shares
-
నా కోసం ఆ దేవుడే నిన్ను పంపాడు: షోయబ్ మాలిక్పై భార్య పోస్ట్ (ఫొటోలు)
-
'90 రోజుల ప్రేమ'.. ఫోటోలు షేర్ చేసిన పీవీ సింధు (ఫోటోలు)
-
హల్దీ వేడుకను గుర్తు చేసుకున్న కోలీవుడ్ నటి ఇంద్రజ శంకర్ (ఫొటోలు)
-
భారీగా తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ షేర్లు: కారణం ఇదే!
భారతదేశంలోని ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు సోమవారం భారీగా తగ్గాయి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.. రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్ లిమిటెడ్ దాఖలు చేసిన దివాలా పిటిషన్ను ఎదుర్కొంటుందని శనివారం వెల్లడించింది. దివాలా.. దివాలా కోడ్ సెక్షన్ 9 కింద బెంగళూరులోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో ఈ పిటిషన్ను సమర్పించారు.ఆపరేషనల్ క్రెడిటర్ రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్, అందించిన సేవలకు చెల్లింపులలో డిఫాల్ట్ అయిందని ఆరోపించింది. ఓలా ఎలక్ట్రిక్ ఈ వాదనలను ఖండించింది. దీనిపై న్యాయసలహాలు తీసుకుంటున్నామని, వాటాదారుల ప్రయోజనాల కోసం తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లు పతనమయ్యాయి.దీంతో కంపెనీ షేర్లు అమాంతం పడిపోయాయి. ఈరోజు ఉదయం 10.25 గంటలకు ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 6.14 శాతం తగ్గి 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకొని.. రూ. 47.41కి చేరుకున్నాయి. కొంతకాలంగా పతనమవుతున్న ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ ఇప్పుడు భారీ పతనాన్ని చవిచూశాయి. -
ఇదీ హోలీ గిఫ్ట్ అంటే.. ఉద్యోగులకు రూ.34 కోట్లు..
హోలీ పండుగ సందర్భంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు మిఠాయిలు, బహుమతులు ఇవ్వడం సాధారణమే. అయితే ఈ హోలీ సందర్భంగా ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రమోటర్ సంజయ్ షా కేవలం రంగులకే పరిమితం కాకుండా.. తన సిబ్బందికి రూ.34 కోట్ల విలువైన 1,75,000 ఈక్విటీ షేర్లను బహుమతిగా ఇస్తున్నారు.దాదాపు 650 మంది ఉద్యోగులు, వ్యక్తిగత సిబ్బంది దీంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ లిమిటెడ్ సీఎండీ సంజయ్ షా ఈ ఉదార చర్యతో వ్యాపారంలో 25వ ఏట అడుగుపెట్టారు. లబ్ధిదారుల్లో కంపెనీ ఉద్యోగులే కాకుండా ఆయన ఇంట్లో పనిచేసే సహాయకులు, డ్రైవర్లు వంటి వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారు.ఉద్యోగులకు రూ.కోట్ల షేర్లు ప్రకటించిన ప్రూడెంట్ ప్రమోటర్ సంజయ్ షా ఈయనే..ఈ సందర్భంగా సంజయ్ షా మాట్లాడుతూ.. 'ఇది కేవలం షేర్ల బదలాయింపు మాత్రమే కాదు. ఈ ప్రయాణంలో ఉద్యోగులుగా మాత్రమే కాకుండా సహచరులుగా నాకు అండగా నిలిచిన వారికి ఇవి నేను సమర్పించే హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నిస్వార్థ సహకారాలు, విశ్వసనీయత, విధేయత అమూల్యమైనవి’ అని పేర్కొన్నారు.సంజయ్ షా తన నిర్ణయాన్ని కంపెనీకి తెలియజేశారు. ఇందుకోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)తో సహా అవసరమైన రెగ్యులేటరీ అనుమతులను ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ పొందింది. కాగా ఉద్యోగులకు రూ.కోట్ల షేర్లు ప్రకటించిన ప్రూడెంట్ అధినేతపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. -
ధీరూభాయ్ అంబానీ సంతకం వృథా కాబోతోంది..
చండీగఢ్కు చెందిన వ్యక్తి ఇల్లు శుభ్రం చేస్తుండగా 37 ఏళ్ల నాటి రూ.12 లక్షల విలువైన రిలయన్స్ షేర్ సర్టిఫికెట్లు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా వ్యక్తికి వీటిని డిజిటలైజేషన్ చేసుకుందామని ప్రయత్నించగా చిక్కులు ఎదురవుతున్నాయి. దీంతో వాటిని అలాగే వదిలేయాలని నిర్ణయానికి వచ్చేశాడు.వివరాల్లోకి వెళ్తే.. చండీగఢ్కు చెందిన రతన్ ధిల్లాన్ వ్యక్తి ఇల్లు శుభ్రం చేస్తుండగా 37 ఏళ్ల నాటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) షేర్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. 1988లో ఒక్కొక్కటి రూ.10 చొప్పున వీటిని కొనుగోలు చేయగా ఈ షేర్లు స్టాక్ స్ప్లిట్స్, బోనస్ ద్వారా 960 రెట్లు పెరిగాయి. దీంతో వీటి ప్రస్తుత విలువ రూ.12 లక్షలకు చేరింది.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న రతన్ ధిల్లాన్ మొదట వాటిని డిజిటలైజ్ చేసుకోవాలో సలహా కోరారు. అయితే చట్టపరమైన వారసుడి సర్టిఫికెట్, వారసత్వ ధృవీకరణ పత్రం, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ) క్లియరెన్స్ అవసరమయ్యే విస్తృతమైన పేపర్ వర్క్ గురించి తెలుసుకున్న తరువాత, ధిల్లాన్ ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.ధీరూభాయ్ అంబానీ సంతకాలు వృథా కాబోతున్నాయని, షేర్ల డిజిటలైజేషన్ చేయకూడదని నిర్ణయించుకున్నానని రతన్ ధిల్లాన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. "ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది- చట్టపరమైన వారసుడి ధృవీకరణ పత్రాన్ని పొందడానికే 6-8 నెలలు పడుతుంది. ఐఈపీఎఫ్ఏ ప్రక్రియకు 2-3 సంవత్సరాలు పడుతుంది. అంత సమయాన్ని వెచ్చించడంలో అర్థం కనిపించడం లేదు. భారత్ తన పేపర్ వర్క్ ను క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉంది" అని పేర్కొన్నారు.ప్రస్తుతానికి ఫిజికల్ షేర్ సర్టిఫికెట్లను ఏమీ చేయకుండా అలాగే వదిలేస్తానని ధిల్లాన్ తెలిపారు. రతన్ ధిల్లాన్ నిర్ణయంపై మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) లో స్పందనలు వెల్లువెత్తాయి. పలువురు యూజర్లు షేర్ సర్టిఫికెట్ల డిజిటలైజేషన్లో తమ అనుభవాలను పేర్కంటూ కామెంట్లు చేశారు.Final Update: It seems Dhirubhai Ambani’s signatures will go to waste, as I’ve decided not to proceed with digitizing the shares. The process is just too lengthy—obtaining the legal heir certificate alone takes 6-8 months, and the IEPFA process reportedly takes 2-3 years. I… https://t.co/sDt1uPKiqL— Rattan Dhillon (@ShivrattanDhil1) March 12, 2025 -
ఇన్ఫీలో శ్రుతి శిబూలాల్ పెట్టుబడి
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ఎస్డీ శిబూలాల్ కుమార్తె శ్రుతి కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా 29.84 లక్షల షేర్లను సొంతం చేసుకున్నారు. ఇందుకు శ్రుతి శిబూలాల్ దాదాపు రూ. 470 కోట్లు వెచ్చించారు.షేరుకి రూ. 1,574 సగటు ధరలో వీటిని కొనుగోలు చేశారు. ఎస్డీ శిబూలాల్ కుటుంబ సభ్యులలో ఒకరైన గౌరవ్ మన్చందా ఈ షేర్లను విక్రయించారు. కాగా.. మంగళవారం సైతం శ్రుతి శిబూలాల్ రూ. 494 కోట్ల విలువైన ఇన్ఫోసిస్ వాటాను కొనుగోలు చేయడం గమనార్హం! -
ఇండస్ఇండ్ ఇన్వెస్టర్లకు షాక్
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ పోర్ట్ఫోలియో ఖాతాల నిర్వహణలో రూ. 2,100 కోట్లమేర అంతరం నమోదైనట్లు తాజాగా ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. అయితే బ్యాంక్వద్ద తగినంత రిజర్వులు, మూలధనం ఉండటంతో కవర్ చేసుకోగలమని పేర్కొంది. అయితే యాజమాన్యం హామీ ఇచ్చినప్పటికీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇండస్ఇండ్ షేరు 10% పతనమైంది. ఆపై మరింత బలహీనపడుతూ 20% సర్క్యూట్ను తాకింది. సర్క్యూట్ నుంచి రిలీజ్ అయ్యాక మరింత దిగజారింది. వెరసి ట్రేడింగ్ ముగిసేసరికి 27% కుప్పకూలి రూ. 657 వద్ద నిలిచింది. ఒక దశలో రూ. 649 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఏం జరిగిందంటే? ఖాతాలో వ్యత్యాసాన్ని గతేడాది(2024) సెప్టెంబరు– అక్టోబర్లో గుర్తించినట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో, ఎండీ సుమంత్ కథ్పాలియా పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రాథమిక సమాచారాన్ని ఆర్బీఐకు గత వారమే నివేదించినట్లు తెలియజేశారు. అయితే తుది వివరాలు బయటి ఏజెన్సీతో చేయిస్తున్న ఆడిట్ ద్వారా వెల్లడికానున్నట్లు పేర్కొన్నారు. నివేదిక ఏప్రిల్ మొదట్లో వెలువడనున్నట్లు తెలియజేశారు. లాభదాయకత, మూలధన పటిష్టత నేపథ్యంలో ఈ ప్రభావాన్ని బ్యాంక్ సర్దుబాటు చేసుకోగలదన్నారు. 2024 ఏప్రిల్1కు ముందు 5–7ఏళ్లుగా డెరివేటివ్ పోర్ట్ఫోలియో ఖాతాలో తేడా నమోదవుతూ వచ్చిందని చెప్పారు. ఎక్స్ఛేంజీలకు సమాచారం...డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోలో కొన్ని అంతరాలున్నట్లు సోమవారం ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదించింది. వీటి వల్ల బ్యాంక్ నెట్వర్త్పై 2.35 శాతంమేర ప్రతికూల ప్రభావం పడే వీలున్నట్లు పేర్కొంది. అంతర్గత సమీక్ష ద్వారా ఈ అంశాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. వీటిని స్వతంత్రంగా సమీక్షించి నిర్ధారించేందుకు బయటి ఏజెన్సీని ఎంపిక చేసినట్లు తెలిపింది.కాగా.. ట్రెజరీ బిజినెస్లో గుర్తించిన వ్యత్యాసం అంతర్గత, చట్టబద్ధ, ఆర్బీఐ ఆడిట్లలో బయటపడకపోవడం గమనార్హం! 2024 ఏప్రిల్ 1నుంచి డెరివేటివ్స్లో ఇంటర్నల్ ట్రేడ్ను నిలిపివేస్తూ 2023 సెప్టెంబరులో జారీ అయిన ఆర్బీఐ సర్క్యులర్ కారణంగా అంతర్గత బుక్పై సమీక్షకు తెరతీసినట్లు సుమంత్ వెల్లడించారు. దీంతో బయటి ఆడిట్కు ఆదేశించినట్లు తెలియజేశారు. అయితే బ్యాంక్ ఎండీ, సీఈవోగా తిరిగి ఎంపిక చేయడంలో ఆర్బీఐపై ఈ అంశంప్రభావం చూపి ఉండవచ్చని పేర్కొన్నారు. బ్యాంక్ బోర్డు మూడేళ్ల కాలానికి ప్రతిపాదించగా.. గత వారం ఆర్బీఐ ఏడాది కాలానికే సుమంత్ బాధ్యతల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రూ. 19,000 కోట్లు ఆవిరి...షేరు భారీ పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే ఇండస్ఇండ్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు ఒక్కరోజులోనే రూ. 19,000 కోట్లమేర చిల్లుపడింది. ఈ నెల 10న నమోదైన రూ. 70,150 కోట్ల నుంచి బ్యాంక్ మార్కెట్ విలువ తాజాగా రూ. 51,168 కోట్లకు క్షీణించింది. బ్యాంక్ షేరు 2018 ఆగస్ట్లో రూ. 2038 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. గతేడాది అంటే 2024 ఏప్రిల్ 8న రూ. 1,576 వద్ద నమోదైన గరిష్టం నుంచి తాజాగా 52 వారాల కనిష్టం రూ. 649ను తాకింది. వెరసి 59 శాతం పతనమైంది. ఫండ్స్ లబోదిబో ఇది ఇండెక్స్ షేరు కావడంతో 2025 ఫిబ్రవరికల్లా 35 మ్యూచువల్ ఫండ్స్ 360 పథకాల ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశాయి. 20.88 కోట్ల షేర్లను కలిగి ఉన్నాయి. ఈ హోల్డింగ్స్ విలువ రూ. 20,670 కోట్లు కాగా.. షేరు తాజా పతనంలో రూ. 6,970 కోట్లు ఆవిరైంది. దీంతో హోల్డింగ్స్ విలువ రూ. 13,700 కోట్లకు పరిమితమైంది. ఇక ప్యాసివ్ ఫండ్స్ సైతం బ్యాంక్ షేర్ల పతనంతో ప్రభావితమైనట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. -
క్యాస్ట్రాల్ ఇండియాపై అరామ్కో కన్ను
న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న లూబ్రికెంట్స్ తయారీ దిగ్గజం క్యాస్ట్రాల్ ఇండియా కౌంటర్కు మరోసారి డిమాండ్ పెరిగింది. దీంతో బీఎస్ఈలో షేరు 11 శాతం జంప్చేసి రూ. 246 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలోనూ 10 శాతం ఎగసి రూ. 245 వద్ద నిలిచింది. ఒక దశలో 13.4 శాతం దూసుకెళ్లి రూ. 252 వద్ద గరిష్టానికి చేరింది.ఎన్ఎస్ఈలో 7.39 కోట్ల షేర్లు, బీఎస్ఈలో 23.62 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. బీపీ(గతంలో బ్రిటిష్ పెట్రోలియం)కు చెందిన లూబ్రికెంట్ బిజినెస్ను సౌదీ చమురు దిగ్గజం అరామ్కో కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తలు షేరుపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో వరుసగా నాలుగో రోజు క్యాస్ట్రాల్ ఇండియా బలపడింది. 10 బిలియన్ డాలర్లు.. క్యాస్ట్రాల్ బ్రాండుతో బీపీ.. లూబ్రికెంట్స్ విక్రయించే సంగతి తెలిసిందే. బీపీ ఇటీవల పునర్వ్యవస్థీకరణలో భాగంగా లూబ్రికెంట్స్ విభాగం విలువను దాదాపు 10 బిలియన్ డాలర్లుగా మదింపు చేసినట్లు తెలుస్తోంది! కాగా.. వాల్వోలైన్ లూబ్రికెంట్స్ యూనిట్తో క్యాస్ట్రాల్ ఆస్తులను జత చేసే యోచనలో అరామ్కో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.2023లో 2.65 బిలియన్ డాలర్లకు వాల్వోలైన్ను అరామ్కో కొనుగోలు చేసింది. భారత్, చైనా, ఆగ్నేయ ఆసియాలో అదనపు రిఫైనింగ్, కెమికల్స్ బిజినెస్ల కొనుగోలుకి చూస్తున్నట్లు అరామ్కో గతేడాది పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాస్ట్రాల్ ఇండియా కొనుగోలుపై అంచనాలు పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. -
'కాంచన 3' నటి సీమంతం ఫంక్షన్ (ఫోటోలు)
-
నందమూరి తారకరత్న వర్ధంతి.. పిల్లలతో కలిసి అలేఖ్యా రెడ్డి నివాళి (ఫొటోలు)
-
భర్త ఒడిలో క్యూట్ కిడ్స్.. ఐ లవ్ యూ సో మచ్ అంటున్న పీవీ సింధు (ఫొటోలు)
-
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన కన్నడ నటి మేఘనా.. సోషల్ మీడీయాలో వైరల్ (ఫోటోలు)
-
ప్రియురాలి మెడలో మూడు ముళ్లు.. ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి వేడుక (ఫోటోలు)
-
మెహందీ వేడుక ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ కీర్తి సురేశ్ (ఫోటోలు)
-
ఇన్ఫీ మూర్తి కుటుంబ సంపదలో రూ.1900 కోట్లు ఆవిరి!
ప్రముఖ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి (NR Narayana Murthy) కుటుంబం సంపద ఒక్క రోజులో రూ.1900 కోట్లు ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో శుక్రవారం (జనవరి 17) నాడు ఇన్ఫోసిస్ షేర్లు దాదాపు 6 శాతం నష్టపోయి రూ. 1,812.70 వద్ద ముగిశాయి. ఈ భారీ తగ్గుదలతో మూర్తి కుటుంబం నెట్వర్త్లో దాదాపు రూ. 1,900 కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. అమ్మకాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.54 లక్షల కోట్లకు పడిపోయింది.4.02 శాతం వాటాసెప్టెంబర్ త్రైమాసికం నాటికి కంపెనీలో సమిష్టిగా 4.02 శాతం వాటాను నారాయణ మూర్తి కుటుంబం కలిగి ఉంది. ఇందులో మూర్తి 0.40 శాతం వాటాను కలిగి ఉండగా, ఆయన సతీమణి సుధా మూర్తికి 0.92 శాతం, వారి కుమారుడు రోహన్ మూర్తికి 1.62 శాతం వాటా ఉంది. ఇక వారి కుమార్తె, యూకే (UK) మాజీ ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి 1.04 శాతం, నారాయణ మూర్తి మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తి 0.04 శాతం వాటాను కలిగి ఉన్నారు. శుక్రవారం నాటి క్షీణత తర్వాత కంపెనీలో మూర్తి కుటుంబం హోల్డింగ్ల విలువ రూ. 30,334 కోట్లుగా ఉంది. ఇది గురువారం నాటి రూ. 32,236 కోట్లతో పోలిస్తే గణనీయమైన నష్టాన్ని ప్రతిబింబిస్తోంది.లాభాలు బాగున్నా..ఇన్ఫోసిస్ బలమైన త్రైమాసిక ఆదాయాలను ప్రకటించిన తర్వాత మార్కెట్ కల్లోలం ఏర్పడింది. దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతిదారు అయిన ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి (YoY) 11 శాతం వృద్ధిని నమోదు చేసి మొత్తం రూ.6,806 కోట్లకు చేరింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 8 శాతం పెరిగి రూ.41,764 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కంపెనీ తన ఆదాయ వృద్ధి అంచనాను 4.5-5 శాతానికి సవరించింది. ఇది దాని వ్యాపార పథంలో విశ్వాసాన్ని సూచిస్తోంది.ఇదీ చదవండి: విప్రో జూమ్.. టెక్ మహీంద్రా హైజంప్!బలమైన ఫండమెంటల్స్ ఉన్నప్పటికీ, స్టాక్ క్షీణత విస్తృత పరిశ్రమ సవాళ్లు, మార్కెట్ సెంటిమెంట్పై పెట్టుబడిదారుల ఆందోళనలను తెలియజేస్తోంది. 1,812.70గా ఉన్న స్టాక్ విలువ ఐటీ రంగంలో రానున్న ఎదురుగాలి గురించిన భయాందోళనలను ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇన్ఫోసిస్లో మూర్తి కుటుంబానికి ఉన్న ముఖ్యమైన వాటా కంపెనీ వారసత్వంలో వారి కీలక పాత్రను తెలియజేస్తోంది. ఐటీ రంగంలోని కీలక పరిణామాలు, ఇన్ఫోసిస్ దీర్ఘకాలిక వృద్ధి పథాన్ని అంచనా వేయడానికి డీల్ పైప్లైన్ను నిశితంగా పర్యవేక్షించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. -
గారెలు, పులిహోరతో కడుపు నిండిపోయిందన్న హీరోయిన్ (ఫోటోలు)
-
Keerthy Suresh: భర్తతో జాలీగా వెకేషన్.. కానీ! (ఫోటోలు)
-
మేము.. మా రెండు హృదయాలు.. పీవీ సింధు పోస్ట్ వైరల్ (ఫోటోలు)
-
మస్క్ మంచి మనసు.. భారీ విరాళం
ప్రపంచ కుబేరుడు, టెస్లా చీప్ ఎగ్జిక్యూటివ్ 'ఇలాన్ మస్క్' (Elon Musk) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. కొత్త ఏడాది ప్రారంభం కావడానికి ముందే భారీ విరాళం అందించినట్లు సమాచారం.టెస్లా బాస్ ఇటీవల వివిధ ఛారిటీలకు 2,68,000 టెస్లా షేర్ల (Tesla Shares)ను విరాళంగా ఇచ్చారు. వీటి విలువ 108 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 926 కోట్ల కంటే ఎక్కువ). టెస్లాలో దాదాపు 12.8 శాతం వాటా కలిగిన మస్క్.. తన షేర్లను దానం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022 నుంచి భారీ మొత్తంలో విరాళాలను అందిస్తూనే ఉన్నారు.వందల కోట్లు విరాళంగా ఇచ్చిన 'మస్క్' మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే మస్క్ ఏ ఛారిటీలకు విరాళం ఇచ్చారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 2021లో కూడా ఈయన మస్క్ ఫౌండేషన్ (Musk Foundation)కు సుమారు 5.74 బిలియన్ డాలర్ల విరాళం అందించారు.పలు ఛారిటీలకు లెక్కకు మించిన డబ్బు విరాళంగా ఇవ్వడమే కాకుండా.. మానవాళికి ప్రయోజనం చేకూరేలా, దానికి తగిన కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేయడానికి కూడా భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.మస్క్ సంపదబ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల తరువాత ఈయన సంపద గణనీయంగా పెరిగింది. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ స్పేస్ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం.2022 వరకు మస్క్ నికర విలువ 200 డాలర్ల కంటే తక్కువ ఉండేది. అయితే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తరువాత.. ఈయన సంపాదన భారీగా పెరిగింది. తాజాగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. మొత్తం మీద 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33.20 లక్షల కోట్లు) నికర విలువను అధిగమించిన మొదటి వ్యక్తిగా ఇలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. -
Sonakshi Sinha: పులిని నిద్రపుచ్చుతూ.. సింహం పక్కనే సేదతీరుతూ.. (ఫోటోలు)
-
ఎన్పీసీఐ ప్రకటన.. పేటీఎం షేర్లు ఢమాల్!
యూపీఐ ప్రొవైడర్లకు సంబంధించిన 30 శాతం మార్కెట్ షేర్ పరిమితిని పాటించేందుకు గడువును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో రెండేళ్లు పొడిగించింది. ఈ ప్రకటన తర్వాత బుధవారం (జనవరి 1) ట్రేడింగ్ సెషన్లో పేటీఎం (Paytm) షేర్లు బీఎస్ఈ (BSE)లో దాదాపు 4 శాతం పడిపోయి రూ. 976.5కి చేరుకున్నాయి.యూపీఐ ప్రొవైడర్ల డిజిటల్ లావాదేవీల పరిమాణం వాటి మార్కెట్ షేర్లో 30 శాతానికి మించకూడదని ఎన్పీసీఐ నిబంధన విధించింది. దీనికి ఇదివరకు 2024 డిసెంబర్ 31 వరకు గడువు ఉండగా దీన్ని 2026 డిసెంబర్ 31 వరకు మరో రెండేళ్లు పొడిగించింది. "వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (TPAPs) సమ్మతి గడువును మరో రెండేళ్లు పొడిగిస్తున్నాము" అని ఎన్పీసీఐ తన ప్రకటనలో తెలిపింది.పేటీఎం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.62,626 కోట్లుగా ఉంది. కంపెనీ స్టాక్ 52 వారాల కనిష్ట విలువ రూ.310 కాగా, 52 వారాల గరిష్టం రూ.1,063. జనవరి 1న బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్లో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఇది ఒకటి.కాగా ఎన్పీసీఐ నిర్ణయం వల్ల వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫోన్పే (PhonePe), గూగుల్ పే (Google Pay)కి స్వల్పకాలిక ఉపశమనం లభించనుంది. రెండూ కలిసి యూపీఐ (UPI) చెల్లింపుల మార్కెట్లో 85 శాతానికి పైగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కొత్త పరిమితిని పాటించడానికి వాటికి అదనపు సమయం లభించింది.రెగ్యులేటరీ డేటా ప్రకారం.. 2024 నవంబర్లో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్పే 47.8% వాటాను కలిగి ఉండగా గూగుల్ పే 37 శాతం వాటాను కలిగి ఉంది. రెండు కంపెనీలు కలిసి ఆ నెలలో 13.1 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేశాయి. -
అద్భుత క్యాప్షన్తో సంగీత్ ఫొటోలు షేర్ చేసిన పీవీ సింధు (ఫోటోలు)
-
శోభిత పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫొటోలు)
-
500 షేర్లకు T+0 సెటిల్మెంట్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా టీప్లస్జీరో (T+0) సెటిల్మెంట్ను మరింత విస్తరించింది. లావాదేవీ చేపట్టిన రోజే సెటిల్మెంట్కు వీలు కల్పించే విధానంలోకి 500 కంపెనీల షేర్లను చేర్చింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా 500 కంపెనీల స్టాక్స్కు ఆప్షనల్గా టీప్లస్జీరో సెటిల్మెంట్ను వర్తింపచేయనుంది.నిబంధనలకు లోబడి టీప్లస్జీరో, టీప్లస్వన్ సెటిల్మెంట్ సైకిళ్లకు విభిన్న బ్రోకరేజీ చార్జీలకు సైతం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సెబీ తొలుత 2024 మార్చిలో 25 కంపెనీల స్టాక్స్ ద్వారా టీప్లస్జీరో సెటిల్మెంట్కు తెరతీసింది. నాన్కస్టోడియన్ క్లయింట్లకు మాత్రమే ఇది వర్తింపచేసింది. తదుపరి అభిప్రాయ సేకరణ చేపట్టి సెటిల్మెంట్ను విస్తరించింది. 2024 డిసెంబర్31కల్లా టాప్–500 కంపెనీల షేర్లు టీప్లస్జీరో సెటిల్మెంట్ పరిధిలోకి చేర్చుతూ సర్క్యులర్ను జారీ చేసింది.2025 జనవరి నుంచి అట్టడుగున ఉన్న 100 కంపెనీలు సెటిల్మెంట్లోకి రానున్నాయి. ఆపై ప్రతీ నెలా ఇదే రీతిలో 100 కంపెనీలు చొప్పున జత కానున్నాయి. వెరసి ప్రస్తుత 25 కంపెనీలతో కలిపి 525 షేర్లు టీప్లస్జీరో సెటిల్మెంట్ పరిధిలోకి చేరనున్నాయి. వీటికి ఉదయం 8.45–9 సమయంలో ప్రత్యేక బ్లాక్ డీల్ విండోను ఏర్పాటు చేయనుంది. ఐసీఈఎక్స్కు చెల్లు సెబీ తాజాగా ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఐసీఈఎక్స్) మూసివేతకు అనుమతించింది. రెండేళ్ల క్రితమే స్టాక్ ఎక్స్ఛేంజీ గుర్తింపును రద్దు చేయగా.. ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా ఐసీఈఎక్స్ కార్యకలాపాల నిలిపివేతకు ఓకే చెప్పింది. వెరసి ఎక్స్ఛేంజీ విభాగం నుంచి ఐసీఈఎక్స్ వైదొలగనుంది. అయితే ఆదాయపన్ను నిబంధనలను అమలు చేయవలసి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. పేరు మార్పుసహా గతకాలపు లావాదేవీలను డేటాబేస్ నుంచి తొలగించవలసిందిగా ఐసీఈఎక్స్ను సెబీ ఆదేశించింది. -
వొడాఫోన్ ఐడియా షేర్ల జారీ
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన 175.53 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. షేరుకి రూ. 11.28 ధరలో వొడాఫోన్ గ్రూప్ సంస్థలకు వీటిని కేటాయించనుంది. తద్వారా రూ. 1,980 కోట్లు సమకూర్చుకోనుంది. ఒమెగా టెలికం హోల్డింగ్స్కు రూ. 1,280 కోట్లు, ఉషా మార్టిన్ టెలిమాటిక్స్కు రూ. 700 కోట్లు విలువైన షేర్లను జారీ చేయనుంది.2025 జనవరి 7న నిర్వహించనున్న అసాధారణ సమావేశం(ఈజీఎం)లో ఈ అంశాలను బోర్డు చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ప్రస్తుతం కంపెనీలో వొడాఫోన్ గ్రూప్ వాటా 22.56 శాతంకాగా.. ఆదిత్య బిర్లా గ్రూప్ 14.76 శాతం, కేంద్ర ప్రభుత్వం 23.15 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. ఈ ఏడాది(2024–25) రెండో త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ. 8,747 కోట్ల నుంచి తగ్గి రూ. 7,176 కోట్లకు పరిమితమైంది. ఇందుకు ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) మెరుగుపడటం సహకరించింది.మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 2 శాతం మెరుగుపడి రూ. 10,918 కోట్లను తాకింది. కాగా.. ఇటీవల టెలికం దిగ్గజాలు నోకియా, ఎరిక్సన్, శామ్సంగ్తో నెట్వర్క్ పరికరాల సరఫరా కోసం సుమారు రూ. 30,000 కోట్ల(3.6 బిలియన్ డాలర్లు) విలువైన డీల్ను వొడాఫోన్ ఐడియా కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేరు రూ. 8.11 వద్ద ముగిసింది. -
కాశీలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న రాశీఖన్నా (ఫొటోలు)
-
‘ఇటాలియన్ మాఫియా’ : ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట (ఫొటోలు)
-
శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్.. పెళ్లికళ ఉట్టిపడుతోందిగా! (ఫోటోలు)
-
మాటల్లో వర్ణించలేను: బుమ్రా భావోద్వేగం.. రోహిత్ శర్మ భార్య రితికా రిప్లై వైరల్(ఫొటోలు)
-
ఏక్..దో..తీన్..అన్స్టాపబుల్ అంటున్న స్టార్ హీరోయిన్ను గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
శ్రీదేవి ముద్దుల కూతురి బర్త్ డే.. ఆమె బాయ్ఫ్రెండ్ ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
కాసులు కురిపించిన షేర్లు.. కుబేరుల్లో రెండో స్థానానికి జెఫ్ బెజోస్
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్కు షేర్లు కాసులు కురిపించాయి. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేర్చాయి. 3 బిలియన్ డాలర్లు (రూ.25 వేల కోట్లు) విలువైన అమెజాన్ షేర్లను బెజోస్ ఇటీవల విక్రయించారు. దీంతో ఈ సంవత్సరానికి ఆయన మొత్తం స్టాక్ అమ్మకాలు 13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. బెజోస్ 1.6 కోట్లకు పైగా షేర్లను విక్రయించారు. ఇటీవల భారీగా పెరిగిన అమెజాన్ స్టాక్ ధరను ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ఒక్కో షేరు ధర 200 డాలర్లను తాకింది. అమెజాన్ స్టాక్ గత సంవత్సరంలో 40 శాతానికి పైగా పెరిగింది. ఇటీవల ప్రకటించిన మూడవ త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించి రాణించడంతో గత వారం రోజుల్లోనే షేర్ల విలువ 7 శాతం పెరిగింది.ఇదీ చదవండి: చనిపోయినా.. చచ్చేంత సంపాదనఅమెజాన్ స్టాక్ల విలువ పెరగడంతో బెజోస్ సంపద కూడా పెరిగింది. ఇది గత సంవత్సరంలో 42.8 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ నవంబర్ 3 నాటికి, బెజోస్ 220 బిలియన్ డాలర్ల నెట్వర్త్తో బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో రెండవ స్థానంలో ఉన్నారు. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ 262 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా, మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ 201 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. -
Ratan Tata: పెంపుడు కుక్క టిటో, పనిమనిషికి కూడా..
ముంబై: పారిశ్రామికవేత్త రతన్ టాటా తన దాతృత్వాన్ని చనిపోయాక కూడా చాటుకున్నారు. తన రూ.10 వేల కోట్ల ఆస్తుల్లో తోబుట్టువులకే కాదు, పెంపుడు శునకం టిటో, పనిమనిషి సుబ్బయ్య, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు కూడా వాటాలు పంచుతూ వీలునామా రాశారు. టాటా గ్రూప్ చైర్మన్ మాతృసంస్థ టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఈ నెల 9వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. తనకెంతో ప్రీతిపాత్రమైన జర్మన్ షెపర్డ్ శునకం టిటో సంరక్షణ బాధ్యతలను జీవితకాలం పాటు వంట మనిషి రజన్ షా చూసుకోవాలని కోరారు. ఆస్తుల్లో సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరీమణులు షిరీన్, డియానా జీజాభాయ్లకు కొంత కేటాయించారు. టాటా సన్స్లో వాటాను రతన్ టాటా ధార్మిక ఫౌండేషన్కు బదిలీ చేయాలని కోరారు. విల్లుపై బాంబే హైకోర్టు విచారణ జరపనుందని అధికారులు తెలిపారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు చెందిన గుడ్ఫెలోస్లో పెట్టిన పెట్టుబడిని వదిలేయాలని, విదేశాల్లో చదువుకునేందుకు నాయుడుకిచ్చిన రుణం మాఫీ చేయాలని వీలునామాలో తెలిపారు. -
సమంత హల్దీ ఫంక్షన్.. ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ! (ఫొటోలు)
-
దసరా, దీపావళి సంబరాల్లో సమీరా రెడ్డి.. ఫ్యామిలీ ఫోటోలు చూశారా..?
-
స్పైస్జెట్ ఫ్లోర్ ధర రూ. 64.79
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్జెట్ అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి నిధుల సమీకరణకు తెరతీసింది. ఇందుకు తాజాగా షేర్ల జారీ(ఫ్లోర్) ధరను ప్రకటించింది. ఒక్కో షేరుకి రూ. 64.79 చొప్పున సెక్యూరిటీలను విక్రయించనుంది. తద్వారా రూ. 3,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. క్విబ్ ద్వారా రూ. 3,000 కోట్లవరకూ సమీకరించేందుకు గత వారం వాటాదారుల నుంచి స్పైస్జెట్ అనుమతి పొందిన సంగతి తెలిసిందే. కాగా.. వాటాదారుల అనుమతిమేరకు ఫ్లోర్ ధరపై 5 శాతానికి మించకుండా డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తాజాగా వెల్లడించింది. కంపెనీ ఆర్థిక సవాళ్లు, న్యాయ వివాదాలు, విమాన సరీ్వసులు నిలిచిపోవడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిధుల సమీకరణకు ప్రాధాన్యత ఏర్పడింది. బీఎస్ఈలో స్పైస్జెట్ షేరు 5.25 శాతం పతనమై రూ. 73.72 వద్ద ముగిసింది. -
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జీఎంఆర్ వాటా పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో (డీఐఏఎల్) మరో 10 శాతం వాటాను జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జీఐఎల్) దక్కించుకుంది. డీఐఏఎల్లో తనకున్న 10 శాతం వాటాను ఫ్రాపోర్ట్ ఏజీ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ సరీ్వసెస్ వరల్డ్వైడ్ విక్రయించింది. డీల్ విలువ 126 మిలియన్ డాలర్లు. డీల్ తదనంతరం డీఐఏఎల్లో జీఐఎల్ వాటా 74 శాతానికి చేరింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 26 శాతం వాటా ఉంది. వాటా కొనుగోలు ప్రక్రియ 180 రోజుల్లో పూర్తి అవుతుందని జీఎంఆర్ గ్రూప్ సోమవారం తెలిపింది. -
జియో యూజర్లకు శుభవార్త!.. అంబానీ అదిరిపోయే గిఫ్ట్
'రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్' (AGM) ప్రారంభమైంది. ఇందులో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఈక్విటీ షేర్హోల్డర్కు 1:1 బోనస్ ఇష్యూను పరిశీలించడానికి 2024 సెప్టెంబర్ 5న తన డైరెక్టర్ల బోర్డుతో సమావేశం కానుందని వెల్లడించారు. ఇందులో జియో ఏఐ క్లౌడ్ ఆఫర్ గురించి కూడా ప్రస్తావించారు.100 జీబీ ఫ్రీ47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఏఐ క్లౌడ్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్ ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని షేర్హోల్డర్లను ఉద్దేశించి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. ఈ రోజు జియో వినియోగదారులు 100 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజిని పొందుతారని ఆయన ప్రకటించారు.ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, అన్ని ఇతర డిజిటల్ కంటెంట్, డేటాను సురక్షితంగా నిల్వ చేయడానికి & యాక్సెస్ చేయడానికి జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము. వచ్చే దీపావళి నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.#WATCH | Addressing the shareholders during the 47th Annual General Meeting, Reliance Industries Chairman Mukesh Ambani says, "I am thrilled to announce the Jio AI-Cloud Welcome offer. Today, I am announcing that Jio users will get up to 100 GB of free cloud storage, to securely… pic.twitter.com/80RnNxePI7— ANI (@ANI) August 29, 20241:1 బోనస్ ఇష్యూసెప్టెంబర్ 5న జరగబోయే సమావేశంలో 1:1 బోనస్ ఇష్యూ ప్రతిపాదన ఆమోదించబడితే.. పెట్టుబడిదారుడు ప్రతి షేరుకు అదనపు వాటాను పొందే అవకాశం ఉంటుంది.డైరెక్టర్ల బోర్డు 1:1 బోనస్ ఇష్యూను ప్రతిపాదిస్తే.. కంపెనీ నిల్వలను క్యాపిటలైజ్ చేయడం ద్వారా నిధులు సమకూరుస్తాయి. 1:1 బోనస్ ఇష్యూ అనేది ఇప్పటికే ఉన్న షేర్హోల్డర్లు కలిగి ఉన్న షేర్ల సంఖ్యను పెంచడం ద్వారా రివార్డ్ చేయడానికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది. ఇది ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వారి షేర్లను సమర్థవంతంగా రెట్టింపు చేస్తుంది. బోనస్ ఇష్యూలు కంపెనీ తన భవిష్యత్తు అవకాశాలపై మరియు బలమైన ఆర్థిక స్థితిపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. -
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన కిరణ్ అబ్బవరం.. ఆశీర్వాదం కావాలంటూ! (ఫొటోలు)
-
Deepthi Sunaina: కన్నీళ్లు పెట్టుకున్న బిగ్బాస్ బ్యూటీ.. అయినా.. (ఫోటోలు)
-
ఫారిన్ ట్రిప్ ఫొటోలు షేర్ చేసిన సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టి
-
హీరోయిన్ రష్మిక చెల్లిని చూశారా? ఎంత చిన్న పిల్లనో! (ఫొటోలు)
-
'తాత చేసిన పనికి కోటీశ్వరురాలైన మనవరాలు'
కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. చాలామంది జీవితాలను తలకిందులు చేసిన కరోనా లాక్డౌన్ ఓ మహిళను మాత్రం కోటీశ్వరురాలిని చేసింది. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది, ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.బెంగళూరులో నివాసముంటున్న ప్రియా శర్మ 2020 కరోనా సమయంలో ముంబై వెళ్లిపోయింది. ఆ సమయంలో చాలా రోజులు ఇంట్లోనే కాలం గడపాల్సి వచ్చింది. ముంబైలో వ్యాపారవేత్తగా ఉన్న ఆమె తాత ఇష్టాలను, ఇతర విషయాలను తెలుసుకోవడం ప్రారంభించింది. సరిగ్గా అలాంటి సమయంలోనే.. ఆమె తాత 2014లో లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీలో 500 షేర్లు కొనుగోలు చేసినట్లు, ఆ పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు ఆమె కంటపడ్డాయి.ఇదీ చదవండి: ఒకేసారి 10 రోజుల సెలవు.. ఆనందంలో 50వేల ఉద్యోగులుప్రియా శర్మకు దొరికిన ఆ పత్రాలే ఆమెను కోటీశ్వరురాలిని చేశాయి. 16 సంవత్సరాల వ్యవధిలో ఈ షేర్లు 4,500కి పెరిగాయి. వాటి విలువ ఏకంగా రూ. 1.72 కోట్లకు పెరిగింది. అయితే ఈ డబ్బును పొందటం చాలా కష్టంతో కూడుకున్న పని అయిపోయింది. చాలారోజులు పట్టించుకోకుండా వదిలేసినా ఈ స్టాక్స్ కోసం ప్రియా.. లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీని లేఖ రాసింది. ఆ తరువాత చాలా నిబంధనలను దాటుకుంటూ ముందుకు వెల్లాల్సి వచ్చింది. మొత్తం మీద తాత చేసిన పని మనవరాలిని కోటీశ్వరురాలిని చేసింది. -
15 వేల మంది తొలగింపు ప్రకటన.. షేర్లు భారీ పతనం
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పోరేషన్ భారీగా నష్టపోయింది. భారీ వృద్ధి అంచనాతో 15,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికను ప్రకటించిన మరుసటి రోజే ఆ కంపెనీ షేర్లు 40 సంవత్సరాలలో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి.శుక్రవారం న్యూయార్క్లో ట్రేడింగ్ ప్రారంభించిన తర్వాత షేర్లు 26% పైగా పడిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 32 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. బ్లూమ్బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం, కనీసం 1982 నుంచి కంపెనీ స్టాక్ అతిపెద్ద ఇంట్రాడే పతనాన్ని ఇది సూచిస్తోంది.ప్రస్తుత త్రైమాసికంలో అమ్మకాలు 12.5 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లుగా ఉంటాయని కంపెనీ గురువారం తెలిపింది. బ్లూమ్బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం విశ్లేషకులు సగటున 14.38 బిలియన్ డాలర్లు అంచనా వేశారు. కానీ ఇంటెల్ ఒక్కో షేరు 3 సెంట్ల చొప్పున నష్టపోయాయి. ఇంటెల్ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,10,000 మంది ఉద్యోగులు ఉండగా 15% మందికిపైగా తగ్గించాలని యోచిస్తున్నట్లు ఇంటెల్ తాజాగా తెలిపింది. -
‘నువ్వెక్కడున్నా నా మనసంతా నీ చుట్టే’.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం! (ఫొటోలు)
-
సోనాక్షి బ్యాచిలరేట్ పార్టీ.. ఆ డ్రెస్సును గుర్తు పట్టారా? (ఫొటోలు)
-
కొడుకు ఫేస్ రివీల్ చేసిన సింగర్ గీతామాధురి.. ఎంత ముద్దొచ్చేస్తున్నాడో! (ఫొటోలు)
-
క్రౌడ్స్ట్రైక్ అతలాకుతలం
వాషింగ్టన్: ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసిన విండోస్ ఆపరేటింగ్ సిస్టం సాంకేతిక సమస్య ఆర్థికంగా కూడా అంతర్జాతీయంగా గట్టి ప్రభావమే చూపింది. పలు దిగ్గజ సంస్థల షేర్ల విలువ తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా తప్పుడు అప్డేట్తో సమస్యకు కారణమైన సైబర్ సెక్యూరిటీ దిగ్గజం క్రౌడ్స్ట్రైక్కు ఆర్థికంగా గట్టి దెబ్బే తగిలింది. శుక్రవారం ఆ సంస్థ షేర్ వాల్యూ ఒక్కసారిగా 11 శాతానికి పైగా పడిపోయింది. 42.22 డాలర్లున్న ఒక్కో వాటా విలువ 30 డాలర్లకు తగ్గింది. సంస్థ మొత్తం విలువ 83 బిలియన్ డాలర్ల పై చిలుకని అంచనా. ఆ లెక్కన 900 కోట్ల డాలర్లకు పైగా హరించుకుపోయినట్టే. అయితే ఆర్థిక నష్టం కంటే కూడా ప్రపంచంలోనే అగ్రశ్రేణి సైబర్ సెక్యూరిటీ సంస్థగా క్రౌడ్స్ట్రైక్కు ఉన్న ఇమేజీకి జరిగిన నష్టమే చాలా ఎక్కువ. ఎందుకంటే దాని కస్టమర్లుగా ఉన్న కంపెనీలు, పెద్ద సంస్థల్లో చాలావరకు తమ సైబర్ సెక్యూరిటీ బాధ్యతల కోసం ఇతర సైబర్ సెక్యూరిటీ సంస్థలవైపు చూస్తున్నట్టు సమాచారం. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ ఇప్పటికే ఈ జాబితాలో చేరారు. ‘‘మా వ్యవస్థల నుంచి క్రౌడ్స్ట్రౌక్ను తొలగించేశాం’’ అంటూ ఆయన సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేశారు. సెంటినల్ వన్, పాలో ఆల్టో నెట్వర్క్ వంటి క్రౌడ్ర్స్టౌక్ ప్రత్యర్థి కంపెనీలు ఈ పరిస్థితిని రెండు చేతులా సొమ్ము చేసుకుంటున్నాయి. భారీ పరిహారాలు! మరోవైపు క్రౌడ్స్ట్రైక్ కస్టమర్లంతా తమకు జరిగిన నష్టానికి ఆ సంస్థ నుంచి భారీగా నష్టపరిహారం డిమాండ్ చేసేలా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు ఆ సంస్థ క్లయింట్ల జాబితాలో ఉండటం తెలిసిందే. షట్డౌన్ దెబ్బకు వాటి షేర్ల విలువ సగటున ఒక శాతం దాకా పడిపోయినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. -
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. భారీగా నష్టపోయిన టెక్ దిగ్గజం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దిగ్గజ కంపెనీలకు అంతరాయం కలిగించిన మైక్రోసాఫ్ట్ సమస్య స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసింది. దీంతో మైక్రోసాఫ్ట్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఒక్క సారిగా కంపెనీ 23 బిలియన్ డాలర్లు నష్టపోయింది.టెక్ దిగ్గజం షేర్ విలువ ఒకేసారి 0.71 శాతం తగ్గింది. దీంతో కంపెనీ దాదాపు 23 బిలియన్ డాలర్లు నష్టపోయింది. మైక్రోసాఫ్ట్ స్టాక్ ధర నిన్నటి ముగింపు సమయంలో 443.52 డాలర్ల వద్ద ఉండేది. అయితే ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ సమయంలో ఇది 440.37 డాలర్లకు పడిపోయినట్లు ఇన్వెస్ట్మెంట్ డేటా ప్లాట్ఫారమ్ స్టాక్లిటిక్స్ వెల్లడించింది.స్టాక్లిటిక్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రముఖ టెక్ దిగ్గజాల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్లో ఏర్పడ్డ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలపైన గణనీయమైన ప్రభావం చూపాయి. భారతీయ విమాన, ఐటీ సేవలకు మాత్రమే కాకుండా బ్యాంకులు, టెలికాం, మీడియా సంస్థలు కూడా ఈ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి, విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సమస్య ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఎవివిధ రంగాలపై ప్రభావం చూపింది. -
వైట్ డ్రస్లో మెరిసిపోతూ.. స్టన్నింగ్ లుక్స్ షేర్ చేసిన కాజల్ అగర్వాల్ (ఫోటోలు)
-
రాజ కుమారుడిలా రాహుల్.. అందంగా అతియా (ఫోటోలు)
-
రేమండ్ నుంచి రియల్టీ విడదీత
న్యూఢిల్లీ: రియల్టీ బిజినెస్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనున్నట్లు టెక్స్టైల్స్ దిగ్గజం రేమండ్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. రేమండ్ రియల్టీ పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో వాటాదారులకు మరింత విలువ చేకూరనున్నట్లు తెలియజేసింది. తద్వారా భారీ వృద్ధికి వీలున్న దేశీ ప్రాపర్టీ మార్కెట్లో మరింత పురోగతిని సాధించవచ్చని తెలియజేసింది. విడదీత పథకంలో భాగంగా వాటాదారులకు 1:1 ప్రాతిపదికన షేర్లను జారీ చేయనుంది. అంటే రేమండ్ లిమిటెడ్ వాటాదారులకు ప్రతీ షేరుకి 1 రేమండ్ రియల్టీ షేరుని కేటాయించనుంది. వాటాదారులు, రుణదాతలు, ఎన్సీఎల్టీ తదితర నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి రేమండ్ రియల్టీ లిమిటెడ్కు తెరతీయనున్నట్లు రేమండ్ వివరించింది. 24 శాతం వాటారేమండ్ లిమిటెడ్ మొత్తం ఆదాయంలో రియల్టీ బిజినెస్ 24 శాతం వాటాను ఆక్రమిస్తోంది. 2023–24లో విడిగా 43 శాతం వృద్ధితో రూ. 1,593 కోట్ల టర్నోవర్ సాధించింది. విడదీతలో భాగంగా రేమండ్ లిమిటెడ్ వాటాదారులకు రేమండ్ రియల్టీ 6,65,73,731 ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో రేమండ్ రియల్టీ లిస్ట్కానుంది. అనుబంధ సంస్థలుసహా కంపెనీ నిర్వహిస్తున్న రియల్టీ బిజినెస్ను పునర్వ్యవస్థీకరించే బాటలో తాజా పథకానికి తెరతీసినట్లు రేమండ్ లిమిటెడ్ వెల్లడించింది. విడదీత ద్వారా రియలీ్టలో భారీ వృద్ధి అవకాశాలను అందుకోవడం, కొత్త ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడం, వ్యూహాత్మక భాగస్వాములను చేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేసింది. మొత్తం రియల్టీ బిజినెస్ను ఒకే కంపెనీ నిర్వహణలోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. గతేడాది రియల్టీ విభాగం రూ. 370 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. రియల్టీ తీరిలా రేమండ్ రియల్టీ థానేలో 100 ఎకరాల భూమిని కలిగి ఉంది. 40 ఎకరాలు అభివృద్ధి దశలో ఉంది. ఇక్కడ రూ. 9,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. రూ. 16,000 కోట్లకుపైగా అదనపు ఆదాయానికి వీలుంది. వెరసి థానే ల్యాండ్ బ్యాంక్ ద్వారా రూ. 25,000 కోట్ల ఆదాయానికి అవకాశముంది. ఇటీవల అసెట్లైట్ పద్ధతిలో ముంబై, బాంద్రాలో భాగస్వామ్య అభివృద్ధి(జేడీఏ) ప్రాజెక్టుకు తెరతీసింది. అంతేకాకుండా మహీమ్, సియోన్, బాంద్రాలలో మరో మూడు జేడీఏలకు సంతకాలు చేసింది. ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా రూ. 7,000 కోట్ల టర్నోవర్కు వీలుంది.విడదీత వార్తల నేపథ్యంలో రేమండ్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 2,942 వద్ద ముగిసింది. -
క్యూ1లో వేదాంతా దూకుడు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం వేదాంతా గ్రూప్ షేర్లు స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఇటీవల దూకుడు చూపుతున్నాయి. దీంతో ఈ ఏడాది మార్చి 28– జూన్ 20 మధ్య గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 2.2 లక్షల కోట్లు ఎగసింది. వెరసి మార్కెట్ విలువ వృద్ధి వేగంలో డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ, ఆటో దిగ్గజం ఎంఅండ్ఎం, కార్పొరేట్ దిగ్గజాలు టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)లను సైతం అధిగమించింది. ఈ కాలంలో మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ గ్రూప్ మార్కెట్ విలువకు రూ. 1.4 లక్షల కోట్లు చొప్పున జమయ్యింది. వేదాంతా గ్రూప్లోని హిందుస్తాన్ జింక్ షేరు ధర 52 వారాల కనిష్టం నుంచి రెట్టింపైంది. ఇందుకు విడదీత ప్రతిపాదన, రుణభార తగ్గింపుపై యాజమాన్య దృష్టి, మెరుగైన పనితీరు వంటి పలు సానుకూలతలు తోడ్పాటునిచ్చాయి. ఇక ఈ కాలంలో టాటా గ్రూప్ మార్కెట్ విలువ రూ. 60,600 కోట్లమేర బలపడగా.. ఆర్ఐఎల్ విలువ రూ. 20,656 కోట్లమేర క్షీణించింది. రికార్డ్ రెవెన్యూ గతేడాది(2023–24) వేదాంతా గ్రూప్ రూ. 1,41,793 కోట్ల ఆదాయం సాధించింది. గ్రూప్ చరిత్రలోనే ఇది రెండో అత్యధికంకాగా.. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 36,455 కోట్లను తాకింది. 30 శాతం ఇబిటా మార్జిన్లను అందుకుంది. సమీప కాలంలో 10 బిలియన్ డాలర్ల ఇబిటాను సాధించేందుకు వేదాంతా గ్రూప్ ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందుకు వీలుగా జింక్, అల్యూమినియం, చమురు–గ్యాస్, విద్యుత్ తదితర బిజినెస్ల 50 ప్రభావవంత ప్రాజెక్టులను సమయానుగుణంగా పూర్తి చేయనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సైతం గ్రూప్పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్ల వాటా 1.03 శాతం పెరిగి 8.77 శాతానికి చేరింది. దీంతో గత నెల 22న వేదాంతా షేరు రూ. 507 వద్ద, హింద్ జింక్ షేరు రూ. 807 వద్ద చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. బీఎస్ఈలో గురువారం వేదాంతా షేరు 5 శాతం జంప్చేసి రూ. 470ను అధిగమించగా.. హింద్ జింక్ షేరు 2.3 శాతం బలపడి రూ. 648 వద్ద ముగిసింది. -
Samantha: ఆశ్రమంలో సమంత.. ఎందుకంటే? (ఫోటోలు)
-
కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్బాస్ బ్యూటీ (ఫోటోలు)
-
టీ20 వరల్డ్కప్-2024: భర్త క్రికెట్తో.. భార్య యాంకరింగ్తో బిజీ.. క్యూట్ కపుల్(ఫొటోలు)
-
మార్కెట్కు ఎన్నికల కలవరం
ముంబై: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన మూడు దశల పోలింగ్లో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. ఎన్నికలకు ముందు ఊహించినట్లు ప్రస్తుత అధికార పార్టీ గెలుపు అంత సులువు కాదనే అనుమానాలతో అమ్మకాలకు పాల్పడ్డారు. ఆటో మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 1,062 పాయింట్లు నష్టపోయి 72,404 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 345 పాయింట్లు పతనమైన ఏప్రిల్ 19 తర్వాత తొలిసారి 22,000 దిగువున 21,957 వద్ద నిలిచింది. సెన్సెక్స్ ఒకటిన్నర శాతం పతనంతో బీఎస్ఈలో రూ.7.34 లక్షల కోట్లు ఆవిరియ్యాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.393 లక్షల కోట్లకు దిగివచి్చంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ పాలసీ నిర్ణయాలు, అమెరికా ఉద్యోగ గణాంకాల వెల్లడి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.ఆద్యంతం అమ్మకాలే ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమై సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్ది నష్టాల తీవ్రత మరింత పెరిగింది. చిన్న, మధ్య, పెద్ద షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,132 పాయింట్లు క్షీణించి 72,404 వద్ద, నిఫ్టీ 370 పాయింట్లు పతనమై 21,932 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ట్రేడింగ్ ముగిసే వరకు అమ్మకాలు కొనసాగాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 2.41%, రెండు శాతం క్షీణించాయి. → సూచీల వారీగా ఆయిల్అండ్గ్యాస్ 3.50%, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పారిశ్రామికోత్పత్తి ఇండెక్సులు 3%, యుటిలిటీ, కమోడిటీ సూచీలు 2.50%, బ్యాంకులు, ఫైనాన్స్, సరీ్వసెస్ సూచీలు 2% పతనమయ్యాయి. → మార్చి క్వార్టర్లో నికర లాభం 15% వృద్ధి చెందడంతో టీవీఎస్ మోటార్స్ షేరు 3% పెరిగి రూ.2,061 వద్ద నిలిచింది. ట్రేడింగ్ 6% దూసుకెళ్లి రూ.2,121 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. → క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఎస్బీఐ షేరు ఒకశాతం పెరిగి రూ.820 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో మూడున్నర శాతం బలపడి రూ.840 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
ఆర్బీఐ కొట్టిన దెబ్బ.. షేర్లు భారీగా పతనం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొట్టిన దెబ్బతో ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాని వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ఉదయ్ కోటక్ సంపదకు కూడా భారీగా గండి పడింది.కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో ‘తీవ్రమైన లోపాలు’ బయటపడటం ఇందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది.ఆర్బీఐ చర్యల తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం 13 శాతం వరకు పడిపోయాయి. కంపెనీలో దాదాపు 26 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్న ఉదయ్ కోటక్ భారీ నష్టాన్ని చవిచూశారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన సంపద 1.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10 వేల కోట్లు) తగ్గింది. ఏప్రిల్ 24 నాటికి ఉదయ్ కోటక్ నెట్వర్త్ 14.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.1 లక్షల కోట్లు).ప్రత్యర్థి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ 2016 సెప్టెంబర్ తర్వాత మొదటిసారి కోటక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించింది. విశ్లేషకుల అంచనాలను అధిగమించిన తర్వాత యాక్సిస్ షేర్లు పుంజుకున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవోగా ఉదయ్ కోటక్ తప్పుకొన్న తర్వాత అశోక్ వాస్వానీ ప్రస్తుతం సీఈవోగా కొనసాగుతున్నారు. -
ఇప్పుడు 1 షేరుకు 20 షేర్లు ఫ్రీ.. రికార్డ్ తేదీ ప్రకటన!
-
రూ.1000 అప్పుకు రూ.2 కోట్లు తిరిగిచ్చాడు!
చేసిన మేలును మరిచిపోయే ఈ రోజుల్లో కూడా ఎప్పుడో తీసుకున్న 1000 రూపాయలకు ఏకంగా రూ.2 కోట్లు తిరిగి ఇచ్చి అందరి చేతా ఔరా అనిపించుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరు, ఎక్కడ పనిచేస్తున్నారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వైద్యనాథన్ (Vaidyanathan) అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఐడీఎఫ్సీ (IDFC) ఫస్ట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అంటే కొందరికి గుర్తొస్తుంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా కంటే ఈయన చేసిన దాతృత్వం వల్ల చాలా మందికి సుపరిచయం. ఆపదలో ఉన్న వారికి తన షేర్లను గిఫ్ట్ ఇస్తూ ఎంతోమందిని ఆదుకుంటున్నారు. వైద్యనాథన్ ఇప్పటికి రూ. 80 కోట్ల విలువ చేసే షేర్లను ప్రజలకు పంచిపెట్టారు. తాజాగా మరో 5.5 కోట్ల రూపాయల విలువైన షేర్లను మరో ఐదు మందికి గిఫ్ట్గా ఇచ్చేసారు. అంటే 7 లక్షల షేర్స్ (మార్చి 22న ఒక్కో షేర్ ధర రూ.78 వద్ద ముగిసింది) గిఫ్ట్ ఇచ్చారు. ఇందులో రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి వింగ్ కమాండర్ 'సంపత్ కుమార్' ఉన్నారు. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. సంపత్ కుమార్ గతంలో ఎప్పుడో వైద్యనాథన్కు 1000 రూపాయలు అప్పుగా ఇచ్చారట. దాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు వైద్యనాథన్ ఏకంగా వైద్య సహాయం కోసం 2.50 లక్షల షేర్స్ (సుమారు రూ. 2 కోట్లు) గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతోంది. కేవలం వెయ్యి రూపాయలకు.. 2 కోట్ల రూపాయలు గిఫ్ట్ ఇచ్చారంటే అయన దాతృత్వాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారికి మాత్రమే కాకూండా మనోజ్ సహాయ్ అనే వ్యక్తికి 50 వేల షేర్స్, సమీర్ మాత్రే అనే వ్యక్తికి మరో 50 వేల షేర్స్ అందించారు. తన సహోద్యోగి మరణించడం వల్ల అతని కుటుంబాన్ని ఆదుకోవడంలో భాగంగా వారికి 75వేల షేర్స్ ఇచ్చారు. ఎ.కనోజియా అనే వ్యక్తికి కూడా 2.75 లక్షల షేర్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. -
మనవడిపై ప్రేమ.. 4 నెలల బిడ్డకు రూ.240 కోట్ల గిఫ్ట్
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. కేవలం పదివేల రూపాయలతో వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడ్డారు. భారతదేశంలోని మిలియనీర్ల జాబితాలో ఒకరైన నారాయణ మూర్తి తన మనవడికి ఏకంగా కోట్ల రూపాయల షేర్స్ గిఫ్ట్ ఇచ్చారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తన నాలుగు నెలల 'ఏకాగ్రహ్ రోహన్ మూర్తి' (Ekagrah Rohan Murty)కి ఏకంగా రూ. 240 కోట్ల విలువైన షేర్స్ గిఫ్ట్ ఇచ్చారు. దీంతో ఏకాగ్రహ్ ఇప్పుడు ఇన్ఫోసిస్లో 1500000 షేర్స్ లేదా 0.04 శాతం వాటా కలిగి ఉన్నట్లు సమాచారం. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్ 2023 నవంబర్ 10న బెంగళూరులో మగబిడ్డకు జన్మనిచ్చారు. నారాయణ మూర్తి, సుధా మూర్తికి ఇప్పటికే కృష్ణ సునక్, అనౌష్క సునక్ అనే ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. వీరిరువురూ యూకే ప్రధాన మంత్రి రిషి సునక్, అక్షతా మూర్తి కుమార్తెలు. ఏకాగ్ర పేరు మహాభారతంలోని అర్జున్ పాత్ర నుంచి ప్రేరణ పొందింది. సంస్కృత పదమైన 'ఏకాగ్రహ్'కు అచంచలమైన దృష్టి, సంకల్పం అని అర్థం. -
పీఎస్యూ బ్యాంకుల్లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం కొంతమేర వాటాలను విక్రయించనుంది. పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధన(ఎంపీఎస్) అమలులో భాగంగా ఐదు బ్యాంకుల్లో వాటాలను ఆఫర్ చేయనుంది. ఈ జాబితాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ), యుకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్(పీఎస్బీ) ఉన్నట్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషీ పేర్కొన్నారు. 2023 మార్చి 31కల్లా మొత్తం 12 పీఎస్యూ బ్యాంకుల్లో 4 ఎంపీఎస్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరో 3 ప్రభుత్వ రంగ బ్యాంకులు 25 శాతం ఎంపీఎస్ను సాధించినట్లు పేర్కొన్నారు. ఇకపై మిగిలిన 5 బ్యాంకులు సైతం నిబంధనలను అందుకునే కార్యాచరణకు తెరతీయనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత తీరిలా: ప్రస్తుతం పీఎస్బీలో కేంద్ర ప్రభుత్వం 98.25 శాతం వాటాను కలిగి ఉంది. ఈ బాటలో ప్రభుత్వానికి ఐవోబీలో 96.38 శాతం, యుకో బ్యాంక్లో 95.39 శాతం, సెంట్రల్ బ్యాంక్లో 93.08 శాతం, బ్యాంక్ మహారాష్ట్రలో 86.46 శాతం చొప్పున వాటాలున్నాయి. -
డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్ల బ్యాంకు ఖాతాల జప్తు
న్యూఢిల్లీ: కీలక వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘనకు గాను దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ ప్రమోటర్ల బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ హోల్డింగ్స్ను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధించిన జరిమానా, వడ్డీ, రికవరీ వ్యయాలతో కలిపి మొత్తం రూ. 22 లక్షలు రాబట్టేందుకు ఈ మేరకు ఆదేశాలిచి్చంది. వివరాల్లోకి వెడితే..డీహెచ్ఎఫ్ఎల్ ప్రామెరికా లైఫ్ ఇన్సూరెన్స్లో డీహెచ్ఎఫ్ఎల్కి గల వాటాలను అనుబంధ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ ఇన్వెస్ట్మెంట్స్కి గతంలో బదలాయించారు. అప్పట్లో డీహెచ్ఎఫ్ఎల్కి (ప్రస్తుతం పిరమల్ ఫైనాన్స్) సీఎండీగా కపిల్ వాధ్వాన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఆయన సోదరుడు ధీరజ్ వాధ్వాన్ ఉన్నారు. షేర్ల బదలాయింపునకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ నోటీసులో పూర్తి సమాచారం ఇవ్వకపోవడానికి వారిద్దరూ బాధ్యులని సెబీ తన విచారణలో తేలి్చంది. 2023 జూలైలో చెరి రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు ఇచ్చింది. కానీ దాన్ని చెల్లించడంలో వారు విఫలం కావడంతో తాజాగా రెండు వేర్వేరు అటాచ్మెంట్ నోటీసులు ఇచి్చంది. ఆయా ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలకు అనుమతించరాదని అన్ని బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యుచువల్ ఫండ్స్కి సూచించింది. వాధ్వాన్లు తమ బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల్లోని నిదులను మళ్లించే అవకాశం ఉందని విశ్వసిస్తున్నామని, అలా జరిగితే జరిమానాను రాబట్టడం కుదరదనే ఉద్దేశంతో ఈ నోటీసులు ఇస్తున్నట్లు సెబీ తెలిపింది. -
పాపం పేటీఎం ఇన్వెస్టర్లు.. రూ. 27,000 కోట్లు ఆవిరి!
పేటీఎం ( Paytm )యాజమాన్య ఫిన్టెక్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు గురువారం (ఫిబ్రవరి 15) 5 శాతం పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో రూ. 325.30 వద్ద సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని ఉపయోగించే సంస్థలు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) ను ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి పేటీఎం బ్యాంక్ ప్రతినిధులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ప్రశ్నించిన ఘటన తర్వాత వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు పడిపోయాయి.ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిషేధం విధించినప్పటి నుంచి 11 రోజులలో పేటీఎం ఇన్వెస్టర్లు సుమారు రూ. 27,000 కోట్లు నష్టపోయారు. ఇది దాని విలువలో 57 శాతం. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలతో వ్యాపారాన్ని నిర్వహించిన కస్టమర్లకు సంబంధించిన సమాచారం, పత్రాలు, వివరాల ఈడీ నుంచి నోటీసులు, అభ్యర్థనలు వస్తున్నట్లు ఇటీవలి ఫైలింగ్లో వన్97 కమ్యూనికేషన్స్ అంగీకరించింది. అయితే తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ విదేశీ రెమిటెన్స్లలో పాల్గొనదని కంపెనీ స్పష్టం చేసింది. నివేదికల ప్రకారం.. ఈడీ అధికారులు కోరిన సమాచారం, పత్రాలను పేటీఎం ఇప్పటికే అందించినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలోగా మరిన్ని వివరాలు అందజేయాలని ఈడీ ఆదేశించినట్లుగా సమాచారం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి సేకరించిన సమాచారం, డాక్యుమెంట్లు ఈ దశలో ఫెమా ఉల్లంఘనలను సూచించడం లేదని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ద్వారా తెలుస్తోంది. -
మెప్పించని ఆర్బీఐ పాలసీ
ముంబై: ఆర్బీఐ నుంచి కీలక వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత కొరవడంతో రేట్ల ఆధారిత రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఆటో, రియలీ్ట, కమోడిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బలహీన డిసెంబర్ క్వార్టర్ ఫలితాల నమోదుతో ఎఫ్ఎంసీజీ షేర్లూ డీలా పడ్డాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 724 పాయింట్లు నష్టపోయి 71,428 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 213 పాయింట్లు పతనమై 21,718 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఆర్బీఐ పాలసీ ప్రకటన వెల్లడి ఐటీ, ఇంధన షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 921 పాయింట్లు పతనమై 71,231 వద్ద, నిఫ్టీ 266 పాయింట్లు క్షీణించి 21,665 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. వడ్డీ రేట్ల ప్రభావిత షేర్లు డీలా ఆర్బీఐ నుంచి వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత రాకపోవడంతో బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు నష్టాలు చివచూశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.50%, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ 2% చొప్పున నష్టపోయాయి. ఆటో రంగ షేర్లూ నష్టాల బాటపట్టాయి. ఐషర్ మోటార్స్ 3%, అపోలో టైర్స్ 2.50%, మారుతీ, ఎంఅండ్ఎం, సంవర్ధన మదర్సన్ షేర్లు 2%, టీవీఎస్, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ షేర్లు 1%, ఎంఆర్ఎఫ్ 0.10% చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈ ఆటో ఇండెక్స్ 1% పతనమైంది. అలాగే రియల్టీ రంగ షేర్లైన గోద్రేజ్ ప్రాపర్టీస్ 3.50%, శోభ, లోథా 3%, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 1% మేర నష్టపోయాయి. నిబంధనల అతిక్రమణ కారణంగానే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ అధికారులు తెలపడంతో పేటీఎం షేరు 10% పతనమై రూ.447 వద్ద లోయర్ సర్క్యూట్ తాకింది. -
ఐటీ, ఇంధన షేర్లకు డిమాండ్
ముంబై: ఐటీ, ఇంధన కంపెనీల షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మంగళవారం దాదాపు లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెంటిమెంట్ను బలపరిచాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరిగి 72,186 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 158 పాయింట్లు బలపడి 21,929 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 530 పాయింట్లు పెరిగి 72,261 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు బలపడి 72,261 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతానికి పైగా రాణించాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరగడంతో బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ల విలువ రూ.4.27 లక్షల కోట్లు పెరిగి రూ.386.88 లక్షల కోట్లకు చేరింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.93 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1096 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆసియాలో హాంగ్కాంగ్ 4%, చైనా 3%, థాయిలాండ్ 1%, ఇండోనేసియా, తైవాన్ సూచీలు అరశాతం చొప్పున పెరిగాయి. యూరప్ మార్కెట్లు 0.50% – 0.75% చొప్పున లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ► వరుస 3 రోజుల్లో 42% పతనాన్ని చవిచూసిన పేటీఎం షేరు కోలుకుంది. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈలో 3% లాభపడి రూ.452 వద్ద స్థిరపడింది. ► టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ఐటీ షేర్లలో ర్యాలీలో భాగంగా టీసీఎస్ షేరు ట్రేడింగ్లో 4.5% ర్యాలీ చేసి రూ.4,150 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 4% లాభపడి రూ.4,133 వద్ద స్థిరపడింది. -
ఆ వ్యాఖ్యలే కొంప ముంచాయా! ఒకేరోజు రూ.6.64 లక్షల కోట్లు లాస్..
ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk)కు చెందిన టెస్లా కంపెనీ షేర్లు ఒక్కరోజులోనే ఏకంగా 12 శాతానికిపైగా నష్టపోయినట్లు తెలుస్తోంది. టెస్లా ధరలను తగ్గిస్తున్నా.. సేల్స్ మాత్రం తగ్గుముఖం పడుతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మస్క్ చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెస్లా గత కొంతకాలంగా ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల సేల్స్ కూడా బాగా దెబ్బతిన్నాయి. చైనా ప్రధాన పోటీదారుగా ఉండటం వల్ల ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది. టెస్లా స్టాక్ భారీగా తగ్గడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. టెస్లా అమ్మకాలు తగ్గడం మాత్రమే కాకుండా జనవరి 15న స్టాక్ విలువ 12.13 శాతం పడిపోయి 182.63 డాలర్ల వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్ విలువ బాగా తగ్గడం వల్ల టెస్లా మార్కెట్ వ్యాల్యూ ఒక్కరోజే 80 బిలియన్ డాలర్ల వరకు తగ్గింది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 6.64 లక్షల కోట్లకు పైనే అని తెలుస్తోంది. ఇదీ చదవండి: భారత్కు శాశ్వత సభ్యత్వం లేదు.. ఐక్యరాజ్య సమితిపై మస్క్ కీలక వ్యాఖ్యలు ఎలక్ట్రిక్ వాహన రంగంలో చైనా తమకు పోటీ వస్తోందని ఇలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ మార్కెట్ మీద నియంత్రణ కోల్పోతే చైనా తప్పకుండా ఇతర దేశాల వ్యాపారాలను కొల్లగొట్టే ప్రమాదం ఉందని వాపోయారు. ప్రస్తుతం BYD కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని.. టెస్లా కార్లకంటే కూడా ఇవి తక్కువ ధరలో లభించడం వల్ల టెస్లా అమ్మకాలు క్షీణించాయని చెబుతూ.. గత త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు బాగా తగ్గినట్లు వెల్లడించారు. -
భారీగా పెరిగిన షేర్స్.. కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మైక్రోసాఫ్ట్!
గ్లోబల్ ఐటీ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' (Microsoft) మార్కెట్ విలువ మొదటిసారిగా 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యుయేషన్ను సాధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కంపెనీ ఈ పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి యూఎస్ స్టాక్ ఎక్సేంజ్లో మైక్రోసాఫ్ట్ షేర్ విలువ 1.3 శాతం పెరిగి 403.78 డాలర్లకు చేరుకుంది. కంపెనీ షేర్ విలువ పెరగడంతో మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్ల మార్క్ను అందుకుంది. గతంలో 3 ట్రిలియన్ మార్కెట్ విలువను సాధించిన మొదటి కంపెనీగా యాపిల్ చేరింది. ఇప్పుడు అలాంటి రికార్డును తాజాగా మైక్రోసాఫ్ట్ కైవసం చేసుకుంది. ఇక యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 3.03 ట్రిలియన్ డాలర్ల సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కొడుకులకు రూ.500 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి - ఎవరో తెలుసా? మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడం.. కంపెనీ ముందుకు దూసుకెళ్లడానికి, వృద్ధి సాధించడానికి కారణమవుతోంది. రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్ మరింత అభివృద్ధిని సాధిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ సంస్థ, యాపిల్ కంపెనీని అధిగమిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
కొడుకులకు రూ.500 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి - ఎవరో తెలుసా?
విప్రో వ్యవస్థాపకుడు 'అజీమ్ ప్రేమ్జీ' (Azim Premji) తన కుమారులు.. సంస్థ చైర్మన్ 'రిషద్ ప్రేమ్జీ', ఎంటర్ప్రైజెస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'తారిఖ్ ప్రేమ్జీ'లకు జనవరి 23న దాదాపు రూ.500 కోట్ల విలువైన 10.2 మిలియన్ షేర్లను గిఫ్ట్గా ఇచ్చినట్లు బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ చూపించింది. అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ అండ్ అజీమ్ ప్రేమ్జీ ఫిలాంత్రోపిక్ ఇనిషియేటివ్స్లో బోర్డు సభ్యునిగా పనిచేస్తున్నాడు. లావాదేవీ తర్వాత, అజీమ్ ప్రేమ్జీ కుటుంబానికి కంపెనీలో 4.4% వాటా ఉంది. ఇందులో ప్రేమ్జీకి 4.3%, అతని భార్య యాస్మీన్ ప్రేమ్జీకి 0.05%, ఇద్దరు కొడుకులకు 0.03% వాటా ఉంది. ఇదీ చదవండి: ప్రపంచంలో అయోధ్యకు పెరిగిన ఖ్యాతి.. ఏడాది చివరికి రూ.4 లక్షల కోట్లు.. ప్రేమ్జీ కుటుంబం విప్రోలో 72.9% వాటా కలిగి ఉన్నప్పటికీ 7.4% షేర్ల నుంచి డివిడెండ్ ఆదాయాన్ని పొందుతుంది. ప్రస్తుతానికి విప్రో ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్తో సహా ప్రేమ్జీ సంపద మొత్తం 11.3 బిలియన్ డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. విప్రో షేర్లు శుక్రవారం నాడు రూ.484.9 వద్ద ముగిశాయి. దీని ప్రకారం 1,0230,180 షేర్ల విలువ రూ. 496 కోట్లుగా ఉంది. -
వికాస్ లైఫ్కేర్ చేతికి స్కై 2.0
న్యూఢిల్లీ: దేశీ కంపెనీ వికాస్ లైఫ్కేర్ లిమిటెడ్ తాజాగా దుబాయ్ సంస్థ స్కై 2.0 క్లబ్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు 7.9 కోట్ల డాలర్లు(సుమారు రూ. 650 కోట్లు) వెచి్చంచనుంది. 2023–24 లోపు వాటా కొనుగోలు ప్రక్రియ ముగియనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. స్కై 2.0 క్లబ్ హోల్డింగ్ సంస్థ బ్లూ స్కై ఈవెంట్ హాల్ ఎఫ్జెడ్–ఎల్ఎల్సీ(దుబాయ్)తో ఇందుకు వాటా మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. 60% వాటాతోపాటు.. భవిష్యత్ బిజినెస్ వెంచర్లనూ సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. 13 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో ఇందుకు డీల్ కుదిరినట్లు తెలిపింది. -
కార్వీ కేసులో సెబీకి నాలుగు వారాల గడువు: శాట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ద్వారా యాక్సిస్ బ్యాంక్కు తాకట్టు పెట్టిన షేర్లను విడుదల చేయడానికి మార్కెట్ రెగ్యులేటర్, డిపాజిటరీలకు 2023 డిసెంబర్ 20 నుండి నాలుగు వారాల సమయం ఉందని సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) శుక్రవారం స్పష్టం చేసింది. శాట్ మునుపటి ఆర్డర్ ప్రకారం తాకట్టు పెట్టిన షేర్లను విడుదల చేయనందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (సెబీ) వ్యతిరేకంగా యాక్సిస్ బ్యాంక్ ట్రిబ్యునల్ ముందు అప్పీల్ చేసింది. ‘ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి అప్పీలుదారు అయిన యాక్సిస్ బ్యాంక్, అలాగే సెబీ, నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్లకు (ఎన్ఎస్డీఎల్) ఆర్డర్ తేదీ నుండి నాలుగు వారాల గడువు ఉందని స్పష్టం చేయబడింది’ అని శాట్ పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి ఇతర రుణదాతలకు తాకట్టు పెట్టిన షేర్లు సెబీ, ఎన్ఎస్డీఎల్ ద్వారా కార్వీ ఖాతాదారులకు బదిలీ అయ్యాయి. ఈ సెక్యూరిటీల కోసం రుణదాతలకు నాలుగు వారాల్లో పరిహారం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. యాక్సిస్ బ్యాంక్కు తాకట్టు పెట్టిన షేర్లు అలాగే ఉన్నాయి. దీనిని గుర్తించిన ట్రిబ్యునల్.. ఆ తనఖా షేర్లను విక్రయించడానికి యాక్సిస్ బ్యాంక్కు అనుమతించింది. 2023 డిసెంబర్ 20 నాటి శాట్ ఆర్డర్పై డిసెంబర్ 30న సుప్రీంకోర్టులో సెబీ అప్పీల్ దాఖలు చేసింది. -
శ్యామ్ మెటాలిక్స్ షేర్ల జారీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ను చేపట్టింది. తద్వారా రూ. 1,385 కోట్లు సమీకరించినట్లు తాజాగా వెల్లడించింది. మొత్తం 38 సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 2.40 కోట్లకుపైగా షేర్లను కేటాయించినట్లు తెలియజేసింది. రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 576 ధరలో జారీ చేసినట్లు తెలియజేసింది. క్విప్ కమిటీ షేర్ల జారీని అనుమతించినట్లు బుధవారం పేర్కొంది. కాగా.. క్విప్ నేపథ్యంలో సెబీ నిబంధనలకు అనుగుణంగా కంపెనీలో పబ్లిక్కు కనీస వాటాకు వీలు కలిగినట్లు వెల్లడించింది. రానున్న కొన్నేళ్లలో ఈక్విటీ జారీ ప్రణాళికలేవీలేవని స్పష్టం చేసింది. తాజాగా సమీకరించిన నిధుల సహాయంతో బ్యాంకుల నుంచి తీసుకుంటున్న వర్కింగ్ క్యాపిటల్ పరిమితులను తగ్గించుకోనున్నట్లు తెలియజేసింది. నికర రుణరహిత కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పేర్కొంది. తద్వారా వృద్ధిని వేగవంతం చేయనున్నట్లు వివరించింది. క్విప్ నేపథ్యంలో శ్యామ్ మెటాలిక్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం జంప్చేసి రూ. 667 వద్ద ముగిసింది. -
త్వరలో ఐపీవోకి.. అంతలోనే రూ.300 కోట్ల షేర్లు అమ్ముకున్న సీఈవో..
పిల్లల దుస్తులు, ఉత్పత్తులను విక్రయించే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘ఫస్ట్క్రై’ (FirstCry) త్వరలో ఐపీవోకి రానుంది. అంతలోనే ఈ కంపెనీ సీఈవో దాదాపు రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేసుకున్నారు. కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం.. ఫస్ట్క్రై సీఈవో సుపమ్ మహేశ్వరి ఐపీవో కోసం పత్రాలను సమర్పించడానికి పది రోజుల ముందు కంపెనీకి చెందిన 6.2 మిలియన్ షేర్లను విక్రయించారు. ఒక్కొక్కటి రూ.487.44 ధరతో మొత్తం రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. సీఈవో సుపమ్ మహేశ్వరి పబ్లిక్ ఇష్యూలో సెల్లింగ్ షేర్హోల్డర్గా కూడా నమోదు చేసుకున్నారని మనీకంట్రోల్ నివేదించింది. 6.2 మిలియన్లకు పైగా షేర్లను ఆఫ్లోడ్ చేయడానికి ముందు, సుపమ్ మహేశ్వరి కంపెనీలో 7.46 శాతం వాటాను (35,097,831 షేర్లు) కలిగి ఉన్నారు. ఇప్పుడు కంపెనీలో ఆయన వాటా 5.95 శాతానికి (28,893,347 షేర్లు) తగ్గింది. ఐపీవోకి వచ్చే నాటికి ఫస్ట్క్రై కంపెనీ విలువ 3.5 నుంచి 3.75 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అయితే ఐపీవో తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఫస్ట్క్రై సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన సుపమ్ మహేశ్వరి అహ్మదాబాద్ ఐఐఎం నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు. బ్రెయిన్వీసా అనే కంపెనీతో తన వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన పిల్లల ఉత్పత్తుల విక్రయ సంస్థలు పరిమితంగా ఉన్నాయని గ్రహించి 2010లో అమితవ సాహాతో కలిసి ఫస్ట్క్రై కంపెనీని స్థాపించారు. ఇందులో మహీంద్ర అండ్ మహీంద్ర, సాఫ్ట్ బ్యాంక్ వంటివి కూడా పెట్టుబడులు పెట్టాయి. -
షేర్స్ కొనడానికి రూ. లక్ష అడిగిన యూజర్ - ఆనంద్ మహీంద్రా అదిరిపోయే రిప్లై
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) దృష్టిని ఇటీవల ఓ వ్యక్తి ఆకర్షించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్లో యూజర్ చేసిన కామెంట్ హాట్ టాపిక్గా మారింది. ఇందులో సర్, మహీంద్రా గ్రూప్ షేర్లను కొనుగోలు చేయడానికి నాకు 1 లక్ష రూపాయలు కావాలి' అని అడిగినట్లు చూడవచ్చు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. నీ ధైర్యానికి అభినందనలు, ఆలా అడగడంలో తప్పేముందని అన్నారు. యూజర్ అడిగిన ప్రశ్నకు తెలివిగా సమాధానం ఇచ్చిన ఆనంద్ మహీంద్రాను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. నిజానికి ఆనంద్ మహీంద్రా ఇలాంటి సంఘటనల మీద స్పందించడం ఇదే మొదటి సారి కాదు. ఇటీవల ఓ పిల్లాడు 700 రూపాయలకు మహీంద్రా థార్ కొంటానని వాళ్ళ నాన్నతో చేసిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇదీ చదవండి: మహీంద్రా థార్ పేరు మారనుందా..? కొత్త పేరు ఏదంటే! ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. చీకూ వీడియోలను చాలానే చూసాను, ఇప్పుడు అతడంటే ఇష్టం ఏర్పడింది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే.. థార్ను 700 రూపాయలకు విక్రయిస్తే.. మేము త్వరలో దివాళా తీయాల్సి ఉంటుందని సరదాగా అన్నారు. What an idea Sirji. Aapki himmat ke liye Taaliyaan! Poochne mein kya jaata hai? 😀 https://t.co/respZDQXKl — anand mahindra (@anandmahindra) December 27, 2023 -
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్కు మరో ఊహించని ఎదురు దెబ్బ!
‘మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు’ అన్న చందంగా తయారైంది ప్రముఖ టెక దిగ్గజం ఇన్ఫోసిస్ పరిస్థితి. ఇప్పటికే ఓ భారీ ప్రాజెక్ట్ రద్దయి ఐటీ రంగంలో హాట్ టాపిగ్గా మారిన ఇన్ఫోసిస్కు తాజాగా మరో షాక్ తగిలింది. కృత్తిమ మేధ ప్రాజెక్ట్ రద్దయ్యిందన్న వార్తలతో ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ సుమారు రూ.7,200 కోట్లు క్షీణించింది. డిసెంబర్ 26న స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్ల క్షీణించాయి. ఫలితంగా ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,200 కోట్లకు పైగా తగ్గింది. గత సెషన్లో మార్కెట్ ముగిసే సమయంలో ఇన్ఫోసిస్ షేర్ ధర రూ.1,562తో పోలిస్తే 1.12 శాతం క్షీణించి రూ.1,544.5 వద్ద ముగిసింది. ఊహించని కార్పొరేట్ పరిణామాల నేపథ్యంలో అత్యంత బలమైన ఐటీ రంగ సంస్థలు కూడా బలహీనంగా ఉండటం ప్రస్తుత ఐటీ మార్కెట్కు పరిస్థితికి అద్దం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫోసిస్ షేరు ధర ఎందుకు పడిపోయింది? ఇక ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్షీణతకు ఓ అంతర్జాతీయ కంపెనీతో కుదుర్చున్న ఒప్పందం రద్దవ్వడమేనని తెలుస్తోంది. ఇన్ఫోసిస్ 15ఏళ్ల పాటు కంపెనీ ప్లాట్ఫామ్లు, కృత్రిమ మేధ(ఏఐ) సొల్యూషన్స్పై పని చేసేందుకు ఓ అంతర్జాతీయ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఆర్ధిక మాంద్యం భయాలు, మార్కెట్లో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా తాజాగా, 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12,450 కోట్లు) విలువైన ఈ ఒప్పందాన్ని సదరు కంపెనీ రద్దు చేసుకుంది. డీల్ రద్దుతో మదుపర్ల అప్రమత్తం ఈ డీల్ రద్దు కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్ట్ రద్దు ఇన్ఫోసిస్ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయన్న అంచనాలతో మదపర్లు షేర్లను విక్రయించారు. ఇన్ఫోసిస్ కొత్త తరం ఏఐ టెక్నాలజీల్లోకి విస్తరించడానికి ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని చాలా మంది ఊహించారు. అయితే, ప్రాజెక్ట్ కేన్సిల్ అవ్వడంతో ఇన్ఫోసిస్ ఆదాయ మార్గాలు, వృద్ధి అంచనాలపై ప్రతికూల ప్రభావం చూపింది. ఐటీ రంగానికి ఎదురుదెబ్బలు కొన్నిసార్లు అస్థిరంగా ఉండే ఐటీ రంగం.. ప్రస్తుతం అప్రమత్తం కావాల్సిన పరిస్థితి నెలకొందని రాయిటర్స్ నివేదించింది. టెక్నాలజీ పెట్టుబడులను ప్రభావితం చేసే అనూహ్య ఆర్థిక పరిస్థితులను తట్టుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు తమ వ్యూహాలను పునఃసమీక్షిస్తున్నాయి. ఇన్ఫోసిస్కు ఈ తాజా కార్పొరేట్ అడ్డంకిని అధిగమించేటప్పుడు నష్ట నియంత్రణ, వాటాదారులకు భరోసా ఇవ్వడంపై తక్షణ దృష్టి సారించే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక హైలెట్ చేసింది. -
మెటల్, ఇంధన షేర్లలో కొనుగోళ్లు
ముంబై: మెటల్, ఇంధన, యుటిలిటీ, విద్యుత్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు పెరిగి 71,337 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లుబలపడి 21,441 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది మూడోరోజూ లాభాల ముగింపు. వరుస సెలవుల తర్వాత ఉదయం దేశీయ మార్కెట్ ఫ్లాట్గా మొదలయ్యాయి. అయితే ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు క్రమంగా లాభాల దిశగా కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 364 పాయింట్లు పెరిగి 71,471 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు బలపడి 71,471 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఐటీ, టెక్, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం చొప్పున రాణించాయి. బాక్సింగ్ డే సందర్భంగా యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. అమెరికా సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,636 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,464 కోట్ల షేర్లను కొన్నారు. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.75%), రిలయన్స్ (0.50%), కోటక్ బ్యాంక్ (1.35%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. మోటిసన్స్ లిస్టింగ్ భళా మోటిసన్స్ జ్యువెలరీ లిస్టింగ్ రోజునే ఇన్వెస్టర్లకు లాభాలను పంచింది. ఇష్యూ ధర రూ. 55తో పోలిస్తే బీఎస్ఈలో ఏకంగా 89 శాతం ప్రీమియంతో రూ. 104 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆపై ఒక దశలో 98 శాతంపైగా దూసుకెళ్లి గరిష్టంగా రూ. 109ను అధిగమించింది. చివరికి 84 శాతం లాభంతో రూ. 101 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలోనూ 98 శాతం జంప్చేసి రూ. 109 వద్ద లిస్టయ్యింది. ఆపై దాదాపు రూ. 110 వద్ద గరిష్టానికి చేరింది. చివరికి 88 శాతంపైగా వృద్ధితో రూ. 104 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 996 కోట్లుగా నమోదైంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 151 కోట్లు సమకూర్చుకున్న విషయం విదితమే. -
ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేయొచ్చా?
స్టార్ హెల్త్ ప్రస్తుత ధర: రూ. 524 టార్గెట్: రూ. 653 ఎందుకంటే: 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్.. దేశీయంగా తొలి స్టాండెలోన్ ఆరోగ్య బీమా రంగ కంపెనీ. ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాద బీమా సేవలకు తోడు.. దేశ, విదేశీ ప్రయాణ బీమా ప్రొడక్టుల (సర్వీసుల)ను సమకూరుస్తోంది. 14,200 ఆసుపత్రులతో ఒప్పందం ద్వారా భారత్లో అతిపెద్ద ఆరోగ్య బీమా సర్వీసులు నెట్వర్క్ను కలిగి ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికం(క్యూ2)లో నికర ఆర్జనా ప్రీమియం (ఎన్ఈపీ)వార్షికంగా దాదాపు 15% జంప్చేసి రూ. 3,206 కోట్లకు చేరింది. ఇందుకు రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం సాధించిన రెండంకెల వృద్ధి దోహదపడింది. దీంతో కంబైన్డ్ రేషియో వార్షిక ప్రాతిపదికన 1.3 శాతం మెరుగుపడి 99.2 శాతాన్ని తాకింది. రిటైల్ హెల్త్ ప్రీమియంలో పటిష్ట పురోగతి, కొత్త ప్రొడక్టుల విడుదల, డిజిటలైజేషన్పై నిలకడైన దృష్టి, విస్తారిత పంపిణీ నెట్వర్క్, కొత్త బ్యాంకస్యూరెన్స్ భాగస్వామ్యాలు (పాలసీల విక్రయంలో బ్యాంకులతో ఒప్పందాలు), మెరుగైన సాల్వెన్సీ రేషియో వంటి అంశాలు భవిష్యత్లో కంపెనీ పటిష్ట పనితీరు చూపేందుకు సహకరించను న్నాయి. డిజిటలైజేషన్ బాటలో ఇటీవల డైనమిక్ యూపీఐ క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తద్వారా కొత్తగా హెల్త్ ఇన్సూ రెన్స్ కొనుగోలు లేదా హెల్త్ పాలసీ కొనసాగింపు (రెన్యువల్)ను సులభంగా చేపట్టేందుకు వీలును కల్పించింది. రిటైల్ హెల్త్ విభాగంలో 33% వాటాతో మార్కెట్ లీడర్గా కంపెనీ నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రస్తుత ధర: రూ. 640 టార్గెట్: రూ. 740 ఎందుకంటే: ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విభా పడాల్కర్తో పాటు.. సీఎఫ్వో నీరజ్ షాతో ఇటీవలే సమావేశమయ్యాం. తద్వారా కంపెనీలో వృద్ధికి సంబంధించి చోటు చేసుకుంటున్న కీలక అంశాలు, మొత్తంగా జీవిత బీమా రంగంలో పరిస్థితులు తదితరాలపై అభిప్రాయాలకు తెరతీశారు. వీటి ప్రకారం కంపెనీ మార్కెట్లో తనకున్న వాటాను మరింత సుస్థిరం చేసుకోనుంది. ఇందుకు వ్యూహాత్మకంగా టెక్నాలజీ వినియోగం, కస్టమర్కు సేవల అందుబాటు (ఎక్స్పీరియన్స్), బ్రాండ్ను పటిష్టపరచుకోవడం, సిబ్బంది అందించే ప్రత్యేక సర్వీసులు వంటివి సహకరించనున్నాయి. వీటికితోడు కొత్త ప్రొడక్టుల విడుదల జత కలవనుంది. బీమా రంగ బిల్లులో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సవరణలు ఆరోగ్య బీమా విభాగానికి ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. వీరి అభిప్రాయం ప్రకారం కస్టమర్ల ఆరోగ్య బీమా అవసరాలకు తాజా బిల్లు తగిన మార్గాలను చూపనుంది. వెరసి కొత్త ప్రొడక్టులను రూపొందించడం, కస్టమర్లకు అనుగుణమైన సర్వీసులందించడం తదితర అంశాలలో బీమా రంగ కంపెనీలకు మరింత వెసులుబాటు లభించనుంది. ఇది దేశీయంగా బీమా సేవల వ్యవస్థ మరింత వేళ్లూనుకునేందుకు తోడ్పాటునివ్వనుంది. రూ. 5 లక్షలలోపు పాలసీలలో 15–17 శాతం చొప్పున వృద్ధి నమోదవుతోంది. అయితే అధిక టికెట్ పరిమాణంగల పొదుపు పాలసీలు తగ్గడంతో సర్దుబాటు ప్రాతిపదికన ఈ ఏడాది (2023–24) మొత్తం వార్షిక ప్రీమియం (ఏపీఈ) 12–13 శాతం చొప్పున పుంజుకునే వీలుంది. మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చానల్ ద్వారా 60 శాతం అమ్మకాలను సాధిస్తుండటం కంపెనీకి కలిసొచ్చే అంశం! -
మారుతీ చేతికి గుజరాత్ ప్లాంట్
న్యూఢిల్లీ: మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్(ఎస్ఎంసీ)కు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్ల జారీకి వాటాదారులు అనుమతించినట్లు మారుతీ సుజుకీ ఇండియా తాజాగా వెల్లడించింది. దీంతో సంబంధిత పార్టీ లావాదేవీకింద సుజుకీ మోటార్ గుజరాత్(ఎస్ఎంజీ)లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకుగాను రెండు ప్రత్యేక అంశాలపై పోస్టల్ బ్యాలట్ ద్వారా మారుతీ గత నెలలో వాటాదారుల నుంచి అనుమతిని కోరింది. రెండు సంస్థల మధ్య ఒప్పందం(సంబంధిత పార్టీ లావాదేవీ)తోపాటు.. నగదుకాకుండా ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్ల కేటాయింపుపై ఓటింగ్కు తెరతీసింది. ఈ రెండు అంశాలకూ వాటాదారుల నుంచి 98 శాతానికిపైగా అనుకూలంగా ఓట్లు లభించినట్లు మారుతీ తాజాగా వెల్లడించింది. గత నెలలో రూ. 12,841 కోట్లకు ఎస్ఎంజీని కొనుగోలు చేసేందుకు కంపెనీ బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచి్చన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరుకీ దాదాపు రూ. 10,241 ధరలో మొత్తం 1.23 కోట్ల ఈక్విటీ షేర్ల జారీకి ఆమోదముద్ర వేసింది. వెరసి ఎస్ఎంజీలో 100 శాతం వాటాను సొంతం చేసుకునే బాటలో ప్రిఫరెన్షియల్ జారీకి మారుతీ బోర్డు తెరతీసింది. ఈ లావాదేవీతో మారుతీలో ఎస్ఎంసీకిగల వాటా 56.4 శాతం నుంచి 58.28 శాతానికి బలపడనుంది. మరోవైపు ఎస్ఎంజీ మారుతీకి పూర్తి అనుబంధ కంపెనీగా ఆవిర్భవించనుంది. -
రెండు రోజుల్లో రూ. 345 కోట్లు.. టిమ్ కుక్ అంటే అట్లుంటది!
యాపిల్ కంపెనీ సీఈఓ 'టిమ్ కుక్' (Tim Cook) ఇటీవల తన షేర్లలో భారీ భాగాన్ని విక్రయించి, గత రెండేళ్లలో ఎప్పుడూ లేనంత అతిపెద్ద విక్రయాన్ని నమోదు చేసుకున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనం చూసేద్దాం. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, కుక్ 5,11,000 షేర్లను (శుక్రవారం 2,70,000 షేర్లు, సోమవారం 2,41,000 షేర్లు) విక్రయించి దాదాపు 41.5 మిలియన్ డాలర్లు ఆర్జించారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 345 కోట్లు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ దాఖలు ప్రకారం, అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం 88 మిలియన్ డాలర్లు, మొత్తం టాక్స్ తరువాత అతనికి 41.5 మిలియన్ డాలర్లు అందుకున్నాడు. 2021 ఆగస్టు తరువాత కుక్ విక్రయించిన అతిపెద్ద ఆపిల్ షేర్లు ఇవే కావడం గమనార్హం. ఇదీ చదవండి: అదే నిజమైతే బిలియనీర్కి ఏడేళ్ళు జైలు శిక్ష! వీడియోలో ఏముందంటే? టిమ్ కుక్ తన యాపిల్ షేర్లలో కొన్నింటిని విక్రయించినప్పటికీ, తన వార్షిక ప్రణాళికలో భాగంగా అతను అదే సంఖ్యలో షేర్లను అందుకోవడం వల్ల కంపెనీలో అతని మొత్తం వాటా మారలేదు. ఇప్పటికి కూడా ఇతడు 3.3 మిలియన్ యాపిల్ షేర్లను కలిగి ఉన్నట్లు సమాచారం. వీటి విలువ ప్రస్తుతం సుమారు 565 మిలియన్ డాలర్లు. -
ఈ పెద్దాయన స్టాక్ మార్కెట్ని ఏలుతున్నారు?, కోట్లు వెనకేసి
చూశారా!! ఈ పెద్దాయనని. ఈయన ఎవరు? ఏం చేస్తుంటారో తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నారా? అయితే, మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ఆయన గురించి తెలుసుకుందాం పదండి. స్టాక్ మార్కెట్తో డబ్బులు సంపాదించడం ఎలా? అని ఎవరినైనా అడిగితే అమ్మో స్టాక్ మార్కెటా? వద్దులే. ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తేనో లేదంటే తెలిసిన వాళ్లకి వడ్డీ ఇచ్చుకున్నా నాలుగు రాళ్లు వెనకేసువచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు? అలా ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు? అంటూ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడుతున్న వారి గురించి కథలు కథలుగా చెప్పుకుంటాం. కానీ, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుని, అనుభవజ్ఞులైన నిపుణులు సలహాలు తీసుకోవాలి. అలా తెలుసుకునే షేర్లలో పెట్టుబడులు పెట్టారు ఈ పెద్దాయన. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్, క్రమశిక్షణ, ఓపిక వహించారు. ఇప్పుడు ముదుసలి వయసులో భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఎలా అంటారా? క్రమశిక్షణ, సహనం ఈ రెండింటిలో ఆరితేరిన బిగ్ బుల్, దివంగత రాకేశ్ ఝున్ఝున్వాలా, దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్లు స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసి డివిడెండ్లు, బోనస్ షేర్లు, షేర్ల బైబ్యాక్, స్టాక్ స్ల్పిట్లతో లాభాల్ని గడిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ కూడా అంతే. సోషల్ మీడియా ఓవర్నైట్ స్టార్ గురించి పెద్దగా వివరాలు వెలుగులోకి రాలేదు. కానీ ఆయన పెట్టిన పెట్టుబడులు, ఆస్తులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రాజీవ్ మెహతా అనే నెటిజన్ ఈ పెద్దాయన గురించి వీడియో చేశారు. ఆ వీడియోలో కోట్ల ఆస్తులు ఉన్నా సాధారణ జీవితం గడుపుతున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఆయనకు ఏయే కంపెనీల్లో షేర్లు ఉన్నాయో వివరించారు. ఆ వివరాల ఆధారంగా సదరు పెద్దాయన నికర ఆస్తి విలువ రూ. 10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఎల్అండ్టీలో 27,855 షేర్లు, అల్ట్రాటెక్ సిమెంట్లో 2,475 షేర్లు, కర్ణాటక బ్యాంక్లో 4,000 షేర్లు తన వద్ద ఉన్నాయని తన మాతృ భాషలో పెద్దాయన చెప్పడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. నివేదికల ప్రకారం..100 మిలియన్ (రూ.10 కోట్ల) కంటే ఎక్కువ విలువైన షేర్లు ఉన్నాయని తెలుస్తోంది. అదనంగా, ఆ వ్యక్తి తాను సంవత్సరానికి సుమారుగా రూ. 6 లక్షల డివిడెండ్లను సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. As they say, in Investing you have to be lucky once He is holding shares worth ₹80 crores L&T ₹21 crores worth of Ultrtech cement shares ₹1 crore worth of Karnataka bank shares. Still leading a simple life#Investing @connectgurmeet pic.twitter.com/AxP6OsM4Hq — Rajiv Mehta (@rajivmehta19) September 26, 2023 ఈ సందర్భంగా రాజీవ్ మెహతా మాట్లాడుతూ పెద్దాయన చెప్పినట్లుగా పెట్టుబడులు మీరు అదృష్టవంతులు కావాలని అన్నారు. అంతేకాదు ఎల్ అండ్ టీలో రూ.80 కోట్ల విలువైన షేర్లు, అల్ట్రాటెక్ సిమెంట్లో రూ. 21 కోట్ల విలువైన షేర్లు, కర్ణాటక బ్యాంక్లో రూ. కోటి విలువైన షేర్లు ఉన్నాయని మెహతా పోస్ట్ చేశాడు.ఇప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు అని’ మెహతా పేర్కొన్నారు. Bhai 27,000 L&T shares = 8 cr no? Similarly 3.2 cr. of Ultratech 10 lakh of Ktk bank It's a decent amount still. More power to him. But please consider blurring his face, such publicity usually doesn't do good esp for old people living a simple life. — Deepak Shenoy (@deepakshenoy) September 26, 2023 ఆ వీడియోపై క్యాపిటల్ మైండ్ సీఈఓ, ఫౌండర్ దీపక్ షెనాయ్ స్పందించారు. రాజీవ్ మెహతా చెప్పిన దానిని బట్టి.. ఎల్ అండ్ టీ కంపెనీలో 27 వేల షేర్ల విలువ రూ. 8 కోట్లు, అల్ట్రాటెక్ కంపెనీలో రూ. 3.2 కోట్ల విలువైన షేర్లు, కర్ణాటక బ్యాంకులో రూ. 10 లక్షల విలువైన షేర్లు.. ఇలా మొత్తంగా రూ. 12 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. ప్రస్తుతం, ఈ పెద్దాయన గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగుతుంది. -
బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా.. షేర్లు ఢమాల్!
ప్రైవేట్ రంగ ధనలక్ష్మి బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ శ్రీధర్ కళ్యాణసుందరం బోర్డుతో విభేదాల కారణంగా రాజీనామా చేశారు. ఆయన వైదొలిగిన గంటల వ్యవధిలోనే బ్యాంక్ షేర్లు భారీగా పడిపోయాయి. ధనలక్ష్మి బ్యాంక్ షేర్లు పాక్షికంగా కోలుకోవడానికి ముందు సోమవారం (సెప్టెంబర్ 18) 9 శాతం వరకూ పడిపోయాయి. ఉదయం 10:20 గంటల సమయానికి బ్యాంక్ షేర్లు 3.25 శాతం క్షీణించి 28.20 రూపాయల వద్ద ఉన్నాయి. కేరళలోని త్రిసూర్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ధనలక్ష్మి బ్యాంక్కి కళ్యాణసుందరం 2022 డిసెంబరులో స్వతంత్ర డైరెక్టర్గా నియమితులయ్యారు. (ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు బిగ్ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం) ధనలక్ష్మి బ్యాంక్ ప్రస్తుతం బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శివన్ నేతృత్వంలో ఉంది. అపరిష్కృతంగా ఉన్న బ్యాంకు ప్రణాళికాబద్ధమైన హక్కుల సమస్యపై తాను ప్రశ్నలు లేవనెత్తానని, దీంతో తనను బ్యాంకు నుంచి తొలగిస్తామని బెదిరించారని సెప్టెంబరు 16న ఎక్స్ఛేంజీలకు పంపిన లేఖలో కళ్యాణసుందరం ఆరోపించారు. ధనలక్ష్మి బ్యాంక్ 2023 మార్చి నాటికి కేవలం రూ. 15 వేల కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉంది. బ్యాంక్ నాయకత్వానికి సంబంధించి చాలా కాలంగా గందరగోళం నెలకొంది. దీంతో ఈ బ్యాంక్పై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచిన ఆర్బీఐ బోర్డులో ఇద్దరు డైరెక్టర్లను ఉంచింది. -
గిఫ్ట్ సిటీ, ఎల్ఎస్ఈలలో లిస్టింగ్
న్యూఢిల్లీ: రుణ సెక్యూరిటీలు, షేర్లను ఐఎఫ్ఎస్సీ–గిఫ్ట్ సిటీతోపాటు.. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎల్ఎస్ఈ)లలో లిస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇందుకు యూకేతో కలసి అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. గిఫ్ట్ సిటీలో కార్యకలాపాల విస్తరణకు యూకే సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వేగవంత, విస్తార ఫిన్టెక్ భాగస్వామ్యానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేశారు. ఇండియా– యూకే 12వ ఎకనమిక్, ఫైనాన్షియల్ సదస్సు ముగింపు సందర్భంగా సీతారామన్ పలు అంశాలను వెల్లడించారు. ఐఎఫ్ఎస్సీ లిస్టింగ్తో ప్రారంభించి తదుపరి లండన్ లిస్టింగ్వైపు దృష్టిపెట్టనున్నట్లు గతంలోనే పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. వెరసి తొలుత ఐఎఫ్ఎస్సీ లిస్టింగ్నకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ ప్లాట్ఫామ్ల ద్వారా విదేశీ పెట్టుబడులను సమకూర్చుకునేందుకు మసాలా, గ్రీన్ బాండ్లను సైతం రుణ సెక్యూరిటీల లిస్టింగ్ జాబితాలో చేర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఎల్ఎస్ఈలో భారత కంపెనీల ప్రత్యక్ష లిస్టింగ్ ప్రణాళికలను యూకే ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ ఈ సందర్భంగా ప్రశంసించారు. -
డీల్స్ @ రూ. 60,000 కోట్లు!
ముంబై: ఓ వైపు దేశీ స్టాక్ మార్కెట్లు ఈ నెల(ఆగస్ట్)లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ మరోపక్క లిస్టెడ్ కార్పొరేట్ ప్రపంచంలో భారీస్థాయి విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. గత ఐదు నెలల తదుపరి ఆగస్ట్లో మార్కెట్లు కొంతమేర వెనకడుగు వేయగా.. షేర్ల అమ్మకపు డీల్స్ కొత్త రికార్డ్కు తెరతీశాయి. ఒక పరిశీలన ప్రకారం ఈ నెలలో 29 వరకూ మొత్తం రూ. 60,000 కోట్లమేర భారీ బ్లాక్డీల్స్ జరిగాయి. క్యాలెండర్ ఏడాదిలోని ఏ నెలలోనైనా విలువరీత్యా ఇవి అత్యధికంకాగా.. రెండు భారీ డీల్స్ ఇందుకు దోహదపడ్డాయి. సాఫ్ట్వేర్ సేవల దేశీ కంపెనీ కోఫోర్జ్(గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్)లో రూ. 7,684 కోట్ల విలువైన ఈక్విటీని పీఈ దిగ్గజం బేరింగ్ అనుబంధ కంపెనీ హల్ట్ విక్రయించింది. ఇదేవిధంగా ప్రయివేట్ రంగ విద్యుత్ కంపెనీ అదానీ పవర్లో ప్రమోటర్ గ్రూప్ రూ. 7,412 కోట్ల విలువైన షేర్లను యూఎస్ దిగ్గజం జీక్యూజీ పార్ట్నర్స్కు విక్రయించింది. ఈ బాటలో ఇండిగో బ్రాండు విమానయాన సేవల కంపెనీ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్లో సహవ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ కుటుంబం 3 శాతం వాటాను రూ. 2,802 కోట్లకు విక్రయించింది. దేశీ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎమ్లో చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్ కంపెనీ యాంట్ఫిన్ రూ. 2,037 కోట్ల విలువైన వాటాను అమ్మివేయగా.. ఆన్లైన్ ఫుడ్ సర్వింగ్ ప్లాట్ఫామ్ జొమాటోలో పీఈ దిగ్గజం టైగర్ గ్లోబల్ 1.44 శాతం వాటాను రూ. 1,124 కోట్లకు విక్రయించింది. మార్కెట్ల వెనకడుగు.. ఈ ఏడాది జూలై 20న దేశీ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ సరికొత్త గరిష్టం 67,500 పాయింట్లను అధిగమించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం దాదాపు 20,000 పాయింట్ల స్థాయికి చేరింది. ఈ రికార్డ్ స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ నిజానికి ఆగస్ట్లో 3 శాతం వెనకడుగు వేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 65,100, నిఫ్టీ 19,350 వద్ద కదులుతున్నాయి. అయితే దేశీయంగా అదనపు లిక్విడిటీ, మిడ్, స్మాల్క్యాప్స్నకు విస్తరించిన యాక్టివిటీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు వంటి అంశాలు.. ఈ నెలలో భారీ స్థాయి లావాదేవీలకు కారణమవుతున్నట్లు కార్పొరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు దేశ ఆర్థిక వ్యవస్థపై మధ్య, దీర్ఘకాలిక వృద్ధి అంచనాలు, స్టాక్ మార్కెట్ భవిష్యత్పై పెరుగుతున్న ఇన్వెస్టర్ల విశ్వాసం జత కలుస్తున్నట్లు తెలియజేశాయి. ఇతర స్టాక్స్లోనే.. ప్రధానంగా ఇండెక్సేతర కంపెనీలలోనే ఇటీవల వాటాల విక్రయాలలో భారీ లావాదేవీలు నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మొత్తం మార్కెట్లో జరుగుతున్న అంశాలను సెన్సెక్స్ లేదా నిఫ్టీ ప్రతిఫలించకపోవచ్చని తెలియజేశాయి. మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు), విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు), పీఈ సంస్థలు తదితర దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు స్వల్పకాలిక అంశాలను పరిగణనలోకి తీసుకోవని వివరించాయి. ఈ నెలలో మార్కెట్లు రికార్డ్ గరిష్టాల నుంచి కొంతమేర క్షీణించినప్పటికీ.. మిడ్, స్మాల్ క్యాప్స్ చరిత్రాత్మక గరిష్టాలకు చేరడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎన్ఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 23% జంప్చేయగా.. నిఫ్టీ దాదాపు 7% ఎగసింది. ఇక జూన్లోనూ మొత్తం రూ. 50,000 కోట్ల విలువైన భారీ బ్లాక్డీల్స్ నమోదుకావడం మార్కెట్ల లోతుకు నిదర్శనమని నిపుణులు విశ్లేíÙంచారు. -
జొమాటోలో కీలక పరిణామం
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ ప్లాట్ఫామ్ జొమాటోలో టైగర్ గ్లోబల్, డీఎస్టీ గ్లోబల్ మొత్తం 1.8 శాతం వాటాను విక్రయించాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా టైగర్ గ్లోబల్ 1.44 శాతం వాటాకు సమానమైన 12,34,86,408 షేర్లను విక్రయించింది. ఇక డీఎస్టీ గ్లోబల్ 0.4 శాతం వాటాకు సమానమైన 3,19,80,447 షేర్లను అమ్మివేసింది. షేరుకి రూ. 90–91 సగటు ధరలో విక్రయించిన వీటి మొత్తం విలువ రూ. 1,412 కోట్లు. యాక్సిస్ ఎంఎఫ్, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రులైఫ్, మోర్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్, సొసైటీ జనరాలి తదితరాలు జొమాటో షేర్లను కొనుగోలు చేశాయి. ఈ నేపథ్యంలో జొమాటో షేరు బీఎస్ఈలో 1.5 శాతం పుంజుకుని రూ. 92.3 వద్ద ముగిసింది. -
నష్టాల్లోంచి లాభాల్లోకి...
ముంబై: ఆఖరి గంటలో అధిక వెయిటేజీ రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు సోమవారం ఇంట్రాడే నష్టాలను భర్తీ చేసుకొని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం నుంచీ సానుకూల సంకేతాలు అందిపుచ్చుకున్నాయి. ట్రే డింగ్లో 501 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 79 పాయింట్ల లాభంతో 65,402 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 170 పాయింట్ల పతనం నుంచి తేరుకొని ఆరు పాయింట్ల స్వల్ప లాభంతో 19,435 వద్ద ముగిసింది. మెటల్, బ్యాంక్స్, ఫైనాన్స్, ఇంధన, ఫార్మా, కన్జూమర్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎక్సే్చంజీలకు సెలవు ప్రకటించారు. ► అదానీ పోర్ట్స్ ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ ని్రష్కమణతో అదానీ గ్రూప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా అంబుజా సిమెంట్స్ షేరు 3.50% పతనమైంది. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు 3.26% నష్టపోయింది. అదానీ ట్రాన్స్మిషన్స్ 2.50%, ఏసీసీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 2% వరకు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 1.50%, ఎన్డీటీ 1.30%, అదానీ పవర్ ఒక శాతం పతనయ్యాయి. ► రూ.880 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో గతవారం ఐపీఓకు వచి్చన టీవీఎస్ సప్లై చివరి రోజు నాటికి 2.78 రెట్ల సబ్్రస్కిప్షన్ సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 2.51 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయగా మొత్తం 6.98 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. -
క్యాపిటలాండ్ ఇన్వెస్ట్మెంట్ రూ. 3 వేల కోట్ల ఫండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రీమియం బిజినెస్ పార్క్లలో ఇన్వెస్ట్ చేసేందుకు 525 మిలియన్ సింగపూర్ డాలర్లతో (సుమారు రూ. 3,225 కోట్లు) ఫండ్ను ఏర్పాటు చేసినట్లు క్యాపిటలాండ్ ఇన్వెస్ట్మెంట్ (సీఎల్ఐ) వెల్లడించింది. క్యాపిటలాండ్ ఇండియా గ్రోత్ ఫండ్ 2 (సీఐజీఎఫ్ 2)లో ఒక అంతర్జాతీయ సంస్థ రూ. 1,630 కోట్లతో 50 శాతం తీసుకున్నట్లు తెలిపింది. సీఎల్ఐకి చెందిన ’ఇంటర్నేషనల్ టెక్ పార్క్ చెన్నై’లో సీఐజీఎఫ్2 ఫండ్ 70 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 590 కోట్లు వెచ్చించింది. వాటాల విక్రయం తర్వాత కూడా సదరు అసెట్ నిర్వహణను సీఎల్ఐ కొనసాగించనుంది. సింగపూర్కి చెందిన సీఎల్ఐ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాల్లో ఒకటి. 2023 మార్చి ఆఖరు నాటికి సంస్థ నిర్వహణలో 133 బిలియన్ సింగపూర్ డాలర్ల (ఎస్జీడీ) అసెట్స్ ఉన్నాయి. వీటిలో 4 బిలియన్ ఎస్జీడీ విలువ చేసే అసెట్స్ భారత్లో ఉన్నాయి. -
మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటర్ల దాతృత్వం
న్యూఢిల్లీ: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రమోటర్లు సమాజ సేవ కోసం 10 శాతం వాటాలను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటింగ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్, ప్రమోటర్ రామ్దేవ్ అగర్వాల్ చెరో ఐదు శాతం (చెరో 73,97,556 షేర్లు) చొప్పున కంపెనీ ఈక్విటీలో వాటాలను విరాళంగా ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.12,161 కోట్లు కాగా, ఈ ప్రకారం 10 శాతం వాటాల విలువ రూ.1,216 కోట్లుగా ఉండనుంది. ఈ మొత్తాన్ని వచ్చే పదేళ్లలోపు లేదా అంతకంటే ముందుగానే ఖర్చు చేయనున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ స్టాక్ ఎక్సే్ఛంజ్లకు సమాచారం ఇచి్చంది. ఇప్పటికే మన దేశం నుంచి విప్రోప్రేమ్జీ, గౌతమ్ అదానీ, శివ్నాడార్, నందన్ నీలేకని తదితరులు సమాజం కోసం పెద్ద మొత్తంలో విరాళలను ప్రకటించగా, వారి సరసన మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ ప్రమోటర్లు కూడా చేరినట్టయింది. మరోవైపు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ తన నిర్వహణలోని బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని గ్లైడ్ టెక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీకి విక్రయించేందుకు నిర్ణయించడం గమనార్హం. గ్లైడ్ టెక్ అనేది మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్కు పూర్తి అనుబంధ సంస్థగా ఉంది. అలాగే అనుబంధ సంస్థ కింద ఉన్న సంపద నిర్వహణ వ్యాపారాన్ని మాతృసంస్థ మోతీలాల్ ఓస్వా ల్ ఫైనాన్షియల్కు మార్చేందుకు నిర్ణయించింది. -
విదేశాల్లో నేరుగా దేశీ సంస్థల లిస్టింగ్
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు తమ షేర్లను నేరుగా విదేశీ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేసుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి కోవిడ్–19 సహాయక ప్యాకేజీ కింద 2020 మేలోనే ప్రకటించినప్పటికీ, దీనిపై తాజాగా నిర్ణయం తీసుకుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్వహించిన కార్పొరేట్ డెట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు తెలిపారు. ‘ఐఎఫ్ఎస్సీ ఎక్సే్చంజీల్లో లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీలు నేరుగా లిస్ట్ అయ్యేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది‘ అని ఆమె చెప్పారు. సంస్థలు అంతర్జాతీయంగా పెట్టుబడులు సమీకరించుకునేందుకు, మెరుగైన వేల్యుయేషన్స్ దక్కించుకునేందుకు దీనితో తోడ్పాటు లభించగలదని మంత్రి పేర్కొన్నారు. మరికొద్ది వారాల్లో దీనికి సంబంధించిన నిబంధనలను నోటిఫై చేయనున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తొలుత గుజరాత్ గిఫ్ట్ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)లో లిస్ట్ అయ్యేందుకు, ఆ తర్వాత ఎనిమిది లేదా తొమ్మిది నిర్దిష్ట దేశాల్లో లిస్టింగ్కు అనుమతినివ్వొచ్చని పేర్కొన్నారు. ఈ జాబితాలో బ్రిటన్, కెనడా, స్విట్జర్లాండ్, అమెరికా మొదలైనవి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. స్టార్టప్లు.. రిలయన్స్కు బూస్ట్.. కొత్త పాలసీతో యూనికార్న్లు (1 బిలియన్ డాలర్లకు పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్లు), విదేశాల్లో లిస్టింగ్పై కసరత్తు చేస్తున్న రిలయన్స్ డిజిటల్ విభాగానికి ఊతం లభించగలదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత విధానం ప్రకారం భారతీయ సంస్థలు.. ప్రధానంగా అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో విదేశాల్లో లిస్ట్ కావాల్సి ఉంటోంది. ఇన్ఫోసిస్, విప్రో తదితర సంస్థలు ఇదే బాటలో లిస్ట్ అయ్యాయి. విదేశాల్లో లిస్టింగ్ వల్ల భారతీయ కంపెనీలు వివిధ దేశాల్లోని ఎక్సే్చంజీల ద్వారా విదేశీ నిధులను సమకూర్చుకునేందుకు వీలుంటుంది. -
ర్యాలీస్లో రేఖా ఝున్ఝున్వాలా వాటాల విక్రయం
ముంబై: దివంగత ఇన్వెస్ట్మెంట్ గురు రాకేష్ ఝున్ఝున్వాలా సతీమణి రేఖా ఝున్ఝున్వాలా తాజాగా ర్యాలీస్ ఇండియాలో మరో 6.2586 శాతం వాటాలను విక్రయించారు. దీంతో ఇకపై తన దగ్గర 2.278 వాటాలు (సుమారు 44.30 లక్షల షేర్లు) ఉన్నట్లవుతుందని ఆమె స్టాక్ ఎక్సేచంజీలకు తెలియజేశారు. 2013 మార్చి 11 నాటికి తమ వద్ద 2.03 కోట్ల షేర్లు (10.4581 శాతం వాటాలు) ఉన్నట్లు.. అప్పటి నుంచి ఈ ఏడాది జూలై 17 మధ్య తాము 37 లక్షల షేర్లు (1.9446 శాతం) విక్రయించామని పేర్కొన్నారు. జూలై 18 – జూలై 20 మధ్యలో మరో 1.21 కోట్ల షేర్లను (6.2586 శాతం) విక్రయించినట్లు వివరించారు. శుక్రవారం ర్యాలీస్ ఇండియా షేర్లు 1.31 శాతం క్షీణించి సుమారు రూ. 218 వద్ద క్లోజయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,237 కోట్ల ప్రకారం రేఖ వద్ద ప్రస్తుతమున్న వాటాల విలువ సుమారు రూ. 96 కోట్లుగా ఉంటుంది. -
పతంజలి ఫుడ్స్లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్లో ప్రమోటర్ సంస్థ పతంజలి ఆయుర్వేద్ 7 శాతం వాటాను విక్రయించనుంది. కంపెనీలో పబ్లిక్ వాటాను 25 శాతానికి పెంచే బాటలో స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను చేపట్టనున్నట్లు పతంజలి ఫుడ్స్ పేర్కొంది. తద్వారా పతంజలి ఆయుర్వేద్ 2.53 కోట్ల షేర్లను( 7 శాతం వాటా) విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు షేరుకి రూ. 1,000 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు నేడు(13న) ప్రారంభంకానున్న ఓఎఫ్ఎస్ శుక్రవారం(14న) రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రానుంది. వాటా విక్రయం ద్వారా పతంజలి ఆయుర్వేద్ కనీసం రూ. 2,530 కోట్లు అందుకోనుంది. ప్రస్తుతం పతంజలి ఫుడ్స్లో పబ్లిక్కు 19.18 శాతం వాటా ఉంది. కాగా.. డిమాండు ఆధారంగా పతంజలి ఆయుర్వేద్ అదనంగా 2 శాతం వాటా(72.4 లక్షల షేర్లు)ను విక్రయించనుంది. వెరసి 9 శాతం వరకూ వాటాను తగ్గించుకునే యోచనలో ఉంది. ఓఎఫ్ఎస్ వార్తల నేపథ్యంలో పతంజలి ఫుడ్స్ షేరు బీఎస్ఈలో 1.3 శాతం లాభంతో రూ. 1,228 వద్ద ముగిసింది. -
ఆ ఒక్కటి జరిగితే యశస్వి జైస్వాల్ కెరీర్ నెక్స్ట్ లెవెల్ కే..!
-
కోల్ ఇండియా ఆఫర్కు డిమాండ్
న్యూఢిల్లీ: పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)కు తొలి రోజు భారీ డిమాండ్ నెలకొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి గురువారం ఏకంగా రూ. 6,500 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీలో 3 శాతం వాటా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓఎఫ్ఎస్ చేపట్టింది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. గురువారం(1)న సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రారంభమైంది, నేడు(శుక్రవారం) రిటైలర్లకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విండో ఓపెన్ కానుంది. తొలి రోజు ప్రభుత్వం 8.31 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 28.76 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అంటే 3.46 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ లభించింది. ఓఎఫ్ఎస్లో భాగంగా కంపెనీ ఈక్విటీలో 3 శాతం వాటాకు సమానమైన మొత్తం 18.48 కోట్లకుపైగా షేర్లను విక్రయించనుంది. ఆఫర్ ధర ప్రకారం ప్రభుత్వానికి రూ. 4,158 కోట్లు అందనున్నాయి. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2023–24)లో తొలి పీఎస్యూలో డిజిన్వెస్ట్మెంట్కు తెరలేచింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 66.13% వాటా ఉంది. ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం రూ. 51,000 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. ఓఎఫ్ఎస్ నేపథ్యంలో గురువారం కోల్ ఇండియా షేరు బీఎస్ఈలో 4.4 శాతం పతనమై రూ. 231 వద్ద ముగిసింది. బుధవారం ధరతో పోలిస్తే 6.7 శాతం డిస్కౌంట్లో ప్రభుత్వం ఓఎఫ్ఎస్ను ప్రకటించింది. -
ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు!
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు భారీ కానుక ప్రకటించింది. రూ.64 కోట్ల విలువైన షేర్లను కేటాయించింది. ఈ మేరకు 5,11,862 ఈక్విటీ షేర్లను కేటాయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు మే 12న తెలియజేసింది. ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్చువల్ గర్ల్ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! షేర్ల విలువ రూ.64 కోట్లు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం.. 5,11,862 షేర్ల విలువ దాదాపు రూ.64 కోట్లు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తూ 2015 స్టాక్ ఇన్సెంటివ్ కాంపెన్సేషన్ ప్లాన్ కింద 1,04,335 ఈక్విటీ షేర్లు, ఇన్ఫోసిస్ ఎక్స్పాండెడ్ స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రామ్ 2019 కింద 4,07,527 ఈక్విటీ షేర్లను కేటాయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కేటాయింపు తర్వాత కంపెనీ విస్తరించిన షేర్ క్యాపిటల్ రూ.2,074.9 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ ఎక్స్పాండెడ్ స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రాం 2019 కింద పొందిన షేర్లకు సంబంధించి ఎలాంటి లాక్-ఇన్ పీరియడ్ ఉండదు. ఉద్యోగులను ప్రోత్సహించేందుకే.. ఇన్ఫోసిస్ ఎక్స్పాండెడ్ స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రామ్ 2019 ఉద్దేశం ఈ పనితీరు ఆధారిత స్టాక్ గ్రాంట్ ప్రోగ్రామ్ ద్వారా కీలక ప్రతిభను ప్రోత్సహించడం, నిలుపుకోవడం, ఆకర్షించడం. అలాగే కంపెనీలో ఉద్యోగుల యాజమాన్యాన్ని విస్తరించడం. ఇన్ఫోసిస్ ఉద్యోగులందరూ ప్లాన్లో పాల్గొనడానికి అర్హులు. ఈ ప్లాన్ కింద నిరోధిత స్టాక్ యూనిట్ల మంజూరు కోసం ఉద్యోగుల అర్హతను వారి స్థాయి, పనితీరు, ఇతర ప్రమాణాల ఆధారంగా కంపెనీ నిర్ణయిస్తుంది. ఇన్ఫోసిస్ ఎక్స్పాండెడ్ స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రామ్ 2019 కింద ఇవ్వబడిన నిరోధిత స్టాక్ యూనిట్ వెస్టింగ్ వ్యవధి అవార్డు తేదీ నుంచి కనిష్టంగా సంవత్సరం, గరిష్టంగా మూడేళ్ల వరకు ఉంటుంది. ఉద్యోగిని తొలగించినప్పుడు లేదా రాజీనామా చేసిన సందర్భంలో వెస్టింగ్ ప్రమాణాలు సంతృప్తి చెందకపోతే సంబంధిత అవార్డు ఒప్పందం కింద మంజూరు చేసిన నియంత్రిత స్టాక్ యూనిట్లు రద్దు అవుతాయని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు.. బ్యాడ్ న్యూస్ చెప్పిన సత్య నాదెళ్ల -
వయసు 24.. సంపాదన రూ. 100 కోట్లు - అతడే సంకర్ష్ చందా!
ఎవరైనా స్కూలుకెల్లే వయసులో అల్లరి చేస్తారు.. గేమ్స్ ఆడుకుంటారు. ఇవి తప్పా వేరే ఆలోచన కూడా సరిగ్గా ఉండదు. అయితే ఇలాంటి ఆలోచనలకు భిన్నంగా హైదరాబాద్కు చెందిన 'సంకర్ష్ చందా' (Sankarsh Chanda). కేవలం 17 ఏళ్ల వయసులోనే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఈ రోజు కోట్లు సంపాదిస్తున్నాడు. సంకర్ష్ చందా హైదరాబాద్ ఏరియా ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా పూర్తి చేసిన తరువాత 2016లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. రూ. 2000లతో ప్రారంభించి కేవలం రెండేళ్లలో అదనపు పెట్టుబడులు కూడా పెట్టాడు. ఒక సంవత్సరంలో తాను సుమారు రూ. 1.5 లక్షల పెట్టుబడి పెట్టానని, రెండు సంవత్సరాల్లో ఆ షేర్ల విలువ రూ. 13 లక్షలకు చేరిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సంకర్ష్ చందా 2017లో నోయిడాలోని బెన్నెట్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఆ సమయంలో తన చదువుకి స్వస్తి చెప్పి స్టాక్లు, బాండ్లు, ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడులకు సహాయం చేసే ఫిన్టెక్ బిజినెస్ స్టార్ట్ చేశారు. చదువు మానేసి తన మొత్తం దృష్టిని కేవలం దీనిపైనే నిమగ్నం చేశారు. సొంతంగా బిజినెస్ స్టార్ చేసినందుకు 2017లోనే తన 8 లక్షల షేర్లను విక్రయించాడు. స్టార్టప్ల సంపాదించిన సొమ్మును మళ్ళీ పెట్టుబడిగా పెట్టాడు. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే భారీ లాభాలను గడించాడు. తన మొత్తం ఆస్తులు ఇప్పుడు రూ. 100 కోట్లు వరకు ఉంటుందని వెల్లడించినట్లు సమాచారం. ఇది మొత్తం తన మొత్తం స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో పాటు కంపెనీ వ్యాల్యుయేషన్ మీద ఆధారపడి ఉంటుందని అంటున్నాడు. 14 సంవత్సరాల వయసులో ఫాదర్ ఆఫ్ వ్యాల్యూ ఇన్వెస్టింగ్ అని పిలువబడే అమెరికన్ ఆర్థిక వేత్త బెంజిమన్ గ్రాహం కథనం చదివిన తర్వాత స్టాక్ మార్కెట్ మీద ఆసక్తి కలిగిందని, అప్పటి నుంచి ఎక్కువ పుస్తకాలు చదవడం, డబ్బు పట్ల మానవ ప్రవర్తన గురించి తెలుసుకోవడం ప్రారంభించినట్లు సంకర్ష్ చందా చెబుతున్నాడు. (ఇదీ చదవండి: తక్కువ ధరలో లభించే 5జి స్మార్ట్ఫోన్స్ - ఇవి చాలా బెస్ట్..!) తాను చదవడానికి కూడా పుస్తకాలను ఇతరుల వద్ద నుంచి లేదా లైబ్రరీ నుంచి తీసుకుంటానని చెప్పాడు. ఒకవేల నేను సొంతంగా పుస్తకాలను కొంటే వాటిని ఉంచడానికి కనీసం నాకు రెండు, మూడు గదులు కావాల్సి వస్తుంది. దానికి అదనపు డబ్బు కావాల్సి వస్తుంది. అందుకే బుక్స్ కొననని చెప్పాడు. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) బిగ్ బుల్ రాకేష్ ఝున్జున్వాలా అడుగుజాడల్లో నడుస్తూ.. చదువుకు స్వస్తి చెప్పి నిండా పాతికేళ్లు కూడా లేని సంకర్ష్ చందా ఏకంగా వంద కోట్లకంటే ఎక్కువ సంపాదించాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సలహాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఒక్కరోజులో రూ.500 కోట్లు ఆవిరి! భారీగా నష్టపోయిన రుషి సునాక్ భార్య..
బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ భార్, భారతీయ ఐటీ వ్యాపార దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ షేర్ల పతనంతో భారీగా నష్టపోయారు. ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం (ఏప్రిల్ 17) 9.4 శాతం పడిపోయాయి. ఫలితంగా అక్షతా మూర్తి సుమారు రూ. 500 కోట్లు నష్టపోయారు. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. 2020 తర్వాత ఇన్ఫోసిస్ షేర్ల అత్యంత భారీ పతనం ఇదే. ఇన్ఫోసిస్లో అక్షతా మూర్తికి 0.94 శాతం షేర్లు ఉన్నాయి. వీటి విలువ ఇప్పటికీ రూ. 4,586 కోట్లకు పైమాటే. ఆమె షేర్లపై లక్షలాది డివిడెండ్లను సంపాదించారు. ఆమె ఎన్నారై కావడంతో తన ఆదాయంలో ఎక్కువ భాగంపై పన్నులు చెల్లించలేదు. ఇది తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. ఆమె యునైటెడ్ కింగ్డమ్లో పన్నులు చెల్లిస్తానని చెప్పడంతో ఏప్రిల్లో వివాదానికి తెరపడింది. విలాసవంతమైన జీవనాన్ని గడిపే రుషి సునాక్, అక్షతా మూర్తి దంపతులకు లండన్లో 7 మిలియన్ పౌండ్ల విలువైన ఇల్లు ఉంది. అమెరికాలో ఓ ఫ్లాట్ ఉంది. వారు ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కోసం 4 లక్షల డాలర్లు అంటే దాదాపు రూ.3.3 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదీ చదవండి: Air India Salaries: జీతాలు పెంచిన ఎయిర్ ఇండియా.. పైలట్ జీతమెంతో తెలుసా? -
చిన్న షేర్లు కుదేల్!
న్యూఢిల్లీ: చిన్న షేర్లు చితికిపోయాయి. ఒకపక్క ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి తోడు వడ్డీరేట్లకు రెక్కలు రావడం, అధిక ద్రవ్యోల్బణం సెగ వాటికి బాగానే తగిలింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో స్మాల్క్యాప్ సూచీ 1,617 పాయింట్లు (5.73%) దిగజారడం దీనికి నిదర్శనం. ఇదే కా లంలో బీఎస్ఈ సెన్సెక్స్, బ్లూచిప్ షేర్లతో పోలిస్తే చిన్న షేర్ల పతనం భారీగా ఉండటం గమనార్హం. తీవ్ర ఒడిదుడుకులు... 2022–23 ఏడాది భారత స్టాక్ మార్కెట్లను తీవ్రంగానే కుదిపేసింది. ప్రధానంగా తొలి క్వార్టర్లో ఉక్రెయిన్పై రష్యా దండయాత్రతో దేశీ సూచీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయని.. అయితే, రెండు, మూడు త్రైమాసికాల్లో తిరిగి పుంజుకోగలిగాయని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. అయితే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో పాటు ధరాభారం, అధిక వడ్డీరేట్ల వల్ల చిన్న షేర్లపై ఇన్వెస్టర్ల ఆసక్తి సన్నగిల్లిందని వారు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఒక్క రోజు మాత్రమే ఉన్న నేపథ్యంలో, గడిచిన ఏడాది కాలాన్ని చూస్తే... మిడ్ క్యాప్ సూచీ 1.12 శాతం (270 పాయింట్లు) మాత్రమే తగ్గగా, సెన్సెక్స్ 1.03 శాతం (608 పాయింట్లు) పడింది. ‘‘ధరల కట్టడే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులన్నీ వడ్డీరేట్లను జోరుగా పెంచడం మొదలుపెట్టాయి. దీంతో ఇన్వెస్టర్లు రిస్క్ తగ్గించుకోవడంపై దృష్టిపెట్టడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది‘‘ అని మార్కెట్స్మోజో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సునీల్ దమానియా విశ్లేషించారు. కాగా, 2021–22లో మార్కెట్లు దుమ్మురేపడంతో స్మాల్ క్యాప్ సూచీ ఏకంగా 36.64 శాతం దూసుకెళ్లడం తెలిసిందే. ఇదే బాటలో మిడ్క్యాప్స్ 19.45 శాతం సెన్సెక్స్ 18.29 శాతం చొప్పున బలపడ్డాయి. ఏడాది తిరిగేసరికి చిన్న షేర్లు మళ్లీ వేగంగా కరిగిపోవడం గమనార్హం. ప్రధానంగా వడ్డీరేట్ల పెరుగుదలతో చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు వడ్డీభారం పెరగడం వల్ల పెద్ద కంపెనీలతో పోలిస్తే అధిక ప్రభావం కనబడుతోందని దమానీ పేర్కొన్నారు. చిన్న షేర్లకు దూరం... ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఇన్వెస్టర్లు చిన్న షేర్లను అధిక రిస్క్తో కూడినవిగా పరిగణిస్తున్నారని స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు. దీంతో వీటిలో పెట్టుబడులకు వెనుకాడటంతో పాటు తమ సొమ్మును వేగంగా వెనక్కి తీసుకోవడం వల్ల స్మాల్క్యాప్ సూచీ మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా పడిందన్నారు. ఫెడ్ భారీగా వడ్డీరేట్లను పెంచడం, ఉక్రెయిన్ యుద్ధం, అధిక ద్రవ్యోల్బణంతో మాంద్యం భయాలు నెలకొన్న కారణంగా గడిచిన ఏడాది కాలం మన మార్కెట్లు గడ్డు పరిస్థితులను చవిచూశాయని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అర్విందర్ సింగ్ నందా పేర్కొన్నారు. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) తిరోగమనం, అదానీ గ్రూప్ స్టాక్స్లో ఎడాపెడా అమ్మకాల వంటి అనేక అంశాలు కూడా మన మార్కెట్ ప్రతికూల పనితీరుకు కారణమని నందా అభిప్రాయపడ్డారు. -
బ్లాక్ కంపెనీని టార్గెట్ చేసిన హిండెన్బర్గ్.. జాక్ డార్సీకి షాక్!
న్యూఢిల్లీ: షార్ట్సెల్లింగ్ రిపోర్టుతో అదానీ గ్రూప్ను అతలాకుతలం చేసిన అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ తాజాగా మరో కంపెనీని టార్గెట్ చేసుకుంది. ఈసారి ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డార్సీకి చెందిన చెల్లింపుల కంపెనీ బ్లాక్ను లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్టర్లను బ్లాక్ తప్పుదోవ పట్టించిందంటూ నివేదికను ప్రచురించింది. 1 బిలియన్ డాలర్ల పైగా మోసానికి పాల్పడిందంటూ ఆరోపించింది. దాదాపు రెండేళ్ల పరిశోధన తర్వాత ఈ రిపోర్టును రూపొదించినట్లు పేర్కొంది. ఈ నివేదికతో అమెరికా మార్కెట్లో బ్లాక్ షేర్లు ఒక దశలో 20 శాతం పైగా క్షీణించి 58 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్బర్గ్ ఈ ఏడాది జనవరిలో ఆరోపించడం, ఫలితంగా అదానీ సంస్థల షేర్లు భారీగా పతనం కావడం తెలిసిందే. అంతకు ముందు 2020లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ నికోలా కార్పొరేషన్పై కూడా హిండెన్బర్గ్ పలు ఆరోపణలు చేసింది. దీనితో ఆ కంపెనీ షేరు పతనం కావడంతో పాటు సంస్థ వ్యవస్థాపకుడు ట్రెవర్ మిల్టన్పై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. -
స్టార్టప్లలో మహిళల హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతంలో పురుషులకు మాత్రమే పరిమితమైన దేశీ స్టార్టప్ రంగంలో ఇప్పుడు మహిళలు దూసుకెళుతున్నారు. కొంగొత్త ఆవిష్కరణలతో అంకుర సంస్థలను విజయవంతంగా నడిపిస్తున్నారు. టెక్నాలజీ, ఈ–కామర్స్, ఫైనాన్స్ తదితర రంగాల్లో రాణిస్తున్నారు. మహిళల సారథ్యంలోని నైకా, జివామి, షీరోస్ వంటి పలు విజయవంతమైన అంకుర సంస్థలు ఇందుకు నిదర్శనం. ఫల్గుణీ నాయర్ నేతృత్వంలోని ఫ్యాషన్ ప్రొడక్ట్స్ సంస్థ నైకా... సంచలన స్థాయిలో స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయ్యింది. ఇన్వెస్టర్లు భారీగా ఎగబడి మరీ షేర్లు కొన్నారు. ఇక అంతకన్నా ముందు .. దాదాపు నలభై ఏళ్ల క్రితం రజని బెక్టర్ ఏర్పాటు చేసిన బేకరీ ఉత్పత్తుల సంస్థ మిసెస్ బెక్టర్స్ లిస్టింగ్కు వస్తే ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పట్టారు. ఇలాంటి సానుకూల స్పందన ఊతంతో మరిన్ని స్టార్టప్లు కూడా లిస్టింగ్ బాట పడుతున్నాయి. గజల్ అలగ్ సహ–వ్యవస్థాపకురాలిగా ఉన్న ఆరోగ్య ఉత్పత్తుల సంస్థ మామాఎర్త్ కూడా తాజాగా ఐపీవో యత్నాల్లో ఉంది. ఇలా పలు అంకుర సంస్థలు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మహిళలకు అవసరమైన ఉత్పత్తులు, సర్విసులను అందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టేవిగా ఉంటున్నాయి. 2014లో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు సహా దేశీయంగా మహిళల సారథ్యంలోని స్టార్టప్ల సంఖ్య .. మొత్తం అంకుర సంస్థల్లో 8 శాతంగా ఉండేది. ప్రస్తుతం ఇది దాదాపు 14 శాతానికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పురుషుల సారథ్యంలోని అంకుర సంస్థలతో పోలిస్తే మహిళల నేతృత్వంలోని స్టార్టప్లు 2.5 రెట్లు ఎక్కువగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాయని, పెట్టుబడులపై 35 శాతం అధికంగా రాబడులు అందించగలుగుతున్నాయని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. లక్ష్యంపైనే గురి.. వ్యాపారాన్ని ప్రారంభించడమంటే అనేక సవాళ్లతో కూడుకున్న వ్యవహారం కావడంతో పాటు మిగతా వర్గాల నుంచి సహకారం లభించడం కూడా కీలకం. వ్యాపారం ప్రారంభించడానికి ముందే టార్గెట్ మార్కెట్, పోటీ, తాము అందించే సర్వీసులు, ఉత్పత్తుల ప్రత్యేకత వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని స్పేస్మంత్ర వ్యవస్థాపకురాలు నిధి అగర్వాల్ పేర్కొన్నారు. మహిళా ఎంట్రప్రెన్యూర్లు మరింత తరచుగా తమ నిర్ణయాలను ప్రశ్నించుకుంటూ ముందుకు సాగాల్సి వస్తుందని టెరావిటా వ్యవస్థాపకురాలు రాహీ అంబానీ తెలిపారు. అయితే, ఒడిదుడుకులను అధిగమించి, లక్ష్యంపైనే దృష్టి పెడితే విజయం సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వాల తోడ్పాటు.. స్టార్టప్ రంగంలోనూ మహిళలు రాణించేలా ప్రభుత్వాలు, వివిధ సంస్థలు తోడ్పాటు అందిస్తుండటం కూడా వారికి సహాయకరంగా ఉంటోంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్, స్టాండప్ ఇండియా వంటి స్కీములు స్టార్టప్లకు అండగా ఉంటున్నాయి. నిధులపరంగాను, ఇతరత్రా సహాయాన్ని అందించేందుకు యాక్సిలరేటర్లు, ఇన్క్యుబేటర్లు మొదలైనవి ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ నుంచి యాక్సెలరేట్హర్ 2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెజాన్ వెబ్ సర్విసెస్ (ఏడబ్ల్యూఎస్), ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ లైట్స్పీడ్ కలిసి యాక్సెలరేట్హర్ 2023 పేరిట ప్రత్యేక ప్రోగ్రాంను ఆవిష్కరించాయి. ప్రారంభ స్థాయి దేశీ స్టార్టప్ల మహిళా వ్యవస్థాపకులు తమ సంస్థలను నిర్మించుకునేందుకు, వృద్ధిలోకి తెచ్చుకునేందుకు, విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దుకునేందుకు అవసరమైన తోడ్పాటు దీని ద్వారా పొందవచ్చు. ఈ ఆరు వారాల యాక్సిలరేషన్ ప్రోగ్రామ్నకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏడబ్ల్యూఎస్ ఇండియా హెడ్ (స్టార్టప్ ఎకోసిస్టమ్) అమితాబ్ నాగ్పాల్ తెలిపారు. దీనికి ఎంపికైన స్టార్టప్లు నిధుల సమీకరణ, సాంకేతిక అంశాలపరమైన మద్దతు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. కనీస లాభదాయకత ఉత్పత్తి కలిగి ఉండి, మూడు మిలియన్ డాలర్ల కన్నా తక్కువ నిధులను సమీకరించిన స్టార్టప్లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫండ్ మేనేజర్లలో 10 శాతమే.. గడిచిన కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో మహిళల మేనేజర్ల సంఖ్య పెరుగుతున్నా ఇప్పటికీ అది సుమారు 10% స్థాయిలోనే ఉన్నట్లు మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా వార్షిక నివేదిక పేర్కొంది. దీని ప్రకారం మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య గతేడాది 32గా ఉండగా ప్రస్తుతం 42కి పెరిగింది. అదే సమయంలో మొత్తం ఫండ్ మేనేజర్ల సంఖ్య 399 నుంచి 428కి చేరింది. వీరిలో 42 మంది మహిళలు.. ఫండ్స్ను ప్రైమరీ లేదా సెకండరీ మేనేజర్లుగా నిర్వహిస్తున్నారు. 2017లో 18 మందికి పరిమితమైన ఫండ్ మేనేజర్ల సంఖ్య ఆ తర్వాత నుంచి క్రమంగా పెరిగినట్లు మార్నింగ్స్టార్ పేర్కొంది. ప్రస్తుతం 24 ఫండ్ సంస్థల్లో 42 మంది మహిళా మేనేజర్లు ఉన్నారు. మహిళా మాసంగా మార్చి .. ఐసీఐసీఐ లాంబార్డ్ ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మహిళలకు సాధికారత కల్పించే ప్రయత్నాల్లో భాగంగా మార్చి నెలను మహిళా మాసంగా పాటిస్తున్నట్లు ప్రైవేట్ రంగ బీమా సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ వెల్లడించింది. ఈ సందర్భంగా కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్లను అందిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ (ముందుగా వచ్చిన వారికి) ప్రాతిపదికన 10,000 మంది మహిళలకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వివరించింది. దీని కింద థైరాయిడ్ ప్రొఫైల్, విటమిన్ డీ, బీ12 తదితర టెస్టులను నిర్వహిస్తారు. అలాగే మహిళా మోటరిస్టులకు కాంప్లిమెంటరీగా రోడ్సైడ్ అసిస్టెన్స్ సర్వీసులు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇక మహిళా ఎంట్రప్రెన్యూర్íÙప్ను ప్రోత్సహించే దిశగా మహిళా ఏజెంట్లను రిక్రూట్ చేసుకునేందుకు, అవగాహన కల్పించేందుకు సమగ్ర శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు కంపెనీ ఈడీ సంజీవ్ మంత్రి పేర్కొన్నారు. మహిళల కోసం సిగ్నిటీ ప్రత్యేక కార్యక్రమాలు టెక్నాలజీ రంగంలో మహిళలకు తోడ్పాటునిచ్చే దిశగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిగ్నిటీ టెక్నాలజీస్ సంస్థ వెల్లడించింది. మార్చి 9న ’ఉమెన్ ఇన్ టెక్ రౌండ్టేబుల్’ వర్చువల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. పలు మహిళా దిగ్గజాలు పాల్గొనే ఈ చర్చాగోష్టికి సంస్థ ఎస్వీపీ శిరీష పెయ్యేటి సారథ్యం వహిస్తారు. అలాగే, మహిళలు కొత్త విషయాలను నేర్చుకునేలా, అనుభవజ్ఞులు నుంచి సలహాలు పొందేలా వెసులుబాటు కల్పించే దిశగా ’హర్డిజిటల్స్టోరీ’ పేరిట ప్రత్యేక ఫ్రేమ్వర్క్ను రూపొందిస్తున్నట్లు సిగ్నిటీ పేర్కొంది. ఇక కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీతో కలిసి పనిచేస్తున్నట్లు, ’ప్రాజెక్ట్ సిగ్నిఫికెన్స్’ పేరిట 100 మంది గ్రామీణ ప్రాంత మహిళలకు డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ కల్పిస్తున్నట్లు వివరించింది. -
నియంత్రణ సంస్థల సేవలు ప్రశ్నార్థకం
ఆర్థికపరమైన అవకతవకలపై తిరుగులేని అధికారాలు చలాయిస్తున్న నియంత్రణా సంస్థగా ‘సెబీ’కి పేరుంది. కానీ వివిధ ప్రభుత్వాల పాలనా కాలాల్లో అది మౌనం పాటించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలపై పారదర్శకతను నెలకొల్పడమే స్వతంత్ర రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు ఉద్దేశం. అలాంటిది స్వయం నియంత్రణా సంస్థలే తమ విధులను సంతృప్తికరంగా నిర్వహించడం లేదనే అభిప్రాయం ఎందుకు ఏర్పడుతోంది? ఈ రెగ్యులేటరీ కమిషన్లను స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వం తరపున పనిచేసేలా మార్చేశారు. ఎంపిక కమిటీలు సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పదవీ విరమణ చేసిన పాలనాధికారులతో కూడి ఉంటున్నాయి. ఇలాంటి ఆచరణ చట్టబద్ధమైన స్వతంత్ర రెగ్యులేటరీల అసలు ఉద్దేశానికి వ్యతిరేకం. ప్రపంచంలోనే అత్యున్నత అధికారం చలాయిస్తున్న నియంత్రణా సంస్థల్లో మన ‘సెబీ’ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఒకటి. ఆర్థిక పరమైన అవకతవకలపై శోధన, స్వాధీనం, దాడులు, అరెస్టులకు సంబంధించి తిరుగులేని అధికారాలను సెబీ కలిగి ఉంటోంది. అనుమానాస్పదమైన ట్రేడింగ్ కార్యకలాపాలను, రియల్ టైమ్ ప్రాతిపదికన షేర్ల విలువను తారు మారు చేయడాన్ని పసిగట్టడంలో సెబీకి విస్తృత మైన నిఘా వ్యవస్థ తోడుగా ఉంటోంది. అయిన ప్పటికీ విభిన్న రాజకీయ పాలనా కాలాల్లో ఈ రెగ్యులేటరీ సంస్థ మౌనం పాటిస్తూ వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా, సెబీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం పనిచేస్తూ వచ్చింది. ప్రత్యేకించి యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రె సివ్ అలయెన్స్) రెండో పాలనా కాలంలో ఇది కొట్టొచ్చినట్లు కనబడుతుంది. లేదా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)లో కో– లొకేషన్ (కోలో) స్కామ్ విషయంలో కానీ, సత్యం కుంభకోణంలో కానీ సెబీ కార్యకలాపాలు ఎలాంటి పబ్లిక్ లేదా రాజకీయ తనిఖీ రాడార్లో లేకుండా కొనసాగుతూ వచ్చాయి. ఇటీవలే ఇలాంటి ప్రశ్నలను పార్లమెంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ప్రతిభావంతంగా లేవనెత్తారు. గత రెండేళ్లలో స్టాక్ మార్కెట్లో కొన్ని కంపెనీల విలువ అమాంతంగా పెరిగిపోవడంపై ఆమె ప్రశ్నలు సంధించారు. కానీ సెబీ మాత్రం ఈ విషయంలో కనీస అధ్యయనం కూడా చేయనట్లు కనిపిస్తోంది. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ రూ. 20,000 కోట్ల విలువైన అత్యంత భారీ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)ని ఒక కంపెనీ ప్రతిపాదించడాన్ని సెబీ ఎలా అనుమతించిందంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సరిగ్గానే ప్రశ్నించారు (అయితే ఆ ప్రతిపాద నను తర్వాత ఉపసంహ రించుకున్నారు.) ఆర్థిక అవకతవకలపై అత్యంత క్రియాశీలకంగా ఉండే రెగ్యులేటరీ సంస్థ సెబీ తన విశ్వసనీయత ప్రశ్నార్థకమైన సమయంలో, తన గమనింపునకు వచ్చి నప్పుడు ఈ విషయమై పరిశీలిస్తానంటూ ముభావంగా స్పందించిందే తప్ప అంతకుమించిన విచారణ జరపలేదు. ఎందుకు విచారించలేదనే కీలక ప్రశ్నకు కూడా ఇప్పటికీ అది సమాధాన మివ్వడం లేదు. చర్యలు తీసుకున్న దాఖలా లేదు సెబీ నిద్రపోతోందంటూ సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో, భారతదేశంలో రెగ్యులేటరీ వ్యవస్థ ఎందుకు విఫలమవుతోందన్న అంశంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ నిర్ణయాలపై పారదర్శకతను నెలకొల్ప డమే స్వతంత్ర రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు ఉద్దేశం. సరళీకరణ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున బొగ్గు, భూమి, విద్యుత్, టెలి కమ్యూనికేషన్లు, స్పెక్ట్రమ్, పెట్రోలయం, సహజ వాయువు, స్టాక్ మార్కెట్లు, పెన్షన్ నిధులు– వీటి నిర్వహణ, విమానాశ్రయాలు వగైరా ఎన్నో అంశాలు రెగ్యురేటరీ పరిశీలనా చట్రం పరిధిలోకి వచ్చాయి. అయితే ట్రాయ్(టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లాంటిది కేవలం సిఫార్సులు మాత్రమే చేయగలిగే అధికారం కలిగివుంటోంది. మరోవైపు విద్యుత్ కమిషన్లు తమ సేవల మార్కెట్లపై అధికారం చలాయించడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. సెబీ, కాంపిటీషన్ కమి షన్ ఆఫ్ ఇండియా వంటి కొన్ని కేసులలో తప్పితే నిబంధనలు పాటించకపోవడంపై చర్యలు తీసు కునే శిక్షాత్మక అధికారాలు ఇప్పటికీ బలహీనంగానే ఉంటున్నాయి. స్వయం నియంత్రణా సంస్థలు తమ విధు లను సంతృప్తికరంగా నిర్వహించడం లేదనే అభి ప్రాయం ఎందుకు ఏర్పడుతోంది? చాలావరకు ఈ రెగ్యులేటరీ సంస్థలే అక్రమాలకు పాల్పడుతున్నా యనే ఆరోపణలు ఉంటున్నాయి. నిబంధనలను అతిక్రమించే సభ్యులకు వ్యతిరేకంగా ఐసీఏఐ (ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) లేదా ఎమ్సీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) వంటి ప్రొఫెషనల్ సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఇక క్రీడా సంస్థల విషయానికి వస్తే అవి జీవితకాలం పదవుల్లో ఉండే వ్యక్తులతో కూడుకుని ఉంటు న్నాయి. పైగా వీటి ఆర్థిక సమగ్రతపై సందేహాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపున ప్రభుత్వం నియమించిన చట్టబద్ధమైన నియంత్రణాధికార సంస్థలు కూడా లోపరహితమైన స్థాయికి చేరలేక పోతున్నాయి. విద్యుత్, టెలీ కమ్యూనికేషన్లు,కాంపిటీషన్, సెక్యూరిటీల విషయంలో సంబంధిత కమిషన్ల ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీల్స్ వంటివి అప్పీలేట్ ట్రిబ్యునల్స్కి వెళుతున్నాయి తప్ప నేరుగా హైకోర్టుల ముందుకు వెళ్లడం లేదు. దీని వల్ల జాప్యం జరగడమే కాకుండా కమిషన్ అసలు ఉద్దేశాన్ని పలుచన చేస్తున్నాయి. డిప్యుటేషన్ మరో సమస్య ప్రభుత్వ విభాగాలు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అనేక ఉదంతాల్లో రెగ్యులేటరీ కమిషన్లను స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వం తరపున పనిచేసేలా మార్చేశారు. రెగ్యు లేటరీ సంస్థల ఛైర్మన్, సభ్యుల ఎంపిక ప్రక్రియ దీనికి ఒక కారణం కావచ్చు. ఎంపిక కమిటీలు సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పదవీ విరమణ చేసిన పాలనాధికారులతో కూడి ఉంటు న్నాయి. ఇలాంటి ఆచరణ చట్టబద్ధమైన స్వతంత్ర రెగ్యులేటరీల అసలు ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉంటోంది. ఇలాంటి విభాగాల్లో నియమితులైన వారిని నాటుకుపోయిన ప్రభుత్వ విధేయ సంస్కృతి నుంచి బయటపడవేయలేరా? చాలావరకు రెగ్యులేటరీ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది ప్రభుత్వ ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్ పై వచ్చినవారు. వీరు రెగ్యులేషన్ లో తమకు కెరీర్ ఉందని భావించడం లేదు. అలా భావించే కొద్దిమందే ఈ విభాగాల సభ్యులుగానూ లేదా ఛైర్మన్లుగానూ ఎదుగుతున్నారు. ఈ తరహా రెగ్యులేటరీ విభాగాలు మరొక ప్రభుత్వ సంస్థలానే తరచుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ఈ విభాగాలలోని కీలక స్థానాలు పదవీ విరమణ చేసిన బ్యూరోక్రాట్లకు, ప్రభుత్వ అధికారులకు పదవీ విరమణ అనంతరం దక్కించుకునే హోదాలుగా మారిపోయాయి. దీని ఫలితంగా పెద్దగా స్వాతంత్య్రం లేకపోవడం, సంబంధిత రంగాల నియంత్రణాధికారుల్లో సాహసం లేక విజ్ఞానం లేకపోవడం జరుగుతోంది. ప్రభుత్వ ప్రతిష్ఠ పైన మాత్రమే కాకుండా, భారత వృద్ధి గాథపై కూడా ఇది ప్రభావం చూపుతున్నందు వలన, దేశంలోని రెగ్యులేటరీ సంస్థల విశ్వస నీయతను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్న మైంది. నీలూ వ్యాస్ వ్యాసకర్త సీనియర్ టీవీ యాంకర్,కన్సల్టింగ్ ఎడిటర్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
పేటీఎంపై సునీల్ మిట్టల్ కన్ను!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్.. డిజిటల్ చెల్లింపుల సేవల్లోని పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆసక్తితో ఉన్నట్టు తెలిసింది. ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్.. పేమెంట్స్ బ్యాంక్ను పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో విలీనం చేయడం ద్వారా వాటా పొందాలనుకుంటున్నట్టు.. అలాగే, పేటీఎంలో ప్రస్తుతం వాటాలు ఉన్న ఇతరుల నుంచి కొంత కొనుగోలు చేసేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. పేమెంట్ బ్యాంకుల్లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లాభాలతో నడుస్తోంది. కానీ, పేటీఎం మాత్రం నష్టాల్లో ఉన్న కంపెనీ. కాకపోతే గతేడాది రూ.2,150 ఐపీవో జారీ ధరతో పోలిస్తే పేటీఎం షేరు 75 శాతం వరకు నష్టపోయి ట్రేడ్ అవుతోంది. వ్యాల్యూషన్ల పరంగా చౌకగా ఉండడంతో భారతీ ఎయిర్టెల్ సునీల్ మిట్టల్కు ఆసక్తి ఏర్పడినట్టు తెలుస్తోంది. -
Rekha Jhunjhunwala: నాలుగు గంటల్లో రూ.482 కోట్లు..
నాలుగు గంటల్లో రూ.482 కోట్లు ఆర్జించి రికార్డ్ సృష్టించారు రేఖా ఝున్ఝున్వాలా. ఆమె దివంగత ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా సతీమణి. దేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు. ఆమె భర్త కూడా ప్రీ-ఐపీఓ కాలం నుంచి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో పెట్టుబడి పెట్టారు. గతేడాది ఆయన మరణానంతరం స్టార్ హెల్త్తో సహా ఆయనకు సంబంధించిన అన్ని షేర్లు రేఖకు బదిలీ అయ్యాయి. స్టార్ హెల్త్ షేరు ధర సోమవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఇన్ట్రా డే గరిష్ట స్థాయి రూ.556.95ను తాకింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన నాలుగు గంటల్లోనే ఇన్ట్రాడేలో ఒక్కో ఈక్విటీ షేర్ రూ.47.90 పెరిగింది. స్టార్ హెల్త్ షేర్ ధర పెరగడంతో రేఖా ఝున్ఝున్వాలా దాదాపు రూ. 482 కోట్లు ఆర్జించారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టయిన తర్వాత రాకేష్ జున్జున్వాలా రెండింటిలోనూ 10,07,53,935 స్టార్ హెల్త్ షేర్లను కలిగి ఉండేవారు. ఇది కంపెనీ మొత్తం చెల్లింపు మూలధనంలో 17.50 శాతం. ఆ షేర్లన్నీ ఇప్పుడు రేఖా ఝున్జున్వాలా సొంతమయ్యాయి. ఒక్కో షేరుకు రూ.47.90 పెరగడం ద్వారా ఆమె రూ.482 కోట్ల భారీ మొత్తం ఆర్జించిన్లయింది. టాటా కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఆమె ఇటీవల రెండు వారాల్లోనే రూ.1000 కోట్లు సంపాదించారు. రేఖా ఝున్జున్వాలా నికర ఆస్తి విలువ రూ. 47,650 కోట్లుగా అంచనా. (ఇదీ చదవండి: తెలిసిన జాక్మా జాడ! ఎక్కడ ఉన్నాడంటే..) -
పేటీఎమ్లో అలీబాబా వాటా విక్రయం
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్లో మిగిలిన ప్రత్యక్ష వాటాను సైతం చైనీస్ కంపెనీ అలీబాబా తాజాగా విక్రయించింది. పేటీఎమ్ బ్రాండుతో సర్వీసులందించే వన్97లో బ్లాక్డీల్ ద్వారా 3.16 శాతం వాటాను అమ్మివేసినట్లు తెలుస్తోంది. డీల్ విలువ రూ. 1,360 కోట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో అలీబాబాకు పేటీఎమ్లో ప్రత్యక్షంగా ఎలాంటి వాటా మిగల్లేదని తెలియజేశాయి. 2022 డిసెంబర్కల్లా 6.26 శాతం ప్రత్యక్ష వాటాను కలిగి ఉన్న అలీబాబా తొలుత ఈ జనవరిలో 3.1 శాతం వాటాను విక్రయించింది. కాగా.. గ్రూప్ సంస్థ యాంట్(ఏఎన్టీ) ఫైనాన్షియల్ ద్వారా పేటీఎమ్లో 25 శాతం వాటాను అలీబాబా కలిగి ఉన్న సంగతి తెలిసిందే. బ్లాక్డీల్ ద్వారా శుక్రవారం(10న) మొత్తం 2.8 కోట్ల పేటీఎమ్ షేర్లు విక్రయమైనట్లు తెలుస్తోంది. అలీబాబాతోపాటు ఇతరులు సైతం లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రూ. 645–655 ధరలో లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. బ్లాక్డీల్ నేపథ్యంలో పేటీఎమ్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 8% పతనమై రూ. 651 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 640 వరకూ క్షీణించింది. -
అయ్యయ్యో గూగుల్ బార్డ్ ఎంత పనిచేసింది: 100 బిలియన్ డాలర్లు మటాష్!
సాక్షి,ముంబై: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్కు భారీ షాక్ తగిలింది. ఆదిలోనే హంసపాదు అన్నట్టు చిన్న పొరపాటుకు బిలియన్ డాలర్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్కు చెందిన చాట్బాట్ ‘చాట్జీపీటీ’కి పోటీగా ‘బార్డ్’ను రంగంలోకి దింపిన గూగుల్కు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ప్రకటించిన చాట్బాట్ బార్డ్కు సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్లో భారీ తప్పిదం కారణంగా గూగుల్ మాతృసంస్థ ఆల్పాబెట్ షేర్ ధర బుధవారం భారీ ఒడిదుడుకులకు లోనైంది. అమెరికా ఎక్స్ఛేంజీలలో ఆల్ఫాబెట్ షేర్లు 8 శాతం కుప్పకూలింది. ఫలితంగా గూగుల్ ఒక్క రోజులోనే ఏకంగా 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మేర మార్కెట్ విలువను కోల్పోయింది. రాయిటర్స్ తొలుత ‘బార్డ్’ యాడ్లోని తప్పిదాన్ని గుర్తించింది. సౌరవ్యవస్థ వెలుపలి గ్రహాల చిత్రాలను తొలిసారిగా ఏశాటిలైట్ తీసిందన్న ప్రశ్నకు బార్డ్ సరైన సమాధానం ఇవ్వడంలో తప్పులో కాలేసింది. "జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని సమాధానం చెప్పింది. కానీ నాసా ధృవీకరించినట్లుగా, 2004లో యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ వెరీ లార్జ్ టెలిస్కోప్ (VLT) ద్వారా ఎక్సోప్లానెట్ల తొలి చిత్రాలను తీసింది. బార్డ్కు సంబంధించి గూగుల్ ట్విటర్లో పోస్ట్ చేసిన చిన్న GIF వీడియోను "లాంచ్ప్యాడ్"గా అభివర్ణించింది. ఈ షార్ట్ వీడియోలోనే ఈ పొరపాటు దొర్లింది. మరోవైపు మైక్రోసాఫ్ట్ చాట్జీపీటీతో దూసుకు రావడంతో గూగుల్ బార్డ్ వైపు ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా ఉన్నారని, ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని, మార్కెట్ గూగుల్కు భారీ శిక్ష విదించిందని ట్రిపుల్ డి ట్రేడింగ్ మార్కెట్ నిర్మాణ విశ్లేషకుడు డెన్నిస్ డిక్ వ్యాఖ్యానించారు. గూగుల్ గత కొన్నివారాలుగా సెర్చ్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హడావిడిగా ఇచ్చిన డెమో సమయంలో తప్పు సమాధానాన్ని పోస్ట్ చేయడం ఇబ్బందికరమైన గందరగోళానికి తీసిందని సీనియర్ సాఫ్ట్వేర్ విశ్లేషకుడు గిల్ లూరియా అన్నారు. -
హిండెన్బర్గ్ వివాదం: అదానీ గ్రూపు ప్రమోటర్స్ సంచలన నిర్ణయం
సాక్షి,ముంబై: అదానీ గ్రూప్- హిండెన్బర్గ్ వివాదం తరువాత మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 2024నాటికి చెల్లించాల్సిన ప్లెడ్జ్ షేర్ల రిలీజ్ కోసం భారీ మొత్తాన్ని ముందుగానే చెల్లించనుంది. 1.1 బిలియన్ డాలర్లను చెల్లించనుంది. ఈమేరకు కంపెనీ ఒక ప్రకటన జారీ చేసింది. (ఇదీ చదవండి: అదానీ-హిండెన్బర్గ్: అదానీకి మరోషాక్! ఆ ప్రమాదం ఎక్కువే?) ఇటీవలి మార్కెట్ అస్థిరత దృష్ట్యా, అదానీ లిస్టెడ్ కంపెనీల షేర్ల మద్దతుతో మొత్తం ప్రమోటర్ పరపతిని తగ్గించడానికి ప్రమోటర్ల నిబద్ధత కొనసాగింపులో, మెచ్యూరిటీ కంటే ముందే 1,114 మిలియన డాలర్ల ప్రీ-పే మొత్తాలను చెల్లించనున్నామని ప్రకటించింది. ముందస్తు చెల్లింపులో భాగంగా ప్రమోటర్ హోల్డింగ్లో 12 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ల 168.27 మిలియన్ షేర్లు విడుదల చేయనుంది. అదానీ గ్రీన్ విషయానికొస్తే, ప్రమోటర్ హోల్డింగ్లో 3 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 27.56 మిలియన్ షేర్లను రిలీజ్ చేయనుంది. అలాగే, ప్రమోటర్ హోల్డింగ్లో 1.4 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అదానీ ట్రాన్స్మిషన్లోని 11.77 మిలియన్ షేర్లను రిలీజ్ చేయనుంది. కాగా అదానీ గ్రీన్ స్క్రిప్ వరుగా నాలుగో సెషన్లోనూ సోమవారం నాడు 5శాతం పడి లోయర్ సర్క్యూట్ అయింది. గత నెలతో పోలిస్తే సగానికి పైగా కోల్పోయింది. అదానీ గ్రూపు గత కొన్ని దశాబ్దాలుగా స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలు పాల్పడిందనే ఆరోపణలతో ఆమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టు మార్కెట్లో ప్రకంపనలు రేపింది. దాదాపు 10 లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీలు భారీ నష్టాన్ని చవిచూశాయి. అయితే అదానీ గ్రూప్ హిండెన్బర్గ్ వాదనలను నిరాధారమైనదని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. (ఇదీ చదవండి: Tech layoffs మరో టాప్ కంపెనీ నుంచి 6650 ఉద్యోగులు ఔట్!) -
Adani Group issue: ‘అదానీ’పై అదే రగడ
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలు, తద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల పతనం కారణంగా తలెత్తిన పరిస్థితులపై పార్లమెంట్లో వెంటనే చర్చ ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఏకతాటిపైకి వచ్చిన విపక్ష సభ్యుల ఆందోళనతో శుక్రవారం లోక్సభ, రాజ్యసభ స్తంభించాయి. మిగతా సభా కార్యకలాపాలను పక్కనపెట్టి హిండెన్బర్గ్ నివేదికపై చర్చించాల్సిందేనంటూ ప్రతిపక్షాలన్నీ పట్టుబట్టడంతో వరుసగా రెండోరోజు కూడా ఎలాంటి చర్చలు లేకుండానే ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం సమావేశాలకు ముందే తీసుకున్న సంయుక్త నిర్ణయం 15 పార్టీలు వాయిదా తీర్మానాలిచ్చాయి. లోక్సభ ఆరంభమై ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన వెంటనే విపక్ష ఎంపీలు హిండెన్బర్గ్ నివేదికపై చర్చకు పట్టుబడుతూ ఆందోళనకు దిగారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకురావడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. విచారణ జరిపించాల్సిందే... అదానీ గ్రూప్ పట్ల వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) లేదా సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్తో విచారణ జరిపించాలని విపక్షాలు పునరుద్ఘాటించాయి. అత్యంత కీలకమైన ఈ అంశంపై చర్చకు అంగీకరించకపోవడం ఏమిటని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చర్చించే దాకా పట్టు! పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మోదీ సర్కారుపై దాడిని మరింత తీవ్రతరం చేయాలని విపక్షాలు నిర్ణయించాయి. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాంబర్లో 16 ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం ఉదయం సమావేశమయ్యాయి. ఈ భేటీలో కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ, ఆప్, బీఆర్ఎస్, శివసేన, ఆర్జేడీ, జేడీ(యూ), సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోస్ మణి), కేరళ కాంగ్రెస్ (థామస్), ఆరెస్పీ ఇందులో ఉన్నాయి. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ అవకతవకలపై సభలో చర్చ జరిగేదాకా పట్టుబట్టాల్సిందేనని పార్టీలన్నీ ఏకగ్రీవంగా నిర్ణయించాయి. దాంతోపాటు అదానీ గ్రూప్ అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సంయుక్త పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తుకు కేంద్రం అంగీకరించేదాకా ఉభయ సభల్లోనూ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశాయి. అదానీ అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిందే. అప్పుడు మాత్రమే వాటిలో ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, ఎస్బీఐ పెట్టుబడులకు భద్రత’’ అని భేటీ అనంతరం కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మీడియాతో అన్నారు. అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టేలా ప్రధాని మోదీయే వాటిపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున ఆర్థిక, అకౌంటింగ్ అవకతవకలకు పాల్పడిందంటూ న్యూయార్క్కు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల దెబ్బకు గ్రూప్ విలువ చూస్తుండగానే ఏకంగా 100 బిలియన్ డాలర్ల మేరకు పడిపోయింది. -
నియంత్రణ సంస్థలు పక్కాగా ఉన్నాయి
న్యూఢిల్లీ: భారత నియంత్రణ సంస్థలు ఎంతో కచ్చితత్వంతో, కఠినంగా పనిచేస్తుంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లలో నెలకొన్న పరిణామాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో అనిశ్చితికి దారితీశాయా? అంటూ గౌతమ్ అదానీ గ్రూప్ షేర్ల పతనం గురించి ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. దశాబ్దాలుగా ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని చెబుతూ.. నియంత్రణ సంస్థలు మన మార్కెట్ను చక్కని, సరైన స్థితిలో నిలబెట్టినట్టు పేర్కొన్నారు. ముందున్నట్టే భారత్ ఇక మీదటా చక్కని నియంత్రణలతో కూడిన ఫైనాన్షియల్ మార్కెట్గా కొనసాగుతుందన్నారు. ‘‘అంతర్జాతీయంగా ఎక్కువగా చర్చించుకుంటున్న ఓ సంఘటన భారత మార్కెట్లు ఎంత గొప్పగా నిర్వహించబడతాయనే దానికి నిదర్శనం కాబోదు’’అని మంత్రి పేర్కొన్నారు. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ అదానీ గ్రూపు కంపెనీలు, షేర్లపై ఆరోపణలతో ఓ నివేదిక విడుదల చేయడం తెలిసిందే. ఈ నివేదిక తర్వాత అదానీ గ్రూపు కంపెనీలు ఈ వారంలో ఊహించని విధంగా భారీ నష్టాలు చూశాయి. దీంతో ఆర్థిక మంత్రి దీనిపై స్పష్టత ఇచ్చారు. మెరుగ్గా బ్యాంకింగ్ వ్యవస్థ భారత బ్యాంకింగ్ వ్యవస్థ నేడు ఎంతో సౌకర్యంగా ఉందని మంత్రి సీతారామన్ స్పష్టం చేశారు. నికర నిరర్థక రుణాలు (ఎన్పీఏలు) చాలా కనిష్ట స్థాయికి దిగొచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేబినెట్ ఆమోదం పొందిన పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణను ముందుకు తీసుకెళతామని ప్రకటించారు. -
అదానీ గ్రూప్ షేర్ల పతనం.. ఇదంతా జస్ట్ టీ కప్పులో తుఫాను..
న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక పరిస్థితుల కోణంలో చూస్తే అదానీ గ్రూప్ షేర్ల పతనంతో స్టాక్ మార్కెట్లో నెలకొన్న అల్లకల్లోలం అంతా ’టీ కప్పులో తుఫాను’లాంటిదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ వ్యాఖ్యానించారు. స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోను కావడం సర్వసాధారణమేనని, దీని గురించి ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగు చర్యలు తీసుకునేందుకు స్వతంత్ర నియంత్రణ సంస్థలు ఉన్నాయని ఆయన చెప్పారు. అలాగే గ్రూప్ కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకులు, బీమా సంస్థలపై ప్రభావాల గురించి స్పందిస్తూ .. దేశీ ఆర్థిక సంస్థలు పటిష్టంగానే ఉన్నాయని సోమనాథన్ స్పష్టం చేశారు. పెట్టుబడులకు తగిన పరిస్థితులు కల్పించడం, ఆర్థిక మార్కెట్ల నియంత్రణ పటిష్టంగా .. పారదర్శకంగా ఉండేలా చూడటం వంటి అంశాల గురించే ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగం పటిష్టం: ఆర్బీఐ అదానీ గ్రూప్నకు రుణాలిచ్చిన బ్యాంకుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ గ్రూప్ పేరును ప్రస్తావించకుండా .. దేశీ బ్యాంకింగ్ రంగం పటిష్టంగా, స్థిరంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఆర్థిక స్థిరత్వాన్ని పాటించే క్రమం ్డలో .. ఒక నియంత్రణ సంస్థగా బ్యాంకుల పరిస్థితిని ఆర్బీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. భారీ రుణాల విషయంలో బ్యాంకులు కూడా నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నాయని పేర్కొంది. డో జోన్స్ సూచీల నుంచి ఏఈఎల్ తొలగింపు.. అకౌంటింగ్ మోసాల ఆరోపణలతో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తమ సస్టెయినబిలిటీ సూచీల నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ను తొలగించనున్నట్లు ఎస్అండ్పీ డోజోన్స్ తెలిపింది. ఫిబ్రవరి 7 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్టుతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుప్పకూలడం, రూ. 20,000 కోట్ల భారీ ఎఫ్పీవోను అదానీ ఎంటర్ప్రైజెస్ ఉపసంహరించడం తెలిసిందే. నిధుల సమీకరణ కష్టతరం.. గ్రూప్ కంపెనీల షేర్ల భారీ పతనం కారణంగా అదానీ గ్రూప్ తదుపరి నిధుల సమీకరణపై ప్రతికూల ప్రభావం పడొచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరించింది. ఇటీవలి పరిణామాలతో తాము రేటింగ్ ఇచ్చే గ్రూప్ సంస్థల ఆర్థిక పరిస్థితులను సమీక్షించినట్లు పేర్కొంది. దీర్ఘకాలిక కాంట్రాక్టులు, మార్కెట్లో ఆధిపత్యం తదితర అంశాలపరంగా అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్లకు తాము రేటింగ్ ఇచ్చినట్లు వివరించింది. మరోవైపు, అదానీ సంస్థల రుణ పరపతిపై తాజా అంశాల తక్షణ ప్రభావమేమీ ఉండబోదని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అటు, అదానీ పోర్ట్స్, అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థల రేటింగ్స్ను స్థిర స్థాయి నుంచి నెగటివ్ స్థాయికి ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ కుదించింది. రేటింగ్స్ ఇచ్చేటప్పుడు తాము పరిగణనలోకి తీసుకున్న రిస్కులపై ఇన్వెస్టర్లలో మరింత ఎక్కువ ఆందోళన ఉండవచ్చని లేదా ప్రతికూల సెంటిమెంటు కారణంగా గ్రూప్ నిధుల సమీకరణ వ్యయాలు మరింతగా పెరగవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. షేర్లపై రుణాలేమీ ఇవ్వలేదు: ఎస్బీఐ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లపై రుణాలేమీ ఇవ్వలేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేశ్ ఖరా తెలిపారు. రుణాలతో పాటు లెటర్స్ ఆఫ్ క్రెడిట్, పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల రూపంలో ఎస్బీఐ ఇచ్చినది సుమారు రూ. 27,000 కోట్ల ఉంటుందని, ఇది తమ మొత్తం పద్దుల్లో 0.88 శాతం మాత్రమేనని ఆయన చెప్పారు. రీపేమెంటులో అదానీ గ్రూప్నకు మంచి రికార్డే ఉందని, వడ్డీల చెల్లింపులో సమస్యలెదుర్కొనే పరిస్థితి ఉంటుందని భావించడం ఆయన చెప్పారు. అదానీ గ్రూప్నకు ఇచ్చిన రుణాలను గత రెండేళ్లలో క్రమంగా తగ్గించుకున్నామని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఎండీ సంజీవ్ చడ్ఢా చెప్పారు. ప్రస్తుతమున్న వాటికి సంబంధించి కూడా అసెట్ క్వాలిటీపరంగా ఆందోళనేమీ లేదని వివరించారు. మరోవైపు, భారతీయ చట్టాలకు అనుగుణంగానే అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసినట్లు ఫ్రాన్స్కి చెందిన టోటల్ఎనర్జీస్ ఎస్ఈ తెలిపింది. ఇటీవలి పరిణామాల కారణంగా వీటినేమీ పునఃసమీక్షించలేదని పేర్కొంది. టోటల్ఎనర్జీస్కు అదానీ టోటల్ గ్యాస్లో 37.4 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 19.75 శాతం వాటాలు ఉన్నాయి. -
అదానీ గ్రూప్ షేర్లు విలవిల.. ఒక్క వారంలో రూ.7.44 లక్షల కోట్లు ఆవిరి!
అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు అదానీ గ్రూప్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫిబ్రవరి 2న అదానీ స్టాక్ల విక్రయాలు అధికం కావడంతో కొన్ని అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు వాటి సంబంధిత లోయర్ సర్క్యూట్లకు పడిపోయాయి. ఈ ప్రకంపనలు నేపథ్యంలో గత వారం నుంచి అదానీ గ్రూప్ మార్కెట్ విలువలో దాదాపు రూ.7.44 లక్షల కోట్లు నష్టపోయింది. సిటీ గ్రూప్ ఇంక్ (Citigroup Inc.) మార్జిన్ లోన్ల కోసం అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల సెక్యూరిటీలను తాకట్టుగా స్వీకరించడాన్ని కూడా నిలిపివేసిందని బ్లూమ్బెర్గ్ నుంచి నివేదికలు వెలువడ్డాయి. దీనిని అనుసరించి అదానీ గ్రూప్ స్టాక్లపై చీకటి మేఘాలు చుట్టుముట్టాయి. దానికి తోడు, అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 20,000 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ను ఆశ్చర్యకరంగా ఉపసంహరించుకుంటున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 1 గంటకు అదానీ గ్రూప్లోని కొన్ని కంపెనీల షేర్ల పరిస్థితి ఈ పరిణామాలు అదానీ సంస్థల షేర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఫిబ్రవరి 2న ఉదయం 11.43 గంటలకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 8.53 శాతం తగ్గి రూ.1,957.25 వద్ద ట్రేడవుతుండగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇతర అదానీ గ్రూప్ స్టాక్స్ - అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డిటివి కూడా వాటి సంబంధిత లోయర్ సర్క్యూట్లలోకి చేరుకున్నాయి. చదవండి: వ్యాపారం చేయాలనుకునేవారికి శుభవార్త.. ఇకపై అది ఒక్కటి చాలు! -
వేదాంత లాభం క్షీణత
న్యూఢిల్లీ: మెటల్, మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 41 శాతం క్షీణించి రూ. 2,464 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,164 కోట్లు ఆర్జించింది. పెరిగిన ముడివ్యయాలు, విండ్ఫాల్ ట్యాక్స్ లాభాలను ప్రభావితం చేశాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 12.5 చొప్పున నాలుగో మధ్యంతర డివిడెండును ప్రకటించింది. అల్యూమినియం, కాపర్, ఆయిల్గ్యాస్ కార్యకాలాపాల కోసం 91 మెగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్, 600 మెగావాట్ల సౌర విద్యుత్ను పొందేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ తెలిపింది. ఆదాయం అప్ ప్రస్తుత సమీక్షా కాలంలో వేదాంతా మొత్తం ఆదాయం రూ. 34,674 కోట్ల నుంచి రూ. 34,818 కోట్లకు స్వల్పంగా బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 26,777 కోట్ల నుంచి 31,327 కోట్లకు భారీగా ఎగశాయి. 2022 జూలెలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విండ్ఫాల్ ట్యాక్స్ కారణంగా రూ. 333 కోట్ల ప్రభావం పడినట్లు కంపెనీ వెల్లడించింది. జింక్ ఇంటర్నేషనల్ ఆస్తులను రూ. 2,981 కోట్ల విలువలో హిందుస్తాన్ జింక్కు విక్రయించనున్నట్లు పేర్కొంది. క్యూ3లో తరుగుదల, అమార్టైజేషన్ పద్దు 4 శాతం పెరిగి రూ. 2,720 కోట్లుగా నమోదైంది. 2022 డిసెంబర్ 31కల్లా స్థూల రుణభారం రూ. 61,550 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం నష్టంతో రూ. 320 వద్ద ముగిసింది. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
అదానీ షేర్ల పతనం, లక్షల కోట్లు ఢమాల్, ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన
సాక్షి, ముంబై: అదానీ గ్రూపుపై తీవ్ర ఆరోపణలు స్టాక్మార్కెట్ను కుదిపేశాయి. హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికను విడుదల నివేదికను విడుదల చేసిన తర్వాత స్టాక్ మార్కెట్లో కంపెనీలు 8 శాతం వరకు నష్టపోయిన రెండు రోజుల తర్వాత శుక్రవారం కూడా అదానీ షేర్లలో మరింత అమ్మకాలు వెల్లు వెత్తాయి. మొత్తం తొమ్మిది లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మళ్లీ ఒత్తిడికి గురయ్యాయి. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్ అవర్స్లో గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో దాదాపు రూ. 2 లక్షల కోట్లకుపైగా కోల్పోయింది. దీంతో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా కుప్పకూలగా, నిఫ్టీ 333 పాయింట్లు పతనమైంది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. కలకలం రేపుతున్న ఈ వివాదం నేపథ్యంలోని ఈ పతనం ఏ మేరకు కొనసాగుతుందనే ఆందోళన నెలకొంది. అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 20 శాతం మేర భారీ పతనాన్ని నమోదు చేసింది. మరో ముఖ్యమైన అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 13.5 శాతం క్షీణించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్ మిషన్ 12 శాతానికి పైగా పడిపోయాయి. ఇంకా అంబుజా సిమెంట్, ఏసీసీ 6 శాతానికి పైగా పతనమవగా, అదానీ పవర్, అదానీ విల్మార్ షేర్లు 5 శాతం చొప్పున క్షీణించాయి. Our response to Adani: pic.twitter.com/6NcFKR8gEL — Hindenburg Research (@HindenburgRes) January 26, 2023 హిండెన్బర్గ్ ప్రతి సవాల్ మరోవైపు హిండెన్బర్గ్ రీసెర్చ్పై దావా వేయనున్నట్టు అదానీ ప్రకటించింది. అవన్నీ తప్పుడు వార్తలు తప్పుడు సమాచారరమని కొట్టి పారేసింది. భారతీయ చట్టాల క్రింద సంబంధిత నిబంధనలను పరిశీలిస్తున్నామని అదానీ లీగల్ గ్రూప్ హెడ్ జతిన్ జలంధ్వాలా ఒక ప్రకటనలో తెలిపారు. అయితే తమ నివేదికకు కట్టుబడి ఉన్నామని హిండెన్బర్గ్ రీసెర్చ్ స్పష్టం చేసింది. తమ వద్ద సుదీర్ఘ పత్రాల జాబితా ఉందని హిండెన్బర్గ్ రీసెర్చ్ ట్విటర్లో తెలిపింది. అటు అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై ఆర్బీఐ, సెబీ సమగ్ర దర్యాప్తు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్, మనీలాండరింగ్ చేసిందంటూ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపుపై జనవరి 24, మంగళవారం అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదిక ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఇలా జరుగుతుందని ఎలాన్ మస్క్ అస్సలు ఊహించి ఉండడు
సాక్షి, బిజినెస్ డెస్క్ : అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా షేరు ఏడాది క్రితం దాకా బ్రేకుల్లేని బండిలా రివ్వున దూసుకెళ్లిపోయింది. కంపెనీ బాసు ఎలాన్ మస్క్ను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి స్థానంలో కూర్చోబెట్టింది. కానీ ఇప్పుడదే షేరు ఏకంగా 70 శాతం పడిపోయి .. నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలో మస్క్ సంపదా భారీగా హరించుకుపోయింది. చరిత్రలోనే అత్యంత వేగంగా భారీ సంపదను పోగొట్టుకున్న కుబేరుడిగా రికార్డును కూడా మూటగట్టుకున్నారు. ముచ్చట పడి, పంతం పట్టి కొనుక్కున్న ట్విటర్కే సమయం అంతా వెచ్చిస్తూ టెస్లాను మస్క్ పట్టించుకోకపోతూ ఉండటమే ఇన్ని అనర్ధాలకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. అయితే, అదొక్కటే కాకుండా టెస్లాకు మార్కెట్లో పోటీ పెరిగిపోతుండటం, డిమాండ్ తగ్గుతుండటం, కంపెనీపై ఇన్వెస్టర్లకు నమ్మకం సడలుతుండటం మొదలైనవి మరికొన్ని కారణాలని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఇదంతా ఒక దశ మాత్రమేనని, మళ్లీ పుంజుకునే సామర్థ్యాలు టెస్లాకు పుష్కలంగా ఉన్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ట్విటర్తో కష్టాలు.. మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్ను కొనడంతోనే అటు టెస్లాకు ఇటు మస్క్కు కష్టాలు వచ్చాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ట్విటర్ను 44 బిలియన్ డాలర్లకు కొంటానంటూ గతేడాది ఏప్రిల్లో ప్రకటించిన మస్క్, బోలెడంత ఊగిసలాట తర్వాత అక్టోబర్లో ఎట్టకేలకు కొన్నారు. డీల్ గురించి ప్రకటించిన దగ్గర్నుంచి ఆయన 23 బిలియన్ డాలర్ల విలువ చేసే టెస్లా షేర్లను అమ్మేశారు. ట్విటర్ను కొన్నప్పటి నుంచి గరిష్టంగా దానికే సమయాన్ని వెచ్చిస్తున్నారని, టెస్లాను పట్టించుకోవడం లేదనే అభిప్రాయంతో మిగతా షేర్హోల్డర్లూ అదే బాట పట్టారు. ఇవన్నీ కంపెనీ షేరుపై ప్రతికూల ప్రభావం చూపాయన్న అభిప్రాయం ఉంది. డిమాండ్ డౌన్.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ప్రత్యర్థి సంస్థల నుంచి పోటీ కారణంగా టెస్లా కార్లకు డిమాండ్ బలహీనపడుతోంది. కంపెనీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా టెస్లా తొలిసారిగా డిస్కౌంట్లు ఆఫర్ చేయడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ముందు 3,750 డాలర్ల డిస్కౌంటు ఇస్తామని ప్రకటించిన టెస్లా.. మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆ తర్వాత దాన్ని ఏకంగా 7,500 డాలర్లకు పెంచింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో పోటీ పెరుగుతున్న క్రమంలో కీలకమైన చైనా, అమెరికా మార్కెట్లలో డిమాండ్ బలహీనపడుతుండటం టెస్లాకు అర్థమవుతోంది కాబట్టే ఇలా డిస్కౌంట్ల బాట పడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ఇదే కాకుండా అమెరికా ఎకానమీ ఈ ఏడాది మాంద్యంలోకి జారుకుంటుందని, కార్లకు డిమాండ్ పడిపోతుందని వస్తున్న వార్తలూ టెస్లాకు ప్రతికూలంగా ఉంటున్నాయి. అంతేకాకుండా ఫోక్స్వ్యాగన్, ఫోర్డ్, జీఎం, హ్యుందాయ్ వంటి దిగ్గజాలు బిలియన్ల కొద్దీ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తూ టెస్లాకు దీటుగా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను దింపేందుకు కసరత్తు చేస్తుండటమూ కంపెనీకి సవాలుగా మారుతోంది. కీలకమైన అమెరికా ఈవీ మార్కెట్లో టెస్లా వాటా 2020లో 79% కాగా గతేడాది తొలి 9 నెలల్లో 65%కి పడిపోయింది. 2025 నాటికి ఇది 20% దిగువకు పడిపోవచ్చని ఎస్అండ్పీ గ్లోబల్ మొబిలిటీ అంచనా. వేల్యుయేషన్లపై సందేహాలు.. అమ్మకాలు అంతంతే అయినా అసాధారణంగా ట్రిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో ట్రేడ్ అవడం టెస్లాకు క్రమంగా ప్రతికూలంగా మారింది. ఒక దశలో టెస్లా వేల్యుయేషన్.. ప్రపంచంలోనే టాప్ 12 భారీ ఆటో దిగ్గజాలన్నింటినీ మించి పలికింది. కానీ వాటి అమ్మకాలతో పోలిస్తే టెస్లా విక్రయాలు తూగడం లేదు. ఇదంతా మార్కెట్కు అవగతమయ్యే కొద్దీ కంపెనీ వేల్యుయేషన్ ట్రిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుతం దాదాపు 400 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతే గాకుండా మస్క్ చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండకపోతుండటం కూడా ఇన్వెస్టర్లలో అపనమ్మకం కలిగిస్తోంది. ఏదేదో చేసేస్తున్నానంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసే మస్క్ .. వాటిని ఆచరణలో మాత్రం చూపడం లేదంటూ విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు దాదాపు నాలుగేళ్ల క్రితం ఆవిష్కరించిన సైబర్ట్రక్ ఉత్పత్తి 2021లో మొదలుపెడతామని మస్క్ చెప్పినప్పటికీ ఈ ఏడాది వరకూ వాయిదా పడుతూ వచ్చింది. 2024లో గానీ పూర్తి స్థాయిలో తయారీ పుంజుకోదు. ఫోర్డ్, రివియన్ లాంటి కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ పికప్లను అమ్మేస్తుండగా టెస్లా ఎప్పటికి పుంజుకుంటుందనేది సందేహంగా మారింది. సంపద సృష్టిలోనూ.. కోల్పోవడంలోనూ రికార్డే! టెస్లా షేరు 2021 ఆఖర్లో దాదాపు 409 డాలర్ల రికార్డు స్థాయిని తాకింది. దానికి అనుగుణంగానే అందులో సుమారు 21 శాతం వాటాలున్న కంపెనీ చీఫ్ మస్క్ 320 బిలియన్ డాలర్ల సంపదతో సంపన్నుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో నంబర్ వన్గా ఉండేవారు. అయితే, గట్టిగా ఏడాది తిరిగేసరికి టెస్లా షేరు 123 డాలర్లకు పడిపోయింది. మస్క్– ట్విటర్ డీల్ నేపథ్యంలో గత మూడు నెలల్లో భారీగా పతనమైంది. వెరసి 2022 మొత్తం మీద దాదాపు 65 శాతం క్షీణించింది. దానికి తగ్గట్లే కంపెనీలో 13.4 శాతం (ప్రస్తుతం) వాటాలు ఉన్న మస్క్ సంపద కూడా ఏకంగా 188 బిలియన్ డాలర్ల మేర పడిపోయింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం మస్క్ సంపద విలువ 132 బిలియన్ డాలర్లు. ఇంత స్వల్ప కాలంలో ఇంత భారీగా సంపద కోల్పోవడంలో మస్క్ రికార్డు సృష్టించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ రికార్డు జపాన్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ అధినేత మసయోషి సన్ పేరిట ఉండేది. 2000 ఐటీ బబుల్ బరస్ట్ అయినప్పుడు ఆయన ఏకంగా 58.6 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. -
సెర్బియా కంపెనీలో సోనాకు వాటాలు
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల తయారీ సంస్థ సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ (సోనా కామ్స్టార్) తాజాగా సెర్బియాకు చెందిన నోవెలిక్లో 54 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 40.5 మిలియన్ యూరోలు (సుమారు రూ. 356 కోట్లు). అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) సెన్సార్స్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఆటోమోటివ్ పరిశ్రమలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఈ విభాగం 2030 నాటికి 43 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. వాటాల కొనుగోలు డీల్ 2023 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని సోనా కామ్స్టార్ ఎడీ వివేక్ విక్రమ్ సింగ్ తెలిపారు. తదుపరి దశ వృద్ధి కోసం సోనాతో భాగస్వామ్యం ఉపయోగపడగలదని నోవెలిక్ సహ వ్యవస్థాపకుడు వెల్కో మిహాయ్లోవిక్ చెప్పారు. గతేడాది నోవెలిక్ ఆదాయం 9.3 మిలియన్ యూరోలుగా ఉండగా, లాభం 2.5 మిలియన్ యూరోలుగా నమోదైంది. -
సెర్బియా కంపెనీలో సోనాకు వాటాలు
ఆటో విడిభాగాల తయారీ సంస్థ సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ (సోనా కామ్స్టార్) తాజాగా సెర్బియాకు చెందిన నోవెలిక్లో 54 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 40.5 మిలియన్ యూరోలు (సుమారు రూ. 356 కోట్లు). అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) సెన్సార్స్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఆటోమోటివ్ పరిశ్రమలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఈ విభాగం 2030 నాటికి 43 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. వాటాల కొనుగోలు డీల్ 2023 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని సోనా కామ్స్టార్ ఎడీ వివేక్ విక్రమ్ సింగ్ తెలిపారు. తదుపరి దశ వృద్ధి కోసం సోనాతో భాగస్వామ్యం ఉపయోగపడగలదని నోవెలిక్ సహ వ్యవస్థాపకుడు వెల్కో మిహాయ్లోవిక్ చెప్పారు. గతేడాది నోవెలిక్ ఆదాయం 9.3 మిలియన్ యూరోలుగా ఉండగా, లాభం 2.5 మిలియన్ యూరోలుగా నమోదైంది. చదవండి: సిబిల్ స్కోరు గురించి ఈ విషయాలు తెలియక.. తిప్పలు పడుతున్న ప్రజలు! -
సెన్సెక్స్.. బౌన్స్బ్యాక్
ముంబై: గ్లోబల్ మార్కెట్ల సానుకూలతలు, ఇన్వెస్టర్ల మూకుమ్మడి కొనుగోళ్లతో దేశీ స్టాక్ మార్కెట్లు కదం తొక్కాయి. వెరసి మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ క్యూ3 ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఐటీ కౌంటర్లకు డిమాండ్ పుట్టింది. ముందురోజు నాస్డాక్ (యూఎస్) జోరందుకోవడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చింది. సెన్సెక్స్ 847 పాయింట్లు జంప్ చేసింది. 60,747 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 242 పాయింట్లు ఎగసి 18,101 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 989 పాయింట్లు దూసుకెళ్లి 60,889ను తాకింది. నేటి ట్రేడింగ్లో ఆసియా, యూరోపియన్ మార్కెట్లలో సానుకూల ట్రెండ్ నెలకొంది. దీంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వేతన వృద్ధి మందగించడం, సర్వీసుల రంగం బలహీనపడటంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు వేగానికి కళ్లెం పడనున్నట్లు అంచనాలు పెరిగాయి. డాలరుతో మారకంలో రూపాయి 31 పైసలు బలపడింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 82.35 వద్ద ముగిసింది. మూడు మాత్రమే ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్లో మూడు కౌంటర్లు మాత్రమే డీలా పడ్డాయి. ప్రధానంగా హెచ్సీఎల్ టెక్, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్, యాక్సిస్ బ్యాంక్ లాభపడ్డాయి. బ్లూచిప్స్లో కేవలం టైటన్, బజాజ్ ఫిన్సర్వ్, మారుతీ వెనకడుగు వేశాయి. టెక్నాలజీ, ఐటీ 2.6 శాతం జంప్చేయగా.. పవర్, మెటల్, ఎనర్జీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో, ఇండస్ట్రియల్స్ 1.8–1.2 శాతం మధ్య ఎగశాయి. కేవలం కన్జూమర్ డ్యురబుల్స్ నీరసించింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం, సాŠమ్ల్ క్యాప్ 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. గత వారం దిద్దుబాటు తదుపరి గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న సానుకూల ట్రెండ్ దన్నుతో ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్ చేపట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. చదవండి: నాలుగేళ్ల జీతం బోనస్ బొనాంజా: ఈ బంపర్ ఆఫర్ ఎక్కడ? -
సఖాలిన్–1 క్షేత్రాల్లో ఓవీఎల్కు 20 శాతం వాటాలు
న్యూఢిల్లీ: రష్యాలోని సఖాలిన్–1 చమురు, గ్యాస్ క్షేత్రాల్లో తిరిగి 20 శాతం వాటాలను తీసుకున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ విదేశ్ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ఆపరేటర్ అయిన అమెరికన్ సంస్థ ఎక్సాన్మొబిల్ అనుబంధ కంపెనీ ఎక్సాన్ నెఫ్ట్గాజ్ను పక్కకు తప్పించి, దానికి సంబంధించిన అసెట్స్ అన్నింటిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతేడాది కొత్త ఆపరేటర్కు బదలాయించారు. గతంలో తమకున్న వాటాలను తిరిగి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలంటూ అప్పట్లో షేర్హోల్డర్లయిన జపాన్ సంస్థ సోడెకో కన్సార్షియం, ఓవీఎల్కు రష్యా ప్రభుత్వం సూచించింది. దానికి అనుగుణంగానే ఓవీఎల్ దరఖాస్తు చేసుకోగా, తదనుగుణంగా గతంలో దానికి ఉన్నంత వాటాలను కేటాయించింది. సోడెకో కూడా తన వాటాను అట్టే పెట్టుకుంది. అయితే, ఎక్సాన్మొబిల్ విషయంలో స్పష్టత రాలేదు. గతంలో సఖాలిన్1లో ఎక్సాన్ నెఫ్ట్గ్యాస్, సోడెకో సంస్థలకు చెరి 30 శాతం, రాస్నెఫ్ట్కు 20 శాతం వాటాలు ఉండేవి. 2001లో ఓవీఎల్ ఇందులో 20 శాతం వాటాలు తీసుకుంది. గతేడాది అక్టోబర్లో ఈ ప్రాజెక్టును సఖాలిన్–1 లిమిటెడ్ లయబిలిటీ కంపెనీకి రష్యా బదలాయించింది. ఈ కొత్త కంపెనీలో ఓవీఎల్, రాస్నెఫ్ట్కు చెరి 20 శాతం, సోడెకోకు 30 శాతం వాటాలు ఉండగా.. ఎక్సాన్మొబిల్ వాటా విషయంలో ఇంకా ఏమీ తేలలేదు. ఉక్రెయిన్ మీద దాడికి ప్రతిగా రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో గతేడాది ఏప్రిల్లో సఖాలిన్–1 నుంచి ఉత్పత్తిని ఎక్సాన్ నెఫ్ట్గాజ్ నిలిపివేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు సఖాలిన్–1లో రోజుకు 2,20,000 బ్యారెళ్ల (బీపీడీ) చమురు ఉత్పత్తయ్యేది. నవంబర్ నుంచి మళ్లీ 1,40,000–1,50,000 బీపీడీ మేర ఉత్పత్తి మొదలుపెట్టారు. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. 4 రోజుల్లో రూ.15.78 లక్షల కోట్లు ఆవిరి!
ముంబై: కోవిడ్ భయాలకు తోడు తాజాగా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు తెరపైకి రావడంతో శుక్రవారం స్టాక్ సూచీలు కుప్పకూలాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలు సెంటిమెంట్ను మరింత బలహీనపరిచాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ విస్తృత స్థాయిలో మార్కెట్లో అన్ని రంగాలలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 60 వేల స్థాయిని, నిఫ్టీ 18 వేల స్టాయిలను కోల్పోయాయి. మార్కెట్ ముగిసే సెన్సెక్స్ 981 పాయింట్లు క్షీణించి 60 వేల దిగువన 59,845 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 321 పాయింట్లు నష్టపోయి 17,807 వద్ద నిలిచింది. మధ్య, చిన్న తరహా షేర్లలో నెలకొన్న అమ్మకాల సునామీతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.11%, మిడ్క్యాప్ సూచీ 3.40 చొప్పున క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.706 కోట్లు షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,399 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో థాయ్లాండ్ తప్ప అన్ని దేశాల సూచీలు నష్టాల రెండున్నర శాతం వరకు క్షీణించాయి. యూరప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం పతనమయ్యాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు ఒకశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో ఈ వారం సూచీలు భారీగా నష్టపోయాయి. ఈ ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,493 పాయింట్లు, నిఫ్టీ 462 పాయింట్లు కోల్పోయాయి. 4 రోజుల్లో రూ.15.78 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ నాలుగు ట్రేడింగ్ సెషన్లలో 1961 పాయింట్ల(మూడుశాతానికి పైగా) పతనంతో స్టాక్ మార్కెట్లో భారీగా సంపద హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.15.78 లక్షల కోట్లు తగ్గి రూ. 272.12 లక్షల కోట్లకు చేరింది. ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్ల భారీ పతనం ప్రభుత్వరంగ షేర్లలో భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 14%, యూనియన్ బ్యాంక్ 10.57%, సెంట్రల్ బ్యాంక్, యూకో బ్యాంక్ షేర్లు పదిశాతం, మహారాష్ట్ర బ్యాంక్, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 8–7% చొప్పున నష్టపోయాయి. కెనరా బ్యాంక్. పీఎస్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ షేర్లు 5 నుంచి మూడుశాతం పతనమయ్యాయి. ఫలితంగా నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 6.5% నష్టపోయింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► లిస్టింగ్ తొలిరోజే ల్యాండ్మార్క్ కార్స్ షేరు డీలాపడింది. ఇష్యూ ధర (రూ.506)తో పోలిస్తే 7% డిస్కౌంట్తో రూ.471 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 12% క్షీణించి రూ.446 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి పదిశాతం నష్టంతో రూ.456 వద్ద స్థిరపడింది. ► అబాన్స్ హోల్డింగ్స్ కూడా ఇష్యూ ధర (రూ.270)తో పోలిస్తే 1% నష్టంతో ఫ్లాట్గా రూ.273 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ పతనంలో భాగంగా ట్రేడింగ్లో 20% క్షీణించి రూ.216 అప్పర్ సర్క్యూట్ తాకి ముగిసింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్ఫోన్! -
జేసీ ఫ్లవర్స్కు 7 కంపెనీల షేర్లు
న్యూఢిల్లీ: రుణాల రివకరీకి వీలుగా తనఖాకు వచ్చిన 7 కంపెనీల షేర్లను ఆస్తుల పునర్నిర్మాణ సంస్థ(ఏఆర్సీ) జేసీ ఫ్లవర్స్కు బదిలీ చేసినట్లు ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. జాబితాలో డిష్ టీవీ, ఏషియన్ హోటల్స్, అవంతా రియల్టీ తదితరాలున్నట్లు పేర్కొంది. మొత్తం రూ. 48,000 కోట్ల రుణ రికవరీలో భాగంగా తాజా చర్యలు చేపట్టింది. తనఖాకు వచ్చిన డిష్ టీవీ ఇండియాకు చెందిన దాదాపు 44.54 కోట్ల షేర్లు(24.19 శాతం వాటాకు సమానం) జేసీ ఫ్లవర్స్కు బదిలీ చేసినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. పొందిన రుణాలను ఎస్సెల్ గ్రూప్ తిరిగి చెల్లించడంలో విఫలంకావడంతో తాజా చర్యలు తీసుకున్నట్లు వివరించింది. ఇక ఇదే అంశంలో ఏషియన్ హోటల్స్(నార్త్)లో 7.21 శాతానికి సమానమైన 14 లక్షలకుపైగా షేర్లను జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీకి బదిలీ చేసినట్లు తెలియజేసింది. ఈ బాటలో రియల్టీ కంపెనీ అవంతాకు చెందిన 30 శాతం వాటా(10 లక్షలకుపైగా షేర్లు), తులిప్ స్టార్ హోటల్స్కు చెందిన 20.61 శాతం వాటా(9.5 లక్షల షేర్లు), రోజా పవర్ సప్లై కంపెనీకి చెందిన 29.97 శాతం వాటా(12.73 కోట్ల షేర్లకుపైగా), డియాన్ గ్లోబల్కు చెందిన 14.11 శాతం వాటా(45.46 లక్షల షేర్లు), వడ్రాజ్ సిమెంట్కు చెందిన 20 శాతం వాటా(40 కోట్ల షేర్లు) బదిలీ చేసినట్లు వివరించింది. -
రైల్ షేర్ల పరుగు కొనసాగేనా?
ఏడాది కాలంగా రైల్వే రంగ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. ఈ బాటలో అత్యధిక శాతం షేర్లు గత రెండు నెలల్లో 52 వారాల గరిష్టాలకు చేరాయి. మరికొన్ని స్టాక్స్ 2022 జనవరిలో నమోదైన గరిష్టాల నుంచి కొంతమేర వెనకడుగు వేసినప్పటికీ పటిష్టంగా ట్రేడవుతున్నాయి. ఇందుకు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న సార్వత్రిక బడ్జెట్పై అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇతర వివరాలు చూద్దాం.. రైల్వే స్టాక్స్లో కొనసాగుతున్న బుల్ రన్కు కొద్ది రోజుల్లో బ్రేకులు పడవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ఏడాది కాలంగా పలు కౌంటర్లు ర్యాలీ బాటలో సాగుతుండటంవల్ల లాభాల స్వీకరణకు చాన్స్ ఉన్నట్లు భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్పై సానుకూల అంచనాలు రైల్వే రంగ కంపెనీలకు జోష్నిస్తున్నట్లు తెలియజేశారు. బడ్జెట్ ప్రకటనకు ఇక 30–40 రోజులు మాత్రమే మిగిలిఉన్న నేపథ్యంలో రైల్వే కౌంటర్లలో యాక్టివిటీ తిరిగి ఊపందుకోనున్నట్లు పేర్కొన్నారు. అయితే నిజానికి రైల్ షేర్లలో సంస్థాగత ఇ న్వెస్టర్ల పెట్టుబడులు తక్కువగా ఉండటంతో ర్యా లీలో నిలకడ లోపించవచ్చని అభిప్రాయపడ్డారు. అధిక ధరల వద్ద ర్యాలీ కొనసాగేందుకు సంస్థాగత ఇన్వెస్టర్ల ఆసక్తి కీలకమని తెలియజేశారు. వెరసి 2023–24 బడ్జెట్ వెలువడిన తదుపరి రైల్ షేర్లలో దిద్దుబాటు(కరెక్షన్)కు వీలున్నట్లు పేర్కొంటున్నా రు. లాభాల పరుగు రైల్వే సంబంధ కౌంటర్లలో ఆర్వీఎన్ఎల్, టెక్స్మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్, రైట్స్ లిమిటెడ్, ఐఆర్ఎఫ్సీ, టిటాగఢ్ వేగన్స్, ఇర్కాన్ ఇంటర్నేషనల్, రైల్టెల్ కార్పొరేషన్ ఏడాది కాలంగా ర్యాలీ వచ్చింది. ఈ కౌంటర్లు సుమారు 120–100 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఇందుకు కొద్ది నెలలుగా రైల్వేలపై ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలు పెరగడం, షేర్లు అందుబాటు ధరలో లభిస్తుండటం, అధిక డివిడెండ్లు వంటి అంశాలు దోహదపడ్డాయి. చాలా కౌంటర్లు 10 పీఈ స్థాయిలో కదులుతుండటంతో ట్రేడర్లు ఆసక్తి చూపినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీనికితోడు 3–4 శాతం డివిడెండ్ ఈల్డ్ ఆకర్షణను పెంచినట్లు తెలియజేశారు. ఫలితంగా డిఫెన్స్ రంగ స్టాక్స్లో ర్యాలీ తదుపరి రైల్వే రంగ కౌంటర్లలోకి ఇన్వెస్టర్ల చూపు మరలినట్లు విశ్లేషించారు. 38 శాతంతో జోష్ గత బడ్జెట్(2022–23)లో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి వ్యయాల్లో విలువరీత్యా రైల్వే ప్రాజెక్టులకు 38 శాతం కేటాయింపులు చేపట్టడం ర్యాలీకి సహకరించినట్లు నిపుణులు తెలియజేశారు. 2019–20లో 43 శాతం కేటాయింపులను పొందిన రీతిలో రైల్వేకు మళ్లీ ప్రాధాన్యత ఏర్పడటం ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నట్లు వివరించారు. ఈసారి రానున్న బడ్జెట్లో రైల్వేలు స్థూలంగా రూ. 1.5–1.8 లక్షల కోట్ల బడ్జెటరీ మద్దతును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్లో ఇది రూ. 1.37 లక్షల కోట్లుగా నమోదైంది. కొత్తగా 300–400 వందే భారత్ రైళ్లకు తెరలేవనున్న అంచనాలతో ఈసారి రికార్డ్ బడ్జెటరీ మద్దతు లభించవచ్చని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. రానున్న 20–25 ఏళ్లలో కొత్తగా లక్ష కిలోమీటర్ల ట్రాక్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా కొత్త లైన్లకూ కేటాయింపులు పెరగవచ్చని భావిస్తున్నాయి. వెరసి ఈ ప్రణాళికల కారణంగా రైల్వే సరఫరాదారులు, ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కంపెనీలకు భారీ ఆర్డర్లు లభించవచ్చని పేర్కొంటున్నాయి. -
ఇకనైనా మారాలి మస్క్.. ఒక్క రోజులో 63వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి!
ట్విట్టర్కు సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ సీఈవో, టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు మరో భారీ షాక్ ఎదురైంది.ట్విటర్లోని ఊహించని పరిణామాలు, టెస్లాపై ప్రభావం చూపుతున్నాయి. దెబ్బతో మస్క్ సంపద కొవ్వొత్తిలా కరుగుతోంది. ఇటీవల, ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు అనే స్థానం నుంచి కిందకు పడిన సంగతి తెలిసిందే. తాజాగా టెస్లా షేర్లు అమ్మకాలతో మస్క్ సంపదతో మంగళవారం ఒక్క రోజే 7.7 బిలియన్ డాలర్లు ( రూ.63.72 వేల కోట్లు) ఆవిరయ్యాయి. ఈ ఏడాది మస్క్ సంపద 122.6 బిలియన్ డాలర్లు తరిగిపోయింది. ట్విటర్ ఎఫెక్ట్.. టెస్లా పై పడుతోందా? ఏం జరుగుతోందంటే...పలు రేటింగ్ ఏజెన్సీలు తమ ధరల లక్ష్యాలను తగ్గించడంతో టెస్లా షేర్లు మంగళవారం దాదాపు 6 శాతం పడిపోయి రెండేళ్ల కనిష్ట స్థాయి $140.86కి చేరాయి. మరో వైపు మస్క్ దృష్టి ట్విట్టర్ వైపు ఎక్కువగా పోయిందని, ఇది టెస్లాకు హాని కలిగిస్తోందని బ్రోకరేజ్ హౌస్లు నమ్ముతున్నాయి. వీటితో పాటు ట్విటర్కు నిధులను సమకూర్చేందుకు మస్క్ మరిన్ని టెస్లా షేర్లను విక్రయించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి టెస్టా షేర్ల అమ్మకానికి కారణమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. టెస్లా బ్రాండ్ దెబ్బతింటుందని ఇన్వెస్టర్లు భయపడుతున్నారని ఓ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. అదే సమయంలో, మరొక బ్రోకరేజ్ సంస్ధ ట్విట్టర్ కారణంగా మస్క్ పరధ్యానం టెస్లాకు ప్రమాదాన్ని పెంచుతోందని, అందుకే షేర్లు తగ్గుతోందని అభిప్రాయపడింది. ప్రస్తుతం మస్క్ 148 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో 2 వ స్థానంలో ఉన్నారు. 161 బిలియన్ డాలర్లతో బెర్నాల్డ్ ఆర్నాల్డ్ తొలి స్థానంలో, 127 బిలియన్ డాలర్లతో అదానీ మూడో స్థానంలో ఉన్నారు. చదవండి: ఆరేళ్లలో బ్యాంకింగ్ రుణ మాఫీ ఎన్ని లక్షల కోట్లు తెలుసా? -
మూడు వారాల్లో అతిపెద్ద లాభం
ముంబై: బ్యాంకింగ్, ఇంధన, ఎఫ్ఎంసీజీ షేర్లు పరుగులు తీయడంతో స్టాక్ సూచీలు మూడు వారాల్లోనే అతిపెద్ద ఒకరోజు లాభాన్ని సోమవారం నమోదు చేశాయి. యూరప్ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. గతవారంలో నష్టాలను చవిచూసిన సూచీలు ఈ వారం అతి స్వల్ప ఫ్లాట్గా ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆసియా మార్కెట్ల రికవరీ, యూరప్ మార్కెట్ల సానుకూల వార్తలతో సూచీలు రోజంతా పటిష్టమైన లాభాలతో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఉదయం 61,405 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 507 పాయింట్లు బలపడి 61,845 గరిష్టాన్ని తాకింది. చివరికి 468 పాయింట్ల పెరిగి 61,806 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 151 పాయింట్లు ర్యాలీ చేసి 18,420 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 163 పాయింట్లు పెరిగి 18432 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. వచ్చే ఏడాది(2023)లో అమెరికా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) వృద్ధి నెమ్మదించే అవకాశాలు ఉండొచ్చనే అంచనాలతో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అలాగే ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ అరశాతం, స్మాల్ సూచీ 0.30% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.538 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.687 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► కెఫిన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకు తొలిరోజు 55 శాతం స్పందన లభించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ 2.27 కోట్ల షేర్లను జారీ చేయగా, 1.29 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ► గడిచిన నెలరోజుల్లో నైకా విక్రయాలు భారీగా తగ్గిపోవడం ఈ కంపెనీ షేరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. బీఎస్ఈ ఇంట్రాడేలో నాలుగు శాతానికి పైగా పతనమై రూ.158 వద్ద జీవితకాల కనిష్టానికి దిగివచి్చంది. ఆఖరికి మూడుశాతం నష్టంతో రూ.163 వద్ద స్థిరపడింది. -
ఆర్థిక మాంద్యంలోనూ అదరగొట్టిన మల్టీ బ్యాగర్ స్టాక్.. కలలో కూడా ఊహించని లాభం!
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు ఉన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్లోని కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్లు ఈ ఏడాది అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నాయి. మార్కెట్లో అదరగొడుతూ పెట్టుబడిదారులకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం అలాంటి ఒక మల్టీబ్యాగర్ స్టాక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఉక్కు రంగంలో కామధేను లిమిటెడ్ కంపెనీ. కామధేను స్టాక్ను పరిశీలిస్తే, కేవలం ఒకటిన్నర నెలల్లోనే ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలును అందించింది. కేవలం 50 రోజుల్లో 190% రాబడి.. తగ్గేదేలే కామధేను లిమిటెడ్ ఒక చిన్న నుంచి మధ్యస్థ పరిమాణ ఉక్కు కంపెనీ. ఈ స్టాక్ను పరిశీలిస్తే, కేవలం ఒకటిన్నర నెలల్లోనే, పెట్టుబడిదారులకు 190% రాబడిని ఇచ్చింది. అక్టోబర్ 25, 2022, అంటే దీపావళి మరుసటి రోజున, స్టాక్ రూ.129 వద్ద ట్రేడింగ్లో ఉండగా, డిసెంబర్ 15, 2022న నాటికి స్టాక్ రూ.374 వద్ద ట్రేడవుతోంది. దీని ప్రకారం ఒక ఇన్వెస్టర్ అక్టోబర్ 25, 2022న కామధేను షేర్లను కొనుగోలు చేయడానికి రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టుంటే, వాటి ప్రస్తుత విలువ రూ.2.90 లక్షలకు పెరిగింది. అనగా ఇన్వెస్టర్లకు రూ. 1.90 లక్షల రిటర్న్స్ని ఇచ్చింది.దీపావళి నుంచి ఈ స్టాక్ రాకెట్గా దూసుకోపోయింది. అదే సమయంలో, కంపెనీ రెండేళ్లలో 246 శాతం, మూడేళ్లలో 314 శాతం రాబడిని ఇచ్చింది. చదవండి: ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు! -
ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తున్న ప్రముఖ కంపెనీల షేర్లు.. కారణం అదేనా?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి అర్ధభాగంలో అటూఇటుగా పనితీరు చూపిన టైర్ల తయారీ కంపెనీలు ఇకపై పుంజుకోనున్నాయి. ఇందుకు ప్రధానంగా ముడివ్యయాలు తగ్గుతుండటం, డిమాండు ఊపందుకోనుండటం దోహదపడనుంది. వెరసి టైర్ల కంపెనీల షేర్లు ఇకపై జోరందుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. ఇటీవలే ముగిసిన ఈ ఏడాది రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో టైర్ల తయారీ కంపెనీలు మిశ్రమ ఫలితాలు సాధించాయి. అయితే భవిష్యత్లో అమ్మకాలు బలపడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వాహన తయారీ దిగ్గజాల(ఓఈఎం) నుంచి ఆర్డర్లు పెరగడంతోపాటు.. సెకండరీ(రీప్లేస్మెంట్) మార్కెట్ నుంచి టైర్లకు డిమాండు మెరుగుపడుతోంది. ఇది విక్రయాలకు ఊపునివ్వనుంది. ఇవికాకుండా మరోవైపు ముడిచమురు ధరలు దిగిరావడంతో సంబంధిత ముడిసరుకుల వ్యయాలు తగ్గుతున్నాయి. దీనికి నేచురల్ రబ్బర్ ధరలు నీరసించడం జత కలుస్తోంది. అమ్మకాలతో పోలిస్తే టైర్ల తయారీలో ఈ రెండింటి సంబంధ ముడివ్యయాలే 60 శాతాన్ని ఆక్రమిస్తుంటాయి. దీంతో లాభదాయకత మెరుగుపడేందుకు వీలుంటుంది. ముడివ్యయాల ఎఫెక్ట్ త్రైమాసికవారీగా చూస్తే క్యూ2లో సియట్ స్థూల మార్జిన్లను 0.82 శాతం, అపోలో టైర్స్ 0.1 శాతం చొప్పున మెరుగుపరచుకున్నాయి. అయితే మరో దిగ్గజం ఎంఆర్ఎఫ్ మార్జిన్లు మాత్రం 1.8 శాతం నీరసించాయి. భారీగా పెరిగిన ముడివ్యయాల ధరలను కస్టమర్లకు పూర్తిస్థాయిలో బదిలీ చేయకపోవడం ప్రభావం చూపింది. ఎగుమతులపై అధికంగా ఆధారపడే ఆఫ్రోడ్ టైర్ల దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్ స్థూల మార్జిన్లు త్రైమాసికవారీగా 2.2 శాతం క్షీణించాయి. ప్రధానంగా ముడిసరుకులు, రవాణా వ్యయాలు పెరగడంతో టైర్ల పరిశ్రమ వరుసగా నాలుగు త్రైమాసికాలపాటు మార్జిన్ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా తెలియజేసింది. అయితే చమురు డెరివేటివ్స్, రబ్బర్ ధరలు వెనకడుగు వేస్తుండటంతో ఈ ఏడాది ద్వితీయార్థం(అక్టోబర్–మార్చి)లో మార్జిన్లు బలపడవచ్చని అంచనా వేసింది. జులై నుంచి దిగివస్తున్న ముడిచమురు ధరలు మార్చిలో నమోదైన చరిత్రాత్మక గరిష్టం నుంచి 35 శాతం క్షీణించాయి. మరోపక్క ప్రపంచ ఆర్థిక మాంద్య ఆందోళనలతో రబ్బర్ ధరలు సైతం కొన్నేళ్ల కనిష్టాలను తాకుతున్నాయి. కోవిడ్–19 ప్రభావంతో చైనా నుంచి టైర్లకు డిమాండు తగ్గడం ప్రభావం చూపుతోంది. మార్జిన్లకు బలిమి మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ అంచనా ప్రకారం నేచురల్, సింథటిక్ రబ్బర్, కార్బన్ బ్లాక్ ధరలు 10 శాతం తగ్గితే.. నిర్వహణ లాభ మార్జిన్లు 1.6 శాతం, 0.8 శాతం, 1 శాతం చొప్పున బలపడతాయి. కాగా.. యూరోపియన్ మార్కెట్లలో అనిశ్చితుల కారణంగా బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేరు ఇటీవల నీర సించగా.. మార్జిన్ల ప్రభావంతో నెల రోజులుగా ఎంఆర్ఎఫ్ స్టాక్ హెచ్చుతగ్గుల మధ్య అక్కడక్కడే అన్నట్లుగా కదులుతోంది. ఇదే కాలంలో అపోలో టైర్స్, జేకే టైర్స్ సైతం ఒడిదొడుకులు ఎదుర్కోగా గత ఆరు నెలల కాలంలో ఈ రెండు స్టాక్స్ 17–47 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే గత మూడు నెలల్లో సియట్ షేరు 27 శాతం లాభపడటం గమనార్హం! -
జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం
సాక్షి, ముంబై: చైనాకు చెందిన అలీబాబా కంపెనీ అలీపే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో తనకున్న వాటాల నుంచి 3.07 శాతాన్ని (26,28,73,507 షేర్లు) విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల రూపంలోనే ఈ విక్రయం జరిగింది. (జోరుగా ప్యాసింజర్ వాహన విక్రయాలు, టాప్లో ఆ రెండు) కెమాస్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కొనుగోలు చేసిన రూ.608 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన అమ్మకం ద్వారా అలిపే మొత్తం రూ.1,631 కోట్లను ఆర్జించింది.సగటున ఒక్కో షేరు విక్రయం ధరం రూ.62,06గా ఉంది. సెప్టెంబర్ చివరికి జొమాటోలో అలీబాబా గ్రూపునకు 13 శాతం వాటా ఉండగా, విక్రయం తర్వాత కూడా ఇంకా 10 శాతం వాటా మిగిలి ఉంది. సింగపూర్ సావరీన్ వెల్త్ ఫండ్ టెమాసెక్కు చెందిన కెమాస్ ఇన్వెస్ట్మెంట్స్ పీటీఈ 9.80 కోట్ల జొమాటో షేర్లను కొనుగోలు చేసింది. ఇదీ చదవండి: CNN layoffs షాకింగ్: ఉద్యోగులకు ముప్పు నేడో, రేపో నోటీసులు! -
ప్రొటీన్ ఈగవ్ టెక్నాలజీస్ ఐపీవోకు ఆమోదం
న్యూఢిల్లీ: ఐటీ సంబంధిత సేవల్లోని ప్రొటీన్ ఈ గవ్ టెక్నాలజీస్, బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీల ఐపీవోలకు సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ రెండు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) అనుమతి కోరుతూ ఈ ఏడాది ఆగస్ట్ ముందు సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేశాయి. ఈ నెల 15–17 మధ్య సెబీ నుంచి వీటికి అనుమతి (అబ్జర్వేషన్) లభించింది. బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్/ప్రస్తుత వాటాదారుల అమ్మకం) రూపంలో 2,60,00,000 షేర్లను విక్రయించనుంది. అలాగే, రూ.250 కోట్ల విలువైన తా జా షేర్ల జారీ చేయనుంది. ఇందులో రూ.68 కోట్లను రుణాలను చెల్లించేందుకు, రూ.120 కోట్లను మూలధన అవసరాలకు వినియోగించనుంది. ఇక ప్రొటీన్ ఈగవ్ టెక్నాలజీస్ (గతంలో ఎన్ఎస్డీఎల్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో 1.2 కోట్ల ఈక్విటీ షేర్లను ఐపీవోలో భాగంగా వాటాదారులకు విక్రయించనుంది. ఈ ఐపీవోతో కంపెనీకి వచ్చే నిధులు ఏమీ లేవు. ప్రస్తుత వాటాదారులైన యాక్సిస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు తదితర కంపెనీలు వాటాలను విక్రయిస్తాయి. -
ఎన్డీటీవీకి అదానీ ఆఫర్ షురూ
న్యూఢిల్లీ: మీడియా కంపెనీ ఎన్డీటీవీలో అదనపు వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ నేటి(మంగళవారం) నుంచి ప్రారంభంకానుంది. షేరుకి రూ. 294 ధరలో పబ్లిక్ నుంచి 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 493 కోట్లు వెచ్చించనుంది. ఆఫర్ ఈ నెల 22న ప్రారంభమై డిసెంబర్ 5న ముగియనుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ నెల 7న అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్కు అనుమతించింది. దశాబ్దంక్రితం వీసీపీఎల్ అనే సంస్థ ఎన్డీటీవీ వ్యవస్థాపకులకు రూ. 400 కోట్ల రుణాలివ్వడం ద్వారా వారంట్లను పొందింది. వీసీపీఎల్ను సొంతం చేసుకున్న అదానీ గ్రూప్ వీటిని ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు నిర్ణయించింది. తద్వారా న్యూస్గ్రూప్ సంస్థలో 29.18 శాతం వాటాను హస్తగతం చేసుకుంది. ఫలితంగా అక్టోబర్ 17న వాటాదారుల నుంచి 26 శాతం అదనపు వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ను ప్రకటించింది. అయితే సెబీ నుంచి అనుమతులు ఆలస్యంకావడంతో తాజాగా ఇందుకు తెరతీసింది. వెరసి షేరుకి రూ. 294 ధరలో 1.67 కోట్ల ఎన్డీటీవీ ఈక్విటీ షేర్లను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ఆఫర్కు పూర్తి స్పందన లభిస్తే రూ. 492.81 కోట్లు వెచ్చించనుంది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్డీటీవీ షేరు బీఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 382 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే ఓపెన్ ఆఫర్ 23 శాతం తక్కువ! చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
స్టాక్ మార్కెట్: ప్రారంభంలో హుషారు.. చివర్లో నీరసం
ముంబై: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ రోజంతా నష్టాలలోనే కదిలాయి. చివరికి సెన్సెక్స్ 87 పాయింట్లు క్షీణించి 61,663 వద్ద ముగిసింది. నిఫ్టీ 36 పాయింట్లు తక్కువగా 18,308 వద్ద స్థిరపడింది. తొలుత హుషారు చూపిన మార్కెట్లు వెనువెంటనే నీరసించాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో మిడ్ సెషన్కల్లా సెన్సెక్స్ 61,337కు, నిఫ్టీ 18,210 దిగువకు చేరాయి. ఈ వారం ఆటుపోట్ల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో నిలిచాయి. నికరంగా సెన్సెక్స్ 132 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు కోల్పోయాయి. ఆటో బ్లూచిప్స్ వీక్: ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగాలు 1.2–0.6 శాతం మధ్య క్షీణించాయి. అయితే పీఎస్యూ బ్యాంక్స్ 1.5 శాతం ఎగసింది. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, ఐషర్, మారుతీ, సిప్లా, కోల్ ఇండియా, టాటా కన్జూమర్, ఎయిర్టెల్, యూపీఎల్ 2.5–1 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, హెచ్యూఎల్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, కొటక్ బ్యాంక్ 1.2–0.4 శాతం మధ్య బలపడ్డాయి. చిన్న షేర్లూ: మార్కెట్లను మించుతూ మిడ్, స్మాల్ క్యాప్స్ వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,137 నష్టపోగా.. 1,360 లాభపడ్డాయి. చదవండి: QR Code On Cylinders: కేంద్రం సంచలన నిర్ణయం, గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త -
సాఫ్ట్బ్యాంక్.. పేటీఎం వాటా విక్రయం
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్)లో 4.5 శాతం వాటా విక్రయానికి సాఫ్ట్బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది. బ్లాక్డీల్ ద్వారా ఈ వాటాను 20 కోట్ల డాలర్లకు(సుమారు రూ. 1,627 కోట్లు) విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ ద్వారా పేటీఎంలో సాఫ్ట్బ్యాంక్ 17.5 శాతం వాటాను కలిగి ఉంది. తద్వారా అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది. షేరుకి రూ. 555–601.55 ధరల శ్రేణిలో వాటాను విక్రయించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. పేటీఎమ్ ఐపీవో తదుపరి లాకిన్ గడువు ముగియడంతో సాఫ్ట్బ్యాక్ వాటా విక్రయ సన్నాహాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. షేరు పతనం బీఎస్ఈలో పేటీఎం షేరు బుధవారం(16న) 4 శాతం పతనమై రూ. 601.55 వద్ద ముగిసింది. ఈ ధరలో షేర్లను విక్రయిస్తే సాఫ్ట్బ్యాంక్కు 21.5 కోట్ల డాలర్లు లభిస్తాయి. 2017 చివరి త్రైమాసికంలో సాఫ్ట్బ్యాంక్ 160 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. తదుపరి ఐపీవోలో 22 కోట్ల డాలర్ల విలువైన ఈక్విటీని విక్రయించింది. పేటీఎమ్లో ప్రస్తుత సాఫ్ట్బ్యాంక్ వాటా విలువ 83.5 కోట్ల డాలర్లుగా లెక్కతేలుతోంది! చదవండి: భారత్లోని ఉద్యోగులకు ఇవే కావాలట.. సర్వేలో షాకింగ్ విషయాలు! -
’అదానీ–ఎన్డీటీవీ’ ఓపెన్ ఆఫర్కు సెబీ ఓకే
న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్డీటీవీలో అదనంగా 26 శాతం వాటాల కోసం అదానీ గ్రూప్ ప్రతిపాదించిన ఓపెన్ ఆఫర్కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఓపెన్ ఆఫర్ నవంబర్ 22న ప్రారంభమై డిసెంబర్ 5తో ముగియనుంది. షేరు ఒక్కింటికి రూ. 294 రేటుతో ఈ ఆఫర్ పరిమాణం రూ. 492.81 కోట్లుగా ఉండనుంది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులకు దశాబ్దం క్రితం రూ. 400 కోట్ల రుణం ఇచ్చిన విశ్వప్రధాన్ కమర్షియల్ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్ ఎన్డీటీవీలో పరోక్షంగా 29.15 శాతం వాటాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మైనారిటీ షేర్హోల్డర్ల నుండి మరో 26 శాతం వాటాల కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. సోమవారం ఎన్డీటీవీ షేర్లు దాదాపు 2 శాతం పెరిగి బీఎస్ఈలో రూ. 366 వద్ద క్లోజయ్యాయి. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే. -
మార్కెట్లో న్యూఏజ్ టెక్ షేర్ల వెల్లువ.. జాబితాలో పేటీఎం, జొమాటో, నైకా
గత కొద్ది నెలలుగా పబ్లిక్ ఇష్యూలకు వచ్చి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన పలు కొత్తతరం(న్యూఏజ్) టెక్ కంపెనీల షేర్లు కొద్ది రోజులుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇందుకు ఐపీవోకు ముందు కంపెనీలో ఇన్వెస్ట్చేసిన సంస్థల షేర్లపై లాకిన్ గడువు తీరనుండటం కారణమవుతోంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐపీవోకు ముందు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు లేదా 20 శాతానికి మించిన ప్రమోటర్ల వాటాకు లాకిన్ గడువును ఏడాది నుంచి ఆరు నెలలకు కుదించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వివరాలు చూద్దాం.. గతేడాది నవంబర్ మొదలు ఈ ఏడాది మే నెలవరకూ పబ్లిక్ ఇష్యూలకు వచ్చిన పలు న్యూఏజ్, ఫిన్టెక్ కంపెనీలు, స్టార్టప్ల షేర్లకు లాకిన్ గడువు ఈ నెలలో ముగియనుంది. 12 నెలల నుంచి 6 నెలల గడువు తీరనుండటమే దీనికి కారణం. నేటి నుంచి క్యాంపస్ యాక్టివ్వేర్ షేర్లు అందుబాటులోకి రానుండగా.. ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్, రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ షేర్లకు రేపు(10న) లాకిన్ గడువు తీరనుంది. ఈ జాబితాలో ఫినో పేమెంట్స్ బ్యాంక్(12న), పీబీ ఫిన్టెక్(15న), పేటీఎమ్, శాఫైర్ ఫుడ్స్(18న), డెల్హివరీ(24న), టార్సన్ ప్రొడక్ట్స్(26న) పారదీప్ ఫాస్ఫేట్స్(27న), గో ఫ్యాషన్ ఇండియా(30న) తదితరాలున్నాయి. దీంతో ఈ షేర్లు స్టాక్ ఎక్సే్ఛంజీలను తాకనున్నాయి. వెరసి పలు కంపెనీల కౌంటర్లలో అందుబాటులోని ఈక్విటీ ఒక్కసారిగా పెరగనుంది. అయితే నైకా, రెయిన్బో చిల్డ్రన్స్, క్యాంపస్ యాక్టివ్వేర్, శాఫైర్ ఫుడ్స్, గోకలర్స్ తదితర కొన్ని కౌంటర్లు ఐపీవో ధరతో పోలిస్తే భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో లాభాల స్వీకరణకు అవకాశమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఐపీవోకు ముందు ఇన్వెస్ట్చేసిన సంస్థలు ఆయా షేర్లను విక్రయించేందుకు ఆసక్తి చూపేదీ లేనిదీ వేచి చూడవలసి ఉన్నట్లు మరికొందరు అభిప్రాయపడ్డారు. జొమాటో ఎఫెక్ట్ ఈ ఏడాది జులైలో లాకిన్ గడువు ముగిసిన వెంటనే జొమాటో షేర్లు జులైలో 22 శాతం పతనంకావడం గమనార్హం. ప్రీఐపీవో ఇన్వెస్టర్లు ఉబర్, టైగర్ గ్లోబల్ తదితరాలు షేర్లను విక్రయించడం ప్రభావం చూపింది. ఒక అంచనా ప్రకారం 14 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,15,000 కోట్లు) విలువైన షేర్లకు లాకిన్ గడువు తీరనుంది. వీటిలో నైకా 31.9 కోట్ల షేర్లు, పాలసీ బజార్ 2.8 కోట్ల షేర్లు అందుబాటులోకి రానున్నట్లు అంచనా. దీంతో పలు కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే పేటీఎమ్ షేరు ఐపీవో ధరతో పోలిస్తే 70 శాతం పతనంకాగా.. గత నెల రోజుల్లోనే డెల్హివరీ 35 శాతం, పీబీ ఫిన్టెక్ 26 శాతం, ఫినో పేమెంట్స్ బ్యాంక్ 21 శాతం చొప్పున డీలా పడ్డాయి. చదవండి: ‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ! -
టాటా మోటర్స్లో ఎల్ఐసీకి 5 శాతం వాటా
న్యూఢిల్లీ: గడిచిన పది నెలల్లో వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్లో జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వాటాలు 5 శాతానికి పెరిగాయి. స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసిన సమాచారం ప్రకారం గతేడాది డిసెంబర్ 3 నుండి ఈ ఏడాది అక్టోబర్ మధ్య కాలంలో ఎల్ఐసీ తన షేర్లను 16.59 కోట్ల నుంచి 16.62 కోట్లకు (వాటాలు 4.997 శాతం నుంచి 5.004 శాతానికి) పెంచుకుంది. ఇందుకోసం షేరు ఒక్కింటికి సగటున రూ. 455.69 చొప్పున రూ. 11.39 కోట్లు వెచ్చించింది. టాటా మోటర్స్ మార్కెట్ క్యాప్ రూ. 1.38 లక్షల కోట్లుగా ఉంది. నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం ఏదైనా సంస్థలో తమ వాటాలు 5 శాతం దాటితే లిస్టెడ్ కంపెనీలు తప్పనిసరిగా స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేయాలి. మంగళవారం ఎల్ఐసీ షేర్లు స్వల్పంగా పెరిగి రూ. 605 వద్ద, టాటా మోటర్స్ షేర్లు 2 శాతం పెరిగి రూ. 421.50 వద్ద ముగిశాయి. -
విచిత్ర ఆలోచన.. తనను తానే షేర్లుగా అమ్మేసుకున్నాడు
ఏదైనా కంపెనీ పెట్టినప్పుడు కొంత మంది కలిసి తలా ఇంత సొమ్ము సర్దడం, ఆ మేరకు వారందరికీ వాటాలు ఉండటం కామనే. కానీ ఓ వ్యక్తి తనను తానే వాటాలు వేసి అమ్మేసుకుంటే..?డబ్బులిచ్చి వాటాలు తీసుకున్నవారు చెప్పినట్టుగా తన జీవితంలో నిర్ణయాలు తీసుకుంటే..? ఇదేదో చిత్రంగా ఉంది అనిపిస్తోందా.. మరి ఈ కథేమిటో తెలుసుకుందామా.. కంపెనీ ఎందుకు.. తానే ఉండగా..! ఆయన పేరు మైక్ మెరిల్. అమెరికాలోని పోర్ట్లాండ్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ‘టెక్ సపోర్ట్, వెబ్3 డెవలప్మెంట్’ఉద్యోగం చేస్తుంటాడు. ఆయనకు 2008లో ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. కంపెనీలు, షేర్లు ఎందుకుగానీ.. తనకు తానే ఓ కంపెనీగా చేసుకుని, తన జీవితాన్నే షేర్లుగా మార్చి అమ్ము కోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేం.. తన జీవితాన్ని ఓ లక్ష షేర్లుగా మార్చి, ఒక్కో షేర్కు ఒక డాలర్ రేటు నిర్ణయించాడు. ఈ విషయాన్ని మిత్రులకు, బంధువులకు చెప్పాడు, సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశాడు. చదవండి: అత్యంత ఆసక్తిదాయక స్థలమిదే ప్రత్యేకంగా వెబ్సైట్ పెట్టి మరీ.. తన జీవితం షేర్లను కొనుగోలు చేసేందుకు, అమ్మేందుకు, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఓ వెబ్సైట్ కూడా పెట్టాడు. కీలక విషయాల్లో తాను ఏం నిర్ణయం తీసుకోవాలో ఆ వెబ్సైట్లోనే ప్రశ్నలు పెడతాడు. ఎక్కువ మంది షేర్ హోల్డర్లు దేనికి ఓటేస్తే.. ఆ నిర్ణయం తీసుకుంటాడన్న మాట. ఆ రోజు తాను ఏ డ్రెస్సు వేసుకోవాలన్న దగ్గరి నుంచి ఉద్యోగంలో ఉండాలా, మానేయాలా అనే దాకా చాలా నిర్ణయాలు షేర్ హోల్డర్ల అభిప్రాయం మేరకే తీసుకుంటాడు. తాను వెజిటేరియన్గా మారాలనుకుంటే షేర్ హోల్డర్లు ఓకే చేశారు. నిద్ర సమయాలు మార్చుకోవాలనుకుంటే ఓకే చేశారు. చిత్రంగా తాను వేసెక్టమీ చేయించుకుంటానంటే మాత్రం ‘నో’చెప్పారు. ఇష్టంలేకున్నా చేయాల్సి వస్తోంది! ‘‘నన్ను నేను షేర్లు చేసి అమ్మేసుకున్నాక.. షేర్ హోల్డర్లు చెప్పినట్టే చేయాలి. చాలాసార్లు నాకు ఇష్టం లేకున్నా.. వారు చెప్పినట్టు చేయాల్సి వస్తోంది. అయితే ప్రతిసారీ దానివల్ల మంచే జరుగుతోంది..’’అని మైక్ మెరిల్ చెప్తున్నారు. రేటు పెరుగుతూ.. తగ్గుతూ.. 2008లో మైక్ మెరిల్ ఇలా జీవితాన్ని షేర్లలా అమ్ముతున్న ప్రకటన చేసినప్పుడు పెద్దగా స్పందన రాలేదు. మొదటి పది రోజుల్లో బంధువులు, స్నేహితులు సరదాకి షేర్లు కొన్నారు. అలా మొత్తం లక్ష షేర్లకుగాను.. 929 షేర్లు మాత్రమే అమ్మాడు. సాధారణంగా ఎక్కువ షేర్లు ఉన్నవారికి నిర్ణయాల్లో ఎక్కువ హక్కు ఉంటుంది. 99శాతం వాటా తన వద్దే ఉండటంతో మైక్ మెరిల్ పద్ధతి మార్చాడు. తన దగ్గర ఉన్న వాటాకు ఓటింగ్ హక్కులు తొలగించుకున్నాడు. బయటివారి వద్ద ఉన్న షేర్ల సంఖ్య లెక్కనే.. వారు చెప్పినట్టు నిర్ణయాలు తీసుకోవడం, నడుచుకోవడం మొదలుపెట్టాడు. ఇది మెల్లగా ఆ నోటా ఈ నోటా మీడియాలో పడి అప్పట్లో వైరల్గా మారింది. దీనితో మైక్ మెరిల్ లైఫ్ షేర్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పటివరకు బయటి వ్యక్తులు 14,924 షేర్లు కొన్నారు. ఒక సమయంలో షేర్ ధర 18 డాలర్లు దాటింది. అంటే మైక్ మెరిల్ విలువ ఆ రోజున 12 లక్షల డాలర్లకు చేరినట్టుగా లెక్కించారు. మన కరెన్సీలో రూ.9.94 కోట్లు అన్నమాట. ఆయన గురించిమీడియాలో వైరల్గా మారినప్పుడల్లా కొందరు షేర్లు కొనేందుకు ఆసక్తి చూపడంతో ధర పెరగడం.. తర్వాత అమ్మేయడంతో ధర తగ్గడం జరుగుతూ వస్తోంది. అంటే మైక్ మెరిల్ ధర పెరుగుతూ, తగ్గుతూ ఉంటోంది. ప్రస్తుతం మైక్ మెరిల్ షేర్ ధర ఐదారు డాలర్ల మధ్య ట్రేడ్ అవుతోంది. -
ఇకనైనా నోళ్లు మూస్తారా...చిన్మయి వైరల్ ఫోటోలు
చెన్నై: సరోగసీ ఒక విలాసవంతమైన వ్యాపారంగా మారిపోతున్న వైనం, సరోగసీ వివాదం, సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న వేధింపుల నేపథ్యంలో గాయని చిన్మయి శ్రీపాద బేబీ బంప్తో ఒక సెల్ఫీని ఇన్స్టాలో షేర్ చేశారు. తద్వారా అద్దెగర్భం ద్వారా పిల్లల్ని కన్నారన్న పుకార్లకు చెక్ చెప్పారు. అంతేకాదు ఇద్దరు బిడ్డలకు పాలిస్తున్న ఫోటోను కూడా చిన్మయి షేర్ చేశారు. దీంతోపాటు తన అభిపప్రాయాలతో ఒక వీడియోను కూడా పంచుకున్నారు. ట్విన్స్కు పాలు పట్టడంలోని ఇబ్బందులు, బ్యాక్పెయిన్, షోల్టర్స్ పెయిన్ గురించి కూడా ఆమె చెప్పకనే చెప్పారు. దీంతో నిజంగా మీరు రియల్ శివగామి అంటున్నారు ఫ్యాన్స్. (Dhanteras 2022: బంగారు, వెండిపై ఫోన్పే క్యాష్ బ్యాక్ ఆఫర్) ‘ఓన్లీ సెల్ఫీ’ అటూ ప్రెగ్నెన్సీ సమయంలో తీసిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో ఒక నోళ్లు మూత పడ్డాయి. నిజంగా ఇది 'ఐకానిక్' పిక్ అంటూ ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు. “సరోగసీ అంటూ కారు కూతలు కూసిన వాళ్లంతా ఇకనైనా నోరు మూయండి” అని మరొకరు వ్యాఖ్యానించారు. చిన్మయి శ్రీపాద, నటుడు, నిర్మాత రాహుల్ రవీంద్రన్ దంపతులు ఈ ఏడాది జూన్లో ద్రిప్తా, శర్వాస్ అనే కవలలకు జన్మనిచ్చారు. వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు సరోగసీ విధానం ద్వారా పిల్లల్ని కనడం సాధారణంగా మారిపోయింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు మహిళలు అద్దె తల్లులుగా మారుతున్నారనీ, కుటుంబ అవసరాల కోసం, డబ్బు సంపాదన కోసం సరోగేట్గా మారుతున్నారనేది ఒక వాదన. ఇందుకు పరిస్థితులను బట్టి కనీసం రూ.15 లక్షల నుంచి 30 లక్షల వరకు లేదా అంతకు మించి డబ్బు వసూలు చేస్తారట. అయితే దీనిపై నియంత్రణ లేకపోవడంతో భారత్ లో సరోగసీ దుర్వినియోగం అవుతుందన్న వాదనలు ఉన్నాయి. దీంతో భారత ప్రభుత్వం 2019లో సరోగసీని నిషేధించి, నియమ నిబంధనలను కఠినతరం చేసింది. (Motorola Edge 30 Ultra: కొత్త వేరియంట్, 200 ఎంపీ కెమెరా, భారీ లాంచింగ్ ఆఫర్) అద్దెగర్భం ద్వారా పిల్లల్ని కనడం(సరోగసీ) అనేది వ్యాపారంగా మారిపోయిందనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల సినీ నటులు నయన్, విఘ్నేష్ దంపతులు సరోగసి ద్వారా పిల్లల్ని కనడం పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించిన వివరణ కోరింది. అయితే ఆరేళ్ల క్రితమే తమ పెళ్లిన రిజిస్టర్ చేసుకున్నామని నయన్ దంపతులు ప్రకటించారు. ఇంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి సరోగసీ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. వీరే కాదు, నటుడు షారుఖ్ ఖాన్ దంపతులు, శిల్పాశెట్టి దంపతులతోపాటు, తెలుగు నటి మంచు లక్ష్మి దంపతులు సైతం సరోగసీ విధానంలో పిల్లలకు జన్మనిచ్చారు.(Diwali Gifts: గిఫ్ట్స్, బోనస్లు అందుకున్నారా? మరి ట్యాక్స్ ఎంతో తెలుసా? ) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) > View this post on Instagram View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
అంబుజా సిమెంట్ కొనుగోలు, అదానీకి భారీ షాక్!
న్యూఢిల్లీ: సంస్థాగత ఇన్వెస్టర్ల సలహా సంస్థ ఐఐఏఎస్ తాజాగా అదానీ కుటుంబం చేపట్టిన పెట్టుబడుల సమీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు చేయవలసిందిగా అంబుజా సిమెంట్స్ వాటాదారులకు సూచించింది. వారంట్ల జారీ ద్వారా రూ. 20,000 కోట్ల సమీకరణకు అంబుజా సిమెంట్స్ సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా స్వతంత్ర డైరెక్టర్లుగా అమీత్ దేశాయ్, పుర్వీ షేథ్ ఎంపికను సైతం వ్యతిరేకించవలసిందిగా ఐఐఏఎస్ సిఫారసు చేసింది. ఏసీసీలో 50.05 శాతం వాటాను కలిగి ఉన్న అంబుజా సిమెంట్స్ శనివారం(8న) అత్యవసర వాటాదారుల సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహిస్తోంది. మొత్తం 12 ప్రతిపాదనలపై వాటాదారుల అనుమతిని కోరనుంది. వీటిలో ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా 47.74 కోట్ల వారంట్ల జారీ ప్రతిపాదన సైతం ఉంది. షేరుకి దాదాపు రూ. 419 ధరలో అదానీ గ్రూప్ సంస్థ హార్మోనియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్కు వారంట్ల కేటాయింపు ద్వారా రూ. 20,001 కోట్లను సమీకరించే యోచనలో ఉంది. బోర్డులో గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, కుమారుడు కరణ్ అదానీసహా ఇద్దరు డైరెక్టర్లు, మరో నలుగురు స్వతంత్ర డైరెక్టర్ల ఎంపికకు అనుమతులను కోరనుంది. కారణాలివీ.. అదానీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఐఐఏఎస్ ఇందుకు పలు కారణాలను పేర్కొంది. వారంట్లను మార్పిడి చేశాక ఈక్విటీ 19.4 శాతంమేర విస్తరించనుంది. ఇది అత్యధికంకాగా.. ప్రమోటర్ల వాటా ప్రస్తుత 63.1 శాతం నుంచి 70.3 శాతానికి పెరగనుంది. అంతేకాకుండా వారంట్ల ఇష్యూ ధర ప్రస్తుత రూ. 500తో పోలిస్తే 16 శాతంపైగా తక్కువ(డిస్కౌంట్). హోల్సిమ్ గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన ధర కంటే 8.8 శాతం ప్రీమియం. అంబుజా సిమెంట్స్ ఇప్పటికే రూ. 3,840 కోట్ల నగదు, తత్సమాన నిల్వలు కలిగి ఉంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే ఇవి రూ. 8,500 కోట్లు. ఎన్ఎస్ఈలో అంబుజా సిమెంట్స్ షేరు 3.7 శాతం జంప్చేసి రూ. 526 వద్ద ముగిసింది. చదవండి👉 ‘అదానీ సంపద హాంఫట్’ ఒక్కరోజే వేలకోట్ల నష్టం..కారణం ఏంటో తెలుసా -
బజాజ్ ఎలక్ట్రానిక్స్@రూ. 56–59
న్యూఢిల్లీ: రిటైల్ చైన్ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. అక్టోబర్ 4న ప్రారంభమయ్యే ఇష్యూకి రూ. 56–59 ధరల శ్రేణిని ప్రకటించింది. 7న ముగియనున్న ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండుతో కంపెనీ వినియోగ వస్తువుల విక్రయ స్టోర్లను నిర్వహిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 254 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పవన్ కుమార్ బజాజ్, కరణ్ బజాజ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కంపెనీకి 36 పట్టణాలలో 112 మల్టీబ్రాండ్ ఔట్లెట్స్ ఉన్నాయి. చదవండి: మామూలు లక్ కాదండోయ్, సంవత్సరంలో రూ.లక్ష పెట్టుబడితో రూ.20 లక్షలు! -
ఐపీవోకు అప్రమేయ ఇంజినీరింగ్
న్యూఢిల్లీ: మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ అప్రమేయ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 50 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఐపీవో నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్లో కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రధానంగా ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు, నిర్వహణ తదితర హెల్త్కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసులను అందిస్తోంది. చదవండి: గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ సమస్య ఉండదబ్బా! -
ఎయిర్టెల్ షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్లో మొత్తం 1.76 శాతం వాటాను సింగపూర్ టెలీకమ్యూనికేషన్స్(సింగ్టెల్) విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా షేరుకి రూ. 686 ధరలో పాస్టెల్ లిమిటెడ్(సింగ్టెల్ సంస్థ) 1.63 శాతం వాటాను విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం దాదాపు రూ. 6,602 కోట్ల విలువైన ఈ వాటా(9.62 కోట్లకుపైగా షేర్లు)ను ఎయిర్టెల్ ప్రమోటర్ భారతీ టెలికం కొనుగోలు చేసింది. ఈ బాటలో సింగ్టెల్ మరో సంస్థ విరిడియన్ సైతం 0.13 శాతం వాటా(కోటి షేర్లు)ను ఇదే ధరలో విక్రయించినట్లు తెలుస్తోంది. సాధారణ వాటాదారులు 70 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ లావాదేవీ తదుపరి భారతీ ఎయిర్టెల్లో పబ్లిక్ వాటా 44.74 శాతం నుంచి 44.87 శాతానికి పెరిగినట్లు తెలియజేశాయి. జూన్ చివరికల్లా ఎయిర్టెల్లో భారతీ టెలికం 35.85 శాతం వాటా కలిగి ఉంది. కాగా.. భారతీ టెలికంలో సింగ్టెల్కు 50.56 శాతం, సునీల్ మిట్టల్ కుటుంబానికి 49.44 శాతం చొప్పున వాటా ఉంది. ఈ వార్తల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు ఎన్ఎస్ఈలో 1.4 శాతం బలపడి రూ. 379 వద్ద ముగిసింది. -
పావెల్ ప్రకటనతో భారీ పతనం.. రూ.2.39 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీరేట్ల పెంపు తప్పదని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటనతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. ఉదయం భారీ నష్టాలతో మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల ప్రభావంతో రోజంతా బలహీనంగానే ట్రేడయ్యాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 861 పాయింట్లు క్షీణించి 57,973 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 246 పాయింట్ల పతనంతో 17,313 వద్ద నిలిచింది. ఆసియాలో ఒక్క చైనా అన్ని దేశాల స్టాక్ సూచీలు రెండుశాతం నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 0.50% నుంచి ఒకశాతం పతనమయ్యాయి. అమెరికా సూచీలు పావుశాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ ఒకటిన్నర నష్టంతో బీఎస్ఈలో రూ.2.39 లక్షల కోట్ల సంపద మాయమైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొ త్తం విలువ రూ.274 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఆరంభ నష్టాల నుంచి రికవరీ అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఉదయం స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 1467 పాయింట్ల పతనంతో 57,367 వద్ద, నిఫ్టీ 370 పాయింట్ల పతనంతో 370 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 57,367 వద్ద కనిష్టాన్ని, 58,208 గరిష్టాన్ని చూసింది. నిఫ్టీ 17,380 – 17,166 పరిధిలో ట్రేడైంది. రిలయన్స్ షేరు ఒడిదుడుకులకు లోనై, చివరికి ఒకశాతం నష్టంతో రూ.2,597 వద్ద ముగిసింది. -
స్టాక్ మార్కెట్: ఒక్కరోజులోనే రూ.2.94 లక్షల కోట్లు ఆవిరి.. కారణమిదే!
ముంబై: దలాల్ స్ట్రీట్లో కొన్ని రోజులుగా సందడి చేసిన బుల్ వారాంతపు రోజైన శుక్రవారం చతికిలపడింది. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 652 పాయింట్లు నష్టపోయి 60వేల దిగువన 59,646 వద్ద స్థిరపడింది. ఈ సూచీలో 30 షేర్లలో ఎల్అండ్టీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. నిఫ్టీ 198 పాయింట్లు క్షీణించి 17,758 వద్ద నిలిచింది. దీంతో సెన్సెక్స్ అయిదు, నిఫ్టీ ఎనిమిది రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,111 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,633 కోట్ల షేర్లను అమ్మారు. స్టాక్ సూచీలు ఒక శాతానికి పైగా పతనంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.2.94 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.277.58 లక్షల కోట్లకు దిగివచ్చింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రికవరీతో పాటు డాలర్ ఇండెక్స్ బలపడటంతో రూపాయి విలువ 20 పైసలు క్షీణించి 79.44 వద్ద స్థిరపడింది. లాభాలతో మొదలై నష్టాల్లోకి: దేశీయ స్టాక్ మార్కెట్ ఉదయం లాభంతోనే మొదలైంది. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. సెన్సెక్స్ ఒక దశలో 823 పాయింట్లు పతనమై 60,298 వద్ద, నిఫ్టీ 245 పాయింట్లు నష్టపోయి 17,711 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు కేంద్రం డీజిల్పై ఎగుమతి విండ్ఫాల్ లాభాల పన్నును రూ.5 నుంచి రూ.7కు పెంచడంతో రిలయన్స్ షేరు రెండుశాతం నష్టపోయి రూ.2,614 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఆర్థిక, బీమా రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీల పతనానికి కారణమయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఇండస్ ఇండ్, బజాజ్ ఫైనాన్స్, బజాబ్ ఫిన్సర్వ్ షేర్లు 3 నుంచి 2శాతం నష్టపోయాయి. నష్టాలు ఎందుకంటే జూన్ కనిష్ట స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీలు 18% ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరి ష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ రెండేళ్ల గరిష్టానికి చేరింది. యూఎస్ ఫెడ్ రిజ ర్వ్ మినిట్స్, నిరుద్యోగ డేటా వెల్లడి తర్వాత కీలక వడ్డీరేట్ల పెంపు భయాలు మరో సారి తెరపైకి రావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. వరుసగా 13 ట్రేడింగ్ సెషన్లో నికర కొనుగోలుదారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు గురువారం అనూహ్యంగా రూ.1,706 కోట్ల షేర్లు అమ్మేశారు. చదవండి: Tencent: పదేళ్లలో ఇదే తొలిసారి.. 5వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ -
స్టాక్ మార్కెట్: ఏప్రిల్ 13 తర్వాత.. ఇదే తొలిసారి
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు ఆటో షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు సోమవారమూ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు కలిసొచ్చాయి. కేంద్రం వెల్లడించిన స్థూల ఆర్థిక గణాంకాలు అంచనాలకు తగ్గట్లు నమోదయ్యాయి. కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పించగలిగాయి. ఫలితంగా మార్కెట్ ముగిసే సరికి సెన్సెక్స్ 545 పాయింట్లు పెరిగి 58,115 వద్ద నిలిచింది. ఏప్రిల్ 13వ తేదీ తర్వాత సెన్సెక్స్ 58 వేల స్థాయిపై ముగియడం ఇదే తొలిసారి. నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో 17,340 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు. కాగా, ఇటీవల జీవితకాల కనిష్టానికి దిగివచ్చిన రూపాయి రికవరీ క్రమంగా రికవరీ అవుతోంది. సోమవారం 18 పైసలు బలపడి నెలగరిష్ట స్థాయి 79.24 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా వాహన విక్రయాలు జూలైలోనూ రెండంకెల వృద్ధిని నమోదు చేయడంతో ఆటో షేర్లు భారీగా గిరాకీ నెలకొంది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు విషయంలో ఇకపై దూకుడు వైఖరిని ప్రదర్శించకపోవచ్చనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 4 రోజులు: రూ.12.74 లక్షల కోట్లు 4 రోజుల ర్యాలీతో రూ.12.74 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.270 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► 5జీ స్పెక్ట్రం కోసం రికార్డు స్థాయిలో రూ.1.50 లక్షల కోట్లకు పైగా బిడ్లు ధాఖలవడంతో టెలికాం షేర్లు లాభాల మోత మోగించాయి. రిలయన్స్ 2.60% ఎగసి రూ.2,575 వద్ద స్థిరపడింది. ఎయిర్టెల్ షేరు 2.40% పెరిగి రూ.694 వద్ద ముగిసింది. చదవండి: ఆగస్ట్లో విడుదలయ్యే అదిరిపోయే స్మార్ట్ఫోన్లు ఇవే! -
వేలకోట్ల నష్టం..జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ కీలక నిర్ణయం!
ప్రముఖ ఫుడ్ ఆగ్రిగ్రేటర్ జొమాటోలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జులైలో జొమాటో లాకిన్ పిరియడ్ పూర్తి కావడంతో షేర్లు అల్ల కల్లోలం సృష్టించాయి. లాకిన్ పిరియడ్ పూర్తయిన జులై 25న ఒక్కరోజే సుమారు వెయ్యికోట్లు నష్టపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నష్టాల్ని బేరీజు వేసుకొని వాటి నుంచి బయటపడేందుకు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జొమాటో సంస్థ జొమాటోతో పాటు బ్లింకింట్, హైపర్ ప్యూర్, ఫీడింగ్ ఇండియా కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. అయితే వాటి నిర్వహణ కష్ట తరంగా మారాయి.నష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి.ఈ క్రమంలో జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎటర్నల్ పేరుతో జొమాటోతో పాటు బ్లింకింట్, హైపర్ ప్యూర్, ఫీడింగ్లను ఒకేతాటికింద తీసుకొని రానున్నారు. ఆ సంస్థలకు శాశ్వతంగా నలుగురు సీఈవోల్ని నియమించనునున్నారు. తద్వారా వ్యాపారాన్ని విస్తృతం చేయడంతో, వ్యాపార నిర్వహణ, నష్టాల్ని నివారించవచ్చని భావిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీఈవో దీపిందర్ గోయల్ మాట్లాడుతూ 'నేను సీఈవోగా ఉన్న కంపెనీ నుంచి ఇతర సంస్థలకు సైతం సీఈవోల్ని నియమించబోతున్నాం. ఒకరికొకరు పోటీ పడుతూ ఒక సూపర్ టీమ్గా పని చేస్తారంటూ ' అభిప్రాయం వ్యక్తం చేశారు. కొనసాగుతున్న నష్టాలు బీఎస్ఈలో జొమాటో స్టాక్స్ నష్టాల పరపరం కొనసాగుతుంది. గత శుక్రవారం బీఎస్ఈ మార్కెట్లో జొమాటో షేర్ రూ.46.80 వద్ద ముగిసింది. ఇక ఈ(సోమవారం) వారం ప్రారంభంలో సైతం నష్టాల్ని చవిచూశాయి. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి జొమాటో 0.30శాతం నష్టపోయి రూ.46.50వద్ద ముగిసింది. -
స్టాక్ మార్కెట్: అమెరికా ఫెడ్ రిజర్వ్ అంచనాలు.. రెండో రోజు అదే తీరు!
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ అంచనాలకు మించి వడ్డీరేట్లను పెంచవచ్చనే భయాలతో స్టాక్ సూచీలు రెండోరోజూ నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, కొత్త తరం కంపెనీల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 498 పాయింట్లు నష్టపోయి 55,268 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 147 పాయింట్లు క్షీణించి 16,500 దిగువున 16,484 వద్ద నిలిచింది. విస్తృతస్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈలోని మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతానికి పైగా పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,548 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.999 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ రిజర్వ్ నేటి (బుధవారం) రాత్రి ద్రవ్య పరపతి విధానాలను వెల్లడించనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. సూచీలు ఉదయం స్వల్ప లాభాల్లో ఆరంభమైనప్పటికీ.., జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోని బలహీనతలతో నష్టాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్ను ప్రభావితం చేసే సానుకూల సంకేతాలేవీ లేకపోవడంతో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ 563 పాయింట్లు క్షీణించి 55,203 వద్ద, నిఫ్టీ 168 పాయింట్లు పతనమైన 16,631 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► జొమాటో షేర్ల పతనం కొనసాగింది. బీఎస్ఈలో ఇంట్రాడేలో 13% పతనమై రూ.41.25 వద్ద కొత్త జీవితకాల కనిష్టాన్ని తాకింది. ట్రేడింగ్ ముగిసే సరికి 12.41% నష్టంతో రూ.41.65 వద్ద నిలిచింది. ► 5జీ టెలికం సర్వీసులకు సంబంధించి స్పెక్ట్రం వేలం ప్రారంభమవడంతో టెలికం రంగ షేర్లు మిశ్రమంగా ముగిశాయి. ఎయిర్టెల్ షేరు ఒకశాతం లాభపడగా, వొడాఫోన్ ఐడియా షేరు 1% నష్టపోయింది. జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఎలాంటి లాభ నష్టం లేకుండా ఫ్లాట్గా రూ. 2,420 వద్ద స్థిరపడింది. స్పెక్ట్రం వేలం నేటితో ముగియనుంది. -
యురేకా ఫోర్బ్స్కు షాపూర్జీ టాటా
న్యూఢిల్లీ: కన్జూమర్ డ్యురబుల్స్ కంపెనీ యురేకా ఫోర్బ్స్ నుంచి నిర్మాణ రంగ దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ పూర్తిగా బయటపడింది. కంపెనీలో మిగిలిన 8.7 శాతం వాటాను కొత్త యాజమాన్య సంస్థ లునోలక్స్కు విక్రయించింది. పీఈ దిగ్గజం యాడ్వెంట్ ఇంటర్నేషనల్కు చెందిన లునోలక్స్ 1.68 కోట్ల ఈక్విటీ షేర్లను(8.7 శాతం వాటా) షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ నుంచి సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని యురేకా ఫోర్బ్స్ తాజాగా వెల్లడించింది. 2021 సెప్టెంబర్ 19న కుదిరిన వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం ఈ లావాదేవీని షాపూర్జీ పల్లోంజీ పూర్తి చేసినట్లు పేర్కొంది. షాపూర్జీ నుంచి రూ. 4,400 కోట్లకు యురేకా ఫోర్బ్స్ను కొనుగోలు చేసేందుకు యాడ్వెంట్ ఇంటర్నేషనల్ గతేడాది సెప్టెంబర్లో డీల్ను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్లో యురేకా ఫోర్బ్స్ నుంచి షాపూర్జీకి చెందిన ఏడుగురు డైరెక్టర్లు బోర్డు నుంచి తప్పుకోగా.. ఈ వారం మొదట్లో జూబిలెంట్ ఫుడ్వర్క్స్ మాజీ సీఈవో ప్రతీక్ పోటాను చీఫ్గా యాడ్వెంట్ ఎంపిక చేసింది. ప్రతీక్ ఆగస్ట్ 16 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ఎలాన్ మస్క్ మాటంటే..మాటే! పడిపోతున్న ట్విటర్, టెస్లా షేర్లు!
న్యూయార్క్: ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్పై కోర్టుకు వెళ్లడంపై మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ న్యాయపోరు ఓ కొలిక్కి వచ్చేందుకు సుదీర్ఘ సమయం పట్టేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్విటర్, టెస్లా షేర్లు సోమవారం గణనీయంగా క్షీణించాయి. ట్విటర్ షేరు ఒక దశలో 8 శాతం పైగా తగ్గి 33.71 డాలర్లకు, టెస్లా 6 శాతం పైగా క్షీణించి 706.25 డాలర్ల స్థాయికి పడిపోయాయి. వివాదం వివరాల్లోకి వెడితే షేరు ఒక్కింటికి రూ. 54.20 డాలర్ల రేటు చొప్పున 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ను కొనుగోలు చేస్తానంటూ కొన్నాళ్ల క్రితం మస్క్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ డీల్ రద్దు చేసుకుంటే ఆయన 1 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, నకిలీ ఖాతాల లెక్క సరిగ్గా చెప్పడం లేదని ఆరోపిస్తూ ఈ డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ఈమధ్య ప్రకటించారు. కొనుగోలు ఒప్పందాన్ని ప్రకటించినప్పట్నుంచీ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న ట్విటర్ .. ఈ తాజా ప్రకటనపై మండిపడింది. తాము అన్ని వివరాలు సరిగ్గానే ఇచ్చినప్పటికీ మస్క్ కావాలనే ఇలా చేస్తున్నారని ఆరోపించింది. -
కేంద్రం కొత్త పన్నుల షాక్, రిలయన్స్, ఓఎన్జీసీ ఢమాల్!
సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించిన పన్ను పోటుతో రిలయన్స్, ఓఎన్జీసీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అంతర్గతంగా ఇంధన కొరతను నివారించేందుకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎగుమతి పన్నులు, దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం లేదా విండ్ఫాల్ పన్ను విధించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓఎన్జీసీ షేర్లు శుక్రవారం కుప్పకూలాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరడంతో భారీగా లాభపడిన చమురు ఉత్పత్తిదారులపై ఇండియా విండ్ఫాల్ పన్నును ప్రవేశ పెట్టింది. అలాగే గ్యాసోయిల్, గ్యాసోలిన్ జెట్ ఇంధనం దిగుమతులపై సుంకాలను విధించింది. దీంతో రిలయన్స్ స్టాక్ 8.7 శాతం వరకు పడిపోయింది. 2020, నవంబర్ 2 తరువాత ఇదే అతిపెద్ద ఇంట్రాడే పతనం. ఫలితంగా దేశంలోని ఆయిల్-టు-రిటైల్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువలో 19.35 బిలియన్ డాలర్ల మేర తగ్గిందని రాయిటర్స్ నివేదించింది. బీఎస్ఈలో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ 16.5 లక్షల కోట్లుగా ఉంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్జీసీ ఏకంగా 12.3 శాతం క్షీణించింది 2020 మార్చి 23 తరువాత ఇదే అతిపెద్ద పతనం. ఆయిల్ ఇండియా దాదాపు 11 శాతం క్షీణించగా, మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్ 10 శాతం క్షీణించాయి. కాగాపెట్రోల్, ఏటీఎఫ్ ఎగుమతులపై లీటరుకు రూ. 6, డీజిల్ ఎగుమతిపై లీటర్కు రూ. 13 పన్ను విధించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ. 23,250 అదనపు పన్ను విధించింది. మరోవైపు డాలర్తో రూపాయి శుక్రవారం మరో ఆల్టైమ్ కనిష్టం 79.11కి చేరుకుంది, గత కొన్ని వారాలుగా ఆల్ టైమ్ కనిష్టానికి చేరుతున్న సంగతి తెలిసిందే. -
టీటీకే ప్రెస్టీజ్ చేతికి అల్ట్రాఫ్రెష్, ఇక ఆ సేవలు కూడా
న్యూఢిల్లీ: అల్ట్రాఫ్రెష్ మాడ్యులర్ సొల్యూషన్స్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు కిచెన్ అప్లయెన్సెస్ దిగ్గజం టీటీకే ప్రెస్టీజ్ తాజాగా పేర్కొంది. ప్రస్తుతం 40 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు వీలుగా రూ. 20 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించింది. తదుపరి మరో రూ. 10 కోట్లు వెచ్చించడం ద్వారా 51 శాతం వాటాను దక్కించుకోనున్నట్లు టీటీకే ప్రెస్టీజ్ ఎండీ చంద్రు కల్రో తెలియజేశారు. దీంతో వేగవంత వృద్ధిలో ఉన్న మాడ్యులర్ కిచెన్ సొల్యూషన్స్ విభాగంలో ప్రవేశించేందుకు కంపెనీకి వీలు చిక్కనుంది. మొత్తం కిచెన్ సొల్యూషన్స్ అందించే కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంలో భాగంగా తాజా కొనుగోలుని చేపట్టినట్లు కంపెనీ చైర్మన్ టీటీ జగన్నాథన్ పేర్కొన్నారు. ప్రస్తుతం మాడ్యులర్ కిచెన్ మార్కెట్ విలువ రూ. 9,500 కోట్లుగా ఉన్నట్లు తెలియజేశారు. దీనిలో 25 శాతమే బ్రాండెడ్ విభాగం ఆక్రమిస్తున్నట్లు వెల్లడించారు. మాడ్యులర్ కిచెన్లోకి అల్ట్రాఫ్రెష్ కొనుగోలు ద్వారా మాడ్యులర్ కిచెన్ సొల్యూషన్స్ విభాగంలో అడుగు పెట్టనున్నట్లు చంద్రు తెలియజేశారు. కంపెనీ బిజినెస్కు ఇది అదనపు ప్రయోజనాలను కల్పిస్తుందని చెప్పారు. 2025 ఆర్థిక సంవత్సరానికల్లా రూ. 5,000 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్షిస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో రూ. 1,000 కోట్లు ఇతర కంపెనీలను సొంతం చేసుకోవడం ద్వారా ఆశిస్తున్నట్లు తెలియజేశారు. తాజా కొనుగోలు దీనిలో భాగమేనని వివరించారు. ప్రస్తుత నాయకత్వంలోనే స్వతంత్ర కంపెనీగా అల్ట్రాఫ్రెష్ మాడ్యులర్ కొనసాగనున్నట్లు వెల్లడించారు. అవసరమైతే ప్రెస్టీజ్ బ్రాండును వినియోగించుకుంటుందని తెలియజేశారు. రానున్న ఐదేళ్లలో రూ. 23,000 కోట్ల టర్నోవర్ను సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రస్తుతం అల్ట్రాఫ్రెష్ 120 స్టూడియోలతో దేశవ్యాప్తంగా 5,000 కిచెన్లను తయారు చేసినట్లు తెలియజేశారు. -
కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా
Kajal Agarwal Shares Her Son Photo Goes Viral: ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న క్రమంలోనే 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడింది. ఇటీవలె మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బాబుకి నీల్ కిచ్లూ అని పేరు కూడా పెట్టేశారు. ఇక ఈ చిన్నారి రాకతో కాజల్ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది. అయితే ఇప్పటివరకు కాజల్ తన కుమారుడిని చూపించలేదు. కొడుకుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసినప్పటికీ ముఖం మాత్రం ఎక్కడా కనిపించకుండా పోస్ట్ చేసింది. తాజాగా మరో ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కాజల్. ఈ ఫొటోలో మాత్రం ఆ చిన్నారి ముఖం కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఫొటోలో బాబును కాజల్ ఒకవైపుకు ఎత్తుకుని బెడ్పై పడుకుని ఉండగా, చిన్నారి ఫేస్కు అతని చేయి కొంచెం అడ్డంగా రావడం మనం చూడొచ్చు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అయిన ఈ ఫొటోను కాజల్ అభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. చాలా క్యూట్ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు తమ పిల్లల ఫొటోలను పూర్తిగా చూపించకుండ ఉండేందుకుక రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కూడా తమ కూతురు ఫొటో ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్తపడిన విషయం తెలిసిందే. చదవండి: డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్.. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
ఫ్లిప్కార్ట్లో వాటాలు కొనుగోలు చేసిన పబ్జీ కంపెనీ
దేశీ ఈకామర్స్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఫ్లిప్కార్ట్లో భారీగా షేర్ల బదలాయింపు జరిగింది. పబ్జీ వంటి వివాస్పద గేమ్ను పరిచయం చేసిన టాన్సెంట్ సంస్థ ఫ్లిప్కార్ట్లో వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన డీల్ 2021 అక్టోబరులో జరగగా తాజాగా ఈ వివరాలను బయటకు వెల్లడించారు. ఫ్లిప్కార్ట్ను స్టార్టప్గా సచిన్బన్సాల్, బిన్నీ బన్సాల్లు నెలకొల్పారు. ఆ తర్వాత సచిన్ బన్సాల్ తన వాటాలు అమ్ముకుని ఫిన్టెక్ సెక్టార్లోకి వెళ్లారు. కాగా బన్ని బన్సాల్కు ఫ్లిప్కార్ట్ ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. కాగా టెన్సెంట్ సంస్థ బిన్నిబన్సాల్ నుంచి 0.72 శాతా వాటాలను 264 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇప్పటికే ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్తో సహా అనేక అంతర్జాతీయ కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి. చదవండి: కడియం నర్సరీలకు రతన్ టాటా ప్రశంసలు -
రూ. 150 కోట్లలో మీ వాటా ఎంత? యంగ్ హీరోకు నెటిజన్ ప్రశ్న..
Kartik Aaryan Reveals His Share In Bhool Bhulaiyaa 2 Profits: బాలీవుడ్ చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్ ఇటీవల నటించి సూపర్ హిట్ కొట్టిన చిత్రం 'భూల్ భులయ్యా 2'. కియరా అద్వానీ, టబు నటించిన ఈ సీక్వెల్ మూవీ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ రుచి చూపించింది. మే 20న విడుదలై ఈ సినిమా సుమారు రూ. 150 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమచారం. ఇప్పుడు ఈ సినిమా విజయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. తాజాగా 'ఆస్క్మీ కార్తీక్' అనే సెషన్ను సోషల్ మీడియా వేదికగా నిర్వహించాడు. ఈ సెషన్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు కార్తీక్. 'మిస్టర్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్ కార్తీక్.. పెళ్లిపై మీ ప్లాన్స్ ఏంటీ ?' అని అడిగిన ప్రశ్నకు 'ముందు నన్ను ఒక రిలేషన్షిప్లోకి వెళ్లనివ్వండి. ఆ తర్వాత పెళ్లి గురించి మాట్లాడుకుందాం. నేను సింగిల్గానే ఉండిపోతానేమో అనిపిస్తుంది.' అని తెలిపాడు. చదవండి: చిరంజీవి బయోపిక్ గురించి నేను అలా అనలేదు: సీనియర్ నటుడు Eligible se taken toh karao phir marriage ki baat karenge. Eligible eligible mein single hi reh jaoonga #AskKartik https://t.co/eHYs2dStj4 — Kartik Aaryan (@TheAaryanKartik) June 7, 2022 అనంతరం మరోకొరు 'సర్.. భూల్ భులయ్యా 2 సినిమాకు రూ. 150 కోట్ల లాభం వచ్చింది కదా. అందులో మీ వాటా ఎంత?' అని అడగ్గా.. 'ఆ లాభాల్లో నేను ఎలాంటి వాటా తీసుకోలేదు. ఈ సినిమా వల్ల నాకు అభిమానుల నుంచి విపరీతమైన ప్రేమ దొరికింది. డబ్బు కంటే ఆ ప్రేమ గొప్పది.' అని సమాధానమిచ్చాడు. అలాగే 'మీకిష్టమైన మార్వెల్ క్యారెక్టర్ ఏంటీ?' అన్న ప్రశ్నకు 'స్పైడీ' అని పేర్కొన్నాడు. చదవండి: మన పిల్లలకైనా ఆ సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్ 150 cr mein profit nahi Fans ka pyaar mila hai !! Koi number usse bada nahin hota ❤️#AskKartik https://t.co/FDge180zsK — Kartik Aaryan (@TheAaryanKartik) June 7, 2022 Spidey 🕷 #AskKartik https://t.co/wuyJoK21o1 — Kartik Aaryan (@TheAaryanKartik) June 7, 2022 -
ట్రూజెట్లో విన్ఎయిర్కు మెజారిటీ వాటాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తొలి సమాంతర విమానయాన సంస్థ విన్ఎయిర్ తాజాగా ట్రూజెట్లో 79 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఈ ఒప్పంద విలువ రూ. 200 కోట్లు. డీల్ ప్రకారం ట్రూజెట్ నిర్వహణ నియంత్రణ, కార్యకలాపాలను విన్ఎయిర్ (ఉయ్ ఇండియన్ నేషనల్స్) టేకోవర్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై టర్బో మేఘా ఎయిర్వేస్ ఎండీ ఉమేష్ వంకాయలపాటి, విన్ఎయిర్ సీఎండీ శామ్యూల్ తిమోతీ సంతకాలు చేశారు. దీని ప్రకారం ఉమేష్ ఎండీగా కొనసాగనుండగా, నూతన మేనేజ్మెంట్ టీమ్కు కొత్త వ్యాపార ప్రణాళికతో తిమోతీ దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ ఒప్పందంతో ట్రూజెట్ 650 మంది పైగా ఉద్యోగులు, వారి కుటుంబాలకు స్వాంతన చేకూరనుంది. మీడియా, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాల్లో ఉన్న ఆర్యన్ గ్రూప్ కంపెనీస్లో విన్ఎయిర్ కూడా భాగంగా ఉంది. డిసెంబర్ ఆఖరు నాటికి రోజూ 17 ఎయిర్క్రాఫ్ట్లు, 3 బ్యాకప్ విమానాలతో ట్రూజెట్ సర్వీసులు నిర్వహించగలదని తిమోతీ తెలిపారు. ఎయిర్క్రాఫ్ట్లు, ఆపరేటింగ్ పర్మిట్లు మొదలైనవన్నీ ఉన్న ఎయిర్లైన్స్ నుంచి విమానాలను వాటి లైసెన్సులతో పాటు లీజుకు తీసుకుని లాభసాటి రూట్లలో నడిపించుకునే సంస్థను సమాంతర (ప్యారలల్) ఎయిర్లైన్గా వ్యవహరిస్తారు.