కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం లోక్సభ స్థానం ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఈమేరకు సోమవా రం ఏడుగురు అభ్యర్థులు 11 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్)గా ఉల్లెంగుల యాదయ్య రెండు సెట్లు, బహుజన్ లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా అంతోని సురేష్ ఒక సెట్ నామినేషన్ సమర్పించారు. అలాగే, స్వతంత్ర అభ్యర్థులు దండా లింగయ్య మూడు సెట్లు, తేజావత్ జోగు రాము రెండు, ఎదురుగట్ల చిట్టిమల్లు, మద్దిశెట్టి ఎర్రప్ప, మద్దినేని అనిల్కుమార్ ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.