సాక్షి, పుణె: భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్లో తీవ్రస్ధాయిలో విజృంభిస్తోంది. కరోనా వైరస్ మ్యుటేషన్ చెందడంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరగడానికి ముఖ్యకారణమని పరిశోధకులు తెలిపారు. డెల్టా వేరియంట్గా పిలవబడే B.1.617.2 వేరియంట్ భారత్లో అత్యధిక ప్రభావం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం భారత్లో మరో కరోనా వైరస్ వేరియంట్ను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) గుర్తించారు. ఈ వేరియంట్ను అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాల నుంచి B.1.1.28.2 వేరియంట్గా గుర్తించారు.
ఎన్ఐవి నివేదిక ప్రకారం, బ్రెజిల్, యునైటెడ్ కింగ్డమ్ నుంచి భారత్కు వచ్చిన ప్రయాణికుల్లో కొత్త వేరియంట్ను కనుగొన్నారు. ఈ కొత్త వేరియంట్ తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించే అవకాశం ఉందని తమ నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ వేరియంట్తో వైరస్ వ్యాప్తి మరింత అధికంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ వేరియంట్ ప్రస్తుతం ఉన్న టీకాలు ఎంతమేరకు సామర్థ్యాన్ని కల్టి ఉన్నాయనే విషయం కోసం , ఎక్కువగా పరీక్షించాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. కొత్త వేరియంట్ను ప్రయోగించిన ఎలుకల్లో శరీర బరువు ఒక్క సారిగా తగ్గిపోయిందని పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా శ్వాసకోశంలో సమస్యలు, ఊపిరితిత్తుల్లో గాయాలు ఏర్పడాయని పేర్కొన్నారు.
కాగా, పది ప్రయోగశాలల సమూహమైన ఇన్సాకాగ్ (INSACOG) విస్తృత అధ్యయనం ప్రకారం, గత రెండు నెలల్లో భారత్లో కోవిడ్ -19 కేసుల పెరుగుదల SARS-CoV-2 కు చెందిన B.1.617 వేరియంట్ కారణమని తెలిపారు. ఇన్సకాగ్ ప్రకారం కరోనా వైరస్ B.1.1.7 వేరియంట్కు 'ఆల్ఫా' అని పేరు పెట్టారు. దీనిని మొదటిసారిగా యునైటెడ్ కింగ్ డమ్లో గుర్తించారు. ఈ వేరియంట్ గత ఒకటిన్నర నెలల్లో తీవ్రస్థాయిలో విజృంభించిందని ఇన్సాకాగ్ తెలిపింది.
మరో కొత్త వేరియంట్.. వాటితో పోలిస్తే మహా డేంజర్..!
Published Tue, Jun 8 2021 4:26 PM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
Border 2: ఇరవయ్యేడేళ్ల తర్వాత...
మాజీ ప్రేమికుల కథ
యడ్యూరప్పపై అరెస్టు వారెంట్
ఐపీఎస్లను వెంటనే డెప్యుటేషన్పై పంపండి
దాడులు, హింసపై పూర్తి వివరాలివ్వండి: హైకోర్టు
Narendra Modi: ఉగ్రనిరోధక సామర్థ్యాలను పెంచండి
కోర్టు ప్రాంగణంలోనే హత్యాయత్నం
ఆగని టీడీపీ ఉన్మాదం
Kuwait Fire Incident: 49లో 45 మంది భారతీయులే
విశాఖ విమల విద్యాలయం మూసివేత
తప్పక చదవండి
- ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా
- NEET-UG 2024: లీక్ కాలేదు, రిగ్గింగ్ జరగలేదు: ప్రధాన్
- NEET-UG 2024: సీబీఐతో దర్యాప్తు జరిపించాలి: ఖర్గే
- రాజ్యసభ బరిలో సునేత్రా పవార్
- విశాఖ విమల విద్యాలయం మూసివేత
- మరింత చేరువగా గ్రీన్ ఎనర్జీ
- రక్తం కాదు..ప్రాణం ఇచ్చినట్టే!
- పచారీ కొట్లకు 10 మినిట్స్ సవాల్
- వొడాఫోన్లో నోకియా, ఎరిక్సన్ వెండార్లకు 166 కోట్ల షేర్లు
- నిరంతర గరిష్ట నిల్వలతోనే నష్టం!
Advertisement