధాన్యాన్ని మొబిలిటీ ఎక్స్పో తెలియజేస్తోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. ఎక్స్పో విశేషాలు.. మెర్సిడెస్ బెంజ్ తమ ఆఫ్ రోడ్ జీ వాగన్ ఎలక్ట్రిక్ వెర్షన్ ’కాన్సెప్ట్ ఈక్యూజీ’, జీఎల్ఏ, ఏఎంజీ జీఎల్ఈ 53 కూపే వాహనాలను ప్రదర్శించింది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ర్యాల్–ఈ, ఎలక్ట్రిక్ ఎక్స్యూవీ 400, ఎలక్ట్రిక్ 3 వీలర్ ట్రియో మొదలైనవి ప్రదర్శనకు ఉంచింది. ఫోర్స్ మోటర్స్ .. ట్రావెలర్ ఎలక్ట్రిక్, అర్బానియా డీజిల్, ట్రావెలర్ సీఎన్జీల వాహనాలను ప్రదర్శించింది. ప్రదర్శనలో టాటా మోటార్స్ 18 ‘ఫ్యూచర్ రెడీ‘ కమర్షియల్, ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. బీఎండబ్ల్యూ తమ ఈవీలు, బీఎండబ్ల్యూ ఐ7, బీఎండబ్ల్యూ ఐ4, మినీ 3–డోర్ కూపర్ ఎస్ఈలను ప్రదర్శనకు ఉంచింది. -
టాటా మోటార్స్ లాభాలు అదుర్స్.. ఎన్ని వేల కోట్లంటే?
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 133 శాతం దూసుకెళ్లి రూ. 7,100 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 3,043 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 25 శాతం ఎగసి రూ. 1,10,600 కోట్లకు చేరింది. ఆటో విభాగంలోనూ మూడు రకాల బిజినెస్లూ సానుకూల పనితీరును చూపినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. సీజనాలిటీ నేపథ్యంలో ఈ ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లోనూ మరింత మెరుగైన ఫలితాలను సాధించే వీలున్నట్లు అంచనా వేసింది. ఇందుకు కొత్త ప్రొడక్టుల విడుదల, మెరుగైన సరఫరాలు తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. వాణిజ్య వాహన(సీవీ) ఆదాయం 19 శాతం వృద్ధితో రూ. 20,100 కోట్లను తాకింది. దేశీ సీవీ విక్రయాలు 1 శాతం వృద్ధితో 91,900 యూనిట్లకు చేరగా.. ఎగుమతులు 14 శాతం ఎగసి 4,800 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రయాణికుల వాహన అమ్మకాలు 5 శాతం పుంజుకుని 1,38,600 యూనిట్లకు చేరాయి. ఆదాయం 11 శాతం అధికమై రూ. 12,900 కోట్లను తాకింది. బ్రిటిష్ అనుబంధ కంపెనీ జేఎల్ఆర్ ఆదాయం 22 శాతం జంప్చేసి 7.4 బిలియన్ పౌండ్లకు చేరింది. తగ్గిన రుణ భారం ప్రస్తుత సమీక్షా కాలంలో కంపెనీ నికర రుణ భారాన్ని రూ. 9,500 కోట్లమేర తగ్గించుకోవడంతో రూ. 29,200 కోట్లకు చేరుకున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. నిర్వహణ లాభ(ఇబిట్) మార్జిన్లు రెట్టింపునకుపైగా బలపడి 8.8 శాతాన్ని తాకినట్లు వెల్లడించింది. ప్రణాళికలకు అనుగుణంగా రుణ తగ్గింపు లక్ష్యాన్ని సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. విభిన్న వ్యూహాల ఆధారంగా చేపడుతున్న బిజినెస్ నిర్వహణ సంతృప్తికర ఫలితాలను చూపుతున్నట్లు టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్వో పీబీ బాలాజీ పేర్కొన్నారు. పూర్తి ఏడాదిని పటిష్ట పనితీరుతో ముగించనున్నట్లు అభిప్రాయపడ్డారు. రానున్న త్రైమాసికాలలోనూ రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు.. మెరుగైన ఫలితాలను కొనసాగించగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 879 వద్దే ముగిసింది. -
ఆటో రిక్షా.. అదే స్కూటర్ - ఇప్పటి వరకు ఇలాంటి వెహికల్ చూసుండరు!
భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల హీరో మోటోకార్ప్ మొదటిసారి ఓ వినూత్న వాహనాన్ని ఆవిష్కరించింది. ఇది ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన వాహనాల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హీరో మోటోకార్ప్ ఆవిష్కరించిన ఈ కొత్త వెహికల్ 'సర్జ్ ఎస్32' కన్వర్టిబుల్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ చూడటానికి ఆటో రిక్షా మాదిరిగా ఉంటుంది. కానీ ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్కి జత చేసి ఉండటం చూడవచ్చు. కాబట్టి ఈ వెహికల్ అటు స్కూటర్గా, ఆటో రిక్షాగా కూడా పనిచేస్తుంది. కంపెనీ ప్రత్యేకంగా దీనిని స్వయం ఉపాధి పొందే వారికోసం రూపొందించినట్లు వెల్లడించింది. ఇటీవల జరిగిన ‘హీరో వరల్డ్’ ఈవెంట్లో కంపెనీ దీన్ని ప్రదర్శించింది. ఈ వాహనానికి విండ్ స్క్రీన్, హెడ్ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, విండ్ స్క్రీన్ వైపర్లు ఉన్నాయి, డోర్స్ మాత్రం లేదు. కానీ జిప్తో కూడిన సాఫ్ట్డోర్లు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: మూడు నెలల బిడ్డను అక్కడ విడిచిపెట్టి.. ఇన్ఫోసిస్ కోసం సుధామూర్తి.. కొత్త సర్జ్ ఎస్32 త్రీవీలర్లో 10 kW ఇంజిన్, 11 kWh బ్యాటరీ ఉంటుంది. అదే సమయంలో రోజు వారీ వినియోగనైకి అనుకూలంగా ఉండటానికి స్కూటర్లో 3kw ఇంజిన్, 3.5 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. త్రీవీలర్ 50 కిమీ/గం వేగంతో 500 కిమీ బరువుని మోయగల కెపాసిటీ కలిగి ఉంటుంది. స్కూటర్ మాత్రం 60 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. -
పాత వాహనాలను ఈ వీలుగా మార్చేందుకు ప్రోత్సాహకాలు
-
సంతోషాల మకరందం.. పల్లెల్లో సంక్రాంతి శోభ
ఆనందాలు ముంగిళ్లలో రంగవల్లులై మెరిసినట్టు.. ఉత్సాహధ్వానాలు హరిదాసుల కీర్తనలై మార్మోగినట్టు.. సంక్షేమ సిరులు పాలపొంగళ్లై పొంగినట్టు.. ‘‘నవరత్నాలు’’ పొదిగిన నవ్వుల ఇంద్రధనస్సులు భోగిమంటల వెలుగులో దేదీప్యమానమై శోభిల్లినట్టు.. ధాన్యలక్ష్మి బసవన్నలతో కలిసి లయబద్ధంగా నర్తించినట్టు.. ప్రతిపతాక గగనాన పతంగులై సగర్వంగా రెపరెపలాడినట్టు.. ‘‘గడపగడపా’’ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతోంది. సంతోషాల ‘మకర’ందాలు గ్రోలుతోంది. పండగ కళతో ఉట్టిపడుతోంది. సాక్షి, అమరావతి: పల్లెలు సంక్రాంతి కాంతులతో తళుకులీనుతున్నాయి. దూరప్రాంతాల నుంచి బంధుమిత్రుల మిత్రుల రాకతో జన తరంగమై పరవళ్లు తొక్కుతున్నాయి. సంప్రదాయ కోడిపందేలు, ఎద్దుల ప్రదర్శనలకు సిద్ధమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయి పంటల దిగుబడులు రావడంతో కర్షకుల ఇంట ఆనందం తొణికిసలాడుతోంది. పెద్ద పండగను అట్టహాసంగా జరుపుకునేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. కొత్త దుస్తులు, కొత్తవస్తువుల కొనుగోళ్లకు తరలివెళ్తున్నారు. ఫలితంగా దుకాణాలు, షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తుండడంతో నిరుద్యోగ యువతలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటికే గ్రూప్–1, గ్రూప్–2, జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ లెక్చరర్స్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్స్తోపాటు ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్న పశుసంవర్ధక సహాయక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడంతోపాటు త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు సర్కారు ప్రకటించడంతో యువతరంలో కొత్త జోష్ కనిపిస్తోంది. సంక్షేమ ‘సిరి’నవ్వులు గడిచిన నాలుగున్నరేళ్లల్లో వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం రూ.2.46 లక్షల కోట్లు జమ చేసింది. దాదాపు ప్రతినెలా ఏదో పథకం రూపంలో ప్రభుత్వం చేయూతనివ్వడంతో పేదలు ఆర్థిక సాధికారత సాధించారు. పేదలతోపాటు మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగింది. ఫలితంగా ఇంటింటా చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయి. సేద్యలక్ష్మి కటాక్షం ఖరీఫ్ సీజన్ ఆరంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఆ తర్వాత మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు రైతన్నలను కలవరపెట్టినప్పటికీ సాగైన విస్తీర్ణంలో మాత్రం రికార్డు స్థాయి దిగుబడులు రావడం రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. వరి ఎకరాకు గతేడాది సగటున 30–35 బస్తాల దిగుబడి రాగా, ఈ ఏడాది ఏకంగా ఎకరాకు సగటున 35–40 బస్తాల దిగుబడి వచ్చింది. దీంతో రైతన్నల గాదెలన్నీ ధాన్యపురాశులతో నిండిపోయాయి. వాహనాల అమ్మకాల జోరు మరొక వైపు కొత్త అల్లుళ్ల రాకతో రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో పురోగతి నమోదవుతుందన్న విక్రయదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్కు ముందు ప్రతి నెలా దేశ వ్యాప్తంగా సగటున 18 లక్షల వాహనాలు అమ్ముడవుతుంటే కోవిడ్ తర్వాత పది లక్షలకు పడిపోగా, గతేడాది 12 లక్షల వాహనాలు అమ్మకాలు జరిగాయి. కాగా ఈ ఏడాది కనీసం 15 లక్షలకు పైగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. కార్ల అమ్మకాలు. కోవిడ్కు ముందు ప్రతి నెలా దేశ వ్యాప్తంగా 2.7 లక్షల కార్లు విక్రయం అవుతుంటే, ఆ తర్వాత 3.5 లక్షలకు చేరినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం 4లక్షలకు పైగా కార్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. వస్త్ర వ్యాపారంలో 20 శాతం వృద్ధి సంక్రాతి అమ్మకాల్లో వస్త్ర వ్యాపారం, ఎలక్ట్రానిక్స్ అమ్మకాలదే అగ్రస్థానంగా ఉంది. వస్త్ర వ్యాపారం గతేడాదితో పోలిస్తే 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం వృద్ధిని నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నారు. ళీ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈ సంక్రాంతికి రూ.వెయ్యి కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ♦ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వస్త్ర, బంగారం దుకాణాల ద్వారా రూ.300 కోట్ల మేర వ్యాపారం జరిగే అవకాశం నెలకొందని వ్యాపారులు చెబుతున్నారు. ♦ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భంగా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వస్త్ర, బంగారం, కిరాణా దుకాణాల్లో మొత్తం రూ.250 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని విక్రయదారుల అంచనా. వాణిజ్య కార్యకలాపాల్లో 25 శాతం వృద్ధిరేటు పొరుగు రాష్ట్రాలు, పట్టణాల నుంచి సొంతూళ్ల బాట పట్టే వారితో బస్సులు, రైళ్లు, విమానాలు కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాలతో వచ్చే ప్రయాణికులతో టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. కొత్త దుస్తులు, కొత్త వస్తువుల కొనుగోలుదారులతో అన్ని షాపులూ కిక్కిరిసిపోతున్నాయి. నూతన వస్త్రాల దగ్గర నుంచి కార్లు, బంగారం వరకు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు కొనుగోళ్లు చేస్తున్నారు. ఫలితంగా గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాల్లో 25 శాతానికి పైగా వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త అల్లుళ్లు, బంధువులతో కళకళ బంధువులు, కొత్త అల్లుళ్లతో పల్లెలు కళలాడుతున్నాయి. వారి కోసం సంప్రదాయ పిండివంటల తయారీ చేయడంతో ఇళ్లన్నీ ఘుమఘుమలాడుతున్నాయి. ముగ్గులు, వివిధ క్రీడా పోటీలు, బొమ్మల కొలువులతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది. కొన్ని చోట్ల పూర్వ విద్యార్థులంతా సమావేశాలు ఏర్పాటు చేసుకుని, నాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. కోనసీమ గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా జరిగే ప్రభల తీర్థాలు, సంప్రదాయ కోడి పందాలను చూడటానికి ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. -
హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ
-
3 రోజుల్లో చలాన్లకు రూ. 8.44 కోట్ల చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీకి రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారుల నుంచి భారీ స్పందన లభి స్తోంది. పెద్దఎత్తున జరిమానాలు పడిన వాహనదారులు ప్రభుత్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకుంటు న్నారు. 3 రోజుల్లోనే 9.61 లక్షల చలాన్లకు సంబంధించి రూ.8.44 కోట్ల మేర జరిమానాలను చెల్లించారు. ఈ మేరకు రవాణా శాఖ వర్గాలు వివరాలు వెల్లడించాయి. హైదరా బాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 3.54 లక్షల చలాన్లతో రూ. 2.62 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరి ధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపుతో రూ.1.80 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 93 వేల చలాన్ల నుంచి రూ.76.79 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కాగా, చెల్లింపులు అధికంగా ఉంటున్న నేపథ్యంలో సర్వర్ తరచూ మొరాయిస్తున్నట్లు వాహనదారులు తెలిపారు. -
తుక్కు చేయడానికి ఎన్ని కేంద్రాలు అవసరమంటే..
న్యూఢిల్లీ: దేశీయంగా 1,000 వాహన తుక్కు కేంద్రాలు, 400 ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ సెంటర్లు అవసరమని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 85 స్క్రాపింగ్ సెంటర్లకు ప్రభుత్వం అనుమతిన్చినట్లు ’డిజిఈఎల్వీ’ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన వివరించారు. జాతీయ వాహన స్క్రాపేజీ పాలసీ అనేది అన్ని వర్గాలకు ప్రయోజనకరమని, దక్షిణాసియాలో భారత్ స్క్రాపింగ్ హబ్గా ఎదిగేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. వాహన స్క్రాపింగ్ కోసం వాహనదారుకు స్క్రాపింగ్ కేంద్రం (ఆర్వీఎస్ఎఫ్) జారీ చేసిన సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ (సీడీ)లను ట్రేడింగ్ చేసుకునేందుకు డిజిఈఎల్వీ ప్లాట్ఫాం ఉపయోగపడుతుంది. గత మూడు నెలలుగా బీటా ఫేజ్లో ఉన్న డిజిఈఎల్వీ దాదాపు 800 సర్టిఫికెట్ల ట్రేడింగ్కు తోడ్పడింది. పాతబడిన, ఫిట్నెస్ కోల్పోయిన, కాలుష్యకారక వాహనాలను దశలవారీగా తప్పించేందుకు 2021 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ వాహన స్క్రాపేజీ పాలసీని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం పాత వాహనాలను స్క్రాపింగ్ చేసిన వారు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే రోడ్ ట్యాక్స్లో పాతిక శాతం వరకు రిబేటు పొందవచ్చు. ఈ పాలసీ 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. -
పలు పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్న సీఎం వైఎస్ జగన్
-
ఆ వాహనాలకు GPSలు
-
విషమంగా ఢిల్లీ గాలి కాలుష్యం!
ఢిల్లీ: దేశ రాజధాని పరిసర ప్రాంతాలలో గాలి నాణ్యత ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఢిల్లీ నగరాన్ని విషపూరిత పొగ దట్టంగా కప్పేసింది. గాలి నాణ్యతా సూచీ(AQI) శుక్రవారం ఉదయం అత్యధికంగా 404గా నమోదైంది. నెమ్మదిగా వీస్తున్న గాలులు, తక్కువ ఉష్ణోగ్రతలు కాలుష్య కారకాలు పేరుకుపోయే వాతావరణాన్ని సృష్టించాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని వెల్లడించింది. ఢిల్లీలో గురువారం గాలి నాణ్యతా సూచీ 419గా నమోదైంది. బుధవారం 401గా ఉన్న నాణ్యతా ప్రమాణాలు.. మంగళవారం 397, సోమవారం 358, ఆదివారం 218, శనివారం 220గా ఉన్నాయి. రోజురోజుకీ గాలి నాణ్యత మరింత దిగజారుతోందని ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. వాహనాల ఉద్గారాలతో పాటు దీపావళి వేడుకలు పరిస్థితుల్ని మరింత తీవ్రతరం చేశాయి. Delhi's air quality remains in 'severe' category Read @ANI Story | https://t.co/vJd7cKWoNZ#Delhi #AQI #DelhiAirPollution pic.twitter.com/FzrD2O2eqt — ANI Digital (@ani_digital) November 17, 2023 ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం గురువారం స్పెషల్ టాక్స్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. అటు.. గాలి నాణ్యతను పెంచడానికి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన రెండు స్మోగ్ టవర్లు కాలుష్యాన్ని తగ్గించలేకపోయాయని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి తెలిపింది. అంతేకాకుండా వాటి నిర్వహణకు ఖర్చు అధికంగా అవుతుందని పేర్కొంది. కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు పలు అవస్థలు పడుతున్నారు. ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తున్నదని స్థానికులు వాపోయారు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని అంటున్నారు. రోడ్డుపైకి వెళ్తే పొగతో దారి కనిపించే పరిస్థితులు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: హర్యానా నూహ్లో మళ్లీ ఉద్రిక్తత -
నేడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సీసీపీటీ వాహనాల విడుదల
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణశాఖ అమ్ములపొదిలో మరో కీలక అస్త్రం చేరనుంది. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసిన సీసీపీటీ(క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్) వాహనాలను సోమవారం సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో విడుదల చేయనున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో అనేక రక్షణ ఉత్పత్తులను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తోంది. ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(ఏవీఎన్ఎల్) ఐదు ఉత్పత్తి యూనిట్లలో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒకటి. ఏవీఎన్ఎల్ ప్రధానంగా ఆర్మ్డ్ ఫైటింగ్ వెహికల్స్(మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు), మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్ని భారత సైన్యంలోని వివిధ విభాగాల కోసం తయారు చేస్తుంది. ఇప్పటికే టీ–90 ట్యాంక్, టీ–72 ట్యాంక్, బీఎంపీ–2(శరత్ ట్యాంక్), ఎంబీటీ అర్జున్ ఉండగా, యుద్ధక్షేత్రంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా తాజాగా ఈ క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్(సీసీపీటీ) వాహనాన్ని రూపొందించారు. సీసీపీటీ ప్రత్యేకతలు ఇవీ.. సీసీపీటీని డీఆర్డీవోలోని కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(సీవీఆర్డీఈ) రూపొందించింది. అన్ని వ్యూహాత్మక, సాంకేతిక అగ్ని నియంత్రణ విధుల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఆర్టిలరీ గన్ల అన్ని వెర్షన్ల ఫైర్ కంట్రోల్ ఫంక్షన్లను సాధించడం కోసం తయారు చేశారు. సీసీపీటీ అనేది అన్ని భారతీయ ఆర్టిలరీ గన్ కమాండ్ పోస్ట్ ఫంక్షన్లకు ఒక సాధారణ వేదికగా పనిచేస్తుంది. తొలుత 2018లో 43 వాహనాల సరఫరా కోసం మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఇండెంట్ ఇచ్చారు. వివిధ దశల్లో రూపొందించిన అనంతరం 2021లో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రెండు సీసీపీటీ వాహనాలు ఉత్పత్తి చేసి, ట్రయల్స్ కోసం భారత సైన్యానికి అప్పగించింది. వివిధ భూభాగాలు, వాతావరణ పరిస్థితులలో ప్రభావవంతంగా పని చేయగలదని ట్రయల్స్లో సీసీపీటీ వాహనాలు నిరూపించాయి. దీంతో వాటిని పూర్తిస్థాయిలో సైన్యంలో ప్రవేశపెట్టేవిధంగా సోమవారం వాటిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. -
బీచ్ క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్..!
-
ఎక్కడికైనా వస్తుంది.. కల్తీని పట్టేస్తుంది
సాక్షి, అమరావతి: ఆహార కల్తీ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దుకాణాలు, హోటళ్లు, ఇతర ప్రదేశాల్లో ఆహార కల్తీని సులభంగా గుర్తించేలా ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ పేరిట ల్యాబ్తో కూడిన మొబైల్ వాహనాలు త్వరలో రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. వీటిద్వారా ఆహార కల్తీని అప్పటికప్పుడే కనిపెట్టే సౌకర్యం అందుబాటులోకి రాబోతుంది. రెండు దశల్లో 14 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. తొలి దశలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం రీజియన్లకు ఒక్కొక్కటి, స్టాండ్ బై కింద ఒక వాహనం చొప్పున మొత్తం నాలుగు కొనుగోలు చేస్తున్నారు. ఇక రెండో దశలో 10 వాహనాలను కొనుగోలు చేయనున్నారు. రెండు దశల్లో 14 వాహనాలు అందుబాటులోకి వచ్చాక ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన పాత జిల్లా కేంద్రంలో ఒక్కొక్క వాహనాన్ని అందుబాటులో ఉంచనున్నారు. ఒక్కో వాహనం కొనుగోలుకు రూ.45 లక్షల చొప్పున ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. తొలి దశలో 4 వాహనాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్విసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎంఎస్ఐడీసీ) టెండర్లు ఆహా్వనించింది. ప్రతి వాహనంలో 80 రకాల పరీక్షలు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వాహనంలో 80 రకాల పరీక్షలు చేసే సౌకర్యం ఉంటుంది. పాల కల్తీని నివారించడానికి యూరియా, డిటర్జెంట్, ఇతర రసాయనాలను కలిపారా? లేదంటే పాలల్లో కొవ్వు, సాలిడ్ నాట్ ఫ్యాట్ (ఘన పదార్థాలు) స్థాయిలను తెలుసుకోవడానికి మిల్క్ అనలైజర్ అందుబాటులో ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారేమో తెలుసుకోవడానికి టీపీసీ, ఆహార పదార్థాల తయారీలో ఫుడ్ కలర్స్ ఆనవాళ్లు పసిగట్టడానికి, ఉప్పులో అయోడిన్ వంటి పరీక్షలు చేయడానికి మ్యాజిక్ బాక్స్, టిష్యూపేపర్ టెస్ట్లు మొబైల్ ల్యాబ్లో నిర్వహించవచ్చు. డిజిటల్ మల్టీ పారామీటర్, హ్యాండ్ మిల్లీమీటర్ (పీహెచ్ కండెక్టివిటీ, టీడీఎస్, టెంపరేచర్), డిజిటల్ రీ ఫ్యాక్టో మీటర్, డిజిటల్ బ్యాలెన్స్, హాట్ ప్లేట్, హాట్ ఎయిర్ ఓవెన్, రాపిడ్ మిల్క్ స్క్రీనింగ్ తదితర పరికరాలు ఉంటాయి. ఫుడ్ పాయిజన్, డయేరియా వంటి ఘటనల్లో నీటిలో బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించడానికి శాంపిళ్లను నిర్ధేశిత టెంపరేచర్లో భద్రపరిచి సెంట్రల్ ల్యాబ్కు తరలించడానికి వీలుంటుంది. కల్తీ నియంత్రణ చర్యల్లో భాగంగా.. ఆహార కల్తీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం. కల్తీని తక్షణమే పసిగట్టి బాధ్యులపై చర్యలు తీసుకునే వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న విధానంలో శాంపిళ్లు సేకరించి ల్యాబ్స్కు పంపి పరీక్షించి ఫలితాలు రావడానికి సమయం పడుతోంది. ఈ కాలయాపనకు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్తో చెక్ పడుతుంది. పాఠశాలలు, హాస్టళ్లు, ఇతర ప్రదేశాల్లో ఫుడ్ పాయిజన్, డయేరియా కేసులు నమోదైనప్పుడు సత్వరమే స్పందించడానికి మొబైల్ ల్యాబ్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. – జె.నివాస్, కమిషనర్, రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ -
హైదరాబాద్ లో 162 సిల్ట్ కార్టింగ్ వాహనాలు అందజేత
-
ఫిఫ్త్ ఫ్లోర్లో పెట్రోల్ బంక్ ఎందుకు కట్టారు? వాహనదారులు ఎలా వెళతారు?
ప్రపంచంలో లెక్కలేనన్ని వింతలు విడ్డూరాలు కనిపిస్తాయి. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. తాజాగా ఇలాంటి వింత ఉదంతం వైరల్ అవుతోంది. భవనంలోని 5వ అంతస్తులో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం విస్మయం గొలుపుతోంది. ఈ భవనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను @TansuYegen అనే వినియోగదారు ట్విట్టర్లో షేర్ చేశారు. కోట్లాది మంది యూజర్స్ ఈ వీడియో చూశారు. ఈ భవనంలోని ఐదవ అంతస్తులో గల పెట్రోల్ బంక్ దగ్గరకు వాహనదారులు ఎలా వెళతారనే ప్రశ్న అందరిమదిలోనూ మెదులుతోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ పెట్రోల్ బంక్ చైనాలోని చాంగ్కింగ్లో నిర్మితమయ్యింది. పెట్రోలు బంక్కు వచ్చిన కొన్ని వాహనాల్లో ఇంధనం నింపుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. నిజానికి ఈ భవనం తక్కువ ఎత్తులోనే ఉంది. ఇది కొండ ప్రాంతం కావడంతో భవనం దిగువ భాగంలో నిర్మించబడింది. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ భవనం ఐదవ అంతస్తుకు వెనుక నుంచి మరో మార్గం ఉంది. ఆ దారిగుండా వాహనదారులు సులభంగా పెట్రోల్ బంక్కు చేరుకోగలుగుతారు. చైనావాసుల ప్రతిభకు ఈ పెట్రోల్ బంక్ అద్భుతమైన ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా చదవండి: ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు అలా ఎందుకు జరిగాయి? అల్లుని మృతదేహాన్ని చూసి నెహ్రూ ఏమన్నారు? Refueling on the rooftop of a parking lot and subway passing through a residential building in the city of Chongqing, China. pic.twitter.com/gKZpbUA9wn — Tansu YEĞEN (@TansuYegen) September 2, 2023 -
రూ. 45 వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ వచ్చే ఎనిమిదేళ్లలో తమ వార్షికోత్పత్తిని 40 లక్షల యూనిట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. ఇందుకోసం రూ. 45,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. సంస్థ వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) పాల్గొన్న సందర్భంగా చైర్మన్ ఆర్సీ భార్గవ మంగళవారం ఈ మేరకు ’మారుతీ 3.0’ వెర్షన్ భారీ విస్తరణ ప్రణాళికలను వెల్లడించారు. తమ సంస్థ 40 ఏళ్లలో వార్షికంగా ఇరవై లక్షల యూనిట్ల తయారీ, అమ్మకాలను సాధించిందని ఆయన చెప్పారు. కంపెనీ ప్రస్థానంలోని మూడో దశలో టర్నోవరును రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్లు, సీఎన్జీ మొదలైన టెక్నాలజీలన్నింటినీ పరిశీలించనున్నట్లు భార్గవ చెప్పారు. 2030–31 నాటికి మరో 20 లక్షల వార్షికోత్పత్తి, 28 మోడల్స్ను జోడించుకోవాలని భావిస్తున్నట్లు వివరించారు. ‘తొలి దశలో మాది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండేది. కోవిడ్ మహమ్మారితో మా రెండో దశ ముగిసింది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్ల మార్కెట్గా భారత్ ఆవిర్భవించింది. రాబోయే రోజులు చాలా సవాళ్లతో, చాలా అనిశ్చితితో కూడుకున్నవిగా ఉంటాయి.కొత్తగా ఇరవై లక్షల కార్ల సామర్థ్యాన్ని సాధించేందుకు దాదాపు రూ. 45,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటుంది‘ అని భార్గవ చెప్పారు. మార్కెట్ వాటా మళ్లీ పెంచుకుంటాం.. చిన్న కార్లకు డిమాండ్ మందగించడంతో తగ్గిన తమ మార్కెట్ వాటాను .. వేగంగా వృద్ధి చెందుతున్న ఎస్యూవీ సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడం ద్వారా మళ్లీ పెంచుకుంటామని భార్గవ ధీమా వ్యక్తం చేశారు. అటు ఎలక్ట్రిక్ వాహనాల విషయానికొస్తే.. దేశీయంగా విద్యుత్ వాహనాల పరిస్థితుల గురించి కంపెనీ యాజమాన్యం క్షుణ్నంగా అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. 2024–25 నుంచి 2030–31 మధ్య కాలంలో ఆరు మోడల్స్ను ఉత్పత్తి చేయాలనే ప్రణాళికలు ఉన్నాయని భార్గవ తెలిపారు. ఇక రూ. 10,000కు చేరువకు షేరు ధర చేరిన నేపథ్యంలో స్టాక్ను విభజించే అంశాన్ని బోర్డు ముందు ఉంచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆటోమోటివ్ రంగానికి పీఎల్ఐ స్కీము పొడిగింపు ఆటోమోటివ్ రంగానికి సంబంధించిన రూ. 25,938 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే తెలిపారు. వాస్తవంగా 2022–23 నుంచి 2026–27 వరకు ఉద్దేశించిన ఈ స్కీము.. తాజా నిర్ణయంతో 2027–28 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. సబ్సిడీలను మూడు నెలలకోసారి విడుదల చేయడం, విలువ జోడింపును పరీక్షించే ఏజెన్సీల సంఖ్యను ప్రస్తుతమున్న రెండు నుంచి నాలుగుకు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలంటూ పరిశ్రమ వర్గాలు కోరాయని ఆయన చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. 2022 ఏప్రిల్ 1 తర్వాత నుంచి దేశీయంగా తయారైన నిర్దిష్ట అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఏఏటీ) ఉత్పత్తుల అమ్మకాలకు ఈ స్కీము వర్తిస్తుంది. దీని పనితీరును సమీక్షించిన సందర్భంగా మంత్రి తాజా వివరాలు వెల్లడించారు. కొత్త టె క్నాలజీ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయ డాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎల్ఐ స్కీముకి 95 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. -
ఎటూకాని తోవలో బండి చక్రాల్లో గాలి అయిపోతే?
చిన్నవైనా, పెద్దవైనా వాహనాలకు చక్రాలు, వాటికి టైర్లు ఉంటాయి. టైర్లలో గాలి నింపడం పెద్ద పని. సైకిల్ టైర్లలోకి గాలి కొట్టడం కొద్దిపాటి శ్రమతో కూడుకున్న పని అయితే, భారీ వాహనాల టైర్లకు గాలి కొట్టడం అంత తేలిక పనికాదు. వాటిలో గాలి నింపుకోవడానికి పెట్రోల్ బంకులకో, మెకానిక్ షెడ్లకో వెళ్లక తప్పదు. ఎటూకాని తోవలో బండి చక్రాల్లో గాలి అయిపోతే ఎదురయ్యే తిప్పలు వర్ణనాతీతం. అలాంటి తిప్పలను తప్పించడానికే అమెరికన్ కంపెనీ ‘థామస్ పంప్స్’ ఇంచక్కా చేతిలో ఇమిడిపోయే ‘మినీ పంప్’ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని చక్కగా జేబులో వేసి తీసుకుపోవచ్చు. దీని బరువు 115 గ్రాములు మాత్రమే! ఎలాంటి తోవలోనైనా వాహనం చక్రాల్లోని గాలి అయిపోతే, అక్కడికక్కడే దీంతో క్షణాల్లో గాలి నింపుకోవచ్చు. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీని బ్యాటరీ 25 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. దీని సాయంతో సైకిల్ టైర్లలో 70 సెకన్లలోనే గాలి నింపుకోవచ్చు. మోటార్ సైకిళ్లు మొదలుకొని భారీ వాహనాలకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. కాకుంటే, టైరు పరిమాణాన్ని బట్టి కొంత ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఫుట్బాల్, బాస్కెట్బాల్ బంతుల్లో కూడా క్షణాల్లో గాలి నింపుకోవచ్చు. దీని ధర 119 డాలర్లు (రూ.9898). -
నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదివారం జిల్లా కేంద్రం సూర్యా పేటలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ సముదాయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చినందున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నా రు. ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో 100 ఎకరాల్లో పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11:15 గంటలకు సీఎం కేసీఆర్ సూర్యాపేట పట్టణ కేంద్రానికి చేరుకొని, సాయంత్రం 4:50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్కు వెళ్లనున్నారు. జాతీయ రహదారిపై నేడు వాహనాల మళ్లింపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ బహిరంగసభ నేపథ్యంలో వాహనాలను దారి మళ్లిస్తు న్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్పల్లి వద్ద నల్లగొండ వైపు మళ్లిస్తారు. ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల నుంచి ఖమ్మం రహదారి మీదుగా మళ్లించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబా ద్ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్నగర్, మి ర్యాలగూడ మీదుగా నార్కట్పల్లి వైపు మళ్లిస్తారు. -
దశాబ్దిలో రెండింతలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాల సంఖ్య గత పదేళ్ల కాలంగా గణనీయంగా పెరిగింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో 70,73,109 వాహనాలు ఉండగా.. 2022–23 నాటికి 1,54,77,512కు చేరాయి. సగటున ఏడాదికి 9% చొప్పున పెరుగుదల నమోదు అయినట్లు రవాణా శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే 10 లక్షల వాహనాలు కొత్తగా రోడ్లపైకి వచ్చాయి. ఇక రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో దాదాపు సగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండటం విశేషం. గణనీయంగా పెరుగుతున్న ఈవీలు తెలంగాణలోని మొత్తం 1.54 కోట్ల వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 1.13 కోట్ల వరకు ఉన్నాయి. మోటారు కార్లు 20 లక్షలు, ఆటోలు 4.5 లక్షలు, స్కూలు బస్సులు 28,962, గూడ్స్ ఆటోలు 6.09 లక్షలు, ఈ–కార్ట్స్ 235, మోటారు క్యాబ్స్ 20,335, మ్యాక్సీ క్యాబ్స్ 31,060, కాంట్రాక్ట్ క్యారేజెస్ 9,244, ట్రక్కులు/ట్రాక్టర్లు 7 లక్షల వరకు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఉన్న 70 లక్షల వాహనాల్లో 50 లక్షలు ద్విచక్ర వాహనాలు కాగా కార్ల వంటి తేలికపాటి వాహనాలు 13 లక్షలు ఉన్నాయి. 2013–14 నాటికి రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉన్న 70.73 లక్షల వాహనాల్లో 8.22 లక్షలు రవాణా వాహనాలు ఉండగా... 63.68 లక్షలు సరుకు రవాణా వాహనాల కేటగిరీకి చెందినవి. అప్పట్లో ద్విచక్ర వాహనాలు 52.84 లక్షలు, కార్లు 7,96,232, జీపులు 14,989, ట్యాక్సీలు 74,097, బస్సులు 40,807, సరుకు రవాణా చేసే తేలికపాటి వాహనాలు 1,85,688, ట్రక్కులు/ట్రాక్టర్లు 1,25,240 ఉండేవి. సెకండ్ హ్యాండ్ మార్కెట్ను సైతం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా కొన్ని ఉత్తరాది నగరాల్లోని బడాబా బులు, సంస్థలు ఆర్థిక సంవత్సరం ముగిసేటప్పుడు పెద్ద సంఖ్యలో కొత్త వాహనాలను ఖరీదు చేస్తుంటారు. ఆదాయపన్ను రిటర్న్స్లో లెక్కలు చూపించడానికే ఇలా చేస్తుంటారు. ఆయా సమ యాల్లో అక్కడ నుంచి భారీ సంఖ్యలో సెకండ్ హ్యాండ్ వాహనాలు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్తుంటాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్లో వాహనాల సంఖ్య 25 లక్షలు ఉండగా... గత దశాబ్ద కాలంగా ఏటా ఈ వాహనాలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని రోడ్లపై 46,937 విద్యుత్ (ఎలక్ట్రిక్) వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు రవాణశాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఈ వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు మినహాయింపు ఇస్తోంది. దీంతో ఏటా ఈ వాహనాల సంఖ్య పెరుగుతోందని, రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు కేవలం తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనాలకు సంబంధించినవి మాత్రమే కాగా.. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్టర్ అయినవి కూడా రాష్ట్రంలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో నగరానికి వచ్చేవీ పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి ఇక్కడకు తీసుకువచ్చే వాహనాలను రిజిస్టర్ చేయించి నంబర్ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ఇప్పటికీ వేల సంఖ్యలో వాహ నాలు అక్కడి రిజిస్ట్రేషన్ నంబర్లతోనే తిరిగేస్తున్నా యి. ఈ కారణంగా వీటి సంఖ్య అధికారిక గణాంకాల్లోకి చేరట్లేదు. -
వాహనదారులకు అలర్ట్.. ఇక ఆగక్కర్లేదు,కొత్త టోల్ వ్యవస్థ రాబోతోంది
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఆపాల్సిన అవసరం లేకుండా కొత్త టోల్ వ్యవస్థను అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. అవరోధం లేని టోల్ వ్యవస్థ కోసం ట్రయల్స్ కొనసాగుతున్నాయి. వాటి ట్రయల్స్ విజయవంతం అయిన వెంటనే, దానిని అమలు చేస్తాము" అని రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. ఈ వ్యవస్థ అమలులోకి వస్తే వాహనదారులు టోల్ బూత్ల వద్ద అర నిమిషం కూడా వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈ నూతన వ్యవస్థ ద్వారా సామర్థ్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. అలాగే కిలోమీటర్ల ఆధారంగా చెల్లింపుల వ్యవస్థకు ఉండొచ్చని తెలిపారు. గతంలో ఫాస్ట్ట్యాగ్ల వినియోగం ద్వారా టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించామని, ప్రస్తుతం ప్రభుత్వం దానిని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు. ఉపగ్రహ, కెమెరాలు వంటి సాంకేతికతల ఆధారితంగా పనిచేసే ఈ నూతన టోల్ వ్యవస్థ పైలట్ ప్రాజెక్ట్గా ఇప్పటికే ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేలో పరీక్షిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు జాతీయ రహదారిపైకి ప్రయాణిస్తున్నప్పుడు టోల్ ప్లాజా వద్ద మీ వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్ను కెమెరా స్కాన్ చేసి డేటాను క్రోడీకరిస్తుంది. మీరు ప్రయాణించిన కి.మీ.లకు ఛార్జీలు విధిస్తుంది. టెలికాం సహా అన్ని రంగాలలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగానే ఇలాంటి పురోగతి అంతా జరుగుతోందని, టెలికమ్యూనికేషన్స్ రంగం అన్ని ఇతర రంగాలతో అనుసంధానమై ఉందని మంత్రి అన్నారు. మెరుగైన టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లు టోల్ ప్లాజాల డేటాను నిర్వహించడంలో సహాయపడతాయని అన్నారు. చదవండి 'ప్రతి ఒక్కరినీ రక్షించలేం..' అల్లర్లపై సీఎం కీలక వ్యాఖ్యలు.. -
అమ్మఒడి వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
ఇంటర్నెట్ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇందులో కొన్ని నెటిజన్లను తెగ ఆకర్శించేస్తాయి. అలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు ట్విటర్ వేదికగా వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వీడియోలో గమనించినట్లయితే ఒక భారీ 'హమ్మర్' (Hummer) రోడ్డుపై ఉండటం చూడవచ్చు. ఇది చూడటానికి సాధారణ కారులా కాకుండా ఒక విమానం మాదిరిగా అనిపిస్తుంది. ఈ కొత్త మోడిఫైడ్ కారు దుబాయ్కి చెందిన 'షేక్ హమద్ బిన్ హమ్దాన్ నహ్వాన్'కి చెందినదిగా తెలుస్తోంది. ఇతన్ని అక్కడి ప్రజలు రెయిన్బో షేక్ అని కూడా పిలుస్తారు. ఇదీ చదవండి: ఆధార్పై కేంద్రం సంచలన నిర్ణయం.. పుట్టిన బిడ్డకు ఎంతో మేలు! కార్ల మీద అమితమైన ఆసక్తి కలిగిన ఈయన దీనిని ప్రత్యేకంగా రూపోంచించినట్లు తెలుస్తోంది. ఇది సాధారణ హమ్మర్ కారుకంటే మూడు రెట్లు పెద్దదిగా ఉంది. దీని పొడవు 184.5 ఇంచెస్, వెడల్పు 865 ఇంచెస్, ఎత్తు 77 ఇంచెస్ వరకు ఉంది. ఈ వీడియో ఎంతోమంది ఆటోమొబైల్ ప్రెమికులను కట్టిపడేస్తోంది. Dubai Rainbow Sheikh’s giant Hummer H1 “X3” is three times bigger than a regular Hummer H1 SUV (14 meters long, 6 meters wide, and 5.8 meters high). The Hummer is also fully drivable [read more: https://t.co/LlohQguhTM]pic.twitter.com/uV1Z4juHKx — Massimo (@Rainmaker1973) July 27, 2023
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఢిల్లీ మెట్రోలో రాహుల్.. ఫొటో వైరల్
వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!
టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని చెప్పినా పోలీసులు స్పందించలేదు: అనిల్ కుమార్
విరాట్ కోహ్లి ఆర్సీబీని వీడాలి.. ఆ జట్టులో చేరాలి: ఇంగ్లండ్ స్టార్
పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
మనం అరెస్టు చేయడమే కానీ మనల్ని అరెస్టు చేయడం ఉంటుందనుకోలే!!
చిన్నమ్మ స్వార్ధానికి మునిగిపోతున్న బీజేపీ..
ఏఐతో మరింత అందంగా: రిలయన్స్
Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
బుద్ధ పూర్ణిమ వేళ.. భక్తుల గంగా స్నానాలు
తప్పక చదవండి
- పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
- ‘నాగి..నిన్ను కొట్టాలి.. ‘బుజ్జి’ గ్లింప్స్పై ప్రభాస్ రియాక్షన్
- న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ మూసివేత? రైళ్ల మళ్లింపునకు సన్నాహాలు?
- YS Raja Reddy: ప్రజల గుండెలలో పెద్దాయన
- ‘ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేయండి’
- నిందితుని కోసం ఆసుపత్రిలోకి దూసుకొచ్చిన పోలీస్ వ్యాన్
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి!
- ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!
- కాంగ్రెస్ హత్యారాజకీయాలకు భయపడేది లేదు: హరీష్ రావు ఫైర్
- అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
Advertisement