-
న్యాయవాదుల సంక్షేమానికి కృషి
ఖలీల్వాడి: న్యాయవా దుల అభివృద్ధి, సంక్షే మం, సమస్యల పరిస్కా రానికి నిరంతరం శ్రమిస్తానని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి జీవన్రెడ్డి అన్నారు. నగ రంలోని వంశీ ఇంటర్నే షనల్ హోటల్లో బుధవారం కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఏ మూలంగా కోర్టుకు ఉన్న అధికారాలను పోలీసులకు ధారాదత్తం చేయడంతో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి పార్లమెంటులో పోరాడుతానని అన్నారు. తాను జగిత్యాలలో న్యాయవాదిగా ప్రాక్టిస్ చేస్తున్న కాలంలోనే రాజకీయ జన్మకు అంకురార్పణ జరిగిందని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు న్యాయవాద సమాజం అండదండలతోనే రాజకీయ ప్రస్థానం కొనసాగుతున్నదని అన్నారు. నిజామాబాద్ జిల్లా జ్యూడిషియల్ అధికార పరిధిలోనికి పాత విద్యాశాఖ కార్యాలయం చెందేవిదంగా కృషి చేస్తానని తెలిపారు. మహేష్గౌడ్, పొన్నం అశోక్గౌడ్, మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు, రాజేశ్వర్రెడ్డి, ఆర్ఎస్ఎల్ గౌడ్, సాయరెడ్డి, యూనిస్ఖాన్ పాల్గొన్నారు. -
బీజేపీ,కాంగ్రెస్లకు బుద్ధి చెప్పాలి
నిజామాబాద్నాగారం: ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్గుప్తా పేర్కొన్నారు. నగరంలో ని 40వ డివిజన్ గౌతమ్నగర్లో బుధవారం ఆయ న ఇంటింటి ప్రచారం చేశారు. ఈసందర్భంగా గణేశ్గుప్తా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బా జిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే ఢిల్లీలో సైతం ప్రశ్నించే గొంతు మనది అవుతుందన్నారు. ప్రజలు ఆరు గ్యారంటీల పేరుతో మోసపోయామని తెలుసుకొని మళ్లీ మార్పు రావాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అని కోరుకుంటున్నారన్నా రు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రౌడీ రాజ్యం నడు స్తుందన్నారు. మేయర్ నీతుకిరణ్, మెతుకు శివకుమార్, ప్రభాకర్ రెడ్డి, సుజిత్సింగ్ ఠాగూర్, సత్యప్రకాష్, రవిచందర్, తడ్కల్ శ్రీను, గాండ్ల లింగం, గోవింద్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
హోల్సేల్ రిటైల్ హోల్సేల్ రిటైల్టమాట 10 20 బెండకాయ 40 60 బీరకాయ 40 70 దొండకాయ 20 40 బీర్నిసుకాయ 30 60 కాకరకాయ 50 70 వంకాయ 30 60 పాలకూర 25 50 మెంతికూర 20 40 కొత్తిమీర 25 50 పుదీనా 50 75 క్యాప్సికం 50 80 గాజరుగడ్డ 40 60 పచ్చిమిర్చి 40 60 దోసకాయ 20 40 ఆలుగడ్డ 20 50 గోబిగడ్డ 25 50 గోబిపువ్వు 60 80 బీట్రూట్ 25 50 కరివేపాకు 60 80 చామగడ్డ 50 70 గోరుచిక్కుడు 40 60 చిక్కుడుకాయ 50 75 – సుభాష్నగర్కూరగాయల ధ రలు(రూ.) -
విలీన గ్రామాల్లో సమస్యల తిష్ట
నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ మున్సిపల్ ప రిధిలో విలీనమైన గ్రామాల్లో సమస్యలు తిష్ట వేశా యి. గుంతలమయంగా మారిన రహదారులతోపా టు, డ్రెయినేజీలు అధ్వానంగా మారాయి. అలాగే పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదీ పరిస్థితి.. రూరల్ మండలంలోని గూపన్పల్లి, ముబారక్, గంగాస్థాన్ఫేస్–1, ఫేస్–2, మారుతినగర్ ప్రాంతాలు నగర మున్సిపల్ పరిధిలోకి వచ్చాయి. అయినా ఆయా గ్రామాల్లో పరిస్థితి మాత్రం మారలేదు. గ్రామాల్లో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. రోడ్లు మొత్తం గుంతలమయం కావడంతో ప్రయాణికులు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. సీసీ, బీటీ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లోపంతో పారిశుధ్యం పడేకేసిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గూపన్పల్లి గ్రామంలో రోడ్లపైనే డ్రెయినేజీలు ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల్లో డ్రెయినేజీలో వ్యర్థాలను తొలగించడం లేదు. మరికొన్ని గ్రామాల్లో వ్యర్థాలను తొలగించి, డ్రెయినేజీ పక్కనే పారవేస్తున్నారు. అలాగే గ్రామాల్లో ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోవడంతో పరిసరాలు దుర్గంధం వెదజల్లుతోంది. అలాగే గతంలో హరిత హారం పథకం కింది అధికారులు మొక్కలు నాటగా, ప్రస్తుతం వాటికి నీరందక ఎండిపోయాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంటి పన్నులు సకాలంలో చెల్లించిన గ్రామాల్లో ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి విలీన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. గుంతలమయంగా రోడ్లు అధ్వానంగా డ్రెయినేజీలు పట్టించుకోని అధికారులు అధికారులు స్పందించాలి.. గ్రామంలో పారిశుధ్యంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. డ్రెయినేజీల్లో వ్యర్థాలను తొలగించి, పక్కనే వేస్తున్నారు. కానీ వెంటనే తీసుకవెళ్లకపోవడంతో మళ్లీ ఆ చెత్తంతా డ్రెయినేజీలోనే పడుతుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సకాలంలో డ్రెయినేజీల్లో చెత్తను తొలగించి, సమస్యను పరిష్కరించాలి. –గంగారెడ్డి, గూపన్పల్లి డ్రెయినేజీలు శుభ్రం చేస్తలేరు.. మా గ్రామంలో డ్రెయినేజీలను శుభ్రం చేయడంలేదు. దీంతో దుర్గంధం వెదజల్లడంతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. అధికారులు గ్రామాలకు వస్తున్నారో లేదో తెలియడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామాన్ని శుభ్రంగా ఉంచి, ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి. –గంగమణి, గూపన్పల్లి -
కాంగ్రెస్లో చేరిక
ఇందల్వాయి/సిరికొండ: ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి, ఎల్లారెడ్డిపల్లె, రంజిత్నాయక్ తండా ల నుంచి పెద్ద సంఖ్యలు ప్రజలు, యువకులు బు ధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కలిగోట నర్సారెడ్డి, జేసీ బాల య్య, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు కాంగ్రెస్లో చేరారు. వారికి రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పార్టీ కండువా కప్పి, కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, గడీల రాములు, భానుచందర్, రమేష్రెడ్డి, లింబాద్రి, సంపత్, నవీన్ గౌడ్, వెంకట్రెడ్డి, కర్సం మోహన్, రాజు, సంతోష్రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్లోకి పలువురు.. సిరికొండ: మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూషణ్రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వనించారు. ధర్పల్లి జెడ్పీటీసీ జగన్, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాజన్న, రాజేంధర్, గంగారెడ్డి పాల్గొన్నారు. బీజేపీలోకి.. సిరికొండ: మండలంలోని రావుట్ల, నారాయణపల్లె గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. లింబాగౌడ్, శేఖర్గౌడ్, రాజేశ్వర్రెడ్డి, నక్క రాజేశ్వర్, రామస్వామి, సతీష్, గోపి, సాయాగౌడ్, రంజిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వెండితెర
రేపటి నుంచి ఆలయ ద్వాదశ వార్షికోత్సవాలు డిచ్పల్లి: మండలంలోని ధర్మారం(బి) గ్రామంలోగల శ్రీదేవీ, భూదేవీ సహిత వేంకటేశ్వరస్వామి ఆలయ సముదాయం ద్వాదశ వార్షికోత్సవాలు శుక్రవారం నుంచి మంగళవారం వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు రావుల బ్రహ్మానందం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రహ్మశ్రీ వేలేటి పశుపతి శర్మ, బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర శర్మ ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్) స్క్రీన్–1 ఆ ఒక్కటీ అడక్కు (తెలుగు)–1.30, 4.30,7.30,10.30 స్క్రీన్–2 బాక్(తెలుగు)–10.40, మంజుమ్మల్ బాయ్స్ (తెలుగు)–4.45, 7.50, ప్రసన్న వదనం (తెలుగు)–7.30, 10.30 స్క్రీన్–3 బాక్ (తెలుగు) – 1.40, 4.35, 7.30, 10.30 పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్) స్క్రీన్–1 ఆ ఒక్కటీ అడక్కు (తెలుగు) – 1.35, 7.45, టిల్ల్లు స్క్వేర్(తెలుగు) – 4.30 బాక్ (తెలుగు) – 10.40 స్క్రీన్–2 ది ఫల్ గై (ఇంగ్లీష్) – 11.00, 1.50, 7.20, 10.10, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ (3డీ–తెలుగు)–4.40 స్క్రీన్–3 ప్రసన్నవదనం (తెలుగు) – 1.10,4.15, 10.10, శబరి (తెలుగు)–7.20 స్క్రీన్ –4 బాక్(తెలుగు)–1.10, మంజుమ్మల్బాయ్స్ (తెలుగు)– 4.20, 7.35, 10.30 దేవి టిల్లు స్క్వేర్ (తెలుగు) నటరాజ్ బాక్ తెలుగు) లలితామహల్ వకీల్సాబ్(తెలుగు) విజయ్ ఆ ఒక్కటీ అడక్కు (తెలుగు) తెలుగు/హిందీ/ఇంగ్లిష్ -
చెక్పోస్టులు, నిఘా బృందాల పనితీరు పరిశీలన
సుభాష్నగర్: ఎన్నికల్లో ప్రలోభాలను నిలువరించేందుకు వీలుగా నిజామాబాద్ పార్లమెంట్ నియో జకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు డీఎం నెమ్జీ విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను సందర్శించడంతో పాటు నిఘా బృందాల(ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీం) పనితీరును క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలిస్తున్నారు. పోలింగ్కు సమయం సమీపించడంతో తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. ఇందులోభాగంగానే బుధవారం మాధవనగర్లో కొనసాగుతున్న చెక్పోస్టు తనిఖీ చేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటివరకు ఎంత మొత్తంలో అక్రమ నగదు, వస్తువులు, మద్యం నిల్వలు స్వా ధీనం చేసుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో విధు లు నిర్వహిస్తున్న నిఘా బృందాల పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలింగ్కు సమయం సమీపించిన నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నగదు, మద్యం పంపిణీ జరిగే అవకాశాలున్నందున గట్టి నిఘా కొనసాగించాలని అబ్జర్వర్ సూచించారు. అబ్జర్వర్ వెంట జిల్లా ఎన్నికల వ్యయ కమిటీ నోడల్ అధికారి పాపయ్య తదితరులున్నారు. -
దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్ కుట్ర
సుభాష్నగర్: దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని, దేశానికి ఆ పార్టీ క్యాన్సర్ కన్నా ప్రమాదకరమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. నగరంలోని 51వ డివిజన్లో మహాజన సంపర్క్ అభియాన్లో భాగంగా బుధవారం ఆయన ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పదేళ్లలో బీజేపీ చేపట్టిన విప్లవాత్మక విజయాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్లో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ వివరించారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నాయకత్వంలో పదేళ్లలో అనేక విప్లవాత్మక విజయాలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. బీజేపీ, మోదీని గుండెల్లో పెట్టుకుని మూడోసారి ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇటలీ కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటూ.. ఒక వర్గానికి కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. నాయకులు పోలీస్ శ్రీనివాస్, ఎల్ఎంఎల్ శ్రీనివాస్, రామడుగు భగత్, కులాచారి సంతోష్, అంబదాస్ రావు, పవన్ ముందాడ, శేఖర్ పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ -
ప్రజలను నిలువు దోపిడీ చేసిన బీజేపీ
డిచ్పల్లి: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా దేశ ప్ర జలను నిలువు దోపిడీ చేసిందని సీపీఐ(ఎంఎ ల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా వ్య తిరేక బీజేపీ, ఎన్డీఏలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారన్నారు. ఇప్పుడు మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో దేవుడు, మతం పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూ స్తున్నారన్నారు.నాయకులు వెంకన్న, సాయగౌ డ్, మురళి, సాయిబాబా, కిషన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. హెన్రీ డునాంట్కు నివాళి నిజామాబాద్నాగారం: రెడ్క్రాస్ సహ వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త హెన్రీ డునాంట్ కు సంస్థ సభ్యులు ఘన నివాళి అర్పించారు. న గరంలోని రెడ్క్రాస్ భవనంలో బుధవారం ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం, హెన్రీ డునాంట్ జన్మదినం నిర్వహించారు. కార్యక్రమానికి జి ల్లా లీగల్ సర్వీసెస్ కార్యదర్శి పద్మావతి హాజ రై, డునాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మా ట్లాడుతూ.. జిల్లా రెడ్క్రాస్ గణనీయమైన సే వలను అందిస్తూ రాష్ట్రస్థాయిలోనే బంగారు ప తకాలు అందుకొని ఆదర్శంగా నిలిచిందన్నా రు. అనంతరం బాల్భవన్లో మంగళవారం చిన్నారులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీ లు నిర్వహించగా విజేతలకు బహుమతులను అందజేశారు. ఇందూర్ మదర్హుడ్ ఆస్పత్రి సౌజన్యంతో ప్రచురించబడిన ‘వడ దెబ్బ నివారణ, జాగ్రత్తలు’ కరపత్రాలు విడుదల చేశారు. జిల్లా రెడ్క్రాస్ సంస్థ చైర్మన్ బస్సా ఆంజనేయు లు, తోటరాజశేఖర్, పురుషోత్తంరెడ్డి, సంస్థ ప్ర తినిధులు కరిపే రవీందర్, అరుణ్బాబు, నీలి రాంచందర్, శ్రీశైలం, రవీందర్, బాబా శ్రీనివా స్, వెంకటేశ్వర్లు, అశ్వక్ అహ్మద్, పోచయ్య, రామకృష్ణ, ప్రభాకర్, సుమిత పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన సిరికొండ: మండల కేంద్రంతోపాటు చీమన్పల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను బుధవా రం ఎన్నికల పరిశీలకుడు డీఎం నింజే బుధవా రం పరిశీలించారు. కేంద్రాల్లో సౌకర్యాలను త నిఖీ చేశారు. పోలింగ్ రోజున ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో లక్ష్మీప్రసాద్, పంచాయతీ కార్యదర్శి శివకుమార్ తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ గెలుపుకోసం కృషి చేయాలి నిజామాబాద్అర్బన్/ఖలీల్వాడి: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం కృషిచేయాలని బీఆర్ఎస్ లీగల్ సెల్కు మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని సెల్ జిల్లా అ ధ్యక్షుడు దాదన్నగారి మధుసూదన్ రావు తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర గొంతుక వినిపించడానికి బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని కేసీఆర్ వివరించినట్లు మధుసూదన్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానం డిచ్పల్లి: ఆర్ఎంపీ– పీఎంపీ సీపీ వెల్ఫేర్ అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా కట్టా అశోక్ ఇటీ వల ఎన్నికయ్యారు. ఈసందర్భంగా బుధవా రం పద్మశాలి సంఘం సభ్యులు, బ్రహ్మ విద్యాశ్రమం పీఠాధిపతి నిర్మలానంద స్వామి బుధ వారం ఆయనను సన్మానించారు. హరికిషన్, లక్ష్మీనర్సయ్య, శ్రావణ్, మామిడాల రాములు తదితరులు పాల్గొన్నారు. మూడు సెల్ఫోన్ల అందజేత ఖలీల్వాడి: నగరంలో గతంలో పలువురు సెల్ఫోన్లను పోగొట్టుకోగా, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో బుధవారం మూడోటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఈఐఆర్ ద్వారా మూడు సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. -
హామీలను నెరవేర్చని ఎంపీ అర్వింద్
ఖలీల్వాడి: బీజేపీ అభ్యర్థి ఎంపీ అర్వింద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా, మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తు న్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నగ రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి 45ఏళ్లుగా నిత్యం ప్రజా సేవలో ఉండటంతోపాటు ఎటువంటి మచ్చ లేకుండా నిస్వార్థ నాయకుడిగా ఉన్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి విజయం కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. ఎంపీ అర్వింద్ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారన్నారు. ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు రమేష్బాబు, పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, వెంకటేష్, శంకర్గౌడ్, గంగాధర్, సుజాత, జంగం గంగాధర్, నన్నేసాబ్, గంగాధర్, కటారి రాములు, నర్సయ్య, అనసూయ, నాయక్వాడి శ్రీనివాస్, హైమద్, సూరి, కేశవేణు, రత్నాకర్ పాల్గొన్నారు. -
ఆరడుగుల అహంకారం.. అర్వింద్
ఆరు అడుగుల అహంకారానికి నిదర్శనం ఎంపీ అర్వింద్ అని రేవంత్రెడ్డి విమర్శించారు. ఆయన ఐదేళ్లలో నిజామాబాద్ అభివృద్ధికి చేసింది గాడిద గుడ్డేనని మండిపడ్డారు. నిజామాబాద్లో ఇంజినీరింగ్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, పసుపుబోర్డు, స్మార్ట్సిటీ, చక్కెర పరిశ్రమలు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చిన అర్వింద్.. ఐదేళ్ల పాటు పబ్బం గడుపుకున్నారని విమర్శించారు. ఎన్నికలు దగ్గరకు రాగానే పసుపుబోర్డు ఉత్తర్వులు తీసుకువచ్చారని.. కానీ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించలేదన్నారు. -
క్రైం కార్నర్
పరిస్థితి విషమించి వృద్ధుడి మృతి మాక్లూర్: రోడ్డు ప్రమాదంలో గాయపడి జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు పరిస్థితి విషమించి బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అడవిమామిడిపల్లికి చెందిన తెడ్డు పోశన్న(70) బోర్గాం (కే)లో తాత్కాలికంగా నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గత నెల 30వ తేదీన ఉదయం మానిక్బండార్ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా ఆర్మూర్ వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పోశన్న తలకు బలమైన గాయం కావడంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి కుమారుడు తెడ్డు నడ్పి గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై గంగాధర్ తెలిపారు. 21 కేసులు కొట్టివేత బోధన్టౌన్(బోధన్): ఎడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగడిబజార్లో షెడ్డులను అక్రమంగా తొలగించారని వేసిన 21 కేసులను బోధన్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి కొట్టివేస్తూ బుధవారం తీర్పును వెల్లడించారు. ఏజీపీ మోహన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 2019– 20లో ఎడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగడిబజార్లో 20 మంది అక్రమంగా షెడ్డులు వేయగా, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తొలగించారు. దీంతో షెడ్డులు వేసినవారు కోర్టును ఆశ్రయించారు. సాక్ష్యాధారాలు రుజువుకాకపోవడంతో న్యాయమూర్తి కేసులు కొట్టివేశారు. మైనర్ల ఆచూకీ గుర్తింపు మోపాల్(నిజామాబాద్రూరల్): మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్లు ప్రేమ పేరుతో 14 రోజుల క్రితం బయటికి వెళ్లిపోగా.. వారి ఆచూకీని గుర్తించినట్లు ఎస్సై గంగాధర్ బుధవారం తెలిపారు. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. మైనర్లు మెట్పల్లిలో ఉన్నట్లు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గుర్తించామన్నారు. బాలికను జిల్లాకేంద్రంలోని సఖీ సెంటర్కు, బాలుడిని బాయ్స్ అబ్జర్వేషన్ కేంద్రానికి అప్పగించామని తెలిపారు. -
సీఎంను కలిసిన డీసీసీబీ చైర్మన్
సుభాష్నగర్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. సీఎం వెంట మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఉన్నారు. ఖలీల్వాడి: ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్క్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్తోపాటు బోధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ప్రసంగించారు. -
మాలలకు అండగా ఉంటాం
నిజామాబాద్నాగారం: మాలలు తమ సంపూర్ణ మద్దతును తెలుపడం సంతోషంగా ఉందని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. నగరంలోని ఓ హోటల్లో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల మాల, మాల అనుబంధ కులాల ముఖ్య నాయకులతో ఆత్మీయ సమ్మేళనాన్ని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఆనంపల్లి ఎల్లయ్య అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ముఖ్య అథితులుగా హాజరైన జీవన్రెడ్డి, మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. మాలలు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్కు సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారన్నారు. దళితుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ గతంలో భూములు పంపిణీ చేసిందని, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందించి దళితులను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చిందని, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కు చట్టబద్ధత కల్పించి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందన్నారు. దళితులకు రక్షణకవచంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ హేళన చేస్తూ మాట్లాడిన తీరు యావత్తు దళిత సమాజాన్ని కలవర పెట్టిందన్నారు. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ అధ్యక్షు డు కేశవేణు, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్య క్షుడు అంగరి ప్రదీప్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గంట సదానందం, అబ్బి ప్రగతికుమార్, బంగారు సాయిలు, నాంది వినయ్ కుమార్, కిష్టయ్య, సీహెచ్ వెంకటరమణ, మూగ ప్రభాకర్, శెట్టిపల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు. భూ పంపిణీ, కార్పొరేషన్ రుణాలను కాంగ్రెస్ అందించింది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ -
ఇందూరు అభివృద్ధి నా బాధ్యతే..
ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితనను గెలిపిస్తే నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా మారుస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిజామాబాద్కు ప్రత్యేకత ఉందన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బీడీ కార్మికులందరికీ పెన్షన్ అందిస్తామన్నారు. 2019లో డీఎస్ కొడుకు అని పార్టీలకతీతంగా అర్వింద్ను గెలిపించారని, ఇప్పుడు ఆయన అహంకార పూరిత ధోరణి అవలంభిస్తున్నారని ఆరోపించారు. రైతు బిడ్డనైన తనకు రైతుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆర్మూర్, బాల్కొండ రైతాంగం చైతన్యవంతులని, ఈ ప్రాంతానికి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలతో సాగునీరందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. లక్కంపల్లి సెజ్లో వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఖలీల్వాడి/ఆర్మూర్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని.. ఇందూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఇందూరు గడ్డపై మూడు రంగుల జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత బస్సు సౌకర్యం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ. 10 లక్షలకు పెంపు, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గంజాయి, డ్రగ్స్పై ఉక్కు పాదం మోపుతున్నట్లు చెప్పారు. వంద రోజుల్లో ఇన్ని పనులు చేస్తే.. కాంగ్రెస్ ఏం చేసిందంటూ కేసీఆర్ మాట్లాడుతు న్నారన్నారు. బుధవారం ఆర్మూర్, నిజామాబాద్ నగరంలో నిర్వహించిన రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఐదేళ్ల క్రితం మాజీ సీఎం కేసీఆర్ కూతురు వంద రోజుల్లో చక్కెర పరిశ్రమ తెరుస్తామని, ఎర్రజొన్న, పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. దీంతో ఇక్కడి రైతులు ఎన్నికల్లో కవితకు గుణపాఠం చెప్పారన్నారు. బిడ్డ బెయిల్ కోసం నిజామాబాద్ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ బీజేపీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు మోడీ చెప్పిన అబద్ధాలను మళ్లీ చెబుతూ మోసం చేస్తున్నారని వాటిని నమ్మి మరోమారు మోసపోవద్దన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్లచట్టాలు చేస్తే పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ సరిహద్దులో ఉద్యమించి కేంద్రం మెడలు వంచారన్నారు. అదే పౌరుషాన్ని ఆర్మూర్ ప్రాంత రై తాంగం సైతం ప్రదర్శిస్తోందంటూ అభినందించా రు. ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న ఆదర్శ గ్రామం అంకాపూర్తో పాటు చైతన్యవంతమైన రైతులు ఇక్కడ ఉన్నారన్నారు. 2014, 2019లో బీఆర్ఎస్, బీజేపీలను గెలిపించి రైతులు మోసపోయారని.. కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఆర్మూర్ సిద్దులగుట్ట సాక్షిగా ఆగస్టు 15లోగా రైతులకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉంటుందని.. రైతులు పండించిన ప్రతి పంటను గిట్టుబాటు ధరకు కోను గోలు చేస్తామని హామీ ఇచ్చారు. పసుపు బోర్డు సాధించాలన్నా, చక్కెర కర్మాగారం తెరుచుకోవాలన్న కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలన్నారు. ఎన్నికల అనంతరం మంత్రులతో ఉపసంఘాన్ని వేసి రూ. 42 కోట్లు కేటాయించి చక్కెర కర్మాగారం ప్రారంభింపజేస్తామన్నారు. జీవన్రెడ్డి 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేని నేత అని తెలిపారు. నిజాయితీ గల రైతు బిడ్డకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆర్మూర్లో నిర్వహించిన రోడ్షోలో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల నాయకులు పొద్దు టూరి వినయ్కుమార్రెడ్డి, ముత్యాల సునీల్కుమార్రెడ్డి పాల్గొనగా.. నిజామాబాద్లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, డీసీసీ అధ్యక్షులు మానా ల మోహన్రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేణు, తాహెర్బిన్ హందాన్, మాజీమేయర్ సంజయ్, గడుగు గంగాధర్, మహిళా కాంగ్రెస్ నగరాధ్యక్షురాలు రేవతి తదితరులు పాల్గొన్నారు.స్మార్ట్సిటీగా మారుస్తా.. నిజామాబాద్ గడ్డపై మూడు రంగుల జెండా ఎగరాలి జీవన్రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలి ఎంపీ అర్వింద్ చేసింది గాడిద గుడ్డే.. సిద్ధులగుట్ట సాక్షిగా ఆగస్టు 15లోగా రూ. 2లక్షల రుణమాఫీ చేస్తాం 2021లో రైతులు చేసిన పసుపు ఉద్యమమే నన్ను ఈ స్థాయికి తెచ్చింది ఆర్మూర్, నిజామాబాద్ రోడ్ షోల్లో సీఎం రేవంత్రెడ్డి -
సర్వేల జోరు..
● పార్టీల విజయావకాశాలపై ఏజెన్సీల అభిప్రాయ సేకరణ●● ఇంటింటికి తిరుగుతున్న యువత ● ఫోన్ల ద్వారా ఓటర్ల నాడి తెలుసుకునే ప్రయత్నంనిజామాబాద్ అర్బన్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఓటర్ నాడి తెలుసుకునేందుకు పలువురు సర్వేలు చేపడుతున్నారు. పోలింగ్కు సమయం సమీపిస్తుండడంతో ఏ పార్టి అభ్యర్థి విజయం సాధిస్తారని అభ్యర్థులు, ప్రైవేట్ ఏజెన్సీలు సర్వేలు చేపడుతున్నాయి. నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే పలు వురు సర్వేలను చేపట్టారు. ప్రస్తుతం కూడా ప్రచార పర్వం కొనసాగుతున్న తరుణంలో జిల్లాలోని ఆయా నియోజకవర్గాలలో వివిధ పార్టీలు సర్వేలు చేస్తున్నాయి. ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారు. ఏ అభ్యర్థిని గెలిపించే అవకాశం ఉంది. అనే అంశాలతో ఈ సర్వేలు కొనసాగుతున్నాయి. జిల్లాలో పలు ఏజెన్సీలు 15 రోజులుగా తమ ప్రతినిధుల ద్వారా ఓటర్ల అభిప్రాయాలు సేకరిస్తున్నాయి. అభ్యర్థులు సైతం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల పరిధిలో సర్వేల కోసం ఏజెన్సీలు యువ తను వినియోగించుకుంటున్నాయి. తమకు కేటాయించిన గ్రామా ల్లో ఏజెన్సీలు ప్రతినిధులు నిత్యం వంద శాంపిల్స్ తీసుకుంటున్నారు. ఇందులో ఓటరు కులం, వయస్సు, ఏ పార్టీకి ఓటు వేస్తున్నారనే అంశాలు సేకరిస్తున్నారు. అలాగే పోటీలో ఉన్న అభ్యర్థులు సైతం తమ గెలుపోటములపై సర్వేలు చేయిస్తున్నారు. దీనికి తోడు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా సర్వేలు చేస్తున్నట్లు సమాచారం. ఎవరికి ఓటు వేస్తారు ఓటర్ల అభిప్రాయం తెలుసుకోవడానికి అభ్యర్థులు సాంకేతికతను ఉపయోగిస్తున్నా రు. ఫోన్ల ద్వారా ఎవరికి ఓటు వేస్తారని వివరాలు సేకరిస్తున్నారు. ఐవీఆర్ కాల్స్ ద్వారా కూడా సర్వే చేపడుతున్నారు. ఇలా ప్రస్తుతం ప్రతి ఒక్కరికి నిత్యం రెండు నుంచి మూడు సార్లు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో సైతం ఓపినియన్ పో ల్స్ నిర్వహిస్తున్నారు. ఆయా సర్వేల ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్తో అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. తాము వెనుకబడి ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. లోటుపాట్లను తెలుసుకొని ప్రజల మనసు గెలుచుకునేలా హామీలు గుప్పిస్తున్నారు. -
గాలివాన బీభత్సం
దోమకొండ: దోమకొండ మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా బలమైన గాలి వీస్తూ వర్షం కురిసింది. గంటపాటు గాలులు బలంగా వీయడంతో రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కల్లాల్లో ధాన్యం తడవగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం సైతం సాయంత్రం నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా లేదు. బుధవారం సైతం ఈదురుగాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి వరకు విద్యుత్ పునరుద్ధరించే పరిస్థితి లేదని విద్యుత్ అధికారులు తెలిపారు. ఇటు వర్షం, అటు కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చింతమాన్పల్లి, ముత్యంపేట గ్రామాల్లో పలు ఇళ్లపై ఉన్న రేకులు లేచిపోయాయి. శివరాంమందిర్ ఏరియాలో రేకుల షెడ్డు ఎగిరిపడగా ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చింతమాన్పల్లిలో ఓ ఇంటిపై చెట్టు కూలింది. తడిసిన ధాన్యం కామారెడ్డి రూరల్: కామారెడ్డి పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయింది. కామారెడ్డిలోని గాంధీగంజ్లో ధాన్యం కొట్టుకుపోయింది. గాలులకు ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్లు ఎగిరిపోయాయి. దీంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. భిక్కనూరులో భిక్కనూరు: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వడ్లు, మక్కలు ఆరబెట్టుకున్న రైతులు వర్షంతో ఆందోళన చెందుతున్నారు. నేలకొరిగిన చెట్లు తెగిపడిన విద్యుత్ తీగలు -
రెచ్చగొట్టడం, విభజించడం అర్వింద్ పాలసీ
● మేయర్ చేస్తానంటే రూ.4కోట్లు ఇచ్చా ● ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఆయన బాధితులు ● బీజేపీ కార్పొరేటర్ సవిత భర్త మీసాల శ్రీనివాస్నిజామాబాద్నాగారం: రెచ్చగొట్టడం, విభజించి పాలించడం ఎంపీ అర్వింద్ పాలసీ అని బీజేపీ కార్పొరేటర్ మీసాల సవిత భర్త మీసాల శ్రీనివాస్ ఆరోపించారు. దేశంలో మోదీ గెలవాలని, జిల్లాలో మాత్రం అర్వింద్ను ఓడించాల్సిందేనని అన్నారు. నగరంలోని ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎనాడూ పని చేయలేదని, తనను సస్పెండ్ చేసే అర్హత జిల్లా అధ్యక్షుడికి లేదన్నారు. మేయర్ చేస్తానంటే అర్వింద్కు రూ.4కోట్లు ఇచ్చానని, చివరి క్షణంలో పేరు మార్చి మోసం చేశాడని ఆరోపించారు. తాము ఇప్పటికీ బీజేపీలో ఉన్నామని, ఒక వేళ తాము తప్పు చేస్తే చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకే ఉంటుందన్నారు. పార్టీ మనుగడ కోసం అర్వింద్ను సస్పెండ్ చేయాలని, కార్యకర్తలను ఆయన పట్టించుకోడన్నారు. నియోజకవర్గానికి అర్వింద్ చేసింది శూన్యమని, ఎంపీ నిధులు వాడుకోలేని దద్దమ్మ అని ఘాటు విమర్శలు చేశారు. అర్వింద్ బాధితులందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీలేనని.. ఎమ్మెల్యేలు రాకేశ్రెడ్డి, ధన్పాల్ సైతం ఆయన వ్యవహారశైలితో విసిగిపోతున్నారన్నారు. అమిత్షా మీటింగ్లో ఎమ్మెల్యే ధన్పాల్కు జరిగిన అవమానం ప్రజలకు జరిగిన అవమానమని, అర్వింద్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, బజరంగ్దళ్ తదితర హిందూ సంస్థలు వద్దన్నప్పటికీ అధిష్టానం అర్వింద్కు టికెట్ ఇచ్చిందని, నిజామాబాద్లో ఆయనను ఓడిస్తే పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. -
సీఎం రోడ్డు షో హైలైట్స్
ఖలీల్వాడి/ఆర్మూర్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ పట్టణంతోపాటు నిజామాబాద్ నగరంలో బుధవారం నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఆయా మీటింగ్లకు సంబంధించిన హైలైట్స్.. ● ఆర్మూర్లోని అంబేడ్కర్ చౌరస్తాలో కళాకారులు తమ ఆటపాటలతో హుషారెత్తించారు. ● సీఎం వచ్చిన హెలీకాప్టర్ సాయంత్రం 6.10గంటలకు ఆర్మూర్ పట్టణంలోని హెలీప్యాడ్కు చేరింది. ● దోభీఘాట్ నుంచి కాశీహనుమాన్ వీధి, గోల్బంగ్లా, పాత బస్టాండ్ మీదుగా పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వరకు రోడ్షో సాగింది. ● దారిపొడువునా ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ● రాత్రి 7.45 గంటలకు ఆర్మూర్లో కార్నర్ మీటింగ్ ముగిసింది. ● ఆర్మూర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం జిల్లా కేంద్రానికి బయల్దేరారు. ● రాత్రి 8:15 గంటలకు నిజామాబాద్లోని గోల్హనుహన్ ప్రాంతానికి సీఎం రేవంత్రెడ్డి చేరుకున్నారు. ● సీఎంకు కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ● గోల్హనుమాన్ నుంచి అర్యసమాజ్, పెద్దబజార్, ఆజాంరోడ్డు మీదుగా నెహ్రూపార్క్ వరకు రోడ్డు షో కొనసాగింది. ● 8:40 గంటలకు నెహ్రూపార్క్కు రేవంత్రెడ్డి చేరుకున్నారు. ● ముందుగా ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రసంగించగా, చివర రేవంత్రెడ్డి ప్రసంగించారు. ● కార్నర్ మీటింగ్ ముగిసిన తరువాత రోడ్డుమార్గం ద్వారా సీఎం హైదరాబాద్కు వెళ్లారు. ● గోల్మానుమాన్ నుంచి నెహ్రూపార్క్ వరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ● పెద్దబజార్ వద్ద వాహనాల రాకపోకలను డైవర్ట్ చేశారు. సీఏం కాన్వాయ్ వెళ్లిన తర్వాత వాహనాలను అనుమతించారు. ● డీసీపీలు, ఏసీపీలతోపాటు మొత్తం 300 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. -
పీఎఫ్ఐ, సిమికి మాతృసంస్థ కాంగ్రెస్
సుభాష్నగర్: పీఎఫ్ఐ, సిమి ఆర్గనైజేషన్లకు కాంగ్రెస్ మాతృసంస్థగా మారుతోందని, ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థలన్నీ ఆ పార్టీకి మద్దతు పలుకుతూ, ఫండింగ్ చేస్తున్నాయని బీజేపీ అభ్యర్థి, ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిషేధిత సిమి సంస్థ కాంగ్రెస్కు మద్దతు తెలుపుతూ తీర్మానం చేసిన కాపీలను మైనార్టీ ఏరియాల్లో యువకులు పంచుతున్నారని తెలిపారు. ముస్లిములను ఓబీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తుందని, అందుకే కాంగ్రెస్కు ఓటేయాలని తీర్మానం చేశారన్నారు. కాంగ్రెస్ గెలిస్తే సిమి, ఉగ్రవాద సంస్థ కంట్రోల్లో ఉంటుందని ఆరోపించారు. బీజేపీకి 400 ఎంపీ సీట్లు ఇవ్వకుంటే రామమందిరానికి బాబ్రీ తాళం వేస్తారని మోదీ ప్రకటించారని గుర్తుచేశారు. పీఎఫ్ఐకి జగిత్యాల్, నకిలీ పాస్పోర్టులకు బోధన్ అడ్డాగా మారాయని, నిజామాబాద్లోని మైనార్టీ ఏరియాల్లో ఎన్ఐఏ పలుమార్లు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకుందన్నారు. సీఏఏ, యూనిఫామ్ సివిల్ కోడ్, ఎన్ఆర్సీ, ఆర్టికల్ 370పై కాంగ్రెస్ స్టాండ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవి హిందువుల ఉనికి కాపాడే ఎన్నికలని, ఇప్పటికై నా హిందూ సమాజం కళ్లు తెరవాలని కోరారు. అమలుసాధ్యం కాని హామీలు ఇచ్చి సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, నాయకులు గద్దె భూమన్న, న్యాలం రాజు, స్రవంతిరెడ్డి, పంచరెడ్డి ప్రవళిక, ఎర్రం సుధీర్, సుక్క మధు, మాస్టర్ శంకర్, బంటు రాము తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్కు ఉగ్ర సంస్థల మద్దతు బీజేపీ అభ్యర్థి, ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆరోపణ -
పోలింగ్ సజావుగా జరిగేలా కృషిచేయాలి
సుభాష్నగర్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రి య ఈనెల 13న సజావుగా జరిగేలా సెక్టోరల్ అధికారులు కృషి చేయాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఎన్నికల సెక్టోరల్ అధికారులకు మలి విడత శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. శిక్షణ తరగతులకు ఎన్నిక ల సాధారణ పరిశీలకులు ఎలిస్ వజ్ ఆర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియకు సంబంధించి సెక్టోరల్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, పరిశీలించాల్సిన విషయాలపై అంశాల వారీగా కలెక్టర్ అవగాహన కల్పించారు. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఎవరైనా విధులపై అలసత్వాన్ని ప్రదర్శిస్తూ నిర్లక్ష్యానికి తావిస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటి సమాచారం అందించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో అందించిన బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్ల ను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవడం, చెక్ చేయడం వంటివి చేయకూడదన్నారు. పోలింగ్ రోజు ఉదయం 5.30 గంటలకు మాక్పోల్ ప్రారంభమయ్యేలా చూడాలని, ఏజెంట్లు రాని పక్షంలో 15 నిమిషాలు వేచి చూసి మాక్ పోల్ చేయాలని సూచించారు. పోలింగ్ రోజు ఓటింగ్ శాతాన్ని వెంటనే ఎన్ కోర్ యాప్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. 17–సి డాక్యుమెంట్, పీవో డైరీ, విజిట్ షీట్, మాక్ పోల్ సర్టిఫికెట్, 17 కాలమ్ ప్రొఫార్మా వంటివి తప్పులు లేకుండా సక్రమంగా పూరించేలా పరిశీలించాలని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను జాగ్రత్తగా రిసెప్షన్ సెంటర్లకు చేర్చాలని, వాటిని సరిచూసుకుని స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచే వరకు సెక్టోరల్ అధికారులు అక్కడే అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. సెక్టోరల్ ఆఫీసర్లు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, మౌలిక వసతులను పరిశీలించాలని కలెక్టర్ పేర్కొన్నారు. తరగతుల్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రెయినీ కలెక్టర్ సాకేత్ తది తరులు పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు సెక్టోరల్ అధికారులకు శిక్షణా తరగతులు -
సీఎం రేవంత్ రోడ్షో సక్సెస్
ఆర్మూర్ టౌన్/పెర్కిట్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్ సక్సెస్ అయ్యాయి. అంబేడ్కర్ చౌరస్తాలో కళాకారులు తమ ఆటపాటలతో హుషారెత్తించారు. కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ను కలిసిన మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్దేవి లావణ్య పలు సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.16 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణంతోపాటు విలీన గ్రామాలైన పెర్కిట్–కొటార్మూర్, మామిడిపల్లిల్లో సమస్యలను సైతం పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి, ఆర్మూర్, బా ల్కొండ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్చార్జీలు వినయ్రెడ్డి, సునీల్రెడ్డి, రైతు నాయకుడు అన్వేష్రెడ్డి, అయ్యప్ప శ్రీనివాస్ తదితరులున్నారు. -
ఒక ఎంపీ.. రెండు జిల్లాలు
ఖలీల్వాడి: నిజామాబాద్ పార్లమెంట్ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో నిజామాబాద అర్బన్, రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్ ఐదు నియోజకవర్గాలు నిజామాబా ద్ జిల్లాలో ఉండగా, మిగతా రెండు జగిత్యాల, కోరుట్ల ని యోజకవర్గాలు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు రెండు జిల్లాలకు చెందిన నాయకులు, రాష్ట్రస్థాయి నాయకులందరినీ సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల స్వరూపం ఇలా ఉంది.. నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని 60 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ కార్పొరేటర్లతోపాటు డివిజన్ల వారీగా పార్టీల అధ్యక్షులను సమన్వయం చేసుకుంటున్నారు. నిజామాబాద్రూరల్ : అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నిజామాబాద్ రూరల్ మండలంతోపాటు మోపాల్, సిరికొండ, డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి మండలాలున్నాయి. ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలో ఆర్మూర్ టౌన్, ఆర్మూర్ రూరల్, ఆలూర్, మాక్లూర్, నందిపేట్ మండలాలున్నాయి. ఇక్కడ పసుపు రైతులు ఎక్కువగా ఉంటారు. బోధన్ : బోధన్ నియోజకవర్గం పరిధిలో బోధన్టౌన్, రూరల్, ఎడపల్లి, నవీపేట్, రెంజల్ మండలాలు ఉన్నాయి. ఇక్కడ ఆసియా ఖండంలోనే అతి పెద్ద చక్కెర కర్మాగారం ఉంది. నిజాంకాలంలో దీనిని ఏర్పాటు చేశారు. తొలి తెలుగు కవి పంపన ఈ ప్రాంతంకు చెందినవారు. బాల్కొండ : బాల్కొండ నియోజకవర్గంలో బాల్కొండ, వేల్పూర్, భీమ్గల్, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాలు ఉండేవి. మండలాల పునర్విభజన సమయంలో ఏర్గట్ల, ముప్కాల్, మెండోరా మండలాలు ఏర్పాడ్డాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మెండోరా మండలంలో ఉంది. కోరుట్ల : కోరుట్ల నియోజకవర్గం జగిత్యాల జిల్లాలో ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాలతో జగిత్యాల జిల్లాగా ఏర్పడింది. ఇందులో కోరుట్ల, జగిత్యాల్ నియోజకవర్గాలు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. కోరుట్ల నియోజకవర్గంలో కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలతోపాటు మెట్పల్లి రూరల్ మండలం, కోరుట్ల రూరల్ మండలం, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలున్నాయి. జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంగా ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో జగిత్యాల టౌన్, జగిత్యాల రూరల్, సారంగాపూర్, బీర్పూర్, మేడిపల్లి, రాయికల్ మండలాలు ఉన్నాయి. -
మాధవనగర్ వద్ద వాహనాల నిలిపివేత
● జిల్లా కేంద్రం నుంచి డిచ్పల్లి వైపు వాహనాలను అనుమతించని పోలీసులు ● ప్రయాణికులకు ఇబ్బందులు నిజామాబాద్ రూరల్: మాధనగర్ రైల్వే గేటు వద్ద పోలీసులు బుధవారం రాత్రి ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసి నిజామాబాద్ వైపు నుంచి డిచ్పల్లి వైపు వాహనాలను అనుమతించలేదు. అదే సమయంలో వన్వే ద్వారా డిచ్పల్లి వైపు నుంచి వస్తున్న వాహనాలను జిల్లా కేంద్రం వైపు అనుమతించారు. మరికొన్ని వాహనాలు బైపాస్ మీదుగా నగరం వైపు వెళ్లాయి. నిజామాబాద్ వైపు నుంచి డిచ్పల్లి వైపు వెళ్తున్న వాహనాలు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర అసహనానికిలోనై పోలీసులతో వాగ్వాదానికి దిగారు. -
బీజేపీ గెలిస్తే.. నియంత పాలనే! : సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యాంగాన్ని మార్చి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్నది మోదీ ప్రభుత్వ కుట్ర అని టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. బీజేపీ గెలిచి రాజ్యాంగాన్ని మారిస్తే.. దేశం నియంత పాలనలోకి వెళుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేడీ ఒక్కటేనని.. బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని పేర్కొన్నారు. కేసీఆర్ తన బిడ్డ కవిత బెయిల్ కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. బుధవారం నిజామాబాద్, ఆర్మూర్లలో నిర్వహించిన రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లలో రేవంత్రెడ్డి మాట్లాడారు. ‘‘రైతు భరోసా ఇస్తే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తానన్న కేసీఆర్కు సిగ్గులేదు. 69 లక్షల మంది రైతుల ఖాతాలు చూస్తే డబ్బులు జమ అయిన విషయం తెలుస్తుంది. మరి కేసీఆర్ ఏం చేస్తున్నారు? రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్రావు సవాల్ చేశారు. ఆగస్టు 15లోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి.. సిద్దిపేటకు పట్టిన శని హరీశ్రావును వదిలిస్తా. రాజీనామా రాసిపెట్టుకో హరీశ్రావు.. రైతులకు ధాన్యానికి రూ.500 బోనస్తోపాటు ఎర్రజొన్నలు, మొక్కజొన్న, సోయాకు గిట్టుబాటు ధరలు ఇస్తాం. షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశాం. గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాం. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఇప్పటికే ఉపసంఘం వేశాం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చెరుకు రైతులకు రూ.47 కోట్ల బకాయిలు విడుదల చేస్తాం. ఎంపీ అర్వింద్ చెప్తున్న పసుపుబోర్డు కాగితాలకే పరిమితమైంది. నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తానని మాటిచ్చి తప్పిన కవితను ప్రజలు ఓడించి అర్వింద్ను గెలిపించారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన అర్వింద్ తేలేకపోయారు. పైగా షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ప్రధాని మోదీ మళ్లీ అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి. మేం తప్పకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం. రాజ్యాంగాన్ని మార్చితే ప్రజలు ఊరుకోరు 2021లోనే చేయాల్సిన జనగణన చేపట్టకుండా ప్రధాని మోదీ కుట్ర చేశారు. బీసీల కులగణనకు మోదీ ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలి. రాజ్యాంగాన్ని మార్చి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న మోదీ ప్రభుత్వ కుట్రలో భాగమే. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని నచ్చినట్టు మార్చాలని చూస్తే జనం చూస్తూ ఊరుకోరు. రాజ్యాంగాన్ని మారిస్తే దేశం నియంత పాలనలోకి వెళుతుంది. రిజర్వేషన్లను రద్దు చేసే ప్రమాదం మెడ మీద కత్తిలా వేలాడుతోంది. అందుకే దేశ ప్రజలు బీజేపీని గొయ్యి తీసి పాతిపెట్టాలి. అభివృద్ధి అడిగితే గాడిద గుడ్డు ఇచ్చారు రాష్ట్ర విభజన సమయంలో బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, నల్లగొండలో ఐఐటీ, మెదక్లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చింది. కానీ మోదీ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. చక్కెర కర్మాగారం అడిగితే గాడిద గుడ్డు ఇచ్చారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడి ఫొటోలు చూపించి ఓట్లడిగేవారిని బిచ్చగాళ్లు అంటారు. రామాలయం ప్రతిష్టకు 15 రోజుల ముందే అక్షింతలు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్షింతలు ముందే పంపిణీ చేయడం హిందూ సంప్రదాయం కాదు. బీజేపీ నాయకులు దేవుడిని, ప్రజలను మోసం చేస్తున్నారు..’’ అని రేవంత్ ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డిని గెలిపించాలని కోరారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
భారత టాప్ రెజ్లర్పై సస్పెన్షన్ వేటు
గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
బహిరంగ చర్చ.. మోదీ, రాహుల్ గాంధీలకు ఆహ్వానం
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
చంద్రబాబుకి అభివృద్ధి కనిపించడం లేదా?: సజ్జల
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement