-
అకాలవర్షం.. అమ్ముకోకుండా చేస్తోంది
జనగామ: దంచి కొడుతున్న ఎండకాలంలో అకాల వర్షాలు.. అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి 30 శాతం మేర పంట దిగుబడి కోల్పోయిన రైతులు.. చివరకు మిగిలిన గింజలను అమ్ముకునేందుకు మార్కెట్ వస్తే అకాల వర్షం క‘న్నీళ్లు’ మిగిల్చి వెళుతున్నాయి. మంగళవారం కురిసిన జోరు వానతో జనగామ వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్తో పాటు 12 మండలాల పరిధిలోని కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వేలాది బస్తాల ధాన్యం రాసులు తడిసి పోయాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రాసులపై ముందస్తు టార్పాలిన్ కవర్లను కప్పి ఉంచారు. 50 కిలో మీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు తోడు దంచికొట్టిన వర్షంతో జనగామ వ్యవసాయ మార్కెట్ ప్రభుత్వ కొనుగోలు సెంటర్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి పోగా, కొంతమేర కొట్టుకు పోయింది. పట్టణానికి చెందిన వెన్నం వెంకటరాంరెడ్డికి చెందిన 20 బస్తాల ధాన్యం కొట్టుకుపోయింది. చీటకోడూరుకు చెందిన మహిళా రైతు బైరి సులోచనకు చెందిన 100 బస్తాల ధాన్యం తడిసి పోయి, రాసి వద్దనే నీరు నిల్వ ఉండటంతో నష్టం వాటిల్లింది. రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన మహిళా రైతు కేమిడి దేవేంద్రకు చెందిన 150 క్వింటాళ్ల మక్కలు తడిసి పోగా, అందులో నిలిచిన నీటిని తొలగించేందుకు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో తరిగొప్పుల మండలంలో అత్యధికంగా 46.8 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా పాలకుర్తిలో 3.5 మి.మీ వర్షపాతం నమోదైయింది. విద్యుత్ సంస్థకు భారీ నష్టం మూడు రోజులుగా ఈదురుగాలులు, వర్షాలతో విద్యుత్ సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. జిల్లాలోని అనేక గ్రామాల్లో 100 విద్యుత్ స్తంభాలు డీటీఆర్, 33 కేవీ లైన్, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరగడంతో రూ.20 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. కొనుగోలు సెంటర్లలో తడిసిన ధాన్యం రాలిన మామిడి కాయలు విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తం: ఎస్ఈ వేణుమాధవ్ సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం నంబర్ 7901628363 ఏర్పాటు -
ప్రజాస్వామ్యంలో ఓటు విలువైంది..
జనగామ రూరల్: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని, ప్రతీఒక్కరు తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా స్వీప్ నోడల్ అధికారి వినోద్కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఓటు హక్కుపై సంబంధిత అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరు ఎలాంటి ప్రలోభాలాకు గురి కాకుండా బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో ఓటు శాతం పెంచాలని ఇందుకు సమష్టి కృషి చేయాలన్నారు. పోలింగ్ శాతం పెంచడంలో జనగామ ప్రథమ స్థానంలో నిలిచేలా చూడాలన్నారు. అనంతరం అధికారులతో ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకోవాలిజనగామ రూరల్: ప్రతీఒక్కరు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకోవాలని అదనపు పింకేష్కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటితో ముగియనున్న పోస్టల్ బ్యాలెట్ను ఉద్యోగులు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కొమురయ్య, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి జెడ్పి సీఈఓ అనిల్కుమార్, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. నేడు సిద్ధేశ్వరాలయహుండీ లెక్కింపుబచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వరాలయ దేవస్థాన హుండీ లెక్కింపు నేడు (బుధవారం) చేయనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి చిందం వంశీ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈ హుండీ లెక్కింపునకు నల్లగొండ దేవాదాయ అధికారి ప్రత్యేక అధికారిగా వస్తున్నారన్నారు. -
అడిషనల్ కలెక్టర్ ప్రత్యేక పూజలు
పాలకుర్తి టౌన్: శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో మంగళవారం అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ భాగం లక్ష్మిప్రసన్న, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. వాల్ పోస్టర్ ఆవిష్కరణ స్టేషన్ఘన్పూర్: డివిజన్ కేంద్రంలోని ట్రాన్స్కో సబ్స్టేషన్ ఆవరణలో మంగళవారం విద్యుత్ భద్రత వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను టీఎస్ ఎన్పీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ ఇన్చార్జ్ టి.సదర్లాల్, డీఈ హుస్సేన్నాయక్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ భద్రత గురించి అందరికి తెలిసే విధంగా పోస్టర్లను ముద్రించడం జరిగిందన్నారు. విద్యుత్ ప్రమాద రహిత సంస్థగా రూపొందించే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్లో పనిచేస్తున్న సిబ్బంది పాల్గొన్నారు. సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలిబచ్చన్నపేట: మండల కేంద్రంలోని సీహెచ్సీ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్యులు చూడాలని జిల్లా ప్రోగ్రామ్ అధికారి రవీందర్గౌడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రికార్డులను పరిశీలించారు . అనంతరం మాట్లాడుతూ ఓబుల్కేశ్వాపూర్, నర్మెట మండలంలోని గ్రామాలకు సంబంధించిన గర్భిణనులు సాధారణ ప్రసవాలకు బచ్చన్నపేట సీహెచ్సీ ఆస్పత్రికి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైధ్యాధికారి సిద్దార్థరెడ్డి, వైద్యులు సృజన, రూపాదేవి, సీహెచ్ఓ జంగమ్మ, ఫార్మాసిస్ట్ బొడ్డు శ్రీనివాస్, సూపర్వైజర్ అరుణ, స్టాఫ్ నర్సులు, పలువురు పాల్గొన్నారు. ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్కాళోజీ సెంటర్ : వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని స్టేషన్ఘన్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్కు 14 బ్యాలెట్ యూనిట్లు, 50 కంట్రోల్ యూనిట్లు, 10 వీవీ ప్యాట్లు, పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్కు 12 బ్యాలెట్ యూనిట్లు, 50 కంట్రోల్ యూనిట్లు, 8 వీవీ ప్యాట్లను కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు బండారి స్వాగత్ రణవీర్చంద్ సమక్షంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగళవారం కలెక్టరేట్లో ఈవీఎంల రెండో విడత అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, రాధికాగుప్తా, ఎన్నికల పర్యవేక్షకుడు విశ్వనారాయణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీ శ్రీనివాస్, అమరేందర్రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమ పాలనను ఆశీర్వదించండి●డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి జనగామ: తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి సంక్షేమ పాలనను పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీ ర్వదించాలని డీసీసీ అధ్యక్షుడు, జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో టీపీసీసీ కార్యదర్శి జయ ప్రకాష్, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్, దూవయ్యగౌడ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి జయప్రకాష్, సభ్యుడు చెంచారపు శ్రీనివాస్రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికె ఇందిర కిష్టస్వామి, ఇ జ్జగిరి రాములు, శివరాజ్ పాల్గొన్నారు. -
విద్యార్థులు పట్టుదలతో చదవాలి
జనగామ రూరల్: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి 2024లో ఉత్తమ ఫలితాలు సాధించిన వి ద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానం రావడం గర్వకారణమన్నారు. జిల్లాలో 32 పాఠశాలల్లో 10 జీపీఏ సాధించారని 78 పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను అగ్రభాగాన నిలిచిందన్నారు. అందరి సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. ఈ సందర్భంగా డీఈఓ కె రాము, విద్యార్థులను, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ అనిల్కుమార్, డీఆర్డీఓ మొగిలప్ప, బీసీ సంక్షేమాధికారి రవీందర్, ఎస్సీ అధికారి దయానంద, డీఈఏఓ వినోద్కుమార్ పాల్గొన్నారు. -
అలర్ట్గా ఉన్నాం..
అకాల వర్షాలు, ఈదురు గాలులతో జిల్లా విద్యుత్ శాఖ అలర్ట్గా ఉంది. జిల్లాలోని 8 మండలాల పరిధిలో స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు మొదలు పెట్టాం. జనగామ సర్కిల్, డివిజన్ పరిధిలో 24 గంటల పాటు అందుబాటులో ఉండే కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. విద్యుత్ సంబంధిత సమస్యలు ఉంటే 79016 28363కు సమాచారం అందించాలి. విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు సెక్షన్ల వారీగా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది నిరంతరం కష్టపడుతున్నారు. – వేణుమాధవ్, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్ ●– మరిన్ని ఫొటోలు IIIలోu
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement