Reliance AGM 2024: రిలయన్స్‌ బొనాంజా | Reliance AGM 2024: RIL has given bonus shares 5 times | Sakshi
Sakshi News home page

Reliance AGM 2024: రిలయన్స్‌ బొనాంజా

Published Fri, Aug 30 2024 1:59 AM | Last Updated on Fri, Aug 30 2024 1:59 AM

Reliance AGM 2024: RIL has given bonus shares 5 times

1:1లో షేర్ల జారీపై సెపె్టంబర్‌ 5న బోర్డు నిర్ణయం 

త్వరలో గ్లోబల్‌ టాప్‌–30లో కంపెనీకి చోటు 

జియో యూజర్లకు భారీగా ఉచిత క్లౌడ్‌ స్టోరేజీ 

5–7 ఏళ్లలో ఓ2సీ స్థాయికి న్యూ ఎనర్జీ బిజినెస్‌ 

కంపెనీ 47వ ఏజీఎంలో చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 47వ సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం)లో చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వాటాదారులకు బోనస్‌ షేర్లను ప్రకటించారు.  సమీప భవిష్యత్‌లో టాప్‌–30 గ్లోబల్‌ దిగ్గజాల్లో ఒకటి గా కంపెనీని తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు టెక్నా లజీ విస్తృత వినియోగం, ఆధునిక తయారీ విధానాలు దన్నుగా నిలుస్తాయని చెప్పారు.  

ముంబై: ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఆర్‌ఐఎల్‌ విస్తృత స్థాయి టెక్నాలజీ కంపెనీగా మారు తోందని  ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. అన్ని వ్యాపా రాల్లోనూ ఏఐ సంబంధ డిజిటల్‌ ఇన్‌ఫ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తద్వారా కంపెనీ అత్యంత వృద్ధి పథంలో సాగనున్నట్లు చెప్పారు. వెరసి రానున్న కాలంలో కంపెనీ విలువ భారీగా మెరుగుపడనున్నట్లు వివరించారు. ఏజీఎంలో వాటాదారులను ఉద్దేశించి పలు అంశాలను ప్రస్తావించారు.

 వీటి ప్రకారం ఆర్‌ఐఎల్‌ గతేడాది ఆర్‌అండ్‌డీపై రూ. 3,643 కోట్లు వెచ్చించింది. గత ఐదేళ్లలో రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను జారీ చేయనుంది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ షేరుకీ మరో షేరుని ఉచితంగా(బోనస్‌) అందించనుంది. ఈ అంశాన్ని సెప్టెంబర్‌ 5న సమావేశంకానున్న డైరెక్టర్ల బోర్డు పరిశీలించనుంది. కంపెనీ ఇంతక్రితం 2017 సెప్టెంబర్, 2009 నవంబర్‌లోనూ 1:1 ప్రాతిపదికన బోనస్‌ షేర్లను జారీ చేసింది.  

రిటైల్‌ జోరు..: గతేడాది రిలయన్స్‌ రిటైల్‌ తొలిసారి రూ. 3 లక్షల కోట్ల టర్నోవర్‌ మైలురాయిని దాటింది. రానున్న 3–4ఏళ్లలో బిజినెస్‌ను రెట్టింపు చేసే లక్ష్యంతో ఉన్నట్లు ఆర్‌ఐఎల్‌ డైరెక్టర్‌ ఇషా అంబానీ పేర్కొన్నారు. మూడు ప్రయివేట్‌ లేబుళ్లు రూ. 2,000 కోట్ల వార్షిక అమ్మకాలను అందుకున్నాయి. లగ్జరీ జ్యువెలరీ విభాగంలోకి కంపెనీ ప్రవేశించనుంది. దేశవ్యాప్తంగా 18,836 స్టోర్లను నిర్వహిస్తోంది. దీంతో స్టోర్లరీత్యా టాప్‌–5 గ్లోబల్‌ రిటైలర్‌గా నిలుస్తోంది. ఆన్‌లైన్‌ గ్రోసరీ డెలివరీ సరీ్వసుల మిల్క్‌బాస్కెట్‌ను కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. కళానికేతన్, జివామే, క్లోవియా, అర్బన్‌ ల్యాడర్‌లలో పెట్టుబడులు ఫ్యాషన్‌ విభాగంలో పట్టుసాధించేందుకు దోహదం చేస్తున్నాయి.  

జియో.. బంపర్‌ ఆఫర్‌: 100జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ ఫ్రీ
రానున్న దీపావళి కానుకగా రిలయన్స్‌ జియో యూజర్లకు ఉచితంగా 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజీని అందించనుంది. తద్వారా ఫొటోలు, వీడియోలు ఇతర డిజిటల్‌ ఫైళ్లను భద్రంగా దాచుకునేందుకు వీలుంటుంది. వచ్చే 3–5 ఏళ్లలో రిలయన్స్‌ రిటైల్, జియో, డిజిటల్‌ సర్వీసుల ఆదాయం, నిర్వహణ లాభం (ఇబిటా) రెట్టింపు కానున్నట్లు ముకేశ్‌ అచనా వేశారు. డేటా ఆధారిత ఏఐ సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రీమియం డివైస్‌ల అందుబాటులోఉన్న క్లౌడ్‌ సేవలను లగ్జరీగా కాకుండా చౌకగా అందించనున్నట్లు వెల్లడించారు. టీవీ వినియోగదారులకు హలోజియో పేరుతో వాయిస్‌ అసిస్టెంట్‌ సేవలను ప్రారంభించింది.  

రిలయన్స్‌ డిస్నీ.. వినోదంలో కొత్త శకం 
డిస్నీతో ఒప్పందం దేశీ వినోద రంగంలో సరికొత్త శకానికి దారి చూపనున్నట్లు ముకేశ్‌ పేర్కొన్నారు. జియో, రిటైల్‌ తరహాలో మీడియా బిజినెస్‌ సైతం వృద్ధి బాటలో సాగుతుందని చెప్పారు. డిజిటల్‌ స్ట్రీమింగ్‌తో కంటెంట్‌ సృష్టిని జత చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రీన్‌ ఎనర్జీ ప్రయాణంలో భాగంగా ఈ ఏడాది (2024–25) చివరికల్లా ఆర్‌ఐఎల్‌ తొలి సోలార్‌ గిగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు ముకేశ్‌ వెల్లడించారు. ఈ ప్లాంటు లో ఒకే చోట పీవీ మాడ్యూల్స్, సెల్స్, వేఫర్స్,  పాలీసిలికాన్, గ్లాస్‌ తయారీని చేపట్టనున్నారు. తద్వారా ఈ యూనిట్‌ సౌరశక్తిని విద్యుత్‌గా మార్చనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement