వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసుల దాడి | Sakshi
Sakshi News home page

వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసుల దాడి

Published Fri, Apr 19 2024 1:45 AM

సోదాలు చేస్తున్న పోలీసులు 
 - Sakshi

కాగజ్‌నగర్‌ రూరల్‌: పట్టణంలో అక్రమ వడ్డీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై గురువారం డీఎస్పీ కరుణాకర్‌ ఆధ్వర్యంలో మూడు టీంలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. పెద్దవాగు రోడ్డులోని సురేందర్‌ సితాని ఇంట్లో ప్రామిసరీనోట్లు, నాన్‌జ్యూడిషియల్‌ బాండ్లు, నాలుగు బ్లాంక్‌ చెక్కులతో పాటు రూ.1,43,250 నగదు, దుర్గానగర్‌లోని జుగల్‌ కిశోర్‌లోయా ఇంట్లో రూ.28 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శంకరయ్య తెలిపారు. అమాయక ప్రజల నుంచి అధికశాతం వడ్డీ వసూలు చేస్తూ వారిని వేధిస్తుండటంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement