కరోనాతో అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షల సాయం | Sakshi
Sakshi News home page

కరోనాతో అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షల సాయం

Published Thu, Jun 3 2021 11:14 AM

Rs 10 Lakh Assistance For Orphan Children - Sakshi

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ (గన్నవరం): కరోనాతో తల్లి చనిపోవడంతో అనాథలైన ఇద్దరు చిన్నారులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం పత్రాలను బుధవారం అధికారులు, వైఎస్సార్‌సీపీ నాయకులు అందజేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలుకు చెందిన నాగేశ్వరమ్మ ఇటీవల కోవిడ్‌తో మృతిచెందారు. మూడేళ్ల కిందటే నాగేశ్వరమ్మ భర్త రమేష్‌ గుండెపోటుతో మరణించాడు. దీంతో వీరి ఇద్దరు పిల్లలు సాయిగణేష్, నాగరవళి అనాథలయ్యారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అధికారులతో మాట్లాడి చిన్నారులకు ఆర్థిక సాయాన్ని మంజూరు చేయించారు. కరోనా అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు రూ.10 లక్షల సాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

చదవండి: పేదల ఇళ్ల కోసం ప్రత్యేకంగా జేసీలు 
‘గుట్ట’ కాయస్వాహా: టీడీపీ నేత భూ బాగోతం.. 


 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement