-
ముఖేష్ అంబానీ: ఏ వర్కౌట్స్ లేకుండానే 15 కిలోలు తగ్గాడట, ఎలా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు 67వ ఏట అడుగుపెట్టాడు. బిజినెస్ మాగ్నెట్, ఆసియాకుబేరుడు ముఖేష్ అంబానీ, ధీరూభాయ్ అంబానీ, కోకిలా బెన్ దంపతులకు 1957 ఏప్రిల్ 19న యెమెన్లో పుట్టాడు. వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, కెమికల్ ఇంజనీరింగ్ చదివిన అంబానీ తన సామర్థ్యం, కృషితో రిలయన్స్ను ప్రపంచంలోనే ప్రముఖ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించాడు. భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా, ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో నిలవడం విశేషం. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను తన వారసులు, ఇషా అంబానీ పిరమల్, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలకు పంచి ఇచ్చినప్పటికీ 67 ఏళ్ల వయసులో కూడా వ్యాపార దక్షతలో చురుగ్గా ఉంటాడు. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో కీలకమైన వ్యాపార నిర్ణయాలతోపాటు ఇటు కుటుంబ బాధ్యతలను కూడా దిగ్విజయంగా నిర్వరిస్తున్నాడు. అంతేకాదు తన ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను కాపాడుకోవడంలో కూడా దిట్ట. ఆయన పాటించే ఆహారం నియమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియనప్పటికీ, ఎలాంటి వర్కవుట్ లేకుండానే ముఖేష్ అంబానీ 15 కిలోలు తగ్గారట. ఈ సందర్బంగా ఆయన డైట్ , జీవన శైలి ఏంటి అనేది చర్చలో నిలిచింది. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!) కఠినమైన ఆహార నియమాలతోనే ముఖేష్ అంబానీ ఈ అద్భుత ఫలితాన్ని సాధించారని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర సక్సెస్ఫుల్ వ్యక్తుల మాదిరిగానే ముఖేష్ అంబానీ యోగా, ధ్యానంతో రోజు ప్రారంభిస్తాడు. ఉదయం 5:30 గంటలకు మేల్కొంటాడు. యోగా, ధ్యానం సూర్య నమస్కారాలు, వాకింగ్ కోసం బయటికి కూడా వెళ్తాడు. ఎంత బిజీషెడ్యూల్ ఉన్నా ఈ ఉదయపు దినచర్యను మాత్రం ఎప్పుడూ దాటవేయడు. (మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్) బ్రేక్ఫాస్ట్, లంచ్ డిన్నర్ ఇలా.. అంబానీ స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్ని ఫాలో అవుతారు. ఆల్కహాల్, జంక్ ఫుడ్కు దూరంగా ఉంటాడు. ఇక రోజులోని అంబానీ తొలి భోజనం విషయానికి వస్తే అల్పాహారంలో తాజా పండ్లు, జ్యూస్, ఇడ్లీ-సాంబార్ తీసుకుంటాడు. లంచ్, డిన్నర్ కూడా సాంప్రదాయ భారతీయ ఆహారాలతో చాలా సింపుల్గా కానిచ్చేస్తారట. గుజరాతీ తరహాలో దాల్, సబ్జీ, అన్నం, సూప్లు , సలాడ్లను ఇష్టపడతాడు. అది కూడా ఇంట్లో వండిన భోజనం మాత్రమే. కాగా ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలిగా ఐపీఎల్ జట్టుకు ఓనర్గా ఉన్నారు. నీతా, అంబానీ దంపతులు ఇప్పటికేపెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి, కుమార్తె ఇషా అంబానీకి వివాహాలు జరపించారు. నలుగురు మనవలు కూడా ఉన్నారు. ఇక చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ఈ ఏడాది జూన్లో జరగనుంది. -
నీతా అంబానీ లగ్జరీ కారు, ఫోటోలు వైరల్, ధర ఎంతంటే..!
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ అంటే లగ్జరీకి పెట్టింది. డైమండ్ నగలు, వాచ్లు, ఖరీదైన చీరలు,విలాసవంతమైన బ్యాగులు, డనుంచి చెప్పులు, లిప్స్టిక్ కలెక్షన్ల దాకా ప్రతీదీ ప్రత్యేకమే. తాజాగా నీతా మరో ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు. స్పెషల్ గా కస్టమైజ్డ్ రోజ్ క్వార్ట్జ్ లగ్జరీ రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB సెడాన్ను కొనుగోలు చేశారు. బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఫ్లాగ్షిప్ మోడల్ కారు ఇది. బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇలాంటి కారు ఇండియాలోనే మొట్టమొదటిదని భావిస్తున్నారు.దీని స్టాండర్డ్మోడల్ ధర దాదాపు రూ.12 కోట్లు. కస్టమైజ్డ్ స్పెషల్కారుకావడంతో దీనిధర మరింత పెరుగుతుందని అంచనా. ముఖ్యంగా కారు హెడ్రెస్ట్లపై నీతాముఖేష్ అంబానీ (ఎన్ఎంఏ) కూడా ఎంబ్రాయిడరీ చేసిన పిక్స్కూడా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే అంబానీ కుటుంబంలో రోల్స్ రాయిస్ ఫాంటమ్స్,గోస్ట్స్, కల్లినన్స్ సహా 168కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. అయినా కొత్త కలర్ అధునాతన ఫీచర్లతో ఉన్న కొత్త లగ్జరీ రోల్స్ రాయిస్ ప్రత్యేకంగా నిలుస్తుంది. గత దీపావళికి, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి రూ. 10 కోట్ల రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎస్యూవీని బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. భారతదేశంలో ప్రముఖ రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారు ఉన్నవారు ప్రముఖుల్లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఒకరు. View this post on Instagram A post shared by Automobili Ardent India (@automobiliardent) -
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితా (ఫొటోలు)
-
Forbes richest list 2024: టాప్–10లో ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సాధించారు. 2024 ఏడాదికి ఫోర్బ్స్ టాప్–10 బిలియనీర్లలో 9వ ర్యాంకును పొందారు. 116 బిలియన్ డాలర్ల సంపదతో 66 ఏళ్ల ముకేశ్ టాప్–9గా నిలిచారు. 2023లో ముకేశ్ సంపద 83.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా.. దేశీయంగా సంపదలో టాప్–2గా నిలుస్తున్న గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో 17వ ర్యాంకును అందుకున్నారు. యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా 2023లో అదానీ సంపద 47.2 బిలియన్ డాలర్లకు క్షీణించిన సంగతి తెలిసిందే. హిండెన్బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ తిరిగి బలపడింది. ఇక 2022లో అదానీ 90 బిలియన్ డాలర్ల నెట్వర్త్ను సాధించడం ప్రస్తావించదగ్గ అంశం! జాబితా ఇలా ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో 2,781 మంది వ్యక్తులు చోటు సాధించారు. గతేడాది జాబితాతో పోలిస్తే 141 మందికి అదనంగా చోటు లభించింది. 2023తో పోలిస్తే కుబేరుల ఉమ్మడి సంపద 2 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 14.2 ట్రిలియన్ డాలర్లను తాకింది. సరికొత్త రికార్డ్ నమోదైన 2021తో పోలిస్తే 1.1 లక్షల కోట్ల డాలర్లు జత కలసింది. ఫ్యాషన్స్, కాస్మెటిక్స్ దిగ్గజం ఎల్వీఎంహెచ్కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 233 బిలియన్ డాలర్లతో టాప్ ర్యాంకును, 195 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ రెండో ర్యాంకునూ కొల్లగొట్టారు. 177 బిలియన్ డాలర్లతో ఫేస్బుక్ జుకర్బర్గ్ టాప్–3గా నిలిచారు. -
Forbes: డబ్బున్నోళ్ల లిస్ట్.. అందరికంటే రిచ్ ఈ పెద్దాయనే..
అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తన 2024 సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్లో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్వీఎంహెచ్ (LVMH) బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఆయన కుటుంబం 233 బిలియన్ డాలర్లు (రూ. 19.43 లక్షల కోట్లు) సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. 2024లో రికార్డు స్థాయిలో 2,781 మంది బిలియనీర్లు ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. గత సంవత్సరం కంటే ఈ సంఖ్య 141 ఎక్కువ. 2021లో నమోదైన రికార్డు కంటే 26 ఎక్కువ. ఈ లిస్ట్లోని బిలియనీర్ల మొత్తం సంపద 14.2 ట్రిలియన్ డాలర్లు (11.8 కోట్ల కోట్లు) అని పేర్కొంది. ఆర్నాల్ట్, ఆయన కుటుంబం తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 195 బిలియన్ డాలర్ల (రూ. 16.26 లక్షల కోట్లు) నికర సంపదతో రెండవ స్థానంలో ఉన్నారు. ఈయన తర్వాత అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ 194 బిలియన్ డాలర్ల (రూ. 16.17 లక్షల కోట్లు) నెట్వర్త్తో మూడవ స్థానంలో ఉన్నారు. ఇక భారత్కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 116 బిలియన్ డాలర్ల (రూ. 9.67 లక్షల కోట్లు) సంపదతో టాప్ టెన్లో 9వ స్థానంలో నిలిచారు. ఈకాగా ఈసారి ఫోర్బ్స్ లిస్ట్లో కొత్తగా పలువురు సెలబ్రిటీలు చేరారు. పాప్ సంచనం టేలర్ స్విఫ్ట్ ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో అడుగు పెట్టింది. అక్టోబర్లో బిలియనీర్ హోదాకు చేరుకున్న ఈ పాప్ సూపర్ స్టార్, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రిహన్న, కిమ్ కర్దాషియాన్, ఓప్రా విన్ఫ్రే, స్టార్ వార్స్ సృష్టికర్త జార్జ్ లూకాస్లతో కలిసి చేరారు. 1.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,169 కోట్లు) భారీ నెట్వర్త్తో స్విఫ్ట్ 14వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ టాప్ టెన్ లిస్ట్ ఇదే.. -
అంబానీ-అదానీ దోస్త్ మేరా దోస్త్..!
అవునన్నా..కాదన్నా.. ఇద్దరు దిగ్గజ వ్యాపారస్థుల మధ్య ఎల్లప్పుడూ పోటీనే ఉంటుంది. తమతమ వ్యాపారాల్లో ఆధిపత్యపోరు సాగుతూనే ఉంటుంది. అలాంటిది ఇద్దరికీ ఒకేతరహా వ్యాపారాలు ఉంటే మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ కంపెనీ లాభాల కోసం ఎత్తుకుపైఎత్తులు వేస్తారు. కానీ అలాంటి భీకర వాతావరణం లేకుండా ఇద్దరు వ్యాపార సామ్రాజ్య సార్వభౌములు కలిశారు. వాటాలు పంచుకున్నారు. ఓ ప్రాజెక్టు విషయంలో మొదలైన భాగస్వామ్య బంధం భవిష్యత్తులో ఎలా సాగుతుందోననే ఉత్కంఠ మొదలైంది. నిన్నటి వరకూ వ్యాపార ప్రత్యర్థులుగా ఉండి నేటి నుంచి వ్యాపార భాగస్వాములుగా మారిన ఆ ఇద్దరూ మరెవరోకాదు దేశంలోనే వ్యాపార దిగ్గజాలుగా ఉన్న ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు. ఓ పవర్ ప్రాజెక్టు విషయంలో వీరిద్దరి మధ్య తాజాగా భాగస్వామ్యం కుదిరింది. ఇందులో భాగంగా అదానీ పవర్కు చెందిన మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్లోని ఈ ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల యూనిట్లో ఉత్పత్తయ్యే విద్యుత్ను ఆర్ఐఎల్ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు రెండు సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఇద్దరు దిగ్గజాలు వేర్వేరు వ్యాపారాల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ, అగ్రస్థానాన్ని అధిరోహించడం కోసం ఎవరి శైలిలో వారు పోటీపడుతున్నారు. ఆయిల్, గ్యాస్, రిటైల్, టెలికాం విభాగాల్లో ముఖేష్ అంబానీ విజయపరంపరతో ముందుకు వెళ్తున్నారు. ఇన్ఫ్రా, పోర్టులు, ఎయిర్ పోర్టులు, మైనింగ్ వ్యాపారాల్లో అదానీ దూసుకెళ్తున్నారు. మీడియా, పునరుత్పాదాక ఇంధన రంగాలలో మాత్రం ఇద్దరి మధ్య పోటీ ఉంది. తాజా ప్రాజెక్ట్ ఒప్పందంతో ఇద్దరి మధ్య భాగస్వామ్యం కుదిరినా, కయ్యం ఉండదని చెప్పలేమని నిపుణులు భావిస్తున్నారు. వీరి వియ్యాలు.. కయ్యాలు ఎలా ఉన్నా వీరి వల్ల దేశానికి ఏదైనా మేలు జరిగితేనే ప్రయోజనం జరుగుతుందని చెబుతున్నారు. భారత్ ఆర్థికశక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తే అందరూ హర్షిస్తారు. ఇద్దరూ గుజరాతీయులే. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. దిల్లీ పెద్దల ఆశీస్సులు ఇద్దరికీ పుష్కలంగానే ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పదేళ్ల కాలంతో అదానీ గ్రూప్ సంస్థలు భారీ లాభాల్లోకి వెళ్లాయన్నది మాత్రం వాస్తవమని చెబుతున్నారు. ఇదీ చదవండి: వర్షం కురిస్తే ట్యాక్స్ కట్టాల్సిందే..! అంబానీకి చమురు-గ్యాస్ నుంచి టెలికాం దాకా వ్యాపారాలున్నా.. అదానీ బొగ్గు తవ్వకం నుంచి విమానాశ్రయాల వరకు విస్తరించినా.. ఒక్క స్వచ్ఛ ఇంధన వ్యాపారంలో మినహా అంబానీ, అదానీ ఒకరి వ్యాపార బాటలో మరొకరు తారసపడిందే లేదు. 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసినా.. పబ్లిక్ నెట్వర్క్ కోసం దానిని వినియోగించలేదు. అంతే కాదు.. 2022లో అంబానీతో సంబంధమున్న ఒక కంపెనీ ఎన్డీటీవీలో తనకున్న వాటాలను అదానీకి విక్రయించింది కూడా. ఈ నెల మొదట్లో ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ ప్రీవెడ్డింగ్ వేడుకలకు అదానీ హాజరయ్యారు. -
చేతులు కలిపిన అంబానీ– అదానీ
న్యూఢిల్లీ: బిలియనీర్ పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తొలిసారి చేతులు కలిపారు. దీనిలో భాగంగా అదానీ పవర్కు చెందిన పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్లోని ఈ ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల యూనిట్లో ఉత్పత్తయ్యే విద్యుత్ను ఆర్ఐఎల్ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు రెండు సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వెరసి అదానీ పవర్ పూర్తి అనుబంధ సంస్థ మహన్ ఎనర్జెన్ లిమిటెడ్లో 5 కోట్ల ఈక్విటీ షేర్లను ఆర్ఐఎల్ సొంతం చేసుకోనుంది. రూ. 10 ముఖ విలువకే(రూ. 50 కోట్లు) వీటిని చేజిక్కించుకోవడంతోపాటు.. 500 మెగావాట్ల విద్యుత్ను సొంత అవసరాలకు ఆర్ఐఎల్ వినియోగించుకోనుంది. సొంత వినియోగ పాలసీలో భాగంగా ఆర్ఐఎల్ 20 ఏళ్ల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) ఎంఈఎల్తో కుదుర్చుకున్నట్లు అదానీ పవర్ వెల్లడించింది. మొత్తం 2,800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఎంఈఎల్ ప్లాంటులో 600 మెగావాట్ల యూనిట్ను సొంత అవసరాల పద్ధతిలో తెరతీయనున్నట్లు వివరించింది. -
అచ్చం అనంత్ మామలాగే..క్యూట్ కృష్ణ ఫోటో వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ. రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా ఇషా, 2018 డిసెంబరులో వ్యాపారవేత్త ఆనంద్ పిరమల్ను వివాహం చేసుకుంది. ఇషా, ఆనంద్ జంటకు కవలలు - కృష్ణ (కుమారుడు) ఆదియా (కుమార్తె) జన్మించారు. అటు తల్లిగా, ఇటు వ్యాపార నిర్వహణలోనూ అంబానీ వారసురాలిగా తన సత్తా చాటుకుంటోంది. ఇటీవల ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో తన ట్విన్స్తో సందడిగా కనిపించింది ఇషా. ఇషాతో ట్విన్స్ ఫోటోలో సోషల్ మీడియాలో తెగ షేర్ అయ్యాయి. ముఖ్యంగా ఇషా కుమారుడు కృష్ణ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాడు. ఈ ఫోటోలు అచ్చం మేనమామ అనంత్ అంబానీలా ఉండటం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. బ్లాక్ సూట్లో రాయల్ లుక్లో చిరునవ్వుల చిందిస్తున్న ఇషా కుమారుడు కృష్ణ, తమ్ముడు అనంత్ కార్బన్ కాపీలా ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. " అచ్చం అనంత్ అంబానీ లాగానే ఉన్నాడు అని ఒకరు, "అనంత్ మాము జైసా లగ్తా హై" అని మరొకరు వ్యాఖ్యానించారు. అంతేకాదుఆ చిన్నారి ధీరూభాయ్ అంబానీలా ఉన్నాడని మరికొందరు కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ మామ, అల్లుళ్ల పోలికల ఫోటో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
అబ్బురపరిచిన ‘అనంత’ భావోద్వేగం
కళ్లు చెదిరే ఐశ్వర్యం, దేన్నయినా క్షణాల్లో సాధించగల అధికారం, కుటుంబ విలువల పట్ల అచంచల విశ్వాసం, భగవంతుడిపై అంతులేని భక్తి... ఇవన్నీ ఒకే కుటుంబంలో కలగలిసి వుండటం ఊహాతీతం. కానీ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ‘అంబానీ పరివార్’ వీటన్నిటి సమ్మేళనం అని మరోసారి రుజువైంది. గుజరాత్లోని జామ్నగర్లో మూడు రోజులపాటు ఈమధ్య జరిగిన ప్రీ వెడ్డింగ్ సంబరాలు దేశంలోనే ఎప్పుడూ కనీవినీ ఎరుగనివి. కానీ వీటన్నిటి కంటే అందరికీ ఆసక్తి కలిగించింది మరొకటుంది. అది జూలైలో పెళ్లికొడుకు కాబోతున్న అనంత్ అంబానీ చేసిన ప్రసంగం! చిన్ననాటి స్నేహితురాలూ, ప్రియురాలూ అయిన రాధికా మర్చంట్తో ఆయనకు వివాహం అవుతున్న సందర్భంగా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. వర్తమాన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న వివిధ రంగాల ప్రముఖులు, కార్పొరేట్ కుబేరులు, బాలీవుడ్ అగ్రతారలు, క్రికెటర్లు సకుటుంబ సమేతంగా వచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా హాజరయ్యారు. అనంత్ అంబానీ చేసిన ప్రసంగం అందరి మనసులనూ మెలిపెట్టింది. కుమారుడి ప్రసంగం వింటూ ముఖేష్ దంపతులైతే కంటతడి పెట్టారు. 2003లో కరణ్ థాపర్ ‘బీబీసీ’ కోసం ముఖేష్–నీతా దంపతులను ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా నీతాను ‘మీ దృష్టిలో డబ్బంటే ఏమిటి?’ అని అడిగినప్పుడు ‘డబ్బు దానికదే అంతిమ లక్ష్యం కాదు... దాన్ని ఎలా వినియోగిస్తామన్నదే ముఖ్యం’ అని చెబుతూ ఒక మాటన్నారు. ‘డబ్బు సంపాదన, సంపద జీవితం కానే కాదు... కొన్ని అపురూప చిరస్మరణీయ జ్ఞాపకాలను నిర్మించుకోవటమే జీవితం’ అని చెప్పారు. అనంత్ హృదయాంతరాళాల్లోంచి పెల్లుబికి వచ్చిన మాటల వెనక ఆ విలువల జీవశక్తి నిండివుందనీ, ఆ దంపతుల పెంపకం అతణ్ణి తీర్చిదిద్దిందనీ అనిపిస్తుంది. ఏమన్నారూ అనంత్? తన కుటుంబసభ్యులంతా తన కోసం, తన సుఖ సంతోషాల కోసం పడుతున్న శ్రమను వివరించారు. తనకున్న ప్రత్యేక అనారోగ్య సమస్యల నేపథ్యంలో అమ్మానాన్నలిద్దరూ అనుక్షణమూ తనను అపురూపంగా చూసుకున్న వైనాన్ని కళ్లకు కట్టారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత విలక్షణంగా ఉండాలన్న తపనతో గత కొన్ని నెలలుగా రోజుకు కనీసం 20 గంటలు తన కుటుంబసభ్యులంతా పడిన కఠోర శ్రమను గుర్తుకు చేసుకున్నారు. అందరూ అనుకుంటున్నట్టు తన జీవితం పూలపాన్పు కాదనీ, చిన్ననాటినుంచీ భరించలేని బాధల ముళ్లు వేధిస్తూనే ఉన్నాయనీ చెప్పారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడే క్రమంలో వాడక తప్పని స్టెరాయిడ్స్ చివరకు ఊబకాయానికి కారణమైన తీరును తెలిపారు. సాధారణంగా 25–30 ఏళ్ల మధ్యనుండే సంపన్న కుటుంబాల యువతలో చాలా సందర్భాల్లో విచ్చలవిడితనం, బాధ్యతారాహిత్యం కనబడుతూ ఉంటుంది. ఇంగ్లిష్ తప్ప ఏదీ మాట్లాడలేరు. ఈ వేడుకల సందర్భంగా ‘న్యూస్18’కు ఇచ్చిన ఇంటర్వ్యూ అనంత్లోని మానవీయతను వెల్లడిస్తుంది. నిలువెల్లా వినమ్రత, పలికే ప్రతి మాటలో నిజాయితీ అతని సొంతం. ఇంగ్లిష్లో కాదు... అందరికీ అర్థమయ్యేలా స్వచ్ఛమైన హిందీలో భావ వ్యక్తీకరణ అనంత్ ప్రత్యేకత. గాయపడిన, ఆదరణ కోల్పోయిన వన్యప్రాణులను అక్కున చేర్చుకుని వాటి సంరక్షణ కోసం జామ్నగర్లో మూడువేల ఎకరాల్లో ‘స్టార్ ఆఫ్ ద ఫారెస్ట్ వన్తార’ అనే ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. చిన్ననాడు తన నాయనమ్మ కోకిలా బెన్ నేర్పిన ప్రేమ, దయ భావనలే ఈ ప్రాజెక్టుకు తనను పురిగొల్పాయని చెప్పారు. తన ఆధ్వర్యంలోనే గుజరాత్ ప్రభుత్వ సహకారంతో ఒక ‘జూ’ కూడా నిర్వహిస్తున్నారు. ‘ఇండియా టుడే’ ఛానెల్లో వచ్చిన ఇంటర్వ్యూ ఆయనలోని మరో మనిషిని ఆవిష్కరించింది. ఆ యువకుడిలో దాగున్న ఆధ్యాత్మిక భావనలూ, మాతృదేశంపై ఉన్న చెక్కుచెదరని మమకారాన్నీ ఆ ఇంటర్వ్యూ వెలికితీసింది. పెళ్లి వేడుకలు మన దేశంలోనే జరుపుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపే స్ఫూర్తిగా అందుకోసం జామ్నగర్ను ఎంచుకున్నానని చెప్పారు. తన ఇంటిల్లిపాదికీ సనాతన ధర్మంపై ఉన్న భక్తి విశ్వాసాలనూ, వాటికి అనుగుణంగా ఆచరిస్తున్న విలువలనూ వివరించారు. ఆసియా ఖండంలోని సంపన్నవంతుల్లో మొట్టమొదటి స్థానంలో, ప్రపంచ కుబేరుల జాబితాలో పదో స్థానంలో ఉన్న కుటుంబంలో ఒక 28 ఏళ్ల కుర్రాడు ఇంత పరిణతితో, ఆధ్యాత్మిక విలువలతో మాట్లాడతాడని బహుశా ఎవరూ అనుకుని ఉండరు. ‘లైసెన్స్ రాజ్’గా పేరుబడిన ఆర్థిక సంస్కరణల పూర్వ దశలో అనంత్ తాత ధీరూభాయ్ అంబానీ తనదైన రీతిలో పావులు కదుపుతూ, ఒక్కొక్క మెట్టే అధిరోహిస్తూ తన విశాల కుటుంబ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్లారు. ఆయన వారసత్వాన్ని ముఖేష్ అప్రతిహతంగా కొనసాగిస్తూ దాన్ని మరింత పెంచుతున్న వైనమూ కళ్లముందే ఉంది. అందుకే ఇవాళ దేశంలో రిలయన్స్ స్పృశించని రంగమంటూ లేదు. ఆ కుటుంబ విలువలు సైతం అందరి హృదయాలనూ తాకుతాయని ప్రీ వెడ్డింగ్ వేడుకలు తెలియజెప్పాయి. బి.టి. గోవిందరెడ్డి వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్టు -
అంబానీ అదిరిపోయే స్కెచ్..!
-
Nita Ambani 1st Salary: ‘నన్ను చూసి ఎగతాళిగా నవ్వేవారు’
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ టీచర్గా, వ్యాపారవేత్తగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానిగా, నృత్యకారిణిగా, సేవకురాలిగా..ఇలా తన లైఫ్లో ఎన్నో పాత్రలు పోషించారు. జీవితంలో ఎదిగేందుకు చాలాకష్టపడినట్లు ఐకానిక్ టాక్ షో విత్ సిమి గరేవాల్ ఎపిసోడ్లో వెల్లడించారు. ఈమేరకు అప్పటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ వీడియోలో నీతా అంబానీ నర్సరీ స్కూల్లో టీచర్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్ ముఖేష్ అంబానీతో 1985లో వివాహం జరగడానికంటే ఏడాది ముందు నుంచే ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేయడం ప్రారంభించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఇషా అంబానీ ప్రయత్నం ఫలిస్తుందా..? ముఖేష్ అంబానీని పెళ్లాడిన తర్వాత కూడా సన్ఫ్లవర్ నర్సరీ స్కూల్లో టీచర్గా కొనసాగినట్లు తెలిపారు. అప్పుడు తన వేతనం నెలకు రూ.800 ఉండేదని నీతా అంబానీ గత జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆ సమయంలో తనను చూసి చాలా మంది ఎగతాలిగా నవ్వేవారని చెప్పారు. కానీ ఉద్యోగం తనకు సంతృప్తిని ఇచ్చినట్లు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Elite Learning Minds (@elite_learning_minds) -
అనంత్ అంబానీ బరువుపై అసభ్యకరమైన కామెంట్లు చేసిన హీరోయిన్
భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్ వేదికగా మార్చి 1-3 వరకు ఘనంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలను ‘హస్తాక్షర్ ’ కార్యక్రమంతో ముగించారు. దేశ, విదేశాల్లో పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో అంబానీ ఫంక్షన్పై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ స్పందించింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు తనను ఎందుకు పిలవలేదని ఆమె ప్రశ్నించింది. ఒకవేళ తనను పిలిచి ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయడం నుంచి వంట పాత్రలు కడగడం వరకు తానే స్వయంగా చేసేదానినంటూ ఆమె ఇలా పేర్కొంది. 'అంబానీ జీ నమస్తే. నన్ను పెళ్లికి ఎందుకు పిలవలేదు? మీరు ఇంకా నా డ్యాన్స్ చూడలేదనుకుంటా.. మీరు సింగర్ రిహానాతో పాటుగా ఖాన్, ఐఖాన్ అంటూ ఎందరినో పిలిచారు. మీ వేడకలో వారు చేసిన డ్యాన్స్ నా ముందు జుజూబీ.. మీరు నా డాన్స్ చూశారా? మున్నీ బద్నామ్ హుయ్ డార్లింగ్ తేరే లియే, తుక్ తుక్ దేఖే, పరదేశియా ఇలా చాలా పాటలు చేశాను. అవన్నీ మీరు చూడలేదు అనుకుంటా. మీరు కోట్లకు కోట్లు డబ్బు ఇచ్చినా రిహానా చిరిగిన బట్టలతో వచ్చింది. నాకు రూ. 10 కోట్లు ఇచ్చి వుంటే మీకు ఎన్నో ప్రయోజనాలు కలిగేవి. మీ అతిథులందరి గదులు శుభ్రం చేయడం నుంచి వంట పాత్రలు కడిగే వరకు అన్నీ నేనే చేసేదాన్ని. అంటూ కామెంట్ చేసింది. అనంత్ బరువుపై కామెంట్లు అనంత్ అంబానీ బరువుపై రాఖీ సావంత్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. ' డియర్ అంబానీ జీ.. అనంత్ అంబానీ బాగా బరువు పెరిగారు.. ఆయన్ను నా వద్దకు 5రోజుల పాటు పంపించండి. కట్టెపుల్లలా సన్నగా చేసి పంపుతాను. దీని కోసమైన కొంత డబ్బు ఇచ్చి నన్ను కొనుక్కోండి. ఆయనతో కసరత్తులు చేయించడమే కాకుండా.. తృప్తి చేసి పంపిస్తాను. అనంత అంబానీని జీరో సైజ్కు చేర్చి మీ వద్ద ఉంచే బాధ్యత నాది. ఆయన బరువు తగ్గితే మీతో పాటుగా మీ కోడలు కూడా చాలా సంతోషిస్తుంది. అసలే మీ కోడలు దానిమ్మ పండులా ఉంది. ఆయన సన్నగా అయితే ఆమెకే మంచిది.' అని అనంత్ అంబానీ బరువుపై రాఖీ సావంత్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. దీంతో రాఖీ సావంత్ తీరుపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బరువు పెరిగినట్లు స్వయంగా ఆయన చెబుతూ ప్రీవెడ్డింగ్ వేడుకలోనే ఎమోషనల్ అయ్యాడు. అలాంటి వ్యక్తి గురించి ఇలా వల్గర్గా మాట్లాడడానికి సిగ్గులేదా అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆయన అమ్మగారు అయిన నీతా అంబానీ కూడా అనంత్ ఆరోగ్య సమస్యల గురించి గతంలో వివరించారు. అనారోగ్య కారణాలతో కొన్ని రకాల స్టెరాయిడ్స్ వాడటం వల్ల అనంత్ బరువు పెరిగాడని ఆమె చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by TellyMasala (@tellymasala) -
అనామకుడిలా అనిల్ అంబానీ
-
ముఖేష్ అంబానీ ‘లడ్డూ రివర్స్’ వీడియో వైరల్, అసలు నిజం ఇది!
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. ముఖేష్ అంబానీ, నీతాల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈ నెల( మార్చి) 1, 2,3 తేదీల్లో ఘనంగా జరిగాయి. గుజరాత్లోని జామ్ నగర్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల ప్రారంభంలో వేల మందికి అన్న దానం చేశారు. "ఖానా కమ్ పడ్ గయా హై.తూ థోడా అడ్జస్ట్ కర్ లేనా (ఫుడ్ తక్కువైంది.. కొంచెం సర్దుకు పోండి) అనే పేరుతో పోస్ట్ అయిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అంబానీ ఎందుకు అలా చేస్తారు. అని ఆశ్చర్యపోతున్నారా? అసలు నిజం ఇది..! దీనికి సంబంధించి అసలు వీడియోను రివర్స్గా రూపొందించిన ఫేక్ వీడియో ఇది. JIO, after some years of free internet pic.twitter.com/VlFPKrsq6g — Tweeting Quarantino (@rohitadhikari92) March 5, 2024 కమ్యూనిటీ విందులో విస్తర్లలో వడ్డించిన తరువాత, భోజనాలకు కూర్చున్న వారి నుంచి లడ్డూలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా వీడియో ట్విటర్లో తెగ షేర్ అవుతోంది. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో ఇదీ సంగతి అంటూ కొంతమంది ఈ వీడియోపై కమెంట్ చేశారు. అయితే ఇది రివర్స్ వీడియో అంటూ అసలు సంగతి చెప్పారు కొంతమంది. మరి కొంతమంది యూజర్స్ జియో..ఉచితంగా డేటా అలవాటు చేసిన కొన్నాళ్ల తరువాత పరిస్థితి ఇదీ అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. ఇదీ అసలు వీడియో.. In run up to marriage ceremony of Anant Ambani, community feast are being organized in villages around the Jamnagar refinery. Today, in Jogvad village, Billionaire #MukeshAmbani himself seen offering food to the guests in a community feast. pic.twitter.com/0Nb7dWMdVM — Kumar Manish (@kumarmanish9) February 28, 2024 కాగా అనంత్ అంబానీ తన లేడీ లవ్ రాధికా మర్చంట్తో ఈ ఏడాదిలో ఏడడుగులు వేసుందుకు రడీ అవుతున్నాడు. గత ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ లవ్బర్డ్స్ ఈ నెలలో అంగరంగ వైభవంగా ప్రీ- వెడ్డింగ్ బాష్ నిర్వహించారు. బాలీవుడ్సెలబ్రిటీలు, క్రీడారంగ ప్రముఖులతోపాటు బిల్గేట్స్, మార్క్ జుకర్ బర్గ్ సహా పలువురు ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు ఈ వేడుకల్లో విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే. -
అత్తకు తగ్గ కోడలు.. నాట్యంలో దిట్ట.. రాధిక గురించి ఆసక్తికర విషయాలు..
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల గురించి ప్రస్తుతం దేశంఅంతా చర్చ జరుగుతోంది. విదేశాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, బాలీవుడ్ తారలు ప్రివెడ్డింగ్ ఈవెంట్లో సందడి చేశారు. ఆటపాటలతో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుక అందిరికీ గుర్తుండిపోయేలే జరిగింది. ముందస్తు పెళ్లి వేడుకలే ఈ రేంజ్లో ఉంటే ఇక పెళ్లి ఏరేంజ్లో ఉంటుందోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడిగా అనంత్ అంబానీ గురించి దాదాపు చాలామందికే తెలుసు. పనిలోపనిగా అంబానీల ఇంటికొస్తున్న చిన్న కోడలెవరోనని చాలామంది ఆరాతీస్తున్నారు. ఇషా అంబానీ-ఆనంద్ పిరమల్ల వివాహం 2018లోనే జరిగింది. ఆ సమయంలోనే రాధిక మర్చంట్ పేరు వినిపించింది. 2019లో ఆకాశ్-శ్లోకల పెళ్లి సమయంలో రాధిక అంబానీ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం, ప్రతీ వేడుకలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం, సంగీత్ వేడుకలో అనంత్కు జంటగా డ్యాన్స్ చేయడంతో నీతా అంబానీకి కాబోయే చిన్న కోడలంటూ ప్రచారం ఊపందుకుంది. Emotional moment of Radhikaa merchant 😍❤️#RadhikaMerchant #AnantAmbani #MukeshAmbani #AnantRadhikaWedding #NitaAmbani #AmbaniWedding #AmbaniFamily pic.twitter.com/3IB5Gxmmeg — jayaa (@Jayaa2012) March 4, 2024 ఎన్కోర్ హెల్త్కేర్ సంస్థ సీఈఓ వీరెన్ మర్చంట్-శైలజా మర్చంట్ల కుమార్తె రాధిక. తండ్రి వీరెన్ మర్చంట్ హెల్త్కేర్ సీఈఓగా, వైస్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. రాధిక న్యూయార్క్ యూనివర్సిటీలో పాలిటిక్స్, ఎకనామిక్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేశాక ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా కొన్నాళ్లు పనిచేశారు. ఎన్కోర్ హెల్త్కేర్ సంస్థలో డైరెక్టర్గానూ వ్యవహరిస్తున్నారు. #RadhikaMerchant dance like Afsara 😍#MukeshAmbani family truly culture centric pic.twitter.com/bNbLSwWiya — SATYA (@Vindhyaputra) February 29, 2024 రాధికకు శాస్త్రీయ నృత్యం అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టం. ఆ మక్కువతోనే ప్రముఖ డ్యాన్సర్ భావనా థాకర్ వద్ద భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో 2022లో ముకేశ్-నీతా అంబానీలు రాధికకు అరంగేట్రం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముకేశ్ భార్య నీతా అంబానీ కూడా క్లాసికల్ డ్యాన్సర్. దీంతో అత్తకు తగ్గ కోడలు అని అందరూ ప్రశంసించారు. #AmbaniPreWedding Sangeet dance of bride and groom #AmbaniWedding pic.twitter.com/iQHtyi1U9p — ✨ HeroesDontExist! (@humaneGPT) March 3, 2024 -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రాధికా మర్చంట్ గురించి ఈ విషయాలు తెలుసా..?
-
సంప్రదాయ నృత్యంతో కోడలికి ఆహ్వానం పలికిన నీతా అంబానీ.. వీడియో వైరల్
అనంత్ అంబానీ-రాధికామర్చంట్ వివాహ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రివెడ్డింగ్ సంబరాలు ఆదివారంతో ముగిశాయి. ముకేశ్ అంబానీ – నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. రాధికా మర్చంట్ను అనంత్ ఈ ఏడాది జులైలో వివాహం చేసుకోబోతున్నారు. దీంతో అంబానీ కుటుంబం ముందస్తు పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించింది. గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్లో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిపారు. ఈ ప్రీ వెడ్డింగ్ సంబరాలకు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రపంచంలోని బిలియనీర్స్ తరలివచ్చారు. ఇక ఈ వేడుకల్లో నీతా అంబానీ తన సంప్రదాయ నృత్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇదీ చదవండి: రొమాంటిక్ సాంగ్.. ముఖేశ్-నీతాల డ్యాన్స్ చూశారా? అంబానీ ఇంట్లో ఏ వేడుకైనా నీతా అంబానీ ప్రత్యేకంగా నిలుస్తారు. రాధిక మర్చంట్ను అంబానీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ.. విశ్వంభరి దేవీ స్తోత్రంపై నృత్యం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. #WATCH | Founder and chairperson of Reliance Foundation Nita Ambani performed at Anant Ambani-Radhika Merchant's pre-wedding celebrations in Jamnagar, Gujarat. pic.twitter.com/7XvDzbr7Qa — ANI (@ANI) March 3, 2024 -
అనంత్-రాధిక : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ధర ఎంతో తెలుసా?
వ్యాపారవేత్త, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు. స్వయంగా డ్యాన్సర్ అయిన ఆమె అంబానీ కుటుంబవేడుకల్లో తన డ్యాన్స్ పెర్ఫామెన్స్తో అందరినీ మెస్మరైజ్ చేయడం ఆమెకు అలవాటు. తాజాగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్లో తన నాట్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతేకాదు నీతా లుక్స్, ఫ్యాషన్తో అతిథులను సర్ప్రైజ్ చేశారు. ముఖ్యంగా నీతా ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. నీతా కాంచీపురం చీరలో హుందాగా కనిపించారు. రిలయన్స్ లగ్జరీ రిటైల్ బ్రాండ్ స్వదేశ్ సహకారంతో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీర అద్భుతంగా ఆమెకు అమరింది. బోర్డర్పై క్లాసిక్ ట్రెడిషనల్ జర్దోసీ వర్క్, బ్లౌజ్ స్లీవ్లపై ప్రత్యేకమైన గోటా వర్క్, చక్కటి మేకప్తో తన ఐకానిక్ సిగ్నేచర్ స్టయిలో మెరిసిపోయారు. కాంచీపురం చీరకు జతగా, కోట్ల విలువైన పచ్చలు పొదిగిన డైమండ్ నెక్లెస్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అందానికి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. పచ్చలు పొదిగిన, పొడవాటి నెక్లెస్లో ఆమె లుక్తో అతిథులు చూపు తిప్పుకోలేక పోయారంటే అతిశయోక్తి కాదు. దీనికి సరిపోయేలా చెవిపోగులు, బ్యాంగిల్స్ , వేలి రింగ్ ఆకట్టుకున్నాయి. పలు నివేదికల ప్రకారం ఈ పచ్చల హారం ధర దాదాపు రూ. 400-500 కోట్టు ఉంటుందని అంచనా. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కాక్టెయిల్ నైట్ ఈవెంట్లో వైన్ కలర్ కస్టమ్-మేడ్ గౌను, క్లాసిక్ ఫ్రెంచ్ ట్విస్ట్ బన్లో ఆమె లుక్ నీతా స్టయిలింగ్ను ప్రతిబింబించింది. -
సందడి సందడిగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ (ఫొటోలు)
-
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ మెరిసిపోతున్న ఇషా అంబానీ (ఫొటోలు)
-
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సెలబ్రెటీల స్పెషల్ ఫొటోలు..
-
నా జీవితం పూలపాన్పు కాదు
జామ్నగర్: అక్షరాలా ఆకాశమంత పందరి. అంగరంగ వైభవంగా జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ వేడుక. ఆహూతులుగా ప్రపంచ స్థాయి సినీ, వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలు. అంతటా ఆనందం వెల్లివిరుస్తున్న వేళ. పెళ్లికొడుకు కాబోతున్న తన చిన్న కుమారుడు అనంత్ మాట్లాడిన మాటలు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని కంటతడి పెట్టించాయి. గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటైన సువిశాలమైన ప్రాంగణం ఇందుకు వేదికైంది. మూడు రోజుల వేడుకల్లో తొలి రోజు శుక్రవారం అనంత్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచీ తనను వేధిస్తూ వస్తున్న ఆరోగ్య సమస్యలను ప్రస్తావించారు. ‘‘అంతా అనుకుంటున్నట్టు నా జీవితం పూలపాన్పేమీ కాదు. భరించలేని బాధల వాడిముళ్లు చిన్ననాటి నుంచీ విపరీతంగా వేధించాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఆరోగ్య సమస్యలు! కానీ అన్ని బాధలను అధిగమిస్తూ వచ్చానంటే మా అమ్మానాన్నే కారణం! నన్నెంతో అపురూపంగా చూసుకున్నారు. నిరంతరం నా వెన్నంటి నిలిచారు. నా జీవితంలో వారి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పెళ్లి వేడుకను నాకు అత్యంత స్పెషల్గా మలచేందుకు వాళ్లు, నా కుటుంబ సభ్యులు ఎంతగా కష్టపడ్డారో నాకు మాత్రమే తెలుసు. వాళ్లెవరూ కొద్ది నెలలుగా రోజుకు 3 గంటల కంటే నిద్రే పోలేదు. వేడుకలను ఇంత గొప్పగా తీర్చిదిద్ది నన్ను సంతోషపెట్టేందుకు రోజుకు కనీసం 20 గంటల పాటు కఠోరంగా శ్రమిస్తూ వచ్చారు’’ అంటూ ఆద్యంతం ఎమోషనల్గా మాట్లాడారు. అనంత్ మాటలను ఆహూతులతో పాటు ఆసాంతం వింటూ, ఆ క్రమంలో ముప్పిరిగొన్న రకరకాల భావోద్వేగాల నడుమ ముకేశ్, నీతా అంబానీ దంపతులు తడి నిండిన కళ్లతో కుమారున్ని ఆప్యాయంగా చూసుకుంటూ ఉండిపోయారు. దాంతో అందరి మనసులూ భారమయ్యాయి. దిగ్గజాల సందడి అనంత్, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచీ ప్రముఖులంతా తరలివచ్చారు. పారిశ్రామిక, సినీ, క్రికెట్ దిగ్గజాలంతా వేడుకల్లో పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, పారిశ్రామిక దిగ్గజాలు గౌతం అదానీ, కుమార మంగళం బిర్లా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, సల్మాన్ఖాన్, దీపికా పడుకొణె, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీతో పాటు పలు దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు కూడా వీరిలో ఉన్నారు. 1,000 మందికి పైగా వీఐపీలు పాల్గొన్న ఈ వేడుకల్లో ప్రముఖ పాప్ సింగర్ రిహానా ప్రధానాకర్షణగా నిలిచారు. డైమండ్స్, రూడ్బోయ్, పోరిటప్ వంటి తన ఆల్టైం హిట్ నంబర్స్కు ఆడి పాడి ఆహూతులను ఉర్రూతలూగించారు. ప్రఖ్యాత బాలీవుడ్ గాయకుడు అరిజిత్సింగ్ తదితరులు ఆహూతులను తమ గానంతో అలరించారు. -
కొడుకు స్పీచ్.. ముఖేష్ అంబానీ కన్నీళ్లు! వీడియో వైరల్
Mukesh Ambani tears video : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహం త్వరలో జరుగనుంది. వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ గ్రాండ్ ఈవెంట్కి విచ్చేశారు. ఈ సందర్భంగా కొడుకు మాటలకు ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అనేక మంది అతిథుల సమక్షంలో పెళ్లికొడుకు అనంత్ అంబానీ ప్రసంగించారు. తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు ముఖేష్ అంబానీ భావోద్యేగానికి గురయ్యారు. కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. అనంత్ అంబానీ చేసిన భావోద్వేగ ప్రసంగంలో ముఖ్యంగా తాను అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడు తన తల్లిదండ్రులు అందించిన సపోర్ట్ గురించి అనంత్ అంబానీ చెబుతుండగా ముఖేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ మారింది. థాంక్యూ అమ్మా.. నాన్న "ఇదంతా అమ్మ చేసిందే.. ఆమె నా కోసం చాలా కష్టపడింది. గత నాలుగు నెలలుగా ఆమె రోజుకు 18-19 గంటలు నా కోసం కష్టపడ్డారు. నేను అమ్మకు చాలా కృతజ్ఞుడను . అమ్మా, మీరు చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు" అని అనంత్ అంబానీ ప్రసంగంలో పేర్కొన్నారు. "మా నాన్న, అమ్మ ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచారు. నేను ఏదైనా సాధించగలను అనే ఆత్మ విశ్వాసాన్ని నాకు కలిగించారు. మా నాన్న, అమ్మ నన్ను ఎంతగా అర్థం చేసుకున్నారో.. నేను వారికి ఎప్పటికీ కృతజ్ఞుడను" అని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. నా కొడుకులోనే చూసుకుంటున్నా కాగా అంతకుముందు వేడుకలకు విచ్చేసిన ప్రముఖ వ్యాపారవేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, చలనచిత్ర ప్రముఖులు, ఇతర అతిథులందరినీ ఉద్దేశిస్తూ ముఖేష్ అంబానీ ప్రసంగించారు. కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబ అనుబంధం గురించి ప్రస్తావించారు. తన చిన్న కొడుకు అనంత్ అంబానీలోనే చనిపోయిన తన తండ్రి ధీరూభాయ్ అంబానీని చూసుకుంటున్నట్లు వెల్లడించారు. -
రొమాంటిక్ సాంగ్.. ముఖేశ్-నీతాల డ్యాన్స్ చూశారా?
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇప్పటికే అంగరంగ వైభవంగా మొదలైపోయాయి. ప్రపంచం నాలు మూలాల నుంచి పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతో జామ్నగర్ మొత్తం సందడిగా మారింది. ఈ వేడుకల్లో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ డ్యాన్స్ వేయనున్న.. దానికోసం వారు రీహార్సిల్స్ చేస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెట్టింట్లో వైర్ల అవుతున్న వీడియోలో 'ప్యార్ హువా ఇక్రార్ హువా హై' అనే పాటకు లిప్ సింక్ చేస్తూ.. ట్రెడిషినల్ దుస్తుల్లో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ చాలా అద్భుతంగా డ్యాన్స్ వేయడం చూడవచ్చు. కాగా అనంత్, రాధికల పెళ్లి జులై 2024లో జరుగుతుందని ఇప్పటికే వెల్లడించారు. గుజరాత్లోని జామ్నగర్లో మొదలైన 'అనంత్, రాధిక' ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు 1000 మంది సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్టార్ క్రికెటర్స్, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వీరి కోసం ఇప్పటికే ప్రత్యేక వసతులను ఏర్పాటు చేశారు. అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు 120 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 1000 కోట్లు) ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రీవెడ్డింగ్గా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఆయన ఆస్తిలో అది కేవలం 0.1శాతం మాత్రమే అని పలువురు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Isha Ambani Piramal (@_ishaambanipiramal)
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అసోం కాంగ్రెస్ ‘ఎక్స్’ అకౌంట్లో టెస్లా లోగో.. ఏం జరిగిందంటే..
విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం
గాలివాన బీభత్సం
గట్టుమీది గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారం
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు న్యాయం
బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయం
ఊరూరా ఉపాధి జాతర
న్యాయవాదుల సంక్షేమానికి కృషి
బీజేపీ,కాంగ్రెస్లకు బుద్ధి చెప్పాలి
హామీలను నెరవేర్చని ఎంపీ అర్వింద్
తప్పక చదవండి
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement