జియో యూజర్లకు శుభవార్త!.. అంబానీ అదిరిపోయే గిఫ్ట్ | Reliance Industries to Consider 1 1 Bonus Next Board Meeting | Sakshi
Sakshi News home page

జియో యూజర్లకు శుభవార్త!.. అంబానీ అదిరిపోయే గిఫ్ట్

Aug 29 2024 3:16 PM | Updated on Aug 29 2024 6:36 PM

Reliance Industries to Consider 1 1 Bonus Next Board Meeting

'రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్' (AGM) ప్రారంభమైంది. ఇందులో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఈక్విటీ షేర్‌హోల్డర్‌కు 1:1 బోనస్ ఇష్యూను పరిశీలించడానికి 2024 సెప్టెంబర్ 5న తన డైరెక్టర్ల బోర్డుతో సమావేశం కానుందని వెల్లడించారు. ఇందులో జియో ఏఐ క్లౌడ్ ఆఫర్‌ గురించి కూడా ప్రస్తావించారు.

100 జీబీ ఫ్రీ
47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఏఐ క్లౌడ్ ఆఫర్‌ ప్రకటించారు. ఈ ఆఫర్ ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని షేర్‌హోల్డర్లను ఉద్దేశించి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. ఈ రోజు జియో వినియోగదారులు 100 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజిని పొందుతారని ఆయన ప్రకటించారు.

ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లు, అన్ని ఇతర డిజిటల్ కంటెంట్, డేటాను సురక్షితంగా నిల్వ చేయడానికి & యాక్సెస్ చేయడానికి జియో ఏఐ క్లౌడ్ వెల్‌కమ్‌ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము. వచ్చే దీపావళి నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.

	జియో కస్టమర్లకు గుడ్ న్యూస్

1:1 బోనస్ ఇష్యూ
సెప్టెంబర్ 5న జరగబోయే సమావేశంలో 1:1 బోనస్ ఇష్యూ ప్రతిపాదన ఆమోదించబడితే.. పెట్టుబడిదారుడు ప్రతి షేరుకు అదనపు వాటాను పొందే అవకాశం ఉంటుంది.

డైరెక్టర్ల బోర్డు 1:1 బోనస్ ఇష్యూను ప్రతిపాదిస్తే.. కంపెనీ నిల్వలను క్యాపిటలైజ్ చేయడం ద్వారా నిధులు సమకూరుస్తాయి. 1:1 బోనస్ ఇష్యూ అనేది ఇప్పటికే ఉన్న షేర్‌హోల్డర్‌లు కలిగి ఉన్న షేర్‌ల సంఖ్యను పెంచడం ద్వారా రివార్డ్ చేయడానికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది. ఇది ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వారి షేర్‌లను సమర్థవంతంగా రెట్టింపు చేస్తుంది. బోనస్ ఇష్యూలు కంపెనీ తన భవిష్యత్తు అవకాశాలపై మరియు బలమైన ఆర్థిక స్థితిపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement