స్నేహితులతో గడపాలని భార్యకు నరకం | Sakshi
Sakshi News home page

స్నేహితులతో గడపాలని భార్యకు నరకం

Published Tue, Oct 17 2023 8:28 AM

husband harassed wife in karnataka - Sakshi

కర్ణాటక: తన ముగ్గురు స్నేహితులతో లైంగిక క్రియలో పాల్గొనాలని ఓ కిరాతక భర్త భార్యను వేధించాడు, దిగ్భ్రాంతికి గురైన ఆమె బెంగళూరు అమృతహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు... స్థానికంగా ఉంటున్న బాధిత యువతికి 2007 మే 10 తేదీన మంగళూరుకు చెందిన వ్యక్తితో వివాహమైంది. వారికి కొడుకు, కూతురు పుట్టారు. దంపతులు మంగళూరులో కాపురం ఉంటున్నారు. భర్త ఇంట్లో చిన్నపాటి విషయాలకు కూడా రచ్చ చేసేవాడు. చీటికి మాటికి వేధించేవాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది.  

వాట్సాప్‌ చాటింగ్‌ గుట్టురట్టు  
భర్త  ఐఫోన్‌తో పిల్లలు ఆడుకుంటు ఉండగా, ఆమె అందులోని వాట్సాప్‌ చాటింగ్‌ చూసి నివ్వెరపోయింది. బాబు, అనంతకుమార్, వీరేంద్ర అనే ముగ్గురితో అసభ్యకరంగా చాటింగ్‌ చేశాడు, పైగా వారితో శారీరక సంబంధం ఉందని, అతడు గే అని గుర్తించింది. పలువురు సెక్స్‌వర్కర్లతో చాటింగ్‌ కనిపించింది. దీనిపై భర్తను నిలదీయగా అతడు.. నా ఇష్టం, ఏమైనా చేస్తా, దీనిపై ఎవరికైనా చెబితే నిన్ను చంపేస్తానని బెదిరించి కొట్టాడు. నిన్ను పిల్లలను పైసా కూడా ఇవ్వకుండా బయటకు గెంటేస్తానని హెచ్చరించాడు. 

తల్లిదండ్రులతో మొరపెట్టుకోవగా వారు అతనికి బుద్ధి మాటలు చెప్పినా ఫలితం లేకపోయింది. కుటుంబాన్ని పట్టించుకోవడం మానేయడంతో ఆమె బెంగళూరులో పుట్టింటికి వచ్చేసింది. చివరకు పెద్దలు పంచాయతీ చేయగా, బెంగళూరులో ఆర్‌ఎంజెడ్‌ ల్యాటిట్యూడ్‌లో ఫ్లాట్‌ కొని అక్కడికి తీసుకెళ్లాడు. నా స్నేహితులు వస్తుంటారు, వారితో పడుకోవాలని ఆమెకు చెప్పాడు. ఆమె గొడవచేయడంతో మానసికంగా, శారీరకంగా హింసించాడని, చంపేస్తానని వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. కేసు నమోదు చేసుకున్న అమృతహళ్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement
Advertisement