ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా? | Sakshi
Sakshi News home page

Manjummel Boys OTT:'మంజుమ్మల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?

Published Thu, Apr 11 2024 1:30 PM

Manjummel Boys OTT Release Date And Details - Sakshi

ఈ మధ్య మలయాళ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. 'ప్రేమలు' అనే ప్రేమకథ కుర్రాళ్లని నవ్విస్తే 'మంజుమ్మల్ బాయ్స్' అనే మరో మూవీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, మలయాళ చిత్రసీమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడీ చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 22న మలయాళంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. తొలిరోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దాదాపు నెలపాటు  కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. అలా రూ.200 కోట్ల మేర వసూళ్లు దక్కాయి. ఏప్రిల్ 6న తెలుగులోనూ విడుదలైంది. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌తో అసభ్య ప్రవర్తన.. బోనీ కపూర్‌పై నెటిజన్స్‌ ఫైర్!)

అయితే హిట్ టాక్ తెచ్చుకున్న 'మంజుమ్మల్ బాయ్స్' ఓటీటీ హక్కుల్ని కొనే విషయంలో తొలుత లెక్క తేలలేదు. కానీ తర్వాత తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ చిత్ర ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకుంది. మే 3న దక్షిణాదిలో భాషల్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కథ విషయానికొస్తే.. మంజుమ్మల్ అనే ఊరికి చెందిన కొందరు కుర్రాళ్లు తమిళనాడులోని కొడైకెనాల్ ట్రిప్ కి వెళ్తారు. వీళ్లలో ఒకడు లోతైన గుహలో పడిపోతాడు. ఇతడిని మిగతా స్నేహితులు అందరూ కలిసి ఎలా రక్షించారు? చివరకు ఏమైందనేదే 'మంజుమ్మల్ బాయ్స్' స్టోరీ.

(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న ఆర్ఆర్ఆర్ సింగర్.. ఎన్ని కోట్లంటే?)

Advertisement
Advertisement