Mukesh Ambani
-
120 ఏళ్ల చరిత్ర.. రూ.276 కోట్ల లక్ష్మి నివాస్ బంగ్లా: కొత్త ఓనర్లకు అంబానీతో లింక్ (ఫోటోలు)
-
చారిత్రక ‘లక్ష్మీ నివాస్’ బంగ్లా అమ్మకం..
ముంబైలోని అత్యంత చరిత్రాత్మకమైన ప్రాపర్టీలలో ఒకటైన లక్ష్మీ నివాస్ బంగ్లా రికార్డు స్థాయి రియల్ ఎస్టేట్ వ్యవహారంలో చేతులు మారింది. నెపియాన్ సీ రోడ్డులో ఉన్న ఈ చారిత్రక భవనాన్ని రూ.276 కోట్లకు విక్రయించారు. ఇది నగరంలో అత్యంత ఖరీదైన నివాస లావాదేవీలలో ఒకటిగా నిలిచింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన లక్ష్మీ నివాస్ దాని నిర్మాణ వైభవానికి మించి చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది.చరిత్రలో నిలిచిపోయిన భవనం1904లో పార్శీ కుటుంబం నిర్మించిన లక్ష్మీ నివాస్ తరువాత 1917లో కపాడియా కుటుంబం యాజమాన్యంలోకి వచ్చింది. అప్పట్లో కేవలం రూ.1.20 లక్షలకు దీన్ని కొనుగోలు చేశారు. భారత స్వాతంత్య్రోద్యమ కీలక దశలో (1942-1945) లక్ష్మీ నివాస్ దేశంలోని ప్రముఖ విప్లవకారులకు సురక్షిత స్థావరంగా ఆశ్రయం కల్పించింది. రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్, అచ్యుత్ పట్వర్ధన్, అరుణా అసఫ్ అలీ వంటి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఇక్కడ ఆశ్రయం పొందారు.అంతేకాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ రేడియోకు కీలక ప్రసార కేంద్రంగా ఈ బంగ్లా పనిచేసింది. భారత స్వాతంత్ర్య పోరాట గళాన్ని పెంచింది. బంగ్లా ఉన్న నెపియాన్ సీ రోడ్ ఒకప్పుడు బికనీర్ ప్యాలెస్, కచ్ కోట, వాకనర్ హౌస్ వంటి రాయల్ ఎస్టేట్లతో పాటు ఉన్నత స్థాయి బ్రిటిష్ అధికారుల నివాసాలకు నిలయంగా ఉండేది. అందువల్ల లక్ష్మీ నివాస్ వలసవాద చరిత్రకు, భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రతీకగా నిలుస్తుంది.రికార్డు స్థాయి డీల్జాప్కీకి లభించిన రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్లు, ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం లక్ష్మీ నివాస్ అమ్మకం గత ఫిబ్రవరి 28న ఖరారైంది. ఈ లావాదేవీలో రూ.16.56 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు తెలుస్తోంది. 19,891 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా అమ్మకం ధర చదరపు అడుగుకు సుమారు రూ.1.38 లక్షలుగా ఉండటం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ కు నిదర్శనం. ఈ ప్రాపర్టీలో గ్రౌండ్ ఫ్లోర్, రెండు పై అంతస్తులు, వెనుక భాగంలో అదనపు నిర్మాణం ఉన్నాయి. ఇది దక్షిణ ముంబై నడిబొడ్డున విశాలమైన ఎస్టేట్గా ఉంది.కొత్త ఓనర్లకు అంబానీతో లింక్ఈ ప్రతిష్టాత్మక లక్ష్మీ నివాస్ బంగ్లాను ఇప్పుడు అంబానీ కుటుంబానికి చెందిన వాగేశ్వరి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తన కీలక వాటాదారుల ద్వారా సొంతం చేసుకుంది. ఈ కంపెనీకి చెందిన ఎలీనా నిఖిల్ మేస్వానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో కీలక వ్యక్తి అయిన నిఖిల్ మేస్వానీ సతీమణి. ఇక ఈ నిఖిల్ మేస్వానీ ఎవరో కాదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన రసిక్లాల్ మేస్వానీ కుమారుడు. ఈయన ధీరూభాయ్ అంబానీ అక్క త్రిలోచన మేనల్లుడు. -
ముకేశ్ అంబానీ 40వ పెళ్లి రోజు.. బంగారు రంగు కేక్.. దానిపై అన్నీ అవే!
భారతీయ కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ.. ఈ నెలలో తన భార్య నీతా అంబానీతో 40వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీరి ఓ ప్రత్యేకమైన కేక్ తయారు చేశారు. 30 కేజీల బరువున్న ఈ కేక్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ప్రత్యేకమైన కేక్ చూడవచ్చు. ఈ కేక్ మీద సింహాలు, జిరాఫీలు, ఏనుగులు, మొసళ్ళు వంటి వివిధ జంతువుల ఆకారాలు బంగారు రంగులో ఉండటం చూడవచ్చు. జామ్నగర్లోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమయిన వంతారాను ప్రేరణగా తీసుకుని ఈ కేక్ మీద జంతువుల బొమ్మలు చిత్రించారు.కేక్ మధ్యలో నీతా, ముకేశ్ అంబానీల మొదటి అక్షరాలు ఉన్నాయి. పై భాగంలో వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ఉండటం చూడవచ్చు. దీనిని ముంబైలోని ప్రముఖ బేకరీ డెలిసియాను నడుపుతున్న బంటీ మహాజన్ తయారు చేశారు.వంతారాఅనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Deliciae by Bunty Mahajan (@delcakes.in) -
ఆసియాలో టాప్ 10 ధనవంతులు (ఫోటోలు)
-
కొత్త కుబేరులు.. ఆసియా బిలియనీర్స్ లేటెస్ట్ లిస్ట్
ఆసియాలో కొత్త కుబేరులు అవతరించారు. ఫోర్బ్స్ ఏషియన్ బిలియనీర్స్ 2025 తాజా ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. 2024లో విడుదల చేసిన ర్యాంకింగ్స్తో పోలిస్తే 2025లో (మార్చి నాటికి) ఆసియా బిలియనీర్లు అపూర్వ సంపదను ఆర్జించగా, ఈ ఏడాది టాప్ 10 ఆసియా బిలియనీర్ల జాబితాలో ఇండోనేషియాకు చెందిన ప్రజోగో పంగేస్తు, భారత్కు చెందిన సావిత్రి జిందాల్ వంటి ప్రముఖులు చోటు కోల్పోయారు. 2025 ఆసియా బిలియనీర్ ర్యాంకింగ్స్లో అగ్రగామిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) నిలిచారు. ఆయన తరువాత ప్రసిద్ధ బాటిల్ వాటర్ కంపెనీ నాంగ్ఫు స్ప్రింగ్ యజమాని జోంగ్ షాన్షాన్ ఆసియాలో రెండవ ధనవంతుడిగా, చైనాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు.ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ సరఫరా సంస్థ కాంటెంపరరీ ఆంపరెక్స్ టెక్నాలజీని (సీఏటీఎల్) నడిపించే రాబిన్ జెంగ్, చైనీస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ షియోమీ సహ వ్యవస్థాపకుడు లీ జున్ 2025 ఆసియా రిచెస్ట్ లిస్ట్లో కొత్తగా చేరారు.యునిక్లో, థియరీ, జె బ్రాండ్ వంటి పోర్ట్ఫోలియో బ్రాండ్లతో 25 దేశాలలో 2,400 పైగా స్టోర్లతో బలమైన ఉనికిని కలిగి ఉన్న ప్రముఖ జపనీస్ రిటైల్ కంపెనీ ఫాస్ట్ రిటైలింగ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ తడాషి యానాయ్ ఒక్కరే జపాన్ నుండి జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక బిలియనీర్.ఆసియాలో టాప్ 10 ధనవంతులు (2025 మార్చి నాటికి )1 ముఖేష్ అంబానీ - 86.9 బి.డాలర్లు - భారత్2 జోంగ్ షాన్షాన్ - 56.0 బి.డాలర్లు - చైనా3 గౌతమ్ అదానీ 54.7 బి.డాలర్లు - భారత్4 మా హుటెంగ్ 53.3బి.డాలర్లు - చైనా5 జాంగ్ యిమింగ్ 45.6 బి.డాలర్లు - చైనా 6 తడాషి యానై & ఫ్యామిలీ 45.1 బి.డాలర్లు - జపాన్ 7 లీ జున్ 42.6 బి.డాలర్లు - చైనా 8 కొలిన్ హువాంగ్ 40.0 బి.డాలర్లు - చైనా 9 లీ కా-షింగ్ 38.3 బి.డాలర్లు - హాంగ్ కాంగ్ 10 రాబిన్ జెంగ్ 37.6 బి.డాలర్లు - హాంగ్ కాంగ్ -
రిలయన్స్కు రూ.24,500 కోట్ల డిమాండ్ నోటీసులు
వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కి కేంద్రం షాకిచ్చింది. ఓఎన్జీసీకి చెందిన క్షేత్రం నుంచి గ్యాస్ అక్రమంగా ఉత్పత్తి చేసినందుకు, గడువులోగా బ్యాటరీ సెల్ ప్లాంటు ఏర్పాటు చేయనందుకు గాను రెండు డిమాండ్ నోటీసులు ఇచ్చింది. మొదటి దానికి సంబంధించి రూ.24,500 కోట్ల నష్టపరిహారం కట్టాలని ఆదేశించింది. ఇక రెండో అంశానికి సంబంధించి సుమారు 3.1 కోట్ల పెనాల్టీ విధించింది.కృష్ణా గోదావరి బేసిన్లో రిలయన్స్–బీపీ, ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ గ్యాస్ క్షేత్రాలు పక్కపక్కనే ఉన్నాయి. ఓఎన్జీసీ క్షేత్రం నుంచి తమ క్షేత్రంలోకి వచ్చిన గ్యాస్ను రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ బీపీ వెలికితీసి, విక్రయించుకుని, లబ్ధి పొందినట్లు అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి రిలయన్స్, బీపీ నష్టపరిహారం కట్టాలనే అంశం తెరపైకి వచ్చింది. కానీ, ఈ వివాదంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో కంపెనీలకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 14న వాటిని తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో తమతో పాటు నికో (గతంలో భాగస్వామి)కి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ డిమాండ్ నోటీసులు పంపినట్లు ఎక్ఛ్సేంజీలకు రిలయన్స్ తెలిపింది. ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్: ఆరు నెలలు.. అన్లిమిటెడ్మరోవైపు, 10 గిగావాట్ హవర్ (జీడబ్ల్యూహెచ్) సామర్థ్యంతో బ్యాటరీ సెల్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి తొలి మైలురాయి పనులను పూర్తి చేయడంలో జాప్యానికిగాను అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీ స్టోరేజ్ లిమిటెడ్కి భారీ పరిశ్రమల శాఖ పెనాల్టీ విధించినట్లు రిలయన్స్ తెలిపింది. ఈ గడువును పొడిగించాలంటూ ప్రభుత్వాన్ని ఆర్ఎన్ఈబీఎస్ఎల్ కోరినట్లు వివరించింది. జనవరి 1 నుంచి మార్చి 3 వరకు లెక్కేస్తే జరిమానా రూ. 3.1 కోట్లు ఉంటుంది. -
అంబానీ వంతారా : పులులు, సింహాలతో నరేంద్ర మోదీ (ఫోటోలు)
-
అంబానీ వంతారా: పులి పిల్లలతో నరేంద్ర మోదీ - వీడియో
గుజరాత్లోని వన్యప్రాణుల రక్షణ, పునరావాసం & సంరక్షణ కేంద్రంమైన 'వంతారా'ను ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' ప్రారంభించారు. అక్కడ పరిసరాలను సందర్శించారు. అక్కడ పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో ఆయన సన్నిహితంగా మెలిగారు.వంతారాలోని వన్యప్రాణుల ఆసుపత్రిని ప్రధానమంత్రి సందర్శించారు. అక్కడ జంతువుల కోసం ఏర్పాటు చేసిన MRI, CT స్కాన్లు, ICUలు మొదలైన వాటితో కూడిన పశువైద్య సౌకర్యాలను వీక్షించారు. అంతే కాకుండా వైల్డ్లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన అనేక విభాగాలను కూడా పరిశీలించారు.ఆసియాటిక్ సింహానికి MRI చేయడం, హైవేలో కారు ఢీకొట్టిన తర్వాత గాయపడిన చిరుతకు ఆపరేషన్ చేయడం వంటి దృశ్యాలను మోదీ చూసారు. ఆసియాటిక్ సింహం పిల్లలు, తెల్ల సింహం పిల్ల, అరుదైన మరియు అంతరించిపోతున్న జాతి చిరుతపులి పిల్ల, కారకల్ పిల్ల వంటి వివిధ జాతులతో సరదాగా గడిపడమే కాకుండా.. వాటికి పాలు పట్టించడం వంటివియు కూడా మోదీ చేశారు.వంతారా కేంద్రంలో.. రక్షించబడిన జంతువులను వాటి సహజ ఆవాసాలను దగ్గరగా ప్రతిబింబించే ప్రదేశాలలో ఉంచారు. ఇక్కడ ఆసియాటిక్ సింహం, చిరుత, ఒక కొమ్ము గల ఖడ్గమృగం, జిరాఫీ, చింపాంజీ, ఒరంగుటాన్, హిప్పోపొటామస్, మొసళ్ళు, ఏనుగులు, పెద్ద పాములు మొదలైన జంతువులను మోదీ చూసారు.ప్రపంచంలోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన ఏనుగుల ఆసుపత్రిని కూడా ఆయన సందర్శించారు. జంతువులను వీక్షించడమే కాకుండా.. వాటికి సేవ చేస్తున్న వైద్యులు, సహాయక సిబ్బంది, కార్మికులతో ప్రధానమంత్రి సంభాషించారు. వంతారాలో 2,000 కంటే ఎక్కువ జాతులు.. రక్షించబడిన, అంతరించిపోతున్న 1.5 లక్షలకు పైగా జంతువులు ఉన్నాయి.Watch: Prime Minister Narendra Modi inaugurated and visited Vantara, a wildlife rescue and conservation center in Gujarat, home to over 1.5 lakh rescued animals. He explored its advanced veterinary facilities, interacted with rare species, witnessed surgeries, and participated in… pic.twitter.com/XV5j8mELaz— IANS (@ians_india) March 4, 2025 -
అంబానీ అల్లుడికి ట్యాక్స్ నోటీసు..
ఆసియాలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ అల్లుడికి భారీ ట్యాక్స్ నోటీసు వచ్చింది. ఇషా అంబానీకి భర్త అయిన ఆనంద్ పిరమల్ ప్రమోటర్గా ఉన్న రూ.19,675 కోట్ల పిరమల్ గ్రూప్ లో ప్రముఖ సంస్థ అయిన పిరమల్ ఎంటర్ప్రైజెస్కు రూ.1,502 కోట్ల పన్ను డిమాండ్ నోటీసు అందింది. 2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన ఫార్మా వ్యాపారాన్ని పిరమల్ ఫార్మా లిమిటెడ్కు విక్రయించడానికి సంబంధించి మహారాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఈ నోటీసు జారీ చేశారు. రూ.4,487 కోట్ల విలువైన ఈ లావాదేవీలో అనుబంధ సంస్థల బదలాయింపు కూడా ఉంది. రూ.1,502 కోట్ల పన్ను డిమాండ్లో పన్ను మొత్తం రూ.837.17 కోట్లు కాగా వడ్డీ కింద రూ.581.53 కోట్లు, జరిమానాగా రూ.83.71 కోట్లు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.వివాదం ఇదే.. లావాదేవీ వర్గీకరణలోనే పన్ను వివాదం సారాంశం ఉంది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ అమ్మకాన్ని "స్లంప్ సేల్" గా వర్గీకరించింది. వ్యక్తిగత విలువలను కేటాయించకుండా ఆస్తులు, అప్పులతో సహా మొత్తం వ్యాపార సంస్థను బదిలీ చేస్తే దాన్ని స్లంప్ సేల్గా పేర్కొంటారు. ఇటువంటి అమ్మకాలు సాధారణంగా జీఎస్టీ పరిధిలోకి రావు. అయితే ఈ వర్గీకరణ తప్పని, ఈ లావాదేవీ "ఐటమైజ్డ్ సేల్" అని పన్ను అధికారులు వాదిస్తున్నారు. ఇక్కడ ఆస్తులు, అప్పులకు ప్రత్యేక విలువలు కేటాయించి మొత్తం అమ్మకాలపై 18 శాతం జీఎస్టీ విధించారు.పిరమల్ ఎంటర్ప్రైజెస్ స్పందనపన్ను ఉత్తర్వులను పిరమల్ ఎంటర్ప్రైజెస్ తీవ్రంగా ఖండించింది. ఈ డిమాండ్ సమంజసం కాదని భావించిన కంపెనీ ఈ తీర్పును సవాలు చేయడానికి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. "కంపెనీ తన ఉత్తమ ప్రయోజనాల కోసం తగిన చర్యలు తీసుకుంటుంది. ఆర్డర్ ను పక్కన పెట్టడం వల్ల సానుకూల ఫలితం ఉంటుందని సహేతుకంగా ఆశిస్తున్నాము. ఈ ఆర్డర్ కంపెనీ లాభనష్టాల ప్రకటనపై ఎలాంటి ప్రభావం చూపదు" అని రెగ్యులేటరీ ఫైలింగ్ లో పిరమల్ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది.ఇది చదివారా? అంబానీ వారసులలో ఎవరు ఎక్కువ రిచ్?ఆర్థిక ప్రభావంపన్ను వివాదం కొనసాగుతున్నప్పటికీ, పిరమల్ ఎంటర్ప్రైజెస్ 2024 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో రూ .38.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.2,476 కోట్లతో పోలిస్తే 1.1 శాతం క్షీణతతో రూ.2,449 కోట్లకు పరిమితమైంది. వడ్డీ, పన్ను, తరుగుదల, ఎమోర్టైజేషన్ (ఇబిటా) ముందు ఆదాయం 10.8 శాతం క్షీణించి రూ.1,075 కోట్లకు పరిమితమైంది. -
'నాన్న అర్ధరాత్రి 2 గంటల వరకు మేల్కొనే ఉంటారు'
భారతీయ కుబేరుడు 'ముకేశ్ అంబానీ' గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలను.. ఆకాష్ అంబానీ పేర్కొన్నారు. నాన్న పనితీరు నాకు ఆదర్శమని 'ముంబై టెక్ వీక్' కార్యక్రమంలో వెల్లడించారు.ఇప్పటికి కూడా నాన్న (ముకేశ్ అంబానీ) తనకొచ్చిన అన్ని ఈమెయిల్కు రిప్లై ఇస్తూ.. తెల్లవారుజామున 2 గంటల వరకు మేల్కొని ఉంటారని ఆకాష్ అంబానీ చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా.. కంపెనీ వృద్ధి కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఇది 45వ ఏడాది. ఆయన పనతీరు నాకు ఆదర్శమని.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.అమ్మకు, నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఇద్దరూ టీవిలో క్రికెట్ కూస్తూ ఉంటాము. అప్పుడు అమ్మ చిన్నచిన్న విషయాలను కూడా గమనిస్తూ ఉంటారు. అవన్నీ నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అమ్మ, నాన్నకు అంకితభావం ఎక్కువ. అవి మాకందరికీ స్ఫూర్తి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా కుటుంబాన్ని చూసే నేర్చుకున్నానని చెప్పారు.జీవితంలో పని మాత్రమే కాదు, కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. గత 10 సంవత్సరాలుగా రిలయన్స్లో పనిచేస్తూనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నాను. ఇషా, నేను కవల పిల్లలం. మేము ఇద్దరూ కూడా కుటుంబ విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. నా పిల్లలతో గడపడం నాకు చాలా ఇష్టం. శ్లోకా భార్యగా రావడం నా అదృష్టం. తను నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటుంది.పనిగంటలుముంబై టెక్ వీక్ కార్యక్రమంలో 'ఆకాష్ అంబానీ' పనిగంటలపై కూడా మాట్లాడారు. ఆఫీసులో ఎంతసేపు (ఎన్ని గంటలు) ఉంటారనేది ముఖ్యం కాదు, చేస్తున్న పనిలో నాణ్యత ఉండాలి, దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను అని అన్నారు. వృద్ధి అంటే జీవితం అనేది రిలయన్స్ నినాదం, అది వ్యక్తిగత జీవితానికి కూడా వరిస్తుందని అన్నారు. కాబట్టి మీరు ప్రతి రోజు ఎదగడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆర్బీఐని సంప్రదించండి.. అనిల్ అంబానీకి కోర్టు ఆదేశంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మార్గనిర్దేశం చేయడానికి తమ కంపెనీ 1,000 మందికి పైగా డేటా సైంటిస్టులు, పరిశోధకులు, ఇంజనీర్లతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది ఆకాష్ అంబానీ అన్నారు. అంతే కాకుండా ఏఐలో దేశం ముందుకు సాగటానికి సహాయపడటానికి రిలయన్స్.. జామ్నగర్లో 1GW సామర్థ్యం గల డేటా సెంటర్ను కూడా కంపెనీ ఏర్పాటు చేస్తోందని అన్నారు. -
ప్రపంచంలోని సూపర్ బిలియనీర్స్: జాబితాలో 24 మంది
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన సూపర్ బిలియనీర్ల జాబితాను 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' (WSJ) విడుదల చేసింది. గ్లోబల్ వెల్త్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆల్ట్రాటా డేటా ఆధారంగా డబ్ల్యూఎస్జే 24 మందిని సూపర్ బిలియనీర్లుగా గుర్తించింది. సంపద నికర విలువ 50 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు సూపర్ బిలియనీర్లు. 24 మంది సూపర్ బిలియనీర్లలో, 16 మంది సెంటీ బిలియనీర్ల వర్గంలోకి వస్తారు, వీరి నికర విలువ కనీసం 100 బిలియన్ డాలర్లు.ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుడబ్ల్యూఎస్జే ప్రకారం.. టెక్ బిలియనీర్ 'ఎలాన్ మస్క్' భూమిపై అత్యంత ధనవంతుడు. ఈయన సంపద 419.4 బిలియన్ డాలర్లు (రూ. 36 లక్షల కోట్ల కంటే ఎక్కువ). మస్క్ సారథ్యంలో టెస్లా, స్పేస్ఎక్స్, న్యూరాలింక్, ఎక్స్ వంటి కంపెనీలు ఉన్నాయి.సూపర్ బిలియనీర్ల జాబితాలో భారతీయ వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ (17వ స్థానం), గౌతమ్ అదానీ (21వ స్థానం) కూడా ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నికర విలువ 90.6 బిలియన్ డాలర్లు (రూ.7 లక్షల కోట్ల కంటే ఎక్కువ), అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ 60.6 బిలియన్ డాలర్లు (రూ.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ).సూపర్ బిలియనీర్ల జాబితా➤ఎలాన్ మస్క్: రూ.36.65 లక్షల కోట్లు➤జెఫ్ బెజోస్: రూ. 23.05 లక్షల కోట్లు➤బెర్నార్డ్ ఆర్నాల్ట్: రూ. 20.87 లక్షల కోట్లు➤లారెన్స్ ఎల్లిసన్: రూ. 20. 71 లక్షల కోట్లు➤మార్క్ జుకర్బర్గ్: రూ. 19.29 లక్షల కోట్లు ➤సెర్గీ బిన్: రూ. 14.02 లక్షల కోట్లు➤స్టీవెన్ బాల్మెర్: రూ. 13.75 లక్షల కోట్లు➤వారెన్ బఫెట్: రూ. 13.47 లక్షల కోట్లు➤జేమ్స్ వాల్టన్: రూ. 10.27 లక్షల కోట్లు➤సామ్యూల్ రాబ్సన్ వాల్టన్: రూ. 9.9 లక్షల కోట్లు➤అమాన్సియో ఒర్టెగా: రూ. 9.8 లక్షల కోట్లు➤ఆలిస్ వాల్టన్: రూ. 9.6లక్షల కోట్లు➤జెన్సెన్ హువాంగ్: రూ. 9.4 లక్షల కోట్లు ➤బిల్ గేట్స్: రూ. 9.2 లక్షల కోట్లు ➤మైఖేల్ బ్లూమ్బెర్గ్: రూ. 9.0 లక్షల కోట్లు➤లారెన్స్ పేజ్: రూ. 8.8 లక్షల కోట్లు ➤ముఖేష్ అంబానీ: రూ. 7.9 లక్షల కోట్లు ➤చార్లెస్ కోచ్: రూ. 5.8 లక్షల కోట్లు ➤జూలియా కోచ్: రూ. 5.6 లక్షల కోట్లు ➤ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్: రూ. 5.4 లక్షల కోట్లు ➤గౌతమ్ అదానీ: రూ. 5.2 లక్షల కోట్లు ➤మైఖేల్ డెల్: రూ. 5.2 లక్షల కోట్లు ➤జోంగ్ షాన్షాన్: రూ. 5.0 లక్షల కోట్లు ➤ప్రజోగో పంగేస్తు: రూ. 4.8 లక్షల కోట్లు -
భారత్-పాక్ మ్యాచ్.. విజేతగా ముఖేష్ అంబానీ!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇటీవల భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన సత్తా చాటారు. దాంతోపాటు ఈ మ్యాచ్ ప్రారంభం కాకముందే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ రికార్డు సృష్టించారు. అదెలా అనుకుంటున్నారా.. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జియోహాట్స్టార్ భారత్-పాక్ మ్యాచ్ను ప్రసారం చేసే ప్రత్యేక హక్కులను కలిగి ఉంది. దాంతో కొన్ని గంటలపాటు సుమారు 12 కోట్ల మందికిపైగా ఈ మ్యాచ్ను వీక్షించారు. కంపెనీకి ఇతర ప్రసార హక్కులు, యాడ్ రెవెన్యూ ద్వారా బారీగానే ఆదాయం సమకూరినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో భారత్-పాక్ మ్యాచ్లో భారత్ విజయం సాధించడంతోపాటు దీన్ని అందరూ వీక్షించేందుకు ప్రసార హక్కులు సాధించిన ముఖేశ్ అంబానీ కూడా విజేతగానే నిలిచినట్లు భావిస్తున్నారు.రిలయన్స్ ఇటీవలే అధికారికంగా హాట్స్టార్తో కలిసి జియోహాట్స్టార్ను ఆవిష్కరించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు కంపెనీలకు ఎంతో లాభదాయకమని రెండు సంస్థలు గతంలో తెలిపాయి. ఇటీవల జరిగిన ఒక్కమ్యాచ్లోనే భారీగా రెవెన్యూ సంపాదించినట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని ముందే గ్రహించిన కోట్లాదిమంది వ్యూయర్స్ జియోహాట్స్టార్లో ఈ మ్యాచ్ను లైవ్లో వీక్షించారు. ఇది ప్లాట్ఫామ్ వ్యూయర్షిప్ను పెంచడమే కాకుండా ప్రకటనలు, సబ్స్క్రిప్షన్లను, సంస్థ ఆదాయాన్ని కూడా పెంచింది. అంతేకాకుండా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని మరో ఛానెల్ స్పోర్ట్స్ 18 ఈ మ్యాచ్ను టెలివిజన్లో ప్రసారం చేసే హక్కులను కలిగి ఉంది. దీంతో అంబానీ కంపెనీ ఆన్లైన్, టీవీ వ్యూయర్షిప్ రెండింటి నుంచి లాభపడింది.ఇటీవల భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన సత్తా చాటారు. 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాలో కోహ్లీ సెంచరీ (111 బంతుల్లో 100) చేశారు. మరో 7.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో భారత్ మ్యాచ్ను కైవసం చేసుకుంది. ఈ విజయం సెమీఫైనల్లో భారత్ స్థానాన్ని సుస్థిరం చేయడమే కాకుండా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత వన్డేల్లో పాకిస్థాన్పై రికార్డు నెలకొల్పింది.ఇదీ చదవండి: గాల్లో ఎగిరే కారు వచ్చేసింది..! ధర ఎంతంటే..జియోహాట్స్టార్ ప్లాన్లు ఇలా..రూ.195 డేటా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15GB డేటాను అందిస్తుంది. క్రీడలు, వినోద ప్రియులకు ఇది తగిన ఎంపికగా ఉంటుంది. ఇతర ప్రామాణిక రీఛార్జ్ ప్లాన్ల మాదిరిగా ఈ ఆఫర్లో వాయిస్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో లభించే జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ 90 రోజుల మొబైల్ ప్లాన్ మాత్రమే. అంటే యూజర్లు జియోహాట్స్టార్ను మొబైల్లో మాత్రమే వీక్షించగలరు.రీచార్జ్ ఇలా..వినియోగదారులు ఈ ఆఫర్ను మైజియో (MyJio) యాప్, జియో వెబ్సైట్ లేదా అధీకృత జియో రిటైలర్ల ద్వారా పొందవచ్చు. రీఛార్జ్ ప్రక్రియ ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే ఉంటుంది. థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.మరో ప్లాన్రూ.195 డేటా ప్లాన్తోపాటు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వచ్చే మరో స్టాండర్డ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అదే రూ.949 ప్లాన్. దీనికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 2GB రోజువారీ డేటా, అపరిమిత 5G డేటా, 84 రోజుల పాటు జియో హాట్స్టార్ ఉచిత మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిస్తుంది. -
ఐదేళ్లలో రిలయన్స్ రూ.50,000 కోట్ల పెట్టుబడులు
అస్సాం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వచ్చే ఐదేళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ‘అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్’ సందర్భంగా ఆర్ఐఎల్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఈమేరకు ప్రకటన చేశారు. టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, రిటైల్ విస్తరణ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంపెనీ ప్రతిష్టాత్మక ప్రణాళికలను వివరించారు. 2018లో జరిగిన సదస్సులో రాష్ట్రంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ హామీ ఇచ్చిందని, కానీ దానిని రూ.12,000 కోట్లకు పెంచామని అంబానీ గుర్తు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం సహా వివిధ రంగాలకు ప్రయోజనం చేకూర్చేలా ఏఐను ఉపయోగించుకోవాలని ఈ సమ్మిట్ లక్ష్యంగా పెట్టుకుంది.కీలక పెట్టుబడి రంగాలుఏఐ డేటా సెంటర్: అస్సాంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-రెడీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆర్ఐఎల్ యోచిస్తోంది. కృత్రిమ మేధ సహాయంతో ఉపాధ్యాయులు, వైద్యులు, రైతులు అస్సాం నివాసితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని కంపెనీ ఆశిస్తున్నట్లు అంబానీ తెలిపారు.మెగా ఫుడ్ పార్క్: అస్సాంలో సమృద్ధిగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు విలువను జోడించడానికి మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ చర్య రాష్ట్ర రైతులకు మద్దతు ఇస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్, పంపిణీకి కొత్త అవకాశాలను సృష్టించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగవుతుంది.రిలయన్స్ రిటైల్ విస్తరణ: అస్సాంలో రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆర్ఐఎల్ యోచిస్తోంది. ఈ సంఖ్యను 400 నుంచి 800కు పెంచనుంది. ఈ విస్తరణ రిటైల్ ల్యాండ్ స్కేప్ను మెరుగుపరుస్తుంది. వినియోగదారులకు విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు ఇది తోడ్పడుతుంది.క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ: అణు ఇంధనంతో సహా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి అస్సాంను హబ్గా మార్చడంపై కూడా రిలయన్స్ దృష్టి సారించనుంది. అస్సాంలో రెండు కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లను ఆర్ఐఎల్ నిర్మించనుంది. ఇవి ఏటా 8 లక్షల టన్నుల క్లీన్ బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తాయి. ప్రతిరోజూ రెండు లక్షల ప్యాసింజర్ వాహనాలకు ఇంధనం అందించేందుకు సరిపోతుంది.హై-ఎండ్ హాస్పిటాలిటీ: హై ఎండ్ హాస్పిటాలిటీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఆర్ఐఎల్ అస్సాం నడిబొడ్డున విలాసవంతమైన సెవెన్ స్టార్ ఒబెరాయ్ హోటట్ను నిర్మించనుంది. పర్యాటకులను ఆకర్షించడం, రాష్ట్ర ఆతిథ్య ప్రమాణాలను పెంచడం ఈ అభివృద్ధి లక్ష్యం.ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో గోల్డ్రేటు.. ఈ దేశాల్లో చీప్గా కొనుగోలుఈ కార్యక్రమాలు అసోంలోని యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని అంబానీ తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ తన ‘స్వదేశ్’ స్టోర్ల ద్వారా గ్రీన్ గోల్డ్(వెదురు)ను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాలను భారతదేశ అభివృద్ధిలో ప్రధానంగా నిలిపారని అంబానీ కొనియాడారు. -
అంబానీ వారసులలో ఎవరు ఎక్కువ రిచ్?
దేశంలోనే అత్యంత సంపన్నుడైన పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్వర్త్ 91.1 బిలియన్ డాలర్లు. ఆయన ముగ్గురు పిల్లలు ఆకాష్ అంబానీ , ఇషా అంబానీ, అనంత్ అంబానీలు చేతికొచ్చారు. కుటుంబ వ్యాపారంలో వారు కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కంపెనీలో గణనీయమైన వాటాలను కలిగి ఉన్నారు.అయితే ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు వారసుల్లో ఎవరు ఎక్కువ సంపన్నులు (Richest) అనే ఆసక్తికర సందేహం ఎప్పుడైనా కలిగిందా? దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఆకాశ్, అనంత్, ఇషా అంబానీల నెట్ వర్త్ ఎంత? వ్యాపారంలో ఎవరి పాత్ర ఏంటి అన్నది కూడా పరిశీలిద్దాం..ఆకాష్ అంబానీముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు సంతానంలో పెద్దవాడు, ఇషా అంబానీకి కవల సోదరుడు అయిన ఆకాష్ (Akash Ambani) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్గా పనిచేస్తున్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులో డైరెక్టర్గా కూడా ఉన్నారు . ఆకాష్ వార్షిక జీతం రూ . 5.6 కోట్లు, దీని ద్వారా ఆయన 40.1 బిలియన్ డాలర్ల ( సుమారు రూ . 3,32,815 కోట్లు ) నెట్వర్త్ను సంపాదించారు.ఇషా అంబానీ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ (Isha Ambani).. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో నాన్ - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని కలిగి ఉన్నారు . ఆమె రిలయన్స్ రిటైల్ , రిలయన్స్ జియో, రిలయన్స్ ఫౌండేషన్లలో ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బృందంలో కీలక సభ్యురాలు కూడా. అంతే కాకుండా తీరా బ్యూటీకి ఇషా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకురాలు. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమె వార్షిక జీతం సుమారు రూ . 4.2 కోట్లు. ఆమె నెట్వర్త్ రూ . 800 కోట్లని అంచనా.అనంత్ అంబానీఅంబానీ వారసులలో ఆఖరి వాడు అనంత్ అంబానీ (Anant Ambani). రిలయన్స్ జియోలో ఎనర్జీ, టెలికమ్యూనికేషన్ రంగాలను పర్యవేక్షిస్తున్నారు. ఈయన జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులలో డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. అనంత్ వార్షిక జీతం రూ . 4.2 కోట్లు. నెట్వర్త్ విషయానికి వస్తే 40 బిలియన్ డాలర్లు ( సుమారు రూ . 3,32,482 కోట్లు).ఆకాషే అత్యంత రిచ్ముఖేష్ అంబానీ ముగ్గురు వారసులలో ఆకాష్ అంబానీ అత్యంత ధనవంతుడు. తన తమ్ముడు అనంత్ కంటే స్వల్ప ఆధిక్యంతో 40.1 బిలియన్ డాలర్ల నికర సంపదను కలిగి ఉన్నారు. ఇక ఇషా అంబానీ విషయానికి వస్తే రూ .800 కోట్ల నెట్వర్త్తో సోదరులిద్దరి కన్నా ఆమడ దూరంలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ అంబానీ వారసులందరూ కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టుకుంటున్నారు. -
మహాకుంభమేళాలో స్టాల్స్ : స్ట్రీట్ వెండర్లుగా అంబానీ, అదానీ, మస్క్.. (ఫొటోలు)
-
అమెరికాలో నీతా అంబానీకి అరుదైన గౌరవం (ఫోటోలు)
-
Maha Kumbh Mela : సింపుల్గా, హుందాగా రాధిక-అనంత్ అంబానీ జంట
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబంతో కలిసి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్నమహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఈ భక్తజన సంద్రంలో అంబానీ కుటుంబంకూడా చేరింది. ముఖేష్ అంబానీ,కోకిలాబెన్ అంబానీ, ఆకాశ్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతాతో పాటు, అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ,చిన్న కోడలు రాధిక మర్చంట్ (ఫిబ్రవరి 11న) త్రివేణి సంగమంలో పవిత్ర ఆచారాలలో పాల్గొని పవిత్ర స్నానం చేశారు. (మున్నార్ : థ్రిల్లింగ్ డబుల్ డెక్కర్ బస్, గుండె గుభిల్లే! వైరల్ వీడియో)మహా కుంభ్లో, రాధిక తన లుక్తో ఆకట్టుకుంది. నేవీ బ్లూ సిల్క్ లగ్జరీ కుర్తాలో హుందాగా కనిపించింది. గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీతో జయంతి రెడ్డి రూపొందించిన ఈ దుస్తుల విలువ ఇపుడు హాట్ టాపిక్గా నిలిచింది. V-నెక్లైన్ ,మోచేయి వరకు పొడవున్న స్లీవ్లు నెక్లైన్ బోర్డర్లను జరీ ఎంబ్రాయిడరీతో తీర్చి దిద్దారు. ఈ కుర్తాకు కాంట్రాస్టింగ్ పుదీనా గ్రీన్ ధోతీ ప్యాంటు, మ్యాచింగ్ దుపట్టాతో జత చేసింది. దీని ధర లక్ష రూపాయలని వివిధ నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే జ్యయుల్లరీ తక్కువగా ఉంచినప్పటికీ మోడ్రన్గా ఉండటం విశేషం. సింపుల్ పోనీటైల్తో డైమండ్ స్టడ్ చెవిపోగులు, హారాన్ని ధరించి ఆధ్యాత్మిక లుక్లో అలరించింది. (Valentines Day : లవ్ బర్డ్స్కోసం ది బెస్ట్ డెస్టినేషన్ ఇదే!)ఇక రాధికకు జతగా అనంత్ అంబానీ అద్భుతమైన ఎరుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. వెండి మోటిఫ్లు , చక్కటి,చిక్కటి బంగారు ఎంబ్రాయిడరీ చేసిన మెరూన్ వెయిస్ట్కోట్, షైనింగ్ రెడ్ ఎరుపు కుర్తాను ధరించాడు. అలాగే బంగారు గొలుసు, నుదుటిన తిలకంతో తన సాంప్రదాయ రూపాన్ని పూర్తి చేశాడు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) కాగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలోమహా కుంభమేళా 2025 ఉత్సాహంగా సాగుతోంది. సూర్యుని చుట్టూ బృహస్పతి చుట్టే కక్ష్య పూర్తైన సూచనగా జరుపుకునే ముఖ్యమైన తీర్థయాత్ర పండుగ ఇది. 12-కుంభమేళా చక్రం ముగింపును ఇది సూచిస్తుంది. దీనిని అధికారికంగా 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళాగా పిలుస్తారు. ఈ కార్యక్రమం జనవరి 13న మొదలై, ఫిబ్రవరి 26 వరకు సాగనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశంగా గుర్తింపు పొందింది. -
మహా కుంభమేళాలో అంబానీ ఫ్యామిలీ (ఫోటోలు)
-
మహా కుంభమేళాలో అంబానీ కుటుంబం పవిత్ర స్నానం
ప్రయాగ్రాజ్, 11 ఫిబ్రవరి 2025: మహా కుంభమేళా(Maha Kumbh Mela) సందర్భంగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ముకేశ్ అంబానీ(Mukesh Ambani) తన తల్లి, కుమారులు, మనుమలు/మనుమరాళ్లతో కలిసి పవిత్ర స్నానం చేశారు.ముకేశ్ అంబానీ తన తల్లి కోకిలాబెన్, కుమారులు ఆకాశ్, ఆనంత్, కోడళ్ళు శ్లోకా, రాధికా, మనుమలు పృథ్వి, వేద, అక్కలు దీప్తి సల్గావ్కర్, నీనా కోఠారి తదితరులతో కలిసి స్నానం చేశారు. వీరితో పాటు ముకేశ్ అంబానీ అత్త పూర్ణిమాబెన్ దలాల్ మరియు మరదలు మమతాబెన్ దలాల్ కూడా పాల్గొన్నారు.గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమం వద్ద అనేకమంది యాత్రికులతో కలిసి అంబానీ కుటుంబం ఆధ్యాత్మిక యాత్రలో భాగమైంది. నిరంజని అఖాడాకు చెందిన స్వామి కైలాషానంద గిరిజీ మహారాజ్ గంగా పూజను నిర్వహించారు. పూజ అనంతరం ముకేశ్ అంబానీ పరమార్థ్ నికేతన్ ఆశ్రమానికి చెందిన స్వామి చిదానంద సరస్వతీ మహారాజ్ను కలుసుకున్నారు. ఆశ్రమంలో అంబానీ కుటుంబం ప్రసాదం, లైఫ్ జాకెట్లను పంపిణీ చేసింది.రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మహా కుంభమేళాలో యాత్రికుల సేవ కోసం ‘తీర్థ యాత్రి సేవ’ పేరిట వివిధ సేవలను అందిస్తోంది. ఈ యాత్రలో యాత్రికుల సంక్షేమం, సౌకర్యాలను మెరుగుపరచడానికి కంపెనీ ఈ ప్రత్యేక సేవలను చేపడుతోంది.‘వీ కేర్’ తత్వాన్ని ఆధారంగా తీసుకుని రిలయన్స్ యాత్రికులకు పౌష్టికమైన భోజనం (అన్న సేవ), పూర్తి వైద్యం, భద్రతా రవాణా, మెరుగైన కనెక్టివిటీ వంటి అనేక సేవలను అందిస్తోంది. అంతేకాకుండా పవిత్ర నదీ జలాల్లో భద్రత, సౌకర్యవంతమైన విశ్రాంతి కేంద్రాలు, స్పష్టమైన మార్గదర్శక వ్యవస్థ, పరిపాలన, పోలీస్, మరియు లైఫ్ గార్డులకు మద్దతు వంటి ఇతర సేవలు కూడా అందిస్తోంది. -
నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్
ఆసియాలో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) కు చైర్మన్ ముఖేష్ అంబానీ. మరోవైపు ఆయన భార్య నీతా అంబానీ ((Nita Ambani) కూడా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్గా, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) స్థాపకురాలిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాగే ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ యజమానిగా వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు. అంతేకాదు ఐఓసీ సభ్యురాలిగా ఉన్నారు నీతా అంబానీ. బిలియనీర్ అంబానీ తన భార్యకు ఇచ్చిన విలువైన బహుమతి ఒకటి ఇపుడు నెట్టింట సందడిగా మారింది. అదేంటో చూద్దామా. వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్గా రాణిస్తున్న తన భార్య ప్రయాణ ఇబ్బంది లేకుండా ముఖేష్ అంబానీ ఆమెకు ఒక ప్రైవేట్ జెట్ను బహుమతిగా ఇచ్చాట. 2007లో నీతా అంబానీ పుట్టినరోజున అంబానీ ఈ అందమైన గిప్ట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆమె ప్రయాణాల కోసం కస్టమ్-ఫిట్టెడ్ ఎయిర్బస్ 319ను ప్రైవేట్ జెట్ బహుమతిగా ఇచ్చి నీతాను సర్ప్రైజ్ చేశారట. సహా అల్ట్రా-లగ్జరీ ఇంటీరియర్లతో అదిరిపోయే దీని విలువ రూ.230 కోట్లు. అత్యంత అందమైన ఈ ప్రైవేట్ జెట్ ఫైవ్ స్టార్ హోటల్ కంటే తక్కువేమీ కాదు.కస్టమ్-ఫిట్టెడ్ ఎయిర్బస్ 319 ప్రత్యేకతలుచూడ్డానికి విలాసవంతంగా, అందంగా ఉండే ప్రైవేట్ జెట్లోని సౌకర్యాలు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి. అటాచ్డ్ బాత్రూమ్తో కూడిన మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందీ ప్రైవేట్ జెజ్లో. ఒకేసారి 10-12 మందికి పైగా కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. ఈ అసాధారణ బహుమతి అన్ని సౌకర్యాలతో కూడిన సజావుగా, విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా రూపొందించారు. సుదీర్ఘ ప్రయాణాల సమయంలో సురక్షితంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ జెట్ విమానంలో హై-డెఫినిషన్ స్క్రీన్లు, సరౌండ్ సౌండ్, పెద్ద మీడియా లైబ్రరీ ఉన్నాయి. ప్రీమియం ఫిట్టింగ్లు, మార్బుల్ యాక్సెంట్లు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బాత్రూమ్లు ఉన్నాయి. ఈ జెట్ విమానంలో ఎర్గోనామిక్ సీటింగ్ పెద్ద కాన్ఫరెన్స్ టేబుల్, విశాలమైన లాంజ్ ఏరియాదీని సొంతం.ప్రైవేట్ జెట్లో ధీరేంద్ర శాస్త్రిఅనంత్ అంబానీ వివాహ సమయంలో ఈ ప్రైవేట్ జెట్ విశేషమైన దృష్టిని ఆకర్షించింది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర శాస్త్రి ఒక ఇంటర్వ్యూలో అనంత్ తన ప్రయాణానికి ప్రైవేట్ జెట్ను అందించి, ఈ కార్యక్రమానికి హాజరు కావాలని వ్యక్తిగతంగా ఆహ్వానించారని వెల్లడించారు.అయితే బిజీగా షెడ్యూల్ కారణంగా తొలిత సంకోచించిన శాస్త్రి అంబానీ ఆహ్వానాన్ని అందుకుని పెళ్లి తంతులుపాల్గొన్నారు. అంతేకాదు అంబాన కుటుంబం ఇచ్చిన ఆతిథ్యానికి ముగ్దులైపోయారు కూడా. కాగా అంబానీకి దీంతోపాటు బోయింగ్ 737 మాక్స్ 9 కూడా ఉంది. అధునాతన సాంకేతికత, LEAP-18 ఇంజిన్లతో కూడిన ఈ విమానం భారతదేశంలోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్లలో ఒకటి. -
ఏఐకు బానిసలుగా మారొద్దు
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఇటీవల జరిగిన పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ (PDEU) స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కృత్రిమమేధపై చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. భారతదేశ భవిష్యత్తుకు కృత్రిమమేధ(AI) వాడకం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఏఐ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, దాని శక్తిని బాధ్యతాయుతంగా ఉపయోగించాలన్నారు. కృత్రిమమేథపై అతిగా ఆధారపడకూడదని, దానికి బానిసలుగా మారకూడదన్నారు.కృత్రిమ మేధను మానవ సామర్థ్యాలను పెంపొందించే సాధనంగా చూడాలి తప్ప.. వాటిని భర్తీ చేసే మార్గంగా చూడరాదని అంబానీ స్పష్టం చేశారు. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, అందరికీ జీవన నాణ్యతను మెరుగుపరచడానికి కృత్రిమ మేధను ఉపయోగించాలని ఆయన విద్యార్థులను కోరారు. ఏదేమైనా, సాంకేతిక పరిజ్ఞానానికి బానిసలుగా మారవద్దని ఆయన సూచించారు. కృత్రిమ మేధ అభివృద్ధి, జనరేటివ్ ఏఐలో నైతిక విలువల పాత్ర, వీటిపై మానవ పర్యవేక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.అత్యంత సంపన్న దేశంగా..ఈ శతాబ్దం చివరినాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా అవతరిస్తుందని ఆయన అంచనా వేశారు. యువత, జనాభా, సాంకేతిక పురోగతి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల స్ఫూర్తితో దేశ సామర్థ్యంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విద్య, మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగాల్లో సరైన విధానాలు, పెట్టుబడుల్లో వృద్ధి దేశ ప్రగతికి తోడ్పడుతుందని చెప్పారు.యూనివర్సిటీ ఆఫ్ లైఫ్..విద్యార్థులు ఉన్నత కలలు కనాలని, వాటిని సాకారం చేయడానికి కృషి చేయాలన్నారు. ప్రపంచంలో అన్ని రంగాల్లో నిత్యం వస్తున్న మార్పులకు అనుగుణంగా నిరంతరం అభ్యాసం చేయాలన్నారు. ప్రస్తుతం నైపుణ్యాల పెంపునకు సాంకేతిక పరిజ్ఞానం సహాయకారిగా ఉన్నప్పటికీ, అంతిమంగా మానవ స్ఫూర్తి, సంకల్పమే విజయాన్నిస్తుందని చెప్పారు. విద్య పూర్తి చేసుకుని ఈ విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత క్యాంపస్, తరగతి గదులు, ఉపాధ్యాయులు లేని మరో ‘యూనివర్సిటీ ఆఫ్ లైఫ్’లో అడుగుపెట్టాల్సి ఉంటుందన్నారు. అందులో మీరు సొంతంగా జీవితంలో పురోగతి సాధించాలన్నారు.ఇదీ చదవండి: మొబిక్విక్, క్రెడ్లో ఈ–రూపీ వాలెట్లుపీడీఈయూ ఏర్పాటు ఇలా..ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ అంబానీ ‘పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్శిటీని ఏర్పాటు చేయడం ప్రధానమంత్రి అసాధారణ దార్శనికత ఫలితమే. ఇరవై ఏళ్ల క్రితం ప్రపంచ స్థాయి మానవ వనరులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తూనే ఇంధనం, ఇంధన ఉత్పత్తులలో గుజరాత్ దేశాన్ని నడిపించాలని కోరుకుంటున్నట్లు ఆయన నాతో చెప్పారు. అదే ఈ విశ్వవిద్యాలయం స్థాపనకు దారితీసింది’ అని అన్నారు. -
అంబానీ కొత్త కారు.. తొలి బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్!
ఆసియాలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ (Mukesh Ambani). అత్యంత సంపన్నులుగా ఐశ్వర్యానికి, హోదాకు పేరుగాంచిన అంబానీ కుటుంబం (Ambani family) దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కార్ల సేకరణను కూడా కలిగి ఉంది. జియో గ్యారేజ్లో ఉన కార్ల ఖచ్చితమైన లెక్క తెలియదు కానీ దేశంలోనే అత్యధిక సంఖ్యలో రోల్స్-రాయిస్ కల్లినన్ ఎస్యూవీలు (Rolls-Royce Cullinan) వీరి వద్దే ఉన్నాయి. ఇలాంటి కార్లు వీరి వద్ద కనీసం పది ఉంటాయని చెబుతారు. ఇప్పుడు మరో కొత్త రోల్స్ రాయిస్ కారు చేరింది. ఇది సాధారణ కుల్లినన్ కారు కాదు. ఇది భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్ కల్లినన్.జియో గ్యారేజ్కి ప్రత్యేక అతిథిఅంబానీ ఫ్యామిలీ కొత్త కారు అంటూ ఈ ప్రత్యేకమైన రోల్స్ రాయిస్ కల్లినన్ ఫొటోలు ఆన్లైన్లో కనిపించాయి. ఆటోమొబిలి ఆర్డెంట్ ఇండియా వారి ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఇవి షేర్ అయ్యాయి. బుల్లెట్ఫ్రూఫింగ్ కార్లలో ప్రత్యేకత కలిగిన చండీగఢ్ వర్క్షాప్లో అద్భుతమైన సిల్వర్ ఎస్యూవీ కనిపించింది. ‘తమ వద్ద ఉన్న కుల్లినన్లతోపాటు అంబానీ కుటుంబం బుల్లెట్ప్రూఫ్ను కలిగి ఉండాల్సిన సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నారు. అంబానీ ఫ్లీట్ నుండి అందమైన సిల్వర్ రోల్స్ రాయిస్ కల్లినన్ ఇదే’ ఆ పోస్ట్లో పేర్కొన్నారు.ఫొటోల్లో కల్లినన్ సిరీస్ I మోడల్గా కనిపిస్తోంది. ఇది ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ కార్ల కలెక్షన్లో భాగమై ఉండవచ్చు. దాన్నే బుల్లెట్ప్రూఫ్ చేయిస్తుండవచ్చు. ముఖేష్ అంబానీ సాధారణంగా భారీ భద్రత కలిగిన మెర్సిడెస్ బెంజ్ ఎస్ 680 (Mercedes-Benz S 680) గార్డ్ సెడాన్లలో ప్రయాణిస్తూ కనిపిస్తారు. అయితే భారతదేశంలో ఎస్యూవీలకు పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా బుల్లెట్ ప్రూఫ్ కల్లినన్ తమ అవసరాలకు బాగా సరిపోతుందని కుటుంబం భావించి ఉండవచ్చు.అల్ట్రా లగ్జరీ ఎస్యూవీరోల్స్ రాయిస్ కల్లినన్ అత్యంత లగ్జరీ కారు. 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ 563 Bhp, 850 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. విస్తృతమైన కస్టమైజేషన్ ఆప్షన్స్కు ఇది ప్రసిద్ధి చెందింది. బెస్పోక్ ఫీచర్ల ఆధారంగా కుల్లినన్ ధర ఉంటుంది. ఇప్పుడు ఆర్మ్డ్ బాడీవర్క్ కోసం వర్క్షాప్కు పంపిన నేపథ్యంలో దీని తుది ధరను అంచనా వేయడం సవాలుగా మారింది.అంబానీ రోల్స్ రాయిస్ కలెక్షన్రాయిస్ కలెక్షన్ కల్లినన్ కార్లతో అంబానీ ఫ్యామిలీ అనుబంధం 2019 నాటిది. భారతదేశంలో మొట్ట మొదటగా ఈ మోడల్ను కొనుగోలు చేసింది అంబానీ కుటుంబమే. రిచ్ బ్రౌన్ షేడ్ వాహనం మొదటి కల్లినన్ కాగా ఆ తర్వాత 2021లో ఆర్కిటిక్ వైట్ కలర్ కార్ వచ్చింది.మూడవ కల్లినన్ను వారి కుమార్తె ఇషా అంబానీ ఉపయోగించారు. దాదాపు రూ. 1 కోటి విలువైన టస్కాన్ సన్ కల్లినన్ కూడా ఈ కలెక్షన్లో ఉంది. దీపావళి సందర్భంగా నీతా అంబానీకి బహుమతిగా ఇచ్చిన ప్రీమియం మోడల్ బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్. పెబుల్ ప్యారడిసో బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్ను అనంత్ అంబానీ పెళ్లికి ముందు కొనుగోలు చేశారు. సిరీస్ II కల్లినన్ తాజాగా ఫ్లీట్లో చేరింది. వీటితో పాటు విదేశాల్లోనూ కులినన్ వాహనాలు అంబానీ ఫ్యామిలీకి ఉన్నాయి. -
రిలయన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు
గుజరాత్లోని జామ్నగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను నిర్మించనున్నట్లు రిలయన్స్(Reliance) ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ప్రకటించారు. భారతదేశంలో కృత్రిమ మేధ (AI), డిజిటల్ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతుండడంతో రిలయన్స్ ఈ ప్రకటన చేయడం టెక్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా ఆధారిత టెక్ కంపెనీ ఎన్విడియా సహకారంతో అత్యాధునిక బ్లాక్వెల్ ఏఐ ప్రాసెసర్లతో నడిచే ఈ డేటా సెంటర్ మూడు గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.భారతదేశంలో కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అక్టోబర్ 2024లో రిలయన్స్, ఎన్విడియా మధ్య భాగస్వామ్యం కుదిరినట్లు ఇరు సంస్థలు గతంలోనే ప్రకటించాయి. గతంలో జరిగిన ఎన్విడియా ఏఐ సమ్మిట్(AI Summit) 2024 సందర్భంగా సంస్థ సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఏఐ విభాగంలో ఇండియా సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు. ‘భారతదేశం తన సొంత కృత్రిమ మేధను తయారు చేయడం పూర్తి అర్థవంతమైన చర్యగా భావిస్తున్నాం. స్థానికంగా డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల డేటా భద్రత సవాళ్లు ఏర్పడవు’ అని హువాంగ్ అన్నారు. ఇండియాలో మెరుగైన డిజిటల్ కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ధి కలిగిన ఏఐ ఆవశ్యకతను ఎత్తిచూపుతూ ముఖేష్ అంబానీ ఈ చర్యలు చేపట్టడంతో టెక్ నిపుణుల దృష్టిని ఆకర్షించారు.ఇదీ చదవండి: ఉద్యోగులకు ఏఐ చేదోడుజామ్నగర్లో లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్తో(ఎల్ఎల్ఎం) డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్టప్లకు సహకారం, ఏఐ ప్రాజెక్టులు, ఎల్ఎల్ఎం అభివృద్ధికి రూ.10,000 కోట్లకు పైగా కేటాయించాలని రిలయన్స్ నిర్ణయించింది. డేటా సెంటర్ల అభివృద్ధికి ప్రభుత్వ మద్దతు కూడా లభిస్తుందని కంపెనీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు వేలాది హై-స్కిల్డ్ ఉద్యోగాలను సృష్టిస్తుందని, ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఇండియాను ముందువరుసలో ఉంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. సుస్థిర ఇంధన వనరులకు పెద్దపీట వేసే రిలయన్స్ సోలార్, పవన, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులతో సహా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఈ డేటా సెంటర్కు అవసరమైన ఎనర్జీని సరఫరా చేస్తారని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
ట్రంప్ ప్రమాణాస్వీకారోత్సవంలో చీరకట్టులో నీతా అంబానీ స్టన్నింగ్ లుక్స్..!
-
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అంబానీ హాజరు
అమెరికా 47వ అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ వేడుకలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani), ఆయన సతీమణి రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ(Nita Ambani) హాజరయ్యారు. 2025 జనవరి 20న(భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి) వాషింగ్టన్ డీసీలో జరిగే కార్యక్రమంలో ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.ట్రంప్ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం ఉన్న అంబానీ దంపతులను ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ ఈవెంట్కు ఆహ్వానం అందుకున్న అతికొద్ది మంది ప్రపంచ ప్రముఖుల్లో అంబానీ దంపతులున్నారు. అంబానీ ఆధ్వర్యంలోని చాలా వ్యాపారాలు అమెరికాలోనూ ఉన్నాయి. దాంతోపాటు భారత్, యునైటెడ్ స్టేట్స్ మధ్య వ్యాపార, ఆర్థిక సహకార రంగాల్లో బలమైన సంబంధాలున్నాయి.ఇదీ చదవండి: ఇంటి అద్దె చెల్లిస్తున్నారా.. ప్లాన్ చేసుకోండి..ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు అంబానీ దంపతులు ట్రంప్తో దిగిన ఫొటో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈమేరకు జనవరి 19న ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్లో వీరు పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడిగా ఎన్నివైన జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్తో ముచ్చటించారు. టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్ బర్గ్, బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ సహా పలువురు అమెరికాకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
ధీరూభాయ్ అంబానీని కొనియాడిన నీతా
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీ 92వ జయంతిని పురస్కరించుకుని, జామ్ నగర్ రిఫైనరీ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ధీరూభాయ్ అంబానీ కోడలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ(Nita Ambani) ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.ధీరూభాయ్(dhirubhai ambani) కలల భూమి జామ్ నగర్ అని నీతా అంబానీ అభివర్ణించారు. ఆయన ధైర్యసాహసాలు, అలుపెరగని సంకల్పం, ఆకాంక్షలు నిజం అయ్యాయని చెప్పారు. జామ్ నగర్ కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదని, రిలయన్స్ గ్రూప్నకు కేంద్ర బిందువు అని కంపెనీ సృజనాత్మకత, సర్వీస్ను ప్రతిబింబిస్తుందని ఆమె నొక్కి చెప్పారు. రిఫైనరీ స్థాపించినప్పటి నుంచి కంపెనీ ఎదిగిన తీరుకు జామ్ నగర్ ఉదాహరణ అని అన్నారు. సంస్థ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీకి నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమంలో భాగమైన ఉద్యోగులు, వారి కుటుంబాలు, కీలక ఎగ్జిక్యూటివ్కు ధన్యవాదాలు తెలిపారు. రిలయన్స్ ఎదుగుదలకు, సంస్థ విజయానికి కారణమైన కోకిలాబెన్ అంబానీ(ధీరూభాయ్ అంబానీ భార్య)కు నీతా కృతఙ్ఞతలు తెలియజేశారు.ఇదీ చదవండి: జీఎస్టీ నిబంధనలు పాటించని 30 విభాగాలు గుర్తింపురిలయన్స్ జామ్ నగర్ రిఫైనరీ ప్రత్యేకతలు..గుజరాత్లోని జామ్ నగర్లోని రిలయన్స్(Reliance) రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సంక్లిష్టమైన సింగిల్ సైట్ రిఫైనరీ.సామర్థ్యం: రోజుకు 1.4 మిలియన్ బ్యారెళ్ల ప్రాసెసింగ్ సామర్థ్యం (ఎంఎంబీపీడీ) కలిగి ఉంది.ఈ రిఫైనరీ 216 వివిధ గ్రేడ్ల ముడి చమురును ప్రాసెస్ చేయగలదు.ఇది ఫ్లూయిడైజ్డ్ కెటాలిటిక్ క్రాకర్ (ఎఫ్సీసీ), కోకర్, ఆల్కైలేషన్, పారాక్సిలీన్, పాలీప్రొపైలిన్, రిఫైనరీ ఆఫ్ గ్యాస్ క్రాకర్ (ఆర్ఓజీసీ), పెట్కోక్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లతో సహా మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లను కలిగి ఉంది.ఈ రిఫైనరీలో అధిక నాణ్యతగల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. -
అంబానీ జెట్ పైలట్ల జీతం ఎంతంటే..
ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి పటిష్ట భద్రత ఉంటుంది. తాను ప్రయాణించే వాహనాలు, విమానాలు, ప్రైవేట్ జెట్లు.. ఇలా ప్రతిదాన్ని భద్రత పరంగా పకడ్బందీగా నిర్వహిస్తుంటారు. అంబానీ వినియోగించే బోయింగ్ 737 మ్యాక్స్ జెట్ను ఇటీవల తనిఖీలు నిర్వహించి వేరే పేరుతో రిజిస్టర్ చేశారు. గతంలో ఈ జెట్ శాన్ మారినో కోడ్ కింద ‘టీ7-లోటస్’ పేరుతో ఉండేది. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం దీన్ని ‘వీటీ-ఏకేవీ’గా రిజిస్టర్ చేశారు.ఈ విలాసవంతమైన జెట్ను నడపడానికి ఉత్తమ పైలట్లను మాత్రమే ఎంచుకుంటారు. దేశంలోనే అత్యంత ధనవంతుడి భద్రత, సౌకర్యానికి సంబంధించిన విషయం కావడంతో చాలా పకడ్బందీగా వ్యవహరిస్తారు. ఈ జెట్ నడిపే పైలట్లకు ఏటా వేతనం 1,20,000 డాలర్లు(సుమారు రూ.ఒక కోటి) ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో తొలి అడుగులుసుమారు రూ.1,000 కోట్ల విలువైన బోయింగ్ 737 మ్యాక్స్ జెట్ను రిలయన్స్ కమర్షియల్ డీలర్స్ లిమిటెడ్ (ఆర్సీడీఎల్) నిర్వహిస్తోంది. దీన్ని నడిపే పైలట్లు నిత్యం భద్రతా ప్రోటోకాల్స్ను పాటిస్తూ అప్డేట్గా ఉండటానికి కఠినమైన శిక్షణ ఉంటుంది. ముఖేష్ అంబానీ వద్ద ఉన్న ఇతర ప్రైవేట్ జెట్లను కూడా ఆర్సీడీఎల్ పర్యవేక్షిస్తోంది. ఇది అత్యున్నత స్థాయి విమానయాన భద్రత, నైపుణ్యాన్ని కలిగి ఉంది. -
అంబానీ ఇంటికి కొత్త అతిథి.. ఇది చాలా స్పెషల్!
భారతీయ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) మరో విలాసవంతమైన ఎలక్ట్రిక్ కారును (Electric Car) కొనుగోలు చేశారు. ఇది అంబానీ బ్యారేజిలో చేరిన 'రోల్స్ రాయిస్' (Rolls Royce) బ్రాండ్ మొదటి ఎలక్ట్రిక్ వెహికల్. దీని ధర రూ. 7.5 కోట్లు (ఎక్స్ షోరూమ్).అంబానీ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు పేరు 'స్పెక్టర్' (Spectre). ఈ కారుకు MH 0001 అనే వీఐపీ నెంబర్ ప్లేట్ ఉంది. ఈ నెంబర్ ప్లేట్ కోసం కూడా వారు భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ఎంత వెచ్చించారు అనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.అంబానీ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు కస్టమైజ్డ్ అని తెలుస్తోంది. కాబట్టి దీని ధర ఎక్స్ షోరూమ్ ధర కంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ కారు 102 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ఒక సింగిల్ ఛార్జితో ఏకంగా 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఇదీ చదవండి: ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న బైకులు ఇవే!స్పెక్టర్ అనేది రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కారును ఇప్పటికే మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', కేరళకు చెందిన ఒక బిల్డర్ కూడా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.రోల్స్ రాయిస్ స్పెక్టర్ (Rolls Royce Spectre)రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన స్పెక్టర్ కారు ధర రూ. 7 కోట్ల కంటే ఎక్కువ. కాబట్టి దీనిని సామాన్య ప్రజలు కొనుగోలు చేయడం కష్టం. ఇప్పటి వరకు భారతదేశంలో ఈ కారును 10మంది కంటే తక్కువే.. దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారాం. అయితే ఈ కారు చూడటానికి మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.ఇదీ చదవండి: రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!అంబానీ గ్యారేజిలోని కార్లు (Mukesh Ambani Car Collection)భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ గ్యారేజిలో.. రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఈడబ్ల్యుబీ, మెర్సిడెస్ బెంజ్ ఎస్660 గార్డ్, మాట్ బ్లాక్ బీఎండబ్ల్యూ 760ఎల్ఐ, ఫెరారీ 812 సూపర్ఫాస్ట్, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, మెర్సిడెస్ ఏఎంజీ జీ63, టెస్లా మోడల్ ఎస్ 100డీ, రోల్స్ రాయిస్ కల్లినన్, మెర్సిడెస్ మేబ్యాక్ 62, ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్, ఆస్టన్ మార్టిన్ రాపిడ్, లంబోర్ఘిని ఉరుస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్హెడ్ కూపే, ఆర్మర్డ్ బీఎండబ్ల్యూ 760 ఎల్ఐ, బెంట్లీ బెంటయ్గా, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ మొదలైనవి ఉన్నాయి. మొత్తం మీద అంబానీ గ్యారేజిలో సుమారు 170 కంటే ఎక్కువ కార్లు ఉన్నట్లు సమాచారం. -
పాకిస్తానీల కళ్లన్నీ భారత్పైనే.. గూగుల్లో ఏం వెతికారంటే..
వివిధ దేశాలలో ప్రజల దృష్టిని ఆకర్షించిన అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ట్రెండ్స్, భిన్న అంశాలను వెల్లడిస్తూ గూగుల్ (Google) ప్రతి సంవత్సరం తన "ఇయర్ ఇన్ సెర్చ్" నివేదికను ఆవిష్కరిస్తుంది. ఇందులో వార్తలు, క్రీడా ఈవెంట్ల దగ్గర నుండి సెలబ్రిటీలు, సినిమాలు, టీవీ షోలు, సందేహాలు వంటివెన్నో ఉంటాయి.ఈ క్రమంలోనే గూగుల్ ఇటీవల పాకిస్తాన్కు సంబంధించిన “ఇయర్ ఇన్ సెర్చ్ 2024”ని విడుదల చేసింది. ఏడాది పొడవునా పాకిస్తాన్ ప్రజలు గూగుల్ ఏం వెతికారు..కీలక పోకడలు, అంశాలను హైలైట్ చేస్తూ విభిన్న రంగాలలో జాతీయ ఆసక్తిని ఆకర్షించిన వాటిపై ఒక సంగ్రహావలోకనం ఈ నివేదిక అందిస్తుంది.గూగుల్ పాకిస్తాన్ 2024 సంవత్సరాంతపు జాబితాలో క్రికెట్, వ్యక్తులు, సినిమాలు&నాటకాలు, హౌ-టు సందేహాలు, వంటకాలు, టెక్నాలజీ వంటి ఆరు కేటగిరీల్లో అత్యధిక సెర్చ్ చేసిన టాప్ 10 అంశాలు ఉన్నాయి. అయితే యాదృచ్ఛికంగా వీటిలో భారత్ గురించి లేదా దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. భారతీయ వ్యాపారవేత్తలు, సోనీ, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లలో భారతీయ షోలు, టీ20 ప్రపంచ కప్ సిరీస్లో భారత జట్టు క్రికెట్ మ్యాచ్లు వీటిలో ఉన్నాయి.పాకిస్థానీల ఆసక్తులు ఇవే..క్రికెట్లో పాకిస్థాన్లో అత్యధికంగా శోధించిన ఐదు గేమ్లు భారత్ ఆడిన మ్యాచ్లే. వీటిలో టీ20 ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ల మధ్య పోరు ఒకటి. ఇది కాకుండా అత్యధికంగా సెర్చ్ చేసిన ఇతర మ్యాచ్లలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇండియా వర్సెస్ ఇంగ్లండ్, ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్లు ఉన్నాయి.ఇక వ్యక్తుల విషయానికి వస్తే.. 'పీపుల్ లిస్ట్ ఫర్ పాకిస్థాన్'లో భారత్కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఉన్నారు.సినిమాలు & నాటకాల జాబితాలో అత్యధికంగా భారతీయ టీవీ షోలు, నాలుగు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. హీరామండి, ట్వల్త్ ఫెయిల్, మీర్జాపూర్ సీజన్ 3, బిగ్ బాస్ 17 పాకిస్తానీలు అత్యధికంగా సెర్చ్ చేసిన టీవీ షోలు కాగా యానిమల్, స్త్రీ 2, భూల్ భులైయా 3, డంకీ 2024లో అత్యధికంగా గూగుల్ చేసిన బాలీవుడ్ సినిమాలు. -
రిలయన్స్ గ్రూప్ ప్రెసిడెంట్గా ఇరా బింద్రా నియామకం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్ ప్రెసిడెంట్గా ఇరా బింద్రా(47)ను నియమిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించారు. ఈ స్థాయి వ్యక్తుల నియామకాలకు సంబంధించిన వివరాలను ముఖేశ్ నేరుగా వెల్లడించడం ఇదే తొలిసారి. ఇరా బింద్రా ఇప్పటివరకు యూఎస్లోని మెడ్ట్రానిక్ సంస్థలో పనిచేశారు. అక్కడ ఆమె హెచ్ఆర్ విభాగాధిపతిగా, కంపెనీ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్లో అన్ని అనుబంధ సంస్థలకు సంబంధించి టాప్ మేనేజ్మెంట్ నియామకాలను ఈమె చేపట్టబోతున్నారు. కంపెనీ ప్రెసిడెంట్గా నియమించడంతో ఈమె రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న మొదటి కుటుంబేతర మహిళ కావడం విశేషం.ఇదీ చదవండి: సుప్రీం కోర్టు ఆమోదంతో రూ.4,025 కోట్ల ఆస్తులు అప్పగింత‘రిలయన్స్ గ్రూప్లో టాలెంట్ను మెరుగుపరిచేందుకు బింద్రా బాధ్యతలు నిర్వర్తిస్తారు. నాతోసహా ఇషా, ఆకాష్, అనంత్, ఎగ్జిక్యూటివ్ కమిటీతో కలిసి పని చేస్తారు. విభిన్న పరిశ్రమలు, వ్యాపార సైకిల్స్పై బింద్రాకు అపార పరిజ్ఞానం ఉంది. మెడ్ట్రానిక్లో కీలక బాధ్యతల్లో పని చేశారు. జీఈ వంటి ఫార్చ్యూన్ 100 కంపెనీలో హెచ్ఆర్ టీమ్లకు నాయకత్వం వహించారు. కొత్త ఆపరేటింగ్ మోడల్ రూపొందించి దాన్ని అమలు చేశారు. తన నైపుణ్యాలు కంపెనీకి ఎంతో ఉపయోగపడుతాయి’ అని ముఖేశ్ అంబానీ అన్నారు.1998లో ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీ నుంచి బింద్రా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.1999లో నెదర్లాండ్స్లోని మాస్ట్రిక్ట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు.తర్వాత ఆమె మెడ్ట్రానిక్లో చేరడానికి ముందు జీఈ క్యాపిటల్, జీఈ ఇండియా, జీఈ హెల్త్కేర్, జీఈ ఆయిల్ & గ్యాస్లో పనిచేశారు. -
ట్రెండింగ్లో నిలిచిన కొత్త పెళ్లి కూతురు.. ఇంకొందరు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్అంబానీ చిన్న కోడలు రాధిక మర్చెంట్ 2024 ఏడాదికిగాను గూగుల్ సెర్చ్లో ట్రెండింగ్లో నిలిచారు. ముఖేశ్అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జులైలో రాధిక మర్చెంట్తో జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహానికి అంతర్జాతీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, సినీతారలు హాజరై సందడి చేశారు. దాంతో అంబానీ కోడలు గురించి చాలామంది గూగుల్లో సెర్చ్ చేసినట్లు తెలిసింది.2024లో రాధిక మర్చెంట్తోపాటు మరికొందరు ట్రెండింగ్లో నిలిచారు.1. వినేష్ ఫొగాట్: భారతదేశపు రెజ్లింగ్ స్టార్రెజ్లర్ వినేష్ ఫొగాట్ 2024లో అత్యధికంగా గూగుల్లో సెర్చ్ చేసిన భారతీయ వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. పారిస్ ఒలింపిక్లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ పోటీలో 100 గ్రాముల అధిక బరువుండి దానికి అర్హత సాధించలేకపోయారు.2. నితీష్ కుమార్: బిహార్ రాజకీయ వ్యూహకర్తబిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2024 లోక్సభ ఎన్నికల సమయంలో విపరీతమైన ప్రజాదరణ పొందారు. తన రాజకీయ ఎత్తుగడలు, పొత్తులపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.3. చిరాగ్ పాశ్వాన్: రాజకీయ నాయకుడుదివంగత కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మోడీ 3.0 కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.4. హార్దిక్ పాండ్యా: క్రికెటర్క్రికెట్లో ఆల్ రౌండర్గా పేరున్న హార్దిక్ పాండ్యా మోడల్ నటాసా స్టాంకోవిక్తో విడాకులు తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు.5. పవన్ కళ్యాణ్: రాజకీయ నాయకుడుప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ 2024 జూన్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.6. శశాంక్ సింగ్: కొత్త క్రికెట్ స్టార్శశాంక్ సింగ్ ఐపీఎల్ క్రికెట్లో తన అద్భుతమైన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించారు.7. పూనమ్ పాండే: మోడల్, నటిగర్భాశయ క్యాన్సర్తో పూనమ్ పాండే మృతి చెందినట్లు ఆమె అనుచరులు తెలిపారు. తర్వాత అది ఫేక్ అని, తాను బతికే ఉన్నానని చెప్పింది.8. రాధిక మర్చెంట్: అంబానీ కోడలుజులైలో అనంత్ అంబానీతో గ్రాండ్ వెడ్డింగ్ నేపథ్యంలో రాధికా మర్చంట్ పేరు వైరల్గా మారింది.9. అభిషేక్ శర్మ: క్రికెటర్క్రికెటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్లో అసాధారణ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నారు.10. లక్ష్య సేన్: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు2024 పారిస్ ఒలింపిక్స్లో లక్ష్య సేన్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. -
రూ.508 కోట్లకు బంగ్లా అమ్మేసిన ఇషా అంబానీ - సొంతం చేసుకున్న హాలీవుడ్ జంట (ఫోటోలు)
-
ఐపీఎల్ వేలం 2025 : అదిరే డ్రెస్లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ఫ్యాషన్ స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సమయానికి తగ్గట్టుగా డ్రెస్లను ఎంపిక చేసుకోవడంలో, ఫ్యాషన్ను, బిజినెస్ను మిళితం చేయడంలో నీతా తరువాతే ఎవరైనా అనేది అభిమానుల మాట మాత్రమే కాదు, ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం కూడా. తాజా ఐపీఎల్ -2025 వేలం సందర్భంగా మరోసారి తన స్టైల్తో అందర్నీ తనవైపు తిప్పుకుంది. నీతా అంబానీ నేవీ బ్యూ ప్యాంట్సూట్ ధరించి అందరినీ ఆకర్షించింది. అంతేకాదు ఆ డ్రెస్ ధర కూడా హాట్ టాపిక్గా నిలిచింది. ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన నీతా అంబానీ వైడ్-లెగ్ ప్యాంట్, బ్లూ సూట్లో హుందాగా కనిపించారు. నీతా ధరించిన ‘మజే’ బ్రాండ్కు చెందిన ఈ బ్రేజర్ సూట్ ధర అక్షరాలా 950 డాలర్లు. అంటే దాదాపు రూ.78 వేలు. ఇందులో బ్లేజర్ రూ. 47 వేలు కాగా వైడ్-లెగ్ ట్వీడ్ ట్రౌజర్ ధర సుమారు రూ. 31వేలు, మొత్తంగా ఆమె సూట్ ధర రూ.78 వేలు. అంతేనా వజ్రాలు పొదిగిన ఎంఐ బ్రూచ్, హ్యాండ్బ్యాగ్, డైమండ్ రింగ్, డైమండ్ చెవిపోగులు, సన్ గ్లాసెస్, వాచ్, హీల్స్ ఇలా అన్నీ ప్రత్యేకంగా కనిపించడం విశేషం. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)nbsp;ఐపీఎల్ మెగా వేలం-2025 తొలి రౌండ్ విడత ప్రక్రియ దుబాయ్లోని జెడ్డాలో ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో ఎంఐ నలుగురు సూపర్ స్టార్లు రోహిత్ శర్మ,హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాతోపాటు టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మకూడా ఉన్నాడు. ముఖ్యంగా తిలక్ వర్మను రూ.8 కోట్లకు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ఈ వేలంలో నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. -
మరో సంచలనానికి సిద్దమవుతున్న జియో.. త్వరలో 5జీ స్మార్ట్ఫోన్
అక్టోబర్ నెలలో రిలయన్స్ జియో అతి తక్కువ ధర వద్ద రెండు 4జీ మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే బాటలో చౌకైన 5జీ స్మార్ట్ఫోన్ను తీసుకురావడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ యోచిస్తున్నట్లు సమాచారం.భారతదేశపు అతిపెద్ద టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ అయిన రిలయన్స్ జియో.. సరసమైన 5జీ స్మార్ట్ఫోన్ను తయారు చేయడానికి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చురర్ (OEMs), యూఎస్ చిప్మేకర్ క్వాల్కామ్తో జత కట్టనుంది. ఈ విషయాన్ని జియో వైస్ ప్రెసిడెంట్ సునీల్ దత్ వెల్లడించారు.రిలయన్స్ జియో అన్ని స్మార్ట్ఫోన్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. పరికరాల తయారీదారులు & బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని అన్వేషిస్తోంది. 5జీ స్మార్ట్ఫోన్ నెట్వర్క్ను మెరుగుపరచడం మాత్రమే కాకుండా.. వినియోగదారులకు సరసమైన పరికరాలను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని సునీల్ దత్ పేర్కొన్నారు.భారతదేశ టెలికామ్ ల్యాండ్స్కేప్ను విప్లవాత్మకంగా మార్చిన చరిత్ర జియోకు ఉంది. 2016లో సంస్థ జియో ఫోన్ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 999 మాత్రమే, నెలకు రూ. 123తో ప్రారంభమయ్యే సరసమైన రీఛార్జ్లను అందించింది. కాబట్టి ఇది మార్కెట్లో 10 కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది.ఇక రాబోయే జియో 5జీ స్మార్ట్ఫోన్ కూడా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నారు. అయితే ఇది మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది. దీని ధర ఎంత ఉండొచ్చు? అనే చాలా వివరాలు రాబోయే రోజుల్లో అధికారికంగా వెల్లడవుతాయి. -
అనంత్-రాధిక అంబానీ ‘ప్రేమమందిరం’ దుబాయ్ లగ్జరీ విల్లా, ఫోటోలు
-
అనంత్-రాధికా అంబానీ అదిరిపోయే దుబాయ్ విల్లా, ఫోటోలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తమ చిన్న కొడుకు అనంత్ అంబానీకి అద్భుతమైన పెళ్లి కానుక ఇచ్చారు. అత్యంత వైభవంగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహాన్ని ఇటలీలో జరిపించిన అంబానీ దంపతులు అలాగే కనీవినీ ఎరుగని రీతిలో రెండు ప్రీ-వెడ్డింగ్ బాష్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటలీలోని ఓ క్రూజ్ షిప్లో భారీ పార్టీని ఏర్పాటు చేసారు. ఇందంతా ఒక ఎత్తయితే అంబానీలు తమ చిన్న కోడలు రాధికా మర్చెంట్కు దుబాయ్లో 640 కోట్ల విలువైన బంగ్లాను కానుకగా ఇచ్చారు. ఈ లగ్జరీ బంగ్లాకు సంబంధించిన ఫోటోలు ఇపుడు నెట్టింట సందడి చేస్తున్నాయి.దుబాయ్లోని ఫేమస్ పామ్ జుమైరాలో ఈ విలాసవంతమైన విల్లా ఉంది. దుబాయ్లో అత్యంత ఖరీదైన విల్లాలో ఇదొకటి. దాదాపు 3000 చదరపు అడుగుల్లో ఈ విల్లాను నిర్మించారు. ఈ విల్లా మొత్తంలో 10 బెడ్రూంలు, 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. సొగసైన లివింగ్ రూమ్లు, బెడ్రూమ్లు విలాసవంతమైన బాత్రూమ్ల ఇలా ప్రతీది చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా జాగ్రత్తపడ్డారట. ఇటాలియన్ మార్బుల్, అద్భుతమైన ఆర్ట్వర్క్తో అలంకరించిన 10 ఖరీదైన బెడ్రూమ్లు, ఆకట్టుకునే ఇంటీరియర్స్తో విల్లా ఒక అద్భుత కళాఖండంగా ఉంటుందని సమాచారం. ఇండోర్, అవుట్డోర్ పూల్స్ ఉన్నాయి. పాంపరింగ్ సెషన్ల కోసం ప్రైవేట్ స్పా, ప్రైవేట్ సెలూన్ కూడా ఉన్నాయి. పెద్ద కోడలు శ్లోకా మెహతాకి 450 కోట్ల ఖరీదైన బంగ్లాతో పాటు రూ. 200 కోట్ల ఖరీదైన నెక్లెస్ ఇచ్చారు. ఈ ఏడాది జులై 12న రాధిక, అనంత్ అంబానీ వివాహ వేడుక చాలా గ్రాండ్గా నిర్వహించిన సంగతి తెలిసిందే.👉 ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదీ చదవండి: పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...! -
పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...!
పెళ్లి తరువాత అమ్మాయిలకు అత్తింటి పేరు వచ్చి చేరడం సాధారణం. అయితే ఇది వారి వ్యక్తిగత ఇష్లాలు, ఆచారాలను బట్టి కూడా ఉంటుంది. తాజాగా రిలయన్స్ సామ్రాజ్యాన్ని సృష్టించిన అంబానీ ఇంటి కోడలు రాధికా మర్చంట్ పేరు మార్చుకుంది. పెళ్లి తర్వాత, రాధిక మర్చంట్ తన పేరులో 'అంబానీ'ని అధికారికంగా చేర్చుకుంది. రాధికా మర్చంట్ తన భర్త అనంత్ అంబానీ ఇంటిపేరును తన పేరులో చేర్చుకోవడంతో ‘రాధిక అంబానీ’గా అవతరించింది. వ్యాపారవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికా మర్చంట్ తన చిరకాల బాయ్ఫ్రెండ్ అనంత్ అంబానీని ఈ ఏడాది జూలైలో పెళ్లాడింది. రాధిక తన తండ్రి వ్యాపారమైన ఎన్కోర్ హెల్త్కేర్కు డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంది. ఇటీవల ఎంటర్ప్రెన్యూర్ ఇండియాతో మాట్లాడిన ఆమె తన భవిష్యత్ కెరీర్ ప్లాన్లను కూడా వివరించింది. ముఖ్యంగా దక్షిణాది మార్కెట్లలో తమ వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించినట్లు రాధిక వెల్లడించింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తీసుకురావాలని ఆమె భావిస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి : Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా? -
వంద మందిలో ఒకే ఒక్కడు.. ముఖేష్ అంబానీ
వ్యాపార రంగంలో ఫార్చూన్ (Fortune) అత్యంత శక్తివంతమైన 100 మంది వ్యక్తులలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఒకరుగా నిలిచారు. ఈ జాబితాలో చోటుదక్కించుకున్న భారతీయ వ్యాపారవేత్త ఆయనొక్కరే కావడం విశేషం. శక్తిమంతుల జాబితాలో ఆయన 12వ స్థానంలో నిలిచారు. ఇంకా ఈ లిస్ట్లో ఆరుగురు భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారు.ఈ జాబితాలో చోటు దక్కించుకున్నవారు 40 పరిశ్రమల నుండి ఉన్నారు. వీరిలో 30 నుండి 90 ఏళ్ల వరకు పలు వయసులవారు ఉన్నారు. ఇందులో వ్యవస్థాపకులు, ప్రముఖ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్లు, ఆవిష్కర్తలు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నారు. ఇక ఇందులో స్థానం పొందిన ఐదుగురు భారతీయ సంతతి సీఈవోలలో నలుగురు టెక్ దిగ్గజాల సీఈవోలు కాగా, ఒకరు మేకప్ బ్రాండ్ను నడుపుతున్నారు.ఇదీ చదవండి: సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరటభారతీయ సంతతికి చెందిన సత్య నాదెళ్ల ఫార్చూన్ జాబితాలో జాబితాలో 3వ స్థానంలో ఉండగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఈసారి టాప్ 10 అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక అడోబ్ సీఈవో శంతను నారాయణ్ 52వ స్థానంలో, యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ 69వ స్థానంలో ఉన్నారు. వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా 74వ ర్యాంక్, మేకప్ బ్రాండ్ ఐస్ లిప్స్ ఫేస్ (ELF) సీఈవో తరంగ్ అమిన్ 94వ ర్యాంక్ దక్కించుకున్నారు. -
సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)తో 2009లో విలీనమైన పెట్రోలియం లిమిటెడ్ (ఆర్పీఎల్)కు సంబంధించిన షేర్లలో 2007లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల విషయంలో ముకేశ్ అంబానీ మరో రెండు సంస్థలకు ఊరట లభించింది. ఇందుకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విధించిన జరిమానా విధింపును కొట్టివేస్తూ శాట్ (సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్) ఇచ్చిన రూలింగ్ను తాజాగా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.ఈ విషయంలో సెబీ దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది. శాట్ జారీ చేసిన ఉత్తర్వుపై జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మా జోక్యాన్ని కోరే ఈ అప్పీల్లో చట్టం ప్రమేయం లేదు. మీరు ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి వెంబడించలేరు‘ అని బెంచ్ పేర్కొంది. కేసు వివరాలు ఇవీ... » నవంబర్ 2007లో నగదు, ఫ్యూచర్స్ విభాగాల్లో ఆర్పీఎల్ షేర్ల విక్రయం, కొనుగోలులో అవకతవకలు జరిగాయన్నది కేసు సారాంశం. » 2009లో ఆర్ఐఎల్తో విలీనం అయిన లిస్టెడ్ అనుబంధ సంస్థ– ఆర్పీఎల్లో దాదాపు 5 శాతం వాటాను విక్రయించాలని 2007 మార్చిలో ఆర్ఐఎల్ నిర్ణయం తీసుకుంది. » ఈ నేపథ్యంలోనే 2007 నవంబర్లో ఆర్పీఎల్ ఫ్యూచర్స్లో లావాదేవీలు చేపట్టేందుకు ఆర్ఐఎల్ 12 మంది ఏజెంట్లను నియమించిందని, ఈ 12 మంది ఏజెంట్లు కంపెనీ తరపున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సెగ్మెంట్లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నారని, అదే సమయంలో కంపెనీ నగదు విభాగంలో ఆర్పీఎల్ షేర్లలో లావాదేవీలు చేపట్టిందని సెబీ ఆరోపించింది.» ఈ కేసు విషయంలో సెబీ 2021 జనవరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)పై రూ. 25 కోట్లు, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీపై రూ. 15 కోట్లు, నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్పై రూ. 20 కోట్లు, ముంబై సెజ్పై రూ. 10 కోట్లు జరిమానా విధించింది. నవీ ముంబై సెజ్, అలాగే ముంబై సెజ్ను ఒకప్పుడు రిలయన్స్ గ్రూప్లో పనిచేసిన ఆనంద్ జైన్ ప్రమోట్ చేయడం గమనార్హం. 12 సంస్థలకు నిధులు సమకూర్చడం ద్వారా మొత్తం మానిప్యులేషన్ స్కీమ్కు నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ పాత్రధారులుగా మారినట్లు ఆరోపణ.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!» అంబానీ, నవీ ముంబై సెజ్, ముంబై సెజ్లపై 2021లో సెబీ జారీ చేసిన ఉత్తర్వులను శాట్ 2023లో రద్దు చేసింది. జరిమానాకు సంబంధించి డిపాజిట్గా ఉంచిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని శాట్ ఆదేశించింది. కార్పొరేట్ సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించే ప్రతి ఆరోపణకు మేనేజింగ్ డైరెక్టర్ను బాధ్యునిగా చేయలేవని పేర్కొంది. ఇద్దరు సీనియర్ అధికారులు అక్రమ లావాదేవీలు నిర్వహించారని స్పష్టమవుతోందని, ఈ విషయంలో ముకేశ్ అంబానీ పాత్ర ఉన్నట్లు సెబీ రుజువుచేయలేకపోయిందని పేర్కొంది. ఆర్ఐఎల్పై ఆరోపణలను మాత్రం శాట్ కొట్టివేయకపోవడం గమనార్హం. » కాగా, శాట్ రూలింగ్ను సవాలుచేస్తూ, డిసెంబర్ 2023 డిసెంబర్ 4న సెబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
దానగుణంలో వీరే టాప్: మొదటిస్థానంలో నాడార్.. రెండో స్థానంలో
-
దానగుణంలో హెచ్సీఎల్ నాడార్ టాప్..
ముంబై: టెక్ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ దాతృత్వంలో అంబానీ, అదానీని కూడా మించిపోయారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 2,153 కోట్లు విరాళమిచ్చారు. క్రితం ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఇది 5 శాతం అధికం. దీంతో ఎడెల్గివ్–హురున్ వితరణశీలుర లిస్టులో శివ్ నాడార్ అగ్రస్థానంలో నిల్చారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రూ. 407 కోట్లతో రెండో స్థానంలో, వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ రూ. 330 కోట్లతో అయిదో స్థానంలో ఉన్నారు. జాబితా ప్రకారం మొత్తం మీద 203 మంది రూ. 5 కోట్లకన్నా అధికంగా విరాళమిచ్చారు. హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం రూ. 1,000 కోట్ల పైగా నికర విలువ ఉన్న మొత్తం 1,539 మంది వ్యక్తుల సంపద 46 శాతం పెరిగింది. 203 మంది ఇచి్చన సగటు విరాళం పరిమాణం రూ. 71 కోట్ల నుంచి రూ. 43 కోట్లకు తగ్గింది. వితరణకు సంబంధించి మహిళల జాబితాలో రోహిణి నీలేకని రూ. 154 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, రూ. 90 కోట్లతో సుస్మితా బాగ్చీ రెండో స్థానంలో ఉన్నారు. రంగాలవారీగా చూస్తే విద్యారంగానికి అత్యధికంగా రూ. 3,680 కోట్లు, హెల్త్కేర్కి రూ. 626 కోట్లు లభించాయి. రిచ్ లిస్ట్లో రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో అదానీ అగ్రస్థానంలో, రూ. 10.14 లక్షల కోట్లతో అంబానీ రెండో స్థానంలో ఉండగా రూ. 3.14 లక్షల కోట్ల సంపదతో శివ్ నాడార్ మూడో స్థానంలో ఉన్నారు. రిచ్ లిస్టులోని ప్రమోటర్ల సారథ్యంలో ఉన్న తొమ్మిది కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద నిర్దేశిత 2 శాతానికి మించి ఖర్చు చేశాయి. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 900 కోట్లు, యార్డీ సాఫ్ట్వేర్ ఇండియా రూ. 25 కోట్లు చొప్పున ఖర్చు చేశాయి.ధనవంతులైన టాప్ 10 పరోపకారుల జాబితా▸శివ్ నాడార్ & కుటుంబం: రూ. 2,153 కోట్లు▸ముకేశ్ అంబానీ & కుటుంబం: రూ. 407 కోట్లు▸బజాజ్ కుటుంబం: రూ. 352 కోట్లు▸కుమార మంగళం బిర్లా & కుటుంబం: రూ. 334 కోట్లు▸గౌతమ్ అదానీ & కుటుంబం: రూ. 330 కోట్లు▸నందన్ నీలేకని: రూ. 307 కోట్లు▸కృష్ణ చివుకుల: రూ. 228 కోట్లు▸అనిల్ అగర్వాల్ & కుటుంబం: రూ. 181 కోట్లు▸సుస్మిత & సుబ్రోతో బాగ్చి: రూ. 179 కోట్లు ▸రోహిణి నీలేకని: రూ. 154 కోట్లుWho are the top 10 impact leaders in the 2024 EdelGive Foundation HURUN INDIA Philanthropy List?Shiv Nadar tops the 2024 EdelGive Foundation HURUN INDIA Philanthropy List, followed by Mukesh Ambani and his family and the Bajaj family. These philanthropic leaders continue to… pic.twitter.com/EsnrO831Hd— HURUN INDIA (@HurunReportInd) November 7, 2024 -
నీతా.. నిన్నే పెళ్లాడుతా! ట్రాఫిక్ సిగ్నల్లో ప్రపోజ్
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ జీవిత భాగస్వామి నీతా అంబానీ తన 60వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో ఎంతో ముఖ్యమైన ముఖేష్ అంబానీతో ప్రేమ కథ ఎలా ప్రారంభమైందో ఈ కథనంలో తెలుసుకుందాం..ధీరూభాయ్ని మెప్పించి..ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ.. నీతా హుందాతనం, ప్రతిభను చూసి తన కోడలుగా ఎంచుకున్నారు. ఓసారి నీతా భరతనాట్యం ప్రదర్శనను తిలకించిన ధీరూభాయ్ తన కొడుకు ముఖేష్ ఆమే సరిజోడని భావించారు. వారిద్దరికీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది వారి మధ్య స్నేహాన్ని క్రమంగా పెంచింది.చెబితేనే కారు కదిలేది..మీడియా నివేదికల ప్రకారం.. ఒకరోజు ముఖేష్ అంబానీ, నీతాతో కలిసి కారులో వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపి నీతా వైపు తిరిగి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగారు. నిశ్చేష్టురాలైన ఆమె ఆశ్చర్యంతో ఏమీ చెప్పలేక కొద్దిసేపు అలాగే ఉండిపోయింది. సమాధానం చెప్పే వరకూ కారు కదలదని ముఖేష్ అంబానీ చెప్పారు. దీంతో తరువాత ఆమె అంగీకరించారు. అలా వారు కలిసి జీవితాన్ని ప్రారంభించారు. -
‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’
దీపావళి పండగను పురస్కరించుకుని చాలా మంది విభిన్న రీతుల్లో వేడుకలు నిర్వహించుకుంటారు. దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న ముఖేశ్ అంబానీ గారాలపట్టి, ఆయన కూతురు ఇషా అంబానీ దీపావళి రోజును ఎలా జరుపుకుంటారో తెలిపారు. ఇంటిల్లిపాది ఎలా వేడుకలు నిర్వహించుకుంటారో తెలియజేశారు. తన వ్యాపారాలు వృద్ధికి ఈ పండగ ఎలా ఉపయోగపడుతుందో చెప్పారు.‘చిన్ననాటి నుంచి నాకు పండుగలంటే చాలా సరదా. ఆ సమయంలో మా ఇల్లు బంధువులతో, పండుగ వేడుకలతో కళకళలాడుతుంది. ఎన్ని పనులున్నా అమ్మానాన్నలు వాటిని పక్కన పెట్టి మాతోనూ, బంధుమిత్రులతోనూ గడుపుతారు. బిజీ జీవితంలో పండుగలు మా అందరికీ ఓ ఆటవిడుపులా దోహదపడుతాయి. అంతేకాదు ఎన్నో విషయాల్నీ శాస్త్రాల్నీ తెలియజేస్తుంటాయి. అయితే నాకు అన్ని పండుగల్లో కెల్లా దీపావళి అంటే చాలా ఇష్టం. మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించడం, ఆ వెలుగును చూస్తూ ఆనందించడం అలవాటు. ఆ కాంతులు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినట్టు అనిపిస్తుంది. దాంతో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఈ పండగ వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది. టపాసుల విషయానికొస్తే పక్షుల్నీ, జంతువుల్నీ భయపెట్టీ, పర్యావరణానికి హాని చేసే వాటికి నేను దూరం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించే ఏకైక దేశం భారత్!ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిలయన్స్ ట్రెండ్స్ టిరా బ్యూటీ యూస్టా అజార్ట్ హామ్లేస్ నెట్మెడ్స్ ఫ్రెష్పిక్ -
చైనా కుబేరుడి కంటే అంబానీ సంపద రెండింతలు!
చైనాలోని అత్యంత ధనవంతుల జాబితాను ‘హురున్ చైనా రిచ్ లిస్ట్’ పేరుతో విడుదల చేశారు. అందులో బైట్డ్యాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ మొదటిస్థానంలో నిలిచారు. ఈయన సంపద దాదాపు 49.3 బిలియన్ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు)గా ఉందని హురున్ నివేదించింది. అయితే తన సంపద గతంలో కంటే పెరిగినప్పటికీ భారత్లో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీను మాత్రం మించలేకపోయారు.చైనాలో కుబేరుల పెరుగుదల తగ్గిపోతుందని హురున్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఇటీవల భారీగా తగ్గిన చైనా ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ల ప్రభావంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. ప్రస్తుతం చైనా కుబేరుల మొత్తం సంపద మూడు ట్రిలియన్ డాలర్లు(రూ.250 లక్షల కోట్లు)గా ఉంది. అయితే ఇది గతంలోకంటే 10 శాతం తగ్గినట్లు హురున్ నివేదిక ఛైర్మన్ రూపెర్ట్ తెలిపారు.చైనా కంటే భారత్లో పెరుగుదలచైనాలో బిలియనీర్ల జాబితా తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా భారత్లో మాత్రం వారి సంఖ్య పెరుగుతోంది. ఆగస్టులో విడుదల చేసిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం..భారత్ గతంలో కంటే 29 శాతం బిలియనీర్ల సంఖ్యను పెంచుకుంది. ఇది రికార్డు స్థాయిలో 334కు చేరుకుంది. అయితే, మొత్తం బిలియనీర్ల సంఖ్య విషయానికి వస్తే భారతదేశం ఇప్పటికీ చైనా కంటే వెనుకబడే ఉంది. చైనాలో 753 మంది బిలియనీర్లు ఉన్నారు.ఇదీ చదవండి: కొత్త అప్డేట్..యాపిల్లో అదిరిపోయే ఫీచర్!చైనా కుబేరుడు జాంగ్ యిమింగ్హురున్ నివేదిక ప్రకారం జాంగ్ యిమింగ్(41) సంపద నికర విలువ 49.3 బిలియన్ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు). ఆన్లైన్ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్లు డౌయిన్, టిక్టాక్ మాతృ సంస్థ బైట్డాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు యిమింగ్. కాగా, భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ సంపద నికర విలువ 102 బిలియన్ డాలర్ల(రూ.8.5 లక్షల కోట్లు)కు చేరుకుంది. అంబానీ సంపద గతేడాది కంటే 25 శాతం పెరిగింది. -
జియోకు కస్టమర్లు షాక్.. కోటి మంది గుడ్ బై..!
-
ఆస్కార్ రిటైరయ్యింది..!
ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం ముంబైలోని అంటీలియా వద్ద పేలుడు పదార్థాలను కనిపెట్టి పెను ప్రమాదాన్ని నివారించిన పోలీసు జాగిలం ‘ఆస్కార్’విధుల నుంచి విశ్రాంతి తీసుకుంది. మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్న అంబానీ నివాసం సమీప పార్కింగ్ ప్లేస్లో 2021 ఫిబ్రవరి 25న ఆగంతకులు ఉంచిన జిలెటిన్ స్టిక్స్ను ఇది పసిగట్టింది. అప్పట్లో ఈ విషయం దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది. ఆస్కార్ బుధవారం తోటి శునకం మిలోతోపాటు రిటైరయ్యింది. ఈ సందర్భంగా జరిగిన వేడుకకు అదనపు కమిషనర్ వినీత్ సాహూ సహా పలువురు అధికారులు హాజరై జాగిలాలకు ఘనంగా వీడ్కోలు పలికారు. ముంబై పోలీసు విభాగం బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీడీఎస్)లో 2014లో చేరిన ఆస్కార్ పదేళ్లపాటు వీఐపీ భద్రతతోపాటు బెదిరింపులు, బెదిరింపు కాల్స్ సమయంలో విధులను సమర్ధవంతంగా నిర్వహించిందని ఓ అధికారి తెలిపారు. మిలో కూడా వీఐపీలు, కీలక సంస్థల భద్రతతోపాటు అనుమానాస్పద బ్యాగుల తనిఖీ విధుల్లో పాల్గొందని చెప్పారు. రిటైరయ్యాక ఈ రెండు జాగిలాలకు ఏసీ వసతి సౌకర్యంతోపాటు రవాణా సమయంతో ఏసీతో కూడిన వాహనం సమకూర్చుతామని, ఇవి అందించిన సరీ్వసులకు గుర్తింపుగా ‘వాల్ ఆఫ్ ఫేమ్’ను ఏర్పాటు చేశామని చెప్పారు. -
JioHotstar: కోటి రూపాయలు ఇచ్చారంటే..: అంబానీకే ఆఫర్ ఇచ్చిన విద్యార్థి
ఢిల్లీ : ఓ విద్యార్థి తన ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో విఫలమయ్యేవాడు. కానీ ఈసారి గురి తప్పలేదు. యూ ఆర్ వెల్కమ్ అంటూ కేంబ్రిడ్జీ నుంచి ఆహ్వానం అందింది. త్వరలోనే విద్యార్థి ఇంగ్లాండ్కు వెళ్లాల్సి ఉంది. అందుకే ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి ఓ ఆఫర్ ఇచ్చాడు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి? విద్యార్థి ఇచ్చిన ఆఫర్ను ముఖేష్ అంబానీ స్వీకరిస్తారా? లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? ఆ కథా కమామిషు ఏంటో ఏంటో తెలుసుకుందాం పదండి.రిలయన్స్,డిస్నీ మీడియా వ్యాపారాల విలీనానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రిలయన్స్, డిస్నీ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలీనానంతరం డిస్నీప్లస్,హాట్స్టార్లో జియో సినిమాను విలీనం చేయబోతున్నారని, రెండు సంస్థలను కలిసి జియో హాట్స్టార్గా వ్యవహరించనున్నారని మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.జియోహాట్స్టార్ పేరుతో ఈ తరుణంలో ఢిల్లీకి చెందిన ఓ డెవలపర్ జియోహాట్స్టార్ పేరుతో డొమైన్ బుక్ చేశాడు. ఆదే జియోహాట్స్టార్ పేరు మీద వ్యపారావ్యవహారాలు కొనసాగించాలనుకున్న రిలయన్స్కు సదరు డెవలపర్ ఆఫర్ ఇచ్చాడు. జియోహాట్స్టార్ డొమైన్ పేరును బుక్ చేసుకుంది తానేనని, అది మీకు కావాలంటే ఇస్తాను. ఇందుకోసం మీరు నాకు రూ.కోటి ఇవ్వాలని రిలయన్స్ సంస్థకు లేఖ రాశాడు.కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ఆ లేఖలో.. నేను 2021లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ యాక్సిలరేట్ ప్రోగ్రామ్కు ఎంపికైన డెవలపర్ని. ఐఐటీ పూర్తి చేయలేకపోయాను. అయినప్పటికీ నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకునేందుకు మొగ్గుచూపుతుంటాను. టైర్-2 కాలేజీ నుంచి వచ్చిన తనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ వచ్చింది. ఆంత్రప్రెన్యూర్షిప్ విభాగంలో పూర్తి స్థాయి డిగ్రీని పూర్తి చేసేందుకు అవకాశం కలిగింది. కానీ ఆ డిగ్రీలో చేరాలంటే ఖరీదైన వ్యవహారం. నేను భరించలేను. కోటి ఇవ్వాలంటూఅందుకే జియోహాట్స్టార్ విలీనం చివరి దశలోకి వచ్చిందని తెలిసింది. వెంటనే జియోహాట్స్టార్.కామ్ డొమైన్ను నేను కొనుగోలు చేశారు. విలీనం అనంతరం జియోహాట్స్టార్గా మీరు వినియోగదారులకు సేవలందించాలంటే నేను కొనుగోలు చేసిన డొమైన మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నేను అడిగినంత మీరు ఇస్తే నా కలను సాకారం చేసినవారవుతారు. ఈ మొత్తం రిలయన్స్ ఖర్చుగా భావిస్తుందేమో కానీ ఇది నాకు జీవితాన్ని మార్చే అవకాశం’అని పేర్కొన్నాడు.మరి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ విద్యార్థి అడిగిన మొత్తం ఇస్తారా? లేదంటే సదరు విద్యార్థిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
అంబానీ కవల పిల్లల వ్యాపార సామ్రాజ్యం
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వారసులు, కవలు ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీలు బుధవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ముఖేశ్-నీతా అంబానీ దంపతులకు ఐవీఎఫ్ ద్వారా అక్టోబర్ 23, 1991లో వీరు ఇద్దరు జన్మించారు.ఇషా అంబానీముంబయిలో అక్టోబర్ 23, 1991లో జన్మించారు.యేల్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ పిరమల్ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.కింది సంస్థలకు ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్రిలయన్స్ ట్రెండ్స్టిరా బ్యూటీయూస్టాఅజార్ట్హామ్లేస్నెట్మెడ్స్ఫ్రెష్పిక్ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..ఆకాశ్ అంబానీముంబయిలో అక్టోబర్ 23, 1991లో జన్మించారు.ముంబయిలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషన్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు.అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.2018లో శ్లోకామెహతాను వివాహం చేసుకున్నారు. వీరికి పృథ్వీ, వేద ఇద్దరు పిల్లలు.కింది సంస్థలకు ఆకాశ్ అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్జియో ప్లాట్ఫామ్స్ లిమిడెట్రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ముంబయి ఇండియన్స్ -
జియోకి షాక్.. కోటి మంది టాటా!
కొన్ని రోజుల క్రితం రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్ల టారిఫ్ను పెంచిన తర్వాత యూజర్లు షాక్ ఇచ్చారు. నివేదికల ప్రకారం పెరిగిన టారిఫ్ల ప్రభావం దాని వినియోగదారు బేస్పై ప్రతిబింబించింది. రెండవ త్రైమాసికంలో దాదాపు 1.09 కోట్ల మంది వినియోగదారులు జియో నుండి వెళ్లిపోయారు.అదే సమయంలో జియో 5G సబ్స్క్రైబర్ బేస్ మాత్రం 17 మిలియన్లు పెరిగినట్లు మొత్తం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంలో యూజర్ బేస్ 130 మిలియన్లు ఉండగా ఇప్పుడు 147 మిలియన్లకు చేరుకుంది. ఇక ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) రూ. 181.7 నుండి రూ.195.1కి పెరిగింది. అయితే మొత్తంగా జియో సబ్స్క్రైబర్ బేస్ క్షీణించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త అడుగు.. దేశంలో తొలి D2Dతన యూజర్ బేస్కు సంబంధించిన పరిస్థితి గురించి తమకు తెలుసునని, లాభాలపై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపదని జియో తెలిపింది. తమ కస్టమర్లకు అత్యుత్తమ 5జీ నెట్వర్క్ను అందించడంపైనే తమ దృష్టి ఉందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులను కోల్పోవడం తమ వ్యాపారాన్ని ప్రభావితం చేయదని, అయితే ఇతర టెలికాం ఆపరేటర్లకు ఇది అవకాశం కల్పిస్తుందని జియో అంగీకరించింది. -
ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతంటే..
ప్రపంచ ధనవంతులలో ఒకరు, భారతీయ పారిశ్రామిక వేత్త 'ముకేశ్ అంబానీ' వ్యాపార సామ్రాజ్యం గురించి, వారి ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అంబానీ దగ్గర డ్రైవర్ జాబ్ చేసే వ్యక్తి జీతం ఎంత ఉంటుందో బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసుకోవాలానే ఆసక్తి కూడా ఉండొచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. 2024 అక్టోబర్ 19 నాటికి ముఖేష్ అంబానీ 103 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోని 15వ సంపన్న వ్యక్తిగా.. ఆసియాలో అత్యంత ధనవంతుడుగా ఉన్నారు. అయితే ఈయన వ్యక్తిగత వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేశారు. ఈ వేతనం 2008 - 2009 ఆర్ధిక సంవత్సరం నుంచి కొనసాగుతోంది.అంబానీ డ్రైవర్ జీతం2017లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సమాచారం ప్రకారం, అంబానీ డ్రైవర్ జీతం నెలకు రూ.2 లక్షలు. అంటే ఏడాదికి రూ. 24 లక్షలన్నమాట. జీతం కాకుండా ఇతర అలవెన్సులు కూడా కూడా డ్రైవర్కు లభిస్తాయి. 2017లోనే డ్రైవర్ జీతం రెండు లక్షలు అంటే.. ఇప్పుడు రెట్టింపు అయి ఉంటుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనిజానికి అంబానీ కారు డ్రైవ్ చేసివారు ప్రొఫెషనల్ డ్రైవర్లు. వీరికి డ్రైవింగ్ చేయడానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఉంటుంది. లగ్జరీ కార్లను, బులెట్ ప్రూఫ్ కార్లను ఎలా డ్రైవ్ చేయాలి? వాటిని ఎలా మెయింటెనెన్స్ చేయాలి? అనే విషయాల గురించి కూడా బాగా అవగాహన ఉంటుంది. ఈ కారణంగానే సంపన్నుల డ్రైవర్లకు జీతాలు ఎక్కువగా ఉంటాయి. -
గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా.. రతన్ టాటాకు అంబానీ ఫ్యామిలీ నివాళి
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక దీపావళి విందులో 'రతన్ టాటా'కు ముఖేష్ అంబానీ ఫ్యామిలీ, వేలాది మంది ఉద్యోగులు నివాళులర్పించారు. నీతా అంబానీ 'గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా' అని రతన్ టాటాను కొనియాడారు. దూరదృష్టి కలిగిన పారిశ్రామికవేత్త, పరోపకారి, ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తి అని అన్నారు.దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా.. మా మామయ్య ధీరూభాయ్ అంబానీకి, నా భర్త ముకేశ్ అంబానీకి, మా కుటుంబానికి మంచి స్నేహితులు. ఆకాష్ అంబానీకి మార్గదర్శి అని నీతా అంబానీ అన్నారు. మహనీయుడు రతన్ టాటాకు నివాళిగా అందరూ మౌనం పాటించాలని పేర్కొన్నారు. ఈ సమయంలో ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురైనట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. -
రిలయన్స్కు జియో దన్ను
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఈ ఆరి్థక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. జూలై– సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 16,563 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 17,394 కోట్లు ఆర్జించింది. చమురు శుద్ధి, పెట్రోకెమికల్ బిజినెస్లు నీరసించడంతో ప్రభావం చూపింది. రిటైల్, టెలికం బిజినెస్లు మాత్రం పటిష్ట పనితీరును ప్రదర్శించాయి. రష్యా చౌక చమురుతో చైనా పెట్రోలియం ప్రొడక్టుల సరఫరాలు పెరిగి ఓటూసీ బిజినెస్ మార్జిన్లు మందగించాయి. రిటైల్ సైతం పెద్దగా వృద్ధి సాధించలేదు. కంపెనీ ఇబిటా 2 శాతం తగ్గి రూ. 43,934 కోట్లకు చేరింది. ఫైనాన్స్ వ్యయాలు 5 శాతం పెరిగి రూ. 6,017 కోట్లను తాకాయి. కాగా.. మొత్తం ఆదాయం రూ. 2.38 లక్షల కోట్ల నుంచి రూ. 2.4 లక్షల కోట్లకు బలపడింది. రుణ భారం రూ. 3.36 లక్షల కోట్లకు చేరింది. చేతిలో ఉన్న నగదును పరిగణిస్తే నికర రుణ భారం రూ. 1.16 లక్షల కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ వెల్లడించింది. టెలికం జోరుఈ ఏడాది క్యూ2లో ఆర్ఐఎల్ టెలికం, డిజిటల్ బిజినెస్ల విభాగం జియో ప్లాట్ఫామ్స్ నికర లాభం 23 శాతంపైగా జంప్చేసి రూ. 6,539 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) 7.4 శాతం మెరుగై రూ. 195.1కు చేరింది. టారిఫ్ల పెంపుతో రానున్న 2–3 క్వార్టర్లలో మరింత పుంజుకోనుంది. స్థూల ఆదాయం 18 శాతం ఎగసి రూ. 37119 కోట్లుగా నమోదైంది. 14.8 కోట్ల 5జీ వినియోగదారులతో అతిపెద్ద టెలికం ఆపరేటర్గా ఆవిర్భవించింది. సబ్్రస్కయిబర్ల సంఖ్య 4 శాతం పెరిగి 47.88 కోట్లను తాకింది. రిటైల్ ఓకేరిలయన్స్ రిటైల్ నికర లాభం స్వల్ప వృద్ధితో రూ. 2,836 కోట్లకు చేరింది. ఇబిటా నామమాత్రంగా బలపడి రూ. 5,675 కోట్లయ్యింది. స్థూల ఆదాయం స్వల్పంగా నీరసించి రూ. 76,302 కోట్లకు పరిమితమైంది. స్టోర్ల సంఖ్య 464 పెరిగి 18,946ను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు బీఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 2,745 వద్ద ముగిసింది.డైవర్సిఫైడ్ బిజినెస్ల పోర్ట్ఫోలియో మరోసారి పటిష్ట పనితీరును చూపింది. – ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ చైర్మన్, ఎండీ -
కాబోయే తొలి టాప్10 ట్రిలియనీర్లు వీళ్లేనా?
ప్రపంచంలో కొందరి సంపద అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటికే లక్షల కోట్లు దాటిపోయింది. ఇప్పటి వరకూ వారిని మల్టీ బిలియనీర్లు అనేవారు. ఇప్పుడు కొత్త టైటిల్ రాబోతోంది. అదే ట్రియనీర్. అంటే 1000 బిలియన్లు ఒక ట్రిలియన్కి సమానం. అయితే ఇప్పటి వరకూ ఎవరూ అధికారింగా ట్రిలియనీర్ టైటిల్ పొందలేదు. ఆ టైటిల్ సాధించే దిశగా టాప్ 10లో ఎవరెవరుంటారు అనే దానిపై ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ ఓ జాబితాను తయారు చేసింది.ఎలాన్ మస్క్ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఎలాన్ మస్క్కు ఉంది. ప్రస్తుతం ఆయన నెట్వర్త్ 195 బిలియన్ డాలర్లు. ఇది సగటున ఏడాదికి 109.88 శాతం చొప్పున పెరుగుతోంది. దీని ప్రకారం ఆయన 2027 కల్లా ట్రిలియన్ డాలర్ల సంపదను చేరుకుంటారు. ఎలాన్ మస్క్ టెస్లా, స్పేస్ఎక్స్, న్యూరా లింక్ వంటి సంస్థలకు అధినేతగా ఉన్నారు.గౌతమ్ అదానీభారత్కు చెందిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ట్రిలియనీర్ అయ్యేవారి జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఈయన 2028 నాటికి ట్రిలియనీర్ కానున్నారు. 84 బిలియన్ డాలర్లున్న గౌతమ్ అదానీ నెట్వర్త్ ఏటా సగటున 122.86 శాతం వృద్ధి చెందుతోంది.జెన్సెన్ హువాంగ్చిప్ కంపెనీ ఎన్విడియా కోఫౌండర్, సీఈవో జెన్సెన్ హువాంగ్ నెట్వర్త్ 77 బిలియన్ డాలర్లు కాగా సంవత్సానికి 111.88 శాతం పెరుగుతోంది. దీని ప్రకారం 2028 కల్లా ట్రిలియనీర్ జాబితాలోకి చేరనున్నారు.ప్రజోగో పంగెస్టుబరిటో పసిఫిక్ వ్యాపార సమ్మేళం అధినేత ప్రజోగో పంగెస్టు కూడా ట్రిలియనీర్ కానున్నవారి జాబితాలో ఉన్నారు. ఈయన 2028 నాటికి ట్రిలియనీర్ కానున్నారు. 43.4 బిలియన్ డాలర్లున్న పంగెస్టు నెట్వర్త్ ఏటా సగటున 135.95 శాతం పెరుగుతోంది.బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబంఎల్వీఎంహెచ్ ఫౌండర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం సంపద 223 బిలియన్ డాలర్లు. ఇది ఏటా 29.33 శాతం వృద్ధి చెందుతోంది. ఈ లెక్కన 2030 కల్లా ఆర్నాల్ట్ కుటుంబం ట్రిలియనీర్ జాబితాలోకి రానుంది.మార్క్ బుకర్బర్గ్మెటా ఫౌండర్, చైర్మన్, సీఈవో అయిన మార్క్ బుకర్బర్గ్ 2030 నాటికి ట్రిలియనీర్ కానున్నారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలో రెండో అత్యంత సంపన్నుడిగా ఉన్న బుకర్బర్గ్ నెట్వర్త్ ఏటా 35.76 శాతం వృద్ధి చెందుతోంది.ఫిల్ నైట్ కుటుంబంనైక్ చైర్మన్ ఫిల్ నైట్, ఆయన కుటుంబం సంయుక్తంగా 40.9 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. ఇది సంవత్సరానికి సగటున 7.99 శాతం పెరుగుతోంది. 2030 నాటికి ఈ కుటుంబం ట్రిలియనీర్ జాబితాలో చోటు దక్కించుకోనుంది.ముఖేష్ అంబానీఆసియా అపర కుబేరుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 2033 కల్లా ట్రిలియనీర్ కానున్నారు. ఆయన నెట్వర్త్ ఏటా సగటున 28.25 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది.మైకేల్ డెల్డెల్ టెక్నాలజీస్ చైర్మన్ సీఈవో మైకేల్ డెల్ ప్రస్తుత నెట్వర్త్ 91 బిలియన్ డాలర్లు. ఇది సంవత్సరానికి 30.89 శాతం చొప్పున పెరుగుతూ వస్తోంది. దీని ప్రకారం ఆయన 2033 నాటికి ట్రిలియన్ డాలర్ క్లబ్లో చేరనున్నారు.స్టీవ్ బామర్మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బామర్ ప్రస్తుత నెట్వర్త్ 121 బిలియన్ డాలర్లు. 25.76 శాతం చొప్పున ఏటా వృద్ధి చెందుతోంది. ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక ప్రకారం ఈయన 2034 నాటికి ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఉంది. -
ఐకానిక్ ఇషా అంబానీ, స్టైలిష్ లుక్స్ (ఫోటోలు)
-
అంబానీ చెప్పిన మూడు విషయాలు ఇవే..
ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ 'హర్ష్ గోయెంకా' తన ఎక్స్ ఖాతాలో 'ముఖేష్ అంబానీ' నుంచి మూడు విషయాలను నేర్చుకున్నట్లు వెల్లడించారు. అంబానీతో జరిగిన పరస్పర చర్యల ద్వారా నేర్చుకున్న విషయాలు విజయానికి దోహదపడతాయని పేర్కొన్నారు.మూడు విషయాలుపెద్ద కల - ఏదైనా సాధించాలంటే ముందుగా దాని గురించి కలలు కనండి. దాన్ని సహకారం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ''లక్ష్యంపై దృష్టి పెడితే అన్ని అడ్డంకులను అధిగమిస్తారు, అడ్డంకులను దృష్టిలో ఉంచుకుంటే, మీరు మీ లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు'' అని అంబానీ అన్నారు.శ్రమకు ప్రత్యామ్నాయం లేదు - లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి. శ్రమకు ప్రత్యామ్నాయం ఏదీ లేదు. మీరు ఎప్పుడూ ఉత్తమంగా ఉండాలని కోరుకోవాలి. భారతదేశంలో మాత్రమే గొప్పవాళ్లుగా గుర్తించబడితే సరిపోదు.. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాళ్ళుగా ఎదగాలి. కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుంది.సానుకూలంగా ఉండటం ముఖ్యం - జీవితంలో విజయం సాధించాలంటే సానుకూలత చాలా ముఖ్యం. విజయాన్ని సాధించడానికి ఆత్మవిశ్వాసంతో పాటు తనపై నమ్మకం కూడా ఉండాలి. ఆటంకాలు ఎన్ని ఎదురైనా ఓర్పుగా ఆలోచించాలి.ఇదీ చదవండి: పెరిగిన ఇళ్ల అమ్మకాలు.. ఈ ఎనిమిది పట్టణాలే టాప్భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఆసియాలోని అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వ్యాపార ప్రపంచంలో విజయం సాధించడానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో 14వ స్థానంలో ఉన్న అంబానీ నికర విలువ 105 బిలియన్ డాలర్లు.I have always learnt so much from my interactions with Mukesh Ambani. Let me share three of his life learnings with you’ll. pic.twitter.com/5p2zR1vWMj— Harsh Goenka (@hvgoenka) October 5, 2024 -
అంబానీకి మార్కెట్ సెగ.. రూ. 1.32 లక్షల కోట్లు ఆవిరి!
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి షేర్ మార్కెట్ సెగ తగిలింది. భారత్లో అత్యంత విలువైన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని షేర్లు భారీగా పతనమవడంతో భారీ నష్టాన్ని చవిచూసింది.షేర్ మార్కెట్లో అమ్మకాల జోరుతో కేవలం నాలుగు రోజుల్లోనే కంపెనీ రూ. 1.32 లక్షల కోట్లు నష్టపోయింది. కొద్ది రోజుల క్రితం రూ. 20 లక్షల కోట్ల మార్కును అధిగమించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ అక్టోబర్ 4 నాటికి రూ.18.76 లక్షల కోట్లకు తగ్గింది. శుక్రవారం కంపెనీ షేరు ధర రూ.42.45 (1.51%) తగ్గింది.ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..రిలయన్స్ షేరులో భారీ క్షీణత కనిపించినప్పటికీ దేశంలో ముఖేష్ అంబానీనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. అక్టోబర్ 4 నాటికి అంబానీ రియల్ టైమ్ నెట్వర్త్ రూ.916055 కోట్లు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, నిరంతర విదేశీ మూలధన ప్రవాహం కారణంగా మార్కెట్ క్రాష్ అయింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా అనిశ్చితి కారణంగా గ్లోబల్ క్రూడ్ ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్లను దెబ్బతీసింది. -
ప్రజా ధనంతో కొడుకు పెళ్లా?.. ముకేష్ అంబానీపై రాహుల్ ధ్వజం
చండీగఢ్: ప్రముఖ వ్యాపారవేత, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కోసం వేల కోట్లు విచ్చలవిడిగా ఖర్చు చేశాడని.. అదంతా దేశ ప్రజల నుంచి దోచిన సొమ్మేనని ఆరోపించారాయన.హర్యానాలోని బహదూర్గఢ్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. అంబానీ తన కొడుకు పెళ్లికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు కదా? అది ఎవరిది.. అదంతా మీ(ప్రజల) డబ్బు.. మీ పిల్లలకు మీరు పెళ్లిళ్లు చేయాలంటే అక్కడ.. మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బు లేదు.. మీ పిల్లల పెళ్లిళ్లకు మీరు బ్యాంకు రుణం తీసుకోవాల్సిందే. కానీ దేశంలో 25 మంది(పలువురు పారిశ్రామికవేత్తలు) మాత్రం తమ వివాహాలు, వేడుకలు జరిపించేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి చేశారు’ అని విమర్శలు గుప్పించారు.#WATCH | Haryana | Addressing a public rally in Sonipat's Gohana, Congress MP & LoP Rahul Gandhi says, "Did you see Ambani wedding? It went on for 15 days you all saw. Did you see Modi ji at the wedding? You saw it right. Did you see Rahul Gandhi there? It should be clear now who… pic.twitter.com/mh3N3E4CQc— ANI (@ANI) October 1, 2024రైతులు బ్యాంకుల్లో, వేరే వారి వద్ద నుంచి అప్పులు తీసుకుంటేనే తన కుటుంబంలో వివాహాలు జరిపించగలుగుతున్నారు. ప్రధాని మోదీ.. మీ జేబులో నుంచి డబ్బులు తీసుకొని ఆ 25 మంది జేబుల్లోకి వేస్తున్నాడని మండిపడ్డారు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. భారత సైనికుల నుంచి పెన్షన్, క్యాంటీన్, అమరవీరుల హోదాను లక్కోవడానికి అగ్నిపథ్ వంటి పథకాలు తీసుకొచ్చారని దుయ్యబట్టారు.#WATCH | Sonipat, Haryana: Congress MP and Leader of Opposition in Lok Sabha Rahul Gandhi while addressing a rally said, "There is everything for Adani, Ambani and billionaires....What is the meaning of Agniveer Yojana?... This scheme has only one aim - snatch away the money for… pic.twitter.com/1nFIlYmCtW— ANI (@ANI) October 1, 2024 ఇదిలా ఉండగా.. వ్యవసాయం ప్రధాన వృత్తిగా సాగుతున్న హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. అటు 10 సంవత్సరాల తర్వాత ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కృషి చేస్తోంది. అక్టోబర్ 8న వెలువడే ఫలితాలతో అటు రెండు పార్టీల భవితవ్యం తేలనుంది. -
ఒక్క కంపెనీ లాభం.. రోజుకు రూ.216 కోట్లు!
దేశంలోని కొన్ని కంపెనీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అవి మనం నిత్యం వింటున్న పేర్లే.. బాగా తెలిసిన కంపెనీలే. అయితే అవి రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో తెలిస్తే ముక్కున వేలేసుకుంటాం. 2024 ఆర్థిక సంవత్సరానికి ఆయా కంపెనీలు ప్రకటించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల ఆధారంగా సగటున రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.ముఖేష్ అంబానీ నేతృత్వలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.79 లక్షల కోట్ల ఏకీకృత ఎబీటా (EBITDA)ని నివేదించింది. నికర లాభం రూ. 79,020 కోట్లుగా ఉంది. అంటే కంపెనీ సగటున రోజుకు ఆర్జిస్తున్న లాభం రూ.216.5 కోట్లు. ఈటీ మనీ నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో సగటున రోజువారీ లాభంలో టాప్ టెన్ కంపెనీల జాబితా ఇదే..లాభాల్లో టాప్10 కంపెనీలు🔝రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.216.5 కోట్లు🔝ఎస్బీఐ రూ.186.7 కోట్లు🔝హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.179.3 కోట్లు🔝ఓఎన్జీసీ రూ.156.4 కోట్లు🔝టీసీఎస్ రూ.126.3 కోట్లు🔝ఐసీఐసీఐ బ్యాంక్ రూ.123.3 కోట్లు🔝ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.118.2 కోట్లు🔝ఎల్ఐసీ రూ.112.1 కోట్లు🔝కోల్ ఇండియా రూ.102.4 కోట్లు🔝టాటా మోటర్స్ రూ.87.1 కోట్లుఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ.. -
వయాకామ్18 బోర్డులో అంబానీలు
న్యూఢిల్లీ: గ్లోబల్ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ దేశీ బిజినెస్తో విలీనం నేపథ్యంలో తాజాగా ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు వయాకామ్18 బోర్డులో చేరారు. ముకేశ్ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్శన్ నీతా అంబానీ, కుమారుడు ఆకాశ్ అంబానీ బోర్డు సభ్యులుగా చేరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధి ట్రీ సిస్టమ్స్కు చెందిన మీడియా, ఎంటర్టైన్మెంట్ బిజినెస్లకు హోల్డింగ్ కంపెనీగా వయాకామ్18 వ్యవహరిస్తోంది. స్టార్ ఇండియా విలీనానికి సీసీఐ, ఎన్సీఎల్టీ అనుమతులు లభించడంతో వాల్ట్ డిస్నీ, వయాకామ్18 బోర్డులో సర్దుబాట్లకు తెరలేచినట్లు తెలుస్తోంది. బోధి ట్రీ సిస్టమ్స్ సహవ్యవస్థాపకుడు జేమ్స్ మర్డోక్, కీలక ఇన్వెస్టర్ మహమ్మద్ అహ్మద్ అల్హర్డన్, ఆర్ఐఎల్ మీడియా, కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్పాండే, అనాగ్రామ్ పార్ట్నర్స్ పార్ట్నర్ శువ మండల్ సైతం బోర్డులో చేరనున్నారు. స్టార్ ఇండియాతో వయాకామ్18 మీడియా, డిజిటల్ 18 మీడియా విలీనానికి గత నెల(ఆగస్ట్) 30న ఎన్సీఎల్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
అంబానీ కొత్త విమానం.. ధర తెలిస్తే అవాక్కవుతారు!
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ.. 'బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం' కొనుగోలు చేశారు. ఈ అల్ట్రా-లాంగ్-రేంజ్ బిజినెస్ ఫ్లైట్ విలువ సుమారు రూ.1,000 కోట్లు. ఇప్పటి వరకు మనదేశంలో ఏ వ్యాపారవేత్త కూడా ఇంత ఖరీదైన ఫ్లైట్ కొనుగోలు చేయలేదని సమాచారం.ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధీనంలో తొమ్మిది ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. అయితే అంబానీ కొనుగోలు చేసిన ఈ బోయింగ్ 737 మ్యాక్స్ 9 ఫ్లైట్ అనేక మార్పులను పొందినట్లు సమాచారం. ఈ కారణంగానే దీని ధర చాలా ఎక్కువని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విమానం ఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రిలయన్స్ ప్రధాన కార్యాలయం ఉన్న ముంబైకి చేరనుంది.ఇదీ చదవండి: హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాల జోరు.. వీటికే ఎక్కువ డిమాండ్బోయింగ్ 737 మ్యాక్స్ 9 స్పెసిఫికేషన్స్బోయింగ్ 737 మ్యాక్స్ 9 రెండు CFMI LEAP-1B ఇంజిన్లను పొందుతుంది. ఈ విమానం ఒకసారికి 11,770 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. దీనిని పూర్తిగా స్విట్జర్లాండ్లో అనుకూలీకరించి ఇండియాకు తీసుకురావడం జరిగింది. ఇది విలాసవంతమైన ఫీచర్స్ కలిగి ఉన్నట్లు సమాచారం. -
మల్టీ కలర్ చీరలో నీతా అంబానీ స్పెషల్ అండ్ సింపుల్ లుక్
రిలయన్స్ పౌండేషన్ అధ్యక్షురాలు నీతా అంబానీ ఏ చీర కట్టినా, ఏనగ పెట్టినా అద్భుతమే. ట్రెండ్కు తగ్గట్టుగా ఫ్యాషన్, డిజైనర్ దుస్తులు అందర్నీ ఆకర్షిస్తుంటాయి. చేనేత, ,పట్టుచీరలు, డైమండ్ నగలు, ముత్యాల హారాలతో తనదైన ఫ్యాషన్ సెన్స్తో ఫ్యాషన్ ఐకాన్లా నిలుస్తుంటారామె. ఇటీవల అంబానీ కుటుంబం గణేష్ చతుర్థిని ఉత్సాహంగా నిర్వహించింది. ఈ సందర్బంగా నీతా అంబానీ 'బంధేజ్' చీరలో ప్రత్యేకంగా కనిపించారు.డిజైనర్ జిగ్యా పటేల్ డిజైన్ చేసిన వంకాయ రంగు, గులాబీ రంగుల మల్టీకలర్ బంధేజ్ చీరలో నీతా అంబానీ అందంగా కనిపించారు. ఇక ఆమె వేసుకున్న గుజరాతీ ఎంబ్రాయిడరీతో ఎరుపు రంగు బ్లౌజ్ ప్రత్యేకత ఏంటంటే స్లీవ్లపై గణపతి బప్పా డిజైన్ ఉండటం. ఇంకా ఎనిమిది వరుసల ముత్యాల హారం, డైమండ్ చెవిపోగులు, ముత్యాలు పొదిగిన గాజులు, చేతి రింగ్, ఇంకా సింపుల్గా పువ్వులతో ముడితో ఎత్నిక్ లుక్తో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశారు. ఇటీవల ఎన్ఎంఈసీసీలో జరిగిన ఈవెంట్లో నీతా అంబానీ పట్టు 'పటోలా' చీరలో మెరిసారు. స్టైలిష్ రెడ్-హ్యూడ్ సిల్క్ పటోలాకు మ్యాచింగ్గా రాధా-కృష్ణ-ప్రేరేపిత గ్రాఫిక్ డిజైన్ వర్క్ బ్లౌజ్ ధరించిన సంగతి తెలిసిందే.కాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ , రాధిక పెళ్లి తరువాత వచ్చిన తొలి వినాయక చవితి కావడంతో అంబానీ కుటుంబం ఈ గణేష్ చతుర్థి వేడుకలనుఘనంగా నిర్వహించారు. బాలీవుడ్ తారలు, క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులు హాజరై గణపతి బప్పా ఆశీస్సులు తీసుకున్నారు. -
దీప్వీర్ బిడ్డను చూసేందుకు తరలివెళ్లిన అంబానీ
బాలీవుడ్ నటులు రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ దంపతులకు ఇటీవల (సెప్టెంబర్ 8)న ఆడబిడ్డ పుట్టింది. ఈ నేపథ్యంలో పలువురుబాలీవుడ్ పెద్దలు, ఇతర సెలబ్రిటీలకు ఈజంటకు అభినందనలు అందించారు. మరికొంతమంది స్వయంగా హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి వెళ్లి రణ్వీర్, దీపిక తొలి సంతానాన్ని ఆశీర్వదించారు. అలాగే దీపికా, రణ్వీర్ దంపతులతో సన్నిహిత సంబంధాలున్న, వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భారీ భద్రత మధ్య దక్షిణ ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్కు వెళ్లారు. రణ్వీర్, దీపికకు అభినందనలు తెలిపారు. వారి ముద్దుల తనయను ఆశీర్వదించారు.Mukesh Ambani made a late night visit to H.N. Reliance Hospital to meet Deepika, Ranveer and their baby.#DeepikaPadukone #RanveerSingh pic.twitter.com/4oLdspp7PN— Deepika Padukone Fanpage (@DeepikaAccess) September 10, 2024 కాగా బిలియనీర్ ముఖేష్ అంబానీ బాలీవుడ్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారు. అంబానీ ఇంట ఏ పండుగ, ఏ వేడుక జరిగిన బాలీవుడ్ పెద్దలంతా అక్కడ హాజరు కావాల్సిందే. అనంత్, రాధిక ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలు, మొన్న అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ అతిరథ మహారథులంతా తరలి వచ్చారు. అయితే గర్భంతో ఉన్న నేపథ్యంలో దీపికా రాలేకపోయినప్పటికీ, రణ్వీర్ అనంత్ , రాధిక వివాహ వేడుకల్లో ప్రత్యేక డ్యాన్స్తో అలరించారు. -
గణేష్ నిమజ్జనం: వేడుకగా ఆడిపాడిన అంబానీ కుటుంబం
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట విశేష పూజలందుకున్న విఘ్ననాయకుడు నిమజ్జనం కోసం తరలి వెళ్లాడు. గణపతి బప్పా మోరియా అంటూ అంబానీ అధికారిక నివాసం ఆంటిలియాలో పూజలందుకున్న గణపతిని అంబానీ కుటుంబం సాదరంగా సాగ నంపింది. పోయిరావయ్య బొజ్జ గణపతి, మళ్లొచ్చే ఏడాది మళ్లీ రావయ్యా అంటూ ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో లంబోదరుడికి మోకరిల్లి, హారతిచ్చి, జై బోలో గణేష్ మహారాజ్కీ అంటూ జేజేలు పలుకుతూ మేళ తాళాలతో ఊరేగింపుగా యాంటిలియా చా రాజాను నిమజ్జనానికి తోడ్కొని పోయారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla)నిమజ్జనానికి ముందు నిర్వహించిన పూజాకార్యక్రమంలో ముఖేష్ అంబానీ తల్లి కోకిలా బెన్, భార్య నీతా అంబానీ హారతి నివ్వగా, కొత్త దంపతులు అనంత్, రాధికతోపాటు, ఆకాశ్ అంబానీ,శ్లోకా అంబానీ,ఇషా, పిరామిల్ ఆనంద్ దంపతులు, అంబానీ మనవలు ,మనవరాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.కాగా గణేష్ చతుర్ధి అంటే అంబానీ ఇంట పెద్ద సందడే ఉంటుంది. అందులోనూ అంబానీ, నీతాల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం తరువాత వచ్చిన తొలి వినాయక చవితి కావడంతో మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే 15కోట్ల రూపాయల విలువైన స్వర్ణకిరీటాన్ని ముంబైలోని లాల్బాగ్యా గణపతికి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా అంబానీ ఇంట వినాయక చవితి వేడుకల్లో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, రేఖ, సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, బోనీ కపూర్, సారా అలీ ఖాన్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, అనన్య పాండే, భూమి పెడ్నేకర్ , సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. -
వినాయక చవితి వేడుకల్లో తమన్నా సందడి!
వినాయక చవితి వచ్చిందంటే సినీతారల సందడి మామూలుగా ఉండదు. ఎప్పటిలాగే ముంబయిలోని ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు గ్రాండ్ నిర్వహించారు. ముంబయిలోని ముకేశ్ నివాసం యాంటిలియాలో జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్లోని ప్రముఖులంతా హాజరై సందడి చేశారు. కొందరు సతీసమేతంగా విచ్చేసి గణనాధుని పూజల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఈ వేడుకల్లో టాలీవుడ్ హీరోయిన్ తమన్నా కూడా సందడి చేసింది.ముకేశ్ అంబానీ నిర్వహించిన గణపతి పూజలో టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమన్నా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఆమెతో పాటు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ లాంటి సూపర్ స్టార్స్ పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఈ వేడుకల్లో మెరిశారు. అయితే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి మిస్సయిన సెలబ్రిటీ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ వినాయక చవితి వేడుకలకు హాజరు కావడం విశేషం.అంతేకాకుండా జాకీ ష్రాఫ్ తన కుమారుడైన టైగర్ ష్రాఫ్లో కలిసి వచ్చారు. ఈ వేడుకల్లో కాజల్ అగర్వాల్, అమీర్ ఖాన్ కుమారులు జునైద్, ఆజాద్లు కూడా పాల్గొన్నారు. ప్రముఖ నటి భాగ్యశ్రీ తన భర్త హిమాలయాతో కలిసి హాజరయ్యారు. గాయం నుంచి కోలుకున్న సల్మాన్ ఖాన్ తన మేనకోడలు అలీజ్ అగ్నిహోత్రితో కలిసి సందడి చేశారు. మరో బాలీవుడ్ జంట రితీష్, జెనీలియా దేశ్ముఖ్, శ్రద్ధా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ జంట, రాజ్కుమార్రావు సతీమణి పాత్రలేఖతో కలిసి గణపతి ఉత్సవాలకు హాజరయ్యారు. -
అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం.. అన్నతో సవాలుకు సిద్ధం!
అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా సోదరుడు ముఖేష్ అంబానీకి సవాలు విసిరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ గోపాలకృష్ణన్ను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్గా నియమించుకుంది. కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీల తయారీకి సంబంధించిన ప్రణాళికలను ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు.రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం ఏటా 2,50,000 వాహనాల ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యంతో ఈవీ ప్లాంట్ను నిర్మించడానికి అయ్యే ఖర్చు సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. రానున్న రోజుల్లో దీనిని ఏటా 7,50,000 వాహనాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ కార్లతో పాటు బ్యాటరీ తయారీ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశీలిస్తోంది. 10 గిగావాట్ హవర్స్ (GWh) సామర్థ్యంతో ప్రారంభించి, వచ్చే దశాబ్దంలో 75 గిగావాట్ హవర్స్కి విస్తరించాలనేది కంపెనీ ప్రణాళిక అని మూలాలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది.దీనిపై కంపెనీ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ ఈ వార్తలు ఇప్పటికే ప్రభావం చూపాయి. రాయిటర్స్ కథనం తర్వాత, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు దాదాపు 2% పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతమై ముందుకు సాగితే, ఇప్పటికే ఈవీ మార్కెట్లో పురోగతి సాధిస్తున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్కి ప్రత్యక్ష పోటీని ఇవ్వవచ్చని భావిస్తున్నారు. -
ఇషా అంబానీకి ఆరేళ్లున్నప్పటినుంచీ..తొలి ఫీజు రూ. 25లే : వీణా
సెలబ్రిటీ మెహందీ కళాకారిణి, వీణా నగ్దా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తనదైన ప్రత్యేక మెహందీ కళతో సెలబ్రిటీ వధువుల ఫస్ట్ ఆప్షన్ ఆమె. బాలీవుడ్ క్వీన్స్ అందాల హీరోయిన్ శ్రీదేవి మొదలు ఈతరం దీపికా పదుకొనే, అలియా భట్, ట్వింకిల్ ఖన్నా, కృతి ఖర్బందా దాకా ఆమే హాట్ ఫ్యావరేట్. పలు బాలీవుడ్ సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. వీణా. అంతేకాదు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబంతో ఆమెకు సుదీర్ఘం అనుబంధం ఉంది. అంబానీలతో తన 38 ఏళ్ల అనుబంధం గురించి ప్రస్తావించిన వీణా రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీపై ప్రశంసలు కురిపించడం విశేషం.వీణా నగ్దా మెహందీ ఆర్ట్పై తన తనకున్న ప్రేమను వివరించడంతోపాటు, 38 ఏళ్ల అంబానీ కుటుంబంలో కోకిలాబెన్ అంబానీ నుండి నీతా అంబానీ వరకు తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అంబానీ కుటుంబంలో రెండు చేతుల నిండా నిండుగా గోరింటాకు పెట్టినందుకు తీసుకున్నతొలి రెమ్యునరేషన్ రూ, 25 రూపాయలట. ఆ సమయంలో ముఖేష్ అంబానీ కోకిలాబెన్ ఫోన్ నెంబరు, కార్డు ఉండాలని సలహా ఇచ్చాడు. దీంతో ఆమె సలహా పాటించినట్టు వీణా తెలిపారు. తనను ఎంతో మెచ్చుకునేవారని ఆమె చెప్పారు. అంతేకాదు అంబానీ ఇంటికి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు, ఎక్కువ ఫీజు వసూలు చేయాలని సూచించారట పొరుగింటివారు. కానీ తాను ఎన్నడూ అలాగ చేయ లేదని వెల్లడించింది. అంబానీలతో కలిసి పని చేయడమే గొప్ప అవకాశంగా భావించి సాధారణ కస్టమర్ల నుంచి పొందే ఛార్జీనే తీసుకోవాలని తన తల్లి కోరిందట. ఆ సలహా తనకు ఎప్పుడూ గుర్తుండేదంటూ చెప్పుకొచ్చారు.ఇషాకు ఆరేళ్లప్పటినుంచి గోరింటాకు పెడుతున్నాఇషా అంబానీ , శ్లోకా మెహతాకు 6 సంవత్సరాల వయస్సులో గోరింటాకు వారి చేతులను అలంకరించిన విషయాన్ని వీణా నగ్దా గుర్తు చేసుకుంది ఇషాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి వీణా నగ్దాను మెహందీ ఆర్టిస్ట్గా ఉన్నారు. ధీరూభాయ్ అంబానీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి తాను హాజరయ్యానని, ఆయన కుమార్తెల చేతులకు కూడా మెహందీ పెట్టానని తెలిపింది. అప్పుడు శ్లోకాకి కూడా ఆరేళ్లు అని కూడా వీణా గుర్తు చేశారు. వారంతా చదువుల కోసం సింగపూర్లో ఉండేవారికి ఇంటికి వచ్చినప్పుడల్లా మెహందీ పార్టీలు చేసుకునే వారని వివరించారు.పారిస్ ఒలింపిక్స్ 2024, మెహిందీ ఆర్ట్పారిస్ ఒలింపిక్స్ 2024కి ఆహ్వానించినపుడు తానెంతో పొంగిపోయానని, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటేందుకు నీతా అంబానీ చేసిన పనికి థ్రిల్ అయ్యానని వీణా వెల్లడించింది. పారిస్ ఒలింపిక్స్లో ఇండియన్ హౌస్లోని మెహందీ స్టాల్ గురించి మాట్లాడటం, ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది ఒలింపిక్ రింగ్ను మెహందీ డిజైన్ వేయించుకోవడం గురించి కూడా ప్రస్తావించారు. 'మెహెందీ క్వీన్ ఆఫ్ బాలీవుడ్' అని ట్యాగ్ ఇచ్చిన బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన కళకు విస్తరణకు అందించిన సహాయాన్ని కూడా వీణా గుర్తు చేసుకున్నారు. -
Reliance AGM 2024: రిలయన్స్ బొనాంజా
రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం)లో చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు బోనస్ షేర్లను ప్రకటించారు. సమీప భవిష్యత్లో టాప్–30 గ్లోబల్ దిగ్గజాల్లో ఒకటి గా కంపెనీని తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు టెక్నా లజీ విస్తృత వినియోగం, ఆధునిక తయారీ విధానాలు దన్నుగా నిలుస్తాయని చెప్పారు. ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ విస్తృత స్థాయి టెక్నాలజీ కంపెనీగా మారు తోందని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. అన్ని వ్యాపా రాల్లోనూ ఏఐ సంబంధ డిజిటల్ ఇన్ఫ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తద్వారా కంపెనీ అత్యంత వృద్ధి పథంలో సాగనున్నట్లు చెప్పారు. వెరసి రానున్న కాలంలో కంపెనీ విలువ భారీగా మెరుగుపడనున్నట్లు వివరించారు. ఏజీఎంలో వాటాదారులను ఉద్దేశించి పలు అంశాలను ప్రస్తావించారు. వీటి ప్రకారం ఆర్ఐఎల్ గతేడాది ఆర్అండ్డీపై రూ. 3,643 కోట్లు వెచ్చించింది. గత ఐదేళ్లలో రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ షేరుకీ మరో షేరుని ఉచితంగా(బోనస్) అందించనుంది. ఈ అంశాన్ని సెప్టెంబర్ 5న సమావేశంకానున్న డైరెక్టర్ల బోర్డు పరిశీలించనుంది. కంపెనీ ఇంతక్రితం 2017 సెప్టెంబర్, 2009 నవంబర్లోనూ 1:1 ప్రాతిపదికన బోనస్ షేర్లను జారీ చేసింది. రిటైల్ జోరు..: గతేడాది రిలయన్స్ రిటైల్ తొలిసారి రూ. 3 లక్షల కోట్ల టర్నోవర్ మైలురాయిని దాటింది. రానున్న 3–4ఏళ్లలో బిజినెస్ను రెట్టింపు చేసే లక్ష్యంతో ఉన్నట్లు ఆర్ఐఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు. మూడు ప్రయివేట్ లేబుళ్లు రూ. 2,000 కోట్ల వార్షిక అమ్మకాలను అందుకున్నాయి. లగ్జరీ జ్యువెలరీ విభాగంలోకి కంపెనీ ప్రవేశించనుంది. దేశవ్యాప్తంగా 18,836 స్టోర్లను నిర్వహిస్తోంది. దీంతో స్టోర్లరీత్యా టాప్–5 గ్లోబల్ రిటైలర్గా నిలుస్తోంది. ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ సరీ్వసుల మిల్క్బాస్కెట్ను కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. కళానికేతన్, జివామే, క్లోవియా, అర్బన్ ల్యాడర్లలో పెట్టుబడులు ఫ్యాషన్ విభాగంలో పట్టుసాధించేందుకు దోహదం చేస్తున్నాయి. జియో.. బంపర్ ఆఫర్: 100జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీరానున్న దీపావళి కానుకగా రిలయన్స్ జియో యూజర్లకు ఉచితంగా 100 జీబీ క్లౌడ్ స్టోరేజీని అందించనుంది. తద్వారా ఫొటోలు, వీడియోలు ఇతర డిజిటల్ ఫైళ్లను భద్రంగా దాచుకునేందుకు వీలుంటుంది. వచ్చే 3–5 ఏళ్లలో రిలయన్స్ రిటైల్, జియో, డిజిటల్ సర్వీసుల ఆదాయం, నిర్వహణ లాభం (ఇబిటా) రెట్టింపు కానున్నట్లు ముకేశ్ అచనా వేశారు. డేటా ఆధారిత ఏఐ సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రీమియం డివైస్ల అందుబాటులోఉన్న క్లౌడ్ సేవలను లగ్జరీగా కాకుండా చౌకగా అందించనున్నట్లు వెల్లడించారు. టీవీ వినియోగదారులకు హలోజియో పేరుతో వాయిస్ అసిస్టెంట్ సేవలను ప్రారంభించింది. రిలయన్స్ డిస్నీ.. వినోదంలో కొత్త శకం డిస్నీతో ఒప్పందం దేశీ వినోద రంగంలో సరికొత్త శకానికి దారి చూపనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. జియో, రిటైల్ తరహాలో మీడియా బిజినెస్ సైతం వృద్ధి బాటలో సాగుతుందని చెప్పారు. డిజిటల్ స్ట్రీమింగ్తో కంటెంట్ సృష్టిని జత చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ ప్రయాణంలో భాగంగా ఈ ఏడాది (2024–25) చివరికల్లా ఆర్ఐఎల్ తొలి సోలార్ గిగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు ముకేశ్ వెల్లడించారు. ఈ ప్లాంటు లో ఒకే చోట పీవీ మాడ్యూల్స్, సెల్స్, వేఫర్స్, పాలీసిలికాన్, గ్లాస్ తయారీని చేపట్టనున్నారు. తద్వారా ఈ యూనిట్ సౌరశక్తిని విద్యుత్గా మార్చనుంది. -
ధనవంతుల జాబితాలో వెనక్కి తగ్గిన అంబానీ (ఫోటోలు)
-
అంబానీ ని ధాటి మొదటి స్థానంలోకి అదానీ, పూర్తి ఆస్తి ఎంతంటే..!
-
జియో యూజర్లకు శుభవార్త!.. అంబానీ అదిరిపోయే గిఫ్ట్
'రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్' (AGM) ప్రారంభమైంది. ఇందులో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఈక్విటీ షేర్హోల్డర్కు 1:1 బోనస్ ఇష్యూను పరిశీలించడానికి 2024 సెప్టెంబర్ 5న తన డైరెక్టర్ల బోర్డుతో సమావేశం కానుందని వెల్లడించారు. ఇందులో జియో ఏఐ క్లౌడ్ ఆఫర్ గురించి కూడా ప్రస్తావించారు.100 జీబీ ఫ్రీ47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఏఐ క్లౌడ్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్ ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని షేర్హోల్డర్లను ఉద్దేశించి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. ఈ రోజు జియో వినియోగదారులు 100 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజిని పొందుతారని ఆయన ప్రకటించారు.ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, అన్ని ఇతర డిజిటల్ కంటెంట్, డేటాను సురక్షితంగా నిల్వ చేయడానికి & యాక్సెస్ చేయడానికి జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము. వచ్చే దీపావళి నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.#WATCH | Addressing the shareholders during the 47th Annual General Meeting, Reliance Industries Chairman Mukesh Ambani says, "I am thrilled to announce the Jio AI-Cloud Welcome offer. Today, I am announcing that Jio users will get up to 100 GB of free cloud storage, to securely… pic.twitter.com/80RnNxePI7— ANI (@ANI) August 29, 20241:1 బోనస్ ఇష్యూసెప్టెంబర్ 5న జరగబోయే సమావేశంలో 1:1 బోనస్ ఇష్యూ ప్రతిపాదన ఆమోదించబడితే.. పెట్టుబడిదారుడు ప్రతి షేరుకు అదనపు వాటాను పొందే అవకాశం ఉంటుంది.డైరెక్టర్ల బోర్డు 1:1 బోనస్ ఇష్యూను ప్రతిపాదిస్తే.. కంపెనీ నిల్వలను క్యాపిటలైజ్ చేయడం ద్వారా నిధులు సమకూరుస్తాయి. 1:1 బోనస్ ఇష్యూ అనేది ఇప్పటికే ఉన్న షేర్హోల్డర్లు కలిగి ఉన్న షేర్ల సంఖ్యను పెంచడం ద్వారా రివార్డ్ చేయడానికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది. ఇది ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వారి షేర్లను సమర్థవంతంగా రెట్టింపు చేస్తుంది. బోనస్ ఇష్యూలు కంపెనీ తన భవిష్యత్తు అవకాశాలపై మరియు బలమైన ఆర్థిక స్థితిపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. -
29న రిలయన్స్ ఏజీఎం.. అంచనాలన్నీ వీటిపైనే!
భారతీయ పారిశ్రామికవేత్త, అత్యంత సంపన్నుడు అయిన 'ముకేశ్ అంబానీ' ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏట కూడా 'రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్' (AGM) ఈ నెల 29న నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే విషయాలను తెలుసుకోవడానికి సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.ఆగష్టు 29న జరగనున్న 47వ వార్షిక సర్వసభ్య సమావేశంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. అంబానీ తీసుకునే నిర్ణయాలు ఏకంగా 35 లక్షల మందిని ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే లాభాల బాటలో దూసుకెళ్తున్న రిలయన్స్ కంపెనీ ఆగష్టు 29 తరువాత మరింత వృద్ధి చెందే అవకాశం లేకపోలేదు.రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ 2017లో కేవలం 1500 రూపాయలకే రీఫండబుల్ డిపాజిట్తో జియో ఫోన్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 2018లో 2999 రూపాయలకు జియో ఫోన్2, 2019లో సౌదీ ఆరామ్కో పెట్టుబడులతో పాటు జియో ఫైబర్ లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. 2020లో గూగుల్ కంపెనీలో పెట్టుబడి, 2021లో రూ. 75000 కోట్ల పెట్టుబడితో కొత్త ఎనర్జీ బ్లూప్రింట్, 2022లో 5జీ కోసం రూ.2 లక్షల కోట్లు కేటాయింపు.. ఇలా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ ఏడాది జరగబోయే సమావేశంలో.. రిలయన్స్ జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ గురించి మాట్లాడే అవకాశం ఉంది. అంతే కాకుండా వారసత్వ ప్రణాళికలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. అంటే ఉన్న వ్యాపారాలలో ఎవరికి ఏది అప్పగిస్తారో.. గురువారం జరిగే సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది.రిలయన్స్ కంపెనీ ఆయిల్ అండ్ కెమికల్, న్యూఎనర్జీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే గుజరాత్లోని జామ్నగర్లో మెగా గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్ సిద్ధమవుతోంది. కాబట్టి జరగబోయే సమావేశంలో గిగా ఫ్యాక్టరీలు, ఎనర్జీ స్టోరేజీలు, ఎలక్ట్రోలైసర్లు, ప్యూయల్ సెల్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
నవకల్పనలపై జియో ఫైనాన్షియల్ దృష్టి
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎస్ఎఫ్ఎల్) నవకల్పనలు, వృద్ధి, దేశవ్యాప్తంగా ఆర్థికాంశాల గురించి అవగాహన కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. సర్వీసుల పోర్ట్పోలియోను విస్తరిస్తోందని, అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ను సరళతరం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.రిలయన్స్ అనుబంధ సంస్థ జేఎఫ్ఎస్ఎల్ తొలి వార్షిక నివేదికను గురువారం విడుదల చేసిన సందర్భంగా అంబానీ ఈ విషయాలు తెలిపారు. టెక్నాలజీ ఊతంతో వివిధ వర్గాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన ప్రోడక్టులు అందించడం ద్వారా ఆర్థికంగా సమ్మిళిత భారత భవిష్యత్ను తీర్చిదిద్దే విషయంలో కంపెనీ సారథ్య బాధ్యతలను నిర్వర్తించగలదని ఆయన పేర్కొన్నారు.భారత మార్కెట్పై గల అపార అవగాహన, టెక్నాలజీలో అనుభవాన్ని ఉపయోగించుకుని కస్టమర్ల అవసరాలకు తగిన ఆర్థిక సాధనాలు, సేవలను రూపొందించడం కొనసాగిస్తుందని వివరించారు. అధునాతన సాంకేతికత తోడ్పాటుతో యూజర్ల అనుభూతిని మెరుగుపర్చే దిశగా జియోఫైనాన్స్ యాప్ను ప్రవేశపెట్టినట్లు జేఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఈషా ఎం అంబానీ తెలిపారు. -
జియో యూజర్లకు అంబానీ గిఫ్ట్!.. సైలెంట్గా నాలుగు కొత్త ప్లాన్స్
జియో రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచేసిందని యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ ముకేశ్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇందులో భాగంగానే అంబానీ నాలుగు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టారు.జియో కొత్త ప్రీపెయిడ్ ఆఫర్లురూ.199 ప్లాన్: ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లు మాత్రమే కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సబ్స్క్రిప్షన్లు (18 రోజులు) ఉన్నాయి.రూ.209 ప్లాన్: ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 22 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది.రూ.249 ప్లాన్: రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది.రూ.299 ప్లాన్: రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది.రీఛార్జ్ ప్లాన్స్ పెంచడం వల్ల ఇప్పటికే చాలామంది జియో యూజర్లు 'బీఎస్ఎన్ఎల్'కు మారిపోతున్నారు. ఇప్పటికే లక్షలమంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఇక యూజర్లను మళ్ళీ ఆకట్టుకోవడానికి సంస్థ ఈ ప్లాన్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. -
భారత్..డేటా సంపన్న దేశం: అంబానీ
మలిదశ వృద్ధి ప్రయాణానికి రిలయన్స్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. 2016లో జియో 4జీ టెలికం సేవలను ప్రారంభించడం ద్వారా భారత్ను డేటా పరంగా సంపన్న దేశంగా మార్చినట్టు కంపెనీ వార్షిక నివేదికలో అంబానీ పేర్కొన్నారు. జియో ద్వారా దాదాపు దేశంలోని ప్రతి ఇంటికీ అధిక వేగంతో కూడిన 4జీ డేటాను అందుబాటు ధరలకు అందిస్తున్నట్టు చెప్పారు.ఈ సందర్భంగా అంబానీ మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చాం. అంతర్జాతీయ అనిశ్చితులున్నా ప్రపంచంలో భారత్ స్థిరంగా అభివృద్ధి చెందుతోంది. వేగంగా వృద్ధి చెందుతున్న దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగ అవసరాలను తీర్చే స్థాయిలో రిలయన్స్ రిటైల్ ఉంది. 100 బిలియన్ డాలర్ల (రూ.8.4 లక్షల కోట్లు) విలువ కలిగిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో బడా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నార’ని చెప్పారు.ఇదీ చదవండి: ఒక్క రూపాయీ జీతం తీసుకోని ముఖేష్ అంబానీ!గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‘2035 నాటికి సున్నా కర్బన ఉద్గారాల విడుదలే(నెట్ జీరో) లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు వీలుగా జామ్నగర్లో దీరూభాయి అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. పునరుత్పాదక ఇంధన వనరుల తయారీకి సంబంధించి రిలయన్స్ సమగ్ర కేంద్రంగా ఉంటుంది. వయకామ్ 18, స్టార్ ఇండియా వ్యాపారాల విలీనంతో జాయింట్ వెంచర్ టెలివిజన్, డిజిటల్ స్ట్రీమింగ్లో అగ్రగామిగా అవతరిస్తున్నాం’ అని ముఖేశ్ అన్నారు. -
ఒక్క రూపాయీ జీతం తీసుకోని ముఖేష్ అంబానీ!
దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వరుసగా నాలుగో ఏడాది కూడా తన కంపెనీల నుంచి ఎలాంటి జీతం తీసుకోలేదు. కరోనా మహమ్మారి సమయం నుంచి ఆయన వేతనం తీసుకోవడం ఆపేశారు. ఆయనేకాదు తన బోర్డులోకి వచ్చిన తన వారసులు కూడా వేతనాలు తీసుకోకపోవడం గమనార్హం.కరోనాకి ముందు వేతనం అందుకున్న ముఖేష్ అంబానీ.. ఉన్నత నిర్వాహక స్థానాల్లో ఉన్నవారు వేతనాల విషయంలో ఆదర్శంగా ఉండాలని, అందుకు తానే వ్యక్తిగత ఉదాహరణగా నిలిచేందుకు 2009 నుంచి 2020 ఆర్థిక సంవత్సరం వరకు తన వార్షిక వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. 2021లో కోవిడ్ మహమ్మారి కారణంగా వ్యాపారాలు ప్రభావితమైనప్పుడు అంబానీ తన జీతాన్ని పూర్తీగా వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.కంపెనీ తాజా వార్షిక నివేదిక ప్రకారం.. 2024 ఆర్థికేడాదిలో ముఖేష్ అంబానీ జీతం రూపంలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అలవెన్సులు, పెర్క్విసిట్లతో పాటు రిటైరల్ ప్రయోజనాలను కూడా పొందలేదు. 1977 నుంచి రిలయన్స్ బోర్డులో ఉన్న ముఖేష్ అంబానీ, 2002 జూలైలో తన తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత కంపెనీ ఛైర్మన్ అయ్యారు.ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలు ఇషా, ఆకాష్, అనంత్లు గత ఏడాది అక్టోబర్లో ఎటువంటి జీతం లేకుండా బోర్డులో నియమితులయ్యారు. కానీ ఒక్కొక్కరు సిట్టింగ్ ఫీజుగా రూ.4 లక్షలు, కమీషన్ కింద రూ.97 లక్షలు పొందారు. బోర్డులో 2023 ఆగస్టు 28 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించిన ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సిట్టింగ్ ఫీజు రూపంలో రూ.2 లక్షలు, కమీషన్ కింద రూ.97 లక్షలు అందుకున్నారు.ముఖేష్ అంబానీ కంపెనీ నుంచి ఎలాంటి వేతనం తీసుకోనప్పటికీ వ్యాపార పర్యటనల సమయంలో అయ్యే ఖర్చులన్నిటినీ కంపెనీ నుంచి చెల్లిస్తారు. అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడానికి కూడా కంపెనీనే ఖర్చులు భరిస్తుంది. 109 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. -
జియోపై బీఎస్ఎన్ఎల్ స్ట్రాంగ్ ఎఫెక్ట్
జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచిన తరువాత చాలామంది బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) నెట్వర్క్కు మారిపోతున్నారు. దీంతో బీఎస్ఎన్ఎల్ కొత్త సబ్స్క్రైబర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే 2.75 మిలియన్ల యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకున్నట్లు సమాచారం.బీఎస్ఎన్ఎల్ వైపు వచ్చిన యూజర్లలో ఎక్కువ భాగం మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. జియో, ఎయిర్టెల్ వంటి రీఛార్జ్ ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ చార్జీలు, వ్యాలిడిటీ వంటివి చాలామందిని ఆకర్షిస్తున్నాయి. మొత్తం మీద బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్ ముకేశ్ అంబానీ జియోపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.ప్రభుత్వం నిర్వహిస్తున్న బీఎస్ఎన్ఎల్ చందాదారుల సంఖ్య పెరుగుతోందని, స్వదేశీ 4జీ నెట్వర్క్ కూడా సిద్ధంగా ఉందని.. దానిని 5Gకి మార్చడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. అంతే కాకుండా బీఎస్ఎన్ఎల్ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ కంపెనీలు 4జీ నెట్వర్క్ను తీసుకువచ్చినప్పుడు బీఎస్ఎన్ఎల్ 4జీ ఎందుకు దీనిని ప్రవేశపెట్టలేదని చాలామంది అడిగారు. అయితే ప్రభుత్వం నిర్వహించే కంపెనీ నెట్వర్క్ను అభివృద్ధి చేయవలసి వస్తే.. స్వదేశీ టెక్నాలజీ, పరికరాలను మాత్రమే ఉపయోగించాలని.. చైనా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసే పరికరాలను ఉపయోగించకూడదని ప్రధానమంత్రి తీర్మానమని జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.భారత్ తన స్వంత 4జీ స్టాక్, కోర్ సిస్టమ్ లేదా రేడియేషన్ యాక్సెస్ నెట్వర్క్ అని పిలువబడే టవర్లను అభివృద్ధి చేస్తుందని ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రధాని మోదీ వెల్లడించారు. భారతదేశం తన సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది, దేశప్రజలకు 4G నెట్వర్క్ను అందిస్తుందని అన్నారు. స్వదేశీ సాంకేతికతను కలిగి ఉన్న ఐదవ దేశంగా భారత్ అవతరించిందని సింధియా చెప్పారు.టవర్ల ఏర్పాటుకోసం తేజస్ నెట్వర్క్, సీ-డాట్, టీసీఎస్ వంటి భారతీయ సంస్థలతో బీఎస్ఎన్ఎల్ పనిచేస్తోంది. 2024 అక్టోబర్ నాటికి 80000 టవర్లు, వచ్చే ఏడాది మార్చి నాటికి 21000 టవర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 2025 నాటికి 4G నెట్వర్క్కు చెందిన లక్ష టవర్లు ఇన్స్టాల్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. -
ప్యారిస్ ఒలింపిక్స్ 2024.. నీతా అంబానీ అద్భుత లుక్స్ ఫోటోలు
-
భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ బాస్ ఎవరో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన అంబానీ ఫ్యామిలీ చాలా కాలంగా వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తోంది. ధీరూభాయ్ అంబానీ కుటుంబంలోని అందరూ వ్యాపారంలో సంబంధాన్ని కలిగి ఉన్నారు. ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ ముకేశ్ అంబానీ సారథ్యంలో నడుస్తోంది. ఇందులో ఆకాష్, ఇషా, అనంత్ అంబానీలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ కంపెనీ నేడు ఈ స్థాయికి రావడానికి కారణమైన వాళ్లలో ధీరూభాయ్ అంబానీ సోదరీమణులలో ఒకరు కూడా ఉన్నారు.ధీరూభాయ్ అంబానీ అంటే.. ముఖేష్ అంబానీ తండ్రి, నీతా అంబానీ మామ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు అని అందరికీ తెలుసు. అయితే ఈయనకు నలుగురు తోబుట్టువులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరు త్రిలోచన బెన్, రామ్నిక్లాల్ అంబానీ, జాసుబెన్, నతుభాయ్. త్రిలోచన బెన్ వయసులో ధీరూభాయ్ అంబానీ కంటే పెద్దవారు.త్రిలోచన బెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపనలో పరోక్షంగా ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే ఈమె గురించి చాలామందికి తెలియకపోవడం గమనార్హం. త్రిలోచన బెన్ కుమారుడు రిలయన్స్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన రసిక్లాల్ మెస్వానీ. ఈమె మనవళ్లు నిఖిల్ ఆర్ మేస్వానీ, హిటల్ ఆర్ మేస్వానీ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్లో కీలక పదవుల్లో ఉన్నారు.నిఖిల్ ఆర్ మేస్వానీ 1986లో ఆర్ఐఎల్లో చేరి కంపెనీ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. ఈయన పెట్రోకెమికల్ విభాగాన్ని చూసుకుంటూ.. ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్తో పాటు ఇండియన్ సూపర్ లీగ్ను నిర్వహించడంలో కూడా పాల్గొంటారు.ఇక త్రిలోచన బెన్ చిన్న మనవడు హిటల్ ఆర్ మేస్వాని 1995లో కంపెనీలో చేరి.. తన అన్న నిఖిల్ మాదిరిగానే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అదే పదవిని నిర్వహించారు. పెట్రోలియం రిఫైనింగ్, మార్కెటింగ్, పెట్రోకెమికల్స్ తయారీతో పాటు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (HR), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్ & టెక్నాలజీ వంటి కంపెనీ ఇతర కార్పొరేట్ విధులను కూడా ఈయన నిర్వహిస్తారు.ముకేశ్ అంబానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వ్యాపార ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు. నా మొదటి బాస్.. నా అత్త కుమారుడు రసిక్లాల్ మెస్వానీ అని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈయన సంస్థను సరైన దిశలో నడిపించారని ప్రశంసించారు.రసిక్లాల్ మెస్వానీ చాలా ఓపెన్గా ఉంటారు. మేము ఒకరి క్యాబిన్లోకి మరొకరు వెళ్ళవచ్చు. సమావేశాల్లో, చర్చల్లో పాల్గొనవచ్చు. దీన్ని మా నాన్న ప్రోత్సహించారు. నేను అధికారికంగా రిలయన్స్లో చేరినప్పుడు.. నాన్న పాలిస్టర్ వ్యాపారాన్ని రసిక్భాయ్ కింద ఉంచారు. ఇందులో పాలిస్టర్ ఫైబర్ను దిగుమతి చేసుకోవడం, దానిని టెక్స్టైల్ చేయడం, మా సొంత మిల్లులలో విక్రయించడం వంటివి ఉన్నాయని ముకేశ్ అంబానీ వెల్లడించారు. -
ప్రపంచంలోనే అతి పెద్ద మామిడితోట మనదగ్గరే.. ఆ కుబేరుడిదే!
పెట్రోలియం, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ గురించి అందరికి తెలుసు. కానీ ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారు కూడా అని కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.ముకేశ్ అంబానీకి గుజరాత్లోని జామ్నగర్లో సుమారు 600 ఎకరాల మామిడి తోట ఉంది. ఇక్కడ 1.5 లక్షల కంటే ఎక్కువ మామిడి పండ్ల రకాలు ఉన్నట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడితోట కావడం గమనార్హం. ఇందులో కేసర్, అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి దేశీయ మామిడి జాతులు.. ఫ్లోరిడాకు చెందిన టామీ అట్కిన్స్, కెంట్ & ఇజ్రాయెల్ దేశానికి చెందిన లిల్లీ, కీట్, మాయా వంటి అంతర్జాతీయ రకాలు ఉన్నట్లు సమాచారం.ముకేశ్ అంబానీ మామిడి తోటలో ప్రతి ఏటా 600 టన్నుల కంటే ఎక్కువ అధిక నాణ్యత కలిగిన మామిడి పళ్ళు ఉత్పత్తి అవుతాయి. వీటిని రిలయన్స్ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తూ.. ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారుగా రికార్డ్ సృష్టించింది. -
అంబానీ ఆస్తులు కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా?
-
కొత్త కోడలి అదృష్టం!! పెళ్లి తర్వాత రూ.25వేల కోట్ల సంపద!
అపర కుబేరుడు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్తో జూలై 12న అత్యంత ఘనంగా, విలాసవంతంగా జరిగింది. ఈ వివాహం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద గణనీయంగా పెరిగింది.పెళ్లికి విపరీతంగా ఖర్చు చేసినా ముఖేష్ అంబానీ సంపద మాత్రం తగ్గలేదు. అంతకు ఐదింతలు పెరిగింది. జాతీయ వార్తాసంస్థ ఆజ్తక్ ప్రకారం, పెళ్లి తర్వాత అంబానీ నెట్వర్త్ రూ.25,000 కోట్లు (3 బిలియన్ డాలర్లు) పెరిగింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జూలై 5న అంబానీ నెట్వర్త్ 118 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. జూలై 12 నాటికి ఇది 121 బిలియన్ డాలర్లకు పెరిగింది.ఈ అసాధారణ పెరుగుదల ప్రపంచ సంపద ర్యాంకింగ్స్లో ముఖేష్ అంబానీ స్థానాన్ని పెంచింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో అంబానీ స్థానం 12 నుంచి 11వ స్థానానికి ఎగిసింది. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. అంబానీ నెట్వర్త్ పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పటిష్ట పనితీరు కారణమని చెప్పవచ్చు. పెళ్లి రోజున, రిలయన్స్ షేర్లు 1% పెరిగాయి. గత నెలలో షేర్లు 6.65% పెరిగాయి. గత ఆరు నెలల్లో 14.90% రాబడిని అందుకున్నారు. -
అంబానీ ఇంటిని తలదన్నే ఇల్లు!! బెంగళూరులో..
దేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏది అంటే టక్కున ముఖేష్ అంబానీది అనే చెప్పేస్తారు. ముంబైలో ఉన్న ఈ విలాసవంతమైన నివాసం పేరు ‘యాంటిలియా’. అయితే దీనిని తలదన్నే మ్యాన్షన్ బెంగళూరులో ఉంది. అది ఎవరిది.. దాని విలువ ఎంత.. ఇతర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం..400 అడుగుల ఎత్తు.. 33 అంతస్తుల లగ్జరీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్.. దానిపైన మ్యాన్షన్. రెండు అంతస్తుల్లో ఉన్న ఈ స్కై మ్యాన్షన్లో ఉన్న విలాసవంతమైన సదుపాయాల గురించి తెలిస్తే నోరెల్లబెడతారు. హెలిప్యాడ్, లష్ గార్డెన్స్, ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్, 360 డిగ్రీ వ్యూయింగ్ డెక్తో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.ప్రస్తుతం విదేశాలకు పరారైన, లిక్కర్ కింగ్గా పేరొందిన విజయ్ మాల్యాకు చెందిందే ఈ విలాసవంతమైన భవనం. కింగ్ఫిషర్ టవర్స్గా పిలిచే ఈ అపార్ట్మెంట్ బ్లాక్ను మాల్యా పూర్వీకుల ఇల్లు ఉండే 4.5 ఎకరాల స్థలంలో నిర్మించారు. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ దీన్ని నిర్మించింది. ఈ ఇంటి విలువ 20 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.ఒక్క రోజు కూడా ఉండలేదుఇక అంబానీ కుటుంబానికి చెందిన ముంబై టవర్, యాంటిలియా దేశంలోని అత్యంత సంపన్నుల యాజమాన్యంలో ఉన్న మరో అద్భుతమైన ఇల్లు . దీని నిర్మాణానికి 2 బిలియన్ ఖర్చయినట్లు అంచనా. విలువపరంగా చూస్తే కింగ్ఫిషర్ టవర్స్ విలువ తక్కువే అయినా అంబానీ నివాసం 27 అంతస్తులు ఉంటే.. మాల్యా మ్యాన్షన్ ఉండే టవర్స్ 33 అంతస్తుల్లో ఉంది. అయితే ముచ్చట పడి కట్టించుకున్న ఈ మ్యాన్షన్లో విజయ్ మాల్యా ఒక్క రోజు కూడా ఉండలేదు. ఇది ఇంకా నిర్మాణంలో ఉండగానే బ్యాంకులకు రుణాల ఎగవేత వ్యవహారంలో ఆయన దేశం వదిలి పారిపోయారు. -
అంబానీ ఆస్తులు జీరో కావాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా..?
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ ఆస్తులు కరిగిపోవాలంటే ఎన్ని రోజులు పడుతుందోననే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా..‘కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయ్’ కదా.. ఒకవేళ అంబానీ తన వ్యాపారం పరంగా ఎలాంటి మూలధన వ్యయం చేయకుండా ప్రస్తుతం ఉన్న ఆస్తిని అనుభవించాలంటే ఎన్నేళ్లు సమయం పడుతుందో తెలుసుకుందాం.ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నికర ఆస్తుల విలువ రూ.10.21 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఒకవేళ అంబానీ రోజూ రూ.3 కోట్ల రూపాయలు చొప్పున ఖర్చు చేసినా లేదా విరాళంగా ఇచ్చినా ఆయన సంపద మొత్తం 3,40,379 రోజుల్లో జిరో అవుతుంది. అంటే ఏడాదికి 365 రోజులకుగాను లెక్కిస్తే తన సంపద పూర్తిగా కరిగిపోవాలంటే 932 సంవత్సరాల 6 నెలలు పడుతుందన్నమాట. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం 2024 ప్రారంభం నుంచి ఇప్పటివరకు అంబానీ ఆస్తుల నికర విలువ దాదాపు రూ.1.98 లక్షల కోట్లు పెరిగింది.ఇదీ చదవండి: మరో సిమెంట్ కంపెనీపై అదానీ కన్ను?ముఖేశ్ అంబానీ ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల పెళ్లిని అంగరంగవైభవంగా నిర్వహించారు. రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లను జరుపుకున్నారు. దానికోసం రూ.కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. -
హాట్ టాపిక్గా అనంత్ అంబానీ పెళ్లి : అతి విలాసవంతమైన పెళ్లిళ్లు ఇవిగో!
అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం కనీవినీ ఎరుగుని రీతిలో అత్యంత ఘనంగా జరిగింది. ఇంట్లో జరిగిన చివరి వివాహం కావడంతో దేశ విదేశీలకు ప్రముఖులతో అంత్యంత ఆడంబరంగా నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ. దీంతో ఈ వివాహ వేడుక ప్రపంచంలో ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది.నిశ్చితార్థం మొదలు, రెండు ప్రీవెడ్డింగ్వేడుకలు, ముంబైలో మూడు రోజుల పాటు నిర్వహించిన గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకల్లో అతిథుల ఆహ్వానం దగ్గర్నించీ, ఆతిథ్యం, వారికి అందించిన బహుమతులు ప్రత్యేక ప్రదర్శనలు, విందు ఇలా ప్రతీదీ ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ పెళ్లి వేడుకల్లో కొత్తదంపతులతో సహా అంబానీ కుటుంబ మహిళలు ధరించిన కోట్లాది రూపాయల విలువ చేసే దుస్తులు, వజ్రాభరణాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. లైవ్మింట్, ది ఎకనామిక్ టైమ్స్ , ఔట్లుక్ అంచనా ప్రకారం ఈ వివాహ వేడుకల మొత్తం ఖర్చు 5వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయి ఉంటుందని అంచనా.ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన వివాహాలలో చోటు దక్కించుకున్న బ్రిటీష్ యువరాణి డయానా ప్రిన్స్ చార్లెస్ల వంటి దిగ్గజ వివాహాల ఖర్చు రూ. 1,361 కోట్లను, షేక్ హింద్ బింత్ బిన్ మక్తూమ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ల ఖర్చులను రూ. 1,144 కోట్లుగా అధిగమించినట్టే. 1981, జూలై 29న అప్పటి ప్రిన్స్ చార్లెస్ , లేడీ డయానా వివాహం లండన్లోని సెయింట్ పాల్స్ కేథడ్రల్లో రాయల్ వెడ్డింగ్ అత్యంత ఘనంగా జరిగింది. 3,500 మంది వ్యక్తులు ప్రత్యక్షంగా చూసారు, అయితే ప్రపంచవ్యాప్తంగా సుమారు 750 మిలియన్ల మంది ప్రజలు దీనిని టీవీలో వీక్షించారు. 10వేల, 25 అడుగుల పొడవుతో తయారు చేసిన అప్పటి యువరాణి డయానా వెడ్డింగ్ గౌన్ స్పెషల్ ఎట్రాక్షన్. 1979లో దుబాయ్ రాయల్ వెడ్డింగ్లో షేక్ మహ్మద్ తన కజిన్ షేఖా హింద్ను వివాహం చేసుకున్నాడు. వారం రోజుల పాటు అత్యంగ ఘనంగా ఈ వేడుకలు జరిగాయి.2004లో సహారా గ్రూప్కు చెందిన సుబ్రతో రాయ్ తన కుమారుల కోసం డబుల్ వెడ్డింగ్ సందర్భంగా లక్నోను విలాసవంతమైన ఏర్పాట్లతో ముంచెత్తారు. ఆరు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్లో 11వేల మంది అతిథుల హాజరయ్యారు. వీరి పెళ్లి ఖర్చు రూ. 550 కోట్ల రూపాయలట.2023, నవంబర్లో మేడ్లైన్ బ్రాక్వే , జాకబ్ లాగ్రోన్ల వెడ్డింగ్ "శతాబ్దపు వివాహం"గా పేరొందింది. ఈ వివాహానికి దాదాపు 59 మిలియన్ల డాలర్లు అంటే రూ. 489 కోట్లు ఖర్చయ్యాయి. పారిస్లోని వెర్సైల్లెస్ ప్యాలెస్లో విలాసవంతంగా ఈ వివాహం జరిగింది.2011లో కేట్ మిడిల్టన్ , ప్రిన్స్ విలియం రాజ వివాహం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వివాహాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ పెళ్లికి 43 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. 1,900 మంది అతిథులతో వెస్ట్మిన్స్టర్ అబ్బేలో జరిగిన ఈ ఈవెంట్ను ప్రపంచవ్యాప్తంగా 160 మిలియన్ల మంది వీక్షకులు వీక్షించారు, కామన్వెల్త్ దేశాల్లో వేడుకలు జరిగాయి.2018లో, అమెరికన్ నటి మేఘన్ మార్క్లేతో ప్రిన్స్ హ్యారీ వివాహం బ్రిటీష్ రాయల్ వివాహం విండ్సర్లోని సెయింట్ జార్జ్ చాపెల్లో జరిగిన వేడుకకు అనేక మంది ప్రముఖులు మరియు రాయల్టీతో సహా 600 మంది అతిథులు హాజరయ్యారు. ఇండియాకు చెందిన ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన లక్ష్మీ మిట్టల్ కుమార్తె వనీషా మిట్టల్ వివాహం ఆ జాబితాలో మరొకటి. 2004లో వనీషా మిట్టల్- అమిత్ భాటియా నిశ్చితార్థ వేడుక పారిస్లోని వెర్సైల్లెస్ ప్యాలెస్లో జరగగా, వివాహం చాటౌ వెక్స్లో జరిగింది. ఈ వివాహానికి సుమారు 66 మిలియన్ డాలర్లు రూ. 547 కోట్లు ఖర్చయిందట.2018, డిసెంబరు 12న ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ -ఆనంద్ పిరమల్ వివాహ జరిగింది.ఈ వివాహానికి సుమారు 15 మిలియన్లు డాలర్లు అంటే రూ. 110 కోట్లు ఖర్చయ్యాయి. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి బాలీవుడ్, భారతీయ రాజకీయ వర్గాల ప్రముఖులు హాజరయ్యారు.2006, ఫిబ్రవరి 18 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, మోడల్ ప్రియా సచ్దేవ్ వివాహం హోటల్ వ్యాపారి విక్రమ్ చత్వాల్తో మూడు నగరాల్లో 10 రోజుల పాటు వైభవంగా జరిగింది.26 దేశాల నుండి 600 మంది అతిథులు ఆహ్వానం, ప్రైవేట్గా చార్టర్డ్ విమానాలలో తరలించారు. అతిథి జాబితాలో బిల్ క్లింటన్, మోడల్ నవోమి క్యాంప్బెల్, అప్పటి భారత-పీఎం మన్మోహన్ సింగ్, లక్ష్మీ మిట్టల్ తదితరులు హాజరైనారు. 50,000 కిలోల పువ్వులు, 3వేల కొవ్వొత్తులు , ఇతర వస్తువులతో అలంకరించిన మొఘల్-కోర్ట్ శైలిలో ఈ వివాహం జరిగింది. పెళ్లికి 20 మిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ పెట్టుబడి బ్యాంకర్ మార్క్ మెజ్విన్స్కీని ల గ్రాండ్ వెడ్డింగ్ 2010లో ఆస్టర్ కోర్ట్స్లో జరిగింది. ఖర్చు 5 మిలియన్లు డాలర్లు. (దాదాపు రూ. 40 కోట్లు).ఇంకా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా తన ప్రతిభను చాటుకుంటున్న ప్రియాంక చోప్రా ,నిక్ జోనాస్ 2018,డిసెంబర్ 1 న వివాహం చేసుకున్నారు ఐదు రోజుల పాటు వీరి వివాహం రాజస్థాన్లోని ఉమైద్ భవన్ ప్యాలెస్లో జరిగింది. ఈ జంట కేవలం హోటల్స్కోసం రూ.3 కోట్లు ఖర్చు చేశారు. పెళ్లి తర్వాత ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ కూడా జరిగింది. -
దుబాయ్లో కొత్త పెళ్లికొడుకు ఇల్లు ఎలా ఉందో చూశారా?
ఆసియా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ల వివాహం ముంబైలో అంత్యంత వైభవంగా జరిగింది. ప్రపంచంలోని నలుమూలల నుంచి వ్యాపార దిగ్గజాలు, రాజకీయ సినీ ప్రముఖులు తరలిరాగా ప్రపంచం అబ్బురపడేలా అంగరంగ వైభవంగా వేడుకలు సాగాయి.విస్తారమైన వ్యాపార సామ్రాజ్యానికి పేరుగాంచిన అంబానీ కుటుంబానికి చెందిన చిన్న వారసుడు అనంత్ అంబానీ వివాహం నేపథ్యంలో వారి వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన కార్లు, ఆస్తుల గురించి చర్చ జరుగుతోంది. అయితే పెళ్లికి ముందే అనంత్ అంబానీకి ముఖేష్ అంబానీ దుబాయ్లో ఓ లగ్జరీ విల్లాను కొనుగోలు చేసి గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలుసా..? ఆ విలాసవంతమైన ఇంటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..అనంత్ అంబానీకి దుబాయ్లోని పామ్ జుమేరాలో సముద్రతీరంలో అత్యంత ఖరీదైన, విశాలమైన విల్లా ఉంది. ముఖేష్ అంబానీ 2022లో దీన్ని సుమారు రూ.640 కోట్లు పెట్టి కొనుగోలు చేసి అనంత్ అంబానీకి బహుమతిగా ఇచ్చారు. ఇందులో పది బెడ్రూమ్లు, ప్రైవేట్ స్పా, 70 మీటర్ల పొడవైన ప్రైవేట్ బీచ్ ఉన్నాయి. ఇది దుబాయ్లోని అత్యంత విలాసవంతమైన నివాసాలలో ఒకటిగా ఉంది. -
అనంత్ దంపతులను ఆశీర్వదించిన మోదీ
ముంబై: అంబానీల ఇంట పెళ్లి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. రిలయన్స్ సంస్థల అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ–రాధికా మర్చంట్ దంపతులను ఆశీర్వదించారు. శుక్రవారం రాత్రి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పెళ్లి వేడుకలకు ప్రపంచ ప్రముఖులంతా తరలి రావడం తెలిసిందే. శనివారం జరిగిన వివాహ విందులో పాల్గొన్న మోదీకి ముకేశ్–నీతా అంబానీ దంపతులు స్వాగతం పలికారు. ‘శుభ్ ఆశీర్వాద్’ పేరిట జరిగిన విందు వేడుకకు కూడా తారాలోకంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపార, రాజకీయ తదితర రంగాల దిగ్గజాలు హాజరై సందడి చేశారు. -
అదే ప్రార్థిస్తున్నా.. వేడుకలో ముఖేష్ అంబానీ స్పీచ్
బిలియనీర్ ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ప్రసంగించారు. అనంత్, రాధికలకు స్వర్గంలోని వారి తాత ముత్తాతల ఆశీర్వాదం ఉంటుందని, వారి శ్రేయస్సు కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని భావోద్వేగంతో పేర్కొన్నారు.వేడుకలకు విచ్చేసిన అతిథులను ఉద్దేశించి ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. "అనంత్, రాధికలకు స్వర్గంలో ఉన్న వారి తాత ముత్తాతల ఆశీర్వాదం ఉంటుంది. అనంత్, రాధికల జీవితం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అన్నారు.ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ సెంటర్ వేదిక వద్ద అనంత్ అంబానీ, తన చిరకాల స్నేహితురాలు రాధిక మర్చంట్ను పెళ్లాడారు. గ్లోబల్ సెలబ్రిటీలు, బిజినెస్ టైకూన్లు, ఇతర ప్రముఖుల సమక్షంలో వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతన్నాయి. -
అంబానీ చిన్న కోడలిగా రాధిక మర్చంట్, తొలి ఫోటో వైరల్
బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, తన ప్రేయసితో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అత్యంత ఘనంగా నిర్వహించిన పెళ్లి వేడుకలో, సన్నిహితులు, అతిథుల ఆశీర్వాదాల మధ్య అనంత్, రాధిక మర్చంట్ దండలు మార్చుకున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్కు సంబంధించిన ఫోటో, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Shloka Akash Ambani (@shloka_ambani) వరుడు తల్లిదండ్రులు,వధువు తల్లిదండ్రులు అనంత్ సోదరి ఇషా అంబానీ పిరమల్, అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతో పాటు, వధువు సోదరి అంజలి మర్చంట్ మజిథియా,తదితరు సన్నిహిత కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగి తేలారు. బాలీవుడ్, టాలీవుడ్, క్రీడా రంగ ప్రముఖులు, దేశ విదేశాలకు అతిథులు ఈ వేడుకకు మరింత ఆనందోత్సాహాలను జోడించారు. రియాలిటీ టీవీ స్టార్లు కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్ సందడి చేశారు. ఇంకా శాంసంగ్ చైర్మన్ లీ జే-యోంగ్, బాలీవుడ్ స్టార్లు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్వీకపూర్, కత్రినా, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబం, రాంచరణ్, సూర్య జ్యోతిక, రాణా అతని భార్య, మాజీ అందాల సుందరి మానుషి చిల్లర్, ఇవాంకా ట్రంప్ తదితరులు ఈ లిస్ట్లో ఉన్నారు. -
అటు దాండియా.. ఇటు మెహందీ.. కలర్ఫుల్గా అంబానీ ఫ్యామిలీ (ఫోటోలు)
-
అనంత్-రాధిక గ్రాండ్ వెడ్డింగ్: భావోద్వేగ క్షణాలు, వైరల్ వీడియో
పెళ్లి చేసి ఆడబిడ్డను అత్తారింటికి సాగనంపడం అనేది భావోద్వేగంతో కూడిన సందర్భం. పెళ్లికి నిశ్చితార్థం మొదలు, ఆ మూడు ముళ్లూ పడివరకు, ఇక అమ్మాయి అప్పగింతల సమయంలో ఆ ఉద్విగ్న క్షణాలు కన్నీటి పర్వంత మవుతాయి. నిరుపేదైనా, కుబేరుడైనా ఈ అనుభవం తప్పదు. పారిశ్రామికవేత్త విరేన్ మర్చంట్ ముద్దుల తనయ రాధికమర్చంట్ మధ్య ఇలాంటి భావోద్వేగ క్షణాలు నమోదైనాయి. మర్చంట్, అంబానీ కుటుంబాలు నిర్వహించిన గ్రహ శాంతి పూజ సందర్భంగా వీరేన్, కాబోయే వధువు రాధికను ఆలింగనం చేసుకుని ఎమోషనల్ అయ్యారు. గ్రాండ్ వెడ్డింగ్కు ముందు అనంత్ అంబానీకూడా తన కాబోయే భార్యను ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా ఇద్దరు పారిశ్రామికవేత్తలువియ్యమందుకునే ముహూర్తం మరికొద్ది గంటల్లో రానుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటి, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా చిన్న కుమారుడు అనంత్, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్, వ్యాపారవేత్త శైలా మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్తో ఈ రోజు (జూలై 12) వివాహం జరగనుంది. ఈ వివాహానికి పలువురు సినీ, క్రీడా రంగ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథులు ఇప్పటికే ముంబై చేరుకుంటున్నారు. View this post on Instagram A post shared by WeddingSutra.com (@weddingsutra) -
అంబానీ చెల్లి.. భర్త చనిపోయినా కోట్ల కంపెనీకి ఛైర్పర్సన్గా..
ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న ముఖేశ్ అంబానీ కుంటుంబం గురించి తెలుసా అంటే.. ఆయన గురించి తెలియని వారుంటారా..? ముఖేశ్ భార్య నీతా, పిల్లలు ఆకాశ్, అనంత్, ఇషా అని చెబుతారు కదూ. కానీ ముఖేశ్ చెల్లెళ్ల గురించి ఎంతమందికి తెలుసు.. అందులో ఒకరి భర్త మరణించినా తన కంపెనీలను సమర్థంగా నిర్వహిస్తూ కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇంతకీ ఆమె ఎవరు..తాను చేస్తున్న వ్యాపారం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.ధీరూభాయ్ అంబానీకి ముఖేష్, అనిల్లతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి పేర్లు నీనా కొఠారి, దీప్తి సల్గోకర్. నీనా కొఠారి 1986లో కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ ఛైర్మన్ భద్రశ్యామ్ కొఠారిని వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అర్జున్ కొఠారి, కుమార్తె నయనతార కొఠారి ఉన్నారు. నీనా భర్త శ్యామ్ కొఠారి 2015లో క్యాన్సర్తో మరణించారు. ఆ తర్వాత నీనా వారి కుటుంబ వ్యాపారమైన కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ బాధ్యతలను చేపట్టారు. ఏప్రిల్ 8, 2015లో ఆమె కంపెనీ ఛైర్పర్సన్గా నియమితులయ్యారు.ఆమె భర్త మరణానంతరం కంపెనీ లాభాలను పెంచేందుకు చాలా కృషి చేశారు. ప్రస్తుతం కొఠారీ షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.450 కోట్లుగా ఉంది. కార్పొరేట్ షేర్హోల్డింగ్స్ ప్రకారం.. నీనా భద్రశ్యామ్ కొఠారి రెండు స్టాక్లను కలిగి ఉన్నారు. వాటి నికర విలువ రూ.54 కోట్లకు పైగానే ఉంది. కార్పొరేట్ పరిశ్రమలో నీనా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆమె 2003లో జావగ్రీన్ అనే కాఫీ అండ్ ఫుడ్ చైన్ని ప్రారంభించారు.ఆమె పెద్ద కుమారుడు అర్జున్ కొఠారి..కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్కు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. కుటుంబ వ్యాపారాన్ని విస్తరించేందుకు తల్లి నీనాతో కలిసి పని చేస్తున్నారు. కాగా, నీనా కుమార్తె నయనతార కెకె బిర్లా మనవడు షమిత్ భారతియాను వివాహం చేసుకున్నారు.ఇదీ చదవండి: అతిథుల కోసం 3 ఫాల్కన్ జెట్లు, 100 విమానాలుముఖేశ్ అంబానీ రెండో చెల్లి దీప్తి సల్గోకర్. ఈమె వీ.ఎం.సల్గోకర్ అండ్ బ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ దత్తరాజ్ సల్గోకర్ భార్య. ఈ దంపతులు గోవాలో ‘సునపరంతా గోవా సెంటర్’లో ప్రదర్శనశాలను నిర్వహిస్తున్నారు. దీప్తి సల్గ్కోకర్ వీ.ఎం.సగోన్కర్ అండ్ బ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కార్పొరేట్ కమ్యునికేషన్ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహా వేడుకకు సర్వం సిద్ధమైంది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ సెంటర్లో జులై 12న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటవ్వనుంది. వీరి వివాహానికి దేశీయ ప్రముఖులతోపాటు విదేశాల్లోని దిగ్గజ సంస్థల సీఈఓలు హాజరవుతున్నారు. -
అంబానీ ఇంట పెళ్లికి హాజరుకానున్న ప్రముఖ సీఈఓలు (ఫొటోలు)
-
అంబానీ పెద్ద కోడలు శ్లోకా బర్త్డే : ఆకాశ్ స్పెషల్ విషెస్ వైరల్
ఒకవైపు రిలయన్స్అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం అంతా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి వేడుకల్లో బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా బర్త్డేఈ రోజు. ఈ సందర్భంగా అంబానీ ఫ్యామిలీ శ్లోకాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియోను రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.ముందుగా అంబానీ పెద్ద కుమారుడు, శ్లోకా మెహతా భర్త ఆకాశ్ అంబానీ తన భార్యకు స్పెషల్ విషెస్ అందించారు. తరువాత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఇషా, ఆనంద్ పిరామిల్ దంపతులతోపాటు కాబోయే వధూవరులు అనంత్, రాధిక మర్చంట్ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అందించారు. ప్రసిద్ధ డైమండ్ ట్రేడింగ్ కంపెనీ రోజీ బ్లూ డైమండ్స్ ఎండీ కుమార్తె శ్లోకా మెహతా. 1990, జూలై 11 న పుట్టింది. 2019 మార్చిలో ఆకాశ్ అంబానీనీ పెళ్లాడింది. వీరికి పృథ్వీ , వేద ఆకాశ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.కాగా జూలై 12న తన చిరకాల ప్రేయసి రాధిక మర్చంట్ను అనంత్ పెళ్లాడ బోతున్నాడు. ఈ పెళ్లి వేడుక మూడు రోజుల పాటు జరగనుంది. ఈ వివాహానికి దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. అతిథి మర్యాదల ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. అంతేకాదు వీరి పెళ్లి సందర్భంగా జులై 12-15 వరకు ముంబైలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు ప్రకటించడం గమనార్హం. View this post on Instagram A post shared by Shloka Akash Ambani (@shloka_ambani) -
రిచ్ బ్లూ గ్రీన్ లెహంగాలో ఎవర్ గ్రీన్గా ఉన్న నీతా లుక్..!
ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి కోలాహలంతో సందడిగా ఉంది. రోజుకో ఈవెంట్లో కుటుబసభ్యులంతా కళ్లు చెదిరే ష్యాషన్ డిజైనర్ వేర్లతో అలరిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమం చాలా వేడుకగా జరుగుతోంది. అందులో భాగంగా అనంత్ రాధికల శివశక్తి వేడుక జరిగింది. ఈ వేడుకలో నీతా ధరించిన లెహంగా మిస్మరైజ్ చేస్తోంది. చక్కటి రిచ్ బ్లూ గ్రీన్ లెహంగాలో నీతా దివి నుంచి భువికి వచ్చిన దేవతలా మెరిసిపోతోంది. ఆ గ్రాండ్ లెహంగాకి తగ్గట్టుగా ఆమె ధరించిన పెద్ద కుందన్ నెక్లెస్ సెట్ మిరుమిట్లు గొలిపే కాంతితో ఆమె ముఖ వర్చస్సు మరింత అందంగా కనిపిస్తోంది. అబు జానీ సందీప్ ఖోస్టో డిజైన్ చేసిన స్పెషల్ లెహంగాలో నీతా చాలా అందంగా కనిపించింది. ఆ లెహంగా..చిలుక ఆకుపచ్చ స్కర్ట్, పైన రిచ్ బ్లూ దుప్పట దానిపై చేతితో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్, మిర్రర్లతో కూడిన జరీ వర్క్తో అందంగా తీర్చిదిద్దారు. నీతా ధరించిన లెహంగా మంచి రిచ్ లుక్లో ఉండగా, ముఖ్యంగా ఆమె నెక్కి ధరించిన కుందనపు నగ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చెవులకు సైతం పెద్ద కుందనాలతో ఉన్న చెవిపోగులనే ధరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, అనంత్ రాధికల పెళ్లి జూలై 12న అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (చదవండి: అనంత్ -రాధిక పెళ్లి వేడుక: తమిళియన్ హెయిర్ స్టైల్లో ఇషా..!) -
హల్దీ ఫంక్షన్లో ముఖేశ్ అంబానీ చెల్లెలు సందడి (ఫొటోలు)
-
అనంత్ - రాధిక పెళ్లి వేడుకలు.. మెరిసిపోయిన అంబానీ కుటుంబం (ఫోటోలు)
-
అనంత్ రాధిక సంగీత్ కార్యక్రమంలో నీతా లుక్ అదుర్స్..చేతికి హృదయాకారంలో..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహ వేడుకలకు సంబంధించిన ప్రతి వేడుక ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ఆ వేడుకల్లో ఆ అంబానీ కుటుంబ సభ్యులు ధరించే దుస్తులు, ఆభరణాలు వార్తల్లో హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. జూలై 12న అనంత-రాధికల వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివాహానికి ముందు జరిగే సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ కార్యక్రమంలో నీతా రాణి పింక్ లెహంగా చోళీలో అద్భుతంగా కనిపించారు. ఆ డిజైనర్ లెహంగాకి తగ్గట్లు ఆమె ఎంచుకున్న కాంతీలాల్ ఛోటాలాల రూపొందిచిన వజ్రాభరణాలు మరింత అందాన్ని తెచ్చిపెటట్టాయి ఆమెకు. అలాగే చేతులకు డైమండ్ బ్యాంగిల్స్ ధరించింది. ఈ అలంకరణలో అందరి దృష్టి ఆమె ధరించిన హృదయకారపు ఉంగరంపైనే పడింది. ఇదే ఉంగరాన్ని ఆమె కూతురు ఇషా అంబానీ, మనీష్ మల్హోత్రా దీపావళి బాష్లో ధరించింది. ప్రస్తుతం ఈ తల్లి, కూతుళ్ల ద్వయం సేమ్ రింగ్ని ధరించడం నెట్టింట కాస్త హాట్టాపిక్గా మారింది. ముఖ్యంగా ఈ వేడుకలో నీతా ధరించిన ఆభరణాలు చాలా హైలెట్గా నిలిచాయి.నీతా ధరించిన ఆభరణాలు..కాంతిలాల్ ఛోటాలాల్ రూపొందించిన ఆభరణాలు నీతా కంఠానికి ఎగ్జాట్గా సరిపోయాయి. రోజ్ కట్ డైమండ్లు ఆమె మెడను మిరమిట్లుగొలిపే కాంతితో నింపాయి. ఆమె తలకు ధరించిన పాపిడి బొట్టు, చెవిపోగులు.. ప్రతీదీ కళాత్మకంగా ఉంది. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం..ఏకంగా ఓ లగ్జరీ కారు ధర..!) -
అనంత్ అంబానీ -రాధిక సంగీత్ : వారసులతో ముఖేష్, నీతా మురిపెం!
రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ వేడుకలు మరింత జోరందుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్కెంట్ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి సంగీత్ వేడుకును ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అంబానీ కుటుంబం ఆనందోత్సాహాలు అంబరాన్నంటాయి.ఈ వేడుకలో ముఖేష్, నీతా అంబానీ దంపతులు మనవళ్లు, మనవరాళ్లతో వింటేజ్ ఓపెన్-టాప్ కారులో షికారు చేయడం హైలైట్గా నిలిచింది. ఈ సందర్బంగా ముఖేష్ను చూసి నీతా అంబానీ ముద్దు, ముద్దుగా మురిసిన దృశ్యం వైరలవుతోంది. 1968 నాటి బాలీవుడ్ బ్రహ్మచారి మూవీలోని "చక్కే మే చక్క" అనే క్లాసిక్ ట్యూన్కి, అంబానీ కారు నడుపుతూ కన్పించారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)పృథ్వి, కృష్ణ, మనవరాళ్లు ఆద్యశక్తి, వేద తమ గ్రాండ్ పేరెంట్స్తో ఉత్సాహంగా కనిపించిన వీడియోను సంగీత్లో ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.రణబీర్ కపూర్ అలియా భట్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, రణ్వీర్ సింగ్,దీపికా పదుకొణె, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, తదితర బాలీవుడ్ ప్రముఖుల ఈ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని జోడించారు. ఇంకా క్రికెటర్లు ధోనీ, హార్దిక్ పాండ్య ప్రత్యేకంగా నిలిచారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్తో కలిసి కాబోయే వరుడు అనంత్ అంబానీ డ్యాన్స్ చేశారు. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలోని ‘దీవాంగీ.. దీవాంగీ’ పాటకు అంబానీ కుటుంబం అంతా ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఎప్పటిలాగానే నీతా అంబానీ సంప్రదాయ భరతనాట్యంతో తన ప్రత్యేకతను చాటుకున్నారు.కాగా మూడు రోజుల పాటు జులై 12-14 తేదీల్లో ముంబైలోని జియో సెంటర్ వేదికగాఅనంత్-రాధిక వివాహం అంగరంగవైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. -
‘మామేరు’ వేడుకలో మెరిసిన రాధిక : అమ్మనగలతో అందంగా, అద్భుతంగా!
అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన చిరకాల ప్రేయసితో వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముహూర్తం సమీపిస్తోంది. దీంతో పెళ్లి వేడుకలోని కీలక ఘట్టాలు ఒక్కొక్కటీ వైభవంగా మొదలయ్యాయి.ప్రధానంగా గుజరాతీ వివాహాల్లో తొలుతగా నిర్వహించే ఆచారాలను ఇరు కుటుంబాలు పాటిస్తున్నాయి. ఇందులో భాగంగానే ముంబైలోని యాంటిలియాలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల మామేరు వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కాబోయే వధువు రాధిక తన స్టయిలిష్ లుక్తో అందర్నీ ఆకట్టుకుంది.అమ్మ నగలతో అందంగారాధికా మర్చంట్ ఆరెంజ్ అండ్ పింక్ షేడ్స్లో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహంగాలో అందంగా ముస్తాబైంది. బంగారు నెక్లెస్ , మ్యాచింగ్ జుంకాలు, బ్యాంగిల్స్ ఇంకా స్పెషల్ హెయిర్ స్టయిల్తో ఆమె ఫ్యాషన్ లుక్ అదిరిపోయింది. ముఖ్యంగా ఇదే వేడుకలో తన తల్లి ధరించిన ఆభరణాలను ఎంచుకోవడం ప్రత్యేకతగా నిలుస్తోంది.బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, ప్రియుడు శిఖర్ పహారియాతో స్టైలిష్గా కనిపించింది. ఇంకా మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్, ఓరీ తదితర బాలీవుడ్ ప్రముఖులు ఈ ఈవెంట్కు మరింత గ్లామర్ జోడించారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) గుజరాతీ వివాహాలలో కుటుంబ ప్రాముఖ్యతను, వరుడు తల్లి పుట్టింటివారి ప్రేమలను చాటేలా 'మోసలు' లేదా 'మామెరు' వేడుకులను నిర్వహిస్తారు. ఈ 'మామేరు' వేడుకలో వధూవరులు మేనమామలు, ఇతర కుటుంబ సభ్యుల ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. అమ్మతరపు వారు అందించే బహుమతులను స్వీకరిస్తారు.కాగా జూలై 12నుంచి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జరగ బోతున్నాయి. జూలై 13న శుభ్ ఆశీర్వాద్, జూలై 14న మంగళ్ ఉత్సవ్ (వివాహ రిసెప్షన్)దాకా ఈ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. -
అంబానీ ఇంట మొదలైన పెళ్లి సందడి (ఫోటోలు)
-
దటీజ్ నీతా అంబానీ : ఈ బెనారసీ చీర స్పెషాల్టీ ఏంటో తెలుసా?
సందర్భానికి తగినట్టు దుస్తులను, నగలను, అలంకరణను ఎంచుకోవడంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీది ఎపుడూ అందెవేసిన చేయి. పట్టు చీరలు, బెనారసీ, స్వదేశీ నేత చీరలు అంటే ఆమెకు ప్రాణం. తాజాగా తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సామూహిక వివాహాల కార్యక్రమంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. దీనికి గుట్టపూసల నెక్లెస్, స్టైలిష్ చెవిపోగులు, బన్, గజ్రా (మల్లె పూల దండ)తో ఇలా ప్రతీ విషయంలో తన ష్యాషన్ స్టయిల్ను చాటుకున్నారామె. తన సిగ్నేచర్ స్టైల్లో ఆమె లుక్, ముఖ్యంగా చీరలోని మరో ప్రత్యేకత విశేషంగా నిలిచింది. అనంత్-రాధిక వివాహ సన్నాహాకాలు జోరందుకున్న నేపథ్యంలో జూలై 12,మంగళవారం నిరుపేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక వివాహాలను జరిపించారు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్లో జరిగిన ఈ వేడుకలో నీతా అంబానీ ముదురు ఎరుపు రంగు బెనారసీ చీరలో మహారాణిలా కనిపించారు. ముఖ్యంగా చీర ఒక విషయంలో అందరినీ ఆకర్షించింది. పవిత్ర గాయత్రీ మంత్రాన్ని బంగారంతో ఎంబ్రాయిడరీ చేయించడమే దీనికి కారణం. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బంగారు జరీ వర్క్, పక్షుల డిజైన్తో తీర్చి దిద్దిన అద్భుతమైన బెనారసి చీరకు తగ్గట్టుగా గుట్టపూసల నెక్లెస్ను ధరించారు. ఈ నెక్లెస్ ఆంధ్రప్రదేశ్కి చెందిన సాంప్రదాయ దక్షిణ భారత డిజైన్తో పోలి ఉందని నిపుణులు పేర్కొన్నారు. అలాగే చెవిపోగుల్లో శ్రీకృష్ణుని బొమ్మను కూడా గమనించవచ్చు.కాగా సామూహిక వివాహ వేడుకల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతోపాటు పెద్ద కుమారుడు, ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా, కుమార్తె ఇషా అంబానీ పిరమల్,, భర్త ఆనంద్ పిరమల్ పాల్గొన్నారు. శ్లోకా, నీతా ఇద్దరూ నూతన వధూవరులకు ఖరీదైన బహుమతులను అందించారు. దేశవిదేశాలకు అతిరథ మహారథులసమక్షంలో జూలై 12న అనంత్-రాధిక వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. -
అపరకుబేరుడు ముఖేశ్ అంబానీ లగ్జరీ కార్లు
-
అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ : మరో విశేష కార్యక్రమం, వైరల్ వీడియో
రిలయన్స్ అధినేత, కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా మరో విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన జంటల సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు అంబానీ దంపతులు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విశేషంగా నిలిచింది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దగ్గరుండి మరీ ఈ కార్యక్రమాన్నినిర్వహించారు. ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్ఘర్కు చెందిన 50 మంది నిరుపేద జంటకు సామూహిక వివాహాలను నిర్వహించారు. అలాగే అంబానీ పెద్దకుమారుడు ఆకాశ్ అంబానీ, ఆయన భార్య శ్లోకా, ఇషా అంబానీ, భర్త ఆనంద్ పిరామిల్ కూడా పాల్గొన్నారు. శ్లోకా అంబానీ నూతన వధూవరులకు ఖరీదైన బహుమతులను అందించారు. కాగా జూలై 12న ముంబైలోని బాంద్రాలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్, రాధిక మర్చంట్ వివాహం వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యినట్టు తెలుస్తోంది. వీరి పెళ్లికి సంబంధించిన తొలి వివాహ ఆహ్వాన పత్రికను ఇటీవలే నీతా అంబానీ వారణాసిలోని కాశీ విశ్వనాథుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యే అవకాశముందని అంచనా.#WATCH | Navi Mumbai: Reliance Industries Chairman Mukesh Ambani and Nita Ambani present at the mass wedding of the underprivileged being organised as part of the pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/IoMvMsPq7s— ANI (@ANI) July 2, 2024 -
అంబానీ నుంచి మస్క్ వరకు.. బిలినీయర్లకు ఉన్న అలవాట్లు ఇవే!
ప్రపంచంలో వందల కోట్ల జనాభా ఉన్నారు. ఇందులో కొంత మంది మాత్రమే బిలినీయర్లుగా ఎదిగారు. కోటీశ్వరులుగా ఎదిగిన చాలా మంది కొన్ని అలవాట్లను తూ.చ ఖచ్చితంగా పాటిస్తున్నారు. ముకేశ్ అంబానీ నుంచి ఇలాన్ మస్క్ వరకు సక్సెస్ సాధించిన వ్యక్తులందరూ ఎలాంటి అలవాట్లను పాటిస్తారనేది ఈ కథనంలో చూసేద్దాం..ఉదయం త్వరగా మేల్కొనటంముకేశ్ అంబానీ నుంచి ఇలాన్ మస్క్ వరకు దాదాపు చాలామంది బిలినీయర్లు రాత్రి ఎంత సమయానికి నిద్రపోయినా.. ఉదయం మాత్రం 5:30 గంటలకే నిద్రలేస్తారు. ఇది వారి ఫిట్నెస్కు మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ప్రతి ఒక్కరూ రాత్రి త్వరగా పడుకుని ఉదయం ముందుగా నిద్రలేవాలి. ఇది ఓ మంచి అలవాటు.చదవడంచదవడం అనేది చాలామంది అలవాటు. బిల్ గేట్స్ సంవత్సరానికి 50 పుస్తకాలు చదువుతానని గతంలో పేర్కొన్నారు. ఇది సమాజం పట్ల అవగాహనను మాత్రమే కాకుండా.. మానసిక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం ఉత్తమ అలవాటు.వ్యాయామంఅమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ప్రతి రోజూ వ్యాయామంతోనే రోజు మొదలుపెడతారు. శారీరక దృఢత్వం కోసం వ్యాయామం చేయడం అలవాటుగా చేసుకోవాలి. ప్రతి రోజూ కనీసం ఒక అరగంట వివిధ రకాల వ్యాయామాలు చేయాలి. ప్రతిరోజూ వ్యాయామం కూడా దినచర్యలో భాగం చేసుకోవడం ఉత్తమ అలవాటు.నిద్రశరీరానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే అవసరం. రాత్రి కనీసం ఎనిమిది గంటలకు తగ్గకుండా ప్రతి ఒక్కరు నిద్రపోవాలి. ఇది వారి ఆలోచనా శైలిని పెంచుతుంది. బిలినీయర్లు ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రపోతారు. ప్రతి ఒక్కరు నిద్రకు సరైన సమయం కేటాయిస్తే ఒక నెలరోజుల్లో మీలో మార్పు వస్తుందని అమెరికన్ వ్యాపారవేత్త మార్క్ క్యూబన్ చెబుతున్నారు.సామజిక కార్యక్రమాల్లో పాల్గొనటంసక్సెస్ సాధించడానికి సామజిక అనుబంధాలు కూడా చాలా ముఖ్యం. ముకేశ్ అంబానీ నుంచి ఇలాన్ మస్క్ వరకు చాలామంది సామజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారిలో ఓ నూతన ఉత్సాహం వస్తుందని నమ్మకం. కాబట్టి సాధ్యమైనప్పుడల్లా సామజిక కార్యక్రమాల్లో పాల్గొనటం ఉత్తమం. -
కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు కోరిన అనంత్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆదివారం ముంబయిలోని ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియాలో ఏర్పాటు చేసిన విందుకు మోహన్ భగవత్ హాజరయ్యారు. కార్యక్రమానికి పాల్గొన్న ఆయన్ను ముఖేశ్ అంబానీ, అనంత్ అంబానీ కలిసి లోపలికి ఆహ్వానించారు. ఈ క్రమంలో కారులో నుంచి దిగిన మోహన్ భగవత్ కాళ్లకు నమస్కరించి అనంత్ ఆశీర్వాదాలు కోరారు. తన పెళ్లికి తప్పకుండా హాజరుకావాలని తెలిపారు.అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహాం జూలై 12న జరుగుతున్న నేపథ్యంలో ముఖేష్-నీతా అంబానీ దంపతులు కొందరు ప్రముఖులకు ఆదివారం ముంబయిలోని తమ నివాసం యాంటిలియాలో విందు ఏర్పాటు చేశారు. ఈ ఆతిధ్యానికి హాజరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాదాలకు అనంత్ సమస్కరిస్తున్నపుడు తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్గా మారింది.జులై 12న అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహ వేడుక ‘శుభ్ వివాహ్’తో ప్రారంభం కానుంది. జులై 13న 'శుభ్ ఆశీర్వాద్', జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమాలతో వేడుకలు ముగియనున్నాయి. ఇటీవల ఈ జంట ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్నగర్లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను అంగరంగవైభవంగా జరుపుకున్నారు. -
అనంత్ అంబానీ - రాధిక పెళ్లి : అపురూపంగా ఆహ్వాన పత్రిక
బిలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ఏడడుగుల వేడుకకు ముహూర్తం సమీపిస్తోంది. అపరకుబేరుడు, రిలయన్స్ అధినేత అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. అంబానీ కుటుంబం పెళ్లి పనుల్లో ఇప్పటికే బిజీగా ఉంది. వివాహ పత్రికను కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంత్ తల్లి నీతాఅంబానీ. ఆ తరువాత హితులు, సన్నిహితులు, సెలబ్రిటీలకు పెళ్లి ఆహ్వానాలను అందిస్తున్నారు కూడా. ఈ క్రమంలో అనంత్ -రాధిక వెడ్డింగ్ కార్డ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.Unboxing the wedding card for Anant Ambani and Radhika Merchant's world's costliest wedding! pic.twitter.com/p3GnYSjkp2— DealzTrendz (@dealztrendz) June 26, 2024ప్రపంచంలోనే అతి ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది అనంత్-రాధిక పెళ్లి ముచ్చట. ఇక వివాహ ఆహ్వానం ప్రత్యేకంగా ఒక పెట్టెలో ఒక కళాఖండంగా తీర్చిదిద్దిన వైనం విశేషంగా నిలుస్తోంది. అనంత్-రాధిక పేర్లలోని తొలి అక్షరాలు, లైట్లు, ఎర్రని రంగుతో ఇన్విటేషన్ కార్డును అలంకరించారు. బాక్స్ ఓపెన్ చేయగానే ఓం అంటూ మంత్రం వినిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయగానే వెండితో చేసిన ఆలయం, ఈ ఆలయం లోపల వెండితోనే చేసిన వినాయకుడు, దుర్గామాత, రాధాకృష్ణ విగ్రహాలు ముచ్చటగా ఉన్నాయి. అంతేకాదు వివాహ ఆహ్వాన అతిథులకు ఈ వెండి కార్డుతో పాటు పలు బహుమతులు కూడా ఇస్తున్నారని తెలుస్తోంది.అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 12న అంగరంగ వైభవంగా జరగనుంది. దేశ, విదేశాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరుకానున్నారు. -
నీతా అంబానీ మనసు దోచుకున్న చాట్...వైరల్వీడియో
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ , బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి పురస్కరించుకొని ఉత్తర ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న ప్రసిద్ధ కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహ తొలి ఆహ్వానాన్ని శివుని పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాశీ లేదా బనారస్ నగరంలో చాట్ను ఆస్వాదించిన వీడియో వైరల్ అయింది. అంతేకాదు భర్త ముఖేష్ అంబానీకి చాట్లు అంటే చాలా ఇష్టమని ప్రస్తావించారు. ఇపుడు ముఖేష్ ఉండి ఉంటే దీన్ని ఇష్టపడి ఉండేవారని వ్యాఖ్యానించారు. అంబానీ ముంబైలోని స్వాతి స్నాక్స్ ఫుడ్ అంటే చాలా ఇష్టమట ఒకసారి ఆహారాన్ని ఆర్డర్ చేసేవాడని చెబుతారు.After temple visit and the sacred Ganga Aarti, Smt. Nita Ambani savored a variety of dishes at the famous Kashi Chat Bhandaar in Varanasi today#KasiViswanathan #Varanasi #RelianceFoundation #AnantRadhikaWedding #KashiVishwanathTemple #HarHarMahadev #NitaAmbani pic.twitter.com/RzZ8uHWNV1— AkashMAmbani (@AkashMAmbani) June 25, 2024 కాశీలో నీతా అంబానీ మనసు దోచుకున్న స్నాక్ బనారస్ టమాటా చాట్. పాపులర్ కాశీ చాట్ భండార్లో చాట్ను ఆస్వాదించారు. అలాగే స్థానిక సంస్కృతి , సంప్రదాయాల గురించి ముచ్చటించడం విశేషంగా నిలిచింది. పనిలో పనిగా చాట్ రెసిపీని కూడా దుకాణదారుడిని కూడా అడిగి తెలుసుకున్నారు. బనారస్లో ఇది పాపులర్. దేశ విదేశాలనుంచి వచ్చేవారు కచ్చితంగా దీన్ని టేస్ట్ చేస్తారట. దాదాపు పదేళ్ల తర్వాత కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నానంటూ నీతా ఉద్వేగానికి లోనయ్యారు. "గంగా హారతి సందర్భంగా ఇక్కడికి రావడం నా అదృష్టం. చాలా బాగుంది.. ఇక్కడ గొప్ప శక్తి ఉంది’’ అన్నారామె.కాగా అనంత్- రాధిక పెళ్లి బాజాలు జూలై 12న మోగనున్నాయి. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ సెంటర్లో మూడు రోజుల పాటు వీరి వివాహ వేడుకలు జరగనున్నాయి -
అంబానీ మరో ఖరీదైన కారు.. వీడియో వైరల్
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ వద్ద ఇప్పటికే ఖరీదైన అనేక అన్యదేశ్య కార్లు ఉన్నాయి. కాగా ఇటీవల మరో రోల్స్ రాయిస్ కారు వారు గ్యారేజిలో చేరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇప్పటికే ముకేశ్ అంబానీ గ్యారేజిలో ఎనిమిది రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు వీడియోలో కనిపించే రోల్స్ రాయిస్.. 9వ కారు అని తెలుస్తోంది. వీడియోలో మహీంద్రా స్కార్పియో, టయోటా ఫార్చ్యూనర్, మెర్సిడెస్ జీ63 ఏఎంజీ కార్లు కాన్వాయ్ ముందు భాగంలో ఉన్నాయి. ఆ తరువాత రోల్స్ రాయిస్ కారు రావడం గమనించవచ్చు.వీడియో రాత్రి సమయంలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి కారు ఏ కలర్ అనేది స్పష్టంగా తెలియడం లేదు. బహుశా ఇది వైట్ కలర్ అని తెలుస్తోంది. దీని ధర రూ. 10 కోట్లు కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ముకేశ్ అంబానీ గ్యారేజిలో రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా ఇతర సూపర్ కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. -
అంబానీ డీప్ ఫేక్ వీడియో : లక్షల స్కాం వెలుగులోకి
‘కూటికోసం కోటి విద్యలు’ అనేదాన్ని ‘కోటి మోసాలు’గా మార్చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఏదో ఒక రకంగా ప్రజలను మభ్య పెట్టి, మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కోవలోకి డీప్ ఫేక్ వీడియోలు వచ్చి చేరుతున్నాయి. సామాన్యుల నుంచి, ఉన్నతాధికారులు, డాక్టర్లు, ఆఫీసర్లు. హై ఫ్రొఫైల్ వ్యక్తుల దాకా నమ్మించి బోల్తా కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త పేరుతో డీప్ ఫేక్ వీడియో ద్వారా రూ.7లక్షలు మోసానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.ఏం జరిగిందంటే..రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పేరుతో తయారు చేసిన డీప్ ఫేక్ వీడియో ద్వారా ముంబైలోని అంధేరికి చెందిన మహిళా ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ కె హెచ్ పాటిల్ నుంచి రూ.7 లక్షలు కొల్లగొట్టారు నేరగాళ్లు. అధిక రాబడి కోసం ‘రాజీవ్ శర్మ ట్రేడ్ గ్రూప్’ కంపెనీకి చెందిన బీసీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ అకాడమీలో చేరాలని అంబానీ రికమెండ్ చేస్తున్నట్టు ఈ వీడియోను సృష్టించారు. తద్వారా తక్కువ పెట్టుబడికే, అధిక రాబడులు వస్తాయని నమ్మ బలికారు. ఏప్రిల్ 15న తన ఇన్స్టాగ్రాంలో ఈ వీడియోను చూసిన పాటిల్ ఆన్లైన్లో వెరిఫై చేయడానికి ప్రయత్నించినా కూడా అసలు విషయాన్ని పసిగట్టలేకపోయింది. లండన్, ముంబైలో కార్యాలయాలు ఉన్నాయని నమ్మి, పలుమార్లు నగదును డిపాజిట్ చేసింది. మే-జూన్ నెలల మధ్య 16 వేర్వేరు ఖాతాల్లో మొత్తంగా రూ. 7.1 లక్షలు జమ చేయగా, దీనికి రూ.30 లక్షల లాభాన్ని ఆర్జించినట్టు ట్రేడింగ్ వెబ్ సైట్లో కనిపిస్తోంది. కానీ దానిని విత్డ్రా చేసుకొనే అవకాశంలేకపోవడంతో అనుమానం వచ్చింది. చివరికి మోస పోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ పాటిల్ డబ్బు బదిలీ చేసిన 16 బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. ఈ లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు. -
అనంత్-రాధిక క్రూయిజ్ పార్టీ : మెరిసిన రాధిక, ఫోటోలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్ను జులైలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చిలో అనంత్-రాధిక తొలి ప్రీవెడ్డింగ్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత కనీవినీ ఎరుగని రీతిలో ఇటలీలో రెండొ ప్రీ-వెడ్డింగ్ వేడుకను గ్రాండ్ క్రూయిజ్ పార్టీలో నిర్వహించారు. మే 29న ప్రారంభమై జూన్ 1న ఫ్రాన్స్లో ముగిసిన ఈ వేడుకలో పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే.తాజాగా అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ రాధికా వివాహం జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే వివాహ వేడుకలో మూడు ఈవెంట్లు ఉండ బోతున్నాయి. తొలుత 'శుభ వివాహ' ఆ తర్వాత జూలై 13న 'శుభ్ ఆశీర్వాద్' , 'మంగళ ఉత్సవ్', జూలై 14న వివాహ రిసెప్షన్ ఉంటుంది. అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్ఫారమ్లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ , రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ బోర్డులలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు -
మోదీ ప్రమాణస్వీకారం.. అంబానీ, షారుక్ ఫోటో వైరల్
భారత ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన మోదీ ప్రమాణ స్వీకారోత్సవం కన్నులపండువగా జరిగింది. రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు.. ఇలా ఎందరో ఈ వేడుకలో తళుక్కుమని మెరిశారు. వారిలో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్.. పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఉన్నారు. ఓఆర్ఎస్ తాగుతూ..పక్కపక్కనే కూర్చున్న వీళ్లిద్దరూ ఓఆర్ఎస్ డ్రింక్తో దర్శనమిచ్చారు. ఇంకేముంది.. వారిని క్లిక్మనిపించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎంతో ధనవంతులైన వీరు ఖరీదైన డ్రింక్స్కు బదులుగా దాదాపు రూ.30 ఉంటే ఓఆర్ఎస్ డ్రింక్ తాగుతున్నారని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇదే బెటర్'సోడా సహా ఇతర డ్రింక్స్ కంటే ఇదే నయం.. ఇప్పుడున్న వాతావరణానికి ఓఆర్ఎస్ తాగితేనే బెటర్. పైగా ఈ మధ్యే షారూఖ్కు వడదెబ్బ తగిలింది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే', 'హే.. ఈరోజు నేను కూడా ఇదే ఓఆర్ఎస్ తాగాను' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా గత నెల షారూఖ్ వడదెబ్బ కారణంగా అహ్మదాబాద్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే! ORS 👍 pic.twitter.com/C24eNG6UYx— sonal. (@sonaluwu) June 9, 2024 HQ pictures of Shah Rukh Khan & Mukesh Ambani at Rashtrapati Bhavan earlier today for PM Narendra Modi's Oath Ceremony ♥️#ShahRukhKhan pic.twitter.com/HlUE9lV7PU— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) June 9, 2024చదవండి: నిర్మాతగా బాలకృష్ణ కూతురు.. సినిమా ప్రకటించిన బోయపాటి -
‘సిండ్రిల్లా’లా మెరిసిన రాధికా మర్చంట్, మురిసిన అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తెతో రాధిక మర్చంట్ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక ఇటలీలో క్రూయిజ్ షిప్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా జరిగింది. గుజరాత్లోని జాం నగర్లో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలతో పోలిస్తే, రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకను మరింత ఘనంగా నిర్వహించింది అంబానీ కుటుంబం. అలాగే ఈ వేడుకలో రాధికా మర్చంట్ తన ప్రిన్స్, అనంత్ అంబానీతో రియల్ లైఫ్ సిండ్రిల్లాలా మెరిసిపోయింది. రాధిక, నీలిరంగులోని కార్సెట్ గౌనులో అందంగా కనిపించింది. దీనికి బ్లూ డైమండ్, బ్లూ సఫైర్ నెక్లెస్, చెవిపోగులు ధరించింది. అటు అనంత్ అద్భుతమైన లుక్స్తో ఆకట్టుకున్నాడు. అనంత్ బూజీ బ్లాక్ సెల్ఫ్ డిజైన్ చేసిన బ్లాక్ టక్సేడోలో అందంగా కనిపించాడు. అందంతో మెరిసిపోతున్న ప్రేయసిని చూసి అనంత్ అంబానీ, అటు పెళ్లి కళ ఉట్టిపడుతున్ నకాబోయే కోడల్ని చూసి ముఖేష అంబానీ కూడా మురిసిపోయారు. ఇదే ఈవెంట్లో పింక్ డియోర్ దుస్తులు ధరించింది రాధిక. ఈ గౌను ధర సుమారు మూడు లక్షలట. అలాగే ఈ సందర్భంగా ఆమె ధరించిన బ్యాగ్ ధర రూ. 26 లక్షలట. ఇటలీలోని పోర్టోఫినోలో జరిగిన ఈ వేడుకకు దాదాపు 800 మందికి పైగా అతిథులుతో రూ.7500 కోట్లతో ఘనంగా జరిగిందీ వేడుక. జూలై 12న లవ్బర్డ్స్ అనంత్- రాధిక పెళ్లి పీటలెక్కనున్నారు. -
ఎన్నికల ఫలితాలు తారుమారు.. భారీగా తగ్గిన అంబానీ, అదానీల సంపద
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అంచనాలు తారుమారయ్యాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా క్రాష్ అయ్యాయి. దీంతో భారత చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నికర సంపద భారీగా తగ్గింది.దేశంలో లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. లోక్సభ ఫలితాలకు ముందు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా.. బీజేపీ ఆ స్థాయిలో సీట్లులో రాణించకపోవడం.. అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. దీంతో అంబానీ, అదానీ నికర సంపద క్షీణించినట్లు తెలుస్తోంది. ముఖేష్ అంబానీ 8.99 బిలియన్ డాలర్ల సందప క్షీణించింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 106 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు.గౌతమ్ అదానీ నికర విలువ ఒక్క రోజులో 24.9 బిలియన్ డాలర్లు పడిపోయింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బుధవారం నాటికి అయన సంపద 97.5 బిలియన్ డాలర్లుగా ఉంది. గౌతమ్ అదానీ ప్రస్తుతం ప్రపంచ సంపన్నుల జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ తర్వాత భారత్లో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. -
అంబానీయా.. మజాకా! సముద్రతీరమంతా బుక్ చేసేశాడుగా!
రాధిక మర్చంట్, అనంత్ అంబానీల ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభాగంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎంతో మంది సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఇటలీలోని పోర్టోఫినోలో జరిగిన చివరి రోజు ఈవెంట్లో ప్రఖ్యాత ఇటాలియన్ టేనర్ ఆండ్రియా బోసెల్లి మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇటలీలో జరిగిన ఈ వేడుకలకు జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ వంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు సైతం హాజరయ్యారు. మొత్తం ఈ వేడుకలకు 1200 మంది అతిథులు హాజరైనట్లు సమాచారం. ఈ కార్యక్రమం కోసం అంబానీ ఏకంగా పోర్టోఫినో సముద్ర తీరం మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. View this post on Instagram A post shared by yourpoookieboo(YPB) (@yourpoookieboo)అంబానీ ఫ్యామిలీ ఇటలీ సెలబ్రేషన్లకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అంబానీ ఫ్యామిలీతో పాటు.. షారుఖ్ ఖాన్, భార్య గౌరీ ఖాన్, జాన్వీ కపూర్, కియారా అద్వానీ, రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా మొదలైన సెలబ్రిటీలు కూడా కనిపించారు. View this post on Instagram A post shared by yourpoookieboo(YPB) (@yourpoookieboo) -
ఆసియా కుబేరుడు ఎవరు? బ్లూమ్బర్గ్ తాజా ర్యాంకులు
అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 111 బిలియన్ డాలర్ల (రూ.9.2 లక్షల కోట్లు) నికర సంపదతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని (109 బిలియన్ డాలర్లు) అధిగమించి సూచీలో 11వ స్థానంలో ఉన్నారు.వచ్చే పదేళ్లలో 90 బిలియన్ డాలర్ల మూలధన వ్యయాలతో గ్రూప్ వేగంగా విస్తరిస్తున్నదని జెఫరీస్ చేసిన ప్రకటన నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలన్నీ శుక్రవారం షేర్ల ధరలను పెంచాయి. మార్కెట్ సానుకూలంగా స్పందించడంతో అదానీ గ్రూప్ షేర్లకు ఇన్వెస్టర్ల సంపద రూ.1.23 లక్షల కోట్లు పెరగడంతో ఇంట్రాడే ట్రేడింగ్లో వాటి మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17.94 లక్షల కోట్లకు పెరిగింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17.51 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది.బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. బెర్నార్డ్ అర్నాల్ట్ ప్రస్తుతం 207 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. 203 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్, 199 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
అనంత్-రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకలో కాటిపెర్రీ పెర్ఫార్మెన్స్
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాప్ సెన్సేషన్ కాటి పెర్రీ చేసిన లైవ్ పెర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో పెర్రీ సిల్వర్కలర్లో శరీరాన్ని హత్తుకుని ఉండే దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకుంది. తనతోపాటు ఈ ఈవెంట్లో పాల్గొన్న తన ట్రూప్ తెల్లటి దుస్తులు ధరించి వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీలను అలరించారు.ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్-రాధికల రెండో ప్రీవెడ్డింగ్ వేడుకలు మే 29న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. క్రూయిజ్షిప్లో జరిగే ఈ వేడుకలో దాదాపు 900 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్కు సుమారు 4,380 కిలోమీటర్లమేర క్రూయిజ్ ప్రయాణం సాగుతుంది.అనంత్ అంబానీ-రాధిక మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈ ఏడాది మార్చినెలలో ఘనంగా జరిగాయి. గుజరాత్లోని జామ్నగర్ జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో మెటా ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న వంటి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ముకేశ్ అంబానీ తన కుమారుడు, కోడలు ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్లు ఫోర్బ్స్ గతంలోనే నివేదించింది.ఇదీ చదవండి: భారీగా తగ్గనున్న ఎలక్ట్రానిక్ వాహన ధరలు.. ఎంతంటే..సంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం ఈ జంట ముంబైలో జులై 12న వివాహం చేసుకోనుంది. జులై 12 శుక్రవారం రోజున శుభ వివాహ వేడుకతో పెళ్లి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14 ఆదివారం రోజు జరిగే మంగళ్ ఉత్సవ్, వివాహ రిసెప్షన్తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.Katy Perry performing Firework at Cannes tonight! pic.twitter.com/MafEP3OJGP— Katy Perry Today (@todaykatyp) June 1, 2024 -
అంబానీ మనవరాలా..మజాకా..క్రూయిజ్లో ఫస్ట్ బర్త్డే
రిలయన్స్ అధినేత ముఖేశ్అంబానీ తన మనవరాలి మొదటి పుట్టినరోజు వేడుకలను ఏకంగా క్రూయిజ్ షిప్లో జరుపుకునేలా ప్లాన్ చేశారు. ముఖ్శ్ అంబానీ పెద్దకుమారుడు ఆకాశ్ అంబానీ-శ్లోకామెహతాల కూతురు వేదాఆకాశ్అంబానీ బర్త్డే వేడుకలను 900 మంది సెలబ్రిటీలతో కలిసి సముద్రంలో జరుపుకుంటున్నారు.అపరకుబేరుడు ముఖేశ్అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్లో ఈ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. మే 29న మొదలైన ఈవేడుక జూన్1న ముగియనుంది. అయితే మే31న అనంత్ అన్నయ్య-వదినల కూతురు వేదా మొదటి పుట్టినరోజు. దాంతో పెళ్లి వేడుకల్లోనే ఈ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అనంత్-రాధిక జంట జామ్నగర్లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ ఈవెంట్ను అంగరంగవైభవంగా జరుపుకున్నారు.ఇదీ చదవండి: ఏఐతో వై-ఫై స్పీడ్ పెంచేందుకు పెట్టుబడులుఆకాశ్-శ్లోకా మెహతాలకు ఇద్దరు పిల్లలు. కుమారుడు పృథ్వీ, కూతురు వేదా. పృథ్వీ డిసెంబర్ 2020లో జన్మించాడు. వేదా మే 31, 2023లో పుట్టింది. -
పొల్యూషన్కి మామిడి మొక్కలతో చెక్ పెట్టి..దాన్నే బిజినెస్గా మార్చేశాడు!
భారత పారిశ్రామిక దిగ్గజం,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి రిలయన్స్ జియో వంటి వివిధ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనే ఆసియాలో అతిపెద్ద మామిడి తోటను కలిగి ఉన్న వ్యక్తి కూడా. అంతేగాదు ఎక్కువ మామిడి పండ్లను పండించి ఎగుమతి చేసేది కూడా రిలయన్స్ సంస్థే. దీని వెనుక దాగున్న ఆసక్తికర కథ వింటే..ముఖేశ్ అంబానీకి సలాం కొట్టకుండా ఉండలేరు.భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ 1990లలో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఆయిల్ని గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేశారు. దీని కారణంగా పెద్ద మొత్తంలో కాలుష్యం ఏర్పడటం జరిగింది. ఈ విషయమై కాలుష్య నియంత్రణ బోర్డుల నుంచి రిలయన్స్కి నోటీసులు వచ్చాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కోసం తీవ్రంగా అన్వేషించడం మొదలు పెట్టింది రిలయన్స్. దీనికి చెక్పెట్టగలిగేది మామిడి మొక్కలే అని డిసైడ్ అయ్యారు. వెంటనే ఆ రిఫైనరీ ఆయిల్ సమీపంలో ఉన్న దాదాపు 600 ఎకరాల బంజరు భూములను గ్రీన్ఫీల్డ్గా మార్చేసింది. ఆ భూముల్లో ఏకంగా 200 రకాల మామిడి మొక్కలను నాటించింది. ఈ తోటకు ముఖేశ్ అంబానీ తండ్రి రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ పేరు మీదుగా 'దీరుభాయ్ అంబానీ లిఖీబాగ్ అమ్రాయీ' అనే పేరే పెట్టారు. దీనిని లఖీభాగ్ అని పిలుస్తారు. ఇది బిహార్లోని దర్భంగాలో ఉంది. ఈ తోటలో అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి ప్రధాన భారతీయ రకాలే కాకుండా విదేశీ మామి రకాలు కూడా ఉన్నాయి. ఈ లఖీబాగ్ అమ్రాయి తోట నుంచి ఏడాదికి దాదాపు 127 రకాల మామిడి పండ్లను ఉత్తత్తి చేస్తుంది. వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తారు. అంతేగాదు రిలయన్స్ పండ్ల తోటలను సందర్శించి వినూత్న పద్ధతులను నేర్చుకోమని రైతులను ప్రోత్సహిస్తోంది కూడా. పైగా ప్రతి ఏడాది ఏకంగా ఒక లక్షకుపైగా మామిడి మొక్కలను ఉచితంగా రైతులకు పంపిణీ చేస్తుంది రిలయన్స్ కంపెనీ. ఇక్కడ ఒక సమస్య పరిష్కారాన్ని కనుగొని దాన్నుంచి కూడా వ్యాపారం చేసి లాభాలు ఆర్జించిన గొప్ప వ్యాపారవేత్త మన ముఖేశ్ అంబానీ. నిజంగా బిజినెస్ మ్యాన్ అసలైన నిర్వచనం, స్ఫూర్తి కూడా అతడే కదూ..!.(చదవండి: ఫిడే చెస్ రేటింగ్ పొందిన అతిపిన్న వయస్కురాలు! దటీజ్ జియానా గర్గ్..!) -
జీయో నుంచి మరో అదిరిపోయే ఆఫర్..
-
సముద్రంలో పెళ్లివేడుకలకు బయలుదేరిన తారలు
రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ ఇటలీలో మొదలైంది. ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్న ప్రముఖులు బుధవారం ముంబయి ఎయిర్పోర్ట్ నుంచి ఇటలీ బయలుదేరారు.మొదటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జామ్నగర్లో జరిగాయి. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు క్రూయిజ్ షిప్లో జరగనున్నాయి. ఈ వేడుకకు కరీనాకపూర్, సారాఅలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్, అనన్యపాండే, జాన్వీకపూర్ బుధవారం ముంబయి ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఈ మేరకు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అప్పటికే చాలామంది ప్రముఖులు ఇటలీ చేరుకున్నారు.రెండో ప్రీవెడ్డింగ్ వేడుకలు మే 29న ప్రారంభమై జూన్ 1న ముగియనున్నాయి. ఈ వేడుకలు ఎలా సాగనున్నాయి, డ్రెస్కోడ్ ఎలా ఉంటుందనే వివరాలతో పాటు సెకండ్ ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ షెడ్యూల్ కూడా ఇప్పటికే లీక్ అయింది. ఈ ప్రయాణం ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్కు సుమారు 4,380 కిలోమీటర్లు సాగుతుంది. ఈ వేడుకలకు దాదాపు 800 మంది అతిథులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
Anant - Radhika Cruise Party : షకీరా ఆట పాట, ఫీజు తెలిస్తే ఫ్యూజులెగిరిపోతాయ్!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్ను జూలై 12, 2024న వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో గుజరాత్లోని జామ్నగర్లో స్టార్-స్టడెడ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకను నిర్వహించారు. ఇపుడిక రెండోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం. బిలియనీర్ స్టేటస్కి తగ్గట్టుగా ఈసారి ఇటలీలో క్రూయిజ్ షిప్లో నిర్వహిస్తుండటం విశేషం.నాలుగు రోజుల ఈవెంట్ల గురించిన వివరాలతో నిండిన రెండవ ప్రీ-వెడ్డింగ్ ఇన్విటేషన్, ప్లాన్, ఫోటోలు ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా నిలిచాయి. తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది. పాపులర్ పాప్ సింగర్, పాటల రచయిత షకీరా అనంత్ రాధిక క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తాజా నివేదికల ప్రకారం ఈ ఈవెంట్ కోసం రూ.10-15 కోట్లు చార్జ్ చేయనుందని తెలుస్తోంది.కాగా ఇటలీలో మే 29 నుండి జూన్ 1, 2024 వరకు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ల రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. వెల్కం డిన్నర్, మే 30, 2024న 'రోమన్ హాలిడే' , 'లా డోల్స్ ఫార్ నియెంటె', 'టోగా పార్టీ'. ఆ తర్వాత, మే 31, 2024న ఆకాష్ అంబానీ శ్లోకా మెహతా కుమార్తె, వేద తొలి ఏడాది పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. కొన్నిఇప్పటికే సల్మాన్ఖాన్, అలియా, రణబీర్దంపతులు, రణ్వీర్ సింగ్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యామిలీ ఇటలీకి పయనమైన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలతోపాటు, పలువురు ప్రముఖులు దాదాపు 800మంది పాల్గొనే అవకాశం ఉంది. అయితే జామ్నగర్ ఈవెంట్ కోసం రూ.1259 కోట్లు, కేవలం కేటరింగ్కే ఏకంగా రూ. 210 కోట్లు ఖర్చు చేసిన అంబానీ కుటుంబం ఈ సారి ఎంత వెచ్చిస్తోంది అనే చర్చ జోరుగా సాగుతోంది. -
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ల పెళ్లి ముచ్చట మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుని, ప్రీ వెడ్డింగ్ బాష్ను ఘనంగా నిర్వహించుకున్న లవ్బర్డ్స్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఛలో ఇటలీ..ఈ ఏడాది మార్చిలో జామ్నగర్లో వారి గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల తర్వాత, అనంత్ -రాధిక మర్చంట్ ఇటలీ నుండి ఫ్రాన్స్కు ప్రయాణించే క్రూజ్లో మూడు రోజుల వేడుకను నిర్వహించనున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా మరో ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించుకునేందుకు రడీగా ఉన్నారు. ఈ వేడుక కోసం బాలీవుడ్, క్రీడా, రాజకీయ రంగ ప్రముఖులు ఇటలీకి పయనమయ్యారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీతోపాటు,అనిల్ అంబానీ , కాబోయే వధువు రాధిక తండ్రితో కలిసి వెళ్లారు. ( ఇదీ చదవండి: అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ బాష్ : 800 మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?)అలాగే రాధిక-అనంత్కు మంచి స్నేహితులు బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ తన ముద్దుల తనయ రాహాలతో కలిసి బయలుదేరారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అలాగే ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి, పాపతో కలిసి ఎయిర్ పోర్ట్లో దర్శనిచ్చారు. అంతేనా సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ ఇంకా బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. (చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్ : రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా)కాగా అనంత్-రాధిక రెండవ ప్రీ వెడ్డింగ్ బాష్ మే 28వ తేదీనుంచి 30 మధ్య దక్షిణ ఫ్రాన్స్ తీరంలో క్రూయిజ్ షిప్లో జరుగుతందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. క్రూయిజ్ ఇటలీ నుండి బయలుదేరి, 2365 నాటికల్ మైళ్లు (4380 కిమీ) దూరం ప్రయాణించి దక్షిణ ఫ్రాన్స్లో ఉన్న వేదికకు చేరుకుంటుంది. -
వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనంపై ..సీసీఐకి రిలయన్స్ అభ్యర్ధన
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విలీనం ప్రక్రియను ముమ్మరం చేశారు. రూ.70వేల కోట్ల విలువైన ఎంటర్ టైన్మెంట్ విభాగానికి చెందిన ఆ రెండు సంస్థల్ని విలీనం చేసేందుకు గాను అనుమతి కావాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుండి క్లియరెన్స్ను అభ్యర్థించింది.పీటీఐ నివేదిక ప్రకారం..ఈ ఏడాది ఫిబ్రవరిలో ముఖేష్ అంబానీ చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి రూ.70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటుకు నిర్ణయించాయి. సంయుక్త సంస్థలో రిలయన్స్ రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ డీల్ గురించి ఎప్పటినుంచో వస్తున్న ఊహాగానాలకు తెర దించుతూ ఫిబ్రవరిలో అధికారిక ప్రకటన విడుదల చేశాయి.ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో విలీనం కానుంది. జాయింట్ వెంచర్కు రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహిస్తుంది. విలీన సంస్థలో రిలయన్స్కు 16.34 శాతం, వయాకామ్ 18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలు దఖలు పడనున్నాయి. -
చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా అనేక ఖరీదైన బహుమతులను అందించారు. తాజాగా నీతా అంబానీ కాబోయే చిన్న కోడలికి దుబాయ్లోని అద్భుతమైన లగ్జరీ విల్లాను బహుమతిగా అందించ నున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్గా, ఎన్ఎంఏసీసీ అధ్యక్షురాలిగా ఉన్న నీతా అంబానీ దుబాయ్లో 640 కోట్ల విల్లాను కానున్నకొత్త కోడలికి గిఫ్ట్గా అందించనున్నారు. ఇందుల 10 విలాసవంతమైన బెడ్రూమ్లు, అద్భుతమైన ఇంటీరియర్స్, ఇటాలియన్ పాలరాయి, అద్భుతమైన కళాకృతులు హైలైట్గా ఉంటాయిట. ఇంకా ఇందులో 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలవనుంది. అంతేకాదు బిలియనీర్ ఫ్యామిలీ బస చేయడానికి, భారీ పార్టీలను హోస్ట్ చేసేందుకు కూడా ఇది సరిపోతుందని అంచనా.లవ్బర్డ్స్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించి, 2022లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల గుజరాత్లో జామ్ నగర్లో ప్రీవెడ్డింగ్ వేడుకలను ఘనంగా నిర్వహించు కున్నారు. హస్తాక్షర్ వేడుకలో తమ ప్రేమపై సంతకాలుకూడా చేశారు. అటు రెండో విడత వేడుకలకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ ఏడాది జూలైలో ఏడడుగులు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.కాగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా అనంత్కు ఏకంగా రూ.4.5 కోట్లు విలువ చేసే బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ స్పీడ్ కారును గిఫ్ట్ గా అందించారు ముఖేష్ అంబానీ. అలాగే కాబోయే కోడలు రాధికా మర్చంట్కి ఖరీదైన వెండి గణపతి విగ్రహం, కలశాలు సహా పలు నగలు కానుకగా అందించారట. అలాగే నీతా అంబానీ తన సొంత డైమండ్ నక్లెస్ సైతం రాధికాకు బహుమతిగా అందించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
ఇషా అంబానీకి జియో బంపర్ డీల్! సక్సెస్ అయితే..
ఈషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ బంపర్ డీల్ అందుకుంటోంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ముకేశ్ అంబానీకి చెందిన జియో లీజింగ్ సర్వీసెస్ ఈషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్తో రూ.35,904 కోట్ల డీల్ కుదుర్చుకోనుంది.టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, జియో లీజింగ్ సర్వీసెస్ వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ .35, 904 కోట్ల విలువైన రౌటర్లు, సెల్ ఫోన్లు వంటి టెలికాం పరికరాలు, కస్టమర్ కేంద్రాల ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ డీల్ కు ఆమోదం పొందడానికి కంపెనీ వాటాదారులకు పోస్టల్ బ్యాలెట్ నోటీసును పంపినట్లు సమాచారం.జియో లీజింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎల్ఎస్ఎల్) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వినియోగదారులకు అనుబంధ సేవలతో పాటు టెలికాం పరికరాలను లీజుకు ఇచ్చే వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ డీల్ విజయవంతమైతే భారత టెలికాం రంగంలో ఇదే అతిపెద్ద ఎక్విప్మెంట్ లావాదేవీ అవుతుంది. నివేదిక ప్రకారం, జెఎల్ఎస్ఎల్ లీజింగ్ మోడల్ ద్వారా, ముఖేష్ అంబానీ లేటెస్ట్ 5జీ పరికరాలను ప్రజలకు అందుబాటు ధరలో అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మోడల్ ఆకాష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు మరింత మంది చందాదారులను ఆకర్షిస్తుంది. జియో ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా ఉన్న విషయం తెలిసిందే. 2025 మార్చి నుంచి 2026 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరాల్లో ఈ లావాదేవీ జరగనుంది. -
సముద్రంపై మరోసారి అనంత్ ప్రీవెడ్డింగ్ వేడుకలు
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తనకు కాబోయే భార్య రాధిక మర్చంట్తో రెండో రౌండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సిద్ధమవుతున్నారు.ఈమేరకు కొన్ని మీడియా సంస్థలు అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ వార్తలు ప్రచురించాయి. ఆ కథనాల ప్రకారం..ముఖేష్ అంబానీ-నీతా అంబానీల రెండో కుమారుడు అనంత్ అంబానీ తనకు కాబోయే భార్య రాధిక మర్చంట్తో రెండోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వేడుకలు మే 28-30 వరకు జరగనున్నాయి. అయితే ఈసారి ఏకంగా సముద్రంపైనే ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా లగ్జరీ క్రూయిజ్ను ఏర్పాటు చేశారు. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్ వరకు దాదాపు 4,380 కి.మీ దూరం ఈ క్రూయిజ్లో ప్రయాణిస్తూ వేడుకలు జరుపుకుంటారు. ఇందులో మొత్తం 800 మంది అతిథులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. 600 మంది సిబ్బంది వారికి ఏర్పాట్లు చేస్తారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఎన్కోర్ హెల్త్కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈ ఏడాది మార్చినెలలో ఘనంగా జరిగాయి. గుజరాత్లోని జామ్నగర్ జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో మెటా ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న వంటి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ముకేశ్ అంబానీ తన కుమారుడు, కోడలు ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్లు ఫోర్బ్స్ గతంలోనే నివేదించింది.మే28 నుంచి జరగబోయే రెండో రౌండ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కు అతిథుల జాబితా సిద్ధమైంది. అందులో సల్మాన్ఖాన్, షారూఖ్ఖాన్, ఆమిర్ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్ వంటి సినీ ప్రముఖలతోపాటు చాలామంది వ్యాపార దిగ్గజాలు, అంబానీ కుటుంబ సన్నిహితులు హాజరవుతున్నట్లు మీడియా సంస్థల ద్వారా తెలిసింది. -
ఓటేసిన వ్యాపార ప్రముఖులు
ముంబై: లోక్సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్లో ముంబైలోని ఆరు లోక్సభ స్థానాలకు సోమవారం ఎన్నికల పోలింగ్ జరిగింది. ముంబైలో పలువురు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, వారి కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి ముంబైలోని మలబార్ హిల్లో ఓటు వేశారు. #WATCH | Reliance Industries Chairman Mukesh Ambani, Founder and Chairperson of Reliance Foundation Nita Ambani along with their son arrive at a voting centre in Mumbai to cast their vote for #LokSabhaElections2024 pic.twitter.com/R97TSDysam— ANI (@ANI) May 20, 2024 ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తన సహాయకుడు శంతను నాయుడుతో కలిసి ముంబైలోని కోల్బాలోని పోలింగ్ బూత్ వచ్చి ఓటు వేశారు. అనిల్ అంబానీ ముంబైలోని పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి ఓటింగ్ ప్రారంభమయ్యే వరకు ఎదురు చూసి మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | Industrialist Anil Ambani stands in a queue at a polling booth in Mumbai, as he waits for the voting to begin.#LokSabhaElections2024 pic.twitter.com/UUCC9iOmyu— ANI (@ANI) May 20, 2024 ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పెద్దార్ రోడ్లోని పోలింగ్ బూత్లో కూతురు అనన్య బిర్లాతో కలిసి ఓటు వేశారు. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. The privilege of deciding who will govern us…It’s a blessing. Never turn your back on a blessing… pic.twitter.com/rkSAr2CQMh— anand mahindra (@anandmahindra) May 20, 2024 ముంబైలోని పెద్దార్ రోడ్డు సమీపంలో తన కుటుంబంతో కలిసి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఓటు వేశారు. జెట్ ఎయిర్వేస్ మాజీ ఛైర్మన్ నరేష్ గోయల్, హెచ్డీఎఫ్సీ మాజీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ ముంబైలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు.VIDEO | Lok Sabha Elections 2024: "I, along with my family cast our votes together. It is a very proud moment for every Indian and it is a moment of pride to participate in an election of 140 crore people," says RBI governor Shaktikanta Das (@DasShaktikanta) after casting his… pic.twitter.com/YEPMHmKCqn— Press Trust of India (@PTI_News) May 20, 2024 -
ఓటేసిన అంబానీ దంపతుల విన్నపం ఇదే..
ముంబై: లోక్సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్లో సెలబ్రిటీలు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, వారి కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి సోమవారం ముంబైలోని మలబార్ హిల్కి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఓటు వేసిన అనంతరం రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు కీలక పాత్రను నొక్కిచెప్పారు. ‘దేశ పౌరులుగా ఓటు వేయడం చాలా ముఖ్యం. ఓటు వేయడం మన హక్కు, బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను" అని ఆమె వ్యాఖ్యానించారు. ముఖేష్ అంబానీ ఇవే భావాలను వ్యక్తీకరించారు. "ప్రతి భారతీయుడు ఓటు వేయాలి. ఇది నాతోటి ప్రజలకు నా విజ్ఞప్తి" అని పేర్కొన్నారు.లోక్సభ ఎన్నికల ఐదో దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 49 స్థానాలకు పోలింగ్ జరిగింది. 695 మంది అభ్యర్థుల పోటీలో ఉన్నారు. వీరిలో రాజ్నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీయూష్ గోయల్, ఉజ్వల్ నికమ్, చిరాగ్ పాశ్వాన్, ఒమర్ అబ్దుల్లా వంటి ప్రముఖలు ఉన్నారు.#WATCH | Reliance Industries Chairman Mukesh Ambani, Founder and Chairperson of Reliance Foundation Nita Ambani along with their son arrive at a voting centre in Mumbai to cast their vote for #LokSabhaElections2024 pic.twitter.com/R97TSDysam— ANI (@ANI) May 20, 2024 -
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ బాష్ : 800 మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
ఆసియా కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన లేడీ లవ్ రాధిక మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేసేందుకు సన్నద్ధమవున్నాడు. వచ్చే నెల (జూలై 12న) అనంత్-రాధిక వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించేందుకు అంబానీ సిద్ధమ వుతున్నారు. ఈ క్రమంలో మార్చి మూడవ తేదీవరకు జామ్నగర్లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకుల సందడి ఇంకా ముగియకముందే రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకకు సన్నద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 28 నుంచి 30 మధ్య దక్షిణ ఫ్రాన్స్లో క్రూయిజ్ షిప్లో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుక జరగనుంది. క్రూయిజ్ ఇటలీ నుండి బయలుదేరి 2365 నాటికల్ మైళ్ల (4380 కి.మీ) దూరం ప్రయాణించి దక్షిణ ఫ్రాన్స్లోని గమ్యస్థానానికి చేరుకుంటుందని కూడా పేర్కొంది. ఈ వేడుక కేవలం పెళ్లి చేసుకోబోయే అనంత్-రాధికకు మాత్రమేకాదు అతిథులందరికీ కూడా అద్భుతమైన అనుభవంగా మిగలేలా సర్వ హంగులతో ఏర్పాట్లు చేస్తున్నాయిట ఇరు కుటుంబాలు. అతిధులు ఈ వేడుకలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ సెలబ్రిటీలతో సహా మొత్తం 800 మంది అతిథులు హాజరుకానున్నారు. రముఖ్యంగా అనంత్ సోదరుడు ఆకాష్ అంబానీ శ్లోకా మెహతా జంటతో సన్నిహితంగా ఉంటే బాలీవుడ్ జంట రణబీర్ కపూర్ అలియా భట్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలవబోతున్నారు. క్రూయిజ్ షిప్లో మొత్తం 600 మంది సిబ్బంది అతిథుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారట. కాగా 2017లో డ్రైవ్లో పరస్పర స్నేహితుల ద్వారా పరిచయమైన వీరిద్దరూ లవ్బర్డ్స్గా మారిపోయారు. కొన్నాళ్ల డేటింగ్ తరువాత 2023లో రాజస్థాన్లోని నాథ్ద్వారాలోని శ్రీనాథ్జీ టెంపుల్లో రాధికకు పెళ్లికి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఆంటిలియాలో నిశ్చితార్థం వేడుక, 2024లో జామ్నగర్లో మూడు రోజుల పాటు ప్రీవెడ్డింగ్ హస్తాక్షర్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే. -
ముఖేష్ అంబానీ: ఏ వర్కౌట్స్ లేకుండానే 15 కిలోలు తగ్గాడట, ఎలా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు 67వ ఏట అడుగుపెట్టాడు. బిజినెస్ మాగ్నెట్, ఆసియాకుబేరుడు ముఖేష్ అంబానీ, ధీరూభాయ్ అంబానీ, కోకిలా బెన్ దంపతులకు 1957 ఏప్రిల్ 19న యెమెన్లో పుట్టాడు. వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, కెమికల్ ఇంజనీరింగ్ చదివిన అంబానీ తన సామర్థ్యం, కృషితో రిలయన్స్ను ప్రపంచంలోనే ప్రముఖ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించాడు. భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా, ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో నిలవడం విశేషం. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను తన వారసులు, ఇషా అంబానీ పిరమల్, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలకు పంచి ఇచ్చినప్పటికీ 67 ఏళ్ల వయసులో కూడా వ్యాపార దక్షతలో చురుగ్గా ఉంటాడు. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో కీలకమైన వ్యాపార నిర్ణయాలతోపాటు ఇటు కుటుంబ బాధ్యతలను కూడా దిగ్విజయంగా నిర్వరిస్తున్నాడు. అంతేకాదు తన ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను కాపాడుకోవడంలో కూడా దిట్ట. ఆయన పాటించే ఆహారం నియమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియనప్పటికీ, ఎలాంటి వర్కవుట్ లేకుండానే ముఖేష్ అంబానీ 15 కిలోలు తగ్గారట. ఈ సందర్బంగా ఆయన డైట్ , జీవన శైలి ఏంటి అనేది చర్చలో నిలిచింది. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!) కఠినమైన ఆహార నియమాలతోనే ముఖేష్ అంబానీ ఈ అద్భుత ఫలితాన్ని సాధించారని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర సక్సెస్ఫుల్ వ్యక్తుల మాదిరిగానే ముఖేష్ అంబానీ యోగా, ధ్యానంతో రోజు ప్రారంభిస్తాడు. ఉదయం 5:30 గంటలకు మేల్కొంటాడు. యోగా, ధ్యానం సూర్య నమస్కారాలు, వాకింగ్ కోసం బయటికి కూడా వెళ్తాడు. ఎంత బిజీషెడ్యూల్ ఉన్నా ఈ ఉదయపు దినచర్యను మాత్రం ఎప్పుడూ దాటవేయడు. (మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్) బ్రేక్ఫాస్ట్, లంచ్ డిన్నర్ ఇలా.. అంబానీ స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్ని ఫాలో అవుతారు. ఆల్కహాల్, జంక్ ఫుడ్కు దూరంగా ఉంటాడు. ఇక రోజులోని అంబానీ తొలి భోజనం విషయానికి వస్తే అల్పాహారంలో తాజా పండ్లు, జ్యూస్, ఇడ్లీ-సాంబార్ తీసుకుంటాడు. లంచ్, డిన్నర్ కూడా సాంప్రదాయ భారతీయ ఆహారాలతో చాలా సింపుల్గా కానిచ్చేస్తారట. గుజరాతీ తరహాలో దాల్, సబ్జీ, అన్నం, సూప్లు , సలాడ్లను ఇష్టపడతాడు. అది కూడా ఇంట్లో వండిన భోజనం మాత్రమే. కాగా ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలిగా ఐపీఎల్ జట్టుకు ఓనర్గా ఉన్నారు. నీతా, అంబానీ దంపతులు ఇప్పటికేపెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి, కుమార్తె ఇషా అంబానీకి వివాహాలు జరపించారు. నలుగురు మనవలు కూడా ఉన్నారు. ఇక చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ఈ ఏడాది జూన్లో జరగనుంది. -
నీతా అంబానీ లగ్జరీ కారు, ఫోటోలు వైరల్, ధర ఎంతంటే..!
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ అంటే లగ్జరీకి పెట్టింది. డైమండ్ నగలు, వాచ్లు, ఖరీదైన చీరలు,విలాసవంతమైన బ్యాగులు, డనుంచి చెప్పులు, లిప్స్టిక్ కలెక్షన్ల దాకా ప్రతీదీ ప్రత్యేకమే. తాజాగా నీతా మరో ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు. స్పెషల్ గా కస్టమైజ్డ్ రోజ్ క్వార్ట్జ్ లగ్జరీ రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB సెడాన్ను కొనుగోలు చేశారు. బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఫ్లాగ్షిప్ మోడల్ కారు ఇది. బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇలాంటి కారు ఇండియాలోనే మొట్టమొదటిదని భావిస్తున్నారు.దీని స్టాండర్డ్మోడల్ ధర దాదాపు రూ.12 కోట్లు. కస్టమైజ్డ్ స్పెషల్కారుకావడంతో దీనిధర మరింత పెరుగుతుందని అంచనా. ముఖ్యంగా కారు హెడ్రెస్ట్లపై నీతాముఖేష్ అంబానీ (ఎన్ఎంఏ) కూడా ఎంబ్రాయిడరీ చేసిన పిక్స్కూడా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే అంబానీ కుటుంబంలో రోల్స్ రాయిస్ ఫాంటమ్స్,గోస్ట్స్, కల్లినన్స్ సహా 168కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. అయినా కొత్త కలర్ అధునాతన ఫీచర్లతో ఉన్న కొత్త లగ్జరీ రోల్స్ రాయిస్ ప్రత్యేకంగా నిలుస్తుంది. గత దీపావళికి, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి రూ. 10 కోట్ల రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎస్యూవీని బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. భారతదేశంలో ప్రముఖ రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారు ఉన్నవారు ప్రముఖుల్లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఒకరు. View this post on Instagram A post shared by Automobili Ardent India (@automobiliardent) -
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితా (ఫొటోలు)
-
Forbes richest list 2024: టాప్–10లో ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సాధించారు. 2024 ఏడాదికి ఫోర్బ్స్ టాప్–10 బిలియనీర్లలో 9వ ర్యాంకును పొందారు. 116 బిలియన్ డాలర్ల సంపదతో 66 ఏళ్ల ముకేశ్ టాప్–9గా నిలిచారు. 2023లో ముకేశ్ సంపద 83.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా.. దేశీయంగా సంపదలో టాప్–2గా నిలుస్తున్న గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో 17వ ర్యాంకును అందుకున్నారు. యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా 2023లో అదానీ సంపద 47.2 బిలియన్ డాలర్లకు క్షీణించిన సంగతి తెలిసిందే. హిండెన్బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ తిరిగి బలపడింది. ఇక 2022లో అదానీ 90 బిలియన్ డాలర్ల నెట్వర్త్ను సాధించడం ప్రస్తావించదగ్గ అంశం! జాబితా ఇలా ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో 2,781 మంది వ్యక్తులు చోటు సాధించారు. గతేడాది జాబితాతో పోలిస్తే 141 మందికి అదనంగా చోటు లభించింది. 2023తో పోలిస్తే కుబేరుల ఉమ్మడి సంపద 2 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 14.2 ట్రిలియన్ డాలర్లను తాకింది. సరికొత్త రికార్డ్ నమోదైన 2021తో పోలిస్తే 1.1 లక్షల కోట్ల డాలర్లు జత కలసింది. ఫ్యాషన్స్, కాస్మెటిక్స్ దిగ్గజం ఎల్వీఎంహెచ్కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 233 బిలియన్ డాలర్లతో టాప్ ర్యాంకును, 195 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ రెండో ర్యాంకునూ కొల్లగొట్టారు. 177 బిలియన్ డాలర్లతో ఫేస్బుక్ జుకర్బర్గ్ టాప్–3గా నిలిచారు. -
Forbes: డబ్బున్నోళ్ల లిస్ట్.. అందరికంటే రిచ్ ఈ పెద్దాయనే..
అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తన 2024 సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్లో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్వీఎంహెచ్ (LVMH) బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఆయన కుటుంబం 233 బిలియన్ డాలర్లు (రూ. 19.43 లక్షల కోట్లు) సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. 2024లో రికార్డు స్థాయిలో 2,781 మంది బిలియనీర్లు ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. గత సంవత్సరం కంటే ఈ సంఖ్య 141 ఎక్కువ. 2021లో నమోదైన రికార్డు కంటే 26 ఎక్కువ. ఈ లిస్ట్లోని బిలియనీర్ల మొత్తం సంపద 14.2 ట్రిలియన్ డాలర్లు (11.8 కోట్ల కోట్లు) అని పేర్కొంది. ఆర్నాల్ట్, ఆయన కుటుంబం తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 195 బిలియన్ డాలర్ల (రూ. 16.26 లక్షల కోట్లు) నికర సంపదతో రెండవ స్థానంలో ఉన్నారు. ఈయన తర్వాత అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ 194 బిలియన్ డాలర్ల (రూ. 16.17 లక్షల కోట్లు) నెట్వర్త్తో మూడవ స్థానంలో ఉన్నారు. ఇక భారత్కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 116 బిలియన్ డాలర్ల (రూ. 9.67 లక్షల కోట్లు) సంపదతో టాప్ టెన్లో 9వ స్థానంలో నిలిచారు. ఈకాగా ఈసారి ఫోర్బ్స్ లిస్ట్లో కొత్తగా పలువురు సెలబ్రిటీలు చేరారు. పాప్ సంచనం టేలర్ స్విఫ్ట్ ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో అడుగు పెట్టింది. అక్టోబర్లో బిలియనీర్ హోదాకు చేరుకున్న ఈ పాప్ సూపర్ స్టార్, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రిహన్న, కిమ్ కర్దాషియాన్, ఓప్రా విన్ఫ్రే, స్టార్ వార్స్ సృష్టికర్త జార్జ్ లూకాస్లతో కలిసి చేరారు. 1.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,169 కోట్లు) భారీ నెట్వర్త్తో స్విఫ్ట్ 14వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ టాప్ టెన్ లిస్ట్ ఇదే.. -
అంబానీ-అదానీ దోస్త్ మేరా దోస్త్..!
అవునన్నా..కాదన్నా.. ఇద్దరు దిగ్గజ వ్యాపారస్థుల మధ్య ఎల్లప్పుడూ పోటీనే ఉంటుంది. తమతమ వ్యాపారాల్లో ఆధిపత్యపోరు సాగుతూనే ఉంటుంది. అలాంటిది ఇద్దరికీ ఒకేతరహా వ్యాపారాలు ఉంటే మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ కంపెనీ లాభాల కోసం ఎత్తుకుపైఎత్తులు వేస్తారు. కానీ అలాంటి భీకర వాతావరణం లేకుండా ఇద్దరు వ్యాపార సామ్రాజ్య సార్వభౌములు కలిశారు. వాటాలు పంచుకున్నారు. ఓ ప్రాజెక్టు విషయంలో మొదలైన భాగస్వామ్య బంధం భవిష్యత్తులో ఎలా సాగుతుందోననే ఉత్కంఠ మొదలైంది. నిన్నటి వరకూ వ్యాపార ప్రత్యర్థులుగా ఉండి నేటి నుంచి వ్యాపార భాగస్వాములుగా మారిన ఆ ఇద్దరూ మరెవరోకాదు దేశంలోనే వ్యాపార దిగ్గజాలుగా ఉన్న ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు. ఓ పవర్ ప్రాజెక్టు విషయంలో వీరిద్దరి మధ్య తాజాగా భాగస్వామ్యం కుదిరింది. ఇందులో భాగంగా అదానీ పవర్కు చెందిన మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్లోని ఈ ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల యూనిట్లో ఉత్పత్తయ్యే విద్యుత్ను ఆర్ఐఎల్ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు రెండు సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఇద్దరు దిగ్గజాలు వేర్వేరు వ్యాపారాల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ, అగ్రస్థానాన్ని అధిరోహించడం కోసం ఎవరి శైలిలో వారు పోటీపడుతున్నారు. ఆయిల్, గ్యాస్, రిటైల్, టెలికాం విభాగాల్లో ముఖేష్ అంబానీ విజయపరంపరతో ముందుకు వెళ్తున్నారు. ఇన్ఫ్రా, పోర్టులు, ఎయిర్ పోర్టులు, మైనింగ్ వ్యాపారాల్లో అదానీ దూసుకెళ్తున్నారు. మీడియా, పునరుత్పాదాక ఇంధన రంగాలలో మాత్రం ఇద్దరి మధ్య పోటీ ఉంది. తాజా ప్రాజెక్ట్ ఒప్పందంతో ఇద్దరి మధ్య భాగస్వామ్యం కుదిరినా, కయ్యం ఉండదని చెప్పలేమని నిపుణులు భావిస్తున్నారు. వీరి వియ్యాలు.. కయ్యాలు ఎలా ఉన్నా వీరి వల్ల దేశానికి ఏదైనా మేలు జరిగితేనే ప్రయోజనం జరుగుతుందని చెబుతున్నారు. భారత్ ఆర్థికశక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తే అందరూ హర్షిస్తారు. ఇద్దరూ గుజరాతీయులే. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. దిల్లీ పెద్దల ఆశీస్సులు ఇద్దరికీ పుష్కలంగానే ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పదేళ్ల కాలంతో అదానీ గ్రూప్ సంస్థలు భారీ లాభాల్లోకి వెళ్లాయన్నది మాత్రం వాస్తవమని చెబుతున్నారు. ఇదీ చదవండి: వర్షం కురిస్తే ట్యాక్స్ కట్టాల్సిందే..! అంబానీకి చమురు-గ్యాస్ నుంచి టెలికాం దాకా వ్యాపారాలున్నా.. అదానీ బొగ్గు తవ్వకం నుంచి విమానాశ్రయాల వరకు విస్తరించినా.. ఒక్క స్వచ్ఛ ఇంధన వ్యాపారంలో మినహా అంబానీ, అదానీ ఒకరి వ్యాపార బాటలో మరొకరు తారసపడిందే లేదు. 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసినా.. పబ్లిక్ నెట్వర్క్ కోసం దానిని వినియోగించలేదు. అంతే కాదు.. 2022లో అంబానీతో సంబంధమున్న ఒక కంపెనీ ఎన్డీటీవీలో తనకున్న వాటాలను అదానీకి విక్రయించింది కూడా. ఈ నెల మొదట్లో ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ ప్రీవెడ్డింగ్ వేడుకలకు అదానీ హాజరయ్యారు. -
చేతులు కలిపిన అంబానీ– అదానీ
న్యూఢిల్లీ: బిలియనీర్ పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తొలిసారి చేతులు కలిపారు. దీనిలో భాగంగా అదానీ పవర్కు చెందిన పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్లోని ఈ ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల యూనిట్లో ఉత్పత్తయ్యే విద్యుత్ను ఆర్ఐఎల్ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు రెండు సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వెరసి అదానీ పవర్ పూర్తి అనుబంధ సంస్థ మహన్ ఎనర్జెన్ లిమిటెడ్లో 5 కోట్ల ఈక్విటీ షేర్లను ఆర్ఐఎల్ సొంతం చేసుకోనుంది. రూ. 10 ముఖ విలువకే(రూ. 50 కోట్లు) వీటిని చేజిక్కించుకోవడంతోపాటు.. 500 మెగావాట్ల విద్యుత్ను సొంత అవసరాలకు ఆర్ఐఎల్ వినియోగించుకోనుంది. సొంత వినియోగ పాలసీలో భాగంగా ఆర్ఐఎల్ 20 ఏళ్ల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) ఎంఈఎల్తో కుదుర్చుకున్నట్లు అదానీ పవర్ వెల్లడించింది. మొత్తం 2,800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఎంఈఎల్ ప్లాంటులో 600 మెగావాట్ల యూనిట్ను సొంత అవసరాల పద్ధతిలో తెరతీయనున్నట్లు వివరించింది. -
అచ్చం అనంత్ మామలాగే..క్యూట్ కృష్ణ ఫోటో వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ. రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా ఇషా, 2018 డిసెంబరులో వ్యాపారవేత్త ఆనంద్ పిరమల్ను వివాహం చేసుకుంది. ఇషా, ఆనంద్ జంటకు కవలలు - కృష్ణ (కుమారుడు) ఆదియా (కుమార్తె) జన్మించారు. అటు తల్లిగా, ఇటు వ్యాపార నిర్వహణలోనూ అంబానీ వారసురాలిగా తన సత్తా చాటుకుంటోంది. ఇటీవల ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో తన ట్విన్స్తో సందడిగా కనిపించింది ఇషా. ఇషాతో ట్విన్స్ ఫోటోలో సోషల్ మీడియాలో తెగ షేర్ అయ్యాయి. ముఖ్యంగా ఇషా కుమారుడు కృష్ణ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాడు. ఈ ఫోటోలు అచ్చం మేనమామ అనంత్ అంబానీలా ఉండటం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. బ్లాక్ సూట్లో రాయల్ లుక్లో చిరునవ్వుల చిందిస్తున్న ఇషా కుమారుడు కృష్ణ, తమ్ముడు అనంత్ కార్బన్ కాపీలా ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. " అచ్చం అనంత్ అంబానీ లాగానే ఉన్నాడు అని ఒకరు, "అనంత్ మాము జైసా లగ్తా హై" అని మరొకరు వ్యాఖ్యానించారు. అంతేకాదుఆ చిన్నారి ధీరూభాయ్ అంబానీలా ఉన్నాడని మరికొందరు కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ మామ, అల్లుళ్ల పోలికల ఫోటో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
అబ్బురపరిచిన ‘అనంత’ భావోద్వేగం
కళ్లు చెదిరే ఐశ్వర్యం, దేన్నయినా క్షణాల్లో సాధించగల అధికారం, కుటుంబ విలువల పట్ల అచంచల విశ్వాసం, భగవంతుడిపై అంతులేని భక్తి... ఇవన్నీ ఒకే కుటుంబంలో కలగలిసి వుండటం ఊహాతీతం. కానీ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ‘అంబానీ పరివార్’ వీటన్నిటి సమ్మేళనం అని మరోసారి రుజువైంది. గుజరాత్లోని జామ్నగర్లో మూడు రోజులపాటు ఈమధ్య జరిగిన ప్రీ వెడ్డింగ్ సంబరాలు దేశంలోనే ఎప్పుడూ కనీవినీ ఎరుగనివి. కానీ వీటన్నిటి కంటే అందరికీ ఆసక్తి కలిగించింది మరొకటుంది. అది జూలైలో పెళ్లికొడుకు కాబోతున్న అనంత్ అంబానీ చేసిన ప్రసంగం! చిన్ననాటి స్నేహితురాలూ, ప్రియురాలూ అయిన రాధికా మర్చంట్తో ఆయనకు వివాహం అవుతున్న సందర్భంగా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. వర్తమాన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న వివిధ రంగాల ప్రముఖులు, కార్పొరేట్ కుబేరులు, బాలీవుడ్ అగ్రతారలు, క్రికెటర్లు సకుటుంబ సమేతంగా వచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా హాజరయ్యారు. అనంత్ అంబానీ చేసిన ప్రసంగం అందరి మనసులనూ మెలిపెట్టింది. కుమారుడి ప్రసంగం వింటూ ముఖేష్ దంపతులైతే కంటతడి పెట్టారు. 2003లో కరణ్ థాపర్ ‘బీబీసీ’ కోసం ముఖేష్–నీతా దంపతులను ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా నీతాను ‘మీ దృష్టిలో డబ్బంటే ఏమిటి?’ అని అడిగినప్పుడు ‘డబ్బు దానికదే అంతిమ లక్ష్యం కాదు... దాన్ని ఎలా వినియోగిస్తామన్నదే ముఖ్యం’ అని చెబుతూ ఒక మాటన్నారు. ‘డబ్బు సంపాదన, సంపద జీవితం కానే కాదు... కొన్ని అపురూప చిరస్మరణీయ జ్ఞాపకాలను నిర్మించుకోవటమే జీవితం’ అని చెప్పారు. అనంత్ హృదయాంతరాళాల్లోంచి పెల్లుబికి వచ్చిన మాటల వెనక ఆ విలువల జీవశక్తి నిండివుందనీ, ఆ దంపతుల పెంపకం అతణ్ణి తీర్చిదిద్దిందనీ అనిపిస్తుంది. ఏమన్నారూ అనంత్? తన కుటుంబసభ్యులంతా తన కోసం, తన సుఖ సంతోషాల కోసం పడుతున్న శ్రమను వివరించారు. తనకున్న ప్రత్యేక అనారోగ్య సమస్యల నేపథ్యంలో అమ్మానాన్నలిద్దరూ అనుక్షణమూ తనను అపురూపంగా చూసుకున్న వైనాన్ని కళ్లకు కట్టారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత విలక్షణంగా ఉండాలన్న తపనతో గత కొన్ని నెలలుగా రోజుకు కనీసం 20 గంటలు తన కుటుంబసభ్యులంతా పడిన కఠోర శ్రమను గుర్తుకు చేసుకున్నారు. అందరూ అనుకుంటున్నట్టు తన జీవితం పూలపాన్పు కాదనీ, చిన్ననాటినుంచీ భరించలేని బాధల ముళ్లు వేధిస్తూనే ఉన్నాయనీ చెప్పారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడే క్రమంలో వాడక తప్పని స్టెరాయిడ్స్ చివరకు ఊబకాయానికి కారణమైన తీరును తెలిపారు. సాధారణంగా 25–30 ఏళ్ల మధ్యనుండే సంపన్న కుటుంబాల యువతలో చాలా సందర్భాల్లో విచ్చలవిడితనం, బాధ్యతారాహిత్యం కనబడుతూ ఉంటుంది. ఇంగ్లిష్ తప్ప ఏదీ మాట్లాడలేరు. ఈ వేడుకల సందర్భంగా ‘న్యూస్18’కు ఇచ్చిన ఇంటర్వ్యూ అనంత్లోని మానవీయతను వెల్లడిస్తుంది. నిలువెల్లా వినమ్రత, పలికే ప్రతి మాటలో నిజాయితీ అతని సొంతం. ఇంగ్లిష్లో కాదు... అందరికీ అర్థమయ్యేలా స్వచ్ఛమైన హిందీలో భావ వ్యక్తీకరణ అనంత్ ప్రత్యేకత. గాయపడిన, ఆదరణ కోల్పోయిన వన్యప్రాణులను అక్కున చేర్చుకుని వాటి సంరక్షణ కోసం జామ్నగర్లో మూడువేల ఎకరాల్లో ‘స్టార్ ఆఫ్ ద ఫారెస్ట్ వన్తార’ అనే ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. చిన్ననాడు తన నాయనమ్మ కోకిలా బెన్ నేర్పిన ప్రేమ, దయ భావనలే ఈ ప్రాజెక్టుకు తనను పురిగొల్పాయని చెప్పారు. తన ఆధ్వర్యంలోనే గుజరాత్ ప్రభుత్వ సహకారంతో ఒక ‘జూ’ కూడా నిర్వహిస్తున్నారు. ‘ఇండియా టుడే’ ఛానెల్లో వచ్చిన ఇంటర్వ్యూ ఆయనలోని మరో మనిషిని ఆవిష్కరించింది. ఆ యువకుడిలో దాగున్న ఆధ్యాత్మిక భావనలూ, మాతృదేశంపై ఉన్న చెక్కుచెదరని మమకారాన్నీ ఆ ఇంటర్వ్యూ వెలికితీసింది. పెళ్లి వేడుకలు మన దేశంలోనే జరుపుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపే స్ఫూర్తిగా అందుకోసం జామ్నగర్ను ఎంచుకున్నానని చెప్పారు. తన ఇంటిల్లిపాదికీ సనాతన ధర్మంపై ఉన్న భక్తి విశ్వాసాలనూ, వాటికి అనుగుణంగా ఆచరిస్తున్న విలువలనూ వివరించారు. ఆసియా ఖండంలోని సంపన్నవంతుల్లో మొట్టమొదటి స్థానంలో, ప్రపంచ కుబేరుల జాబితాలో పదో స్థానంలో ఉన్న కుటుంబంలో ఒక 28 ఏళ్ల కుర్రాడు ఇంత పరిణతితో, ఆధ్యాత్మిక విలువలతో మాట్లాడతాడని బహుశా ఎవరూ అనుకుని ఉండరు. ‘లైసెన్స్ రాజ్’గా పేరుబడిన ఆర్థిక సంస్కరణల పూర్వ దశలో అనంత్ తాత ధీరూభాయ్ అంబానీ తనదైన రీతిలో పావులు కదుపుతూ, ఒక్కొక్క మెట్టే అధిరోహిస్తూ తన విశాల కుటుంబ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్లారు. ఆయన వారసత్వాన్ని ముఖేష్ అప్రతిహతంగా కొనసాగిస్తూ దాన్ని మరింత పెంచుతున్న వైనమూ కళ్లముందే ఉంది. అందుకే ఇవాళ దేశంలో రిలయన్స్ స్పృశించని రంగమంటూ లేదు. ఆ కుటుంబ విలువలు సైతం అందరి హృదయాలనూ తాకుతాయని ప్రీ వెడ్డింగ్ వేడుకలు తెలియజెప్పాయి. బి.టి. గోవిందరెడ్డి వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్టు -
అంబానీ అదిరిపోయే స్కెచ్..!
-
Nita Ambani 1st Salary: ‘నన్ను చూసి ఎగతాళిగా నవ్వేవారు’
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ టీచర్గా, వ్యాపారవేత్తగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానిగా, నృత్యకారిణిగా, సేవకురాలిగా..ఇలా తన లైఫ్లో ఎన్నో పాత్రలు పోషించారు. జీవితంలో ఎదిగేందుకు చాలాకష్టపడినట్లు ఐకానిక్ టాక్ షో విత్ సిమి గరేవాల్ ఎపిసోడ్లో వెల్లడించారు. ఈమేరకు అప్పటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ వీడియోలో నీతా అంబానీ నర్సరీ స్కూల్లో టీచర్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్ ముఖేష్ అంబానీతో 1985లో వివాహం జరగడానికంటే ఏడాది ముందు నుంచే ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేయడం ప్రారంభించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఇషా అంబానీ ప్రయత్నం ఫలిస్తుందా..? ముఖేష్ అంబానీని పెళ్లాడిన తర్వాత కూడా సన్ఫ్లవర్ నర్సరీ స్కూల్లో టీచర్గా కొనసాగినట్లు తెలిపారు. అప్పుడు తన వేతనం నెలకు రూ.800 ఉండేదని నీతా అంబానీ గత జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆ సమయంలో తనను చూసి చాలా మంది ఎగతాలిగా నవ్వేవారని చెప్పారు. కానీ ఉద్యోగం తనకు సంతృప్తిని ఇచ్చినట్లు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Elite Learning Minds (@elite_learning_minds) -
అనంత్ అంబానీ బరువుపై అసభ్యకరమైన కామెంట్లు చేసిన హీరోయిన్
భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్ వేదికగా మార్చి 1-3 వరకు ఘనంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలను ‘హస్తాక్షర్ ’ కార్యక్రమంతో ముగించారు. దేశ, విదేశాల్లో పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో అంబానీ ఫంక్షన్పై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ స్పందించింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు తనను ఎందుకు పిలవలేదని ఆమె ప్రశ్నించింది. ఒకవేళ తనను పిలిచి ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయడం నుంచి వంట పాత్రలు కడగడం వరకు తానే స్వయంగా చేసేదానినంటూ ఆమె ఇలా పేర్కొంది. 'అంబానీ జీ నమస్తే. నన్ను పెళ్లికి ఎందుకు పిలవలేదు? మీరు ఇంకా నా డ్యాన్స్ చూడలేదనుకుంటా.. మీరు సింగర్ రిహానాతో పాటుగా ఖాన్, ఐఖాన్ అంటూ ఎందరినో పిలిచారు. మీ వేడకలో వారు చేసిన డ్యాన్స్ నా ముందు జుజూబీ.. మీరు నా డాన్స్ చూశారా? మున్నీ బద్నామ్ హుయ్ డార్లింగ్ తేరే లియే, తుక్ తుక్ దేఖే, పరదేశియా ఇలా చాలా పాటలు చేశాను. అవన్నీ మీరు చూడలేదు అనుకుంటా. మీరు కోట్లకు కోట్లు డబ్బు ఇచ్చినా రిహానా చిరిగిన బట్టలతో వచ్చింది. నాకు రూ. 10 కోట్లు ఇచ్చి వుంటే మీకు ఎన్నో ప్రయోజనాలు కలిగేవి. మీ అతిథులందరి గదులు శుభ్రం చేయడం నుంచి వంట పాత్రలు కడిగే వరకు అన్నీ నేనే చేసేదాన్ని. అంటూ కామెంట్ చేసింది. అనంత్ బరువుపై కామెంట్లు అనంత్ అంబానీ బరువుపై రాఖీ సావంత్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. ' డియర్ అంబానీ జీ.. అనంత్ అంబానీ బాగా బరువు పెరిగారు.. ఆయన్ను నా వద్దకు 5రోజుల పాటు పంపించండి. కట్టెపుల్లలా సన్నగా చేసి పంపుతాను. దీని కోసమైన కొంత డబ్బు ఇచ్చి నన్ను కొనుక్కోండి. ఆయనతో కసరత్తులు చేయించడమే కాకుండా.. తృప్తి చేసి పంపిస్తాను. అనంత అంబానీని జీరో సైజ్కు చేర్చి మీ వద్ద ఉంచే బాధ్యత నాది. ఆయన బరువు తగ్గితే మీతో పాటుగా మీ కోడలు కూడా చాలా సంతోషిస్తుంది. అసలే మీ కోడలు దానిమ్మ పండులా ఉంది. ఆయన సన్నగా అయితే ఆమెకే మంచిది.' అని అనంత్ అంబానీ బరువుపై రాఖీ సావంత్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. దీంతో రాఖీ సావంత్ తీరుపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బరువు పెరిగినట్లు స్వయంగా ఆయన చెబుతూ ప్రీవెడ్డింగ్ వేడుకలోనే ఎమోషనల్ అయ్యాడు. అలాంటి వ్యక్తి గురించి ఇలా వల్గర్గా మాట్లాడడానికి సిగ్గులేదా అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆయన అమ్మగారు అయిన నీతా అంబానీ కూడా అనంత్ ఆరోగ్య సమస్యల గురించి గతంలో వివరించారు. అనారోగ్య కారణాలతో కొన్ని రకాల స్టెరాయిడ్స్ వాడటం వల్ల అనంత్ బరువు పెరిగాడని ఆమె చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by TellyMasala (@tellymasala) -
అనామకుడిలా అనిల్ అంబానీ
-
ముఖేష్ అంబానీ ‘లడ్డూ రివర్స్’ వీడియో వైరల్, అసలు నిజం ఇది!
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. ముఖేష్ అంబానీ, నీతాల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈ నెల( మార్చి) 1, 2,3 తేదీల్లో ఘనంగా జరిగాయి. గుజరాత్లోని జామ్ నగర్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల ప్రారంభంలో వేల మందికి అన్న దానం చేశారు. "ఖానా కమ్ పడ్ గయా హై.తూ థోడా అడ్జస్ట్ కర్ లేనా (ఫుడ్ తక్కువైంది.. కొంచెం సర్దుకు పోండి) అనే పేరుతో పోస్ట్ అయిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అంబానీ ఎందుకు అలా చేస్తారు. అని ఆశ్చర్యపోతున్నారా? అసలు నిజం ఇది..! దీనికి సంబంధించి అసలు వీడియోను రివర్స్గా రూపొందించిన ఫేక్ వీడియో ఇది. JIO, after some years of free internet pic.twitter.com/VlFPKrsq6g — Tweeting Quarantino (@rohitadhikari92) March 5, 2024 కమ్యూనిటీ విందులో విస్తర్లలో వడ్డించిన తరువాత, భోజనాలకు కూర్చున్న వారి నుంచి లడ్డూలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా వీడియో ట్విటర్లో తెగ షేర్ అవుతోంది. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో ఇదీ సంగతి అంటూ కొంతమంది ఈ వీడియోపై కమెంట్ చేశారు. అయితే ఇది రివర్స్ వీడియో అంటూ అసలు సంగతి చెప్పారు కొంతమంది. మరి కొంతమంది యూజర్స్ జియో..ఉచితంగా డేటా అలవాటు చేసిన కొన్నాళ్ల తరువాత పరిస్థితి ఇదీ అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. ఇదీ అసలు వీడియో.. In run up to marriage ceremony of Anant Ambani, community feast are being organized in villages around the Jamnagar refinery. Today, in Jogvad village, Billionaire #MukeshAmbani himself seen offering food to the guests in a community feast. pic.twitter.com/0Nb7dWMdVM — Kumar Manish (@kumarmanish9) February 28, 2024 కాగా అనంత్ అంబానీ తన లేడీ లవ్ రాధికా మర్చంట్తో ఈ ఏడాదిలో ఏడడుగులు వేసుందుకు రడీ అవుతున్నాడు. గత ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ లవ్బర్డ్స్ ఈ నెలలో అంగరంగ వైభవంగా ప్రీ- వెడ్డింగ్ బాష్ నిర్వహించారు. బాలీవుడ్సెలబ్రిటీలు, క్రీడారంగ ప్రముఖులతోపాటు బిల్గేట్స్, మార్క్ జుకర్ బర్గ్ సహా పలువురు ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు ఈ వేడుకల్లో విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే. -
అత్తకు తగ్గ కోడలు.. నాట్యంలో దిట్ట.. రాధిక గురించి ఆసక్తికర విషయాలు..
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల గురించి ప్రస్తుతం దేశంఅంతా చర్చ జరుగుతోంది. విదేశాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, బాలీవుడ్ తారలు ప్రివెడ్డింగ్ ఈవెంట్లో సందడి చేశారు. ఆటపాటలతో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుక అందిరికీ గుర్తుండిపోయేలే జరిగింది. ముందస్తు పెళ్లి వేడుకలే ఈ రేంజ్లో ఉంటే ఇక పెళ్లి ఏరేంజ్లో ఉంటుందోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడిగా అనంత్ అంబానీ గురించి దాదాపు చాలామందికే తెలుసు. పనిలోపనిగా అంబానీల ఇంటికొస్తున్న చిన్న కోడలెవరోనని చాలామంది ఆరాతీస్తున్నారు. ఇషా అంబానీ-ఆనంద్ పిరమల్ల వివాహం 2018లోనే జరిగింది. ఆ సమయంలోనే రాధిక మర్చంట్ పేరు వినిపించింది. 2019లో ఆకాశ్-శ్లోకల పెళ్లి సమయంలో రాధిక అంబానీ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం, ప్రతీ వేడుకలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం, సంగీత్ వేడుకలో అనంత్కు జంటగా డ్యాన్స్ చేయడంతో నీతా అంబానీకి కాబోయే చిన్న కోడలంటూ ప్రచారం ఊపందుకుంది. Emotional moment of Radhikaa merchant 😍❤️#RadhikaMerchant #AnantAmbani #MukeshAmbani #AnantRadhikaWedding #NitaAmbani #AmbaniWedding #AmbaniFamily pic.twitter.com/3IB5Gxmmeg — jayaa (@Jayaa2012) March 4, 2024 ఎన్కోర్ హెల్త్కేర్ సంస్థ సీఈఓ వీరెన్ మర్చంట్-శైలజా మర్చంట్ల కుమార్తె రాధిక. తండ్రి వీరెన్ మర్చంట్ హెల్త్కేర్ సీఈఓగా, వైస్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. రాధిక న్యూయార్క్ యూనివర్సిటీలో పాలిటిక్స్, ఎకనామిక్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేశాక ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా కొన్నాళ్లు పనిచేశారు. ఎన్కోర్ హెల్త్కేర్ సంస్థలో డైరెక్టర్గానూ వ్యవహరిస్తున్నారు. #RadhikaMerchant dance like Afsara 😍#MukeshAmbani family truly culture centric pic.twitter.com/bNbLSwWiya — SATYA (@Vindhyaputra) February 29, 2024 రాధికకు శాస్త్రీయ నృత్యం అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టం. ఆ మక్కువతోనే ప్రముఖ డ్యాన్సర్ భావనా థాకర్ వద్ద భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో 2022లో ముకేశ్-నీతా అంబానీలు రాధికకు అరంగేట్రం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముకేశ్ భార్య నీతా అంబానీ కూడా క్లాసికల్ డ్యాన్సర్. దీంతో అత్తకు తగ్గ కోడలు అని అందరూ ప్రశంసించారు. #AmbaniPreWedding Sangeet dance of bride and groom #AmbaniWedding pic.twitter.com/iQHtyi1U9p — ✨ HeroesDontExist! (@humaneGPT) March 3, 2024 -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రాధికా మర్చంట్ గురించి ఈ విషయాలు తెలుసా..?
-
సంప్రదాయ నృత్యంతో కోడలికి ఆహ్వానం పలికిన నీతా అంబానీ.. వీడియో వైరల్
అనంత్ అంబానీ-రాధికామర్చంట్ వివాహ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రివెడ్డింగ్ సంబరాలు ఆదివారంతో ముగిశాయి. ముకేశ్ అంబానీ – నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. రాధికా మర్చంట్ను అనంత్ ఈ ఏడాది జులైలో వివాహం చేసుకోబోతున్నారు. దీంతో అంబానీ కుటుంబం ముందస్తు పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించింది. గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్లో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిపారు. ఈ ప్రీ వెడ్డింగ్ సంబరాలకు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రపంచంలోని బిలియనీర్స్ తరలివచ్చారు. ఇక ఈ వేడుకల్లో నీతా అంబానీ తన సంప్రదాయ నృత్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇదీ చదవండి: రొమాంటిక్ సాంగ్.. ముఖేశ్-నీతాల డ్యాన్స్ చూశారా? అంబానీ ఇంట్లో ఏ వేడుకైనా నీతా అంబానీ ప్రత్యేకంగా నిలుస్తారు. రాధిక మర్చంట్ను అంబానీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ.. విశ్వంభరి దేవీ స్తోత్రంపై నృత్యం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. #WATCH | Founder and chairperson of Reliance Foundation Nita Ambani performed at Anant Ambani-Radhika Merchant's pre-wedding celebrations in Jamnagar, Gujarat. pic.twitter.com/7XvDzbr7Qa — ANI (@ANI) March 3, 2024 -
అనంత్-రాధిక : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ధర ఎంతో తెలుసా?
వ్యాపారవేత్త, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు. స్వయంగా డ్యాన్సర్ అయిన ఆమె అంబానీ కుటుంబవేడుకల్లో తన డ్యాన్స్ పెర్ఫామెన్స్తో అందరినీ మెస్మరైజ్ చేయడం ఆమెకు అలవాటు. తాజాగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్లో తన నాట్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతేకాదు నీతా లుక్స్, ఫ్యాషన్తో అతిథులను సర్ప్రైజ్ చేశారు. ముఖ్యంగా నీతా ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. నీతా కాంచీపురం చీరలో హుందాగా కనిపించారు. రిలయన్స్ లగ్జరీ రిటైల్ బ్రాండ్ స్వదేశ్ సహకారంతో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీర అద్భుతంగా ఆమెకు అమరింది. బోర్డర్పై క్లాసిక్ ట్రెడిషనల్ జర్దోసీ వర్క్, బ్లౌజ్ స్లీవ్లపై ప్రత్యేకమైన గోటా వర్క్, చక్కటి మేకప్తో తన ఐకానిక్ సిగ్నేచర్ స్టయిలో మెరిసిపోయారు. కాంచీపురం చీరకు జతగా, కోట్ల విలువైన పచ్చలు పొదిగిన డైమండ్ నెక్లెస్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అందానికి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. పచ్చలు పొదిగిన, పొడవాటి నెక్లెస్లో ఆమె లుక్తో అతిథులు చూపు తిప్పుకోలేక పోయారంటే అతిశయోక్తి కాదు. దీనికి సరిపోయేలా చెవిపోగులు, బ్యాంగిల్స్ , వేలి రింగ్ ఆకట్టుకున్నాయి. పలు నివేదికల ప్రకారం ఈ పచ్చల హారం ధర దాదాపు రూ. 400-500 కోట్టు ఉంటుందని అంచనా. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కాక్టెయిల్ నైట్ ఈవెంట్లో వైన్ కలర్ కస్టమ్-మేడ్ గౌను, క్లాసిక్ ఫ్రెంచ్ ట్విస్ట్ బన్లో ఆమె లుక్ నీతా స్టయిలింగ్ను ప్రతిబింబించింది. -
సందడి సందడిగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ (ఫొటోలు)
-
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ మెరిసిపోతున్న ఇషా అంబానీ (ఫొటోలు)