-
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలనుకున్న కేరళ స్పిన్నర్ ఆశా శోభన కల ఎట్టకేలకు నేరవేరింది. సోమవారం సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలలతో జరుగుతున్న నాలుగో టీ20లో ఆశా శోభనా టీమిండియా తరపున అరంగేట్రం చేసింది. భారత బ్యాటర్ స్మృతి మంధాన చేతుల మీదగా శోభన టీమిండియా క్యాప్ అందుకుంది. కాగా ఆశా శోభన 33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఆశా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఎవరీ ఆశా శోభన?ఆశా శోభన దేశీవాళీ క్రికెట్లో కేరళ సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్ను ఆదర్శంగా తీసుకుని ఆశా శోభన క్రికెట్ను కెరీర్గా ఎంచుకుంది. 13 ఏళ్ల వయస్సులోనే ఆశా క్రికెట్ వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత కేరళ జట్టు తరపున అద్బుతంగా రాణించడంతో భారత-ఏ జట్టులో ఆమెకు చోటు దక్కింది. కానీ సీనియర్ జట్టులో మాత్రం చోటు దక్కించుకలేకపోయింది. అయితే డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు ఆమెను సొంతం చేసుకుంది. తొలి సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆశా.. డబ్ల్యూపీఎల్-2024 సీజన్లో మాత్రం దుమ్ములేపింది. 10 మ్యాచ్ల్లో 7.11 ఏకానమితో 12 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. ఈ క్రమంలో భారత సెలక్టర్లు నుంచి ఆశాకు పిలుపు వచ్చింది. -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
#RCB: ఇదేందయ్యా.. ఆ పందొమ్మిది పేర్లు పచ్చబొట్టుగా!
అభిమానులందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు వేరు అని మరోసారి నిరూపించాడు ఓ యువకుడు. మాట నిలబెట్టుకుంటూ ఏకంగా పందొమ్మిది పేర్లను చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఇంతకీ ఆ పేర్లు ఎవరివంటే?!.. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ‘ఈసారి కప్ మనకే’ అని ఆశలు పెట్టుకోవడం.. ఆఖరి దాకా ఎదురుచూసి ఉసూరుమనడం.. పదహారేళ్లుగా ఆర్సీబీ ఫ్యాన్స్కు అలవాటైపోయింది. మధ్యలో మూడుసార్లు ఫైనల్ వరకు చేరినా ఆఖరి మెట్టుపై బోల్తా పడటంతో నెక్ట్స్ టైమ్ బెటర్ లక్ అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయారు. విరాట్ కోహ్లి వంటి స్టార్, రన్మెషీన్లో జట్టులో ఉన్నా ఆర్సీబీ టైటిల్ గండం దాటకపోవడంతో ఒకరకంగా పూర్తి నిరాశలో కూరుకుపోయారు. అలాంటి అభిమానులకు కొత్త ఊపిరిలూదుతూ మహిళా జట్టు తొలిసారి ఆర్సీబీకి ట్రోఫీ అందించింది. వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్-2024లో చాంపియన్గా అవతరించి బెంగళూరు ఫ్రాంఛైజీకి మొదటి టైటిల్ అందించింది. స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ వుమెన్ టీమ్ ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో ఓ అభిమాని టైటిల్ సాధించిన ఆ జట్టులోని ప్లేయర్ల అందరి పేర్లు పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇందులో తాజా ఎడిషన్కు దూరమైన హీథర్ నైట్ పేరు కూడా ఉండటం విశేషం. ఈ మేరకు.. ‘‘మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్ చేరినా మెన్స్ టీమ్ టైటిల్ సాధించలేకపోయింది. అయితే, పదహారేళ్ల మా కలను ఆర్సీబీ మహిళా జట్టు నెరవేర్చింది. ఒకవేళ WPL 2024 గెలిస్తే వాళ్ల పేర్లను టాటూ వేయించుకుంటానని నేను ప్రామిస్ చేశా. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నా’’ అంటూ మనోజ్ నాయక్ అనే ట్విటర్ యూజర్ అకౌంట్లో ఓ వీడియో ప్రత్యక్షమైంది. ఇందులో ఆర్సీబీ జెర్సీ వేసుకున్న వ్యక్తి.. స్మృతి మంధాన సహా జట్టులోని మొత్తం పందొమ్మిది పేర్లను పచ్చబొట్టు వేయించుకున్నాడు. మరి వాళ్ల పేర్లు ఏమిటంటే.. స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలిస్ పెర్రీ, రేణుకా సింగ్, రిచా ఘోష్, దిశా కసత్, శ్రేయాంక పాటిల్, ఇంద్రాణి రాయ్, ఆశా శోభన, ఏక్తా బిస్త్, సబ్బినేని మేఘన, జార్జియా వరేహం, శుభా సతీశ్, కేట్ క్రాస్, నదినె డి క్లర్క్, సోఫీ మొలినెక్స్, సిమ్రన్ బహదూర్, శ్రద్ధా పొఖార్కర్, హీథర్ నైట్(తాజా ఎడిషన్కు దూరం). ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో ఆర్సీబీకి శుభారంభం లభించలేదు. ఆరంభ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన బెంగళూరు.. తర్వాత పంజాబ్ కింగ్స్పై గెలిచింది. కానీ మూడో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఎదుర్కొన్న ఫాఫ్ డుప్లెసిస్ బృందం మళ్లీ ఓటమిని చవిచూసింది. తదుపరి మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. చదవండి: #Mayank Yadav: నేను ఆరాధించే ఫాస్ట్ బౌలర్ ఆ ఒక్కడే: నయా ‘స్పీడ్గన్’ Frm loosing 3 IPL finals n never giving up and wining an @wplt20 🏆. @RCBTweets women's have given us everything what we dreamed for the past 16yrs😭. Had promised myself to get inked of all the RCB players name if they win this wpl 2024. And today I kept my promise.#RCBFAN pic.twitter.com/SpDaVk9wOT — Manoj nayak (@Nmanoj183) March 30, 2024 -
వివాదంలో భారత ఆల్రౌండర్.. ప్రధాని మోదీకి క్షమాపణలు
ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తనకు అపార గౌరవం ఉందని భారత మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ తెలిపింది. బీజేపీ నేతలను ఉద్దేశించి తన అకౌంట్ నుంచి అభ్యంతరకర పోస్టు ఎలా వెళ్లిందో తెలియదని.. అప్పుడు తన ఫోన్ తన ఆధీనంలో లేదని స్పష్టం చేసింది. ఏదేమైనా తెలియకుండానే చాలా మంది హృదయాలను గాయపరిచానని.. ఇందుకు చింతిస్తున్నట్లు పూజా పేర్కొంది. ప్రధాని మోదీకి క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా టీమిండియా ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ ఇన్స్టా స్టోరీలో ‘వసూలీ టైటాన్స్’ పేరిట ప్రధాని మోదీతో పాటు బీజేపీ కీలక నేతలు, కేంద్ర మంత్రుల మార్ఫింగ్ ఫొటో ప్రత్యక్షమైంది. శుక్రవారం నాటి పోస్టు నెట్టింట వైరల్కాగా వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో ఈ విషయంపై స్పందించిన పూజా వస్త్రాకర్.. ‘‘నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి అత్యంత అభ్యంతరకరమైన ఫొటో పోస్ట్ అయినట్లు నా దృష్టికి వచ్చింది. నిజానికి ఆ సమయంలో ఫోన్ నా దగ్గర లేదు. ప్రధాన మంత్రి పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. తెలిసో తెలియకో నా వల్ల కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాను. క్షమాపణలు కోరుతున్నాను’’ అని ఇన్స్టాగ్రామ్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కాగా మధ్యప్రదేశ్కు చెందిన 24 ఏళ్ల పూజా వస్త్రాకర్ టీమిండియా బౌలింగ్ ఆల్రౌండర్. భారత్ తరఫున 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఆమె.. ఇప్పటి వరకు నాలుగు టెస్టులు, 30 వన్డేలు, 58 టీ20 మ్యాచ్లు ఆడింది. టెస్టుల్లో 14, వన్డేల్లో 23, టీ20లలో 40 వికెట్లు తీసింది. వన్డేల్లో నాలుగు అర్ధ శతకాలు కూడా సాధించింది. టెస్టుల్లో 47, టీ20లలో 37* పూజా అత్యధిక స్కోర్లు. ఇక ఇటీవల ముగిసిన వుమెన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన పూజా వస్త్రాకర్ నిరాశపరిచింది. ఆడిన తొమ్మిది మ్యాచ్లలో కలిపి ఈ రైటార్మ్ పేసర్ కేవలం ఐదు వికెట్లు తీసింది. చదవండి: #Kohli: పాపం.. కోహ్లి ఒక్కడు ఏం చేయగలడు? -
RCB: అభిమానులకు క్షమాపణ చెప్పిన ఆర్సీబీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ తమ అభిమానులకు క్షమాపణ చెప్పింది. ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ సందర్భంగా కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ డబ్బు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. కాగా ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ పేరిట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 19న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అట్టహాసంగా ఈవెంట్ నిర్వహించింది. విరాట్ కోహ్లి సహా ఆర్సీబీ స్టార్లు, వుమెన్ ప్రీమియర్ లీగ్-2024లో చాంపియన్గా నిలిచిన ఆర్సీబీ మహిళా జట్టు.. ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో ఆర్సీబీ తమ పేరు, లోగో మార్పులతో పాటు కొత్త జెర్సీని కూడా విడుదల చేసింది. అయితే, ఈ ఈవెంట్ను ఆర్సీబీ వెబ్సైట్, యాప్లో ప్రత్యక్షంగా వీక్షించాలంటే రూ. 99 చెల్లించాలని నిబంధన విధించింది. అయినప్పటికీ చాలా మంది అభిమానులు డబ్బు చెల్లించి ఈవెంట్ను చూసేందుకు సిద్ధమయ్యారు. అక్కడ ఫ్రీగా స్ట్రీమింగ్ కానీ.. ప్రసారంలో ఇబ్బందులు తలెత్తడంతో తమ అధికారిక యూట్యూబ్ చానెల్లో లైవ్ స్ట్రీమింగ్ చేసింది. దీంతో డబ్బు చెల్లించిన వాళ్లు.. ‘‘ఇదేం పద్ధతి’’ అంటూ ఆర్సీబీ తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో క్షమాపణ కోరుతూ ఆర్సీబీ ప్రకటన విడుదల చేసింది. మీ డబ్బులు రీఫండ్ చేస్తాం ‘‘ప్రియమైన ఆర్సీబీ అభిమానులారా.. పెద్ద ఎత్తున ఈ ఈవెంట్కు డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో లైవ్ స్ట్రీమింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా అంతరాయం కలిగింది. అందుకే మీ డబ్బులు రీఫండ్ చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే ఆ ప్రక్రియ కూడా మొదలుపెట్టేశాం. రానున్న ఏడు రోజుల్లో మీ డబ్బు మీ అకౌంట్లకు చేరుతుంది. మాతో సహకరించినందుకు ధన్యవాదాలు. తదుపరి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని ఆర్సీబీ గురువారం తెలిపింది. కాగా ఈరోజు(మార్చి 22)న ఐపీఎల్-2024 ఎడిషన్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో ఈ టోర్నీకి తెరలేవనుంది. కొత్త కెప్టెన్ రుతురాజ్గైక్వాడ్ సారథ్యంలో చెన్నై.. ఫాఫ్ డుప్లెసిస్ బృందంతో తలపడనుంది. చదవండి: ధోని ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: టీమిండియా మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ -
IPL 2024: ఐపీఎల్ టైటిల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విరాట్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ (మార్చి 19) జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అన్బాక్స్ ఈవెంట్లో ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ మహిళల ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకోవడంపై స్పందిస్తూ.. ఈ ఏడాది ఆర్సీబీ టైటిళ్ల సంఖ్యను డబుల్ చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. మహిళల ఆర్సీబీ జట్టు టైటిల్ గెలిచినప్పుడు తామందరం మ్యాచ్ చూస్తున్నామని.. ఆ సమయంలో ఆర్సీబీ అభిమానుల స్వచ్ఛమైన ప్రేమను ఫీలయ్యామని అన్నాడు. ఆర్సీబీ టైటిల్ గెలిచిన క్షణాన బెంగళూరు నగరమే టైటిల్ గెలిచిన ఫీలింగ్ కలిగిందని తెలిపాడు. ఇన్నేళ్ల పాటు అభిమానులు మాపై ఉంచిన నమ్మకాన్ని త్వరలోనే డబుల్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. THE RCB TEAM IS READY FOR IPL 2024...!!!!! 🔥 pic.twitter.com/aRCU4671at — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 16 ఏళ్లలో తాను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా టైటిల్ గెలవాలనే దృడ సంకల్పంతోనే వచ్చానని.. అందు కోసం ప్రతిసారి శాయశక్తుల కృషి చేశానని పేర్కొన్నాడు. ఐపీఎల్ టైటిల్ తొలిసారి గెలిచిన ఆర్సీబీ జట్టులో ఉండాలన్నది తన కోరిక అని.. అభిమానులు, ఫ్రాంచైజీకి సహకారాన్ని ఎప్పటికీ మరువలేనని, టైటిల్ గెలిచి వీరి రుణాన్ని తీర్చుకుంటానని తెలిపాడు. కాగా, అన్బాక్స్ ఈవెంట్ ప్రారంభానికి ముందు మహిళల ఐపీఎల్ ఛాంపియన్స్ ఆర్సీబీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన పురుషుల ఆర్సీబీ బృందంలో విరాట్ కోహ్లి కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా విరాట్.. సహచరులతో కలిసి చప్పలు కొడుతూ ఛాంపియన్స్ను మైదానంలోకి ఆహ్వానించాడు. ఈ ఈవెంట్ సందర్భంగా విరాట్ చాలా హుషారుగా కనిపించాడు. మహిళా క్రికెటర్లతో కలిసి ఫోటోలను పోజులిచ్చాడు. చిన్నస్వామి స్టేడియం మొత్తం విరాట్ నామస్మరణతో మార్మోగిపోయింది. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే ఆర్సీబీ.. డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కేతో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
IPL 2024: మహిళా ఛాంపియన్లకు "గార్డ్ ఆఫ్ హానర్" ఇచ్చిన ఆర్సీబీ
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో అన్బాక్స్ పేరిట ఓ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ సందర్భంగా ఆర్సీబీ టీమ్.. మహిళా ఐపీఎల్ ఛాంపియన్లను (ఆర్సీబీ) గౌరవించుకుంది. ఆర్సీబీ బృందం తమ మహిళా జట్టుకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చింది. ఆర్సీబీ పురుష జట్టు సభ్యులు ఇరు వైపులా నిలబడి తమ మహిళా బృందాన్ని చప్పట్లతో సాదరంగా మైదానంలోకి ఆహ్వానించారు. RCB Team Giving Guard of honour to Women's team at Chinnaswamy stadium. - MOMENT OF THE DAY...!!!! ⭐ pic.twitter.com/JxqKUniGgW — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 Great Gesture by RCB Team...!!!!! 👏❤️ - They giving guard of honour to RCB Women's team at Chinnaswamy stadium. pic.twitter.com/2AGVcZjVqB — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 RCB Team giving Guard of honour to RCB Women's team at Chinnaswamy stadium. - This is Beautiful gesture by RCB Team...!!!!! ❤️ pic.twitter.com/PseXxeAOdC — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 మహిళా ఆర్సీబీ జట్టు కెప్టెన్ స్మృతి మంధన ముందు నడుస్తుండగా జట్టు సభ్యులు ఆమెను ఫాలో అయ్యారు. గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్న అనంతరం ఆర్సీబీ మహిళా జట్టు ప్రేక్షకులకు అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ తిరిగింది. అన్బాక్స్ ఈవెంట్ సందర్భంగా మెన్స్ ఆర్సీబీ టీమ్ కీలక సభ్యులు విరాట్ కోహ్లి, ఫాఫ్ డెప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ మహిళల ఆర్సీబీ జట్టు సభ్యులను అభినందించారు. ఫోటోలకు పోజులిచ్చారు. Asha Sobhana clicked selfie with Virat Kohli at Chinnaswamy. - A beautiful picture! pic.twitter.com/S13eiyId4M — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 THE CRAZE OF VIRAT KOHLI AND RCB IS REALLY HUGE...!!!!! 🙌 ❤️ pic.twitter.com/Bx79AczHAQ — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 విరాట్ కోహ్లి కొందరు మహిళా జట్టు సభ్యులతో కలిసి సెల్ఫీలు దిగారు. చాలాకాలం తర్వాత విరాట్ కోహ్లిని చూసేందుకు భారీ సంఖ్యలు అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. కోహ్లి నామస్మరణతో స్టేడియం మార్మోగిపోయింది. Smriti Mandhana and her team taking lap of honour to crowds at Chinnaswamy stadium. - This is beautiful...!!!! 🏆 pic.twitter.com/ga7aqXAuNm — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 THE INCREDIBLE ATMOSPHERE AT CHINNASWAMY. - RCB FANS ARE CRAZY...!!!!! 🔥 pic.twitter.com/2UkP8N0RDe — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 కాగా, కొద్ది రోజుల కిందట జరిగిన మహిళల ఐపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలిచి ఆర్సీబీ టీమ్ తొలిసారి ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీకి ఇదే తొలి టైటిల్. పురుషుల జట్టు మూడుసార్లు ఫైనల్కు చేరినప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. మహిళల టీమ్ ఇచ్చిన జోష్తో ఆర్సీబీ మెన్స్ టీమ్ కూడా ఆసారి ఎలాగైనా టైటిల్ సాధిస్తామని ధీమాగా ఉంది. No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 ఈసారి టైటిల్ సాధించేందుకు ఆర్సీబీ మెన్స్ టీమ్ కఠోరంగా శ్రమిస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే ఆర్సీబీ.. డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కేతో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
WPL 2024: ఆర్సీబీ క్వీన్.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
WPL 2024: ఫైనల్లో 4 వికెట్లు.. ఆర్సీబీ క్వీన్! ఎవరీ శ్రేయాంక?
రాయల్ ఛాలెజంజర్స్ బెంగళూరు నిరీక్షణకు తెరపడింది. గత 16 ఏళ్లగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ట్రోఫిని ఎట్టకేలకు ఆర్సీబీ ముద్దాడింది. అయితే ఆర్సీబీ అబ్బాయిలకు సాధ్యం కాని టైటిల్ను.. అమ్మాయిలు అందుకుని చూపించారు. డబ్ల్యూపీఎల్-2024 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించిన ఆర్సీబీ తొలి టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. అయితే ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడడంలో ఆ జట్టు యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ది కీలక పాత్ర. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో 4 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. అంతకుముందు సెమీఫైనల్లో రెండు కీలక వికెట్లు ఆమె పడగొట్టింది. ఓ వైపు కాలి గాయంతో బాధపడుతూనే అద్బుతమైన ప్రదర్శన కనబరిచి తన జట్టుకు టైటిల్ను అందించింది. ఓవరాల్గా ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన పాటిల్ 13 వికెట్లు పడగొట్టి.. పర్పుల్ క్యాప్ను సొంతం చేసుకుంది. కాగా తొలి నాలుగు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన పాటిల్ను ఆర్సీబీ మేనెజ్మెంట్ రెండు మ్యాచ్లకు పక్కన పెట్టేసింది. ఆ తర్వాత మళ్లీ తుది జట్టులోకి వచ్చిన శ్రేయాంక దెబ్బతిన్న సింహంలా చెలరేగిపోయింది. ఈ క్రమంలో ఎవరీ శ్రేయాంక పాటిల్ను నెటిజన్లు తెగ వేతికేస్తున్నారు. ఎవరీ శ్రేయాంక పాటిల్.. 21 ఏళ్ల శ్రేయాంక పాటిల్ బెంగళూరులో జన్మించింది. శ్రేయాంక దేశీవాళీ క్రికెట్లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుంది. అయితే దేశవాళీ క్రికెట్లో మెరుగ్గా రాణించడంతో ఆమె భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది ఆఖరిలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి శ్రేయాంక అడుగుపెట్టింది. ఇప్పటివరకు భారత్ తరపున 2 వన్డేలు, 6 టీ20లు ఆడిన ఈ కర్ణాటక క్రికెటర్.. వరుసగా 4, 8 వికెట్లు పడగొట్టింది. కాగా డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో శ్రేయాంకను రూ.10 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్-2024 సీజన్కు ముందు ఆమెను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. కాగా పాటిల్ మహిళల కరేబియన్ ప్రీమియర్ లీగ్లోనూ భాగమైంది. ఈ లీగ్లో గయానా ఆమెజాన్ వారియర్స్కు శ్రేయాంక ప్రాతినిథ్యం వహిస్తుంది. చదవండి: T20 WC: టీ20 జట్టు నుంచి అవుట్! వరల్డ్కప్లో నో ఛాన్స్! Shreyanka Patil with her Purple Cap award. - The hero of the team! 💜 pic.twitter.com/ATA6DMiYqT — Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2024 Ellyse Perry " Pretty bonkers to be honest. It's another level for us.Shreyanka Patil is such a young player and she has got the world at her feet, they are awesome.Shreyanka and Sophie devine will be owning the stage and they are the goat dangers 😄 "pic.twitter.com/ukWj0D4g9P — Sujeet Suman (@sujeetsuman1991) March 18, 2024 -
ఫైనల్లో ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కెప్టెన్! వీడియో వైరల్
డబ్ల్యూపీఎల్ ట్రోఫీని తొలిసారి ముద్దాడాలని కలలలు గన్న ఢిల్లీ క్యాపిటల్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. టోర్నీ ఆసాంతం దుమ్మురేపిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. దీంతో వరుసగా రెండో సారి టైటిల్కు అడుగు దూరంలో ఢిల్లీ నిలిచిపోయింది. గతేడాది కూడా ఢిల్లీ తుది పోరులోనే ఓటమి పాలైంది. ఇప్పుడు మరోసారి టైటిల్ చేజారడంతో ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ కన్నీటిపర్యంతమైంది. ఉబికి వస్తున్న కన్నీరును ఆమె ఆపుకోలేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా మంది లానింగ్కు మద్దతుగా నిలుస్తున్నారు. ఫైనల్లో ఓడినప్పటికీ లీగ్ మొత్తం బాగా ఆడారు అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సైతం ఆమెకు సపోర్ట్గా నిలిచింది. ఎప్పుడూ నీవు మా రానివే అంటూ లానింగ్ ఫోటోను ఢిల్లీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. Meg Lanning 💔 Chin up, champ 🐐 📸 - JioCinema#WPLFinal #WPL2024 pic.twitter.com/FzvlbN2nVe — shreya (@shreyab27) March 17, 2024 -
ప్రియుడితో కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చిన మంధాన.. ఫోటో వైరల్
డబ్ల్యూపీఎల్-2024 ఛాంపియన్స్గా ఆర్సీబీ నిలిచిన సంగతి తెలిసిందే. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్ పోరులో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ ఖాతాలో తొలి టైటిల్ చేరింది. ఐపీఎల్లో గత 16 ఏళ్లగా ఆర్సీబీ పురుషుల జట్టు నిరాశపరుస్తుండగా.. మహిళల జట్టు మాత్రం కేవలం రెండో సీజన్లోనే టైటిల్ సాధించి సత్తాచాటింది. ఇక 16 ఏళ్ల తర్వాత ఆర్సీబీకి డబ్ల్యూపీఎల్ రూపంలో తొలి టైటిల్ రావడంతో బెంగళూరు ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలిపోయారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి వంటి దిగ్గజ క్రికెటర్లు ఆర్సీబీ మహిళల జట్టును అభినందించారు. బాయ్ ఫ్రెండ్తో స్మృతి.. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బాయ్ ఫ్రెండ్ స్మృతి పలాష్ ముచ్చల్ సందడి చేశాడు. మ్యాచ్ జరుగుతుండగా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తూ పలాష్ కన్పించాడు. అదే విధంగా విజయనంతరం స్మృతి పలాష్ ముచ్చల్తో కలిసి ట్రోఫీతో ఫోటలోకు ఫోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా 2023లో చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు స్వర్ణం గెలిచినప్పుడు కూడా పలాష్ స్మృతితో పోజులిచ్చింది. ఇక గత కాలంగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు. బాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గాపేరు గాంచిన పలాస్కు.. ఓ ఈవెంట్లో మంధానతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. -
స్మృతి మంధానకు వీడియో కాల్ చేసిన కోహ్లి.. వీడియో వైరల్
'ఈ సాల్ కప్ నమదే'.. ప్రతీ ఏడాది ఐపీఎల్ సీజన్కు ముందు ఆర్సీబీ అభిమానుల నుంచే వినిపించే మాట. కానీ భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. ఆఖరికి ఊరించి ఊసురుమన్పించడం ఆర్సీబీకి పరిపాటిగా మారిపోయింది. తమ ఆరాద్య జట్టు ఒక్కసారి ట్రోఫీని ముద్దాడితే చూడాలని పరితపించారు. అయితే ఎట్టకేలకు అభిమానుల కల నేరవేరింది. 16 ఏళ్లుగా ఐపీఎల్లో పురుషుల ఫ్రాంఛైజీకి సాధ్యం కాని టైటిల్ను డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లోనే అమ్మాయిల జట్టు సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసిన ఆర్సీబీ.. తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఆర్సీబీ పురుషుల జట్టు ఆటగాళ్లు సైతం సంబరాల్లో మునిగితేలిపోయారు. తొలిసారి టైటిల్ను సొంతం చేసుకున్న ఆర్సీబీ మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సోషల్ మీడియా వేదికగా తమ మహిళల జట్టును అభినందించాడు. సూపర్ ఉమెన్ అంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అదేవిధంగా టైటిల్ గెలిచిన అనంతరం అర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన వీడియో కాల్ కూడా చేశాడు. మంధానతో పాటు మిగితా ప్లేయర్స్తో విరాట్ కాసేపు సంభాషించాడు. విరాట్ను చూడగానే ఆర్సీబీ ప్లేయర్లు ఆనందంతో గంతులేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా 2008 తొలి సీజన్ నుంచి ఆర్సీబీకి విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: WPL 2024: డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీ... ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా? #RCBUnbox Virat Kohli was literally dancing on the video call. This Trophy matters sooo much to him#ViratKohli𓃵 pic.twitter.com/uFbIxF037d — SAMAR♡︎ (@119_bholi) March 18, 2024 -
డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీ... ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కల ఎట్టకేలకు నేరవేరింది. గత 16 ఏళ్లగా ఐపీఎల్లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్ కలను డబ్ల్యూపీఎల్లో అమ్మాయిలు నెరవేర్చారు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను 8 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ.. తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ బౌలర్ల జోరుకు 113 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో అదరగొట్టగా.. మోలినెక్స్ 3, ఆశ శోభన 2 రెండో వికెట్లు పడగొట్టారు. అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తొలి టైటిల్ విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక డబ్ల్యూపీఎల్ ఛాంపియన్స్గా నిలిచిన ఫ్రైజ్ మనీ ఎంత? ఆరెంజ్ క్యాప్ ఎవరికి దక్కింది? ఇటువంటి విషయాలపై ఓ లూక్కేద్దం. విజేతకు ఎంతంటే? డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీకి రూ.6 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అదేవిధంగా రన్నరప్గా నిలిచిన క్యాపిటల్స్ కు రూ.3 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఆరెంజ్ క్యాప్ విజేత పెర్రీ.. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆర్సీబీ ఆల్రౌండర్ ఎల్లీస్ పెర్రీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచింది. దీంతో ఆమెకు రూ. 5 లక్షల ఫ్రైజ్ మనీ లభించింది. ఓవరాల్గా ఈ సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన పెర్రీ.. 347 పరుగులు చేసింది. పర్పుల్ క్యాప్ హోల్డర్ శ్రేయంక అదేవిధంగా అత్యధిక ఈ ఏడాది సీజన్లో వికెట్లు తీసిన ఆర్సీబీ స్పిన్నర్ శ్రేయంక పాటిల్ పర్పుల్ క్యాప్ హోల్డర్గా నిలిచింది. దీంతో ఆమెకు రూ. 5 లక్షల ఫ్రైజ్ మనీ లభించింది. ఓవరాల్గా ఈ సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన శ్రేయంక.. 13 వికెట్లు పడగొట్టింది. మిగితా అవార్డులు దక్కించుకున్న వారు వీరే.. ప్లేయర్ ఆఫ్ది సిరీస్-దీప్తి శర్మ ఎమర్జింగ్ ప్లేయర్ - శ్రేయాంక పాటిల్ (బెంగళూరు) మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ - దీప్తి శర్మ (యూపీ) బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నీ - సజన సజీవన్ (ముంబై) ఫెయిర్ ప్లే టీమ్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు A special moment to celebrate @imVkohli @mandhana_smriti pic.twitter.com/NkEI6iDIjq — CricTracker (@Cricketracker) March 17, 2024 -
కల నెరవేరింది.. డబ్ల్యూపీఎల్ ఛాంపియన్స్గా ఆర్సీబీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ 2008 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతోంది. మూడుసార్లు ఫైనల్లోకి వచ్చినా... మూడుసార్లూ తుదిపోరులో ఓడిపోయి టైటిల్ను అందుకోలేకపోయింది. ఇదే ఆర్సీబీ ఫ్రాంచైజీ గత ఏడాది మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అడుగు పెట్టింది. తొలి సీజన్లో నాలుగో స్థానంతో నిరాశపరిచింది. అయితే ఏడాది తిరిగేలోపు బెంగళూరు మహిళల జట్టు అద్భుతం చేసింది. ఐపీఎల్లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్ను డబ్ల్యూపీఎల్లో మెరిపించే ఆటతీరుతో బెంగళూరు టైటిల్ను సొంతం చేసుకుంది. తమ ఫ్రాంచైజీకి డబ్ల్యూపీఎల్ టైటిల్ దక్కడంతో ఐపీఎల్ ఆర్సీబీ స్టార్స్ విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్, మాజీ సభ్యులు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, మాజీ యాజమాని విజయ్ మాల్యా తదితరులు అభినందనలు తెలిపారు. న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్యూపీఎల్) రెండో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను మొదట స్పిన్తో కట్టడి చేసి... ఆ తర్వాత జాగ్రత్తగా లక్ష్యాన్ని ఛేదించేసి 8 వికెట్లతో బెంగళూరు గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లలో షఫాలీ వర్మ (27 బంతుల్లో 44; 2 ఫోర్లు, 3 సిక్స్లు) దంచేయగా... కెప్టెన్ మెగ్ లానింగ్ (23 బంతుల్లో 23; 3 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడింది. తర్వాత ఇంకెవరూ 12 పరుగులకు మించి చేయలేకపోయారు. స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్ (3.3–0–12–4), సోఫీ మోలినెక్స్ (3/20), ఆశ శోభన (2/14) ఢిల్లీని దెబ్బ కొట్టారు. అనంతరం బెంగళూరు 19.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 31; 3 ఫోర్లు), సోఫీ డివైన్ (27 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్), ఎలీస్ పెరీ (37 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ పురస్కారం సోఫీ మోలినెక్స్కు దక్కింది. విజేతగా నిలిచిన బెంగళూరు జట్టుకు రూ. 6 కోట్లు ప్రైజ్మనీ లభించింది. గత సీజన్ మాదిరిగానే ఈసారీ ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి, ఆ తర్వాత ఫైనల్లో ఓడిపోయి రన్నరప్తో సరిపెట్టుకోవడం గమనార్హం. ధనాధన్... ఫటాఫట్! ఢిల్లీ ఓపెనర్లు షఫాలీ వర్మ, మెగ్లానింగ్ ఆరంభంలో ధాటిగా చెలరేగిపోయారు. ముఖ్యంగా పవర్ప్లేలో షఫాలీ భారీ సిక్సర్లతో విరుచుకుపడింది. కెపె్టన్ లానింగ్ ఫోర్లతో వేగాన్ని పెంచింది. 6 ఓవర్లలో ఢిల్లీ 61/0 స్కోరు చేసింది. బ్యాటింగ్ పవర్ప్లే తర్వాత బౌలింగ్ పవర్ప్లే మొదలైనట్లుగా ఢిల్లీ వికెట్లు ఫటాఫట్ కూలాయి. 8వ ఓవర్ వేసిన స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ 4 బంతుల్లో 3 వికెట్లు తీసింది. షఫాలీ, కీలకమైన వన్డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (0), క్యాప్సీ (0) వికెట్లను సోఫీ పడగొట్టింది. 64 పరుగుల వద్దే ఈ మూడు వికెట్లు పడ్డాయి. 11వ ఓవర్ నుంచి శ్రేయాంక, ఆశ శోభన తిప్పేయడంతో లానింగ్, మరిజన్ కాప్ (8), జెస్ జొనాసెన్ (3), మిన్ను రాణి (5) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. రాధా యాదవ్ (12; 2 ఫోర్లు) బౌండరీలతో జట్టు స్కోరు 100 దాటాక... మోలినెక్స్ డైరెక్ట్ త్రోకు రాధ రనౌటైంది.19వ ఓవర్ వేసిన శ్రేయాంక రెండో బంతికి అరుంధతి రెడ్డిని (10), మూడో బంతికి తానియా (0)ను అవుట్ చేయడంతో క్యాపిటల్స్ ఆలౌటైంది. పవర్ప్లే తర్వాత ఢిల్లీకి ఏకంగా 47 బంతుల పాటు బౌండరీ గగనమైంది. రాణించిన పెరీ, సోఫీ డివైన్ లక్ష్యం చిన్నదే అయినా... టైటిల్ పోరులో బెంగళూరు ఓపెనర్లు సోఫీ డివైన్, స్మృతి మంధాన అనవసర షాట్లకు వెళ్లకుండా జాగ్రత్తగా పరుగుల్ని రాబట్టారు. దీంతో 6 ఓవర్లలో బెంగళూరు 25/0 స్కోరే చేసింది. అడపాదడపా బౌండరీలతో వేగం పెంచిన సోఫీ డివైన్ జట్టు స్కోరు 49 పరుగుల వద్ద శిఖా పాండే బౌలింగ్లో అవుటైంది. కెప్టెన్ స్మృతికి పెరీ జతవ్వగా ఈ జోడీ కూడా నింపాదిగానే పరుగుల్ని చక్కబెట్టింది. స్వభావానికి విరుద్ధంగా నెమ్మదిగా ఆడిన స్మృతికి మిన్ను మణి చెక్ పెట్టింది. అయితే అప్పటికే బెంగళూరు 82/2 స్కోరుకు చేరింది. మిగతా పరుగుల్ని పెరీ, రిచా ఘోష్ (17 నాటౌట్, 2 ఫోర్లు) పూర్తిచేయడంతో బెంగళూరు 3 బంతులు మిగిలుండగానే ట్రోఫీ గెలిచింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రేయాంక 23; షఫాలీ వర్మ (సి) వేర్హమ్ (బి) సోఫీ మోలినెక్స్ 44; జెమీమా (బి) సోఫీ మోలినెక్స్ 0; క్యాప్సీ (బి) సోఫీ మోలినెక్స్ 0; మరిజన్ కాప్ (సి) సోఫీ డివైన్ (బి) ఆశ 8; జెస్ జొనాసెన్ (సి) స్మృతి (బి) ఆశ 3; రాధా యాదవ్ (రనౌట్) 12; మిన్ను మణి (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రేయాంక 5; అరుంధతి (బి) శ్రేయాంక 10, శిఖా పాండే (నాటౌట్) 5; తానియా భాటియా (సి) రిచా ఘోష్ (బి) శ్రేయాంక 0; ఎక్స్ట్రాలు 3; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–64, 2–64, 3–64, 4–74, 5–80, 6–81, 7–87, 8–101, 9–113, 10–113. బౌలింగ్: రేణుక సింగ్ 2–0–28–0, సోఫీ మోలినెక్స్ 4–0–20–3, ఎలీస్ పెరీ 2–0–14–0, సోఫీ డివైన్ 1–0–9–0, వేర్హమ్ 3–0–16–0, శ్రేయాంక పాటిల్ 3.3–0–12–4, ఆశ శోభన 3–0–14–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) అరుంధతి (బి) మిన్ను మణి 31; సోఫీ డివైన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శిఖా పాండే 32; ఎలీస్ పెరీ (నాటౌట్) 35; రిచా ఘోష్ (నాటౌట్) 17; ఎక్స్ట్రాలు 0; మొత్తం (19.3 ఓవర్లలో 2 వికెట్లకు) 115. వికెట్ల పతనం: 1–49, 2–82. బౌలింగ్: మరిజన్ కాప్ 4–0–20–0, క్యాప్సీ 3–0–13–0, శిఖా పాండే 4–0–11–1, రాధ 1–0–18–0, అరుంధతి 3.3–0–26–0, జొనాసెన్ 2–0–15–0, మిన్ను మణి 2–0–12–1. -
WPL2024 విజేత బెంగళూరు
WPL2024లో బెంగళూరు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఢిల్లీపై 8 దికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. లీగ్ క్రికెట్లో అత్యధిక ప్రజాధరణ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. తాజా (2024) డబ్ల్యూపీఎల్ (మహిళల ఐపీఎల్) ఎడిషన్లో ఫైనల్లో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్కు ముందు వరకు నాలుగు సార్లు ఫైనల్స్ ఆడిన ఆర్సీబీ.. నాలుగు సందర్భాల్లో ఛేజింగ్ చేసి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. స్కోర్లు ఢిల్లీ 113 ఆలౌట్, బెంగళూరు 115/2 -
WPL 2024: ఆర్సీబీ చరిత్ర తిరగరాసేనా..?
లీగ్ క్రికెట్లో అత్యధిక ప్రజాధరణ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. తాజా (2024) డబ్ల్యూపీఎల్ (మహిళల ఐపీఎల్) ఎడిషన్లో ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాళ (మార్చి 17) జరుగుతున్న తుది సమరంలో ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. ఆర్సీబీ బౌలర్లు రెచ్చిపోవడంతో 113 పరుగులకే కుప్పకూలింది. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసిన ఢిల్లీ.. ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు ఒక్కసారిగా విరుచుకుపడటంతో స్వల్ప స్కోర్కే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక్ పాటిల్ 4, సోఫీ మోలినెక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు. షఫాలీ వర్మ (44) టాప్ స్కోరర్గా నిలిచింది. ఆర్సీబీ చరిత్ర తిరగరాసేనా..? ఆర్సీబీ ఐదోసారి ((2009, 2011, 2016 ) ఐపీఎల్, 2011 ఛాంపియన్స్ ట్రోఫీ) ఫైనల్కు చేరిన నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మ్యాచ్కు ముందు వరకు నాలుగు సార్లు ఫైనల్స్ ఆడిన ఆర్సీబీ.. నాలుగు సందర్భాల్లో ఛేజింగ్ చేసి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. తాజాగా జరుగుతున్న ఫైనల్లో కూడా ఆర్సీబీ ఛేజింగే చేస్తుండటంతో ఈసారైనా టైటిల్ గెలుస్తుందా అని ఆ జట్టు అభిమానులు చర్చించుకుంటున్నారు. తాజా పరిస్థితులను (113 పరుగులకే ఆలౌటైన ఢిల్లీ) బట్టి చూస్తే.. ఆర్సీబీ చరిత్ర తిరగరాసి తొలి టైటిల్ గెలిచేలా కనిపిస్తుంది. -
WPL 2024 Final Updates: ఛాంపియన్స్గా ఆర్సీబీ..
►డబ్ల్యూపీఎల్-2024 ఛాంపియన్స్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. 114 పరుగుల లక్ష్య ఛేదన.. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 114 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 49 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శిఖా పాండే బౌలింగ్లో సోఫీ డివైన్ (32) ఔటైంది. 9 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 53/1గా ఉంది. స్మృతి మంధన (20), ఎల్లిస్ పెర్రీ (2) క్రీజ్లో ఉన్నారు. ఆర్సీబీ గెలవాలంటే 66 బంతుల్లో 64 పరుగులు చేయాల్సి ఉంది. 114 పరుగుల స్వల్ప లక్ష్యం.. ఆచితూచి ఆడుతున్న ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధేశించిన 114 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్లు ముగిసే సమయానికి ఈ జట్టు వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. స్మృతి మంధన 12, సోఫీ డివైన్ 8 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఆర్సీబీతో ఫైనల్.. 113 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 113 పరుగులకే కుప్పకూలింది. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసిన ఢిల్లీ.. ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు ఒక్కసారిగా విరుచుకుపడటంతో స్వల్ప స్కోర్కే చేతులెత్తేసింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక్ పాటిల్ 4, సోఫీ మోలినెక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు. షఫాలీ వర్మ (44) టాప్ స్కోరర్గా నిలిచింది. పేకమేడలా కూలుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ 6 ఓవర్లలో 61 పరుగులు చేసి వికెట్లు కోల్పోని ఢిల్లీ క్యాపిటల్స్.. ఆతర్వాత ఆర్సీబీ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలింది. సోఫీ మోలినెక్స్ (3-0-14-3), శ్రేయాంక పాటిల్ (3-0-10-2), ఆశా శోభన (2-0-9-2) ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఢిల్లీ ఇన్నింగ్స్ కుప్పకూలే దిశగా సాగుతుంది. 15 ఓవర్లలో ఆ జట్టు స్కోర్ 90/7గా ఉంది. అరుంధతి రెడ్డి (2), రాధా యాదవ్ (2) క్రీజ్లో ఉన్నారు. మాయ చేసిన సోఫీ మోలినెక్స్..ఒకే ఓవర్లో 3 వికెట్లు ఎనిమిదో ఓవర్లో ఆర్సీబీ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ మాయ చేసింది. ఈ ఓవర్లో ఆమె ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి ఢిల్లీ నడ్డి విరిచింది. ఆ ఓవర్ల అనంతరం 61/0గా ఉన్న ఢిల్లీ స్కోర్ సోఫీ దెబ్బకు ఒక్క సారిగా పడిపోయింది. తొలి బంతికి షఫాలీ వర్మను (44) ఔట్ చేసిన సోఫీ.. మూడో బంతికి రోడ్రిగెజ్ను (0), నాలుగో బంతికి అలైస్ క్యాప్సీ (0) పెవిలియన్కు పంపింది. 9 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 69/3గా ఉంది. లాన్నింగ్ (20), మారిజన్ కాప్ (3) క్రీజ్లో ఉన్నారు. విధ్వంసం సృష్టిస్తున్న షఫాలీ వర్మ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతుంది. షఫాలీ కేవలం 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి అజేయంగా ఉంది. షఫాలీకి మెగ్ లాన్నింగ్ (15 బంతుల్లో 17; 3 ఫోర్లు) సహకరిస్తుంది. 6 ఓవర్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ 61/0గా ఉంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ (మార్చి 17) జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత ఎడిషన్లోనూ ఫైనల్కు చేరిన ఢిల్లీ ఈ సారి టైటిల్పై ధీమాగా ఉండగా.. తొలి టైటిల్ కోసం ఆర్సీబీ ఉవ్విళ్లూరుతుంది. తుది జట్లు.. ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లాన్నింగ్(కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజన్ కాప్, జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా(వికెట్కీపర్), శిఖా పాండే, మిన్ను మణి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్కీపర్), సోఫీ మోలినక్స్, జార్జియా వేర్హామ్, శ్రేయంక పాటిల్, ఆశా శోభన, శ్రద్ధా పోఖర్కర్, రేణుక సింగ్ -
టాప్లో ముంబై, ఢిల్లీ.. మూడో స్థానంలో నైట్రైడర్స్..!
ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రికెట్ లీగ్ల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీల హవా కొనసాగుతుంది. విశ్వవ్యాప్తంగా ఎనిమిది దేశాల్లో జరిగే వివిధ లీగ్ల్లో ముంబై, ఢిల్లీ నగరాల ప్రాంచైజీలే అధికంగా ఉన్నాయి. ముంబై, ఢిల్లీ నగరాధారిత ఫ్రాంచైజీలకు దేశవ్యాప్తంగా ఐదు జట్లు ఉండగా.. కోల్కతా నగరాధారిత ఫ్రాంచైజీకి నాలుగు.. చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలకు మూడు.. హైదరాబాద్, లక్నో, పంజాబ్ నగరాల ఆధారిత ఫ్రాంచైజీలకు తలో రెండ్రెండు జట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్.. భారత్లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ భారత్లోనే జరిగే మహిళల ఐపీఎల్లో (డబ్ల్యూపీఎల్) ముంబై ఇండియన్స్ వుమెన్స్ టీమ్ సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్లో ముంబై ఇండియన్స్ కేప్టౌన్ యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ యూఎస్ఏ వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఢిల్లీ క్యాపిటల్స్.. భారత్లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ భారత్లోనే జరిగే మహిళల ఐపీఎల్లో (డబ్ల్యూపీఎల్) ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్స్ టీమ్ సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్లో ప్రిటోరియా క్యాపిటల్స్ యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో దుబాయ్ క్యాపిటల్స్ యూఎస్ఏ వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో సియాటిల్ ఆర్కాస్ కోల్కతా నైట్రైడర్స్.. భారత్లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్రైడర్స్ యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో అబుదాబీ నైట్రైడర్స్ యూఎస్ఏ వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో లాస్ ఎంజెలెస్ నైట్రైడర్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ట్రిన్బాగో నైట్రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్.. భారత్లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ యూఎస్ఏ వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్.. భారత్లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాజస్థాన్ రాయల్స్ సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్లో పార్ల్ రాయల్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్లో బార్బడోస్ రాయల్స్ సన్రైజర్స్ హైదరాబాద్.. భారత్లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్ హైదరాబాద్ సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్ లక్నో సూపర్ జెయింట్స్.. భారత్లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో లక్నో సూపర్ జెయింట్స్ సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్లో డర్బన్ సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్.. భారత్లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్లో సెయింట్ లూసియా కింగ్స్ -
RCB: 2844 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత..!
మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) 2024 ఎడిషన్లో భాగంగా ఇవాళ (మార్చి 17) జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. టేబుల్ టాపర్గా నిలిచి ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్కు చేరుకోగా.. ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసి ఆర్సీబీ ఫైనల్కు చేరింది. Literally every RCB fan. #DCvRCB pic.twitter.com/y8l9eUAR3K — Yolo247 (@Yolo247Official) March 17, 2024 డబ్ల్యూపీఎల్లో ఫైనల్కు చేరడం ఢిల్లీ క్యాపిటల్స్కు ఇది వరుసగా రెండోసారి కాగా.. ఆర్సీబీ తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించింది. డబ్ల్యూపీఎల్ అరంగేట్రం సీజన్లో (2023) కేవలం రెండే విజయాలతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన ఆర్సీబీ.. ప్రస్తుత సీజన్లో గ్రూప్ దశలో నాలుగు విజయాలు, కీలకమైన ఎలిమినేటర్లో ముంబైపై విజయంతో మొత్తంగా ఐదు విజయాలు సాధించి ఫైనల్కు చేరింది. ఐపీఎల్ (2009, 2011, 2016), డబ్ల్యూపీఎల్ (2024), ఛాంపియన్స్ టీ20 లీగ్లతో (2011) కలిపి ఐదోసారి ఫైనల్కు చేరిన ఆర్సీబీ.. 2844 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఫైనల్కు చేరింది. ఆర్సీబీ చివరిసారిగా 2016 ఐపీఎల్ ఎడిషన్లో ఫైనల్స్ ఆడింది. నాటి ఫైనల్లో ఆర్సీబీ.. సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం ఆర్సీబీ మరోసారి ఫైనల్కు చేరింది. మరి ఈ సారి ఫైనల్లోనైనా ఆర్సీబీ విజయం సాధించి తమ టైటిల్ దాహానికి చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి. -
అక్కడా.. ఇక్కడా ఆర్సీబీ ఆటగాళ్లదే డామినేషన్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ జట్టునే అధికంగా ఇష్టపడతారు. ఆర్సీబీ ప్రాతినిథ్యం వహించిన, వహిస్తున్న క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి ఆటగాళ్ల రేంజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఆర్సీబీ క్రేజ్ కేవలం ఐపీఎల్కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ జట్టు ఆటగాళ్ల క్రేజ్ మహిళల ఐపీఎల్లోనూ (డబ్ల్యూపీఎల్) ఇదే రేంజ్లో ఉంది. డబ్ల్యూపీఎల్లోనూ ఆర్సీబీ టైటిల్ సాధించకపోయినా విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తాజా డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ ఫైనల్కు చేరి తమ తొలి టైటిల్పై అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తుంది. నేడు జరుగబోయే ఫైనల్లో స్మృతి మంధన నేతృత్వంలోని ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఆర్సీబీ కేవలం క్రేజ్ విషయంలోనే తోపు కాదని గణంకాలు సూచిస్తున్నాయి. ఐపీఎల్, డబ్ల్యూపీల్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు ఆర్సీబీ ఆటగాళ్ల పేరిటే ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు (175) క్రిస్ గేల్ పేరిట ఉండగా.. మహిళల ఐపీఎల్లో ఈ రికార్డు ఆర్సీబీకే చెందిన సోఫీ డివైన్ (99) పేరిట ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/12) ఆర్సీబీ బౌలర్ అల్జరీ జోసఫ్ పేరిట ఉండగా.. డబ్ల్యూపీఎల్లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/15) ఎల్లిస్ పెర్రీ పేరిట ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్, డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ డామినేషన్ ఏ రేంజ్లో సాగుతుందో ఇట్టే అర్దమవుతుంది. -
కొత్త విజేత ఎవరో!
న్యూఢిల్లీ: ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్... ఈ రోజేమో డబ్ల్యూపీఎల్ ఫైనల్... ముందున్న క్రికెట్ పండగకు నేడు జరిగే టైటిల్ పోరు ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే ఈ సీజన్లో అతివల మ్యాచ్లు ఆషామాషీగా సాగలేదు. కాబట్టి ఫైనల్ కూడా హోరాహోరీ ఖాయం. పైగా గత రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారీ అలా వెళ్లడానికి సిద్ధంగా లేదు. అలాగని వరుస విజయాలతో డిఫెండింగ్ చాంపియన్ను చిత్తు చేసిన బెంగళూరును తక్కువ అంచనా వేయలేం. ఏదేమైనా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) క్లైమాక్స్లో కొత్త విజేత కోసం గట్టి పోరు తప్పదు! ఈ సీజన్లో కొన్ని ఉత్కంఠభరిత మ్యాచ్లైతే రెగ్యులర్ ఐపీఎల్ (పురుషుల టోర్నీ)ను తలపించేలా భారత క్రికెట్ ప్రేక్షకుల్ని ఊర్రూతలూగించాయి. ఈ నేపథ్యంలో మెరుపులు మెరిపించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సై అంటే సై అంటున్నాయి. ఉత్సాహంతో బెంగళూరు డిఫెండింగ్ చాంపియన్ ముంబైని వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ ఓడించిన బెంగళూరు ఈ ఒక్క మ్యాచ్లో ఫైనలిస్టును ఓడిస్తే ఎంచక్కా టైటిల్ ఎగరేసుకుపోతుంది. కానీ టాపార్డర్ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. గత రెండు మ్యాచ్ల్లోనూ జట్టు ను గట్టెక్కించింది ఎలీస్ పెరీనే! బ్యాట్తో, బంతితో రాణిస్తున్న ఆమెకు కెప్టెన్ స్మృతి మంధాన, సోఫీ మోలినెక్స్, సోఫీ డివైన్ల నుంచి సహకారం లభిస్తే బెంగళూరు భారీ స్కోరు సాధిస్తుంది. లేదంటే బౌలర్లపైనే భారం పడుతుంది. ప్రధాన బౌలర్ రేణుకా సింగ్ ఈ మ్యాచ్లో సత్తా చాటాల్సిన అవసరముంది. శ్రేయాంక, ఆశ శోభన, పెరీ, మోలినెక్స్లు ఆశించిన మేర రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ సారి ట్రోఫీ లక్ష్యంగా... గతేడాది ముంబై జోరుతో రన్నరప్గా సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ట్రోఫీనే లక్ష్యంగా ఈ టోర్నీలో ఆరంభం నుంచి శ్రమించింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంతో నేరుగా ఫైనల్కు దూసుకొ చ్చిన మెగ్ లానింగ్ సేన ఈ సారి భారీ స్కోర్లతో తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించింది. తాజా ఫైనల్ ప్రత్యర్థి బెంగళూరుతో తలపడిన రెండు మ్యాచ్ల్లోనూ భారీ స్కోర్లు చేసే గెలిచింది. లానింగ్, షఫాలీ, జెమీమా, క్యాప్సీ అంతా సూపర్ఫామ్లో ఉండటం వారి బ్యాటింగ్ లైనప్ను దుర్భేద్యంగా మార్చింది. బౌలింగ్లో మరిజన్, శిఖా పాండే, జెస్ జొనాసెన్లు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. పిచ్–వాతావరణం అరుణ్ జైట్లీ స్టేడియంలో గత మూడు మ్యాచ్లనూ బౌలర్లే శాసించారు. బౌలర్లకు కలిసొచ్చే వికెట్పై మెరుపుల కోసం బ్యాటర్లు శక్తికి మించి శ్రమించాలి. వేసవి మొదలవుతున్న వేళ వర్ష సూచనైతే లేదు. తుది జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెపె్టన్), షఫాలీ వర్మ, అలైస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మరిజన్ కప్, జెస్ జొనాసెన్, అరుంధతి, రాధా యాదవ్, మిన్నుమణి, తానియా, శిఖాపాండే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎలీస్ పెరీ, దిశా కాసత్, రిచా ఘోష్, సోఫీ మోలినెక్స్, వేర్హమ్, శ్రేయాంక, ఆశ శోభన, శ్రద్ధ, రేణుకా సింగ్. - రా.గం.7.30 నుంచి ‘స్పోర్ట్స్–18’లో ప్రత్యక్ష ప్రసారం -
WPL 2024: తుది పోరుకు సర్వం సిద్దం.. చరిత్ర సృష్టించేదెవరు?
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 తుది సమరానికి సమయం అసన్నమైంది. ఆదివారం(మార్చి17) ఢిల్లీ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఇరు జట్లు కూడా ఎలాగైనా గెలిచి తొలిసారి టైటిల్ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఢిల్లీకి ఇది రెండో ఫైనల్ కాగా.. ఆర్సీబీ మాత్రం తొలిసారి ఫైనల్కు చేరింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబాలలపై ఓ లూక్కేద్దం. ఢిల్లీ క్యాపిటల్స్.. గతేడాది అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. ఈ ఏడాది సీజన్లో సైతం అదే జోరుతో తుది పోరుకు అర్హత సాధించింది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ.. 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. మిగితా రెండు మ్యాచ్ల్లో అనూహ్యంగా ఢిల్లీ జట్టు ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ బౌలింగ్ పరంగా చాలా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్, క్యాప్సీ వంటి వరల్డ్క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. షెఫాలీ, లానింగ్ ఇద్దరూ తమ జట్టుకు ప్రతీ మ్యాచ్లోనూ తొలి వికెట్కు అద్బుతమైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. ఆ తర్వాత మిడిలార్డర్లో రోడ్రిగ్స్ కీలక ఇన్నింగ్స్లతో దుమ్మురేపుతోంది. వీరితో పాటు క్యాప్సీ కూడా మెరుగ్గా రాణిస్తోంది. వీరు నలుగురు చెలరేగితే ఆర్సీబీకి కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. మారిజాన్ కాప్, జెస్ జోనాస్సెన్ వంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. కాప్ పవర్ప్లేలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్లను దెబ్బతీస్తోంది. జోనాస్సెన్ సైతం తన స్పిన్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పులు పెడుతోంది. వీరిద్దికి తోడు రాధా యాదవ్ తనదైన రోజున బ్యాటర్లకు చుక్కలు చూపించగలదు. ఆర్సీబీ.. ఈ ఏడాది సీజన్లో ఆరంభంలో ఆర్సీబీ జట్టు కాస్త తడబడిన తర్వాత మాత్రం అద్బుతంగా పుంజుకుంది. వరుసగా ముంబై వంటి పటిష్ట జట్టును మట్టికరిపించి ఫైనల్లో ఆర్సీబీ అడుగుపెట్టింది. ఆర్సీబీ ఆల్రౌండర్ పెర్రీ సూపర్ ఫామ్లో ఉంది. బ్యాట్తో పాటు బౌలింగ్లోనూ అదరగొడుతోంది. ఆర్సీబీ ఫైనల్ చేరడంలో పెర్రీది కీలక పాత్ర. ఎలిమినిటర్లో ముంబైపై 66 పరుగులతో పాటు ఓ కీలక వికెట్ పడగొట్టింది. ఈ నేపథ్యంలో మరోసారి ఆమెపైనే ఆర్సీబీ ఆశలు పెట్టుకుంది. టోర్నీ ఆరంభంలో అదరగొట్టిన కెప్టెన్ స్మృతి మంధాన.. తర్వాత మ్యాచ్ల్లో మాత్రం తేలిపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్లో సైతం మంధాన విఫలమైంది. కనీసం ఫైనల్లొనైనా మంధాన చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. బౌలింగ్లో అయితే శ్రేయంక పాటిల్, ఆశ వంటి భారత బౌలర్లు ఉన్నారు. ఏదమైనప్పటికి ఢిల్లీని ఢీకొట్టాలంటే ఆర్సీబీ అన్ని విభాగాల్లో అద్బుతంగా రాణించాలి. -
WPL 2024: భళా బెంగళూరు.. ఫైనల్కు చేరిన ఆర్సీబీ
న్యూఢిల్లీ: గెలుపు వాకిట ముంబై ఇండియన్స్ బోల్తా పడింది. ఉన్నపళంగా ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 5 పరుగుల తేడాతో గట్టెక్కింది. తద్వారా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో స్మృతి మంధాన నాయకత్వంలోని బెంగళూరు జట్టు ఫైనల్ చేరింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సులువుగా గెలవాల్సిన మ్యాచ్లో ఎలిమినేట్ అయ్యింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్తో బెంగళూరు తలపడుతుంది. మలుపు తిప్పిన శ్రేయాంక... శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 17వ ఓవర్ ముగిసేవరకు గెలిచే స్థితిలోనే ఉంది. 18 బంతుల్లో 20 పరుగులు సులువైన సమీకరణం కాగా... 18వ ఓవర్ వేసిన శ్రేయాంక పాటిల్ 4 పరుగులిచ్చి కీలకమైన హర్మన్ప్రీత్ వికెట్ను పడగొట్టింది. దాంతో ముంబై విజయసమీకరణం 12 బంతుల్లో 16 పరుగులుగా మారింది. 19వ ఓవర్ వేసిన సోఫీ మోలినెక్స్ నాలుగే పరుగులిచ్చి సజన (1) వికెట్ను తీసింది. ఇక చివర్లో 6 బంతుల్లో 12 పరుగులు చేయడం కూడా ముంబై జట్టుకు కష్టం కాదు. కానీ లెగ్ స్పిన్నర్ ఆశ శోభన మాయాజాలం చేసింది. తొలి 3 బంతులకు 4 పరుగులే ఇచ్చింది. ఆశ వేసిన నాలుగో బంతికి పూజ వస్త్రకర్ ముందుకొచ్చి ఆడి (4) స్టంపౌట్ అయ్యింది. దాంతో ముంబై నెగ్గాలంటే 2 బంతుల్లో 8 పరుగులు చేయాలి. కొత్త బ్యాటర్ అమన్జ్యోత్ ఐదో బంతికి ఒక పరుగు తీసింది. చివరి బంతికి ముంబై 7 పరుగులు చేయాలి. క్రీజులో అమెలియా కెర్ ఉంది. సిక్స్ కొడితే స్కోర్లు సమమై ‘సూపర్ ఓవర్’కు దారి తీస్తుందా అని ఉత్కంఠ కలిగింది. కానీ ఆశ వేసిన ఆఖరి బంతికి అమెలియా ఒక్క పరుగు మాత్రమే తీయగలిగింది. దాంతో ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో బెంగళూరు 5 పరుగులతో గెలిచి తొలిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదుకున్న పెరీ... అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి (10), సోఫీ డివైన్ (10), దిశ (0), హిట్లర్లు రిచా ఘోష్ (14), సోఫీ మోలినెక్స్ (11) అంతా నిరాశపరిచారు. 15 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 84/5! కనీసం వంద కూడా చేయలేదు. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎలీస్ పెరీ (50 బంతుల్లో 66; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది. ఆఖర్లో జార్జియా వేర్హమ్ (10 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించింది. హేలీ మాథ్యూస్, నటాలీ సీవర్ బ్రంట్, సైకా ఇషాక్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం సునాయాసమైన లక్ష్యాన్ని ఛేదించలేక ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (30 బంతుల్లో 33; 4 ఫోర్) టాప్ స్కోరర్ కాగా.. అమెలియా కెర్ (25 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు), నటాలీ సీవర్ బ్రంట్ (17 బంతుల్లో 23; 4 ఫోర్లు) 20 పైచిలుకు పరుగులు చేశారంతే! శ్రేయాంక (4–0–16–2) జట్టుకు అవసరమైన స్పెల్ వేయగా, పెరీ, సోఫీ, వేర్హమ్, ఆశ తలా ఒక వికెట్ తీశారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) ఇస్మాయిల్ (బి) సీవర్ 10; సోఫీ డివైన్ (బి) హేలీ 10; పెరీ (సి) సీవర్ (బి) సైకా 66; దిశ (సి) పూజ (బి) సైకా 0; రిచా ఘోష్ (సి) సీవర్ (బి) హేలీ 14; సోఫీ మోలినెక్స్ (బి) సీవర్ 11; వేర్హమ్ (నాటౌట్) 18; శ్రేయాంక (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–23, 4–49, 5–84, 6–126. బౌలింగ్: షబ్నిమ్ 4–1–30–0, హేలీ మాథ్యూస్ 4–0–18–2, నటాలీ సీవర్ బ్రంట్ 4–0–18–2, సైకా ఇషాక్ 3–0–27–2, పూజ వస్త్రకర్ 3–0–21–0, అమెలియా కెర్ 2–0–18–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (బి) పెరీ 19; హేలీ (సి) వేర్హమ్ (బి) శ్రేయాంక 15; నటాలీ సీవర్ (బి) వేర్హమ్ 23; హర్మన్ప్రీత్ (సి) డివైన్ (బి) శ్రేయాంక 33; అమెలియా కెర్ (నాటౌట్) 27; సజన (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) సోఫీ మోలినెక్స్ 1; పూజ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) ఆశ శోభన 4; అమన్జోత్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 130. వికెట్ల పతనం: 1–27, 2–50, 3–68, 4–120, 5–123, 6–128. బౌలింగ్: రేణుక 1–0–6–0, శ్రేయాంక పాటిల్ 4–0–16–2, సోఫీ డివైన్ 1–0–9–0, ఎలీస్ పెరీ 4–0–29–1, సోఫీ మోలినెక్స్ 4–0–16–1, వేర్హమ్ 4–0–37–1, ఆశ శోభన 2–0–13–1. -
WPL 2024: ఢిల్లీని ‘ఢీ’ కొట్టేదెవరు?
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అమీతుమీకి అర్హత సాధించేందుకు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై టైటిల్ నిలబెట్టుకునే పనిలో ఉండగా, గత సీజన్లో నిరాశపరిచిన బెంగళూరు కొత్తగా ఫైనల్ చేరేందుకు తహతహలాడుతోంది. ఈ మ్యాచ్లో స్మృతి మంధాన బృందం గెలిస్తే గత రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్తో టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. ముంబై గెలిస్తే మాత్రం 2023 సీజన్ ఫైనల్ పునరావృతం అవుతుంది. ఇక ఈ సీజన్ విషయానికొస్తే బెంగళూరు మెరుగుపడింది. లీగ్ ఆరంభ దశలో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్లపై వరుస విజయాలతో టచ్లోకి వచ్చింది. అయితే గత ఫైనలిస్టులతో తలపడిన మ్యాచ్ల్లో ఓటమి పాలైనప్పటికీ అడపాదడపా విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని పదిలపర్చుకుంది. దీంతో పాటు ఆఖరి మ్యాచ్లో ముంబైలాంటి ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆర్సీబీ స్టార్ ఎలీస్ పెరీ ఆల్రౌండ్ షో ముంబైని ముంచేసింది. కీలకమైన పోరులో ఓపెనర్లు స్మృతి, సోఫీలు విఫలమైనా బ్యాట్తోనూ పెరీ జట్టును నడిపించింది. హిట్టింగ్తో రిచా ఘోష్ జట్టులో కీలకపాత్ర పోషిస్తోంది. సోఫీ డివైన్, జార్జియా వేర్హామ్లు కూడా ధాటిగా ఆడితే ముంబై బౌలర్లకు కష్టాలు తప్పవు. ఈ సీజన్లో ఆఖరి లీగ్ మ్యాచ్ను మినహాయించి ఓవరాల్గా చూసుకుంటే ముంబై డిఫెండింగ్ చాంపియన్ పాత్రకు న్యాయం చేసేలా ఆడింది. హేలీ మాథ్యూస్, సజన, నటాలీ సీవర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్ప్రీత్, అమెలియా కెర్లతో కూడిన బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్ విభాగంలో స్పీడ్స్టర్ షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, అమెలియాలు రాణిస్తే బెంగళూరును ఓడించడం ఏమంత కష్టం కానేకాదు. ఐదు జట్లు పోటీపడ్డ డబ్ల్యూపీఎల్లో లీగ్ దశలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్కు చేరుకుంది. -
ప్లే ఆఫ్స్కు బెంగళూరు
న్యూఢిల్లీ: ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా దర్జాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధించింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన చివరి లీగ్ మ్యాచ్లో స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్సీబీ జట్టు అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఏడు వికెట్లతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను ఓడించిన బెంగళూరు చివరిదైన మూడో ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ముందుగా ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్కాగా... బెంగళూరు 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. ఆ్రస్టేలియా స్టార్ ఆల్రౌండర్ ఎలీస్ పెరీ అద్భుత ఆటతీరుతో బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా బంతితో మెరిసిన పెరీ 4 ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాట్తో అదరగొట్టి 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో అజేయంగా 40 పరుగులు సాధించింది. నేడు జరిగే చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిస్తే 12 పాయింట్లతో లీగ్ టాపర్గా నిలిచి నేరుగా ఫైనల్కు అర్హత పొందుతుంది. ఫైనల్లో స్థానం కోసం ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ గుజరాత్ చేతిలో ఢిల్లీ ఓడిపోతే... ఢిల్లీ, ముంబై రెండు జట్లలో మెరుగైన రన్రేట్ ఉన్న జట్టు ఫైనల్ చేరుతుంది. ముంబైతో మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా... ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (23 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు), సజన (21 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) 43 పరుగులు జోడించి ముంబైకు శుభారంభం ఇచ్చారు. అయితే ఆరో ఓవర్ చివరి బంతికి సోఫీ డివైన్ బౌలింగ్లో హేలీ అవుటవ్వడంతో ముంబై పతనం మొదలైంది. అనంతరం పెరీ తన పేస్ బౌలింగ్తో సజన, హర్మన్ప్రీత్ (0), అమెలియా కెర్ (2), అమన్జ్యోత్ (4), పూజ వస్త్రకర్ (6), నటాలీ సీవర్ బ్రంట్ (10)లను అవుట్ చేసింది. దాంతో ఒకదశలో 43/0తో ఉన్న ముంబై 82/7తో కష్టాల్లో పడింది. చివర్లో ప్రియాంక బాలా (19 నాటౌట్; 2 ఫోర్లు) రాణించడంతో ముంబై స్కోరు 100 దాటింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. స్మతి (11; 2 ఫోర్లు), సోఫీ మోలినెక్స్ (9; 2 ఫోర్లు), సోఫీ డివైన్ (4) తక్కు వ స్కోరుకే వెనుదిరిగారు. అయితే రిచా ఘోష్ (28 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), పెరీ నాలుగో వికెట్కు 76 పరుగులు జోడించి బెంగళూరును విజయతీరాలకు చేర్చారు.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement