
తెలుగులో ‘ఖుషి’ (2023) మూవీ తర్వాత ప్రస్తుతం సమంత ఏ సినిమాలోనూ నటించడం లేదు.

మయోసైటిస్ వ్యాధి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న ఆమె పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఆధ్యాత్మిక సేవను అనుసరిస్తున్నారు.

తాజాగా కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో నిర్వహించిన రిలాక్సింగ్ సెషన్లో పాల్గొన్నారు.

‘‘మనలో చాలామంది మంచి గురువు కోసం వెతుకుతాం.

జీవితంలో వెలుగులు నింపి మనల్ని సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని కనుగొనడానికి మించిన ప్రత్యేకమైనది మరొకటి ఉండదు.

ఎందుకంటే వాళ్ల జ్ఞానం మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అయితే జ్ఞానం కావాలంటే ప్రపంచం నలుమూలలా వెతకాల్సిందే.

ఉరుకులపరుగుల జీవితంలో పడి చాలా విషయాలను మనం తెలుసుకోం. కానీ, సరైన జ్ఞానాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జ్ఞానం గురించి తెలుసుకుంటే సరిపోదు. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని నిజ జీవితంలో ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం’’ అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు సమంత.





