Reliance Industries (RIL)
-
ధీరూభాయ్ అంబానీ సంతకం వృథా కాబోతోంది..
చండీగఢ్కు చెందిన వ్యక్తి ఇల్లు శుభ్రం చేస్తుండగా 37 ఏళ్ల నాటి రూ.12 లక్షల విలువైన రిలయన్స్ షేర్ సర్టిఫికెట్లు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా వ్యక్తికి వీటిని డిజిటలైజేషన్ చేసుకుందామని ప్రయత్నించగా చిక్కులు ఎదురవుతున్నాయి. దీంతో వాటిని అలాగే వదిలేయాలని నిర్ణయానికి వచ్చేశాడు.వివరాల్లోకి వెళ్తే.. చండీగఢ్కు చెందిన రతన్ ధిల్లాన్ వ్యక్తి ఇల్లు శుభ్రం చేస్తుండగా 37 ఏళ్ల నాటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) షేర్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. 1988లో ఒక్కొక్కటి రూ.10 చొప్పున వీటిని కొనుగోలు చేయగా ఈ షేర్లు స్టాక్ స్ప్లిట్స్, బోనస్ ద్వారా 960 రెట్లు పెరిగాయి. దీంతో వీటి ప్రస్తుత విలువ రూ.12 లక్షలకు చేరింది.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న రతన్ ధిల్లాన్ మొదట వాటిని డిజిటలైజ్ చేసుకోవాలో సలహా కోరారు. అయితే చట్టపరమైన వారసుడి సర్టిఫికెట్, వారసత్వ ధృవీకరణ పత్రం, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ) క్లియరెన్స్ అవసరమయ్యే విస్తృతమైన పేపర్ వర్క్ గురించి తెలుసుకున్న తరువాత, ధిల్లాన్ ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.ధీరూభాయ్ అంబానీ సంతకాలు వృథా కాబోతున్నాయని, షేర్ల డిజిటలైజేషన్ చేయకూడదని నిర్ణయించుకున్నానని రతన్ ధిల్లాన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. "ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది- చట్టపరమైన వారసుడి ధృవీకరణ పత్రాన్ని పొందడానికే 6-8 నెలలు పడుతుంది. ఐఈపీఎఫ్ఏ ప్రక్రియకు 2-3 సంవత్సరాలు పడుతుంది. అంత సమయాన్ని వెచ్చించడంలో అర్థం కనిపించడం లేదు. భారత్ తన పేపర్ వర్క్ ను క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉంది" అని పేర్కొన్నారు.ప్రస్తుతానికి ఫిజికల్ షేర్ సర్టిఫికెట్లను ఏమీ చేయకుండా అలాగే వదిలేస్తానని ధిల్లాన్ తెలిపారు. రతన్ ధిల్లాన్ నిర్ణయంపై మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) లో స్పందనలు వెల్లువెత్తాయి. పలువురు యూజర్లు షేర్ సర్టిఫికెట్ల డిజిటలైజేషన్లో తమ అనుభవాలను పేర్కంటూ కామెంట్లు చేశారు.Final Update: It seems Dhirubhai Ambani’s signatures will go to waste, as I’ve decided not to proceed with digitizing the shares. The process is just too lengthy—obtaining the legal heir certificate alone takes 6-8 months, and the IEPFA process reportedly takes 2-3 years. I… https://t.co/sDt1uPKiqL— Rattan Dhillon (@ShivrattanDhil1) March 12, 2025 -
మార్కెట్ ‘కింగ్’ రిలయన్స్
ముంబై: దేశీయంగా అత్యధిక మార్కెట్ వేల్యుయేషన్తో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా నాలుగో ఏడాదీ అగ్రస్థానంలో కొనసాగింది. రూ. 17.5 లక్షల కోట్ల విలువతో బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా టాప్ 500 కంపెనీల లిస్టులో నంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది. అటు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ (టీసీఎస్) రూ. 16.1 లక్షల కోట్ల మార్కెట్ వేల్యుయేషన్తో రెండో స్థానంలో, రూ. 14.22 లక్షల కోట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మూడో స్థానంలో నిల్చాయి.మరోవైపు, ఐపీవోకి సన్నాహాలు చేసుకుంటున్న స్టాక్ ఎక్స్ఛేంజీ ఎన్ఎస్ఈ సంస్థ రూ. 4.7 లక్షల కోట్ల వేల్యుయేషన్తో.. అన్లిస్టెడ్ కంపెనీల విభాగంలో అగ్రస్థానంలో ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయాలు 28 శాతం పెరిగి రూ. 16,352 కోట్లకు, లాభాలు 51 శాతం ఎగిసి రూ. 8,306 కోట్లకు చేరాయి. ఈ విభాగంలో రూ. 77,860 కోట్ల వేల్యుయేషన్తో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా అయిదో స్థానంలో ఉంది. బైటి నుంచి నిధులు సమీకరించకుండా సొంతంగా ఎదిగిన బూట్స్ట్రాప్డ్ సంస్థల లిస్టులో నాలుగో ర్యాంకు దక్కించుకుంది. గ్రూప్లవారీగా చూస్తే టాటా సన్స్ వేల్యుయేషన్ 2024లో 37 శాతం ఎగిసి రూ. 32.27 లక్షల కోట్లకు చేరింది. అదే సమయంలో రిలయన్స్ గ్రూప్ మొత్తం వేల్యుయేషన్ రూ. 19.71 లక్షల కోట్లుగా, అదానీ గ్రూప్ విలువ రూ. 13.40 లక్షల కోట్లుగా ఉంది. తొలిసారిగా లిస్టులోని కంపెనీలన్నీ 1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ ఉన్నవేనని హురున్ చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. దేశవ్యాప్తంగా పరిశ్రమ నిపుణులు, జర్నలిస్టులు, బ్యాంకర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలు, బహిరంగంగా అందుబాటలో ఉన్న గణాంకాల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు వివరించారు. దీనికి డిసెంబర్ 13 కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఇందులో పరిగణనలోకి తీసుకోలేదు. మరిన్ని వివరాలు .. ⇒ టాప్ 500లోకి చోటు దక్కించుకునేందుకు ఈసారి కనిష్ట వేల్యుయేషన్ పరిమితిని 43% అధికంగా రూ. 9,580 కోట్లకు పెంచారు. 2023లో ఇది రూ. 6,700 కోట్లుగా ఉంది. ⇒ లిస్టులోని మొత్తం కంపెనీల విలువ 40 శాతం ఎగిసి 3.8 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ. 324 లక్షల కోట్లు) చేరింది. ఇది దాదాపు 3.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న దేశ జీడీపీ కన్నా అధికం కావడం గమనార్హం. మోతీలాల్ ఓస్వాల్, ఐనాక్స్ విండ్, జెప్టో, డిక్సన్ వంటి సంస్థల వేల్యుయేషన్ అత్యధికంగా పెరిగింది. ⇒ మొత్తం సుమారు రూ. 86 లక్షల కోట్ల పైగా ఆదాయం ఉన్న ఈ 500 కంపెనీలు దాదాపు రూ. 8 లక్షల కోట్ల లాభాలు ఆర్జించగా, రూ. 2.2 లక్షల కోట్ల మొత్తాన్ని పన్నుల కింద చెల్లించాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలపై రూ. 11,000 కోట్లు వెచ్చించాయి. సుమారు 85 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ⇒టాప్ కంపెనీల సంఖ్యాపరంగా చూస్తే రూ. 10.11 లక్షల కోట్ల విలువ చేసే 35 సంస్థలతో హైదరాబాద్ అయిదో స్థానంలో నిలి్చంది. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణ ఏడో ర్యాంకులో ఉంది. -
యాపిల్ను మించిన రిలయన్స్
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయంగా అత్యుత్తమ బ్రాండ్స్ జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది. ఈ విషయంలో యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలను కూడా వెనక్కి నెట్టి, లిస్టులో ఏకైక భారతీయ కంపెనీగా నిల్చింది. సోమవారం విడుదలైన ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024 జాబితాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2023లో 13వ స్థానంలో ఉన్న రిలయన్స్ తాజాగా రెండో స్థానానికి ఎగబాకింది. కొరియన్ బ్రాండ్ శాంసంగ్ ఈ లిస్టులో అగ్రస్థానంలో నిల్చింది. ఇందులో యాపిల్, నైకీ, వాల్ట్ డిస్నీ, నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, టయోటా మొదలైనవి ఉన్నాయి. ఎప్పటికప్పుడు మార్కెట్లో మార్పులను సమర్థంగా ఎదుర్కొంటూ, కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించే వ్యూహాలతో ముందుకెళ్తున్న బ్రాండ్లకు జాబితాలో చోటు దక్కింది. మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా పీడబ్ల్యూసీ టాప్ 100 కంపెనీలను 18 అంశాల ప్రాతిపదికన ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ మదింపు చేస్తుంది. భవిష్యత్తులో విజయం సాధించగలిగే సత్తా ఉన్న బ్రాండ్లకు లిస్టులో చోటు కల్పిస్తుంది. ‘గత పదేళ్లుగా పరిణతి చెందిన గ్లోబల్ దిగ్గజాలు, సవాలు విసిరే కొత్త సంస్థలు, తమ లక్ష్యానికి కట్టుబడి ఉంటూ మెరుగైన అనుభూతిని అందిస్తున్న శక్తివంతమైన బ్రాండ్లు అనేకం కనిపించాయి‘ అని ఫ్యూచర్బ్రాండ్ ఇండెక్స్ నివేదిక పేర్కొంది. గతంలో అమెరికా, యూరప్లో చూసినట్లుగా ఆసియా పసిఫిక్, మధ్యప్రాచ్య దేశాలు బ్రాండ్లపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. -
రిలయన్స్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతంపైగా వృద్ధితో రూ. 18,540 కోట్లను తాకింది. ప్రధానంగా టెలికం, రిటైల్ విభాగాలకుతోడు చమురు, పెట్రోకెమ్ బిజినెస్ నిలకడైన వృద్ధి ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 17,265 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జులై–సెపె్టంబర్(క్యూ2)లో ఆర్జించిన రూ. 16,563 కోట్లతో పోలి్చనా నికర లాభం బలపడింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం అధికంగా రూ. 2.67 లక్షల కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 8 శాతం పుంజుకుని రూ.48,003 కోట్లకు చేరుకుంది. రిటైల్, ఆయిల్ గుడ్... రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నికర లాభం క్యూ3లో 10 శాతం వృద్ధితో రూ. 3,458 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 9 శాతం పెరిగి రూ. 90,333 కోట్లయ్యింది. కొత్తగా 779 స్టోర్లను ఏర్పాటు చేయడంతో వీటి సంఖ్య 19,102కు చేరింది. జామ్నగర్ రిఫైనరీ, పెట్రోకెమికల్ ప్లాంట్లతోకూడిన ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్ ఇబిటా 2 శాతం పుంజుకుని రూ. 14,402 కోట్లను తాకింది. ఇంధన రిటైల్ విభాగం జియో–బీపీ రికార్డ్ అమ్మకాలు(పెట్రోల్, డీజిల్) సాధించినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. కేజీ డీ6 బ్లాకు నుంచి తగ్గిన గ్యాస్ ఉత్పత్తి కారణంగా ఇబిటా 4 శాతం నీరసించి రూ. 5,565 కోట్లకు పరిమితమైంది. సగటున గ్యాస్ ఉత్పత్తి రోజుకి 28.04 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లుకాగా.. 21,000 బ్యారళ్ల చమురు ఉత్పత్తిని సాధించింది. యూఎస్ లగ్జరీ స్టోర్లు: ఫ్రాంచైజీ ఒప్పందం ద్వారా యూఎస్ లగ్జరీ రిటైలర్ ‘శాక్స్ ఫిఫ్త్ ఎవెన్యూ’ స్టోర్లకు దేశీయంగా తెరతీయనున్నట్లు రిలయన్స్ రిటైల్ పేర్కొంది. వెరసి అమెరికన్ లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్లను దేశీయంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. ఇదేవిధంగా మదర్కేర్ పీఎల్సీతో జేవీని నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. తద్వారా తల్లిదండ్రులు, పిల్లల ఉత్పత్తులందించే మదర్కేర్ బ్రాండును దేశీయంగా పరిచయం చేయనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఆర్ఐఎల్ షేరు 2% లాభంతో రూ. 1,275 వద్ద ముగిసింది.జియో దూకుడు ఆర్ఐఎల్ టెలికం విభాగం రిలయన్స్ జియో ఈ ఏడాది క్యూ3లో రూ. 6,477 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో సాధించిన రూ. 5,208 కోట్లతో పోలిస్తే 24 శాతం ఎగసింది. ప్రధానంగా టారిఫ్ల పెంపు ఇందుకు దోహదపడింది. మొత్తం ఆదాయం సైతం రూ. 25,368 కోట్ల నుంచి రూ. 29,307 కోట్లకు జంప్ చేసింది. త్రైమాసికవారీగా కస్టమర్ల సంఖ్య 47.88 కోట్ల నుంచి 48.21 కోట్లకు బలపడగా.. ఒక్కో యూజర్పై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 195.1 నుంచి రూ. 203.3కు ఎగసింది. టెలికం, డిజిటల్ విభాగాల జియో ప్లాట్ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 26 శాతం జంప్చేసి రూ. 6,861 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 19% అధికమై రూ. 38,750 కోట్లకు చేరింది. -
రిలయన్స్, డిస్నీ డీల్కు ఎన్సీఎల్టీ ఓకే
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ మధ్య విలీనానికి తాజాగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), ముంబై బెంచ్ ఆమోదముద్ర వేసింది. వెరసి ఆర్ఐఎల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాలు(వయాకామ్18, డిజిటల్18), వాల్ట్ డిస్నీకి చెందిన స్టార్ ఇండియా మధ్య విలీన పథకానికి గ్రీన్సిగ్నల్ లభించింది. ఇప్పటికే ఈ డీల్కు కొన్ని స్వచ్చంద సవరణల తదుపరి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా రూ. 70,000 కోట్ల విలువైన అతిపెద్ద మీడియా దిగ్గజం ఆవిర్భావినికి మరింత దారి ఏర్పడింది. తమ పరిశీలన ప్రకారం విలీన పథకం సక్రమంగానే ఉన్నట్లు ఎన్సీఎల్టీ పేర్కొంది. అను జగ్మోహన్ సింగ్ (మెంబర్, టెక్నికల్), కిషోర్ వేములపల్లి (మెంబర్, జ్యుడీíÙయల్)లతో కూడిన బెంచ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి నిబంధనల ఉల్లంఘన లేకపోవడంతోపాటు ప్రజావిధానాలకు వ్యతికేరంగా లేదని అభిప్రాయపడ్డారు. ఈ భాగస్వామ్య కంపెనీ(విలీన సంస్థ) రెండు ఓటీటీలతోపాటు 120 టీవీ చానళ్లను కలిగి ఉండనుంది. ఆర్ఐఎల్కు 63.16 శాతం వాటా లభించనుండగా.. వాల్ట్ డిస్నీ 36.84 శాతం వాటాను పొందనుంది. మీడియా దిగ్గజాలు సోనీ, నెట్ఫ్లిక్స్తో మరింత తీవ్రస్థాయిలో పోటీకి దిగేందుకు వీలుగా ఆర్ఐఎల్ దాదాపు రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. -
Reliance AGM 2024: రిలయన్స్ బొనాంజా
రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం)లో చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు బోనస్ షేర్లను ప్రకటించారు. సమీప భవిష్యత్లో టాప్–30 గ్లోబల్ దిగ్గజాల్లో ఒకటి గా కంపెనీని తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు టెక్నా లజీ విస్తృత వినియోగం, ఆధునిక తయారీ విధానాలు దన్నుగా నిలుస్తాయని చెప్పారు. ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ విస్తృత స్థాయి టెక్నాలజీ కంపెనీగా మారు తోందని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. అన్ని వ్యాపా రాల్లోనూ ఏఐ సంబంధ డిజిటల్ ఇన్ఫ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తద్వారా కంపెనీ అత్యంత వృద్ధి పథంలో సాగనున్నట్లు చెప్పారు. వెరసి రానున్న కాలంలో కంపెనీ విలువ భారీగా మెరుగుపడనున్నట్లు వివరించారు. ఏజీఎంలో వాటాదారులను ఉద్దేశించి పలు అంశాలను ప్రస్తావించారు. వీటి ప్రకారం ఆర్ఐఎల్ గతేడాది ఆర్అండ్డీపై రూ. 3,643 కోట్లు వెచ్చించింది. గత ఐదేళ్లలో రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ షేరుకీ మరో షేరుని ఉచితంగా(బోనస్) అందించనుంది. ఈ అంశాన్ని సెప్టెంబర్ 5న సమావేశంకానున్న డైరెక్టర్ల బోర్డు పరిశీలించనుంది. కంపెనీ ఇంతక్రితం 2017 సెప్టెంబర్, 2009 నవంబర్లోనూ 1:1 ప్రాతిపదికన బోనస్ షేర్లను జారీ చేసింది. రిటైల్ జోరు..: గతేడాది రిలయన్స్ రిటైల్ తొలిసారి రూ. 3 లక్షల కోట్ల టర్నోవర్ మైలురాయిని దాటింది. రానున్న 3–4ఏళ్లలో బిజినెస్ను రెట్టింపు చేసే లక్ష్యంతో ఉన్నట్లు ఆర్ఐఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు. మూడు ప్రయివేట్ లేబుళ్లు రూ. 2,000 కోట్ల వార్షిక అమ్మకాలను అందుకున్నాయి. లగ్జరీ జ్యువెలరీ విభాగంలోకి కంపెనీ ప్రవేశించనుంది. దేశవ్యాప్తంగా 18,836 స్టోర్లను నిర్వహిస్తోంది. దీంతో స్టోర్లరీత్యా టాప్–5 గ్లోబల్ రిటైలర్గా నిలుస్తోంది. ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ సరీ్వసుల మిల్క్బాస్కెట్ను కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. కళానికేతన్, జివామే, క్లోవియా, అర్బన్ ల్యాడర్లలో పెట్టుబడులు ఫ్యాషన్ విభాగంలో పట్టుసాధించేందుకు దోహదం చేస్తున్నాయి. జియో.. బంపర్ ఆఫర్: 100జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీరానున్న దీపావళి కానుకగా రిలయన్స్ జియో యూజర్లకు ఉచితంగా 100 జీబీ క్లౌడ్ స్టోరేజీని అందించనుంది. తద్వారా ఫొటోలు, వీడియోలు ఇతర డిజిటల్ ఫైళ్లను భద్రంగా దాచుకునేందుకు వీలుంటుంది. వచ్చే 3–5 ఏళ్లలో రిలయన్స్ రిటైల్, జియో, డిజిటల్ సర్వీసుల ఆదాయం, నిర్వహణ లాభం (ఇబిటా) రెట్టింపు కానున్నట్లు ముకేశ్ అచనా వేశారు. డేటా ఆధారిత ఏఐ సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రీమియం డివైస్ల అందుబాటులోఉన్న క్లౌడ్ సేవలను లగ్జరీగా కాకుండా చౌకగా అందించనున్నట్లు వెల్లడించారు. టీవీ వినియోగదారులకు హలోజియో పేరుతో వాయిస్ అసిస్టెంట్ సేవలను ప్రారంభించింది. రిలయన్స్ డిస్నీ.. వినోదంలో కొత్త శకం డిస్నీతో ఒప్పందం దేశీ వినోద రంగంలో సరికొత్త శకానికి దారి చూపనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. జియో, రిటైల్ తరహాలో మీడియా బిజినెస్ సైతం వృద్ధి బాటలో సాగుతుందని చెప్పారు. డిజిటల్ స్ట్రీమింగ్తో కంటెంట్ సృష్టిని జత చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ ప్రయాణంలో భాగంగా ఈ ఏడాది (2024–25) చివరికల్లా ఆర్ఐఎల్ తొలి సోలార్ గిగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు ముకేశ్ వెల్లడించారు. ఈ ప్లాంటు లో ఒకే చోట పీవీ మాడ్యూల్స్, సెల్స్, వేఫర్స్, పాలీసిలికాన్, గ్లాస్ తయారీని చేపట్టనున్నారు. తద్వారా ఈ యూనిట్ సౌరశక్తిని విద్యుత్గా మార్చనుంది. -
ముఖేష్ అంబానీ: ఏ వర్కౌట్స్ లేకుండానే 15 కిలోలు తగ్గాడట, ఎలా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు 67వ ఏట అడుగుపెట్టాడు. బిజినెస్ మాగ్నెట్, ఆసియాకుబేరుడు ముఖేష్ అంబానీ, ధీరూభాయ్ అంబానీ, కోకిలా బెన్ దంపతులకు 1957 ఏప్రిల్ 19న యెమెన్లో పుట్టాడు. వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, కెమికల్ ఇంజనీరింగ్ చదివిన అంబానీ తన సామర్థ్యం, కృషితో రిలయన్స్ను ప్రపంచంలోనే ప్రముఖ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించాడు. భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా, ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో నిలవడం విశేషం. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను తన వారసులు, ఇషా అంబానీ పిరమల్, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలకు పంచి ఇచ్చినప్పటికీ 67 ఏళ్ల వయసులో కూడా వ్యాపార దక్షతలో చురుగ్గా ఉంటాడు. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో కీలకమైన వ్యాపార నిర్ణయాలతోపాటు ఇటు కుటుంబ బాధ్యతలను కూడా దిగ్విజయంగా నిర్వరిస్తున్నాడు. అంతేకాదు తన ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను కాపాడుకోవడంలో కూడా దిట్ట. ఆయన పాటించే ఆహారం నియమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియనప్పటికీ, ఎలాంటి వర్కవుట్ లేకుండానే ముఖేష్ అంబానీ 15 కిలోలు తగ్గారట. ఈ సందర్బంగా ఆయన డైట్ , జీవన శైలి ఏంటి అనేది చర్చలో నిలిచింది. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!) కఠినమైన ఆహార నియమాలతోనే ముఖేష్ అంబానీ ఈ అద్భుత ఫలితాన్ని సాధించారని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర సక్సెస్ఫుల్ వ్యక్తుల మాదిరిగానే ముఖేష్ అంబానీ యోగా, ధ్యానంతో రోజు ప్రారంభిస్తాడు. ఉదయం 5:30 గంటలకు మేల్కొంటాడు. యోగా, ధ్యానం సూర్య నమస్కారాలు, వాకింగ్ కోసం బయటికి కూడా వెళ్తాడు. ఎంత బిజీషెడ్యూల్ ఉన్నా ఈ ఉదయపు దినచర్యను మాత్రం ఎప్పుడూ దాటవేయడు. (మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్) బ్రేక్ఫాస్ట్, లంచ్ డిన్నర్ ఇలా.. అంబానీ స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్ని ఫాలో అవుతారు. ఆల్కహాల్, జంక్ ఫుడ్కు దూరంగా ఉంటాడు. ఇక రోజులోని అంబానీ తొలి భోజనం విషయానికి వస్తే అల్పాహారంలో తాజా పండ్లు, జ్యూస్, ఇడ్లీ-సాంబార్ తీసుకుంటాడు. లంచ్, డిన్నర్ కూడా సాంప్రదాయ భారతీయ ఆహారాలతో చాలా సింపుల్గా కానిచ్చేస్తారట. గుజరాతీ తరహాలో దాల్, సబ్జీ, అన్నం, సూప్లు , సలాడ్లను ఇష్టపడతాడు. అది కూడా ఇంట్లో వండిన భోజనం మాత్రమే. కాగా ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలిగా ఐపీఎల్ జట్టుకు ఓనర్గా ఉన్నారు. నీతా, అంబానీ దంపతులు ఇప్పటికేపెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి, కుమార్తె ఇషా అంబానీకి వివాహాలు జరపించారు. నలుగురు మనవలు కూడా ఉన్నారు. ఇక చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ఈ ఏడాది జూన్లో జరగనుంది. -
Forbes richest list 2024: టాప్–10లో ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సాధించారు. 2024 ఏడాదికి ఫోర్బ్స్ టాప్–10 బిలియనీర్లలో 9వ ర్యాంకును పొందారు. 116 బిలియన్ డాలర్ల సంపదతో 66 ఏళ్ల ముకేశ్ టాప్–9గా నిలిచారు. 2023లో ముకేశ్ సంపద 83.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా.. దేశీయంగా సంపదలో టాప్–2గా నిలుస్తున్న గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో 17వ ర్యాంకును అందుకున్నారు. యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా 2023లో అదానీ సంపద 47.2 బిలియన్ డాలర్లకు క్షీణించిన సంగతి తెలిసిందే. హిండెన్బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ తిరిగి బలపడింది. ఇక 2022లో అదానీ 90 బిలియన్ డాలర్ల నెట్వర్త్ను సాధించడం ప్రస్తావించదగ్గ అంశం! జాబితా ఇలా ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో 2,781 మంది వ్యక్తులు చోటు సాధించారు. గతేడాది జాబితాతో పోలిస్తే 141 మందికి అదనంగా చోటు లభించింది. 2023తో పోలిస్తే కుబేరుల ఉమ్మడి సంపద 2 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 14.2 ట్రిలియన్ డాలర్లను తాకింది. సరికొత్త రికార్డ్ నమోదైన 2021తో పోలిస్తే 1.1 లక్షల కోట్ల డాలర్లు జత కలసింది. ఫ్యాషన్స్, కాస్మెటిక్స్ దిగ్గజం ఎల్వీఎంహెచ్కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 233 బిలియన్ డాలర్లతో టాప్ ర్యాంకును, 195 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ రెండో ర్యాంకునూ కొల్లగొట్టారు. 177 బిలియన్ డాలర్లతో ఫేస్బుక్ జుకర్బర్గ్ టాప్–3గా నిలిచారు. -
అచ్చం అనంత్ మామలాగే..క్యూట్ కృష్ణ ఫోటో వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ. రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా ఇషా, 2018 డిసెంబరులో వ్యాపారవేత్త ఆనంద్ పిరమల్ను వివాహం చేసుకుంది. ఇషా, ఆనంద్ జంటకు కవలలు - కృష్ణ (కుమారుడు) ఆదియా (కుమార్తె) జన్మించారు. అటు తల్లిగా, ఇటు వ్యాపార నిర్వహణలోనూ అంబానీ వారసురాలిగా తన సత్తా చాటుకుంటోంది. ఇటీవల ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో తన ట్విన్స్తో సందడిగా కనిపించింది ఇషా. ఇషాతో ట్విన్స్ ఫోటోలో సోషల్ మీడియాలో తెగ షేర్ అయ్యాయి. ముఖ్యంగా ఇషా కుమారుడు కృష్ణ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాడు. ఈ ఫోటోలు అచ్చం మేనమామ అనంత్ అంబానీలా ఉండటం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. బ్లాక్ సూట్లో రాయల్ లుక్లో చిరునవ్వుల చిందిస్తున్న ఇషా కుమారుడు కృష్ణ, తమ్ముడు అనంత్ కార్బన్ కాపీలా ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. " అచ్చం అనంత్ అంబానీ లాగానే ఉన్నాడు అని ఒకరు, "అనంత్ మాము జైసా లగ్తా హై" అని మరొకరు వ్యాఖ్యానించారు. అంతేకాదుఆ చిన్నారి ధీరూభాయ్ అంబానీలా ఉన్నాడని మరికొందరు కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ మామ, అల్లుళ్ల పోలికల ఫోటో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
పారామౌంట్ గ్లోబల్తో రిలయన్స్ డీల్
న్యూఢిల్లీ: పారామౌంట్ గ్లోబల్ సంస్థ భారత్లోని టీవీ వ్యాపార విభాగం వయాకామ్ 18లో తమకున్న 13.01 శాతం వాటాలను రిలయన్స్ ఇండస్ట్రీస్కి విక్రయించనుంది. ఇందుకు సంబంధించి పారామౌంట్ గ్లోబల్కి చెందిన రెండు అనుబంధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ తెలిపింది. ఈ డీల్ విలువ రూ. 4,286 కోట్లుగా ఉంటుందని వివరించింది. రిలయన్స్కి చెందిన టీవీ18 బ్రాడ్కాస్ట్కి వయాకామ్18 అనుబంధ సంస్థ. కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా అందులో రిలయన్స్కి 57.48 శాతం వాటా ఉంది. పారామౌంట్ గ్లోబల్తో ఒప్పందం పూర్తయ్యాక ఇది 70.49 శాతానికి పెరుగుతుంది. తమ కంటెంట్కి సంబంధించి వయాకామ్18కి లైసెన్సును ఇకపైనా కొనసాగిస్తామని పారామౌంట్ వెల్లడించింది. నియంత్రణ సంస్థల అనుమతులు, రిలయన్స్–స్టార్ డిస్నీ జాయింట్ వెంచర్ పూర్తి కావడం తదితర అంశాలకు లోబడి ఈ ఒప్పందం ఉంటుందని పేర్కొంది. మీడియాలో రిలయన్స్ మరింత పటిష్టం.. 2014లో నెట్వర్క్18లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన రిలయన్స్ ఆ తర్వాత నుంచి మీడియా రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. భారత్లో తమ మీడియా కార్యకలాపాలను విలీనం చేసుకునేందుకు వాల్ట్ డిస్నీ, రిలయన్స్ కుదుర్చుకున్న ఒప్పందం ఇందుకు దోహదపడనుంది. సదరు జాయింట్ వెంచర్లో రిలయన్స్ రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సోనీ, నెట్ఫ్లిక్స్కు గట్టి పోటీనిచ్చేందుకు రిలయన్స్ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం రిలయన్స్కి చెందిన మీడియా వెంచర్స్ అన్నీ నెట్వర్క్18 కింద ఉన్నాయి. ఇది టీవీ18 బ్రాండ్ పేరిట న్యూస్ చానళ్లు, ఇతరత్రా స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ చానల్స్ని నిర్వహిస్తోంది. అలాగే, మనీకంట్రోల్డాట్కామ్, బుక్మైషో వంటి సంస్థల్లోనూ నెట్ట్ వర్క్18కి వాటాలు ఉన్నాయి. వీటితో పాటు రిలయన్స్కి జియోసూ్టడియోస్ అనే సినిమా నిర్మాణ సంస్థ ఉంది. రెండు లిస్టెడ్ కేబుల్ డి్రస్టిబ్యూషన్ కంపెనీల్లో (డెన్, హాథ్వే) మెజారిటీ వాటాలు ఉన్నాయి. -
అనంత్-రాధిక : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ధర ఎంతో తెలుసా?
వ్యాపారవేత్త, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు. స్వయంగా డ్యాన్సర్ అయిన ఆమె అంబానీ కుటుంబవేడుకల్లో తన డ్యాన్స్ పెర్ఫామెన్స్తో అందరినీ మెస్మరైజ్ చేయడం ఆమెకు అలవాటు. తాజాగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్లో తన నాట్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతేకాదు నీతా లుక్స్, ఫ్యాషన్తో అతిథులను సర్ప్రైజ్ చేశారు. ముఖ్యంగా నీతా ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. నీతా కాంచీపురం చీరలో హుందాగా కనిపించారు. రిలయన్స్ లగ్జరీ రిటైల్ బ్రాండ్ స్వదేశ్ సహకారంతో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీర అద్భుతంగా ఆమెకు అమరింది. బోర్డర్పై క్లాసిక్ ట్రెడిషనల్ జర్దోసీ వర్క్, బ్లౌజ్ స్లీవ్లపై ప్రత్యేకమైన గోటా వర్క్, చక్కటి మేకప్తో తన ఐకానిక్ సిగ్నేచర్ స్టయిలో మెరిసిపోయారు. కాంచీపురం చీరకు జతగా, కోట్ల విలువైన పచ్చలు పొదిగిన డైమండ్ నెక్లెస్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అందానికి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. పచ్చలు పొదిగిన, పొడవాటి నెక్లెస్లో ఆమె లుక్తో అతిథులు చూపు తిప్పుకోలేక పోయారంటే అతిశయోక్తి కాదు. దీనికి సరిపోయేలా చెవిపోగులు, బ్యాంగిల్స్ , వేలి రింగ్ ఆకట్టుకున్నాయి. పలు నివేదికల ప్రకారం ఈ పచ్చల హారం ధర దాదాపు రూ. 400-500 కోట్టు ఉంటుందని అంచనా. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కాక్టెయిల్ నైట్ ఈవెంట్లో వైన్ కలర్ కస్టమ్-మేడ్ గౌను, క్లాసిక్ ఫ్రెంచ్ ట్విస్ట్ బన్లో ఆమె లుక్ నీతా స్టయిలింగ్ను ప్రతిబింబించింది. -
అమ్మకు 90 ఏళ్లు : అంబానీ కుటుంబంసెలబ్రేషన్స్
వ్యాపారం ప్రపంచంలో అపరకుబేరుల్లా వెలుగుతున్న ఫ్యామిలీ అంబానీ. అలాంటి వంశ పార్యంపర్య వ్యాపారానికి వెన్నుముకగా నిలిచిన అద్భత మహిళ కోకిలాబెన్ అంబానీ అంటే అతిశయోక్తి కాదు. ధీరూభాయ్ వ్యాపార ప్రపంచాన్ని శాసించినా, ముఖేష్ అంబానీ ఆసియా కుబేరుడిగా అవతరించినా, దీని వెనుకున్న గొప్ప మహిళా మూర్తి కోకిలా బెన్. భార్యగా, తల్లిగా అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని అంబానీ కుటుంబానికి పెద్ద దిక్కుగా బలమైన అండగా నిలిచారు. దివంగత భర్త ధీరూభాయ్ అంబానీ కలలకు అండగా నిలవడమే కాకుండా, ఆయన మరణానంతరం కుమారులు ముఖేష్ అంబానీ , అనిల్ అంబానీను నిలబెట్టిన మాతృమూర్తి. ఈ రోజుతో ఆమెకు (ఫిబ్రవరి 24) 90 ఏళ్లు . అంబానీ ఫ్యాన్ ప్యాజ్ ఇన్స్టా ప్రకారం ఆమె బర్త్డేని పురస్కరించుకొని కోకిలాబెన కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, నీనా కొఠారి, దీప్తి సల్గావ్కర్, వారి జీవిత భాగస్వాములు ఆమె పుట్టినరోజు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. కోకిలాబెన్ అంబానీ తన పుట్టినరోజు సందర్భంగా టీనా అంబానీ, అనిల్ అంబానీలతో కలిసి ప్రత్యేకంగా రాజస్థాన్లోని రాజ్సమంద్లోని శ్రీనాథ్జీ ఆలయాన్ని శనివారం సందర్శించారు. 'మనోరత్ భోగ్', ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. శ్రీనాథ్జీ మందిర్ మండల్ బోర్డ్ వైస్ చైర్పర్సన్ కూడా అయిన కోకిలా బెన్ నాధ్ద్వారాలోని పుష్టి మార్గీయ ప్రధాన్ పీఠ్ శ్రీనాథ్జీ భవనంలో 56 నైవేద్యాలు సమర్పిస్తారు. ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియాలో కూడా కోకిలాబెన్ పూజలు చేశారు. అలాగే ఆంటిలియాలోని మందిరం దగ్గర పలువురు పండితులు కోకిలాబెన్ ఆరోగ్యం కోసం ప్రార్థన్లు చేశారు. గతంలో 2022లో ముత్యాల అంచుతో త్రీ స్టెప్స్ కేక్ అద్భుతమైన కేక్ను తయారుచేయించారు. ఇందులో విశేషం ఏమిటంటే, అంబానీ వంశానికి చెందిన ప్రతి సభ్యుని ఫోటోలు ఇందులో ఉన్నాయి. గుజరాత్లో జామ్ నగర్లో పుట్టిన ఆమె ఇష్టదైవం కృష్ణుడు. ఇష్టమైన కలర్ పింక్. ఆరోగ్యంగా ఉండేందుకు రోజూయోగ సాధన, చక్కటి ఆహారం తీసుకుంటారట. -
నిఫ్టీ కొత్త రికార్డ్
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్లో శుక్రవారం నిఫ్టీ కొత్త రికార్డు సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ స్టాకులు రాణిండంతో ఇంట్రాడేలో 429 పాయింట్లు ఎగసి 22,127 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీ నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న స్టాక్ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఆయిల్అండ్గ్యాస్, ఇంధన, మెటల్, సరీ్వసెస్, యుటిలిటీ, ఐటీ, విద్యుత్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రథమార్థంలో 2% ర్యాలీ చేశాయి. నిఫ్టీ ఆల్టైం హై(22,127)ని నమోదు చేయగా.., సెన్సెక్స్ 1444 పాయింట్లు దూసుకెళ్లి 73,089 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే మిడ్సెషన్ నుంచి ఆయిల్అండ్గ్యాస్, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సెన్సెక్స్ 440 పాయింట్లు లాభపడి 72,086 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 156 పాయింట్లు పెరిగి 21,854 వద్ద నిలిచింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.80%, 0.50% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.71 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,463 కోట్ల షేర్లు కొన్నారు. నాస్డాక్లో ఐటీ షేర్ల ర్యాలీ ప్రభావం గురువారం రాత్రి అమెరికా మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభంతో ముగిశాయి. దీంతో శుక్రవారం ఆసియా, యూరప్ స్టాక్ సూచీలు 0.5–1% మేర పెరిగాయి. ► ఒడిదుడుకుల ట్రేడింగ్లో భాగంగా సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(73,089) నుంచి ఏకంగా 1004 పాయింట్లు, నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయి(22,127) నుంచి 273 పాయింట్లు నష్టపోయాయి. ఇక ఈ బడ్జెట్ వారంలో సెన్సెక్స్ 1,385 పాయింట్లు, నిఫ్టీ 502 పాయింట్లు చొప్పున ఆర్జించాయి. ► సెన్సెక్స్ 441 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.34 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.382 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ► కేంద్రం బడ్జెట్లో పర్యావరణ అనుకూల ఇంధనాలకు ప్రాధాన్యత నివ్వడం, అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 80 డాలర్ల దిగువకు చేరుకోవడం ఇంధన షేర్లకు కలిసొ చి్చంది. బీపీసీఎల్ 10%, ఐఓసీ 8%, హిందుస్థాన్ పెట్రోలియం 5%, ఓఎన్జీసీ 4%, కోల్ ఇండియా 3% లాభపడ్డాయి. ► ఇంధన షేర్లలో భాగంగా రిలయన్స్ షేరు 2% పెరిగి రూ.2915 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 3.33% ర్యాలీ చేసి రూ.2950 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ విలువ రూ. 41,860 కోట్లు పెరిగి రూ.19.72 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ► పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లు, టాపప్ వంటి పలు సర్వీసులను నిలిపివేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో వరుసగా రెండోరోజూ పేటీఎం షేరు 20% లోయర్ సర్క్యూట్ తాకింది. బీఎస్ఈలో శుక్రవారం 20% పతనమై రూ.487 వద్ద ముగిసింది. -
వచ్చే వారం రిలయన్స్ డేటా సెంటర్ ప్రారంభం
చెన్నై: వేగంగా వృద్ధి చెందుతున్న డేటా సెంటర్స్ విభా గంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంట్రీ ఇస్తోంది. వచ్చే వారం చెన్నైలో సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, అమెరికాకు చెందిన డిజిటల్ రియాలిటీ సంస్థలతో కలిసి దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. చెన్నైలో 20 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న ఈ జాయింట్ వెంచర్ సంస్థ ముంబైలో మరో 40 మెగావాట్ల సెంటర్ కోసం 2.15 ఎకరాలు కొనుగోలు చేసింది. -
Reliance-Disney: త్వరలో రిలయన్స్–డిస్నీ స్టార్ ఇండియా విలీనం
న్యూఢిల్లీ: దేశీయంగా మీడియా రంగంలో కన్సాలిడేషన్కు తెరతీస్తూ డిస్నీ–స్టార్ ఇండియాను విలీనం చేసుకునే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మెగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన నాన్–బైండింగ్ టర్మ్ షీటుపై సంతకాల కోసం లండన్లో జరిగిన భేటీలో డిస్నీ ప్రతినిధి కెవిన్ మేయర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన మనోజ్ మోదీ తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం కుదరడంతో వ్యాపార విలువ మదింపు తదితర ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 45–60 రోజుల గడువు విధించుకున్నారు. అవసరమైతే దీన్ని పొడిగించే అవకాశం ఉంది. జనవరి ఆఖరు నాటికి ఈ డీల్ను పూర్తి చేయాలని రిలయన్స్ ఆసక్తిగా ఉన్నప్పటికీ ఫిబ్రవరి ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ పూర్తిగా స్టాక్, నగదు రూపంలో ఉండగలదని వివరించాయి. ఇరు సంస్థలు టర్మ్ షీటుపై చాలాకాలంగా కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రతిపాదన ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన వయాకామ్18, స్టార్ ఇండియా కార్యకలాపాలను విలీనం చేస్తారు. విలీన సంస్థలో రిలయన్స్కు 51 శాతం, డిస్నీకి 49 శాతం వాటాలు ఉండనున్నాయి. ఇందులో స్టార్ ఇండియాకు చెందిన 77 చానల్స్, వయాకామ్18కి చెందిన 38 చానల్స్ కలిపి మొత్తం 115 చానల్స్ ఉంటాయి. వీటితో పాటు డిస్నీ ప్లస్ హాట్స్టార్, జియో సినిమా అనే రెండు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు కూడా భాగమవుతాయి. జీ ఎంటర్టైన్మెంట్, కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా) విలీన ప్రక్రియ జరుగుతుండగా కొత్తగా రిలయన్స్, డిస్నీ–స్టార్ డీల్ కూడా కుదిరితే దేశీయంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ఐదేళ్లలో రూ.9.63 లక్షలకోట్ల సంపద సృష్టి
ఇన్వెస్టర్ల సంపద సృష్టికి గత ఐదేళ్ల కాలం(2018–23)లో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ చెయిర్ను అలంకరించింది. ఈ బాటలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ రెండో ర్యాంకులో నిలవగా.. లాయిడ్స్ మెటల్స్, అదానీ గ్రూప్ సైతం ఇదే బాటలో నడవడం గమనార్హం! వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్)లో పలు దిగ్గజాలు గత ఐదేళ్లలో జోరు చూపాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అత్యధికంగా రూ. 9,63,800 కోట్ల మార్కెట్ క్యాప్ను జమ చేసుకుంది. నంబర్వన్ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్(టీసీఎస్) రూ. 6,77,400 కోట్ల విలువను జత చేసుకోవడం ద్వారా తదుపరి ర్యాంకును సాధించింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ నివేదిక ప్రకారం సంపద సృష్టిలో అదానీ ఎంటర్ప్రైజెస్ ఆల్రౌండ్ ప్రతిభను కనబరిచింది. స్టాక్ మార్కెట్లో వివిధ కంపెనీల పనితీరును పరిశీలించిన మోతీలాల్ ఓస్వాల్ ఆర్ఐఎల్ వరుసగా ఐదో ఏడాదిలోనూ టాప్లో నిలిచినట్లు పేర్కొంది. ఐసీఐసీఐ, ఎయిర్టెల్ 2018–23 కాలంలో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ రూ. 4,15,500 కోట్లమేర బలపడగా.. ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ విలువ రూ. 3,61,800 కోట్లు పుంజుకుంది. మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ రూ. 2,80,800 కోట్లను జత చేసుకుంది. అయితే లాయిడ్స్ మెటల్స్ అత్యంత వేగంగా 79 శాతం సంపదను పెంచుకున్న కంపెనీగా ఆవిర్భవించింది. ఈ బాటలో అదానీ ఎంటర్ప్రైజెస్ 78 శాతం వార్షిక వృద్ధితో ద్వితీయ ర్యాంకును సాధించింది. ఈ కాలంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ను మించుతూ అత్యంత నిలకడగా పురోగమించిన కంపెనీగా క్యాప్రి గ్లోబల్ నిలిచింది. ఏడాదికి 50 శాతం చొప్పున లాభపడింది. రూ. 10 లక్షలు.. ఐదేళ్లలో రూ.కోటి గత ఐదేళ్లుగా అత్యున్నత ర్యాలీ చేసిన టాప్–10 కంపెనీలలో 2018లో రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. 2023కల్లా ఈ పెట్టుబడి రూ. కోటికి చేరి ఉండేదని నివేదిక పేర్కొంది. -
5 రోజుల్లో రూ. 26 వేల కోట్లు లాభపడిన లక్కీ ఇన్వెస్టర్లు
దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) కూడా ఒకటి. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంకాప్) పరంగా కూడా టాప్ 10 కంపెనీల జాబితాలో టాప్లో కొనసాగుతూ వస్తుంది. తాజాగా లిస్ట్లో కూడా రిలయన్స్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. దీంతో రిలయన్స్ పెట్టుబడిదారులు అపార లాభాలను సొంతం చేసుకున్నారు. గత 5 రోజుల ట్రేడింగ్లో రూ. 26,000 కోట్లకు పైగా లాభాలను సాధించారు. ఆర్ఐఎల్ ఎంక్యాప్ గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. క్రితం వారంతో పోలిస్తే రూ.26,014.36 కోట్లు పెరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో నాలుగు కంపెనీలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఇందులో ఆర్ఐఎల్ తరువాత భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ ,హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిలిచింది. ఆరు కంపెనీలు లాభాలనుకోల్పోయాయి. రూ. 20,490 లాభాలతో రూ. 11,62,706.71 కోట్ల ఎంక్యాప్తో హెచ్డీఎఫ్సీ రెండో స్థానంలో ఉంది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ. 5,46,720.84 కోట్లకు చేరుకుంది. ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,030.88 కోట్లు పెరిగి రూ.6,51,285.29 కోట్లకు చేరుకుంది. గత వారం నష్టపోయిన టాప్ కంపెనీల్లో టీసీఎస్ నిలిచింది. రూ.16,484.03 కోట్లు తగ్గి రూ.12,65,153.60 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఎస్బీఐ , బజాజ్ ఫైనాన్స్ నష్టపోయిన ఇతర టాప్ కంపెనీలు. -
బెంగాల్పై అంబానీ వరాల జల్లు : వేల కోట్ల పెట్టుబడులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పశ్చిమ బెంగాల్పై వరాల జల్లు కురిపించారు. బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ఈవెంట్లో అంబానీ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ వృద్ధిని వేగవంతం చేయడంలో ఎంత మాత్రం వెనుకాడబోదని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు రూ. 45 వేల కోట్ల పెట్టుబడి పెట్టామని దీనికి అదనంగా రూ. 20వేల కోట్లు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నామని అంబానీ ప్రకటించారు. రానున్న మూడేళ్లలో ఈ పెట్టుబడులను రిలయన్స్ పెడుతుందని ప్రకటించారు. ముఖేష్ అంబానీ కోల్కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ప్రారంభ వేడుకలకు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంబానీకి స్వాగతం పలికారు. గొప్ప సంస్కృతి, విద్య, వారసత్వాల నెలవు బెంగాల్. ఐకమత్యమే బలం. ఇక్కడ అందరం కలిసే ఉంటాం.. అదే బెంగాల్కున్న మరో ప్లస్ పాయింట్. తమకు విభజించి పాలించు విధానం లేదంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్- 2023 7వ ఎడిషన్ను సీఎం మమత ప్రారంభించారు. #WATCH | At the Bengal Global Business Summit event, Reliance Industries chairman Mukesh Ambani says, "Reliance will leave no stone unturned to accelerate West Bengal's growth. Reliance has invested close to Rs 45,000 crores in West Bengal. We plan to invest an additional Rs… pic.twitter.com/fmNWCVfekF — ANI (@ANI) November 21, 2023 -
రూ.20,000 కోట్లు సమీకరించిన రిలయన్స్
న్యూఢిల్లీ: భారీ వ్యాపార వృద్ధి ప్రణాళికలతో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు స్థాయిలో నిధులు సమీకరించింది. 7.79 శాతం రేటుపై పదేళ్ల కాల బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.20,000 కోట్లు సమకూర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం రుణ సమీకరణ రేటు కంటే రిలయన్స్ 0.40 శాతం ఎక్కువ ఆఫర్ చేసింది. 20,00,000 సెక్యూర్డ్, రెడీమబుల్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను (ఎన్సీడీలు), రూ.1,00,000 ముఖ విలువపై ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేసినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. కనీస ఇష్యూ సైజు రూ.10,000 కోట్లు కాగా, స్పందన ఆధారంగా మరో రూ. 10,000 కోట్లను గ్రీన్ షూ ఆప్షన్ కింద రిలయన్స్ ఇండస్ట్రీస్ నిధుల సమీకరణ చేసింది. రిలయన్స్ బాండ్ల ఇష్యూకు మొత్తం రూ.27,115 కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎన్సీడీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ కానున్నాయి. -
ఇతర సంస్థల నుంచి డీజిల్ కొనుగోళ్ల నిలిపివేత
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి కంపెనీల నుంచి డీజిల్ కొనుగోళ్లను వచ్చే ఏడాది నుంచి నిలిపివేయాలని ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) భావిస్తోంది. వైజాగ్ రిఫైనరీ విస్తరణ పనులు పూర్తయి, వచ్చే ఆర్థిక సంవత్సరం రాజస్థాన్లో కొత్త రిఫైనరీని నిర్మించిన తర్వాత నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో సంస్థ వెల్లడించింది. వైజాగ్ రిఫైనరీ ప్రస్తుత వార్షిక సామర్ధ్యం 13.7 మిలియన్ టన్నులుగా ఉండగా విస్తరణ పనులు పూర్తయితే 15 మిలియన్ టన్నులకు పెరుగుతుందని కంపెనీ చైర్మన్ పుష్ప్ కుమార్ జోషి చెప్పారు. రాజస్థాన్ రిఫైనరీ 72 శాతం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది దశలవారీగా వినియోగంలోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము విక్రయించే పెట్రోల్లో 43 శాతం, డీజిల్లో 47 శాతం ఇంధనాలను ముంబై, వైజాగ్ రిఫైనరీలు సమకూరుస్తున్నాయి. వైజాగ్ రిఫైనరీ విస్తరణ పనులు పూర్తయ్యాక డీజిల్ విక్రయాల్లో హెచ్పీసీఎల్ సొంత రిఫైనరీల వాటా 61 శాతానికి పెరుగుతుంది. రాజస్థాన్ రిఫైనరీ కూడా అందుబాటులోకి వస్తే మొత్తం డీజిల్ను హెచ్పీసీఎల్ సొంతంగానే ఉత్పత్తి చేసుకోగలుగుతుంది. దేశీయంగా మొత్తం పెట్రోల్ బంకుల్లో దాదాపు పావు శాతం బంకులు హెచ్పీసీఎల్వే ఉన్నాయి. అయితే, వాటిలో విక్రయ అవసరాలకు తగినంత స్థాయిలో సొంతంగా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి చేసుకోలేకపోతుండటంతో ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. హెచ్పీసీఎల్ ఇప్పటికే తమ ముంబై రిఫైనరీ సామరŠాధ్యన్ని 7.5 మిలియన్ టన్నుల నుంచి 9.5 మిలియన్ టన్నులకు విస్తరించింది. -
అంబానీకి బెదిరింపుల కేసులో ఇద్దరి అరెస్ట్
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిళ్లు పంపిన వ్యవహారంలో తెలంగాణ, గుజరాత్లకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఎనిమిది రోజుల వ్యవధిలో అంబానీకి చెందిన సంస్థకు మూడు ఈమెయిళ్లు అందాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామంటూ మొదటి మెయిల్ పంపారు. తమ వద్ద మంచి షూటర్లు ఉన్నట్లు అందులో బెదిరించారు. ఆతర్వాత మరో మెయిల్లో రూ.200 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. సోమవారం పంపిన మెయిల్లో రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని ఉంది. వీటిపై అంబానీ భద్రతా అధికారి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒకరు తెలంగాణలోని వరంగల్కు చెందిన గణేశ్ రమేశ్ వనపర్తి(19) కాగా, మరొకరు గుజరాత్కు చెందిన షాదాబ్ ఖాన్(21). శనివారం గణేశ్ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 8వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. షాదాబ్ ఖాన్ ఉన్నతవిద్యా వంతుడని పోలీసులు చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అంబానీకి మళ్లీ బెదిరింపులు
ముంబై: కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని శుక్రవారం ఓ అగంతకుడు మెయిల్ ద్వారా బెదిరించిన విషయం తెలిసిందే. ఆదివారం మళ్లీ అదే అడ్రస్తో మరోసారి బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు తెలిపారు. రూ.200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని అందులో ఉందన్నారు. అంబానీ నివా సం ఆంటీలియా భద్రతాధికారి దేవేంద్ర ము న్షీరామ్ ఫిర్యాదు చేశారు. నిందితుడు యూరప్కు చెందిన ఈ–మెయిల్ సరీ్వస్ ప్రొవైడర్ ఉపయోగించాడని చెప్పారు. అతడిపై ఐపీసీ 387, 506(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. అయితే షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి ఆ బెదిరింపు మెయిల్ వచి్చనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ముకేశ్ అంబానీకి బెదిరింపులు
ముంబై: కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించి అంబానీ సంస్థకు చెందిన ఓ ఈ–మొయిల్ ఐడీకి శుక్రవారం మెయిల్ వచ్చింది. ‘మా దగ్గర మంచి షూటర్లు ఉన్నారు. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం’అని ఆ మెయిల్ సారాంశం. దీంతో, ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్చార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి ఆ మెయిల్ వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు. గత ఏడాది సైతం ముకేశ్ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. 2022 ఓ వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హర్కిసాన్దాస్ ఆస్పత్రికి ఫోన్ చేసి ‘ఆసుపత్రిని పేల్చేస్తాం. అంబానీ కుటుంబాన్ని చంపేస్తాం’అని బెదిరించాడు. 2021లో ముంబైలోని అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే. -
రిలయన్స్ చేతికే డిస్నీ?, డీల్ విలువ రూ.80,000 కోట్లు
దేశీయ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్,అమెరికన్ ఎంటర్టైన్మెంట్ జెయింట్ వాల్ట్ డిస్నీల మధ్య నగదు బదిలి, స్టాక్ కొనుగోలు ఒప్పందం చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. భారత్లోని వాల్ట్ డిస్నీ తన డిస్నీ స్టార్ ఇండియా 10 బిలియన్ డాలర్ల నియంత్రిత వాటాను అమ్మేందుకు సిద్ధమైంది. అయితే, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 7 బిలియన్ డాలర్ల నుంచి 8 బిలియన్ల డాలర్ల మేర చెల్లించి వాల్ట్ డిస్నీ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటూ పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇక డిస్నీస్టార్ను కొనుగోలు చేసిన మరుసటి నెలలో రిలయన్స్ మీడియా యూనిట్లను డిస్నీలో కలపనున్నారు. ప్రస్తుతం, ఈ కొనుగోలు అంశంపై ఆ రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. డిస్నీ ఆస్తులన్నీ తన వద్దే ఇక డిస్నీస్టార్ను కొనుగోలు చేసిన మరుసటి నెలలో రిలయన్స్ మీడియా యూనిట్లను డిస్నీలో కలపనున్నారు. ప్రస్తుతం, ఈ కొనుగోలు అంశంపై ఆ రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. చర్చల్లో భాగంగా డిస్నీ తన మైనారిటీ వాటాను అలాగే ఉంచుకుని మిగిలిన మేజర్ వాటాను నగదు బదిలి, స్టాక్స్ను కొనుగోలు చేసేలా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. డీల్పై తుది నిర్ణయం తీసుకోలేదు. డిస్నీ ఆస్తులను కొంత కాలం పాటు ఉంచుకోవాలని వాల్ట్ డిస్నీ అనుకుంటుందని సమాచారం. ఐపీఎల్ దెబ్బ.. ఆపై 2022లో ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను 2.7 బిలియన్ డాలర్లకు అంబానీ సొంతం చేసుకున్నారు. జియో సినిమా ఫ్లాట్ఫారమ్లో ఐపీఎల్ ప్రసారాల్ని ఉచితంగా యూజర్లకు అందించారు. ఆ తర్వాత వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హెచ్బీవో షోలను భారత్లో ప్రసారం చేసేందుకు గాను ఆ హక్కుల్ని రిలయన్స్ సొంతం చేసుకోవడం వంటి వరుస పరిణామాలతో వాల్ట్డిస్నీ స్టార్ డిస్నీని అమ్మేలా నిశ్చయించుకుంది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. భారత్ - న్యూజిలాండ్ దేశాల మధ్య జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్లో రికార్డు స్థాయిలో 43 మిలియన్ల వ్యూస్ వచ్చాయని డిస్నీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను 35 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు బ్లూమ్ బెర్గ్ నివేదించింది. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. బలహీన జాతీయ అంతర్జాతీయ సంకేతాలతో బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు ఒకశాతం మేర నష్టపోయాయి. మార్జిన్ల క్షీణత ఆందోళనలతో బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు నెలకొన్నాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3–1% క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాల భయాలు, పశి్చమాసియా దేశాల్లోని యుద్ధ పరిస్థితుల పరిణామాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోయి 66 వేల స్థాయి దిగువన 65,877 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయి 19,671 వద్ద నిలిచింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ఫార్మా, ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేదు. ట్రేడింగ్లో సెన్సెక్స్ 586 పాయింట్లు క్షీణించి 65,842 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 19,660 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,832 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,470 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘బలహీన అంతర్జాతీయ సంకేతాలు, పశ్చిమాసియా దేశాల్లోని అనిశ్చిత పరిణామాలు దేశీయ మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయి. క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఉద్రికత్తలు మరింత ఎక్కువయ్యాయి. ఫెడ్ చైర్మన్ ప్రసంగానికి ముందు ఎఫ్ఐఐలు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ ఐటీ, ఫైనాన్స్ రంగ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇన్వెస్టర్లను మరింత నిరాశపరిచింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. ► సెప్టెంబర్ క్వార్టర్లో నికరలాభం 28% క్షీణించడంతో బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్ షేరు 3% నష్టపోయి రూ.7,871 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ ఒక్కరోజులో రూ.13,345 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ► యాజమాన్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయ వృద్ధి అంచనాలు తగ్గించడంతో ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ షేరు 6% క్షీణించి రూ.4,354 వద్ద స్థిరపడింది. ► జెన్సార్ టెక్నాలజీ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరడంతో కంపెనీ 6% నష్టపోయి రూ. 517 వద్ద స్థిరపడింది. ► సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ టాటా మోటార్స్ 2%, సన్ ఫార్మా 1.50%, మారుతీ 0.50% షేర్లు మాత్రమే లాభపడ్డాయి. సూచీ ఒకశాతం పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.2.42 లక్షల కోట్ల నష్టంవాటిల్లింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.321.40 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
బద్రీనాథ్ను సందర్శించిన ముఖేష్ అంబానీ, కాబోయే చిన్న కోడలు సందడి
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ గురువారం బద్రీనారాయణ ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ధామ్కు చేరుకున్నారు. ఈ పర్యటనలో అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కాబోయే భార్య రాధికా మర్చంట్తో కూడా ఉండటం విశేషం. అలాగే RIL డైరెక్టర్ మనోజ్ మోడీ ఈసారి ముఖేష్ అంబానీకి తోడుగా ఉన్నారు. బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ), సీఈవో బీడీ సింగ్, ఉపాధ్యక్షుడు కిషోర్ పవార్ వీరికి స్వాగతం పలికారు. అనంతరం కేదార్నాథ్ను కూడా సందర్శించారు అంబానీ. ఈ సందర్బంగా బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ (BKTC)కి అంబానీ 5 కోట్ల రూపాయలli విరాళంగా ఇచ్చారు. కాగా అంబానీ కుటుంబం దేవాలయాలు పవిత్ర పుణ్యక్షేత్రాలలో నిత్యం సందర్శిస్తుంటారు. గతంలో కూడా ఈ కమిటీకి విరాళాన్ని ప్రకటించారు అంబానీ. అంతేకాదు 2019లో బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ సభ్యుడిగా అనంత్ అంబానీ నియమితులయ్యారు. అలాగే అనంత్ అంబానీ, రాధిక వచ్చే ఏడాది పెళ్లి పీటలెక్కనున్నారు. చిన్ననాటి స్నేహితుడితో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఆమె తన అత్తమామలతో కలిసి అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించడం, తన సింప్లిసిటీతో ఫ్యాన్స్ ఆకట్టుకోవడం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో, అంబానీ తన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, కోడలు శ్లోకా మెహతా , మనవడు పృథ్వీ అంబానీతో కలిసి ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. గతేడాది అక్టోబర్లో అంబానీ బద్రీనాథ్ ధామ్, కేదార్నాథ్ ధామ్లను సందర్శించారు. అలాగే కేరళలోని గురువాయూర్ ఆలయాన్ని సందర్శించి, ఆలయ 'అన్నదానం' నిధికి 1.51 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ తిరుపతి ఆలయాన్ని సందర్శించినప్పుడు దాదాపు రూ.1.50 కోట్లు విరాళంగా ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్లో అంబానీ రాజస్థాన్లోని శ్రీనాథ్జీ ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే #WATCH | Reliance Industries Chairman, Mukesh Ambani offered prayers at Badrinath Dham in Uttarakhand. pic.twitter.com/fUUvdljevr — ANI (@ANI) October 12, 2023 -
ఎట్టకేలకు శుభవార్త చెప్పిన అంబానీ : త్వరలోనే మూడు ముళ్లు!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ తేదిని తాజాగా వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాధికా మర్చంట్తో నిశ్చితార్థాన్ని చేసుకున్న అనంత్ అంబానీ ముచ్చటగా మూడు ముళ్ల వేడుకతో వివాహ జీవితంలో అడుగు పెట్టబోతున్నారని సమాచారం. అంబానీ ఫ్యాన్ పేజీ అందించిన సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ( 2024) జూలై 10, 11, 12 తేదీల్లో అంగరంగ వైభవంగా అనంత్ -రాధిక పెళ్లి జరగబోతోంది. దీంతో అంబానీ ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. అంబానీ కుటుంబం అధికారిక ప్రకటన కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కాగా అనంత్ అంబానీ తన ప్రియురాలు రాధికా మర్చంట్తో 2023జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ లవ్బర్డ్స్ కుటుంబ వేడుకల్లో, పలు పబ్లిక్ ఈవెంట్లలో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులతో నిర్వహించిన గణేష్ చతుర్థి వేడుకల్లో కాబోయే భర్త అనంత్ అంబానీ కుటుంబంతో పాటు రాధికా మర్చంట్ సందడి చేసిన ఫోటోలు ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాయి. కాబోయే అత్తగారు నీతా అంబానీ, తోటికోడలు శ్లోకా మెహతాతో కలిసి పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచింది. -
నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం
రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ నీతా అంబానీ మరో అరుదైన ఘనతను సొంతంచేసుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే నుంచి ప్రతిష్టాత్మక సిటిజన్ ఆఫ్ ముంబై అవార్డు (2023-24)ను అందుకున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రీడలు, కళలు మరియు సంస్కృతికి అందించిన సేవలకు గాను రోటరీ క్లబ్ ఆఫ్ బొంబే ఈ అవార్డును ప్రదానం చేసింది. ఒక వ్యాపారవేత్తగా పరోపకారిగా నీతా అంబానీ సాధించిన మరో కీలక విజయం అంటూ అందరూ ఆమెకు అభినందనలు తెలిపారు. న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ బోర్డు గౌరవ ట్రస్టీగా ఎన్నికైన తొలి భారతీయురాలిగా నీతా అంబానీ చరిత్ర సృష్టించారు. అలాగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా రికార్డు క్రియేట్ చేసిన నీతా అంబానీ, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్యగా మాత్రమే కాదు, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సేవలందిస్తూ తనదైన ప్రత్యేకతను సాధించారు. ఇటీవల ముంబైలో ఆవిష్కరించిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ కళలకు సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన, కళాకారులకు ఇదొక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.అలాగే ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ ద్వారా భారతీయులందరికీ అందుబాటు ధరలో ప్రపంచ స్థాయి వైద్య సేవల్ని అందిస్తోంది అలాగే రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 5,000 స్కాలర్షిప్లను అందిస్తుంది. Nita Ambani receives the prestigious citizen of Mumbai Award 2023-24 from the Rotary Club of Bombay – a recognition of her enduring contributions to creating transformative institutions in healthcare, education, sports, arts, and culture. pic.twitter.com/SQ7d4CxPAL — ANI (@ANI) September 27, 2023 అంతే కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత విజయవంతమైన క్రికెట్ జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్కు అంబానీ యజమానిగా కూడా రాణిస్తున్నారు. అంబానీ ఇండియన్ సూపర్ లీగ్ను ప్రారంభించిన ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ ఫౌండర్ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. పిల్లల అభివృద్ధికి తోడ్పడే 'అందరికీ విద్య మరియు క్రీడలు' కార్యక్రమానికి కూడా ఆమె సారథ్యం వహిస్తున్నారు. ఇంకా, ఎంఐ న్యూయార్క్ ఫౌండర్గా ప్రొఫెషనల్ అమెరికన్ T20 లీగ్ మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ప్రారంభ ఎడిషన్ను గెలుచుకున్న ఘనత కూడా నీతా అంబానీకే దక్కింది. -
Jio AirFiber: జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసింది..లాంచింగ్ ధర, ఆఫర్లు
Jio AirFiber ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్ ఎయిర్ఫైబర్ ను లాంచ్ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించినట్టుగానే నేడు (సెప్టెంబరు 19) ఈ సేవలను ఆవిష్కరించింది. ముందుగా దేశంలోని 8 నగరాల్లో ఈ సేవలను జియో ప్రారంభిస్తున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. ప్రారంభ నెలవారీ ప్లాన్ రూ.599గాను, హై ఎండ్ ప్లాన్ను రూ.3,999 గాను జియో ప్రకటించింది. జియో ప్రకటించిన దాని ప్రకారం అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూణేలలో Jio AirFiber సేవలు అందుబాటులో ఉంటాయి. (గణపయ్యకు ఈ ఏడాది అంబానీ అదిరిపోయే గిఫ్ట్) Jio AirFiber విశేషాలు Jio AirFiber వినియోగదారులు గరిష్టంగా 1Gbps వేగంతో ఇంటర్నెట్ని యాక్సెస్ చేయవచ్చు. 550 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్లను , 16 ఓవర్-ది-టాప్ (OTT) యాప్లకు యాక్సెస్ను లభిస్తుంది. టీవీ లేదా బ్రాడ్బ్యాండ్ వినియోగదారులను ప్రపంచ-స్థాయి హోమ్ ఎంటర్టైన్మెంట్, బ్రాడ్బ్యాండ్, డిజిటల్ అనుభవానికి అప్గ్రేడ్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ద్వారా అందించబడుతుంది. జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ప్రారంభ ధర రూ. 599. ఎయిర్ఫైబర్ కస్టమర్లకు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా Wi-Fi రూటర్, 4K స్మార్ట్ సెట్-టాప్ బాక్స్ . వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్ను అందిస్తోంది. ఇంకా పేరెంటల్ కంట్రోల్, Wi-Fi 6కి మద్దతు ,ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్వాల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. (యాక్సిస్ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్ ) Jio AirFiber ప్లాన్స్ ♦ పోర్ట్ఫోలియోలో మొత్తం ఆరు ప్లాన్లున్నాయి. రెగ్యులర్ ప్లాన్ ధర రూ. 599, ఇది 30Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. ♦ రూ. 899. రూ. 1,199 ప్లాన్లు 100Mbps వద్ద అపరిమిత డేటా ♦ AirFiber Max కింద, ప్రాథమిక ప్లాన్ ధర రూ. 1,499గా నిర్ణయించింది. ఇది 300Mbps డేటాను అందిస్తుంది. ♦ రూ. 2,499 ప్లాన్ 500Mbps వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చు. ♦ అత్యంత ఖరీదైన జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ రూ. 3,999. ఇది 1Gbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. ♦ అన్ని ప్లాన్లు ఆరు లేదా 12 నెలల వ్యవధితో వస్తాయి , ఈప్లాన్ అన్నింటికి జీఎస్టీ అదనం ♦ ఇన్స్టాలేషన్ ఛార్జీలు రూ.1,000 ♦12 నెలల ప్లాన్పై ఇన్స్టాలేషన్ ఛార్జీలు లేవు ♦ ఇన్స్టాలేషన్ 1 అక్టోబర్, 2023 నుండి ప్రారంభం ఈ కొత్త ప్లాన్లు జియో అధికారిక వెబ్సైట్, లేదా సమీపంలోని Jio స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వాట్సాప్లో 60008-60008కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా వినియోగదారులు ఈ కనెక్షన్ని పొందవచ్చు. -
నీతా అంబానీ స్పెషల్ డైమండ్ వాచ్ చూశారా? ధర కోట్లలోనే
Nita Ambani Patek Philippe Nautilus Watchరిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ సాంప్రదాయ లుక్తో పాటు,సామాజిక కార్యక్రమాలు, అల్ట్రా- లగ్జరీ లైఫ్కి పెట్టింది పేరు. ఆమెకు సంబంధించి ఖరీదైన చీరలు, నగలు, చెప్పులు, లిప్స్టిక్,హ్యాండ్బ్యాగ్స్ ఇలా ప్రతి యాక్ససరీకి ఒక ప్రత్యేక ఉంటుంది. ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్యగానే కాదు, ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్కి యజమానిగా, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపక చైర్ పర్సన్గా, పరోపకారిగా నీతా అంబానీ పాపులర్. నీతా అంబానీ పటేక్ ఫిలిప్ నాటిలస్ వాచ్ ఆధునిక ఫీచర్లతో అద్భుతమైన డిజైన్తో నీతా అంబానీ పాటెక్ ఫిలిప్ నాటిలస్ 7118/1200ఆర్ వాచ్ లేటెస్ట్ బజ్గా నిలిచింది. 18k రోజ్ గోల్డ్ కేస్ , మ్యాచింగ్ బ్రాస్లెట్తో అందంగా కనిపిస్తోంది. చుట్టూ వజ్రాలు పొదిగిన పెర్ల్ డైమండ్-ఎంబెడెడ్ డయల్ స్పెషల్ లుక్ తీసుకొచ్చింది. గోల్డ్ ఒపలైన్ డయల్లో పాలిష్ చేసిన పింక్ హ్యాండ్స్, కౌంటర్లు కూడా ఉన్నాయి. ఈ పటేక్ ఫిలిప్ నాటిలస్ విలువ రూ. 1.05 కోట్లుగా తెలుస్తోంది. జాకబ్ & కో ఫ్లూర్స్ డి జార్డిన్ టూర్బిల్లాన్ పింక్ సఫైర్స్ వాచ్ విలువ రూ. 4.6 కోట్లు, అలాగే పటేక్ ఫిలిప్ ఆక్వానాట్ రోజ్ గోల్డ్ వాచ్ ధర రూ. 3.2 కోట్లు. ఇటీవల IPL మ్యాచ్లలో ఒకదానికి, నీతా అంబానీ తన IPL జట్టు ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆమె చేతికి ఉన్న లగ్జరీ డైమండ్ వాచ్ ధరించిన ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. ఖరీదైన బ్లూ కలర్ టాప్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఈ టాప్పై బంగారంతో ఎంబ్రాయిడరీ చేసిన 'MI'మనం చూడొచ్చు. దీంతోపాటు Audemars Piguet రాయల్ ఓక్ క్రోనోగ్రాఫ్ అమెథిస్ట్ డయల్ 26319OR వాచ్ ఖరీదు రూ. 3.1 కోట్లు. క్లీ డి కార్టియర్కు చెందిన మరో ఖరీదైన వాచ్ నీతా సొంతం. ఈ వాచ్ 18 క్యారెట్ గోల్డ్ అన్కట్ డైమండ్ బ్రాస్లెట్తో కూడిన రోజ్ కలర్ వాచ్. ఈ లగ్జరీ వాచ్లో ఫ్లింక్ సన్రే ఎఫెక్ట్ డయల్ అండ్ బ్లూ రోమన్ న్యూమరల్ అవర్ మార్కర్లు ఉన్నాయి. దీని ధర రూ.25 లక్షలకు పై మాటే. నీతా అంబానీ వాచ్ కలెక్షన్లో టాప్ -10 అత్యంత ఖరీదనవే కావడం విశేషం ఇంకా డైమండ్ నెక్లెస్లు, హ్యాండ్బ్యాగులు, కార్లు ఇలా లగ్జరీ లైఫ్ స్థయిల్,కాస్ట్లీ వస్తువుల కలెక్షన్ తో ఎప్పుడూ టాక్ఆఫ్ది టౌన్గా నిలుస్తారు. 1963 నవంబర్ 1 న జన్మించిన నీతా అంబానీ మధ్యతరగతి కుటుంబానికి చెందినది. ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన మహిళా పారిశ్రామికవేత్తల ఫోర్బ్స్ లిస్టులో నీతా అంబానీ చోటు సంపాదించు కున్నారు. ఇటీవల నీతా ముఖాష్ అంబానీ కల్చరల్సెంటర్(ఎన్ఎంఏసీసీ) ద్వారా భారతీయ కళలకు ప్రోత్సాహన్నిస్తున్నారు. -
రిలయన్స్ ఇషా అంబానీ మరో భారీ డీల్: కేకేఆర్ పెట్టుబడులు
KKR invests Reliance Retail రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ భారీ పెట్టుబడులను సాధించింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ అమెరికాకు,చెందిన KKR, రిలయన్స్రీటైల్ వాటాను1.42 శాతానికి పెంచుకోనుంది. ఇందుకుగాను రిలయన్స్ రీటైల్లో రూ. 2,070 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీంతో రిలయన్స్ రీటైల్ ప్రీ-మనీ ఈక్విటీ విలువ రూ. 8.36 లక్షల కోట్లకు చేరిందని కంపెనీ సోమవారం ప్రకటించింది. దీంతో ఈక్విటీ విలువ పరంగా దేశంలోని మొదటి నాలుగు కంపెనీలలో ఒకటిగా నిలిచింది. గత నెలలో ముఖేష్ అంబానీ రిటైల్ సామ్రాజ్యంలో ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడితరువాత ఈ ఒప్పందం జరిగడం విశేషం. న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ KKR రిలయన్స్ రిటైల్లో 2020లో ఆర్ఆర్విఎల్లో 1.28 శాతం వాటాల కొనుగోలు ద్వారా రూ. 5,550 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కొనుగోలుతో మొత్తం ఈక్విటీ వాటా పూర్తిగా పలచన ప్రాతిపదికన 1.42శాతానికి పెరిగింది. 2020లో వివిధ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుండి మొత్తం రూ. 47,265 కోట్ల నిధుల సమీకరించింది. దీంతో పాటు KKR రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం యూనిట్ అయిన జియో ప్లాట్ఫారమ్ల లిమిటెడ్లో కూడా పెట్టుబడిదారుగా ఉంది. (జీ20 సమ్మిట్: దాదాపు రూ. 400కోట్లు నష్టం, వ్యాపారుల ఆందోళన) 1976లో స్థాపించబడిన, KKR జూన్ 30, 2023 నాటికి సుమారు 519 బిలియన్ల డాలర్లు ఆస్తులను కలిగి ఉంది. కేకేర్ ఫాలోఅన్ పెట్టుబడులపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా ముఖేష్ అంబానీ, ఇటు రిలయన్స్తో భాగస్వామ్యంపై KKR సహ-CEO జో బే ఈ డీల్పై సంతోషం ప్రకటించారు. భారతదేశంలో నిజమైన కార్పొరేట్ లీడర్, ఇన్నోవేటర్. ఈ బృందంతో భాగస్వామ్యాన్ని కొనసాగించే అవకాశం లభించడం సంతోషమని కెకెఆర్లోని ఆసియా పసిఫిక్ ప్రైవేట్ ఈక్విటీ హెడ్ గౌరవ్ ట్రెహాన్ పేర్కొన్నారు. (విమానంలో వెర్రి వేషాలు, నిద్ర నటించిన మహిళ ఏం చేసిందంటే?) -
ఉత్తరాఖండ్ వరదలు:పెద్ద మనసు చాటుకున్న అనంత్ అంబానీ
RIL Director Anant Ambani దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ భారీ విరాళమిచ్చింది.భారీ వర్షాలు , వరదలు, కొండచరియలు విరిగిపడటం లాంటి వాటితో అతలా కుతమైన ఉత్తరాఖండ్కు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ రూ. 25 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించి రిలయన్స్ ప్రతినిది తనయ్ ద్వివేది ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. (‘మస్క్ తప్పు చేశావ్..ఇప్పటికైనా అర్థమవుతోందా?’) ఈ మేరకు అనంత్ అంబానీ ఒక లేఖ రాశారు. తాము అందించిన సాయం ద్వారా ఉత్తరాఖండ్ ప్రజల కోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళుతుందని ఆశిస్తున్నామని ని అంబానీ సిఎం ధామీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. రిలయన్స్ ద్వారా తాము పలు విద్య సామాజిక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 10 సంవత్సరాలకు పైగా రాష్ట్రానికి భాగస్వామిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నా మన్నారు. మరోవైపు ఆర్ఐఎల్కు, అనంత్ అంబానీకి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ధన్యవాదాలు తెలిపారు. (వరల్డ్ రిచెస్ట్ మేన్తో రహస్యంగా కవలలు: ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు) కాగా రిలయన్స్ ఫౌండేషన్ 2021లో కోవిడ్-19 సహాయ చర్యలకు మద్దతుగా ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి రూ. 5 కోట్లను అందించింది. మహమ్మారిపై సమిష్టి పోరాటంలో దేశం పట్ల ఆర్థిక సహాయం చేయడం తన కర్తవ్యమని కంపెనీ తెలిపింది. అలాగే ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ , కేదార్నాథ్ ఆలయ కమిటీలకు ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ గత ఏడాది రూ.2.5 కోట్లు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఆర్నాల్ట్, అంబానీ డీల్: అద్దె ఎంతో తెలిస్తే షాకవుతారు!
ప్రపంచ రెండో కుబేరుడు గ్లోబల్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లూయిస్ విట్టన్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ , ఆసియాకుబేరుడురిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన లగ్జరీ మాల్లో ఒక స్టోర్ను లీజుకు తీసుకున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లోని జియో వరల్డ్ ప్లాజాలో తన కొత్త స్టోర్ను అద్దెకు తీసుకున్నారు. మొత్తం 7,365 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు యూనిట్లకు గాను నెలకు చెల్లిస్తున్న అద్దె ఏకంగా 40.50 లక్షలుగా ఉంది. (కేంద్రం మరో కీలక నిర్ణయం: విండ్ఫాల్ ట్యాక్స్ కట్) ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం లూయిస్ విట్టన్ ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్లో ముఖేష్ అంబానీకి చెందిన నుండి రిటైల్ స్థలాన్ని దీర్ఘకాలిక లీజుకు ఒప్పందం కుదుర్చు కుంది. అంతేకాదుప్రపంచ లగ్జరీ బ్రాండ్ అతిపెద్ద షోరూంగా ఇది నిలవడం విశేషం. కంపెనీ తొమ్మిదిరన్న ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. ఇరు సంస్థలు ఆగస్టు 21న కుదర్చుకున్న ఒప్పందం ప్రకారం లూయిస్ విట్టన్ ఇండియా రిటైల్ రిలయన్స్కు నెలకు రూ.40.5 లక్షలు , లేదా మొత్తం లేదా నికర రాబడి వాటాలో 6 శాతం, ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తుంది. 36 నెలల తర్వాత అద్దె 15 శాతం పెరుగుతుంది. ఇందుకోసం కంపెనీ కంపెనీ రూ.2.43 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. కామన్ ఏరియాకు రూ.24.30 లక్షలు, ఫిట్అవుట్లకు రూ.29.46 లక్షలు కూడా చెల్లించారు.(డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) కాగా 1854లో పారిస్లో లూయిస్ విట్టన్చే దీన్ని స్థాపించారు. ప్రస్తుతం ఆర్నాల్ట్ దీనికి చైర్మన్ అండ్ సీఈవోగా ఉన్నారు. 2003లో న్యూఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఇండియాలో తొలి దుకాణాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం బెంగళూరు,ఢిల్లీ, ముంబైసహా దేశవ్యాప్తంగా మూడు స్టోర్లను కలిగి ఉంది. బెర్నార్డ్ ఆర్నాల్ట్ అతని నికర విలువ 208 బిలియన్ డాలర్లు. ముఖేష్ అంబానీ 94 బిలియన్ డాలర్ల నికర విలువతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడు. -
Reliance AGM 2023: జియో ఎయిర్ఫైబర్ వచ్చేస్తోంది..
ముంబై: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ వృద్ధి లక్ష్యాల సాధన దిశగా ప్రణాళికలు ప్రకటించింది. ఇందులో భాగంగా వినాయక చవితి కల్లా జియో ఎయిర్ఫైబర్ను అందుబాటులోకి తేనుంది. అలాగే, జియో ఫైనాన్షియల్స్ విభాగం ద్వారా బీమా ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. వచ్చే అయిదేళ్లలో 100 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు ప్రకటించారు. అదే క్రమంలో వారసత్వ ప్రణాళికలను కూడా వెల్లడించారు. ఆయన ముగ్గురు సంతానం (ఆకాశ్, ఈషా, అనంత్) కంపెనీ బోర్డులో నియమితులైనట్లు పేర్కొన్నారు. అలాగే, 2024 ఏప్రిల్ 19తో తన పదవీకాలం ముగియనున్నప్పటికీ.. మరో అయిదేళ్ల పాటు చైర్మన్గా కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. ఏజీఎంలో మరిన్ని విశేషాలు.. ఎయిర్ఫైబర్తో వైర్లెస్ బ్రాడ్బ్యాండ్.. సెప్టెంబర్ 19న వినాయక చవితి సందర్భంగా జియో ఎయిర్ఫైబర్ సరీ్వసులు ప్రారంభమవుతాయి. ఇది వైర్లు అవసరం లేని 5జీ బ్రాడ్బ్యాండ్ సరీ్వసులాంటిది. నెట్ కనెక్టివిటీకి ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు .. 5జీ నెట్వర్క్ను, అధునాతన వైర్లెస్ టెక్నాలజీలను ఉపయోగించుకుని ఇది వరుసలో చిట్టచివర్న ఉన్న వారికి కూడా బ్రాడ్బ్యాండ్ సేవలను అందుబాటులోకి తేగలదని ముకేశ్ అంబానీ తెలిపారు. ఆప్టికల్ ఫైబర్తో రోజూ 15,000 ప్రాంగణాలను కనెక్ట్ చేయగలుగుతుంటే, జియోఎయిర్ఫైబర్ దీనికి పది రెట్లు అధికంగా కనెక్ట్ చేయగలదు. తద్వారా 20 కోట్ల గృహాలు, ప్రాంగణాలకు జియో మరింత చేరువ కాగలదు. ఈ సందర్భంగా జియో ట్రూ5జీ డెవలపర్ ప్లాట్ఫాంను కూడా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్లో ఏర్పాటు చేసే తొలి జియో ట్రూ5జీ ల్యాబ్లో టెక్నాలజీ భాగస్వాములు, ఎంటర్ప్రైజ్ కస్టమర్లు .. వివిధ పరిశ్రమలకు అవసరమైన సొల్యూషన్స్ను రూపొందించవచ్చు. వాటిని పరీక్షించవచ్చు. అటు, కృత్రిమ మేధ (ఏఐ) ప్రయోజనాలను అందరికీ, అన్నిచోట్ల అందుబాటులోకి తెచ్చేందుకు జియో ప్లాట్ఫామ్స్ కృషి చేస్తోందని ముకేశ్ అంబానీ చెప్పారు. డిసెంబర్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తరణ పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయని తెలిపారు. జియోసినిమా వినోదానికి దేశీయంలోనే అతి పెద్ద డిజిటల్ వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. సీబీజీ ప్లాంట్లు.. గిగా ఫ్యాక్టరీలు.. 2035 నాటికి కర్బన ఉద్గారాల విషయంలో తటస్థ స్థాయిని సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. జామ్నగర్లో రెండు కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) డెమో యూనిట్లను నెలకొల్పాక, కేవలం 10 నెలల వ్యవధిలోనే ఉత్తర్ప్రదేశ్లోని బారాబంకీలో వాణిజ్యావసరాల కోసం తొలి సీబీజీ ప్లాంటును ఏర్పాటు చేసినట్లు అంబానీ చెప్పారు. వీటిని త్వరితగతిన 25కి, అటుపైన వచ్చే అయిదేళ్లలో 100కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. 2026 నాటికి బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీల తయారీ కోసం జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లో రూ. 75,000 కోట్లతో నాలుగు గిగాఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బీమాలోకి జేఎఫ్ఎస్... జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ (జేఎఫ్ఎస్) బీమా రంగంలోకి విస్తరించనున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. ఇది సరళమైన ఆరోగ్య, జీవిత, సాధారణ బీమా పాలసీలను అందిస్తుందని పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి విస్తరించేందుకు బ్లాక్రాక్తో కలిసి జేఎఫ్ఎస్ జాయింట్ వెంచర్ను ప్రకటించింది. టెలికం విభాగం జియోకి ఉన్న 45 కోట్ల మంది మొబైల్ ఫోన్ యూజర్లకు తమ ఉత్పత్తులను విక్రయించే యోచనలో ఉంది. టాప్ 4లో రిటైల్.. పలు అంతర్జాతీయ దిగ్గజాలు రిలయన్స్ రిటైల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ముకేశ్ అంబానీ చెప్పారు. ఒకవేళ దీన్ని స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేసి ఉంటే ప్రస్తుత వేల్యుయేషన్ ప్రకారం టాప్ 4 లిస్టెడ్ సంస్థల్లో రిటైల్ కూడా ఒకటిగా ఉండేదని ఆయన తెలిపారు. ‘‘2020 సెప్టెంబర్లో నిధులు సమీకరించినప్పుడు రిటైల్ వేల్యుయేషన్ రూ. 4.28 లక్షల కోట్లుగా ఉంది. మూడేళ్ల కన్నా తక్కువ వ్యవధిలోనే ఇది రెట్టింపయింది. రూ. 8.278 లక్షల కోట్ల వేల్యుయేషన్తో ఇటీవలే ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) 1 శాతం వాటాను కొనుగోలు చేసింది. నాణ్యత, నవకల్పన, కస్టమరు ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహించడం, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోగలుగుతుండటం వంటి సామర్థ్యాలకు ఇది నిదర్శనం’’ అని అంబానీ తెలిపారు. అటు రూ. 22 కోట్లకు కొనుగోలు చేసిన సాఫ్ట్డ్రింక్ క్యాంపా కోలాను ఆసియా, ఆఫ్రికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూ డా తీసుకెళ్లనున్నట్లు ఈషా అంబానీ తెలిపారు. వారసత్వ ప్రణాళికలు.. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన వివిధ వ్యాపార విభాగాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానం తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరారు. నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. వారు ఈ హోదాను ‘కష్టపడి సంపాదించుకున్నారని’ అంబానీ తెలిపారు. ‘‘ఈషా, ఆకాశ్, అనంత్లో నేను, మా తండ్రిగారు ధీరుభాయ్ అంబానీ నాకు కనిపిస్తారు. ధీరుభాయ్లోని ఆ మెరుపు వారిలో నాకు కనిపిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జియో ఇన్ఫోకామ్ను ఆకాశ్, రిటైల్ వ్యాపారాన్ని ఆయన కవల సోదరి ఈషా (31), కొత్త ఇంధన వ్యాపార విభాగాన్ని అనంత్ (27) పర్యవేక్షిస్తున్నారు. 2002లో ధీరుభాయ్ మరణానంతరం సోదరుడు అనిల్ అంబానీతో వ్యాపార పంపకాలపరంగా వివాదం తలెత్తిన నేపథ్యంలో ముకేశ్ తాజా వారసత్వ ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, రిలయన్స్ ఫౌండేషన్ కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టే ఉద్దేశంతో ముకేశ్ సతీమణి నీతా అంబానీ రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. అయితే, ఫౌండేషన్ చైర్పర్సన్గా శాశ్వత ఆహా్వనితురాలు హోదాలో ఆమె బోర్డు సమావేశాలన్నింటికి యథాప్రకారంగా హాజరవుతారు. అత్యధిక డిమాండ్ ఉన్నవి, అనేక దశాబ్దాల పాటు ఆరోగ్యకరమైన వృద్ధి సాధించగలిగేవి అయిన వ్యాపారాలను మేము ఎంచుకున్నాం. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలను నిర్మించగలిగాం. మా మూడు వృద్ధి చోదకాలు .. (ఓ2సీ, రిటైల్, జియో డిజిటల్ సర్వీసులు) మరింత విలువ జోడించగలవు. కొత్తగా మా నాలుగో వృద్ధి ఇంజిన్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా వీటికి తోడుగా చేరింది. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ చైర్మన్ -
రిలయన్స్ ఏజీఎం: గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నీతా అంబానీ కొత్త ప్లాన్స్
Reliance AGM Nita Amban NMACC 46వ రిలయన్స్ వాటాదారుల వార్షిక సమావేశంలో రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. దేశ సంసృతినుంచి క్రీడల దాకా తమ ఫౌండేషన్ కృషిని వివరించారు. ముఖ్యంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సొసైటీ గురించి ప్రకటించారు. భారతీయ సంస్కృతి,కళ పట్ల తమ నిబద్ధతకు తాము లాంచ్ చేసిన ఎన్ఎంఏసీసీ అని తెలిపారు. రానున్న పదేళ్లలో 50వేల మంది విద్యార్థుల చదువు, భవిష్యత్తుకోసం పనిచేయనున్నాం.బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిపి మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. 10 లక్షల మహిళల సాధికారత కోసం తాము బాగా కృషి చేయనున్నట్టు నీతా అంబానీ వెల్లడించారు. విద్య, క్రీడలు ఇప్పటివరకు 22 మిలియన్ల మంది యువకులకు చేరువయ్యాయని నీతా అంబానీ చెప్పారు ఈ సందర్భంగా బిల్ గేట్స్ దీనికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. రానున్న పదేళ్లలో 50వేలమంది విద్యార్థుల చదువు, భవిష్యత్తుకోసం పనిచేయనున్నాం. ఈ సెంటర్ను లాంచ్ చేసినప్పటినుంచి 20లక్షలమంది ఈ సెంటర్ను సందర్శించి నట్టు తెలిపారు. అలాగే ఐపీఎల్ టీం గురించి మాట్లాడారు.హార్ధిక ప్యాండ్యా, బుమ్రా,తిలక వర్మ గురించి చెప్పారు. విదేశాల్లో ముఖ్యంగా విమెన్ ఐపీఎల్ టీం ప్రారంభించినట్టు తెలిపారు. అంతర్జాతీయ ఒలంపిక్ మెంబర్గా ఇండియాకు ఎలంపిక్ తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రిలయన్స్ ఫౌండేషన్తో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం ఆవిష్కరణలు ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాగే ఆ ఆవిష్కరణలను అత్యంత అవసరమైన వారికి అందించడంపై దృష్టి పెట్టడం కూడా బావుంది: బిల్ గేట్స్ అధిక-నాణ్యత, సరసమైన మందులు, వ్యాక్సిన్లను తయారు చేయడంలో భారతదేశం బ్రహ్మాండమైన ట్రాక్ రికార్డ్ను కలిగి ఉంది. రిలయన్స్తో ఫౌండేషన్ సహకారంతో మాదక ద్రవ్యాలు , పాయింట్-ఆఫ్-కేర్ డయాగ్నస్టిక్లను అభివృద్ధికి, కొత్త ఆవిష్కరణలు అమలుకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ చెప్పారు. అంటు వ్యాధుల నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా తాము సంఘాలతో కలిసి పని చేయడం కూడా కొనసాగిస్తామని బిల్ గేట్స్ ప్రకటించారు. -
రిలయన్స్ ఏజీఎం: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా
రిలయన్స్ ఇండస్ట్రీ 46వ ఏజీఎం సోమవారం జరిగింది. ఈ సందర్బంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీరిలయన్స్ గ్రూప్,వాటాదారులను ఉద్దేశించి అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. అలాగే రిలయన్స్ అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక ప్రకటన చేశారు. అలేగే సంస్థను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాటాదారులు, ఉద్యోగులక అభినందనలు తెలిపారు. ముఖ్యంగా బోర్డులో కీలకమార్పులను ప్రకటించారు. అంబానీ తన భార్య నీతా అంబానీ రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకుంటారని ప్రకటించారు. అలాగే ఇషా,అనంత్ అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. రిలయన్స్ జియో స్మార్ట్ హోమ్ సేవలను ప్రకటించింది. ఆటోమేట్, రిమోట్ యాక్సెస్ని అనుమతించే ఆధునిక పరికరాల కలయిక.. యాప్లు, రిమోట్లు, స్విచ్లు, వాయిస్ కమాండ్లు లేదా కృత్రిమ మేధస్సు ద్వారా ఈ సేవలను నియంత్రించనుంది. రిలయన్స్ గత 10 సంవత్సరాలలో 150 బిలియన్ల డాలర్లకుపైగా పైగా పెట్టుబడి పెట్టిందని గుర్తుచేశారు. తమ అన్ని వ్యాపారాలలో 2.6 లక్షల ఉద్యోగాలను సృష్టించిందనీ, ఇందులో 3.9 లక్షల మంది తమ ఉద్యోగులు ఉన్నారని అంబానీ ప్రకటించారు. తమ గ్రోత్కు సహకరించిన వాటాదారులకు, ఉద్యోగులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ⇒ ఇది ఆత్మవిశ్వాసం నిండిన నవ భారతం ⇒ రిలయన్స్ అభివృద్ధి చెందుతున్న కొత్త భారతదేశానికి నాందిగా నిలిచింది ⇒ మేం అసాధ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నాం, అంతేకాదు వాటిని సాధించాం ⇒ జియో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ⇒ తొమ్మిదినెలలో 96 శాతం 5జీ సేవలను దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ఏడాది డిసెంబరునాటికి దేశ్యాప్తంగా అందుబాటులోకి తెస్తాం. ⇒ వోల్టాయిక్ ప్యానెల్స్, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్స్ కోసం నాలుగు గిగాఫ్యాక్టరీలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. జామ్నగర్లో పూర్తిగా సమీకృత న్యూ ఎనర్జీ తయారీ పర్యావరణ వ్యవస్థను నెలకొల్పేందుకు కంపెనీ రూ. 75,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని అంబానీ చెప్పారు. ⇒ jio AirFiber సెప్టెంబర్ 19 న గణేష్ చతుర్థి సందర్భంగా ప్రారంభించనున్నట్టు అంబానీ ప్రకటించారు. ⇒ జియో మార్ట్ , వాట్సాప్ల ప్రారంభం అద్భుతమైన వృద్ధిని సాధించింది. 2022లో ప్రారంభించినప్పటి నుండి వాట్సాప్లో జియో మార్ట్ వినియోగదారుల సంఖ్య 9 రెట్లు పెరిగింది: ఇషా అంబానీ ⇒జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFS) జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా రంగొంలో సులభమైన , స్మార్ట్ బీమా ఉత్పత్తులను అంతరాయం లేని డిజిటల్ ఇంటర్ఫేస్ ద్వారా అందించడానికి బీమా విభాగంలోకి ప్రవేశిస్తుందని రిలయన్స్ చైర్మన్ ప్రకటించారు. ⇒జియో వృద్ధికి అత్యంత ఉత్తేజకరమైన సరిహద్దుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి ప్రస్తావించిన ఆయన ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను వివరించారు.క్లౌడ్ అండ్ ఎడ్జ్ లొకేషన్లలో 2,000 మెగావాట్ల వరకు AI-రెడీ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని సృష్టించేందుకు కంపెనీ నిబద్ధతను అంబానీ వెల్లడించారు. -
అంబానీ కంపెనీ దూకుడు! భారీగా పెరిగిన నికర రుణం
దూకుడు మూలధన వ్యయం కారణంగా 2023 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ( Reliance Industries Ltd )కు చెందిన రిటైల్ విభాగం నికర రుణం అనేక రెట్లు పెరిగింది. ఏడాది క్రితం రూ.1,600 కోట్లు ఉన్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ( Reliance Retail Ventures Ltd ) నికర రుణం 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.37,500 కోట్లకు పెరిగినట్లుగా కంపెనీ ఫైలింగ్స్ ద్వారా తెలుస్తోంది. కంపెనీ మూలధన వ్యయంలో భారీ పెరుగుదలే నికర రుణం ఈ స్థాయిలో పెరగడానికి కారణంగా తెలుస్తోంది. కంపెనీ క్యాపెక్స్ 70 శాతం పెరిగి రూ.51,400 కోట్లకు చేరింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొత్తం మూలధన వ్యయంలో మూడవ వంతు. రిలయన్స్ మూలధన వ్యయం గత ఏడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా 2023 ఆర్థిక సంవత్సరంలో 85 ఉందని జెఫ్రీస్ ఫైనాన్షియల్ గ్రూప్ ఒక పరిశోధనా నోట్లో తెలిపింది. ఇక కంపెనీ రిటైల్ సెగ్మెంట్ మూలధన వ్యయం గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1 లక్ష కోట్లకుపైగా ఉంది. స్థాయితో సంబంధం లేకుండా పోర్ట్ఫోలియో స్ప్రెడ్లో రిలయన్స్ రిటైల్ దూసుకెళ్తోంది. ఇదీ చదవండి: Yousta: తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్లోనే.. -
ఇషా అంబానీ దూకుడు: ఖతార్ నుంచి రూ.8 వేల కోట్ల పెట్టుబడులు
బిలియనీర్,రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పెట్టుబడుల విషయంలో దూసుకుపోతోంది. రిలయన్స్కు చెందిన రీటైల్ విభాగం భారీ పెట్టుబడులను సాధించింది. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (QIA) రిలయన్స్ రీటైల్లో రూ. 8,278 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడి నిమిత్తం సంస్థలో దాదాపు ఒక శాతం వాటాను తీసుకుంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ద్వారా, అనుబంధ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్విఎల్)లో రూ. 8,278 కోట్ల పెట్టుబడి పెట్టనుందని రిలయన్స్ బీఎస్ఈ ఫైలింగ్లోతెలిపింది. ఇది రిలయన్స్ రిటైల్లో 0.99 శాతం వాటాను కొనుగోలుతో మైనారిటీ ఈక్విటీ వాటాగా మారుతుంది. ఈ పెట్టుబడి ప్రీ-మనీ ఈక్విటీ వాల్యూ రూ. 8.278 లక్షల కోట్లు అనిఆగస్టు 23న విడుదల చేసిన ప్రకటనలో రిలయన్స్ వెల్లడించింది. ఇషా అంబానీ ఏమన్నారంటే రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో క్యూఐఏ పెట్టుబడులపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా ముఖేష్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. తమ సంస్థను ప్రపంచ స్థాయి సంస్థగా మరింత అభివృద్ధి చేయడం ద్వారా, భారతీయ రిటైల్ రంగాన్ని మార్చేందుకు, క్యూఐఏ గ్లోబల్ అనుభవం బలమైన ట్రాక్ రికార్డ్ తమకు లబ్ది చేకూరుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా రిటైల్ మార్కెట్లో, విభిన్నమైన పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో చేరడంపై ఆనందంగా ఉందని క్యూఐఏ సీఈఓ మన్సూర్ ఇబ్రహీం అల్-మహమూద్ అన్నారు. కాగా ఆర్ఆర్విఎల్ 2020లో వివిధ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుండి రూ. 4.21 లక్షల కోట్ల ప్రీ-మనీ ఈక్విటీ వాటాగా మొత్తం రూ. 47,265 కోట్ల నిధుల సమీకరించిన సంగతి తెలిసిందే. -
అంబానీ ప్లాన్లు మామూలుగా లేవుగా: రూ.40 వేల కోట్లపై కన్ను
ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో భారీ ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ఆయిల్ నుంచి టెలికాం దాకా పట్టిందల్లా బంగారంలా దూసుకు పోతున్న అంబానీ తాజాగా వేల కోట్ల నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ప్రపోజల్ను మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ముందు ఉంచినట్టు సమాచారం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (InvIT) ద్వారా ప్రాథమికంగా రూ.400 కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తోంది.దీనికి సంబంధించిన ప్రతిపాదనను సెబీ వద్ద దాఖలు చేసినట్లు ఇండియా రిటైలింగ్ రిపోర్ట్ చేసింది. రిలయన్స్ రిటైల్ ఇన్విట్ రానున్న రెండు నెలల్లో ప్రారంభంలో సుమారు రూ.400 కోట్లను సమీకరించనుంది. మొదటి రౌండ్ నిధులతో ట్రస్ట్ను ఏర్పాటు చేయనున్నాయి. అయితే ఈ ఏడాది క్యూ4 నాటికి మొత్తంగా రూ.25,000-40,000 కోట్ల దాకా నిధులను సేకరించాలనేది ప్రణాళిక. అయితే ఈ వార్తలపై రిలయన్స్ అధికారంగా స్పందించాల్సి ఉంది. (అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఎల్ఐసీ భారీ వాటా కొనుగోలు) 2.4-3 బిలియన్ డాలర్ల ట్రస్ట్తో రిటైల్ వేర్హౌసింగ్ ఆస్తులను మోనటైజ్ చేయడానికి సిద్ధమవుతోందన్న వార్తలు గత ఏప్రిల్ నుంచే హల్చల్చేస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ రిటైల్ విభాగం ఇటీవలి కాలంలో ఆఫ్లైన్ సెగ్మెంట్లో భారీగా విస్తరిస్తోంది.ఈ క్రమంలో రిలయన్స్ రిటైల్ ఇతర కీలకమైన అంబానీ సంస్థలను అధిగమించి 112 బిలియన్ డాలర్ల విలువగా బ్రోకరేజ్ సంస్థ బెర్న్స్టెయిన్ ఇటీవల నివేదించడం గమనార్హం. దీంతో ఈ వార్తలు మరింత బలం చేకూరుతోంది. కాగా 2022 ఆగస్టులో రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్ పగ్గాలను ఇషా అంబానీ చేపట్టారు. ఆమెనేతృత్వంలోని రిలయన్స్ రిటైల్లో పెట్టుబడి రూ. 25,000 కోట్లకు పైమాటే.దీనికి అదనంగా రూ. 15000 కోట్లుపెట్టుబడులను రిలయన్స్ అందించనుంది. -
అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఎల్ఐసీ భారీ వాటా కొనుగోలు
LICacquires6.66pcJFS: లయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జ్ అయిన ఫైనాన్షియల్ ఎంటిటీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ సంస్థలో 6.66 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ మేరకు ఎల్ఐసీ మంగళవారం ప్రకటించింది. ఇదీ చదవండి:ఎస్బీఐ లైఫ్: కస్టమర్లకు గుడ్ న్యూస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFS) షేర్లు సోమవారం లిస్టింగ్ తర్వాత దాని తొలి ట్రేడింగ్ సెషన్లో లోయర్ సర్క్యూట్ను తాకాయి. ఈ షేరు ఒక్కో షేరుకు రూ. 265గా లిస్ట్ అయింది. చివరికి 5 శాతం నష్టంతో ముగిసిన సంగతి తెలిసిందే. కంపెనీ విభజన తేదీ అయిన జూలై 20న దాని ఉత్పన్నమైన ధర రూ. 261.85 కంటే 1 శాతానికి పైగా మార్జినల్ ప్రీమియం. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.68 లక్షల కోట్ల నుంచి రూ. 1.6 లక్షల కోట్లకు తగ్గింది. మరోవైపు వరుసగా రెండో సెషన్లో మంగళవారం కూడా జేఎఫ్ఎస్ షేర్లు లోయర్ సర్క్యూట్ను తాకాయి. -
లగ్జరీ అపార్ట్మెంట్ను విక్రయించిన ముఖేష్ అంబానీ
ఆసియాలో అత్యంత ధనవంతుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ లగ్జరీ అపార్ట్మెంట్ను విక్రయించారు. న్యూయార్క్లో ఉన్న తన విలాసవంతమైన 2BHK అపార్ట్మెంట్ను రూ. 74.53 కోట్లకు అమ్మేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాస భవనంలో ‘యాంటిలియా’ లో ఉంటున్న అంబానీ విదేశంలో ఖరీదైన ఆస్తిని విక్రయించడం వార్తల్లో నిలిచింది. అయితే ఎందుకు అమ్మారు, ఎవరెవరి మధ్య ఈ డీల్ జరిగిందనే వివరాలు అందుబాటులో లేవు. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్కు బంపర్ ఆఫర్) న్యూయార్క్ పోస్ట్ తాజా నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ న్యూయార్క్లోని మాన్హట్టన్లో తన విలాసవంతమైన కాండోస్లో ఒక దానిని రూ. 74.53 కోట్లకు (9 మిలియన్ డాలర్లు) విక్రయించారు. ఈ అపార్ట్మెంట్ 400 W. 12వ వీధిలోని నాల్గవ అంతస్తులో ఉంది, దీనిని సుపీరియర్ ఇంక్ అని కూడా పిలుస్తారు. రిలయన్స్ అధినేత విక్రయించిన అపార్ట్మెంట్ప్రముఖ హడ్సన్ నది ఒడ్డున, 3 బాత్రూమ్లు, కాండోలో 10-అడుగుల ఎత్తైన పైకప్పులు, నాయిస్ ప్రూఫ్ విండోస్, చెఫ్ కిచెన్ హెరింగ్బోన్ హార్డ్వుడ్ ఫ్లోర్లు ఉన్నాయి. ఈ భవనం 1919 నాటిదని, దీనిని గతంలో సుపీరియర్ ఇంక్ ఫ్యాక్టరీ అని పిలిచేవారట. 2,406 చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన సౌకర్యాలతో రెన్నోవేట్ 2009లో అమ్మకానికి వచ్చాయి. మార్క్ షటిల్వర్త్, లెస్లీ అలెగ్జాండర్, మార్క్ జాకబ్స్ మరియు ఇతరులతో సహా కొంతమంది సెలబ్రిటీలు ఇందులో నివసిస్తున్నారు. (అమ్మకోసం...భళా బుడ్డోడా! వైరల్ వీడియో) కాగా ముఖేష్ అంబానీ నివాసముండే ముంబైలోని యాంటిలియా ఖరీదు రూ. 15,000 కోట్లకు పైనే.దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. -
జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ త్వరలో..
న్యూఢిల్లీ: రిటైల్, టెలికం రంగాల్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఆర్థిక రంగంలోనూ అదే తీరును కొనసాగించడంపై దృష్టి పెడుతోంది. త్వరలోనే జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ను స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయనున్నట్లు సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. తద్వారా సంస్థ పూర్తి విలువను, సామర్థ్యాలను వెలికి తీసే అవకాశం ఉంటుందని సంస్థ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. పర్యావరణ అనుకూల ఇంధనాలపైనా భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సాంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వనరులకు మళ్లడమనేది చరిత్రలోనే కీలక మైలురాయిగా నిలవగలదని అంబానీ తెలిపారు. అటు మరో అయిదేళ్ల పాటు అంబానీని సీఎండీగా కొనసాగించాలన్న ప్రత్యేక తీర్మానానికి షేర్హోల్డర్ల ఆమోదాన్ని కంపెనీ కోరింది. ప్రస్తుతం 66 ఏళ్లున్న అంబానీ.. సంస్థ నిబంధనల ప్రకారం 70 ఏళ్లకు రిటైర్ కావాలి. అంతకు మించిన కాలవ్యవధికి కొనసాగించదల్చుకుంటే దానికి ప్రత్యేక తీర్మానం చేయాల్సి ఉంటుంది. -
తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ
దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనిక పారిశ్రామికవేత్తగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇపుడు కుటుంబ వారసురాలిగా బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చిన అంబానీ తనయ ఇషా అంబానీ కూడా సంచలనం సృష్టించారు. రిలయన్స్ రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ లాభాల్లో మాతృ సంస్థనే అధిగమించింది. దశాబ్దాల చరిత్ర కలిగిన రిలయన్స్తో పోలిస్తే దాదాపు రెండింతలు విలువను కలిగి ఉందట. బాధ్యతలను స్వీకరించిన అనతి కాలంలోనే రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని శరవేగంగా పరుగులు పెట్టిస్తూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు ఇషా. బ్రోకరేజ్ సంస్థ బెర్న్స్టెయిన్ తాజా నివేదిక ప్రకారం ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ విలువను రూ.9,26,055 కోట్లుగా (112 బిలియన్ డాలర్లు) అంచనా వేసింది. ఆయిల్ టు కెమికల్స్ రిలయన్స్ వ్యాపారం రూ.4,71,295 కోట్ల కంటే రెండు రెట్లు ఎక్కువ అని తెలిపింది. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?) రిలయన్స్ రిటైల్ అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు, భారీ పెట్టుబడులతో సరికొత్త విస్తరణలతో కంపెనీని కొత్త పుంతలు తొక్కిస్తోంది. రిలయన్స్ EBITDA భారీ పెరుగుదలకు డిజిటల్ రిటైల్, న్యూ ఎనర్జీతో సాధ్యమైందని బెర్న్స్టెయిన్ వెల్లడించింది. అంతేకాదు 2027 రిలయన్స్ రిటైల్ వ్యయం రూ.18,900 కోట్లకు చేరుకుంటుందని అంచనావేసింది. రిలయన్స్ మొత్తం మూలధన వ్యయంలో 19శాతం వాటాను కలిగి ఉంటుందని కూడా అంచనా వేసింది.రిలయన్స్ రిటైల్ మార్కెట్ నాయకత్వం స్టోర్ నెట్వర్క్ను విస్తరించడం (గత రెండు సంవత్సరాల్లో 1.5 రెట్లు), కొత్త బ్రాండ్లను (1.2 బిలియన్ డాలర్లుపెట్టుబడులు), ఇ-కామర్స్/న్యూ కామర్స్ (రూ. 18 శాతం మిశ్రమం) కొనుగోళ్లతో 7.7 శాతం ఆరోగ్యకరమైన మార్జిన్లతో ప్రత్యర్థులతో పోలిస్తే వార్షిక ప్రాతిపదిక (రూ. 20 శాతం)బలమైన వృద్ధిసాధిస్తోందని పేర్కొంది. (ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?) రిలయన్స్ రిటైల్ దేశంలో అతిపెద్ద ఆర్గనైజ్డ్ రీటైలర్ అని పేర్కొన్న బ్రోకరేజ్ సంస్థ, కంపెనీ ఆదాయం 30 బిలియన్ల డాలర్లతో దేశంలోని మూడు రిటైలర్ల ఉమ్మడి స్కేల్ కంటే 2.5 రెట్లు ఎక్కువఅని వ్యాఖ్యానించింది. 2022, ఆగస్టులో రిలయన్స్ రిటైల్ లీడర్గా ఇషా అంబానీ నియమితులైన సంగతి తెలిసిందే. -
ఇషా అంబానీ అంటే అంతే: అన్కట్డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?
ఆసియాలోనే అత్యంత ధనవంతులైన కుటుంబానికి చెందిన బిజినెస్ ఉమెన్ ఇషా అంబానీ వ్యాపార ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం బిలియనీర్ ముఖేష అంబానీ కుమార్తెగానే కాదు, విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తోంది. అందేకాదు ఫ్యాషన్ ఐకాన్గా తన ఫ్యాన్స్నుఆకట్టుకుంటూనే ఉంటుంది. చూడచక్కని లెహంగా, ముచ్చటైన చీరలు, రాయల్ జ్యువెలరీ, అంతకుమించిన ఫ్యాషన్ అండ్ క్లాసీ స్టైల్తో అందర్నీ మెస్మరైజ్ చేయడం ఇషా స్పెషాల్టీ. ఈ నేపథ్యంలో 165 కోట్ల అన్కట్ డైమండ్ నెక్లెస్ వార్తల్లో నిలిచింది. (బర్త్ డే నాడు కొత్త బిజినెస్లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు!) ఇషా అంబానీ ఖరీదైన వస్తువులలో డైమండ్ నెక్లెస్ స్పెషల్గా నిలుస్తోంది. ఇషా తన వివాహానికి ముందు జరిగిన వేడుకలో మొదట ధరించిన అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్ కూడా ఒకటి. దీని ధర ఖచ్చితంగా తెలియనప్పటికీ, ఆభరణాలు, వజ్రాల నిపుణుల ప్రకారం, 20 మిలియన్ల డాలర్లు (సుమారుగా రూ. 165 కోట్లు) ఉంటుందని అంచనా. ఇషా ప్రీ-వెడ్డింగ్ వేడుక గురించి మాట్లాడుకుంటే ఫ్యాషన్స్టార్ ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా షెల్ఫ్ల నుండి రాణి పింక్ లెహంగాతో పాటు కాస్ట్లీ డైమండ్ నెక్లెస్తో అందరి దృష్టిని ఆకర్షించింది. బెస్పోక్ అన్కట్ నెక్లెస్లో 50 పెద్ద అన్కట్ డైమండ్లతో చాలా స్పెషల్గా రూపొందించారట. అలాగే బనీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్ను గ్రాండ్ ఈవెంట్ సందర్బంగా ఇషా అదే నెక్లెస్ను ధరించింది. ఈవెంట్లో డిజైనర్ ద్వయం అబు జానీ అండ్ సందీప్ ఖోస్లా రూపొందించిన ఎరుపు రంగు టల్లే కేప్తో అందమైన రెడ్ కలర్ వాలెంటినో గౌను ధరించింది. కాగా 2008లో ఫోర్బ్స్ 'యంగెస్ట్ బిలియనీర్ వారసురాలు' జాబితాలో ఇషా అంబానీ రెండవ స్థానంలో నిలిచింది. యేల్ యూనివర్శిటీ సైకాలజీ , సౌత్ ఏషియన్ స్టడీస్లో పట్టా పొందిన ఇషా రిలయన్స్కుచెందిన టెలికాం, రీటైల్ బిజినెస్లో దూసుకు పోతోంది. డిసెంబర్ 12, 2018న బిలియనీర్, అజయ్ పిరమల్, స్వాతి పిరమల్ల కుమారుడు, వ్యాపార దిగ్గజం ఆనంద్ పిరమల్తో వివాహైంది. ఇషాకు ఇద్దరు పిల్లలు (ట్విన్స్) ఉన్నారు. -
బ్లాక్రాక్ బ్యాక్ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం
ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ వ్యాపార విస్తరణలో దూసుకుపోతున్నారు. దేశంలో ఫైనాన్స్ వ్యాపారానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఆ రంగంలోని ప్రత్యర్థులను ఢికొట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోని అతిపెద్ద అసెట్ మ్యానేజ్మెంట్ కంపెనీ బ్లాక్రాక్తో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇటీవల డీమెర్జ్ అయిన జియో ఫైనాన్సియల్స్తో కలిసి ఒక జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయనున్నారు. ఇరు సంస్థల సమ భాగస్వామ్యంతో జియో బ్లాక్రాక్ అనే జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మొత్తం 300 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చట్టపరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాతమ జాయింట్ వెంచర్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. రిలయన్స్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విడిపోయిన కొద్ది రోజులకే ఈ డీల్ కుదుర్చుకోవడం విశేషంగా నిలుస్తోంది. జూన్ చివరి నాటికి 9.4 ట్రిలియన్ డాలర్లు ఆస్తుల నిర్వహణలో ఉన్న బ్లాక్రాక్తో దాదాపు 20 బిలియన్ డాలర్లు మార్కెట్ క్యాప్తో ఉన్న జియో ఫైనాన్సియల్స్ డీల్ కీలకమైన, వ్యూహాత్మకమైన వ్యాపార నిర్ణయంగా మార్కెట్ నిపుణుల అంచనా. (షాకిస్తున్న వెండి, బంగారం ధరలు, ఏకంగా రూ. 1100 జంప్) జియో ఫైనాన్షియల్ సర్వీసెస్తో కలిసి భారతదేశంలో రాబోయే జాయింట్ వెంచర్ ద్వారా ఇండియాలో తమ ఉనికిని మరింత విస్తరణకు కృషి చేయడం చాలా ఆనందంగా ఉందని, బ్లాక్రాక్కు ఇది కీలక అడుగు అని బ్లాక్రాక్ చైర్మన్, సీఈవో లారీ ఫింక్ లింక్డ్ఇన్ పోస్ట్లో తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా పెట్టుబడులు, రిస్క్ మేనేజ్ మెంట్లో బ్లాక్రాక్ లోతైన నైపుణ్యంతో, సాంకేతిక సామర్థ్యం జియో ఫైనాన్షియల్స్ లోతైన మార్కెట్ నైపుణ్యం కలగలిసి తమ డిజిటల్ ప్రొడక్ట్స్ డెలివరీ బాటలు వేస్తుందని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో హితేష్ సేథియా చెప్పారు. (Maruti Jimny Into Camping Setup: మారుతి జిమ్నీని సింగిల్ బెడ్తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో) -
బెదిరింపులు: అంబానీ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు, ప్రత్యేకత తెలిస్తే..!
ఆసియాలో అత్యంత ధనవంతుడు, ఇండియాలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ఇండస్ట్రీస్ (మార్కెట్ క్యాప్ రూ. 17.69 ట్రిలియన్లు) అధినేత ముఖేష్ అంబానీ ఖరీదైన కార్ల విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టు ఉంటారు. తాజాగా మోస్ట్ సేఫెస్ట్, 'బుల్లెట్ ప్రూఫ్' మెర్సిడెస్ బెంజ్కారును ఆయన సొంతం చేసుకున్నారు. దీని విలువ 10 కోట్ల రూపాయలకు పైమాటే. ఈ కారుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. బిలియనీర్ అంబానీ కుటుంబ సభ్యులు లగ్జరీ ఎస్యూవీలు, ఖరీదైన కార్లతో పొడవైన కాన్వాయ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. తాజాగా మెర్సిడెస్-బెంజ్-S680 గార్డ్ బుల్లెట్ప్రూఫ్ సెడాన్ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ మోడళ్లలో ఒకటి ఎస్ 680 గార్డ్ సెడాన్. ఇటీవల అంబానీకి బెదిరింపులు ఎక్కువైన తరుణంలో ఈ కొత్త కారు ప్రత్యేకతలు విశేషంగా నిలుస్తున్నాయి. (ట్విటర్ కొత్త లోగో: ఉద్యోగులు అరెస్ట్, వీడియో వైరల్ ) CS12 Vlogs షేర్ చేసిన వీడియోలో కాన్వాయ్తో పాటు, కొత్త బుల్లెట్ప్రూఫ్ కారులో చూడవచ్చు. ఇది ఇతర మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాగానే కనిపిస్తుంది. కానీ సాధారణ సెడాన్ కంటే దాదాపు 2 టన్నుల బరువు ఎక్కువ . అలాగే దీని బాడీ ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ షెల్ను కలిగి ఉంది. కారులో బుల్లెట్, బ్లాస్ట్ ప్రూఫ్, మల్టీ-లేయర్ గ్లాస్ ఉన్నాయి. మెషిన్ గన్లు కాల్పులనుంచి రక్షించే కెపాసిటీ ఉన్న కారిది. (ఐఆర్సీటీసీ డౌన్, యూజర్లు గగ్గోలు!) కేవలం తుపాకీ కాల్పుల తాకిడికి మాత్రమే తట్టుకోగలదని అనుకుంటే పొరపాటే. ఇదిగ్రెనేడ్ల దాడిని కూడా తట్టుకోగలదు. అంతేకాదు ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సూపర్-ఖరీదైన కారు రీన్ఫోర్స్డ్ టైర్లతో వస్తుంది. గంటకు 80 కిమీ వేగంతో దూసుకుపోతుంది. ఈ కారు 6.0-లీటర్ V12 ఇంజన్తో 612 పవర్ను, 830 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కాగా ముఖేష్ అంబానీ ఫ్యామిలీ కాన్వాయ్లో రోల్స్ రాయిస్ కల్లినన్ SUV, లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్-AMG G63, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-మేబ్యాక్ S580 లాంటి ఇతర ఖరీదైన కార్లు ఉన్నాయి. -
ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్తో భారీ డీల్!
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వ్యాపార విస్తరణలో దూసుకు పోతోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో భాగమైన ముఖేష్ అంబానీ, ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ బ్రాండ్స్, ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ చిల్డ్రన్ వేర్ బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మాను కొనుగోలుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత చర్చలు జరుపుతోందని సమాచారం. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం అలియా భట్ బ్రాండ్ను రూ. 300 నుంచి 350 కోట్ల భారీ డీల్లో కొనుగోలు చేయాలని యోచిస్తోంది. పిల్లల దుస్తుల విభాగంలో తమ ఉనికిని బలోపేతానికి యోచిస్తున్న ఇషా అంబానీ, ఇప్పటికే పాపులర్ అయిన అలియా బ్రాండ్ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. అలియా భట్ అక్టోబర్ 2020లో ఎడ్-ఎ-మమ్మాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2-14 సంవత్సరాల వయస్సున్న కిడ్స్కు పూర్తి స్వదేశీ దుస్తులను విక్రయిస్తుంది. డిజిటల్ మార్కెట్ప్లేస్ ఆరంభంనుంచే అలియా బ్రాండ్ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?) ఈ ఏడాది ఆరంభంలోనే ప్రారంభంలో అలియా ఎడ్-ఎ-మమ్మా రూ. 150 కోట్లకు పైగా వాల్యుయేషన్ను సాధించిందని అంచనా. అటు రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం రూ. 918000 కోట్ల కంటే ఎక్కువ విలువను సాధించింది. అలాగే వాల్యుయేషన్ పరంగా ఇది ఇప్పటికే ఐటీసీ, హెచ్యూఎల్ లాంటి ఎఫ్ఎంసీజీ దిగ్గజాలను అధిగమించింది. వరుస డీల్స్తో ఎఫ్ఎంసీజీ దిగ్గజాలకు సవాల్ విసురుతోంది ఇషా. అయితే తాజా వార్తలపై అటు రిలయన్స్రీటైల్, ఇటు అలియా భట్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. (వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?) కాగా ఆగస్ట్ 2022లో రిలయన్స్ రిటైల్ హెడ్గా ఇషా అంబానీని ముఖేష్ అంబానీ నియమించారు. అప్పటికి సంస్థ టర్నోవర్ రూ. 2 లక్షల కోట్టు. జిమ్మీ చూ, జార్జియో అర్మానీ, హ్యూగో బాస్, వెర్సేస్, మైఖేల్ కోర్స్, బ్రూక్స్ బ్రదర్స్, అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ లాంటి ఇతర ప్రపంచ బ్రాండ్లు రిలయన్స్ రిటైల్ భాగస్వామి బ్రాండ్గా భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. -
అంబానీ మరో సంచలన నిర్ణయం: జూలై 20 ముహూర్తం
ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో కీలక అడుగు వేయబోతున్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ంగ్కు సిద్దమవుతున్నారు. మాతృ సంస్థ రిలయన్స్ గ్రూపు నుంచి విడిపోయేందుకు ఇప్పటికేఎన్సీఎల్టీ ఆమోదం పొందింది. రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (ఆర్ఎస్ఐఎల్) కొత్త ఈక్విటీ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో పొందేందుకు అర్హులైన కంపెనీ ఈక్విటీ వాటాదారులను నిర్ణయించే ఉద్దేశ్యంతో జూలై 20ని రికార్డ్ డేట్గా (షేర్స్ ఎలాట్మెంట్) నిర్ణయించినట్లు శనివారం తెలిపింది. ఈ స్కీం ఎఫెక్ట్ తేదీ జూలై 1, 2023 అని రెగ్యులేటర్ ఫైలింగ్లో రిలయన్స్ పేర్కొంది. స్కీమ్ నిబంధనలకు అనుగుణంగా, ఆర్ఎస్ఐఎల్ ఈక్విటీ షేరును రూ. 10 ముఖ విలువతో జారీ చేస్తుంది. (HDFC Bank: హెచ్డీఎఫ్సీ బ్యాంక్: విలీనం తరువాత లక్షలాది కస్టమర్లకు భారీ షాక్!) ఈ మార్చిలో, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ తన ఆర్థిక సేవల సంస్థను రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (ఆర్ఎస్ఐఎల్)లుగా విడదీసి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జెఎఫ్ఎస్ఎల్)గా పేరు మార్చాలని యోచిస్తున్నట్లు తెలిపింది. అలాగే హితేష్ కుమార్ సేథీ కొత్త సంస్థకు సీఎండీగా ఉంటారని కూడా ఆర్ఎస్ఐఎల్ ప్రకటించింది. (డైనమిక్ లేడీ నదియా: కిల్లర్ మూవ్తో రూ. 300కోట్ల-8వేల కోట్లకు) జియో ఫైనాన్షియల్ నికర విలువ రూ. 1,50,000 కోట్లు. ఈ లిస్టింగ్ ద్వారా కంపెనీకి చెందిన 36 లక్షల మంది వాటాదారులకు లాభాల పంట పడనుంది. మరోవైపు గ్లోబల్ బ్రోకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ ప్రకారం, జియో ఫైనాన్షియల్ షేర్ ధర రూ. 189 ఉంటుందని అంచనా. ఈ డీమెర్జర్, లిస్టంగ్ తరువాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దేశంలో ఐదో అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా అవతరించనుంది. అంతేకాదు పేటీఎం, బజాజ్ ఫైనాన్స్తో గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. -
వి మిస్ యూ పప్పా: ఈ రోజు దేశం చేస్తున్న పని ఆయన ఎప్పుడో చేశారు!
ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫౌండర్ ధీరజ్లాల్ హీరాచంద్ అంబానీ (ధీరూభాయ్) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జూలై 6 ఆయన వర్ధంతి సందర్భంగా ధీరూభాయ్ అంబానీ సక్సెస్ ఫుల్ జర్నీని తెలుసుకుందాం. "కష్టాలు ఎదురైనా మీ లక్ష్యాలను సాధించండి, ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకోండి’’ అనేది ధీరూభాయ్ అంబానీ సందేశం. నిజ జీవితంలో ఆయన అదే ఆచరించి చూపారు. ఎంతో మంది పారిశ్రామిక వేత్తలకు స్ఫూర్తిగా నిలిచారు. టీనా అంబానీ ఘన నివాళి ఈ రోజు దేశమంతా చేస్తున్న పనిని ఆయన ఎప్పుడో పూర్తి చేశారు. అదీ ఆయన దార్శనికత. చాలా విధాలుగా ఆయన కాలం కంటే ముందే ఉన్నారు. ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించమని,అత్యుత్తమంగా ఉండాలని, మనల్ని మనం అంకితం చేసుకోవాలని ప్రోత్సహించిన నిజమైన దార్శనికుడు. పప్పా ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతున్నాం. మీరందించిన అనంతమైన జ్ఞానాన్న మా నిజ జీవితాల్లో వర్తింపజేయడానికి ప్రయత్నిస్తాం అంటూ ఆయన కోడలు, అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ నివాళులర్పించారు. మరోవైపు ధీరూభాయ్ పెద్ద కోడలు, బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తన "అత్యంత స్ఫూర్తిదాయకమైన గురువు" అంటూ గురు పూర్ణిమ రోజు ఎన్ఎంఏసీసీలో నిర్వహించిన పరంపర కార్యక్రమంలో ఘన నివాళులర్పించారు. ధీరూ భాయ్ అంబానీ కొన్ని ఆసక్తికర విషయాలు దిగ్గజ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరూభాయ్ పదో తరగతి మాత్రమే పూర్తి చేశారంటే నమ్ముతారా? ఒకప్పుడు పెట్రోల్ పంపులో పని.. కానీ ఆ తరువాత వేల కోట్ల రూపాయలతో వ్యాపార దిగ్గజంగాఎదిగిన ధీరూభాయ్ అంబానీ గురించి అంతగా తెలియని ఆసక్తికరమైన విషయాలు సాధారణ కుటుంబంలో జననం, కష్టాలు ధీరూభాయ్ అంబానీ గుజరాత్, జునాగద్ జిల్లాలో చోర్వాడ్ అనే చిన్న గ్రామంలో 1932, డిసెంబరు 28న జన్మించారు. సామాన్య టీచర్ కుటుంబంలో నలుగురు తోబుట్టువులతో జీవితం కష్టాలతోనే ప్రారంభమైంది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ధీరూభాయ్ అంబానీ తన చదువును కూడా మధ్యలోనే వదిలివేసి కుటుంబానికి అండగా ఉండేందుకు చిన్న చిన్న పనులు చేశారు. పెట్రోలు బంకులో పని, నెలకు రూ.300 బిలియన్ డాలర్ల కంపెనీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ ప్రారంభంలో బ్రిటిష్ కాలనీ ఆఫ్ అడెన్లోని పెట్రోల్ బంకులో అటెండెంట్గా పనిచేశారు. ఆ సందర్భంగా నెలకు 300రూపాయలు జీతంగా తీసుకునేవారట. అంతకుముందు కుటుంబ పోషణ కోసం అనేక పనులు చేశారు.కానీ అవి నచ్చకపోవడంతో మిడిల్ ఈస్ట్ ఆసియా దేశమైన యెమెన్కు వలస వెళ్లి పెట్రోల్ బంకులో పని మొదలు పెట్టారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తీప్పింది. సూయజ్కు తూర్పున ఉన్న అతిపెద్ద ఖండాంతర వాణిజ్య సంస్థలో ట్రేడింగ్, అకౌంటింగ్, ఇతర వ్యాపార నైపుణ్యాలను నేర్చుకున్నారు. కొన్నేళ్లలోనే మంచి స్థానానికి ఎదిగారు. ఆ తరువాత అన్నింటినీ వదిలి తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చేశారు. రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ ఇండియాకి వచ్చిన తరువాత 1958లో తన బంధువు చంపక్లాల్దమానీతో కలిసి తొలి కంపెనీ రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ (సుగంధ ద్రవ్యాలు, నూలు వ్యాపారం) కంపెనీ స్థాపించారు. నూలు వ్యాపార పరిశ్రమలో పెరుగుతున్న అవకాశాలను గుర్తించిన తర్వాత ధీరూభాయ్ తన వ్యాపారాన్ని మార్చేశారు. మూడేళ్ల తర్వాత 1962లో రిలయన్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ను లాంచ్ చేశారు. బంధువు చంపక్లాల్ దమానీతో విడిపోయిన తరువాత 1966లో గుజరాత్లోని అహ్మదాబాద్లో 'రిలయన్స్ టెక్స్టైల్స్' అనే బట్టల మిల్లును ప్రారంభించారు. దీంతో అతని జీవితంలో అత్యంత మలుపు తిరిగింది. ఇక తరువాత మళ్ళీ ఎప్పుడూ వెనుదిరిగి చూసింది లేదు. అంచెలంచెలుగా రిలయన్స్ సామ్రాజాన్నివిస్తరించారు. అలాగే భారతదేశంలోని సగటు పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్ను పరిచయం చేసిన ఘనత అంబానీకి దక్కుతుందని మార్కెట్ నిపుణులమాట. భారతదేశంలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఫార్చ్యూన్ 500లోచోటు దక్కించుకున్న తొలి ఇండియన్ ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ టెక్స్ టైల్స్ నిలిచింది. అలాగే 1996, 1998, 2000 సంవత్సరాల్లో ఆసియావీక్ పత్రిక 'పవర్ 50- ఆసియాలో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్' జాబితాలో చేరారు. దీంతోపాటు1999 సంవత్సరంలో బిజినెస్ ఇండియా 'బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా అందుకున్నారు. 69 ఏళ్ల వయసులో ధీరూభాయ్ అంబానీ 2002 జూలై 6న ముంబైలో కన్నమూశారు. ఖరీదైన రెస్టారెంట్లలో టీ తాగేవారు తాజా వ్యాపార ఆలోచనలకోసం, తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి, ధీరూభాయ్ అంబానీ సంపన్న వ్యాపారవేత్తలతో కలిసి తిరిగేవారట. నెట్వర్క్ , పరిశ్రమ గురించి తెలుసుకోవడానికి, ఖనీదైన రెస్టారెంట్లలో టీ తాగేవారని చెబుతారు. ధీరూభాయ్ అంబానీ భార్య పేరు కోకిలాబెన్. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ, నినా కొఠారి, దీప్తి సల్గోకర్. ఆస్తులను తన ఇద్దరు కుమారులు ముఖేశ్, అనిల్ అంబానీలకు పంచి ఇచ్చారు. 2002లో ఆయన మరణించే ముందు వరకు కంపెనీని పర్యవేక్షించిన ఆయన 1980ల మధ్యకాలంలో తన కుమారులు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీలకు అప్పగించారు, ఆయన వారసత్వాన్ని అందుకున్న ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా అత్యంత సంపన్నుడుగా, ఆసియా బిలియనీర్గా నిలిచిన సంగతి తెలిసిందే. -
అంబానీ ‘రంగులు మార్చే’ లగ్జరీ కారు: వీడియో వైరల్
ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కోట్ల రూపాయల కొత్త కారు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇటీవల కోటి రూపాయలు పెట్టి, పెయింటింగ్,ఇ తర మార్పులు చేసిన ‘రంగులు మార్చే’ లగ్జరీ కారు రోల్స్ రాయిస్ కెమెరాకు చిక్కింది. (టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్కు మరో ఎదురుదెబ్బ!) ఇటీవల కోటి రూపాయలకుపైగా ఖర్చుపెట్టి మరీ పెయింటింగ్ వేయించిన రోల్స్ రాయిస్ కల్లినన్ ఎస్యూవీ కెమెరాకు చిక్కింది. ఇక ఇన్స్టా యూజర్ దీన్ని పోస్ట్ చేశారు. ర్యాప్ షేడ్స్లైట్స్ మారుతున్న తీరు విశేషంగా నిలిచింది. అయితే నిజంగా ఇది రంగులు మార్చడం కాదు. సైకెడెలిక్ ర్యాప్ వివిధ షేడ్స్ లైట్ల క్రింద వివిధ రంగులను రిప్లెక్ట్ చేస్తుంది. అలా ఈ కారు రంగులు మారుతున్న భ్రమను మనకు కలిగిస్తుందన్న మాట. అంబానీ సొంతమైన రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ధర దాదాపు రూ.13.14 కోట్లు. సాధారణంగా, రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ధర రూ.6.8 కోట్ల నుండి ప్రారంభం. అయితే మీడియా నివేదికల ప్రకారంకోటి రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేసే పెయింటింగ్, 21 అంగుళాల వీల్స్, ఇతర కస్టమైజేషన్ కారణంగా దీని ధర రూ.13.14 కోట్లకు పెరిగిందన్నట్టు. అంతేకాదు దీని రిజిస్ట్రేషన్ నంబర్ '0001' కోసం రూ. 12 లక్షలు చెల్లించారట. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) కాగా అంబానీ లగ్జరీ నివాసం ముంబైలోని రూ. 15,000 యాంటిలియా, రూ. 850 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్తో పాటు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. రోల్స్ రాయిస్, బెంట్లీ, ల్యాండ్ రోవర్, లంబోర్ఘిని ఫెరారీ లాంటి టాప్ కార్లు అంబానీ కుటుంబం సొంతం. -
జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మరో సంచలనానికి నాంది పలికింది. చౌక ధరలో ఫోన్ను లాంచ్ చేసింది. జియో 2 జీ ముక్త్ భారత్ విజన్లో భాగంగా తీసుకొస్తున్న ఈ జియో భారత్ 4జీ ఫోన్ను కేవలం రూ. 999లకే అందిస్తోంది. అంతేకాదు ఈ ఫోన్తో పాటు కొత్త రూ. 123 ప్లాన్ ప్రకటించింది. ఇది 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అన్లిమిటెడ్ కాల్స్తోపాటు, 14GB డేటా (రోజుకు 0.5 GB) అందిస్తుంది. ప్రత్యర్థులతో పోలిస్తే ఇది ఏడు రెట్లు ఎక్కువని జియో పేర్కొంది. ఇంకా 2జీ టెక్నాలజీని ఉపయోగిస్తున్న కస్టమర్ల కోసం ఇన్-క్లాస్ జియో 4జీ నెట్వర్క్ తొలి 10 లక్షల జియో భారత్ ఫోన్ల బీటా ట్రయల్ జూలై 7 నుండి ప్రారంభమవుతుందని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తుండగా, భారతదేశంలో ఇప్పటికీ 250 మిలియన్ల మంది మొబైల్ వినియోగదారులు 2G యుగంలోనే ఉన్నారని, కొత్త జియో భారత్ ఫోన్ ఆ దిశలో మరో అడుగు అని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు. ప్రతీ భారతీయుడికి, ఇంటర్నెట్, ఆధునిక టెక్నాలజీని అందించే లక్ష్యంతో ఆరేళ్ల క్రితం జియోను లాంచ్ చేశాం. ఈ విషయంలో ఎలాంటి రాజీలేదని నిరూపించాం. ఇకపై టెక్కాలజీ కొంతమంది ప్రత్యేక హక్కుగా మిగలబోదు అని ఆకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. 1.77-అంగుళాల QVGA TFT స్క్రీన్, 1000mAh రిమూవబుల్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయి. ఇంకా ఇందులో JioCinema, తాజా వెబ్ సిరీస్లు, బ్లాక్బస్టర్ సినిమాలు, హెచ్బీఓ ఒరిజినల్స్, స్పోర్ట్స్ కంటెంట్ టీవీ షోలతో సహా విస్తారమైన నాన్-స్టాప్ వినోదాన్ని అందించే యాప్ ప్రధానంగా ఉంటుంది. అలాగే ప్రముఖ ఉచిత సంగీత యాప్ JioSaavn, JioPayని కలిగి ఉంది. -
ఈ ఫోటో ఎవరిదో గుర్తు పట్టగలరా? టాప్ హీరోయిన్ అయితే కాదు!
ఆసియా బిలియనీర్, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య, నీతా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అటు హుందాతనానికి, అటు ఫ్యాషన్కి ఐకాన్గా ఉంటారు. వ్యాపారవేత్తగా, నృత్యకారిణిగా, పరోపకారిగా అన్నింటికీ మించి తల్లిగా నీతా అంబానీ ప్రత్యేక ఆదరణను సొంతం చేసుకున్నారు. అన్ని విషయాల్లోనూ భర్త అంబానీతో ధీటుగా తనను తాను నిరూపించుకున్న సక్సెస్ఫుల్ ఉమన్ నీతా. మధ్యతరగతి గుజరాతీ కుటుంబంలో జన్మించిన నీతా చిన్నప్పటినుంచి భరతనాట్యంలో ప్రతిభావంతురాలైన కళాకారిణి రాణిస్తున్నారు. శాస్త్రీయ నృత్యంలో ఇప్పటికే తన ప్రతిభను చాటుకుంటూనే ఉన్నారు. పలు కుటుంబ వేడకుల సందర్బంగా డాన్స్తో ఆకట్టుకోవడం ఆమె స్టయిల్. తాజాగా నీతా అంబానీ చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రదర్శన ఇస్తున్న ఫోటో ఒకటి ఇపుడు నెట్లో చక్కర్లు కొడుతోంది. Music is a universal language that transcends boundaries and unites us all. This World Music Day, immerse yourself in the symphony of diverse sounds at the #NitaMukeshAmbaniCulturalCentre where every note and rhythm weaves a tapestry of mesmerising harmony. pic.twitter.com/fN3KDcnm3Y — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) June 21, 2023 నీతా అంబానీ భరతనాట్యం చేస్తున్న చిన్ననాటి చిత్రాలు చూస్తే అద్భుతం అనిపించకమానదు. సాంప్రదాయ దుస్తులు ధరించి నాట్యం చేస్తున్న ఫోటో స్పెషల్గా ఉంది. తన రెండు చేతులను తన నడుముపై ఉంచి సూపర్ క్యూట్గా ఉన్నారంటూ ఫ్యాన్స్ కమెంట్ చేశారు. అలాగే మరో రెండు ఫోటోల్లో నీతా భారీ నటరాజ్ విగ్రహం ముందు పవర్ ప్యాక్ ప్రదర్శన కళ్లు తిప్పుకోలేని ఎక్స్ప్రెషన్స్ అమూల్యమైన ఫ్రేమ్లో అందంగా ఇమిడిపోయిన ఫోటోలు విశేషంగా నిలుస్తున్నాయి. నీతా నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి కామర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, టీచర్గా రూ. నెలకు 800 సంపాదించే వారట. ఆ తరువాత ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకుని అతిపెద్ద కుటుంబ వ్యాపారంలో చేరారు. రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ , ఐపీఎల్ క్రికెట్ జట్టు ముంబై ఇండియన్స్ యజమానిగా ఉన్నారు.అంతేకాదు కళారంగానికి సేవాలనే ఉద్దేశంతో ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ను ఇటీవల లాంచ్ చేసినసంగతి తెలిసిందే. -
రిలయన్స్కు పునరుత్పాదక ఇం‘ధనం’
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ .. పునరుత్పాదక ఇంధన వ్యాపారం ద్వారా 2030 నాటికి 1015 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉంది. అయితే ఈ విభాగంలో పరిమిత స్థాయిలోనే అనుభవం ఉన్నందున.. సదరు రంగ కంపెనీలను కొనుగోలు చేయడం లేదా భాగస్వామ్యాలను కుదుర్చుకోవాల్సి రానుంది. బ్రోకరేజ్ సంస్థ సాన్ఫోర్డ్ సి బెర్న్స్టీన్ ఈ మేరకు ఒక నివేదిక రూపొందించింది. స్వచ్ఛ ఇంధనమనేది (సౌర, బ్యాటరీ, ఎలక్ట్రోలైజర్లు, ఫ్యూయల్ సెల్స్ మొదలైనవి) రిలయన్స్కు కొత్త వృద్ధి చోదకంగా నిలవనుందని నివేదిక తెలిపింది. 2050 నాటికి భారత్లో వీటిపై 2 లక్షల కోట్ల డాలర్ల పైగా పెట్టుబడులు రానున్నట్లు వివరించింది. 2030 నాటికి ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల విభాగంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటా 5 శాతానికి, ద్విచక్ర వాహనాల్లో 21 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది. అప్పటికి మొత్తం స్వచ్ఛ ఎనర్జీ మార్కెట్ (టీఏఎం) 30 బిలియన్ డాలర్లుగా (ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లు) ఉండొచ్చని తెలిపింది. 2050 నాటికల్లా టీఏఎం 200 బిలియన్ డాలర్లకు, మొత్తం పెట్టుబడులు 2 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని నివేదిక పేర్కొంది. ‘2030 నాటికి రిలయన్స్ .. సౌర ఇంధన మార్కెట్లో 60 శాతం, బ్యాటరీలో 30 శాతం, హైడ్రోజన్ విభాగంలో 20 శాతం వాటా దక్కించుకోవచ్చు. ఈ కొత్త ఇంధనాల వ్యాపారంతో రిలయన్స్ 1015 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించవచ్చని అంచనా వేస్తున్నాం‘ అని నివేదిక వివరించింది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ శిలాజ ఇంధనాల నుంచి క్రమంగా వైదొలిగే క్రమంలో సౌర, హైడ్రోజన్ ఇంధనాల వైపు మళ్లుతోంది. 2035 నాటికి కార్బన్ ఉద్గారాలకు సంబంధించి తటస్థ స్థాయికి చేరుకోవాలని రిలయన్స్ నిర్దేశించుకుంది. ఇందుకోసం సౌర, బ్యాటరీలు, హైడ్రోజన్ వంటి విధానాల ద్వారా పూర్తి స్థాయి పునరుత్పాదక శక్తి వ్యవస్థను రూపొందిస్తోంది. 2030 నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తి సామరŠాధ్యన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారత్ నిర్దేశించుకున్న 280 గిగావాట్ల సామర్ధ్యంలో 35 శాతం. ► రిలయన్స్కు పటిష్టమైన ఆర్థిక వనరులు, సంబంధాలు ఉన్నప్పటికీ .. ఈ విభాగంలో విజయం సాధించడానికి అవసరమైన సాంకేతికత, తయారీ నైపుణ్యాలు అంతగా లేవు. కాబట్టి ఇందుకోసం తగిన సంస్థలతో చేతులు కలపాల్సి ఉంటుంది. ► సౌర, బ్యాటరీ ప్లాంట్లు 2024లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో 2025 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఇంధన వ్యాపారాల నుంచి రిలయన్స్కు ఆదాయాలు రానున్నాయి. ► 2030 నాటికి సౌర విద్యుత్ టీఏఎం 13 బిలియన్ డాలర్లుగా, హైడ్రోజన్ 10 బిలియన్ డాలర్లు, బ్యాటరీల టీఏఎం 7 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. సోలార్లో రిలయన్స్కు 8 బిలియన్ డాలర్లు, బ్యాటరీల్లో 3 బిలియన్ డాలర్లు, హైడ్రోజన్ నుంచి 3 బిలియన్ డాలర్ల వరకు ఆదాయం రావచ్చు. ► సోలార్లో 2030 నాటికి రిలయన్స్ 100 గిగావాట్ల స్థాపిత సామరŠాధ్యన్ని సాధించగలదు. అలాగే, బ్యాటరీల మార్కెట్లో 50 గిగావాట్పర్అవర్ (జీడబ్ల్యూహెచ్) సామర్ధ్యంతో సుమారు 36 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవచ్చు. హైడ్రోజన్ విభాగంలో టీఏఎం 81 గిగావాట్లుగా ఉండనుండగా.. రిలయన్స్ 16 గిగావాట్లతో 19 శాతం వాటా దక్కించుకునే అవకాశం ఉంది. -
జియో యూజర్లకు గుడ్న్యూస్: ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్, ఆఫర్లేంటో చూడండి!
సాక్షి, ముంబై: ముఖేశ్ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఐదు కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.269 -రూ. 789మధ్య వీటిని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆప్లాన్లలో జియో సావన్ ప్రో సబ్స్క్రిప్షన్ను కూడా పొందవచ్చు. కొత్త జియో ప్లాన్లలో అపరిమిత డేటా, యాడ్-ఫ్రీ మ్యూజిక్, లిమిట్లెస్ డౌన్లోడ్లు, అత్యుత్తమ ఆఫ్లైన్ మ్యూజిక్ క్వాలిటీ, JioSaavn సబ్స్క్రిప్షన్తో జియో టూన్స్ ఫీచర్లను యాక్సెస్ ఉంటుంది. ప్లాన్లు, ఆఫర్లు రూ. 269 ప్లాన్ :ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. అపరిమిత, ఉచిత వాయిస్ కాలింగ్, రోజుకు 1.5జీబీ డేటా, అలాగే రోజుకు 100SMSలు ఉచితం. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) రూ. 529 ప్లాన్ : రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100SMS అందిస్తుంది. ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. ఇంకా Jio సూట్ యాప్లకు యాక్సెస్ ఉచిత Jio Saavn సబ్స్క్రిప్షన్ (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?) రూ.589 ప్లాన్: 56 రోజుల వాలిడిటీతో వస్తున్న జియో రూ.589 ప్లాన్లో ప్రతిరోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS Jio సూట్ యాప్లకు ఉచిత యాక్సెస్ రూ.739 ప్లాన్: 84 రోజుల చెల్లుబాటు. రోజుకు 1.5జీబీ డేటాను అందిస్తుంది. అంటే మొత్తం 126 జీబీ డేటా. ఇంకా అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఉచితం. JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity , JioCloudతో సహా Jio యాప్లకు ఉచిత సభ్యత్వం ఇతర ప్రయోజనాలు. రూ. 789 ప్లాన్: 84 రోజుల వాలిడిటీ. రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా. ఇంకా అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఉచితం. JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity , JioCloudతో సహా Jio యాప్లకు ఉచిత సభ్యత్వం ఇతర ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. -
ఆకాష్ అంబానీ-శ్లోక లిటిల్ ప్రిన్సెస్ పేరు: పండితులు ఏమంటున్నారంటే?
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్దకుమారుడు ఆకాష్ రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. గత వారం (మే 31న) ఆకాష్-శ్లోక దంపతులకు రెండో సంతానంగా ఆడబిడ్డ పుట్టింది. 2020 డిసెంబరులో ఈ దంపతులకు తొలి సంతానంగా పృథ్వీ అనే కొడుకు పుట్టాడు. అయితే పాపాయి పేరుపై అభిమానులు చాలా ఊహాగానాలే చేశారు. వీటన్నింటికీ చెక్పెడుతూ ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతా అంబానీ తమ బిడ్డ లిటిల్ ప్రిన్సెస్ పేరు ‘వేద ఆకాష్ అంబానీ’ గా వెల్లడించారు. (మనవరాలి కోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. "శ్రీకృష్ణ భగవానుడి దయ, ధీరూభాయ్ అండ్ కోకిలాబెన్ అంబానీల ఆశీర్వాదంతో, పృథ్వీ తన చిన్న చెల్లెలు వేద ఆకాష్ అంబానీగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది" అని ప్రకటించారు. ‘వేద’ అంటే ఏమిటి? వేద పేరుకు అపారమైన ప్రాముఖ్యత ఉంది, జ్ఞానం, జీవితంపై ఆలోచనాత్మక దృక్పథాన్ని ఇది సూచిస్తుందట. వేద అనేది 'జ్ఞానం' ‘తెలివి తేటలను’ సూచించే సంస్కృత మూలాలున్నదని జ్యోతిష్య శాస్త్ర పండితుల మాట. అంతేకాదు గొప్ప సక్సెస్, ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి తన తల్లి, తాత ముఖేశ్ అంబానీలకు గొప్ప పేరు తెస్తుందని చెబుతున్నారు. కాగా ఆయిల్-టు-టెలికాం-టు-రిటైల్ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీకి ముగ్గురు పిల్లలు . వీరిలో కవలలు ఆకాష్ . ఇషా కాగా చిన్న కుమారుడు అనంత్. రిటైల్ వెంచర్ బాధ్యతలు చూస్తున్న ఇషాకు ఇద్దరు కవల పిల్లలు. ఆకాష్ రిలయన్స్ జియోకు సారధ్యం వహిస్తున్నాడు. ఇక న్యూ ఎనర్జీ వింగ్ హెడ్గా ఉన్న అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. రాధికా మర్చంట్తో ఇప్పటికే నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) -
రూ. 451 కోట్ల శ్లోకా మెహతా డైమండ్ నెక్లెస్: షాకింగ్ న్యూస్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కోడలికి బహుమతిగా ఇచ్చిన ఖరీదైన డైమండ్ నెక్లెస్కు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతాకు గిఫ్ట్గా ఇచ్చిన రూ. 451 కోట్ల డైమండ్ నెక్లెస్ ఇక మార్కెట్లో కనిపించదట. ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? శ్లోకా మెహతాకు ముఖేశ్, నీతా అంబానీలు బహుమతిగా ఇచ్చిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్గా నిలిచినసంగతి తెలిసిందే. ‘మౌవాద్ ఎల్' సాటిలేని 91-డైమండ్ నెక్లెస్' ను వివాహ వేడుకలో శ్లోకా మెహతాకి ఈ నెక్లెస్ను బహుమతిగా ఇచ్చారు. ఆకాశ్ అంబానీ, శ్లోక మెహత 2019 మార్చి నెలలో వివాహం చేసుకున్నారు. 91 వజ్రాలతో, ముఖ్యంగా ఇంటర్నల్గా ఎలాంటి దోషం లేని వజ్రాన్ని పొదిగిన దీని విలువ 451 కోట్ల రూపాయలు. ఈ ప్రత్యేకమైన డైమండ్ నెక్లెస్ ఇకపై మార్కెట్లో అందుబాటులో ఉండదని తెలుస్తోంది. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) తాజా నివేదికల ప్రకారం డిజైన్ మార్పుకారణంగా ఈ ఖరీదైన డైమండ్ నెక్లెస్ సెట్ ఇకపై మార్కెట్లో అందుబాటులో ఉండదు. ఈ డైమండ్స్ పసుపు రంగును పెంచడానికి, మరింత బ్రైట్గా చేయడంతో డిజైన్లో కూడా మర్పులు చేసి రీకట్ చేశారట. ఫలితంగా దాదాపు 200 క్యారెట్ల విలువైన ఈ నెక్లెస్ బరువు 100 క్యారెట్లకు పైగా తగ్గింది. 2022లో సథెబీలో 'మౌవాద్ ఎల్ ఇన్కంపారబుల్ 91 డైమండ్ నెక్లెస్'ను ప్రదర్శించారు. కాగా శ్లోక మెహతా ఇటీవలే రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఆకాశ్- శ్లోక దంపతులకు తొలి సంతానంగా, కుమారుడు పృథ్వి ఉన్నాడు. Behold the most expensive necklace ever created ― The L'Incomparable Diamond Necklace, only made possible by Mouawad. #Mouawad #MouawadDiamondHouse #RareJewels #Diamond #GuinnessWorldRecordhttps://t.co/0dlypdX1MH pic.twitter.com/Zf28a5CWa1 — Mouawad (@mouawad) August 2, 2018 -
నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ దంపతులు ఒడిశా రైలు ప్రమాద బాధితులకు మద్దతు ప్రకటించారు. రిలయన్స్ ఫౌండేషన్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రిలయన్స్ ఫౌండేషన్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ అన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే, తమ ప్రత్యేక విపత్తు నిర్వహణ బృందం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్ని అందించిందన్నారు. రిలయన్స్ స్టోర్ల ద్వారా బాధిత కుటుంబాలకు వచ్చే ఆరు నెలల పాటు పిండి, పంచదార, పప్పు, బియ్యం, ఉప్పు, వంటనూనెతో సహా ఉచిత రేషన్ సరఫరాలను అందించ నున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు అంబులెన్స్లకు ఉచిత ఇంధనాన్ని, ప్రమాదంలో గాయపడిన వారికి ఉచిత మందులు, చికిత్సను అందించనున్నట్టు ప్రకటించింది. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలయన్స్కు చెందిన దాతృత్వ విభాగం రిలయన్స్ ఫౌండేషన్. జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 275 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే. బాధితుల నష్టాన్ని పూడ్చలేం కానీ మరణించిన కుటుంబాలు ఈ విషాదం నుంచి కోలుకుని వారి జీవితాలను తిరిగి గాడిలో పెట్టుకునేలా, ముందుకు నడిచేలా చేసేందుకు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ లక్ష్యంతో 10-పాయింట్ల ప్రోగ్రామ్ను నీతా అంబానీ ప్రకటించారు. (ఆకాష్ అంబానీ ముద్దుల తనయ ఫస్ట్ పిక్ - వీడియో వైరల్) బాధితులకు అండగా పది పాయింట్ల ప్రోగ్రామ్ ►గాయపడిన వారి తక్షణ కోలుకోవడానికి అవసరమైన మందులు, ప్రమాదాల కారణంగా ఆసుపత్రిలో చేరిన వారికి వైద్య చికిత్స. ► విషాదం నుంచి కోలుకునేందుకు మద్దతు కోసం కౌన్సెలింగ్ సేవలు. ►జియో, రిలయన్స్ రీటైల్ ద్వారా మరణించిన వారి కుటుంబంలోని సభ్యునికి ఉపాధి అవకాశాలు ►వీల్చైర్లు, ప్రొస్థెసెస్తో సహా వైకల్యాలున్న వ్యక్తులకు సహాయ సహకారాలు అందించడం. ►కొత్త ఉపాధి అవకాశాలను కనుగొనడానికి బాధిత ప్రజలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ. ►తమ కుటుంబంలోని ఏకైక సంపాదన సభ్యుడిని కోల్పోయిన మహిళలకు మైక్రోఫైనాన్స్ , శిక్షణ అవకాశాలు. ►ప్రమాదంలో ప్రభావితమైన గ్రామీణ కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం ఆవు, గేదె, మేక, కోడి వంటి పశువులను అందించడం. ►మరణించిన కుటుంబ సభ్యునికి జియో ద్వారా ఒక సంవత్సరం పాటు ఉచిత మొబైల్ కనెక్టివిటీ -
అత్యంత విలువైన బ్రాండ్స్లో టీసీఎస్ టాప్..
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్ దేశీయంగా అత్యంత విలువైన బ్రాండ్స్ జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2వ స్థానంలో, ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మూడో స్థానంలో నిల్చాయి. అంతర్జాతీయ బ్రాండ్ కన్సల్టెన్సీ సంస్థ ఇంటర్బ్రాండ్ .. 2023కి గాను రూపొందించిన 50 అత్యంత విలువైన భారతీయ బ్రాండ్స్ జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం టీసీఎస్ బ్రాండ్ విలువ రూ. 1.09 లక్షల కోట్లుగా ఉండగా, రిలయన్స్ రూ. 65,320 కోట్లుగా, ఇన్ఫోసిస్ది రూ. 53,323 కోట్లుగాను ఉంది. హెచ్డీఎఫ్సీ 4వ స్థానంలో, రిలయన్స్ గ్రూప్లో భాగమైన టెలికం, డిజిటల్ విభాగం జియో రూ. 49,027 కోట్ల బ్రాండ్ విలువతో టాప్ 5లో నిల్చాయి. తొలి 10 బ్రాండ్స్ మొత్తం విలువలో టాప్ 3 బ్రాండ్స్ వాటా ఏకంగా 46%గా ఉన్నట్లు ఇంటర్బ్రాండ్ తెలిపింది. ర్యాంకింగ్స్ నివేదికకు సంబంధించి వివరాలు.. ► ఎయిర్టెల్, ఎల్ఐసీ, మహీంద్రా, ఎస్బీఐ, ఐసీఐసీఐ టాప్ 10 బ్రాండ్స్లో చోటు దక్కించుకున్నాయి. ► లిస్టులోని మొత్తం కంపెనీల విలువ రూ. 8.3 లక్షల కోట్లు (100 బిలియన్ డాలర్లు) పైగా ఉంది. ఇది 100 బిలియన్ డాలర్ల మార్కును దాటడం ఇదే ప్రథమం. ► మూడు టెక్నాలజీ బ్రాండ్లు టాప్ 5లో చోటు దక్కించుకోవడం గత దశాబ్ద కాలంలో ఇదే మొదటిసారి. ► గత పదేళ్లలో ఎఫ్ఎంసీజీ విభాగం అత్యధికంగా 25 శాతం, గృహ నిర్మాణం.. ఇన్ఫ్రా 17 శాతం, టెక్నాలజీ 14 శాతం వృద్ధి చెందాయి. ► టాప్ 10 బ్రాండ్ల విలువ రూ. 4.9 లక్షల కో ట్లుగా ఉండగా.. జాబితాలోని మిగతా 40 బ్రాండ్ల విలువ రూ. 3.3 లక్షల కోట్లు. ► ఆర్థిక సేవల రంగం నుంచి అత్యధికంగా తొమ్మిది సంస్థలు ఉండగా .. గృహ నిర్మాణం.. ఇన్ఫ్రా రంగం కూడా గణనీయంగా పెరిగింది. ఈ విభాగం నుంచి ఏడు సంస్థలు చోటు దక్కించుకున్నాయి. -
అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట?
సాక్షి,ముంబై: రిలయన్స్ అధినేత, ఆసియా బిలియనీర్ ముఖేశ్ అంబానీ ఇంటికి ఆడబిడ్డ రూపంలో లక్ష్మీదేవి తరలి వచ్చింది. ముఖేశ్, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులకు సోమవారం(మే 31న) కుమార్తె పుట్టింది.దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.అంబానీ కుటుంబం దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ బుజ్జి పాపాయికి ఏం పేరు పెడతారనే చర్చ కూడా ఊపందుకుంది. (వారసురాలొచ్చేసింది.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆకాష్ అంబానీ దంపతులు) ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల మనవరాలు అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ కమెంట్ చేస్తున్నారు. మే 31న మిథున రాశి (జెమిని) పాపాయి పుట్టిందని, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం,‘కే’ అనే అక్షరం ఉత్తమమైందని భావిస్తున్నారు. అంతేకాదు కష్వి, కైరా, కియానా, కుహూ, కనికా , క్రిష్టి లాంటి పేర్లయితే బావుంటాయంటూ కమెంట్ చేశారు. కాగా 2019, మార్చిలో పెళ్లి చేసుకున్న శ్లోకా మెహతా-ఆకాష్ అంబానీ జంటకు ఇప్పటికే పృథ్వీ అనే కుమారుడు ఉన్నాడు. డిసెంబర్ 2020లో పృథ్వీకి జన్మనిచ్చిన శ్లోకా గత ఏప్రిల్లో జరిగిన నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్లో బేబీ బంప్తో కనిపించినన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ఇషా ట్విన్స్కు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్: వీడియో వైరల్ AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్వర్త్ గురించి తెలుసా? -
వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు
సాక్షి,ముంబై: అంబానీ ఫ్యామిలీ మహిళలంటే ఈ కథే వేరుంటుంది కదా. ఈ విషయాన్నే రిలయన్స్ అధినేత, ఆసియా బిలియనీర్ ముఖేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, కాబోయే కోడలు రాధిక మర్చంట్ మరోసారి నిరూపించారు.లగ్జరీ బ్రాండ్ హ్యాండ్బాగ్తో కనిపించి ఇటీవల అందరి దృష్టినీ ఆకర్షించారు. ప్రస్తుతం ఈ బ్యాగ్ ధర హాట్ టాపిక్గా మారింది. (3 వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్మేకర్ స్పందన ఇది!) నీతా,ముఖేశ్ అంబానీ తనయ, రిలయన్స్ రీటైల్ హెడ్ ఇషా అంబానీ, అనంత్ అంబానీ (ఇషా సోదరుడు అనంత్ రాధిక నిశ్చితార్థం జరిగింది) కాబోయే భార్య రాధిక మర్చంట్ ఇద్దరూ లేడీ డియోర్ మినీ హ్యాండ్బ్యాగ్లతో సందడి చేశారు. మంచి ఫ్రెండ్స్ అయిన వీరిద్దరూ తరచూ అనేక ఈవెంట్లకు హాజరువుతూ ఉంటారు. ప్రముఖ లగ్జరీ బ్రాండ్ బ్యాగ్స్ ధరించి ది డియోర్ ఫాల్ 2023 షోలో పోజులిచ్చారు. డియోర్ అధికారిక వెబ్సైట్లో ప్రస్తుతానికి ఈ బ్యాగు అందుబాటులో లేనప్పటికీ వీరిద్దరూ ధరించిన ఈ బ్యాగు ధర భారత కరెన్సీలో సుమారుగా రూ. 21 లక్షల 6 వేలు. (కేవీపీ పెట్టుబడి డబుల్ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు! ) లగ్జరీ దిగ్గజం క్రిస్టియన్ డియోర్ లేటెస్ట్ ఈవెంట్ ఇటీవల ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియాలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫ్యాషన్ షోకు అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ, సోనమ్ కపూర్, శోభితా ధూళిపాలా, మీరా రాజ్పుత్, అనన్య పాండే, ఖుషీ కపూర్, కరిష్మా కపూర్, డయానా పెంటీ, ఆథియా శెట్టి లాంటి సెలబ్రిటీలు హాజరైనారు. ఇంకా హర్ష్ వర్ధన్ కపూర్, అనితా ష్రాఫ్ అడజానియా, శ్వేతా బచ్చన్, అర్జున్ కపూర్, మసాబా గుప్తా, నటాషా పూనావల్లా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు బ్రిడ్జర్టన్ స్టార్ సిమోన్ ఆష్లే, నటుడు పూర్ణ జగన్నాథన్, సంగీత విద్వాంసురాలు అనౌష్క శంకర్ ఇతరజాతీయ అంతర్జాతీయ ప్రముఖులు ఫ్యాషన్ ఈవెంట్లో సందడి చేశారు. View this post on Instagram A post shared by Dior Official (@dior) -
ఐపీఎల్ 2023: ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీల సంపాదన ఎంతో తెలుసా?
ఐపీఎల్ 2023 పోరులో ముంబై ఇండియన్స్ ట్రోఫీని గెలుచుకునే చివరి అవకాశాన్ని చేజేతులారా జార విడిచుకుంది. ఆసియా కుబేరుడు ముఖేశ్ అంబానీ సతీమణి, నీతా అంబానీ యాజమాన్యంలోని ఐపీఎల్ జట్టు గత రాత్రి గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పరాజయాన్ని మూట గట్టుకుని టైటిల్ పోరును నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారవ సీజన్ ద్వారా అంబానీ కుటుంబం ఎంత ఆర్జించింది అనేది హాట్టాపిక్గా నిలిచింది. టాప్ సక్సెస్ఫుల్ టీంగా భావించే ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీలు ఎన్ని వేల కోట్లు సంపాదించారు అనేదే లేటెస్ట్ టాక్. (మరో 9 వేల మందికి పింక్ స్లిప్స్ సిద్ధం: రూ 2 వేల కోట్ల డీలే కారణమా? ) ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్లో 100 శాతం వాటాతో నీతా, ముఖేష్ అంబానీలే ఏకైక యజమానులుగా ఉన్నారు. మిలియన్ల డాలర్లు 2008లో ఈ జట్టును కొనుగోలు చేశారు. తొలి సీజన్లో జట్టు కొనుగోలుకు రూ. 916 కోట్లు వెచ్చించారు.ఇప్పటివరకు ఐదు టైటిళ్లను సాధించి, 2023 వరకు అత్యధిక సంఖ్యలో ఐపీఎల్ మ్యాచ్లను గెలుచుకుని ఆదాయం విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గిందిలేదు. పెద్ద సంఖ్యలో స్పాన్సర్లను పొందిన జట్టు కూడా ఇదే. ది ట్రిబ్యూన్ ప్రకారం, ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యుయేషన్ రూ. 10,070 కోట్లకు పైమాటే. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ. 200 కోట్లుపెరిగింది. ఇప్పటివరకు అత్యంత లాభదాయకమైన జట్టు కూడా ముంబై ఇండియన్స్. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా వృద్ధిని నమోదు చేసిన ఏకైక జట్టు. (ఈస్ట్ హైదరాబాద్ రయ్ రయ్! ఎందుకో తెలుసా?) దీంతోపాటు టిక్కెట్ ధరలతో పాటు మీడియా స్పాన్సర్షిప్లు, ప్రకటనల సంపాదన కూడా భారీగానే ఉంది. ఇది అంతా ఒక ఎత్తయితే మరో ప్రధాన ఆదాయ వనరు జియో సినిమాకు విక్రయించిన ఐపీఎల్ హక్కుల ద్వారా ఆర్జించింది మరో ఎత్తు. తొలి ఐదు వారాల్లోనే జియోసినిమా రికార్డు స్థాయిలో 1300 కోట్ల వీడియో వీక్షణలను అందుకోవడం గమనార్హం. (Shantanu Narayen:189 బిలియన్ డాలర్ల కంపెనీకి సారధి: రోజుకు రూ.70 లక్షలు సంపాదన) రిలయన్స్ బ్రాండ్ Viacom18, Jio సినిమా ఐపీఎల్ టెలికాస్టింగ్ హక్కులను రూ. 22,290 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతోపాటు జియో సినిమా ఐపిఎల్ని మొదటి హోస్ట్ చేయడం ద్వారా రూ. 23,000 కోట్ల విలువైన ఆదాయాన్ని ఆర్జించింది. రాబోయే కొన్ని సంవత్సరాలలో వేల కోట్లను కూడా ఆర్జించనుందని అంచనా. దీంతో పాటు గ్లోబల్ ఫ్రాంచైజీల ద్వారా కూడా భారీ ఆదాయాన్నే సాధిస్తోంది రిలయన్స్. ఇదీ చదవండి: చేసిన పాపం ఎక్కడికి పోతుంది సుందరా! అనుభవించు: నెటిజన్లు ఫైర్ ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ న్యూస్, బిజినెస్అప్డేట్స్ కోసం చదవండి సాక్షి బిజినెస్ -
మరో 9 వేల మందికి పింక్ స్లిప్స్ సిద్ధం: రూ 2 వేల కోట్ల డీలే కారణమా?
సాక్షి, ముంబై: బిలియనీర్ ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కూడా భారీ ఎత్తున ఉద్యోగాలపై వేటు వేస్తున్న సంస్థల జాబితాలో చేరి పోయింది. ఇషా అంబానీ నేతృత్వంలోని జియో మార్ట్ ఇటీవల 1000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది చాలదన్నట్టు మరో 9 వేలమందిని తొలగించేందుకు యోచిస్తోందట. ఇటీవల చేసుకున్న 28 వేల కోట్ల డీల్ తరువాత ఈనిర్ణయం తీసుకుందని అంచనా. (Meta Layoffs ఇండియాలోని టాప్ ఎగ్జిక్యూటివ్లకు షాక్!) తాజా నివేదికల ప్రకారం, రిలయన్స్ రిటైల్ 15వేల మంది సిబ్బందిలో మూడింట రెండు వంతుల మందికి పింక్ స్లిప్ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగాఇప్పటికే వెయ్యిమందిని తొలగించింది. వీరిలో 500 మంది కార్పొరేట్ ఉద్యోగులే. ఇక మలిరౌండ్లో మరో 9000 మందిని రిజైన్ చేయాల్సిందిగా కోరనుంది. అంతేకాదు వేలాది మంది ఉద్యోగులను పనితీరు మెరుగుదల పథకం (పిఐపి) కిందికి తీసుకు రానుంది. మొత్తం సేల్స్, మార్కెటింగ్ టీమ్ సాలరీ స్ట్రక్చర్ని వేరియబుల్ పే స్ట్రక్చర్కు మార్చి వేసిందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. తన ఖర్చులను తగ్గించడం ద్వారా తన లాభాలను ఏకీకృతం చేయాలనుకుంటోంది. (సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్: ధర రూ.15 వేల లోపే) రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఇటీవలే మెట్రో క్యాష్ అండ్ క్యారీకి చెందిన 31 స్టోర్లను రూ.2,850 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతోపాటు 3500 మంది ఉద్యోగులను కూడా తీసుకుంది. రిలయన్స్ రిటైల్ 2022-2023 నాలుగో త్రైమాసికంలో రూ. 2415 కోట్ల లాభాన్ని సాధించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 12.9 శాతం పుంజుకుంది. ఇలాంటి బిజినెస్ న్యూస్ అప్డేట్స్, ఇంట్రస్టింగ్ కథనాల కోసం చదవండి సాక్షిబిజినెస్ -
రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా వేలాది ఉద్యోగాలను తీసివేస్తున్న కంపెనీలో చేరబోతోంది. ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆన్లైన్ హోల్సేల్ ఫార్మాట్ జియోమార్ట్ వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. రానున్న కాలంలో ఇది మరింత పెరగనుందనే అంచనాలు ఆందోళనకు దారి తీసింది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం రానున్న కాలంలో హోల్సేల్ విభాగం జియోమార్ట్ ఉద్యోగుల్లో మూడింట రెండు వంతు, సుమారు 15వేల మందిని తొలగించనుంది. అంతేకాదు స్థానిక పొరుగు దుకాణాలకు కిరాణా ,సాధారణ వస్తువులను సరఫరా చేసే150 ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలలో సగానికి పైగా మూసివేయాలని కూడా జియోమార్ట్ యోచిస్తోంది. (అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్!) రిలయన్స్ రిటైల్ తన జియోమార్ట్ బిజినెస్-టు-బిజినెస్ వర్టికల్ను ఏకీకృతం చేయడం ప్రారంభించింది. 3,500 మంది ఉద్యోగులతో కూడిన మెట్రో శాశ్వత ఉద్యోగులను చేర్చుకున్న తరువాత, ఉద్యోగాల కోతతోపాటు, కంపెనీ మార్జిన్లను మెరుగు పర్చుకోవడానికి, నష్టాలను తగ్గించుకోవాలని చూస్తోంది. ఇటీవల మెట్రో క్యాష్ అండ్ క్యారీ కొనుగోలు చేసిన కంపెనీ తన కార్యకలాపాలసమీక్ష అనంతర తాజా నిర్ణయం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా కంపెనీ తన కార్పొరేట్ కార్యాలయంలోని 500 మంది ఎగ్జిక్యూటివ్లతో సహా 1,000 మందిని రాజీనామా చేయమని కోరింది. ఇప్పటికే పనితీరు మెరుగుదల ప్రణాళిక (PIP)లో ఉన్న వందలాది మంది ఉద్యోగులతో మరింత మందిని తొలగించాలని యోచిస్తోందని సమాచారం. ఆయా ఉద్యోగుల స్థిర వేతనాన్ని తగ్గించిన తర్వాత మిగిలిన సేల్స్ ఉద్యోగుల్ని వేరియబుల్ పే స్ట్రక్చర్లో ఉంచినట్టు తెలుస్తోంది. మరిన్ని బిజినెస్ వార్తలో కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఇక జియో ఫైనాన్షియల్ సర్వీసులు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తమ ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనుంది. ఇందుకు వాటాదారులు, రుణదాతలు తాజాగా ఆమోదముద్ర వేశారు. తొలుత రిలయన్స్ స్ట్రాటజిక్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఎస్ఐఎల్) పేరుతో విడదీయనున్న కంపెనీని తదుపరి జియో ఫైనాన్షియల్ సర్వీసులుగా మార్పు చేయనున్నారు. వాటాదారుల సమావేశంలో ఈ ప్రతిపాదనకు 99.99 శాతం ఓట్లు లభించినట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది. కాగా.. ఆర్ఐఎల్ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకీ రూ. 10 ముఖ విలువగల ఆర్ఎస్ఐఎల్ షేరును జారీ చేయనున్నారు. తదుపరి ఆర్ఎస్ఐఎల్.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(జేఎఫ్ఎస్ఎల్)గా ఆవిర్భవించనుంది. సెప్టెంబర్కల్లా లిస్టింగ్ జెఫరీస్ రీసెర్చ్ వివరాల ప్రకారం జేఎఫ్ఎస్ఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో సెప్టెంబర్కల్లా లిస్ట్కానుంది. ఇందుకు అప్పటికల్లా అన్ని అనుమతులూ లభించగలవని అభిప్రాయపడింది. కంపెనీ వెనువెంటనే రుణ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. అసెట్ మేనేజ్మెంట్, జీవిత, సాధారణ బీమా విభాగాలకు నియంత్రణ సంస్థల అనుమతులను కోరనుంది. వీటిని 12–18 నెలల్లోగా పొందే వీలున్నట్లు జెఫరీస్ పేర్కొంది. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని విడదీసేందుకు గతేడాది అక్టోబర్లో ఆర్ఐఎల్ గ్రూప్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఐఎల్కు పూర్తి అనుబంధ సంస్థగా ఆర్ఎస్ఐఎల్ వ్యవహరిస్తోంది. ఆర్బీఐ వద్ద రిజిస్టరై డిపాజిట్లు సమీకరించని ప్రధాన ఎన్బీఎఫ్సీగా కొనసాగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు 1.2 శాతం బలపడి రూ. 2,448 వద్ద ముగిసింది. కామత్కు బాధ్యతలు ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో కేవీ కామత్ను జేఎఫ్ఎస్ఎల్కు నాన్ఎగ్జిక్యూటివ్గా చైర్మన్గా ఆర్ఐఎల్ ఎంపిక చేసింది. 2021–22లో ఈ విభాగం రూ. 1,536 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 27,964 కోట్ల సంయుక్త ఆస్తులను కలిగి ఉంది. బ్రోకింగ్ సంస్థ మెక్వారీ వివరాల ప్రకారం జియో ఫైనాన్షియల్ విలువ రూ. 1.52 లక్షల కోట్లకుపైనే. దేశీయంగా ఐదో అతిపెద్ద ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థగా నిలవనుంది. -
ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన
ఫోర్బ్స్ బిలియనీర్ 2023 ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. మరి అంబానీ కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తి గురించి మీకు తెలుసా? ఆయన మరెవ్వరో కాదు అంబానీకి దగ్గరి బంధువు , ముంబై ఇండియన్స్ బాస్ నిఖిల్ మెస్వానీ. ఐపీఎల్ 2023 పోరు నడుస్తున్న క్రమంలో నిఖిల్ సంపాదన, ఇతర విశేషాలపై ఆసక్తి నెలకొంది. ముఖేష్ అంబానీకి చెందిన ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ జట్టు బాస్గా నిఖిల్ మెస్వానీ జట్టు రోజువారీ వ్యవహారాలను చూసుకోవడం మాత్రమే కాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ను విజయవంతమైన వెంచర్గా మార్చడంలో కూడా ఆయనది కీలక పాత్ర. రిలయన్స్ ఇండస్ట్రీస్లో టాప్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న నిఖిల్ మెస్వానీ 1986లో కంపెనీలో చేరారు. జూలై 1988లో నిఖిల్ మెస్వానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. నిఖిల్తోపాటు అతని ఇతర కుటుంబ సభ్యులు కంపెనీ ఎదుగుదలలో కీలక భూమిక పోషిస్తుండటం విశేషం. ఫోర్బ్స్ ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిఖిల్ సంపాదన రూ. 24 కోట్లు. ఇది ముఖేష్ అంబానీ సంపాదించిన దానికంటే ఎక్కువ. అంబానీ 10 సంవత్సరాలకు పైగా తన వేతానాన్ని రూ.15 కోట్లకు కుదించుకుంటున్న సంగతి తెలిసిందే. (వన్ప్లస్ ప్యాడ్ వచ్చేసింది: ధర చూస్తే ఇపుడే కావాలంటారు!) నిఖిల్ మెస్వానీ ఎవరు? నిఖిల్ మెస్వానీ ముంబై విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్, అమెరికాలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశారు. ఇండియాకు తిరిగి వచ్చి రిలయన్స్లో చేరారు. రిలయన్స్లో ప్రాజెక్ట్ ఆఫీసర్గా కెరీర్ ప్రారంభించిన నిఖిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా 1997 - 2005 మధ్య భారీ రిఫైనరీ వ్యాపార బాధ్యతలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రిఫైనరీలలో ఒకటైన జామ్నగర్ రిఫైనరీతో సహా కంపెనీ అనేక ప్రధాన ప్రాజెక్టులలో కీలక పాత్ర పోషించిన ఘనత మెస్వానీ సొంతం. టెలికాం, రిటైల్ రంగాల్లోకి కంపెనీ ప్రవేశంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. (బిచ్చగాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం) నిఖిల్ సోదరుడు హితల్ మెస్వానీ కూడా మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీ రిలయన్స్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. కాగా నిఖిల్ మేస్వానీ తండ్రి, రసిక్లాల్ మేస్వానీ, ధీరూభాయ్ అంబానీకి బంధువు రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరు కావడం గమనార్హం. నిఖిల్ మెస్వానీ దాతృత్వం దాతృత్వ కార్యక్రమాలలో కూడా నిఖిల్ పాల్గొంటారు. రిలయన్స్కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధితో సహా వివిధ సామాజిక కారణాలను ఫౌండేషన్ చూసుకుంటుంది. ముంబై ఇండియన్స్ Vs x గుజరాత్ టైటన్స్ ఈ రోజు ( ఏప్రిల్ 25, మంగళవారం) అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో IPL 2023లో మ్యాచ్ నం. 35లో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్తో తలపడనుంది. Power, finesse, switchin’ it up when needed - Nehal can do it all. 💪#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 pic.twitter.com/s2Bl4BqWrb — Mumbai Indians (@mipaltan) April 25, 2023 -
కేజీ డీ6 ఎంజే ఫీల్డ్లో రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: కేజీ డీ6 పరిధిలోని అత్యంత లోతైన సముద్రపు బ్లాక్ ఎంజే ఫీల్డ్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ సహజ వాయువుని ఈ త్రైమాసికంలోనే ఉత్పత్తి చేయనుంది. ఏకైక డీప్ వాటర్ బ్లాక్ అయిన కేజీ డీ6 దేశ గ్యాస్ అవసరాల్లో 15 శాతాన్ని తీరుస్తుండడం విశేషం. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 20 మిలియన్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్స్ రోజువారీ (ఎంఎంఎస్సీఎండీ) ఉత్పత్తి సగటున ఇక్కడ నమోదైంది. ఎంజే డీప్ వాటర్ ప్రాజెక్ట్లో ఉత్పత్తి మొదలైతే దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా. రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రిటన్కు చెందిన బీపీతో కలసి ఇక్కడ ఉత్పత్తిని ఆరంభించనుంది. వాస్తవానికి గడిచిన డిసెంబర్ త్రైమాసికంలోనే ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉండగా, మూడు నెలల జాప్యం నెలకొంది. కేజీ డీ6లో మూడు ప్రాజెక్టుల ద్వారా గ్యాస్ ఉత్పత్తిపై రిలయన్స్, బీపీ 5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్నాయి. మూడు ప్రాజెక్టులకు గాను ఆర్ క్లస్టర్, శాటిలైట్ క్లస్టర్లో ఇప్పటికే ఉత్పత్తి ఆరంభమైంది. ఎంజే ఫీల్డ్లో ఉత్పత్తి మొదలు కావాల్సి ఉంది. ‘‘ఎంజే ఫీల్డ్లో పరీక్షలు, ఉత్పత్తి మొదలు పనులు నడుస్తున్నాయి. ఇక్కడ ఉత్పత్తి మొదలైతే కేజీ డీ6 పరిధిలో మొత్తం గ్యాస్ ఉత్పత్తి 30 ఎంఎంఎస్సీఎండీకి చేరుకుంటుంది’’అని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన త్రైమాసిక ఫలితాల సందర్భంగా వెల్లడించింది. -
అంబానీ Vs టాటా: కొత్త వ్యాపారంలోకి అంబానీ, నటి సారా సందడి!
సాక్షి, ముంబై: బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ తాజాగా మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతోంది. గతంలో ఎన్నడూ చూడని వేగంతో ఇటీవలి కాలంలో రిలయన్స్ గ్రూప్ అనేక కొత్త వ్యాపారాల్లోకి శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా రిలయన్స్ బ్రిటిష్ కాఫీ షాప్ ప్రెట్ ఎ మ్యాంగర్ను దేశానికి తీసుకురావడం ద్వారా టాటాతో పోటీకి సౌ అంటోంది. దీనికి సంబంధించి బ్రిటీష్ శాండ్విచ్ అండ్ కాఫీ చైన్ 'ప్రెట్ ఎ మాంగర్' తో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ బ్రిటిష్ కాఫీ భాగస్వామ్యంలో ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్లో మేకర్ మ్యాక్సిటీలో ప్రీట్ ఎ మ్యాంగర్ తన తొలి అవుట్లెట్ ప్రారంభమైంది. ప్రెట్ ఎ మేంగర్ షాప్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్ నటి సారా అలీఖాన్ పాల్గొన్నారు. ముంబై షాప్ 2,567 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెద్ద డైనింగ్ స్పేస్తో ఉన్న ప్రెట్ ఐకానిక్ స్టోర్ లాంచింగ్పై సారా కాఫీ పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది. కాఫీ అంటే చాలా ఇష్టమని నాన్నతో కలిసి లండన్లోని ప్రెట్ స్టోర్ని చాలాసార్లు సందర్శించాను ఇపుడిది మన దేశానికి రావడం ఆనందంగా ఉందని పేర్కొంది. (లేఆఫ్స్ ఆందోళనల మధ్య: గూగుల్ సీఈవో షాకింగ్ వేతనం) రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ ఫ్రాంఛైజీ భాగస్వామ్యం కోసం గత ఏడాది బ్రిటిష్ యజమానితో డీల్ కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 100 ప్రీట్ ఎ మాంగర్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. తొలి ఏడాదిలోనే పది 'ప్రెట్ ఎ మ్యాంగర్' స్టోర్లను ప్రారంభించనున్నామని రిలయన్స్ ప్రతినిధి వెల్లడించారు. రిలయన్స్ బ్రాండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ దర్శన్ మెహతా, యూకే బ్రాండ్ భాగస్వామ్యంపై సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక ప్రాధాన్యతలు, ఆహారపు అలవాట్లకు అనుగుణంగా భారతీయ వినియోగదారుల కోసం ప్రెట్ బ్రాండ్ను రిలయన్స్ ద్వారా లాంచ్ చేయడం ఆనందమని బృందంతో ప్రెట్ ఎ మాంగర్ సీఈవో పనో క్రిస్టౌ తెలిపారు. చాలా కాలంగా ఇండియాకు రావాలనేది లక్ష్యం. ముంబైలో తొలి స్టోర్ను లాంచ్ చేయడం తమ అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలలో ఒక మైలురాయని చెప్పారు. యుఎస్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ దేశంలో తన తొలి రెండు స్టోర్లను ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత ప్రెట్ ఎ మ్యాంగర్స్ ఇండియన్ స్టోర్ను ప్రారంభించడం విశేషం. టిమ్ కుక్ ఇండియా టూర్లో భాగంగా ముంబైలోని ముఖేష్ అంబానీ ,నీతా అంబానీల ఆంటిలియాని ఇంటిని కూడా సందర్శించారు. కాగా 1986లో లండన్లో ప్రారంభమైన ప్రెట్ ఎ మాంగర్ యూఏ, అమెరికా హాంకాంగ్, ఫ్రాన్స్, దుబాయ్, స్విట్జర్లాండ్, బ్రస్సెల్స్, సింగపూర్ జర్మనీతో సహా దేశాల్లో దాదాపు 550 దుకాణాలను నిర్వహిస్తోంది. అలాగే టాటా స్టార్బక్స్కు 30 నగరాల్లో 275 స్టోర్లున్నాయి. 50 శాతం వాటాతో అమెరికన్ కాఫీ చైన్నునిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాటాలు కొత్తగా రికార్డు స్థాయిలో 50 స్టోర్లను ప్రారంభించారు. 2025 నాటికి దేశీయ కాఫీ మార్కెట్ 4.2 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని అంచనా. -
జియో లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ, డిజిటల్ సర్వీసుల దిగ్గజం జియో ప్లాట్ఫామ్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 16 శాతం బలపడి రూ. 4,984 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 4,313 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 14 శాతం పుంజుకుని రూ. 25,465 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 22,261 కోట్ల ఆదాయం నమోదైంది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 6.7 శాతం మెరుగై రూ. 178.8కు చేరింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 23 శాతం జంప్చేసి రూ. 19,124 కోట్లయ్యింది. 2021–22లో రూ. 15,487 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 20 శాతం ఎగసి రూ. 1,15,099 కోట్లకు చేరింది. క్యూ4లో 2.9 కోట్లమంది జత కలవడంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 7 శాతం పెరిగి 43.93 కోట్లను తాకింది. -
రిలయన్స్ లాభాల రికార్డ్!
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో సరికొత్త రికార్డును సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 19,299 కోట్లను తాకింది. ఒక త్రైమాసికానికి కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికంకాగా.. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 16,203 కోట్లు మాత్రమే ఆర్జించింది. రిటైల్, టెలికం విభాగాలతోపాటు చమురు, పెట్రోకెమికల్స్ బిజినెస్ వృద్ధి ఇందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2.14 లక్షల కోట్ల నుంచి రూ. 2.19 లక్షల కోట్లకు బలపడింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 66,702 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది కూడా సరికొత్త రికార్డుకాగా.. 2021–22లో రూ. కేవలం 60,705 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం దాదాపు రూ. 10 లక్షల కోట్లకు చేరింది. 2021–22లో రూ. 7.36 లక్షల కోట్ల ఆదాయం మాత్రమే అందుకుంది. పూర్తి ఏడాదికి ఆర్ఐఎల్ నిర్వహణ లాభం(ఇబిటా) తొలిసారి రూ. 1,54,691 కోట్లను తాకింది. ఇది 23 శాతం వృద్ధి. ఈ కాలంలో పెట్టుబడి వ్యయాలు రూ. 1,41,809 కోట్లుకాగా.. కంపెనీవద్దగల రూ. 1,93,282 కోట్ల నగదు బ్యాలెన్స్ను మినహాయిస్తే నికర రుణ భారం వార్షిక ఇబిటాకంటే తక్కువగా రూ. 1,10,218 కోట్లుగా నమోదైంది. అన్ని విభాగాల జోరు: క్యూ4లో ఆర్ఐఎల్ ఇబిటా 22 శాతం జంప్చేసి రూ. 41,389 కోట్లను తాకింది. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్(ఓటూసీ) ఇబిటా 14 శాతంపైగా ఎగసి రూ. 16,293 కోట్లకు, టెలికంసహా డిజిటల్ సర్వీసులు 17 శాతం మెరుగుపడి రూ. 12,767 కోట్లకు, రిటైల్ విభాగం 33 శాతం దూసుకెళ్లి రూ. 4,769 కోట్లకు, ఆయిల్, గ్యాస్ ఇబిటా రెట్టింపై రూ. 3,801 కోట్లకు చేరాయి. డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ఫాల్ ట్యాక్స్ లాభాలపై రూ. 711 కోట్లమేర ప్రభావం చూపినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. అంతక్రితం క్యూ4లో రూ. 1,898 కోట్లమేర ప్రభావం పడినట్లు ప్రస్తావించింది. ఆర్ఐఎల్ షేరు స్వల్ప వృద్ధితో 2,351 వద్ద క్లోజైంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. రిలయన్స్ రిటైల్ భళా గతేడాది(2022–23) క్యూ4(జనవరి–మార్చి)లో రిలయన్స్ రిటైల్ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ. 2,415 కోట్లను తాకింది. 2021–22 క్యూ4లో రూ. 2,139 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 21 శాతం ఎగసి రూ. 61,559 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 50,834 కోట్ల అమ్మకాలు సాధించింది. ఆదాయంలో డిజిటల్, న్యూ కామర్స్ బిజినెస్ వాటా 17 శాతానికి చేరింది. ఇక మొత్తం స్టోర్ల సంఖ్య 18,040కు చేరింది. క్యూ4లో 2,844 స్టోర్లను జత చేసుకుంది. సర్వీసులతో కలిపి క్యూ4లో ఆదాయం రూ. 69,267 కోట్లను తాకగా.. ఇబిటా 33 శాతం వృద్ధితో రూ. 4,914 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మొత్తం ఆదాయం 32 శాతం జంప్చేసి రూ. 2,30,931 కోట్లను తాకింది. నికర లాభం 30 శాతం ఎగసి రూ. 9,181 కోట్లయ్యింది. సర్వీసులతో కలిపి స్థూల ఆదాయం రూ. 2,60,364 కోట్లుగా నమోదైంది. దేశీయంగా రిటైల్ రంగంలో రిలయన్స్ అత్యుత్తమ వృద్ధిని చూపుతున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా ఎం.అంబానీ పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధిలో భాగం డిజిటల్ కనెక్టివిటీ, ఆర్గనైజ్డ్ రిటైల్ విభాగాలలో కంపెనీ కార్యకలాపాలు వ్యవస్థాగత సామర్థ్యాలకు బలాన్నిస్తున్నాయి. తద్వారా ప్రపంచంలోనే వేగవంత వృద్ధిని సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని విడదీసి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో లిస్ట్ చేయనున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఎంజే ఫీల్డ్, ఆర్క్లస్టర్ తదితరాలతో కలిపి కేజీ–డీ6 బ్లాకులో గ్యాస్ ఉత్పత్తి రోజుకి 3 కోట్ల ప్రామాణిక ఘనపుమీటర్లకు చేరే వీలుంది. –ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ -
అంబానీకి ఆ వృత్తిపై మక్కువ!
ఆసియాలోనే అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏప్రిల్ 19, 1957న యెమెన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడైన ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీ దంపతులకు జన్మించారు. ఫోర్బ్స్ తాజా నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీ నికర సంపద విలువ 84.1 బిలియన్ డాలర్లు. అంటే రూ.69 లక్షల కోట్లకుపైగానే. ముఖేష్ అంబానీ 1981లో తమ కుటుంబ వ్యాపారంలోకి వచ్చి విస్తరించారు. 1985లో నీతాను వివాహమాడారు. వీరి ముగ్గరు పిల్లలు ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ. ముఖేష్ అంబానీతోపాటు భార్య నీతా, వారి పిల్లలు కూడా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించేందుకు శ్రమిస్తున్నారు. వ్యాపారంలోకి రాక ముందు తాను ఏం అవ్వాలనుకున్నారో ముఖేష్ అంబానీ ఒకసారి బయటపెట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్లో చేరమని తన తండ్రి అడగకముందు తాను ఉపాధ్యాయుడిని కావాలనుకున్నానని వెల్లడించారు. వివాహం తర్వాత భార్య నీతా అంబానీ కూడా దీన్ని ప్రోత్సహించినట్లు చెప్పారు. ఎందుకంటే వివాహానికి ముందు ఆమె కూడా టీచరే. అది వీలు పడకపోయినప్పటికీ తమ సంతృప్తి కోసం విద్యా రంగ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్.. -
రిలయన్స్ కేజీ–డీ6 గ్యాస్కు డిమాండ్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన కేజీ–డీ6 బ్లాక్ నుంచి వెలికితీసే గ్యాస్ విక్రయం కోసం నిర్వహించిన వేలానికి మంచి స్పందన కనిపించింది. వివిధ రంగాలకు చెందిన 41 కంపెనీలు వేలంలో పాల్గొనగా 29 సంస్థలు 5 ఏళ్ల కాలానికి గ్యాస్ను కొనుగోలు చేశాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), అదానీ–టోటల్ గ్యాస్, షెల్ తదితర కంపెనీలు వీటిలో ఉన్నాయి. రోజుకు 6 మిలియన్ ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్ను విక్రయించగా ఐవోసీ దాదాపు సగభాగాన్ని (2.9 ఎంసీఎండీ) దక్కించుకుంది. గెయిల్ 0.7 ఎంసీఎండీ, అదానీ–టోటల్ గ్యాస్ 0.4 ఎంసీఎండీ, షెల్ 0.5 ఎంసీఎండీ, జీఎస్పీసీ 0.25 ఎంసీఎండీ, ఐజీఎస్ మరో 0.5 ఎంసీఎండీ గ్యాస్ను కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిర్దిష్ట ఫార్ములా ప్రకారం గ్యాస్ ధర యూనిట్కు (ఎంబీటీయూ) 13.35 డాలర్లుగా ఉంటుందని పేర్కొన్నాయి. అయితే, సంక్లిష్ట ప్రాంతాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్కు ప్రభుత్వం నిర్దేశించిన సీలింగ్ రేటును చెల్లించాల్సి ఉంటుందని వివరించాయి. ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఇది 12.12 డాలర్లుగా ఉందని తెలిపాయి. ఈ రేటును కేంద్రం 6 నెలలకోసారి సవరిస్తుంది. రిలయన్స్, దాని భాగస్వామి బీపీ ఈ జనవరిలోనే వేలం నిర్వహించాలని భావించినప్పటికీ జనవరి 13న కేంద్రం కొత్త ధరల విధానాన్ని ప్రకటించింది. దీంతో వేలాన్ని వాయిదా వేసుకుని, మార్చి 9 నుంచి నిర్వహించింది. -
రిలయన్స్ ఫౌండర్ అంబానీ: తొలి జీతం రూ.300, ఆసక్తికర విషయాలు
సక్సెస్ఫుల్ బిజినెస్ మేన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫౌండర్ ధీరజ్లాల్ హీరాచంద్ అంబానీ (ధీరూభాయ్) ఏం చదువుకున్నారో తెలుసా? దిగ్గజ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరూభాయ్ పదో తరగతి మాత్రమే పూర్తి చేశారంటే నమ్ముతారా? ఒకప్పుడు పెట్రోల్ పంపులో పని.. కానీ ఆ తరువాత వేల కోట్ల రూపాయలతో వ్యాపార దిగ్గజంగాఎదిగిన ధీరూభాయ్ అంబానీ గురించి అంతగా తెలియని ఆసక్తికరమైన విషయాలు సాధారణ కుటుంబంలో జననం, కష్టాలు ధీరూభాయ్ అంబానీ గుజరాత్, జునాగద్ జిల్లాలో చోర్వాడ్ అనే చిన్న గ్రామంలో 1932, డిసెంబరు 28న జన్మించారు. సామాన్య టీచర్ కుటుంబంలో నలుగురు తోబుట్టువులతో జీవితం కష్టాలతోనే ప్రారంభమైంది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ధీరూభాయ్ అంబానీ తన చదువును కూడా మధ్యలోనే వదిలివేసి కుటుంబానికి అండగా ఉండేందుకు చిన్న చిన్న పనులు చేశారు. పెట్రోలు బంకులో పని, నెలకు రూ.300 బిలియన్ డాలర్ల కంపెనీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ ప్రారంభంలో బ్రిటిష్ కాలనీ ఆఫ్ అడెన్లోని పెట్రోల్ బంకులో అటెండెంట్గా పనిచేశారు. ఆ సందర్భంగా నెలకు 300రూపాయలు జీతంగా తీసుకునేవారట. అంతకుముందు కుటుంబ పోషణ కోసం అనేక పనులు చేశారు.కానీ అవి నచ్చకపోవడంతో మిడిల్ ఈస్ట్ ఆసియా దేశమైన యెమెన్కు వలస వెళ్లి పెట్రోల్ బంకులో పని మొదలు పెట్టారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తీప్పింది. సూయజ్కు తూర్పున ఉన్న అతిపెద్ద ఖండాంతర వాణిజ్య సంస్థలో ట్రేడింగ్, అకౌంటింగ్, ఇతర వ్యాపార నైపుణ్యాలను నేర్చుకున్నారు. కొన్నేళ్లలోనే మంచి స్థానానికి ఎదిగారు. ఆ తరువాత అన్నింటినీ వదిలి తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చేశారు. రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ ఇండియాకి వచ్చిన తరువాత 1958లో తన బంధువు చంపక్లాల్దమానీతో కలిసి తొలి కంపెనీ రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ (సుగంధ ద్రవ్యాలు, నూలు వ్యాపారం) కంపెనీ స్థాపించారు. నూలు వ్యాపార పరిశ్రమలో పెరుగుతున్న అవకాశాలను గుర్తించిన తర్వాత ధీరూభాయ్ తన వ్యాపారాన్ని మార్చేశారు. మూడేళ్ల తర్వాత 1962లో రిలయన్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ను లాంచ్ చేశారు. బంధువు చంపక్లాల్ దమానీతో విడిపోయిన తరువాత 1966లో గుజరాత్లోని అహ్మదాబాద్లో 'రిలయన్స్ టెక్స్టైల్స్' అనే బట్టల మిల్లును ప్రారంభించారు. దీంతో అతని జీవితంలో అత్యంత మలుపు తిరిగింది. ఇక తరువాత మళ్ళీ ఎప్పుడూ వెనుదిరిగి చూసింది లేదు. అంచెలంచెలుగా రిలయన్స్ సామ్రాజాన్నివిస్తరించారు. అలాగే భారతదేశంలోని సగటు పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్ను పరిచయం చేసిన ఘనత అంబానీకి దక్కుతుందని మార్కెట్ నిపుణులమాట. భారతదేశంలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఫార్చ్యూన్ 500లోచోటు దక్కించుకున్న తొలి ఇండియన్ ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ టెక్స్టైల్స్ నిలిచింది. అలాగే 1996, 1998, 2000 సంవత్సరాల్లో ఆసియావీక్ పత్రిక 'పవర్ 50- ఆసియాలో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్' జాబితాలో చేరారు. దీంతోపాటు1999 సంవత్సరంలో బిజినెస్ ఇండియా 'బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా అందుకున్నారు. 69 ఏళ్ల వయసులో ధీరూభాయ్ అంబానీ 2002 జూలై 6న ముంబైలో కన్నమూశారు. (టాటా, బిర్లా సక్సెస్ సీక్రెట్ ఇదే? అనంత్, రాధికా మర్చంట్ అడోరబుల్ వీడియో వైరల్) ఖరీదైన రెస్టారెంట్లలో టీ తాగేవారు తాజా వ్యాపార ఆలోచనలకోసం, తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి, ధీరూభాయ్ అంబానీ సంపన్న వ్యాపారవేత్తలతో కలిసి తిరిగేవారట. నెట్వర్క్ , పరిశ్రమ గురించి తెలుసుకోవడానికి, ఖనీదైన రెస్టారెంట్లలో టీ తాగేవారని చెబుతారు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) ధీరూభాయ్ అంబానీ భార్య పేరు కోకిలాబెన్. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ, నినా కొఠారి, దీప్తి సల్గోకర్. ఆస్తులను తన ఇద్దరు కుమారులు ముఖేశ్, అనిల్ అంబానీలకు పంచి ఇచ్చారు. 2002లో ఆయన మరణించే ముందు వరకు కంపెనీని పర్యవేక్షించిన ఆయన 1980ల మధ్యకాలంలో తన కుమారులు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీలకు అప్పగించారు, ఆయన వారసత్వాన్ని అందుకున్న ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ఆసియా బిలియనీర్, భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా నిలిచిన సంగతి తెలిసిందే. (షాకింగ్! ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్: చిన్న డ్రాప్ ధర పదివేలకు పైనే) -
కుబేరుల్లో ఒకే ఒక్కడు అంబానీ! 23వ స్థానానికి అదానీ
న్యూఢిల్లీ: హిండెన్బర్గ్ రీసెర్చ్ వ్యవహారంతో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సంపద భారీగా కరిగిపోవడంతో.. అంతర్జాతీయంగా టాప్ 10 కుబేరుల్లో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఒక్కరే చోటు దక్కించుకున్నారు. 82 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన తొమ్మిదో స్థానంలో నిలవగా 53 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ 23వ స్థానానికి పరిమితమయ్యారు. డాలర్ల మారకంలో సంపదను లెక్కిస్తూ రీసెర్చ్ సంస్థ హురున్, రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎం3ఎం కలిసి రూపొందించిన ’2023 గ్లోబల్ రిచ్ లిస్ట్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అంబానీ మూడోసారి టైటిల్ నిలబెట్టుకున్నారు. వ్యాపారవేత్తల దృష్టికోణం నుంచి ప్రస్తుత ప్రపంచ ఎకానమీ పరిస్థితులను ఆవిష్కరించేలా ఈ జాబితా ఉందని హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. క్షీణతలో బెజోస్ టాప్.. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. అత్యధికంగా సంపద పోగొట్టుకున్న వారి లిస్టులో టాప్లో నిల్చారు. ఆయన సంపద 70 బిలియన్ డాలర్లు పడిపోయి 118 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంబానీ, అదానీ కలిసి పోగొట్టుకున్న సంపద కన్నా ఇది ఎక్కువ కావడం గమనార్హం. హురున్ రిపోర్ట్ ప్రకారం ఇలా భారీగా పోగొట్టుకున్న వారి లిస్టులో బెజోస్ అగ్రస్థానంలో ఉండగా.. అదానీ 6, అంబానీ 7వ ర్యాంకుల్లో నిల్చారు. 2022–23లో అదానీ సంపద 35 శాతం పడిపోయింది. 28 బిలియన్ డాలర్ల మేర (రోజుకు రూ. 3,000 కోట్లు చొప్పున) క్షీణించి మార్చి మధ్య నాటికి 53 బిలియన్ డాలర్లకు తగ్గింది. అంబానీ సంపద కూడా క్షీణించినప్పటికీ తగ్గుదల 20 శాతానికే పరిమితమైంది. అదానీ గ్రూప్ సంస్థల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తదనంతర పరిణామాలతో గౌతమ్ అదానీ సంపద భారీగా కరిగిపోయిన సంగతి తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► 2023 గ్లోబల్ రిచ్ లిస్ట్లో సంపన్నుల సంఖ్య 3,112కు తగ్గింది. గతేడాది ఇది 3,384గా ఉంది. వారి మొత్తం సంపద 10 శాతం తగ్గి 13.7 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైంది. ► గతేడాదితో పోలిస్తే భారత్లో బిలియనీర్ల సంఖ్య 28 తగ్గి 187కి చేరింది. ముంబైలో అత్యధికంగా 66 మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను పరిగణనలోకి తీసుకుంటే బిలియనీర్ల సంఖ్య 217గా ఉంది. మొత్తం కుబేరుల సంపదలో భారత్ వాటా 5 శాతంగా ఉంది. కాగా, అమెరికా వాటా అత్యధికంగా 32 శాతంగా ఉంది. భారత్తో పోలిస్తే చైనాలో బిలియనీర్ల సంఖ్య అయిదు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. ► భారత్లో 10 మంది మహిళా బిలియనీర్లు ఉన్నారు. సాఫ్ట్వేర్, సర్వీసుల విభాగంలో స్వయంకృషితో బిలియనీరుగా ఎదిగిన వారిలో 4 బిలియన్ డాలర్ల సంపదతో రాధా వెంబు రెండో స్థానంలో నిల్చారు. దివంగత ఇన్వెస్ట్మెంట్ గురు రాకేశ్ ఝున్ఝున్వాలా సతీమణి రేఖా ఈసారి కుబేరుల లిస్టులో స్థానం దక్కించుకున్నారు. -
జియో చేతికి యూఎస్ కంపెనీ.. 5జీ, బ్రాడ్బ్యాండ్ సేవలకు మద్దతు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం జియో ప్లాట్ఫామ్స్ తాజాగా యూఎస్ కంపెనీ మిమోసా నెట్వర్క్స్ను కొనుగోలు చేసింది. ఇందుకు 6 కోట్ల డాలర్ల(రూ. 492 కోట్లు) విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కమ్యూనికేషన్ సంబంధ పరికరాలు తయారు చేసే మిమోసా కొనుగోలుతో 5జీ టెలికం, బ్రాడ్బ్యాండ్ సర్వీసులను మరింత విస్తరించేందుకు వీలు చిక్కనుంది. అనుబంధ సంస్థ రాడిసిస్ కార్పొరేషన్ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జియో ప్లాట్ఫామ్స్ పేర్కొంది. రుణరహిత, క్యాష్ ఫ్రీ ప్రాతిపదికన మిమోసాను సొంతం చేసుకునేందుకు ఎయిర్స్పాన్ నెట్వర్క్స్ హోల్డింగ్స్తో 6 కోట్ల డాలర్లకు ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. మిమోసా వైఫై–5 ఆధారిత పాయింట్ టు మల్టీపాయింట్ ప్రొడక్టులతోపాటు.. ఆధునిక వైఫై 6ఈ టెక్నాలజీలు, సంబంధిత పరికరాల పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. 2018లో మిమోసాను ఎయిర్స్పాన్ కొనుగోలు చేసింది. కాగా.. చైనీస్ టెక్నాలజీ నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దూరం జరుగుతున్న నేపథ్యంలో మిమోసా కొనుగోలు జియో ప్లాట్ఫామ్స్కు కీలకంగా నిలవనుంది. మిమోసాకు జియో ప్రధాన కస్టమర్కావడం గమనార్హం! -
జీఐఎస్ రెండో రోజు: ఏపీ సర్కార్ కీలక ఎంవోయూలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ కోసం.. పరిపాలన రాజధాని విశాఖ వేదికగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 విజయవంతమైంది. సదస్సులో రెండో రోజైన శనివారం(మార్చి 4వ తేదీ) ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు(ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి పలు ప్రతిష్టాత్మక కంపెనీలు. దాదాపు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. వీటిలో.. రిలయన్స్ కంపెనీ 50వేల కోట్ల రూపాయలతో అగ్రగామిగా(ఇవాళ్టి ఒప్పందాల ప్రకారం) ఉంది. విశాఖ జీఐఎస్.. రెండోరోజు ఎంవోయూల జాబితా పరిశీలిస్తే.. ►రిలయన్స్ ఎంవోయూ రూ. 50,000 కోట్లు ►హెచ్పీసీఎల్ ఎనర్జీ ఎంవోయూరూ. 14, 320 కోట్లు ►టీవీఎస్ ఐఎల్పీ ఎంవోయూ రూ. 1,500 కోట్లు ►ఎకో స్టీల్ ఎంవోయూ రూ. 894 కోట్లు ►బ్లూస్టార్ ఎంవోయూ రూ. 890 కోట్లు ►ఎస్2పీ సోలార్ సిస్టమ్స్ ఎంవోయూ రూ. 850 కోట్లు ►గ్రీన్లామ్ సౌత్ లిమిటెడ్ ఎంవోయూ రూ. 800 కోట్లు ►ఎక్స్ప్రెస్ వెల్ రీసోర్సెస్ ఎంవోయూ రూ. 800 కోట్లు ►రామ్కో ఎంవోయూ రూ. 750 కోట్లు ►క్రిబ్కో గ్రీన్ ఎంవోయూ రూ. 725 కోట్లు ►ప్రకాశ్ ఫెరోస్ ఎంవోయూ రూ. 723 కోట్లు ►ప్రతిష్ట బిజినెస్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►తాజ్ గ్రూప్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►కింబర్లీ క్లార్క్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►అలియన్న్ టైర్ గ్రూప్ ఎంవోయూ రూ. 679 కోట్లు ►దాల్మియా ఎంవోయూ రూ. 650 కోట్లు ►అనా వొలియో ఎంవోయూ రూ. 650 కోట్లు ►డీఎక్స్ఎన్ ఎంవోయూ రూ. 600 కోట్లు ►ఈ-ప్యాక్ డ్యూరబుల్ ఎంవోయూ రూ. 550 కోట్లు ►నాట్ సొల్యూషన్న్ ఎంవోయూ రూ. 500 కోట్లు ►అకౌంటిఫై ఇంక్ ఎంవోయూ రూ. 488 కోట్లు ►కాంటినెంటల్ ఫుడ్ అండ్ బెవరేజీస్ ఎంవోయూ రూ. 400 కోట్లు ►నార్త్ ఈస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంవోయూ రూ. 400 కోట్లు ►ఆటమ్స్టేట్ టెక్నాలజీస్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►క్లేరియన్ సర్వీసెస్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►చాంపియన్ లగ్జరీ రిసార్ట్స్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►వీఆర్ఎమ్ గ్రూప్ ఎంవోయూ రూ. 342 కోట్లు ►రివర్ బే గ్రూప్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►హావెల్స్ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు ►సూట్స్ కేర్ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు ►పోలో టవర్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►ఇండియా అసిస్ట్ ఇన్సైట్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►స్పార్క్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►టెక్ విషెన్ సాఫ్ట్వేర్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►మిస్టిక్ పామ్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►నియోలింక్ గ్రూప్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►ఎండానా ఎనర్జీస్ ఎంవోయూ రూ. 285 కోట్లు ►అబ్సింకా హోటల్స్ ఎంవోయూ రూ. 260 కోట్లు ►సర్ రే విలేజ్ రిసార్ట్స్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►హ్యాపీ వండర్లాండ్ రిసార్ట్స్ ఎంవోయూరూ. 250 కోట్లు ►చాంపియన్స్ యాచ్ క్లబ్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►టెక్నోజెన్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►పార్లె ఆగ్రో ఎంవోయూ రూ. 250 కోట్లు ►ఎకో అజైల్ రిసార్ట్ ఎంవోయూ రూ. 243 కోట్లు ►ఎల్జీ పాలిమర్స్ ఎంవోయూ రూ. 240 కోట్లు ►హైథియన్ హ్యూయన్ మిషనరీ ఎంవోయూ రూ. 230 కోట్లు ►గోకుల్ ఆగ్రో ఎంవోయూ రూ. 230 కోట్లు ►ఎస్పీఎస్ ఇన్ప్రా ఎంవోయూ రూ. 225 కోట్లు ►డీవీవీ బయో ఫ్యూయల్స్ ఎంవోయూ రూ. 223 కోట్లు ►దాల్వకోట్ బయో ఫ్యూయల్ప్ ఎంవోయూ రూ. 200 కోట్లు ►ఆమ్ కన్స్ట్రక్షన్స్ ఎంవోయూ రూ. 200 కోట్లు ►కేపిటల్ బిజినెస్ పార్క్ ఎంవోయూ రూ. 184 కోట్లు ►చాంయిన్ యాచ్ ఎంవోయూ రూ. 190 కోట్లు ►ఎన్జీసీ ట్రాన్స్మిషన్ ఎంవోయూ రూ. 185 కోట్లు ►యాక్సలెంట్ ఫార్మా సైన్స్ ఎంవోయూ రూ. 176 కోట్లు ►విన్విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ ఎంవోయూ రూ. 174 కోట్లు ►ట్రాన్సెండ్ రియాలిటీ డెవలప్మెంట్ ఎంవోయూ రూ. 165 కోట్లు ►చాంపియన్ ఇన్ఫ్రాటెక్ ఎంవోయూ రూ. 150 కోట్లు ►స్విచ్గేర్ ఎంవోయూ రూ. 150 కోట్లు ►ఆంబర్ ఎంటర్ప్రైజస్ ఇండియా ఎంవోయూ రూ. 150 కోట్లు ►ది రిప్పుల్స్ ఎంవోయూ రూ. 150 కోట్లుగా ఉన్నాయి. ఇక విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ వేదికగా తొలి రోజు కూడా ఏపీ ప్రభుత్వంతో కీలక ఎంవోయూలు కుదిరాయి. మొత్తం 92 ఎంవోయూలు జరిగాయి. వీటి విలువ రూ.11లక్షల 87 వేల 756 కోట్లు. వీటిలో ఎన్టీపీసీ రూ. 2..35లక్షల కోట్ల ఎంవోయూతో అగ్రగామిగా నిలిచింది. ఏబీసీ లిమిటెట్ (రూ. 1.20 లక్షల కోట్లు), రెన్యూ పవర్ (రూ. 97, 550 కోట్లు), ఇండోసాల్ (రూ. 76, 033 కోట్లు), ఏసీఎమ్ఈ (రూ. 68,976 కోట్లు), టీఈపీఎస్ఓఎల్ ( రూ. 65, 000 కోట్లు), జేఎస్డబ్యూ గ్రూప్(రూ. 50, 632 కోట్లు), హంచ్ వెంచర్స్(రూ. 50 వేల కోట్లు), అవాదా గ్రూప్( రూ 50 వేల కోట్లు) జాబితాలో అగ్రగామిగా ఉన్నాయి. ఇక రెండు రోజుల ఈ అవగాహన ఒప్పందాల ద్వారా ఏపీకి రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సీఎం జగన్ చేసిన ప్రకటన.. కార్యరూపం దాల్చినట్లయ్యింది. మొత్తంగా 340 పెట్టుబడుల ప్రతిపాదనలు, 20 రంగాల్లో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ఈ ఎంవోయూల ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. -
UP Global Investors Summit 2023 యూపీపై అంబానీ వరాల జల్లు, వేల కోట్ల పెట్టుబడులు
లక్నో: యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 సందర్భంగా పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఉత్తరప్రదేశ్పై వరాల జల్లు కురిపించారు. రానున్న నాలుగేళ్లలో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను సృష్టించేందుకు, అదనంగా రూ.75,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు తెలిపారు. జియో, రీటైల్, రెన్యూవల్, రంగంలో ఈ ఉద్యోగాలు లభిస్తాయని అంబానీ ప్రకటించారు. రానున్న పది నెలల్లో (డిసెంబరు,2023 నాటికి యూపీలోని మూలమూలకు జియో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ముఖేశ్ అంబానీ చెప్పారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్ దేశంలోని 'ఉత్తమ్' ప్రదేశ్గా అభివృద్ధి చెందుతోందంటూ కితాబిచ్చారు. ఉద్యోగ, సహయోగ్ కలబోతగా అభివృద్ధి బాటలో యూపీ పయనిస్తోందిన్నారు. రిలయన్స్ రిటైల్ ద్వారా ఉత్తర ప్రదేశ్ వ్యవసాయ, వ్యవసాయేతర కొనుగోళ్లను పెంచుతాంమనీ, కొత్త బయో ఎనర్జీ వ్యాపారాన్ని ప్రారంభించనున్నామని కూడా ప్రకటించారు.ఈ సందర్భంగా యూనియన్ బడ్జెట్ 2023-24 ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించడానికి పునాది వేసిందని అంబానీ ప్రశంసించారు. కాగా శుక్రవారం ఫిబ్రవరి 10నుంచి మూడు రోజుల పాటు 2023న లక్నోలో జరగనున్న ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కు ముఖ్య అతిధి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రధాని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు తదితరులు పాల్గొన్నారు -
ఇషా అంబానీ దూకుడు: శ్రీలంక కంపెనీతో డీల్, వాటికి బిగ్ షాకే!
సాక్షి,ముంబై: రిలయన్స్ మరో వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. ఆయిల్నుంచి టెలికాం దాకా అడుగుపెట్టిన ప్రతీ రంగంలోనూ దూసుకుపోతున్న రిలయన్స్ త్వరలోనే ఇండియా బిస్కెట్ల వ్యాపారంలోకి ప్రవేశించనుంది. ఇందుకోసం శ్రీలంక ఆధారిత మాలిబాన్ బిస్కెట్ మాన్యుఫాక్టరీస్ (ప్రైవేట్) లిమిటెడ్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. మాలిబాన్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) తెలిపింది. దేశీయ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వినియోగదారు బ్రాండ్ను ఇండియాకు తీసుకురావడమే లక్ష్యమని తెలిపింది. ఇందులో భాగంగానే మాలిబన్ బిస్కెట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే దేశీయ బిస్కెట్ల మార్కెట్లో 80 శాతం వాటా ఉన్న దిగ్గజాలు బ్రిటానియా,ఐటీసీ, పార్లేకు గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ సంతోషం ప్రకటించారు. తమ ఎఫ్ఎంసీజీ పోర్ట్ఫోలియోను గొప్ప బ్రాండ్ ద్వారా బలోపేతం చేయడమే కాకుండా, తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా అద్భుత సేవలందించ గలుగుతామన్నారు. కాగా ఏడాది డిసెంబరులో గుజరాత్లో మేడ్-ఫర్-ఇండియా కన్స్యూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ బ్రాండ్ ‘ఇండిపెండెన్స్’ ను ప్రారంభించిన సంగతి తెలిసిదే. RCPLతో భాగస్వామ్యంపై మాలిబాన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కుముదిక ఫెర్నాండో మాట్లాడుతూ, “రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మాలిబన్తో భాగస్వామ్యాన్ని ఎంచు కోవడం సంతోషమని, దాదాపు 70 సంవత్సరాలుగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను కొనసాగించడంలోతమ అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 1954లో స్థాపితమైన మాలిబాన్ శ్రీలంకలో రెండవ అతిపెద్ద బిస్కెట్ కంపెనీగా పాపులర్. బిస్కెట్లు, క్రాకర్లు, కుకీలు, ఇతర ఉత్పత్తులను 35 దేశాలకు ఎగుమతి చేస్తోంది. -
రిలయన్స్ క్యూ3 లాభాలు ఢమాల్, జియో అదుర్స్
సాక్షి,ముంబై: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ క్యూ3 నికర లాభం 15 శాతం క్షీణించింది. 2022 డిసెంబరు 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఇందులో కన్సాలిడేటెడ్ నికర లాభం 15శాతం తగ్గి రూ. 15,792 కోట్లకుచేరింది. ఇది అంతకు ముందు సంవత్సరం రూ. 18,549 కోట్లుగా ఉంది. రిలయన్స్ ఆదాయం మాత్రం 15 శాతం పుంజుకుని రూ.2,20,592 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇది రూ.1,91,271 కోట్లు. అటు రిలయన్స్ బలమైన రిఫైనింగ్ మార్జిన్లు,ఇంధన డిమాండ్తో చమురు-రసాయనాల వ్యాపారం లాభపడింది. సవాళ్లతో కూడిన వాతావరణంలో కూడా తమ టీమ్స్ బలమైన నిర్వహణ పనితీరులో అద్భుతంగా వర్క్ చేశాయని రిలయర్స్ ఛైర్మన్ అండ్ ఎండీ ముఖేశ్ అంబానీ సంతోషం వెలిబుచ్చారు. జియో లాభం జూమ్ కంపెనీకి చెందిన టెలికాం, డిజిటల్ సేవల అనుబంధ సంస్థ జియో ప్లాట్ఫారమ్లు నికర లాభాలలో 28.6 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.4,881 కోట్లను సాధించింది. ఆదాయం 20.9 శాతం వృద్ధిచెంది 24,892 కోట్లుగా ఉంది. EBITDA 25.1 శాతం పెరిగి 12,519 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ రిటైల్ రిటైల్ విభాగం రిలయన్స్ రీటైల్ వ్యాపారం సంవత్సరానికి 6.2 శాతం వృద్ధితో రూ. 2,400 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 18.6 శాతం పెరిగి రూ.60,096 కోట్లకు చేరుకుంది. EBITDA 24.9 శాతం పెరిగి రూ.4,773 కోట్లకు చేరుకుంది. O2C చమురు నుంచి రసాయనాల (O2C) వ్యాపార ఆదాయం 10 శాతం పెరిగి రూ.1,44,630 కోట్లకు చేరుకుంది. EBITDA 2.9 శాతం పెరిగి రూ.13,926 కోట్లకు చేరుకుంది. -
నంబర్ వన్ బ్రాండ్ సంరక్షకుడిగా అంబానీ ..
న్యూఢిల్లీ: బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ 2023 జాబితాలోని భారతీయు ల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. మొత్తం లిస్టులో రెండో స్థానంలో నిల్చారు. కంపెనీ బ్రాండ్కు సంరక్షకుడిగా వ్యవహరించడంలోను, దీర్ఘకాలికంగా వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలోను సీఈవోల సామర్థ్యాల ఆధారంగా దీన్ని బ్రాండ్ ఫైనాన్స్ రూ పొందించింది. ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ 1వ స్థానంలో ఉన్నారు. గతేడాది అగ్రస్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల 3వ స్థానంలోనూ, అడోబ్ చీఫ్ శంతను నారాయణ్ 4వ స్థానంలో , గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 5వ ర్యాంకులో ఉన్నారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ 8వ స్థానం, డీబీఎస్ సీఈవో పియుష్ గుప్తా 9వ ర్యాంకులో ఉన్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్లో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 1,000 మంది మార్కెట్ అనలిస్టులు, జర్నలిస్టుల అభిప్రాయాల ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. -
వైభవంగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ నిశ్చితార్థ వేడుక
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ఎంగేజ్మేంట్ వేడుక ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. గుజరాతీ హిందూకుటుంబాలలో తరతరాలుగా అనుసరిస్తున్న గోల్ ధన, చునారి విధి వంటి పురాతన సంప్రదాయాలతో ఈ వేడుకను నిర్వహించారు. గుజరాతీ హిందూ కుటుంబాలు తరతరాలుగా పాటిస్తున్న గోల్ ధన, చునారి విధి కార్యక్రమాలు కుటుంబ దేవాలయంలో నిర్వహించారు. కుటుంబ సభ్యులు బహుమతులు ఇచ్చిపుచ్చుకుని ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు గుజరాతీ సంప్రదాయాలలో వివాహానికి ముందు జరిగే వేడుక గోల్ ధన. అంటే ఏంటీ గోల్ ధన అంటే బెల్లం, కొత్తిమీర గింజలు అని అర్ధం. గుజరాతీ సంప్రదాయాలలో వివాహానికి ముందు జరిగే నిశ్చితార్థం లాంటిదే. వధువు కుటుంబం బహుమతులు, స్వీట్లతో వరుడి నివాసానికి తరలి వెళ్లి, అక్కడ బంధు మిత్రుల సమక్షంలో ఆపై జంట ఉంగరాలు మార్చుకుంటారు. ఉంగరాలు మార్చుకున్న తర్వాత దంపతులు తమ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. సాయంత్రం వేడుకలకు అనంత్ సోదరి ఇషా నేతృత్వంలో అంబానీ కుటుంబ సభ్యులు రాధికను ఆహ్వానించడానికి మర్చంట్ నివాసానికి వెళ్లడంతో వేడుకలు ప్రారంభమైనాయి. ఈ మేరకు రిలయన్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అనంత్, రాధికలతోపాటు కుటుంబసభ్యులు శ్రీకృష్ణుని దర్శించుకుని సాంప్రదాయ లగ్న పత్రిక లేదా రాబోయే వివాహానికి ఆహ్వానం పఠనం తర్వాత గణేష్ పూజతో విధులను ప్రారంభించడానికి బృందం అక్కడి నుండి వేడుక వేదికకు తరలివెళ్లింది. గోల్ ధన , చునారి విధి తర్వాత అనంత్ రాధిక కుటుంబీకుల మధ్య ఆశీర్వాదాలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ నేతృత్వంలో నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటూ విశేషంగా నిలిచింది. సోదరి ఇషా రింగ్ వేడుక ప్రారంభమైనట్లు ప్రకటించిన వెంటనే అనంత్ రాధిక ఉంగరాలు మార్చుకుని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంత్, రాధిక పెళ్లికబురు గత కొన్నిరోజులుగా ప్రత్యేకంగా నిలుస్తోంది. తాజాగా వివాహబంధంలో కీలకమైన వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు . కాగా బిలియనీర్ ముఖేశ్ అంబానీ, నీతా కుమారుడు అనంత్ అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్. రిలయన్స్ ఇండస్ట్రీస్లో జియో, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డ్లలో సభ్యునిగా కూడా వివిధ హోదాల్లో పనిచేసి, ప్రస్తుతం RIL ఇంధన వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. శైలా, వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక, న్యూయార్క్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. ఎన్కోర్ హెల్త్కేర్ బోర్డ్లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు.ప్రత్యేక దీపాలు,పుష్పాలంకరణతో వేదిక దేదీప్యమానంగా మంగళవారం రాధిక మర్చంట్ మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రిలయన్స్ను పరుగులు పెట్టించిన అంబానీ.. 20 ఏళ్లలోనే..
న్యూఢిల్లీ: తండ్రి ధీరుభాయ్ అంబానీ ఆకస్మిక మరణంతో వ్యాపార సామ్రాజ్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) పగ్గాలను ఆయన కుమారుడు ముకేశ్ అంబానీ (65) చేపట్టి రెండు దశాబ్దాలయ్యింది. ఈ ఇరవై ఏళ్లలో రిలయన్స్ను ముకేశ్ వృద్ధి బాటలో పరుగులు పెట్టించారు. టెలికమ్యూనికేషన్స్, రిటైల్, కొత్త ఇంధనం తదితర విభాగాల్లోకి సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆయన సారథ్యంలో రిలయన్స్ ఆదాయం 17 రెట్లు, లాభాలు 20 రెట్లు ఎగిశాయి. కంపెనీ అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటిగా ఆవిర్భవించింది. 2002లో ధీరుభాయ్ మరణం అనంతరం ముకేశ్, ఆయన చిన్న సోదరుడు అనిల్ అంబానీ.. రిలయన్స్ పగ్గాలు చేపట్టారు. ముకేశ్ సీఎండీగాను, అనిల్ వైస్ చైర్మన్, జాయింట్ ఎండీగాను బాధ్యతలు స్వీకరించారు. అయితే, సోదరులిద్దరి మధ్య ఆధిపత్య పోరు తలెత్తడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండుగా చీలింది. విభజనతో ముకేశ్ వంతుకు గ్యాస్, ఆయిల్, పెట్రోకెమికల్స్ విభాగాలు రాగా అనిల్ చేతికి టెలికం, విద్యుదుత్పత్తి, ఆర్థిక సేవల విభాగాలు వచ్చాయి. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ డ్రాపౌట్ అయిన ముకేశ్ సారథ్యంలో రిలయన్స్ మహా సామ్రాజ్యంగా ఎదిగింది. ఆ వివరాలు.. ►2002 మార్చిలో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ. 41,989 కోట్లు కాగా 20% వార్షిక వృద్ధితో 2022 మార్చికల్లా రూ. 17,81,841 కోట్లకు చేరింది. ►ఆదాయాలు రూ. 45,411 కోట్ల నుంచి రూ. 7,92,756 కోట్లకు, లాభాలు రూ. 3,280 కోట్ల నుంచి రూ. 67,845 కోట్లకు ఎగిశాయి. ►ఎగుమతులు రూ. 11,200 కోట్ల నుంచి రూ. 2,54,970 కోట్లకు చేరాయి. ►మొత్తం అసెట్స్ వార్షిక ప్రాతిపదికన 19 శాతం వృద్ధితో రూ.48,987 కోట్ల నుంచి రూ. 14,99,665 కోట్లకు ఎగిశాయి. నికర విలువ 2002లో రూ. 27,977 కోట్లుగా ఉండగా.. 2022 మార్చి నాటికి రూ. 6,45,127 కోట్లకు పెరిగింది. ►రెండు దశాబ్దాల్లో ఇన్వెస్టర్ల సంపదకు ఏటా సగటున రూ. 87,000 కోట్లు చొప్పున, రిలయన్స్ రూ. 17.4 లక్షల కోట్లు జత చేసింది. ►మోతీలాల్ ఓస్వాల్ 26వ వార్షిక సంపద సృష్టి అధ్యయనం ప్రకారం 2016–21 మధ్యలో రూ. 10 లక్షల కోట్ల సంపద సృష్టితో రిలయన్స్ టాప్లో నిల్చింది. తన గత రికార్డును తానే తిరగరాసింది. ►ఈ క్రమంలో 2007లో ముకేశ్ అంబానీ దేశీయంగా తొలి ట్రిలియనీర్గా (రూపాయి మారకంలో లక్ష కోట్ల అధిపతి) ఎదిగారు. విస్తరణ.. రెండు దశాబ్దాల్లో రిలయన్స్ పలు కొత్త వ్యాపారాల్లోకి విస్తరించింది. 2006లో రిటైల్లోకి, 2021లో న్యూ ఎనర్జీ విభాగంలోకి ప్రవేశించింది. 2016లో జియో ద్వారా టెలికంలో సంచలనం సృష్టించింది. రిలయన్స్కు 2002లో జామ్నగర్లో ఒక్క ఆయిల్ రిఫైనరీ ఉండేది. అది ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్ లొకేషన్ రిఫైనింగ్ కాంప్లెక్స్గా ఎదిగింది. ఈ వ్యవధిలో రిలయన్స్ చమురు శుద్ధి సామర్థ్యాలను రెట్టింపు చేసుకుంది. 2009లో చమురు, గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించింది. అటు పైన బ్రిటిష్ పెట్రోలియం దిగ్గజం బీపీని భాగస్వామిగా చేసుకుని పెట్రోల్ రిటైల్ అవుట్లెట్స్ నడిపిస్తోంది. పర్యావరణ అనుకూల ఇంధనాలపై దృష్టి పెట్టిన రిలయన్స్ వచ్చే మూడేళ్లలో కొత్త ఇంధన వ్యాపారంపై రూ.75,000 కోట్లు వెచ్చించనుంది. నిధుల సమీకరణ... 2021 ఆర్థిక సంవత్సరంలో రైట్స్ ఇష్యూ వంటి మార్గాల్లో రిలయన్స్ రికార్డు స్థాయిలో రూ. 2.5 లక్షల కోట్లు సమీకరించింది. జియో ప్లాట్ఫామ్స్.. రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో మైనారిటీ వాటాలు విక్రయించింది. ఫేస్బుక్, గూగుల్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. -
రిలయన్స్ మరో సంచలనం: గుజరాత్లో షురూ
సాక్షి,ముంబై ముఖేశ్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనానికి నాంది పలికింది. ఆయిల్ టూ టెలికాం, రీటైల్ వ్యాపారంలో దూసుకుపోతున్న రిలయన్స్ తన రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ పూర్తి యాజమాన్యంలోని బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రతీ అణువులోనూ భారత్ అంటూ స్వదేశీ బ్రాండ్ ‘ఇండిపెండెన్స్’ ను లాంచ్ చేసింది. మేడ్-ఫర్-ఇండియా కన్స్యూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ బ్రాండ్, ఇండిపెండెన్స్ కింద స్టేపుల్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు , ఇతర రోజువారీ అవసర సరుకులు సహా అనేక వర్గాల విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందిస్తుంది. ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టబోతున్నామని ప్రకటించిన రిలయన్స్ గ్రూప్ ‘ఇండిపెండెన్స్’ అనే బ్రాండ్ పేరుతో సేవలను గుజరాత్లో గురువారం ప్రారంభించింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ద్వారా ఈ సేవలను లాంచ్ చేసింది. రాబోయే నెలల్లో ఇండిపెండెన్స్ బ్రాండ్ను విస్తరించాలని , గుజరాత్ వెలుపలి రిటైలర్లను చేర్చాలని యోచిస్తోంది. ఎడిబుల్ ఆయిల్, పప్పులు, తృణ ధాన్యాలు, బిస్కట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ తదితర నిత్యావసర వస్తువులను నాణ్యమైన, సరసమైన ధరలకు సరఫరా చేయనున్నామని కంపెనీ ప్రకటించింది. ఇండిపెండెన్స్ బ్రాండ్ కింద ఎఫ్ఎంసీజీ సేవలను లాంచ్ చేయడం సంతోషంగా ఉందని రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ అన్నారు. అహ్మదాబాద్లో జరిగిన కార్యక్రమంలో వెంచర్స్ లిమిటెడ్ బ్రాండ్ను తీసుకొచ్చారు. గుజరాత్ను ‘గో టు మార్కెట్’ రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా బిలియనీర్ ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ FY22లో కంపెనీ అమ్మకాలు, సేవల విలువ రూ.1,99,749 కోట్లును సాధించి తద్వారా మార్కెట్ విలువ రూ.2 ట్రిలియన్లకు చేరింది. అనుబంధ సంస్థల ద్వారా, రిలయన్స్ రిటైల్ 16,500 కంటే ఎక్కువ సొంత దుకాణాలను నిర్వహిస్తోంది. కిరాణా, ఎలక్ట్రానిక్స్, అపెరల్, ఫార్మసీ, లోదుస్తులు, ఇల్లు , ఫర్నిషింగ్, బ్యూటీ, పర్సనల్ కేర్ సంరక్షణలో 2 మిలియన్లకు పైగా వ్యాపారులతో భాగస్వాములను కలిగి ఉంది. -
సంపద సృష్టిలో పోటాపోటీ.. అగ్రపథాన రిలయన్స్ ఇండస్ట్రీస్
ముంబై: సంపద సృష్టిలో దేశీ కార్పొరేట్ దిగ్గజాలు పోటీ పడుతున్నాయి. వార్షికంగా చూస్తే 2022లో అదానీ గ్రూప్ కంపెనీలు అగ్రభాగానికి చేరగా.. ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గత ఐదేళ్లలో అన్ని రికార్డులనూ అధిగమిస్తూ లీడర్గా నిలిచింది. సంపద సృష్టిపై బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ రూపొందించిన 27వ వార్షిక నివేదిక ప్రకారం గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలు అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్ ఈ ఏడాది దుమ్మురేపాయి. ఇతర వివరాలు చూద్దాం.. టాప్–100 ఇలా..: గత ఐదేళ్లలో టాప్–100 కంపెనీలు మొత్తం రూ. 92.2 లక్షల కోట్ల సంపదను జమ చేసుకున్నాయి. ఇది సరికొత్త రికార్డుకాగా.. ఆర్ఐఎల్ అతిపెద్ద వెల్త్ క్రియేటర్గా నిలిచింది. అయితే 2022లో అదానీ గ్రూప్ కంపెనీలు వివిధ ఆస్తుల కొనుగోలు, కొత్త రంగాలలోకి ప్రవేశించడం వంటి అంశాలతో వెలుగులో నిలిచాయి. వెరసి 2022లో గౌతమ్ అదానీ 155.7 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే రెండో ధనవంతుడిగా రికార్డు సాధించారు. సెప్టెంబర్ 16కల్లా ఫోర్బ్స్ రూపొందించిన రియల్ టైమ్ జాబితా ఇది. ప్రధానంగా ఈ రెండు కంపెనీలలో 75 శాతం చొప్పున వాటా కలిగిన గౌతమ్ అదానీ 2022లో సెప్టెంబర్కల్లా ఏకంగా 70 బిలియన్ డాలర్ల సంపదను జమ చేసుకున్నారు. గ్రూప్ కంపెనీలు అదానీ టోటల్ గ్యాస్(37 శాతం), గ్రీన్ ఎనర్జీ(61 %) ఫోర్బ్స్(65 %)లోనూ వాటాలు కలిగి ఉండటం ఇందుకు సహకరించింది. ఇదే సమయంలో ముకేశ్ 92.3 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో 8వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. 253.5 బిలియన్ డాలర్ల సంపదతో ఎలక్ట్రిక్ కార్ల(టెస్లా) దిగ్గజం ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా ఆవిర్భవించారు. ఐదేళ్ల కాలంలో..: 2017–22 కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ట్రాన్స్మిషన్, ఎంటర్ప్రైజెస్ అత్యంత వేగంగా నిలకడగా ఎదిగిన భారీ కంపెనీలుగా నిలిచాయి. రంగాలవారీగా చూస్తే ఈ కాలంలో టెక్నాలజీ, ఫైనాన్షియల్స్ తొలి రెండు ర్యాంకులను సాధించాయి. సంపద సృష్టిలో టాప్–100 కంపెనీలను, మార్కెట్ విలువల్లో మార్పులను నివేదిక పరిగణించింది. దీనిలో భాగంగా విలీనాలు, విడదీతలు, ఈక్విటీ జారీ, బైబ్యాక్ తదితర కార్పొరేట్ అంశాలను సైతం లెక్కలోకి తీసుకుంది. ఈ ఐదేళ్లలో నాలుగేళ్లపాటు ఆర్ఐఎల్ అత్యధిక సంపదను సృష్టించిన దిగ్గజంగా ఆవిర్భవించింది. వెర సి ఐదేళ్లకుగాను టాప్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఇక టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ జాబితాలో టాప్–5లో నిలిచాయి. కాగా.. అదానీ ఎంటర్ప్రైజెస్ గత ఐదేళ్లలో నిలకడైన సంపద సృష్టికి నిదర్శనంగా నిలిచింది. -
Burgundy Private Hurun India 500: విలువలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నంబర్ 1
ముంబై: దేశంలో అత్యంత విలువైన (మార్కెట్ విలువ ఆధారితంగా) లిస్టెడ్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో నిలిచింది. టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ‘2022 బర్గండి ప్రైవేట్ హరూన్ ఇండియా 500’ కంపెనీల జాబితా గురువారం విడుదలైంది. 500 కంపెనీల ఉమ్మడి విలువ రూ.226 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్ మార్కెట్ విలువ రూ.17.25 లక్షల కోట్లు. రెండో స్థానంలో ఉన్న టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.11.68 లక్షల కోట్లుగా ఉంది. రూ.8.33 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మూడో స్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్ (రూ.6.46 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.6.33 లక్షల కోట్లు), ఎయిర్టెల్ (రూ.4.89 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ (రూ.4.48 లక్షల కోట్లు), ఐటీసీ (రూ.4.32 లక్షల కోట్లు), అదానీ టోటల్ గ్యాస్ (రూ.3.96 లక్షల కోట్లు), అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.3.81 లక్షల కోట్ల విలువతో టాప్–10లో ఉన్నాయి. అదానీ కంపెనీలు ఎనిమిది.. ‘‘గౌతమ్ అదానీకి సంబంధించి ఏడు కంపెనీలు ఇందులో ఉన్నాయి. అంబుజా సిమెంట్స్ కొనుగోలుతో ఎనిమిదో కంపెనీ వచ్చి చేరింది. ఉపఖండంలో అత్యంత సంపన్నుడు కావడందో ఇదేమీ ఆశ్చర్యాన్నివ్వలేదు. టాటా సన్స్ నుంచి ఆరు కంపెనీలు, సంజీవ్ గోయెంకా నుంచి మూడు, కుమార మంగళం బిర్లా నుంచి మూడు చొప్పున కంపెనీలు జాబితాలో ఉన్నాయి’’అని హరూన్ ఇండియా ఎండీ అనాస్ రెహమాన్ జునైద్ తెలిపారు. లిస్టులో తెలంగాణ సంస్థల సంఖ్య రెండు పెరిగి 31కి చేరింది. టాప్ 10 యంగెస్ట్ కంపెనీల జాబితాలో సువెన్ ఫార్మా, మెన్సా బ్రాండ్స్ చోటు దక్కించుకున్నాయి. -
ఫ్యూచర్ రిటైల్: అంబానీ, అదానీకి పోటీగా కంపెనీలు నువ్వా? నేనా?
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) కొనుగోలు రేసులో మొత్తం 13 కంపెనీలు నిల్చాయి. దీనికి సంబంధించి రూపొందించిన తుది జాబితాలో ముఖేశ్ అంబానీ రిలయన్స్ రిటైల్, అదానీ గ్రూప్ జాయింట్ వెంచర్ సంస్థ ఏప్రిల్ మూన్ రిటైల్తో పాటు మరో 11 కంపెనీలు ఉన్నాయి. నవంబర్ 10న విడుదల చేసిన ప్రొవిజనల్ లిస్టుపై రుణ దాతల నుండి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ఆయా కంపెనీలను తుది జాబితాలోనూ చేర్చినట్లు ఎఫ్ఆర్ఎల్ పరిష్కార నిపుణుడు (ఆర్పీ) వెల్లడించారు. (బీమా కంపెనీలకు ఐఆర్డీఏఐ కీలక ఆదేశాలు) ఎఫ్ఆర్ఎల్ రుణ భారం రూ. 24,713 కోట్ల పైచిలుకు ఉంది. ఇందులో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సినది రూ. 21,433 కోట్లు కాగా, ఆపరేషనల్ క్రెడిటర్లకు రూ. 2,464 కోట్ల మేర కట్టాలి. రుణాల చెల్లింపులో డిఫాల్ట్ కావడంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా .. ఎఫ్ఆర్ఎల్పై దివాలా పిటీషన్ వేసింది. ఎఫ్ఆర్ఎల్ సహా 19 ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల టేకోవర్కు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నించినా.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సాధ్యపడలేదు. (Bisleri చైర్మన్ సంచలన నిర్ణయం: రూ. 7 వేల కోట్ల డీల్) -
Forbes World Best Employers for 2022: దేశంలో అత్యుత్తమ సంస్థగా రిలయన్స్
న్యూఢిల్లీ: మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అగ్రగామిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఉద్యోగులకు అత్యుత్తమ యాజమాన్య సంస్థగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఫోర్బ్స్ సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమ యాజమాన్య సంస్థలకు 2022 సంవత్సరానికి ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఆల్ఫాబెట్ (గూగుల్), యాపిల్ వరుసగా ఉన్నాయి. అంతేకాదు 2 నుంచి 12వ స్థానం వరకు ర్యాంకులు అమెరికా కంపెనీలే సొంతం చేసుకున్నాయి. 13వ స్థానంలో జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ గ్రూపు ఉంది. అమెజాన్ 14, డెకథ్లాన్ 15వ ర్యాంకు సొంతం చేసుకున్నాయి. టాప్–100లో రిలయన్స్ ఒక్కటే ఫోర్బ్స్ తాజా జాబితాలో టాప్–100 ర్యాంకుల్లో నిలిచిన ఏకైక భారతీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ సంస్థల్లో 2,30,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలైన మెర్సెడెజ్ బెంజ్, కోకకోలా, హోండా, యమహా, సౌదీ అరామ్కో రిలయన్స్ వెనుకే ఉండడం గమనార్హం. ఈ జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు 137, బజాజ్ (173), ఆదిత్య బిర్లా గ్రూపు (240), హీరో మోటోకార్ప్ (333), ఎల్అండ్టీ (354), ఐసీఐసీఐ బ్యాంకు (365), హెచ్సీఎల్ టెక్ (455), ఎస్బీఐ (499), అదానీ ఎంటర్ప్రైజెస్ (547), ఇన్ఫోసిస్ (668) ర్యాంకులతో నిలిచాయి. అధిక వేతనాలు, మెరుగైన ప్రయోజనాలు, ఉన్నత అవకాశాలు, పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యానికి తోడు, ప్రయోజనం ఆధారిత పనికే తమ ప్రాధాన్యమని ఉద్యోగులు స్పష్టం చేసినట్టు ఫోర్బ్స్ తెలిపింది. 57 దేశాల పరిధిలో 1,50,000 మంది పార్ట్టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగులను సర్వే చేసి ఫోర్బ్స్ ఈ ర్యాంకులు కేటాయించింది. ఇందుకోసం మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్టాటిస్టా సాయం తీసుకుంది. జాబితాలో మొత్తం 800 కంపెనీలకు ర్యాంకులు లభించాయి. -
సెలూన్ వ్యాపారంలోకి రిలయన్స్!
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లోకి వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇప్పుడు సెలూన్ వ్యాపారంలోకి కూడా ప్రవేశిస్తోంది. గ్రూప్ సంస్థ, దేశీయంగా అతి పెద్ద రిటైలింగ్ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ తాజాగా చెన్నైకి చెందిన నేచురల్స్ సెలూన్ అండ్ స్పాలో 49 శాతం వాటాలు కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి నేచురల్స్ ప్రమోటర్లతో చర్చలు జరుపుతోంది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చించబోతున్నది మాత్రం వెల్లడి కాలేదు. తమ కంపెనీ చరిత్రలోనే ఇది ‘అతి పెద్ద మలుపు‘ అంటూ నేచురల్స్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు సీకే కుమరవేల్ .. లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. ‘ఒక బహుళజాతి దిగ్గజం సెలూన్ పరిశ్రమలోకి ప్రవేశించబోతోంది’ అని పేర్కొన్నారు. ‘నేచురల్స్లో రిలయన్స్ రిటైల్ 49 శాతం వాటా కొనబోతోంది. దీనితో సెలూన్ల సంఖ్య మొత్తం 700 నుండి 4–5 రెట్లు వృద్ధి చెందనుంది. రాబోయే రోజుల్లో నేచురల్స్లో గణనీయమైన మార్పులు చూడబోతున్నాం’ అని కుమరవేల్ పోస్ట్ చేశారు. నేచురల్స్ కార్యకలాపాల విస్తరణలో సహాయపడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, నేచురల్స్లో వాటాల కొనుగోలు వార్తలపై స్పందించిన రిలయన్స్ ప్రతినిధి .. తాము ఎప్పటికప్పుడు వివిధ అవకాశాలను పరిశీలిస్తూ ఉంటామని పేర్కొన్నారు. ఈ డీల్ పూర్తయితే లాక్మే బ్రాండ్ పేరిట సెలూన్ సెగ్మెంట్లో కార్యకలాపాలు సాగిస్తున్న హిందుస్తాన్ యూనిలీవర్ వంటి దిగ్గజాలతో రిలయన్స్ రిటైల్ పోటీపడనుంది. 2000ల తొలినాళ్లలో కార్యకలాపాలు ప్రారంభించిన నేచురల్స్కు దేశవ్యాప్తంగా 700 సెలూన్లు ఉన్నాయి. 2025 నాటికి వీటి సంఖ్యను 3,000కు పెంచుకోవాలని యోచిస్తోంది. ఇక రిలయన్స్ గ్రూప్లో అన్ని రిటైల్ కంపెనీలకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) హోల్డింగ్ కంపెనీగా ఉంది. దీనికి రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్ఆర్వీఎల్ రూ. 2 లక్షల కోట్ల టర్నోవర్ (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) నమోదు చేసింది. రిలయన్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా కేవీ కామత్ ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ను ముకేశ్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా నియమిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ప్రకటించింది. 74 సంవత్సరాల కామత్ను ఐదేళ్ల కాలానికి నియమించినట్లు సంస్థ స్టాక్ ఎక్సే్ఛంజ్కి సమర్పించిన ఫైలింగ్లో తెలిపింది. 1971లో ఐసీఐసీఐ బ్యాంక్లో తన కెరీర్ను ప్రారంభించిన ఐఐఎం అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్, పద్మభూషణ్ కామత్కు బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల పదవీ విరమణ చేసిన రిలయన్స్ బోర్డులోని ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లలో ఒకరి స్థానంలో కామత్ నియమితులయ్యారు. -
గ్యాస్లో పెట్టుబడులకు ధర విషయంలో స్వేచ్ఛ కీలకం
న్యూఢిల్లీ: సముద్రాల్లో వందల కొద్దీ మీటర్ల లోతున ఉండే సహజ వాయువు నిక్షేపాలను కనుగొని, వెలికి తీయాలంటే బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీనియర్ వీపీ సంజయ్ రాయ్ తెలిపారు. ఈ రంగంలోకి పెట్టుబడులు రావాలంటే ధర, మార్కెటింగ్పరమైన స్వేచ్ఛ కల్పించడం కీలకమని పేర్కొన్నారు. చమురు, గ్యాస్ ఆపరేటర్ల సమాఖ్య ఏవోజీవో ఈ విషయాన్నే గ్యాస్ ధరను సమీక్షిస్తున్న ప్రభుత్వ నియమిత కిరీట్ పారిఖ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత ఇన్వెస్టర్ కాల్లో పాల్గొన్న సందర్భంగా రాయ్ ఈ విషయాలు వివరించారు. అటు వినియోగ సంస్థలు మాత్రం గ్యాస్ ధరపై ఎంతో కొంత పరిమితి ఉండాలని కోరుకుంటున్నట్లు రాయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పారిఖ్ కమిటీ రాబోయే కొన్ని వారాల్లో నివేదికను సమర్పించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రైమరీ ఎనర్జీ బాస్కెట్లో 6.7 శాతంగా ఉన్న దేశీ గ్యాస్ వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యాన్ని సాధించాలంటే కనీసం రూ. 2–3 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని కమిటీకి ఏవోజీవో తెలిపింది. విద్యుత్తు, ఎరువులు మొదలైన వాటి ఉత్పత్తిలో సహజ వాయువును వినియోగిస్తారు. -
రిలయన్స్ నుంచి.. ప్రత్యేక కంపెనీగా జియో ఫైనాన్షియల్
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ సర్వీసులను ప్రత్యేక కంపెనీగా విడదీయనున్నట్లు జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాల విడుదల సందర్భంగా డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇందుకు తాజాగా బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. వెరసి సొంత అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్(ఆర్ఎస్ఐఎల్)ను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(జేఎఫ్ఎస్ఎల్) పేరుతో ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా ఆర్ఐఎల్ వాటాదారులకు తమ వద్ద గల ప్రతీ షేరుకీ ఒక జేఎఫ్ఎస్ఎల్ షేరుని జారీ చేయనుంది. కంపెనీ షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టింగ్ చేయనుంది. జేఎఫ్ఎస్ఎల్.. కన్జూమర్, మర్చంట్ రుణాల బిజినెస్తోపాటు.. బీమా, ఆస్తుల నిర్వహణ, డిజిటల్ బ్రోకింగ్ తదితర విభాగాలలోకి ప్రవేశించనున్నట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా విస్తరణ, భాగస్వామ్య సంస్థల ఏర్పాటు, ఇతర కంపెనీల కొనుగోళ్లు తదితరాలను చేపట్టనున్నట్లు తెలియజేసింది. డిపాజిట్లు స్వీకరించని ఎన్బీఎఫ్సీగా ఆర్బీఐ అనుమతిగల జేఎఫ్ఎస్ఎల్కు రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్(ఆర్ఐఐహెచ్ఎల్)లో పెట్టుబడులను సైతం బదిలీ చేయనున్నట్లు వివరించింది. చదవండి: ఆర్ధిక మాంద్యంపై ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే -
ఆర్ఐఎల్ లాభం రూ. 13,656 కోట్లు
ముంబై: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 13,656 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 13,680 కోట్లతో పోలిస్తే నామమాత్రంగా తగ్గింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1)లో ఆర్జించిన రూ. 17,955 కోట్లతో పోలిస్తే నికర లాభం భారీగా క్షీణించింది. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విండ్ఫాల్ ట్యాక్స్ చమురు విభాగంపై ప్రతికూల ప్రభావం చూపడంతో లాభాలు నీరసించాయి. ఇక ప్రస్తుత క్యూ2లో రూ. 31,224 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) సాధించగా.. గతేడాది క్యూ2లో రూ. 26,020 కోట్లు మాత్రమే ఆర్జించింది. క్యూ1లో ఇబిటా రూ. 37,997 కోట్లుగా నమోదైంది. తాజా సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ. 2.30 లక్షల కోట్లకు బలపడింది. గతేడాది క్యూ2లో రూ. 1.68 లక్షల కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. ఈ ఏడాది క్యూ1లో రూ. 2.19 లక్షల కోట్ల టర్నోవర్ సాధించింది. కంపెనీ ఇబిటా మార్జిన్లు 13.6%కి చేరాయి. క్యూ1లో ఇవి 17.3 శాతంగా నమోదయ్యాయి. క్యూ2లో ఇతర హైలైట్స్ ► సెప్టెంబర్కల్లా ఆర్ఐఎల్ రుణ భారం రూ. 2.94 లక్షల కోట్లకు చేరగా.. నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 2.01 లక్షల కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. ► చమురు, గ్యాస్ విభాగం రూ. 3,853 కోట్ల ఆదాయం సాధించింది. ఇబిటా 2510 కోట్లు కాగా, ఇబిటా మార్జిన్లు 65% నమోదయ్యాయి. ► రిటైల్ విభాగం ఆదాయం రూ.64,936 కోట్లను తాకగా.. రూ. 4,414 కోట్ల ఇబిటా సాధించింది. ఇబిటా మార్జిన్లు 6.8 %గా ఉన్నాయి. ► ఆయిల్ టు కెమికల్ ఆదాయం రూ. 1.6 లక్షల కోట్లకు చేరింది. ఇబిటా రూ. 11,968 కోట్లు. జియో లాభం 28% జూమ్ క్యూ2లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నికర లాభం 28 శాతం వృద్ధితో రూ. 4,518 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 22,521 కోట్లకు చేరింది. 5 శాతం అధికంగా రూ. 11,489 కోట్ల ఇబిటా సాధించింది. ఇబిటా మార్జిన్లు 0.9 శాతం బలపడి 51 శాతానికి చేరాయి. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 177.20ను తాకింది. ఈ ఏడాది క్యూ1లో రూ. 175 మాత్రమే. సెప్టెంబర్కల్లా మొత్తం సబ్స్క్రయిబర్ల సంఖ్య 427.6 మిలియన్లకు చేరింది. క్యూ1లో ఈ సంఖ్య 419.9 మిలియన్లు. మార్కెట్లు ముగిశాక ఆర్ఐఎల్ ఫలితాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో షేరు ఎన్ఎస్ఈలో 1.2 శాతం క్షీణించి రూ. 2,470 వద్ద ముగిసింది. -
అంబానీ రికార్డు బద్దలు: దుబాయ్లో మరో లగ్జరీ విల్లా డీల్
న్యూఢిల్లీ: బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తన రికార్డును తానే బ్రేక్ చేశారు. ఇటీవల దుబాయ్లో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసిన అంబానీ తాజాగా మరొక బీచ్-సైడ్ విల్లాను కొనుగోలు చేశారు. తద్వారా కేవలం నెల రోజుల్లోనే మరో రికార్డు స్థాయి రియల్ ఎస్టేట్ డీల్ను సాధించడం విశేషం. అయితే ప్రైవేట్ వ్యవహారంగా దీన్ని అత్యంత గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. ఇండియా రెండో అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ గత నెలలో దుబాయిలో రూ.640 కోట్లతో లగ్జరీ విల్లాను సొంతం చేసుకున్నారు. ఈ విల్లాను తన చిన్న కుమారుడు అనంత్ అంబానీకోసం కొనుగోలు చేశారు. తాజాగా కువైట్ వ్యాపారవేత్త మహ్మద్ అల్షాయా కుటుంబం నుండి సుమారు 163 మిలియన్లడాలర్లవిలువైన పామ్ జుమేరా మాన్షన్ను కొనుగోలు చేశారని కొనుగోలుదారుడి పేరు బహిర్గతం చేయకుండా దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ నివేదించింది. కాగా ముఖేశ్ అంబానీ విదేశాలలో భారీగా ఆస్తులను కొనుగోలు చేసుకుంటున్నారు. 79 మిలియన్ల డాలర్లతో ఐకానిక్ యూకే కంట్రీ క్లబ్ స్టోక్ పార్క్ను రూ.592 కోట్లతో కొనుగోలు చేశారు. దీన్ని పెద్ద కుమారుడు ఆకాశ్కు కేటాయించినట్టు సమాచారం. అలాగే కుమార్తె ఈశా అంబానీ కోసం న్యూయార్క్లో కూడా ఖరీదైన భవనం కోసం వెతుకుతున్నట్లు బ్లూమ్బెర్గ్ నివేదించింది. అంతేకాదు సింగపూర్ ఫ్యామిలీ ఆఫీసు ఏర్పాటులో అంబానీ బిజీగా ఉన్నారని ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి. -
‘టైమ్100’లో ఆకాశ్ అంబానీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన టైమ్100 నెక్ట్స్ జాబితాలో దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు, జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ (30) చోటు దక్కించుకున్నారు. బిజినెస్, వినోదం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం, సైన్స్ తదితర రంగాల రూపురేఖలను మార్చగలిగే సామర్థ్యాలున్న 100 మంది వర్ధమాన నాయకులతో టైమ్ మ్యాగజైన్ దీన్ని రూపొందించింది. ఇందులో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక వ్యక్తి ఆకాశ్ అంబానీయే. ఆయన కాకుండా భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త ఆమ్రపాలి గాన్ కూడా జాబితాలో ఉన్నారు. జూనియర్ అంబానీ 22 ఏళ్లకే కంపెనీ బోర్డు సభ్యుడిగా చేరారు. 42.6 కోట్ల మంది పైగా యూజర్లున్న జియోకి చైర్మన్గా ఇటీవల జూన్లోనే నియమితులయ్యారు. పారిశ్రామిక నేపథ్యం గల కుటుంబ వారసుడైన అంబానీ .. వ్యాపార పగ్గాలు చేపడతారన్న అంచనాలు సహజంగానే ఉన్నాయని, ఆయన కూడా కష్టించి పనిచేస్తున్నారని టైమ్ పేర్కొంది. ‘గూగుల్, ఫేస్బుక్ నుంచి భారీగా పెట్టుబడులు సమీకరించడంలో ఆకాశ్ కీలకపాత్ర పోషించారు‘ అని వివరించింది. మరోవైపు, అడల్ట్ కంటెంట్ క్రియేటర్ల సైట్ అయిన ’ఓన్లీఫ్యాన్స్’కి ఆమ్రపాలి గాన్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2020 సెప్టెంబర్లో చీఫ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ ఆఫీసర్గా చేరిన ఆమ్రపాలి ఆ తర్వాత పదోన్నతి పొందారు. అమెరికన్ సింగర్ ఎస్జెడ్ఏ, నటి సిడ్నీ స్వీనీ, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు యా మోరాంట్, టెన్నిస్ ప్లేయర్ కార్లోక్ అల్కెరాజ్ తదితరులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. -
సోలార్ టెక్ సంస్థతో ఆర్ఐఎల్ జత
న్యూఢిల్లీ: సోలార్ టెక్ సంస్థ కేలక్స్లో 20 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పేర్కొంది. ఇందుకు 1.2 కోట్ల డాలర్లు(రూ. 97 కోట్లు) వెచ్చించినట్లు వెల్లడించింది. పెరోవ్స్కైట్ ఆధారిత సోలార్ సాంకేతికతగల కేలక్స్లో వాటాను సొంతం చేసుకోవడం ద్వారా నూతన ఇంధన తయారీ సామర్థ్యాలను పటిష్ట పరచుకోనుంది. పూర్తి అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ ద్వారా కేలక్స్ కార్పొరేషన్తో వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ తెలియజేసింది. ఈ కాలిఫోర్నియా సంస్థ భాగస్వామ్యంతో అధిక సామర్థ్యంగల చౌక వ్యయాల సోలార్ మాడ్యూల్స్ను తయారు చేయగలమని వివరించింది. గుజరాత్లోని జామ్నగర్లో ఆర్ఐఎల్ సమీకృత ఫొటోవోల్టాయిక్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ అధినేత
తిరుపతి: పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అంబానీ కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం అభిషేకం, నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి అంబానీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీస్సులు అందుకున్న అంబానీ మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని సందర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తిరుమల దేవస్థానం ఏటా అభివృద్ధి చెందుతోందని కొని యాడారు. దేశ ప్రజలందరినీ ఆశీర్వదించాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు అంబానీ.ఈ పర్యటనలో ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్తో కలిసి వచ్చారు. -
బిలియనీర్ అదానీ భారీ పెట్టుబడులు: అంబానీకి షాకేనా?
సాక్షి, ముంబై: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ తన వ్యాపార సామాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్లో మరింత దూసుకుపోనుంది. ముఖ్యంగాఎఫ్ఎంసీజీ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించిన తర్వాత ఆసియాలోని అత్యంత ధనవంతుడు తన సామ్రాజ్య ఆహార కార్యకలాపాలను రెట్టింపు చేసేలా, స్థానిక, విదేశీ కొనుగోళ్లపై దృష్టిపెట్టడం మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. బిలియనీర్ గౌతమ్ అదానీ 400 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లతో ఆహారవ్యాపారంలోకి మరింత దూకుడుగా వస్తున్నారని యూఎస్ ఫుడ్ అండ్ అగ్రి ఆర్గనైజేషన్ తెలిపింది. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన అదానీ తన రెట్టింపు ఆదాయాలను దేశీయ ఆహార ఉత్పత్తి పరిశ్రమలో వాటాల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అదానీకి చెందిన కిచెన్ ఎసెన్షియల్స్ సంస్థ అదానీ విల్మార్ లిమిటెడ్ తమ మార్కెట్ రీచ్ను పెంచడానికి ప్రధాన ఆహారాలు, పంపిణీ కంపెనీలలో బ్రాండ్లను కొనుగోలు చేయాలని చూస్తున్నామని అదానీ విల్మార్ సీఎండీ అంగ్షు మల్లిక్ బుధవారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు రానున్న మార్చి నాటికి రెండు డీల్స్ పూర్తి చేయనున్నామని కూడా మల్లిక్ వెల్లడించారు. ఇందుకు 5 బిలియన్ రూపాయలను కంపెనీ కేటాయించిందని చెప్పారు. ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాదికి 30 బిలియన్ రూపాయల ప్రణాళికా బద్ధమైన మూలధన వ్యయంతో పాటు అంతర్గత నిల్వల నుంచి అదనపు నిధులు వస్తాయని చెప్పారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా ఇ-కామర్స్ పంపిణీలో 50 శాతం వృద్ధిని సాధిస్తోందని మల్లిక్ చెప్పారు. ఫిబ్రవరినుంచి తమ ఫుడ్ కంపెనీ షేర్లు మూడు రెట్లు పెరిగియన్నారు. మెక్కార్మిక్ స్విట్జర్లాండ్ నుండి కోహినూర్ కుకింగ్ బ్రాండ్తో సహా పలు బ్రాండ్లను అదానీ విల్మార్ ఇటీవల కొనుగోలుచేసింది.తద్వారా కోహినూర్ బాస్మతి బియ్యం, రెడీ-టు-కుక్, రెడీ-టు-ఈట్ కూరలు, ఫుడ్పై ప్రత్యేక హక్కులు పొందించింది. అదానీ గ్రూప్ గత ఏడాదిలో 17 బిలియన్ డాలర్ల విలువైన దాదాపు 32 కంపెనీలను కొనుగోలు చేసింది. కాగా రిలయన్స్ రీటైల్ వింగ్ రిలయన్స్ రిటైల్ సరసమైన ధరలకు అధిక నాణ్యత గల ఉత్పత్తులను అభివృద్ధి చేసి, డెలివరీ చేసే లక్ష్యంతో ఎఫ్ఎంసిజి వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఏజీఎంలో ప్రకటించింది. -
రిలయన్స్ భారీ పెట్టుబడులు: మరో విదేశీ కంపెనీతో డీల్
సాక్షి, ముంబై: వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరో విదేశీ సంస్థతో భారీ డీల్ కుదుర్చుకుంది. అమెరికాలోని కాలిఫోర్నరియాకు చెందిన చెందిన సెన్స్హాక్లో 79.4 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. దీనికి విలు32 మిలియన్ డాలర్లు.సెన్స్హాక్ ఇంక్. (సెన్స్హాక్)తో కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ మంగళవారం ప్రకటించింది. కాలిఫోర్నియాకు చెందిన సెన్స్హాక్, 2018లో స్థాపించబడింది. ఇది సౌరశక్తి ఉత్పత్తి పరిశ్రమకు సాఫ్ట్వేర్ బేస్డ్ మేనేజ్మెంట్ టూల్స్ను అందించే సంస్థ. ఆటోమేషన్ను ఉపయోగించడం ద్వారా సౌర ప్రాజెక్టు ఉత్పత్తిని వేగవంతం చేయడంలో సహాయపడుతుందని, ఎండ్-టు-ఎండ్ సోలార్ అసెట్ లైఫ్సైకిల్ను నిర్వహించేలా నిరంతరమైన సేవలందించే సోలార్ డిజిటల్ ప్లాట్ఫారమ్ను అందిస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు రెగ్యులేటరీ ఫైలింగ్లో రిలయన్స్ తెలిపింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నాయని రిలయన్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ తెలిపారు. 2030 నాటికి 100 GW సౌరశక్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. సెన్స్హాక్ సహకారంతో ఖర్చులను తగ్గించుకుని ఉత్పాదకతను పెంచుతామన్నారు. అలాగే రిలయన్స్ మద్దతుతోసెన్స్హాక్ అనేక రెట్లు వృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నామని అంబానీ పేర్కొన్నారు. మరోవైపు ఈ వార్తలతో మంగళవారం నాటి మార్కెట్లో రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ డీల్పై సెన్స్హాక్ ఫౌండర్ సీఈవో స్వరూప్ మావనూర్, ప్రెసిడెంట్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ సాంఖే సంతోషం వ్యక్తం చేశారు. -
పెప్సీ, కోకా-కోలాకు రిలయన్స్ షాక్: కాంపా కోలా రీఎంట్రీ
సాక్షి,ముంబై: ఎఫ్ఎంసీజీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న రిలయన్స్ఇండస్ట్రీస్ ఒకప్పటి పాపులర్ కూల్ డ్రింక్ కాంపా కోలాను తీసుకురానుందట. ఈ విస్తృత వ్యూహంలో భాగంగానే ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి దాదాపు రూ. 22 కోట్లకు కాంపా, సోస్యో అనే సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్లను రిలయన్స్ కొనుగోలు చేసిందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. రిటైల్ విభాగం ఎఫ్ఎంసిజి విభాగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ కొనుగోలు వార్త ప్రముఖంగా నిలిచింది. ముఖ్యంగి దిగ్గజాలైన కోకా-కోలా, పెప్సీకో లాంటి కంపెనీలకు షాకిచ్చేలా దీన్ని తిరిగి లాంచ్ చేయనుందిని తెలుస్తోంది. దీపావళి సందర్భంగా అక్టోబర్లో ఈ బ్రాండ్లను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి దూసుకొస్తున్న రిలయన్స్ దాదాపు రెండు డజన్ల బ్రాండ్లను ఇప్పటికే గుర్తించిందనీ, వీటిని జాయింట్ వెంచర్గా కొనుగోలు చేయనుందని ఈటీ రిపోర్ట్ చేసింది. ఎడిబుల్ ఆయిల్, సోప్ బ్రాండ్ తదితర కంపెనీలతో చర్చలు జరుపుతోందని ప్రస్తుతం అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని తెలిపింది. తాజా రిపోర్టు ప్రకారం రిలయన్స్ రిటైల్ స్టోర్లు, జియోమార్ట్, కిరానా స్టోర్లలో కొనుగోలుకు కాంపాకోలా డ్రింక్ అందుబాటులో ఉంచనుంది. నిమ్మ, నారింజ రుచులలో పునఃప్రారంభించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకపుడు కోలా వేరియంట్ కాంపా కోలాతో మార్కెట్ లీడర్గా ఉండేది ఐకానిక్ కోలా.1990ల నుంచి క్రమంగా కనుమరుగై పోయింది. (Anand Mahindra వీడియో వైరల్: లాస్ట్ ట్విస్ట్ ఏదైతో ఉందో..) ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి ప్రవేశించనున్నామని ఇటీవల జరిగిన రిలయన్స్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మెటా, జియో మార్ట్ భాగస్వామ్యంతో వాట్సాప్లో రిలయన్స్ రిటైల్ సేవలను వివరించారు. కేవలం కొన్ని నిమిషాల్లో వాట్సాప్ ద్వారా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయవచ్చని ఆమె వివరించారు. (Benda V302C: కీవే కొత్త బైక్ చూశారా? ధర సుమారు రూ. 4 లక్షలు) కాగా 1990లలో, పార్లే అభివృద్ధి చేసిన శీతల పానీయాల బ్రాండ్లతో పాటు, థమ్స్ అప్, గోల్డ్ స్పాట్, లిమ్కా మార్కెట్లో కాంపా ఆధిపత్యం చెలాయించింది. అయితే, కోకా-కోలా తన రీ-ఎంట్రీలో మూడు పార్లే బ్రాండ్లను కొనుగోలు చేసిన తర్వాత, కాంపా పోటీ పడలేక మార్కెట్ నుంచి తప్పుకుంది. ఆ తరువాత 2019లో మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించేందుకు పదే పదే ప్రయత్నాలు చేసినా ఆర్థిక బలం లేకవిఫలమైంది. -
RIL AGM: దీపావళికల్లా రిలయన్స్ 5జీ
ముంబై: దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత దూకుడుగా విస్తరించనుంది. ఇందుకోసం రూ. 2.75 లక్షల కోట్ల పెట్టుబడులతో భారీ ప్రణాళికలు రూపొందించుకుంది. ఇందులో 5జీపై రూ. 2 లక్షల కోట్లు, కీలకమైన చమురు.. పెట్రోకెమికల్స్ వ్యాపారంపై వచ్చే అయిదేళ్లలో రూ. 75,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5జీ టెలికం సర్వీసులను అక్టోబర్లో (దీపావళి నాటికి) అందుబాటులోకి తేనుంది. అలాగే పోటీ దిగ్గజం అదానీ గ్రూప్ను ఢీకొట్టేందుకు ఎఫ్ఎంసీజీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. సోమవారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. అలాగే వారసత్వ ప్రణాళికలను కూడా ప్రకటించారు. ముగ్గురు సంతానం సారథ్యం వహించబోయే విభాగాలను కూడా వివరించారు. చౌకగా, నాణ్యమైన 5జీ సేవలు.. రిలయన్స్లోని టెలికం విభాగం రిలయన్స్ జియో 5జీ నెట్వర్క్పై రూ. 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీపావళి నాటికి నాలుగు మెట్రో నగరాల్లో, ఆ తర్వాత 2023 డిసెంబర్ ఆఖరు కల్లా దేశవ్యాప్తంగా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనుంది. ‘సిసలైన పాన్–ఇండియా 5జీ నెట్వర్క్ నిర్మించేందుకు మేము రూ. 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాం. వచ్చే రెండు నెలల్లో.. అంటే దీపావళి నాటికి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా సహా కీలకమైన మెట్రో నగరాల్లో జియో 5జీ సేవలను ప్రారంభిస్తాం’ అని ముకేశ్ అంబానీ వివరించారు. అత్యంత వేగవంతమైన 5జీ రాకతో కోట్ల కొద్దీ స్మార్ట్ సెన్సర్స్ను ఆవిష్కరిస్తామని, ఇవి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, నాలుగో పారిశ్రామిక విప్లవానికి ఊతమిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా భారత్ కోసం 5జీ సొల్యూషన్స్ రూపొందించేందుకు చిప్ తయారీ దిగ్గజం క్వాల్కామ్తో జట్టు కట్టినట్లు అంబానీ చెప్పారు. అలాగే, అత్యంత చౌకైన 5జీ స్మార్ట్ఫోన్స్ను అభివృద్ధి చేసేందుకు టెక్ దిగ్గజం గూగుల్తో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ 5జీ నెట్వర్క్స్లోకి కూడా విస్తరిస్తున్నట్లు అంబానీ తెలిపారు. ఇటీవల ముగిసిన వేలంలో జియో రూ. 88,078 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. మరోవైపు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వంటి పవర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కోసం కొత్తగా మరో గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే సోలార్ ప్యానెల్స్, ఎనర్జీ స్టోరేజీ, ఎలక్ట్రోలైజర్లు, ఫ్యూయల్ సెల్స్ ఉత్పత్తి కోసం నాలుగు గిగా ఫ్యాక్టరీలను రిలయన్స్ ప్రకటించగా ఇది ఐదోది కానుంది. ఎఫ్ఎంసీజీలో అదానీతో ఢీ.. వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది వినియోగ ఉత్పత్తుల (ఎఫ్ఎంసీజీ) విభాగంలోకి కూడా ప్రవేశిస్తున్నట్లు ముకేశ్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు. ప్రజల రోజువారీ అవసరాలకు సంబంధించి అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను, చౌకగా అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. తొలి దశలో ఫుడ్, బెవరేజెస్, వ్యక్తిగత సంరక్షణ, నిత్యావసరాలు వంటి విభాగాల్లో పటిష్టమైన బ్రాండ్స్తో కలిసి పనిచేయనున్నట్లు ఈషా చెప్పారు. అలాగే కంపెనీల విలీనాలు, కొనుగోళ్ల ద్వారా పోర్ట్ఫోలియోను విస్తరించనున్నట్లు తెలిపారు. ‘వచ్చే అయిదేళ్లలో ఒక కోటి మంది పైగా వ్యాపారస్తులతో భాగస్వామ్యాలు కుదుర్చుకునే దిశగా ముందుకు వెడుతున్నాం. దేశవ్యాప్తంగా 7,500 పట్టణాలు, 5 లక్షల గ్రామాలకు విస్తరించబోతున్నాం’ అని ఈషా పేర్కొన్నారు. ఇదే సందర్భంగా జియోమార్ట్లో కొనుగోళ్లకు వాట్సాప్ ద్వారా ఆర్డర్లు పెట్టడం, చెల్లింపులు జరిపే విధానాన్ని ఆమె ఆవిష్కరించారు. అటు, జియోమార్ట్తో జట్టుకట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ .. ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. రిలయన్స్లో రిటైల్ వ్యాపారాలకు ఆర్ఆర్వీఎల్ హోల్డింగ్ కంపెనీగా వ్యవహరిస్తోంది. దీని విలువ దాదాపు రూ. 2 లక్షల కోట్లు.. 2022 జూన్ 30 నాటికి రిలయన్స్ రిటైల్కు 15,866 స్టోర్స్ ఉన్నాయి. ఎఫ్ఎంసీజీలో ఎంట్రీతో ఆ విభాగంలో దిగ్గజంగా ఉన్న అదానీ గ్రూప్తో రిలయన్స్ నేరుగా తలపడనుంది. అదానీకి చెందిన అదానీ విల్మర్ వంట నూనెలు మొదలుకుని వివిధ ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులతో దేశంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో అదానీ ప్రధాన వ్యాపారమైన ఎఫ్ఎంసీజీలోకి అంబానీ ఎంట్రీ ప్రాధాన్యం సంతరించుకుంది. వారసులొచ్చేశారు.. ఆకాశ్కు టెలికం, ఈషాకు రిటైల్, అనంత్కు ఎనర్జీ.. ఏజీఎం వేదికగా ముకేశ్ అంబానీ (65) తమ వ్యాపార సామ్రాజ్యానికి వారసులను కూడా ప్రకటించారు. అంబానీకి ముగ్గురు సంతానం (ఇద్దరు కవలలు–ఆకాశ్, ఈషా) కాగా, రిలయన్స్ సామ్రాజ్యంలో ప్రధానంగా ఆయిల్ రిఫైనింగ్..పెట్రోకెమికల్స్, రిటైల్, టెలికం సహా డిజిటల్ సర్వీసులు అని మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి. వీటిని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున అంబానీ కేటాయించారు. ‘జియో (టెలికం విభాగం)లో ఆకాశ్ (30), రిటైల్లో ఈషా ఇప్పటికే సారథ్య బాధ్యతలు చేపట్టారు. కన్జూమర్ వ్యాపార విభాగాలను ప్రారంభించిన తొలినాళ్ల నుంచి వారు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక అనంత్ (26) కూడా మా కొత్త ఇంధన వ్యాపార విభాగం కార్యకలాపాల్లో ఎంతో ఆసక్తిగా పాలుపంచుకున్నారు‘ అంటూ ఎవరికి ఏయే వ్యాపార విభాగాల బాధ్యతలు ఇస్తున్నదీ ఆయన వెల్లడించారు. అయితే, వారసులను ప్రకటించినంత మాత్రాన తాను రిటైర్ అవుతున్నట్లుగా భావించరాదని ఆయన స్పష్టం చేశారు. ‘స్వర్ణ దశాబ్ది ముగిసే 2027 నాటికి రిలయన్స్ విలువ రెట్టింపయ్యేలా, గ్రూప్ సమగ్రంగా..సురక్షితంగా ఉండేలా ఈ ప్రణాళికలు దోహదపడగలవు’ అని అంబానీ చెప్పారు. మూడు వ్యాపార విభాగాలు ప్రస్తుతం దాదాపు ఒకే పరిమాణం స్థాయిలో ఉన్నాయి. జూన్లోనే ఆకాశ్.. జియో ప్లాట్ఫామ్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్గా నియమితులయ్యారు. ఈషా, అనంత్లు గ్రూప్ సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ముందుజాగ్రత్త .. వారసత్వ ప్రకటన ద్వారా, గతంలో తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణానంతరం రిలయన్స్ వ్యాపార విభజనపై సోదరుడు అనిల్ అంబానీతో తనకు తలెత్తిన విభేదాల్లాంటివి, తన సంతానం విషయంలో జరగకుండా ముకేశ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అయిందని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ధీరూభాయ్ అంబానీ 1973లో రిలయన్స్ను ప్రారంభించారు. టెక్స్టైల్స్ నుంచి చమురు, టెలికం వరకూ వ్యాపారాన్ని వివిధ విభాగాల్లోకి విస్తరించారు. అయితే, వీలునామాల్లాంటివేవీ రాయకుండా 2002లో ఆయన ఆకస్మికంగా మరణించడంతో రిలయన్స్ సామ్రాజ్యం బీటలు బారింది. ముకేశ్, ఆయన తమ్ముడు అనిల్ అంబానీల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి వారి మాతృమూర్తి కోకిలాబెన్ జోక్యం చేసుకుని 2005లో రిలయన్స్ను విడగొట్టి సోదరులిద్దరికీ పంచారు. ముకేశ్కు రిఫైనింగ్, ఆయిల్, టెక్స్టైల్స్ వ్యాపారం లభించగా.. అనిల్కు టెలికం, అసెట్ మేనేజ్మెంట్ మొదలైనవి దక్కాయి. 2019 మార్చి ఆఖరు నాటికి రిలయన్స్లో అంబానీల వాటా 50.6 శాతంగా ఉంది. ప్రస్తుతం ముకేశ్ అంబానీ నికర సంపద విలువ 94 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీగా కొనసాగుతుండగా, భార్య నీతా అంబానీ (59) కంపెనీ బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. -
ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా!
దేశంలోనే అత్యంత విలువైన కార్పొరేట్ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ రీటైల్ బాధ్యతల్ని కుమార్తె ఇషా అంబానీకి అప్పగించారు. రిలయన్స్ ఇండస్ట్రీ 45వ ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ.. రిలయన్స్ రీటైల్ బాధ్యతల్ని ఇషా అంబానీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ముఖేష్ అంబానీ ప్రకటన అనంతరం రిలయన్స్ రీటైల్ నుంచి వాట్సాప్ ద్వారా ఆర్డర్లు చేయడం, పేమెంట్స్ చేయడంతో పాటు ఎఫ్ఎంసీజీ విభాగంలోకి అడుగుపెడుడుతున్నట్లు తెలిపారు. ప్రతి భారతీయుడికి హైక్వాలిటీ, తక్కువ ధరకే నిత్యవసర వస్తువుల్ని అందించేలా రీటైల్ విభాగాన్ని డెవలెప్ చేసినట్లు చెప్పారు. కాగా, సూపర్ మార్కెట్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, ఫ్యాషన్, జ్యవెలరీ, ఫుట్వేర్, క్లాతింగ్ విభాగాలతోపాటు ఆన్లైన్ రిటైల్ వెంచర్ జియోమార్ట్ను రిలయన్స్ రిటైల్ విభాగంలోకి రానున్నాయి. ఆకాష్..ఈషా..అనంత్ ముకేష్ అంబానీ ముగ్గురు సంతానంలో ఆకాశ్, ఈషా కవలలుకాగా.. చిన్న కుమారుడు అనంత్. ఇప్పటికే ఈ ముగ్గురికి ముఖేష్ అంబానీ ఆస్తుల పంపకం ప్రక్రియను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్లో పెద్ద కొడుకు ఆకాశ్ ఎం.అంబానీకి టెలికం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతల్ని కట్టబెట్టారు. ఇందుకు అనుగుణంగా టెలికం బోర్డు నుంచి వైదొలిగారు. తాజాగా ఇషా అంబానీకి రిటైల్ గ్రూప్ బాధ్యతల్ని అప్పగించారు. చిన్న కొడుకు ముఖేష్ అంబానీకి న్యూఎనర్జీ బిజినెస్ విభాగాన్ని అప్పగించే యోచనలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి శామ్ వాల్టన్ బాటలో ముఖేష్ అంబానీ రిలయన్స్ లక్షల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యం అన్నీ రంగాలలో విస్తరించి ఉంది. ఇదే వైభవం భవిష్యత్తులోనూ కొనసాగాలంటే పక్కా ప్లాన్, అంతకుమించిన వ్యూహం అవసరం. అందుకోసం కసరత్తు చేస్తున్న ముకేష్ అంబానీ..వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు శామ్ వాల్టన్ నడిచిన బాటను ఫాలో కావాలన్న యోచనలో ఉన్నట్లుగా బ్లూంబర్గ్ కథనం పేర్కొంది. ఇందుకోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భాద్యతలను దానికి పూర్తిగా అప్పగించాలని ముఖేష్ అంబానీ చూస్తున్నారు. కొత్త సంస్థలో బోర్డు సభ్యులుగా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, అతని ముగ్గురు పిల్లలు మరికొందరు కుటుంబ సభ్యులు ఉంటారు. ముఖేష్ అంబానీ సన్నిహిత సహచరులు రిలయన్స్ సామ్రాజ్యాన్ని పర్యవేక్షించే సంస్థ బోర్డులో స్థానం కల్పించానున్నట్లు బ్లూంబర్గ్ తన కథనంలో హైలెట్ చేసింది. -
మరో రంగంలోకి రిలయన్స్ సునామీ: దిగ్గజాలకు దిగులే!
సాక్షి,ముంబై: రిలయన్స్ జియో పేరుతో టెలికాం రంగంలో సునామీ సృష్టించిన ఆయిల్-టు-టెలికాం దిగ్గజం రిలయన్స్ త్వరలోనే మరో రంగంలో ఎంట్రీ ఇస్తోంది. రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ వ్యాపారంలో భారీ వృద్ధి తర్వాత ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఎఫ్ఎంసీజీ) విభాగంలోకి అడుగు పెట్టనునున్నామని రిలయన్స్ మెగా ఈవెంట్లో ప్రకటన వెలువడింది. కంపెనీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు. హైక్వాలిటీ, సరసమైన ఉత్పత్తులను అభివృద్ధి, డెలివరీతో పాటు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఎఫ్ఎంసీజీ విభాగంలో అడుగుపెడుతున్నట్లు తెలిపారు .అలాగే కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని మెరుగుపర్చే ఉద్దేశంతో 2021లో ప్రారంభించిన WhatsApp-JioMart భాగస్వామ్యం ఎలా పనిచేస్తుందో ప్రదర్శించి చూపించారు. ఇషా అంబానీ ఇంకా ఏమన్నారంటే.. ‘‘డిజిటల్ కామర్స్ ప్లాట్ఫారమ్లు ప్రతిరోజూ దాదాపు 6లక్షలకు ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాం. ఇది గత సంవత్సరం కంటే 2.5 రెట్లు పెరిగింది. 260కి పైగా పట్టణాల్లో డెలివరీ చేస్తున్న జియోమార్ట్ ఆన్లైన్ గ్రోసరీ ఇండియా నంబర్ వన్ విశ్వసనీయ బ్రాండ్గా రేట్ సాధించింది. 42 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మా స్టోర్ల సంఖ్యను 15,000కు పైగా పెంచడానికి ఈ ఏడాది 2,500 స్టోర్లను ప్రారంభించాం. స్టోర్ నెట్వర్క్ , మర్చంట్ పార్టనర్ల జోడింపు ద్వారా మరింత మంది కస్టమర్లు మా ఖాతాలో చేరుతున్నారు. రిలయన్స్ రిటైల్ రాబోయే ఐదేళ్లలో 7,500 పట్టణాలు, 3 లక్షల గ్రామాలకు సేవలందించాలనేది మా లక్ష్యం’’ అని ఇషా అంబానీ వెల్లడించారు. ప్రతి భారతీయుడి రోజువారీ అవసరాలను తీర్చే లక్క్ష్యంతో ఈ రంగంలోకి అడుగు పెడుతున్నట్టు ఆమె తెలిపారు. అంతేకాదు భారతదేశం అంతటా గిరిజనులు, ఇతర అణగారిన వర్గాలు ఉత్పత్తి చేసే నాణ్యమైన వస్తువుల మార్కెటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. తద్వారా ఆయా కమ్యూనిటీలకు ఉపాధి, వ్యవస్థాపకత కోసం లాభదాయకమైన అవకాశాలను అందించడమే కాకుండా, సాంప్రదాయ భారతీయ కళాకారులు, ముఖ్యంగా మహిళల అద్భుతమైన ప్రతిభ, నైపుణ్యం, వారి క్రియేటివిటీని సంరక్షించడంలో సహాయపడుతుందని భావిస్తున్నామన్నారు. తద్వారా రిలయన్స్ రిటైల్ హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే బ్రిటానియా వంటి ఎఫ్ఎంసిజి దిగ్గజాలకు గట్టి షాకే ఇవ్వనుంది. చదవండి: Reliance Industries AGM: జియో 5జీ కోసం 2 లక్షల కోట్ల పెట్టుబడి 'అల్ట్రా-అఫర్డబుల్' 5జీ స్మార్ట్ఫోన్ త్వరలో: ముఖేశ్ అంబానీ -
'అల్ట్రా-అఫర్డబుల్' 5జీ స్మార్ట్ఫోన్ త్వరలో: ముఖేశ్ అంబానీ
సాక్షి,ముంబై: భారతదేశంలో 'అల్ట్రా-అఫర్డబుల్' 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేయనున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించారు. ఇందుకోసం జియో గూగుల్తో కలిసి పనిచేస్తోందన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ పలు కీలక విషయాలను వెల్లడించారు. (Reliance Industries AGM: జియో 5జీ కోసం 2 లక్షల కోట్ల పెట్టుబడి) మేడ్ ఇన్ ఇండియా 5జీ సేవలకుగాను ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలను భాగస్వాములుగా ఉండటమ విశేషమని ముఖేష్ అంబానీ అన్నారు. జియో ప్రస్తుతం మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, సిస్కో వంటి గ్లోబల్ నెట్వర్క్ టెక్నాలజీ ప్రొవైడర్లతో మంచి సంబంధాలున్నాయని చెప్పారు. అలాగే ఇండియా 5జీ సొల్యూషన్స్ డెవలప్మెంట్కి క్వాల్కంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు. రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ, రిటైల్ దిగ్గజం ఈ సంవత్సరం ఎఫ్ఎంసీజీ వ్యాపారంలోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు. అలాగే తన తల్లి నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ అనేక సేవలందించిందని తెలిపారు. -
జియో గుడ్ న్యూస్: జియో 5జీ సేవలు, భారీ పెట్టుబడి
సాక్షి,ముంబై: రిలయన్స్ 45వ యాన్యువల్ జనరల్ బాడీ మావేశంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కీలక విషయాలను వెల్లడించారు. జియో 5జీ ప్రపంచంలోనే అత్యంత విలువైన సేవలుఅందించే సంస్థగా నిలుస్తుందని చెప్పారు. భారత డిజిటల్ సేవలను అందించడంలో రిలయన్స్ ఎపుడు ముందుందని అంబానీ చెప్పారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ 4జీ సేవలు, త్వరలోనే 5జీ సేవలని తెలిపారు. దేశవ్యాప్తంగా జియో 5జీ ట్రూ సేవలకు 2 లక్షల కోట్లు రూపాయలు వెచ్చించనుందని తెలిపారు. జియో 5జీ సేవలు 100 మిలియన్ల కుటుంబాలకు చేరాలనేది తమ లక్క్ష్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ ముంబై , కోలకతా, చెన్నైలలో వచ్చే దీపావళికి సేవలు అందుబాటులోకి తీసుకొస్తా మన్నారు. 2023 డిసెంబరు నాటికి ప్యాన్ ఇండియా లెవల్లో 5జీ సేవలఅందిస్తామని కూడా ముఖేశ్ అంబానీ వెల్లడించారు. అలాగే జియో ఎయిర్ ఫైబర్ పేరుతో బ్రాండ్ బాండ్ సేవలను ప్రారంభిస్తామన్నారు. జియో ఆప్టిక్ ఫైబర్ విస్తీర్ణం భారతదేశం అంతటా 11 లక్షల కిలోమీటర్లుగా ఉంటుందన్నారు. రిలయన్స్ ఎగుమతులు 75 శాతం పెరిగి 2,50,000 కోట్లకు చేరుకున్నాయని ముఖేశ్ అంబానీ తెలిపారు. గత ఏడాది 6.8 శాతంగా ఉన్న భారతదేశ సరుకుల ఎగుమతుల్లో తమ వాటా దాదాపు 8.4 శాతం అని పేర్కొన్నారు. రిలయన్స్ తన వ్యాపారాలలో ఆల్ రౌండ్ పురోగతిని కొనసాగిస్తూనే ఉంది. వార్షిక ఆదాయాలలో100 బిలియన్లను దాటిన భారతదేశపు మొదటి కార్పొరేట్ సంస్థగా నిలిచామన్నురు. రిలయన్స్ ఏకీకృత ఆదాయాలు 47 శాతం వృద్ధి చెంది రూ. 7.93 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఎబిట్టా మార్జిన్లు రూ. 1.25 లక్షల కోట్ల కీలకమైన మైలురాయిని దాటింది. వుయ్ కేర్ స్ఫూర్తితో, రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా మిలియన్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తోందని అంబానీ వెల్లడించారు. క్వాల్కంతో జత డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి రిలయన్స్ జియో, క్వాల్కంతో జతకట్టింది. భారతదేశం 75 వసంతాల స్వాతంత్ర్య వేడుకలను జరుపు కుంటున్న తరుణంలో రిలయన్స్ జియోతో కలిపి ఇండియా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేసి, ప్రజలకు, వ్యాపారాలకు డిజిల్ సేవలను అందించడంతోపాటు, న్యూఇండియా సాధించ గలమని క్వాల్కం సీఈవో క్రిస్టియానో అమోన్ ప్రకటించారు. -
దుబాయ్లో విలాసవంతమైన విల్లా కొన్న అంబానీ: చిన్న కొడుకు కోసమేనా?
సాక్షి,ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ దుబాయ్లో విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసినట్టు సమాచారం. దుబాయ్లోని పామ్ జుమేరాలో బీచ్ ఫ్రంట్ విల్లాను 80 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఇదే అతిపెద్ద నివాస ప్రాపర్టీ డీల్ అని ఈ డీల్ గురించి తెలిసిన వారు చెబుతున్న మాట. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం రూ.640 కోట్లు వెచ్చించి అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. బీచ్ ఒడ్డున నిర్మించిన ఈ విల్లాలో లేని లగ్జరీ సౌకర్యం అంటూ ఏదీ లేదు. 10 బెడ్రూమ్లు, ప్రైవేట్ స్పా, ఇండోర్, అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్స్, ఇలా సర్వ హంగులతో 7-స్టార్ హోటల్కు మించి ఉంటుందట. దుబాయ్ ప్రాపర్టీ డీల్ను అంబానీ ఫ్యామిలీ చాలా గోప్యంగా ఉంచింది. అందుకే కొన్నది ఎవరో చెప్పకుండానే స్థానిక మీడియా కూడా దీని గురించి నివేదించింది. అలాగే ఈ విల్లా రెనోవేషన్, సెక్యూరిటీ మరింత పటిష్టంగా ఉండేందుకు మిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్నట్లు వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. రిలయన్స్కు చెందిన ఆఫ్షోర్ ఎంటిటీతోపాటు, గ్రూప్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్, ఎంపీ, దీర్ఘకాల అంబానీ మిత్రుడు పరిమల్నత్వానీ ఈ విల్లా బాధ్యతలు నిర్వహించనున్నారట. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ప్రకారం, ప్రపంచ 11వ బిలియనీర్ అంబానీ 93.3 బిలియన్ల డాలర్ల సంపదకు సంబంధించిన ముగ్గురు వారసుల్లో అనంత్ ఒకరు. తన సామ్రాజ్యాన్ని గ్రీన్ ఎనర్జీ, టెక్, ఇ-కామర్స్ రంగాలకు విస్తరించిన ముఖేశ్ అంబానీ వ్యాపార పగ్గాలను నెమ్మదిగా వారసులకు అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ ఇటీవలే టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఛైర్మన్గా నియమితుడయ్యారు. అలాగే కుమార్తె ఈషా అంబానీకి రిలయన్స్ రీటైల్ బాధ్యతలు, అనంత్కు ఎనర్జీ బిజినెస్ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జనాభాలో 80 శాతానికి మించి ప్రవాసీయులే ఉన్నారు. విదేశాలకు చెందిన, ముఖ్యంగా భారతీయులదే అక్కడి రియల్ ఎస్టేట్లో అధిక వాటా.దశాబ్దాలుగా అక్కడి ఆర్థికవ్యవస్థకు మూలస్తంభంగా ఉన్నారు. అలాగే ఇటీవల ఇంటిని కొనుగోలు చేసే నిబంధనలు సవరించడం, గోల్డెన్ వీసా ఆఫర్తో డిమాండ్ మరింత పెరిగింది. కనీసం 2 మిలియన్ దిర్హామ్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసిన వారికి 10 సంవత్సరాల వీసాను పొందవచ్చు. ఇప్పటికే బ్రిటీష్ ఫుట్బాల్ ఆటగాడు డేవిడ్ బెక్హామ్ తన భార్య విక్టోరియా కోసం, బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేశారు. -
జియో మరో సంచలనం?12 వేలకే 5జీ స్మార్ట్ఫోన్
ముంబై: రిలయన్స్ జియో మరో సంచలనానికి సన్నద్ధమవుతోంది. భారతదేశంలో కొత్త 5G స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. కంపెనీ స్మార్ట్ఫోన్పై హింట్ ఇచ్చినప్పటికీ, అంతకుమించి వివరాలను వెల్లడించారు. అయితే సరసమైన ధరల్లో 5జీ స్మార్ట్ఫోన్ను దేశీయ వినియోగదారులకు అందించనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. గత ఏడాది రిలయన్స్ జియో , గూగుల్ సంయుక్తంగా జియో ఫోన్ నెక్స్ట్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇపుడు ఆగస్ట్ 29న జరగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సాధారణ సమావేశంలో ఈ 5 జీస్మార్ట్ ఫోన్ను లాంచ్ చేయవచ్చని అంచనా.. జియో ఫోన్ 5జీ ధర: అంచనా 5జీ జియో ఫోన్ ధర సుమారు 12 వేల రూపాయల లోపునే ఉండనుందట. అలాగే జియో ఫోన్ నెక్స్ట్ మాదిరిగానే, వినియోగదారులు రూ. 2500 డౌన్ పేమెంట్ చేసి ఫోన్ను సొంతం చేసుకోవచ్చని మార్కెట్ వర్గాల్లో ఊహాగానాలు విరివిగా ఉన్నాయి.గతంలో లాగానే ఈఫోన్ కొనుగోలు చేసినవారికి అన్లిమిటెడ్ కాలింగ్తో పాటు ఇతర బంపర్ ఆఫర్లను అందించనుందట జియో.పూర్తి వివరాలు అధికారంగా ప్రకటించేంతవరకు సస్పెన్స్ తప్పదు.! జియో 5జీ ఫోన్ ఫీచర్లు 6.5 అంగుళాల HD డిస్ప్లే ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 480 సాక్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ 13ఎంపీ ప్రైమరీ సెన్సార్+2 ఎంపీ డ్యూయల్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా -
CSA T20 League: ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన ఎంఐ కేప్టౌన్.. రబడ సహా..
CSA T20 League- MI Capetown: దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో భాగంగా కేప్టౌన్ ఫ్రాంఛైజీని దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంఐ కేప్టౌన్ పేరిట బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో బుధవారం జట్టు పేరును ప్రకటించింది యాజమాన్యం. తాజాగా ఎంఐ కేప్టౌన్లో భాగం కానున్న ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా తమ ఫ్రాంఛైజీ తరఫున ఆడనున్న ముగ్గురు విదేశీ ఆటగాళ్ల వివరాలు వెల్లడించింది. రబడ సహా.. ఎంఐ కేప్టౌన్ వెల్లడించిన ఫస్ట్ గ్రూప్లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కగిసో రబడ, డెవాల్డ్ బ్రెవిస్(అన్క్యాప్డ్)తో పాటు ఫారిన్ ప్లేయర్లు రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), సామ్ కరన్(ఇంగ్లండ్), లియామ్ లివింగ్స్టోన్(ఇంగ్లండ్) ఉన్నారు. కాగా ఈ టీ20 లీగ్ వేలానికి ముందే నిబంధనల ప్రకారం ఐదుగురు ఆటగాళ్లతో ఎంఐ కేప్టౌన్ ఒప్పందం చేసుకుంది. సంతోషంగా ఉంది ఈ సందర్భంగా రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. ‘‘ఎంఐ కేప్టౌన్ నిర్మాణ ప్రయాణంలో ముందడుగు పడినందుకు సంతోషంగా ఉంది. రషీద్, కగిసో, లియామ్, సామ్లను మా ఫ్యామిలీ(#OneFamily)లోకి ఆహ్వానించడం ఆనందకరం. ఇక డెవాల్డ్ మాతో తన కొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. దూకుడైన ఆటకు ఎంఐ పర్యాయపదం లాంటిది. ఎంఐ కేప్టౌన్.. అలాగే మా ఇతర జట్లు కూడా ఇలాగే ముందుకు సాగుతూ దక్షిణాఫ్రికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరినీ అలరిస్తాయి’’ అని పేర్కొన్నారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్కు పేరున్న సంగతి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్లో ఈ జట్టు ఐదుసార్లు చాంపియన్గా నిలిచింది. ఈ క్రమంలో విదేశీ లీగ్లలోనూ ముంబై ఇండియన్స్(ఎంఐ) పేరు కలిసి వచ్చేలా.. సెంటిమెంట్ను రిపీట్ చేస్తూ పేర్లు పెట్టింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్లో కేప్టౌన్కు ప్రాతినిథ్యం వహించనున్న ప్రొటిస్ యువ సంచలన ఇప్పటికే ముంబై ఇండియన్స్కు ఆడుతున్న విషయం తెలిసిందే. చదవండి: Mumbai Indians: విదేశీ లీగ్స్లోనూ తనదైన ముద్ర.. 🇦🇪🤝🇮🇳🤝🇿🇦 Presenting @MICapeTown & @MIEmirates 🤩💙#OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA pic.twitter.com/6cpfpyHP2H — Mumbai Indians (@mipaltan) August 10, 2022 -
విదేశీ లీగ్స్లోనూ తనదైన ముద్ర.. కొత్త జట్ల పేర్లను ప్రకటించిన ముంబై యాజమాన్యం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు పొందింది ముంబై ఇండియన్స్. క్యాష్రిచ్ లీగ్లో అత్యధిక సార్లు(ఐదుసార్లు) ఐపీఎల్ చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా పేరు పొందిన ముంబై ఇండియన్స్ త్వరలోనే మరో రెండు ప్రైవేటు లీగ్స్లో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న యూఏఈ టి20 లీగ్లో ఒక జట్టును.. అదే సమయంలో క్రికెట్ సౌతాఫ్రికా నిర్వహించనున్న సీఎస్కే టి20 లీగ్లో మరొక జట్టును(న్యూ లాండ్స్, కేప్టౌడ్) కొనుగోలు చేసింది. తాజాగా ఆ జట్లకు సంబంధించిన పేర్లను రివీల్ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ముంబై ఇండియన్స్ బ్రాండ్ ను అలాగే ఉంచుతూ యూఏఈ లో కొనుగోలు చేసిన ఫ్రాంచైజీకి ముంబై ఎమిరేట్స్(MI Emirates) గా నామకరణం చేసింది. ఇక సౌతాఫ్రికా టి20 లీగ్లో కేప్ టౌన్ ఫ్రాంచైజీని దక్కించుకున్న అంబానీ దానికి ముంబై కేప్టౌన్ (MI Cape Town) అని పేరును పెట్టింది. ఈ రెండు పేర్లలో కామన్ గా ఉన్న బ్రాండ్ ముంబై(ఎంఐ-MI). ఫ్రాంచైజీల పేర్లతో పాటు అందులో పాల్గొననున్న ఆటగాళ్లు కూడా ముంబై ఇండియన్స్ జెర్సీలను ఆటగాళ్లు ధరించనున్నారు. ముంబై ఇండియన్స్ జెర్సీ బ్లూ, గోల్డ్ లతో కలగలిసిన దుస్తులే యూఏఈ, సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ లలో కనిపించనున్నారు. కేవలం లోగో మాత్రమే మారనుంది. ఈ మేరకు ముంబై ఇండియన్స్.. తన ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదే విషయమై నీతా అంబానీ మాట్లాడుతూ.. ‘మా ఫ్యామిలీలోకి సరికొత్త ఫ్రాంచైజీలు 'ముంబై ఎమిరేట్స్'.. 'ముంబై కేప్ టౌన్'ను స్వాగతించడం చాలా సంతోషాన్నిస్తుంది.ఎంఐ అనే పేరుతో మాకు క్రికెట్కు మించిన అనుబంధం ఉంది. మా తాజా ఫ్రాంచైజీలు కూడా ఎప్పటిలాగే ఒకే నైతికతను స్వీకరిస్తాయి. ఎంఐ స్థాయిని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాయని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. సీఎస్ఏ టి20 లీగ్లో మొత్తం ఆరుజట్లు ఉండగా.. అన్నింటిని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. తాజాగా కేప్టౌన్ను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్.. ముంబై కేప్టౌన్గా నామకరణం చేసింది. ఇక మిగతా జట్లను పరిశీలిస్తే జొహన్నెస్బర్గ్ను సీఎస్కే, సెంచూరియన్, పార్ల్, డర్బన్,పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్,లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్నాయి. 🚨 Welcoming @MIEmirates & @MICapeTown into our FA𝐌𝐈LY OF TEAMS! 💙 📰 Read more - https://t.co/85uWk804hU#OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA — Mumbai Indians (@mipaltan) August 10, 2022 🇦🇪🤝🇮🇳🤝🇿🇦 Presenting @MICapeTown & @MIEmirates 🤩💙#OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA pic.twitter.com/6cpfpyHP2H — Mumbai Indians (@mipaltan) August 10, 2022 🆕 𝕋𝔼𝔸𝕄 💙 𝕊𝔸𝕄𝔼 FA𝐌𝐈LY 🇦🇪 @MIEmirates 🎨: James Sun#OneFamily #MIemirates @EmiratesCricket pic.twitter.com/bxFM9EzBW7 — Mumbai Indians (@mipaltan) August 10, 2022 చదవండి: The Hundred League 2022: దంచికొట్టిన డేవిడ్ మలాన్.. దూసుకుపోతున్న ట్రెంట్ రాకెట్స్ Sanju Samson: 'మరి అంత పనికిరాని వాడా?.. బీసీసీఐ కావాలనే చేస్తోంది' -
న్యూఎనర్జీలోనూ రిలయన్స్ ముద్ర
న్యూఢిల్లీ: టెలికం రంగంలో మాదిరే న్యూ ఎనర్జీలోనూ (హైడ్రోజన్ తదితర కొత్త తరహా పర్యావరణానుకూల ఇంధనాలు) రిలయన్స్ ఇండస్ట్రీస్ బలమైన స్థానం దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు 5–7 ఏళ్ల కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్లోని అన్ని వ్యాపారాలను మించి వృద్ధిని సాధించే విభాగంగా ఇది అవతరించనుందని చైర్మన్ ముకేశ్ అంబానీ అంచనా వేస్తున్నారు. కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి ముకేశ్ అంబానీ వృద్ధి ప్రణాళికలను పంచుకున్నారు. న్యూఎనర్జీపై రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆసక్తి చూపిస్తుండడం తెలిసిందే. ‘‘వచ్చే 12 నెలల్లో పర్యావరణానుకూల ఇంధన రంగం (గ్రీన్ ఎనర్జీ) వ్యాల్యూచైన్లో కంపెనీ పెట్టుబడులు మొదలవుతాయి. తదుపరి కొన్నేళ్లలో వాటిని పెంచుతాం. వచ్చే 5–7 ఏళ్లలో ఈ నూతన వృద్ధి ఇంజన్ ప్రస్తుతమున్న అన్ని ఇంజన్లను మించి వృద్ధి చూపించనుంది’’అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. నాలుగు గిగా ఫ్యాక్టరీల పేరుతో మొత్తం గ్రీన్ ఎనర్జీలోని అన్ని విభాగాల్లోనూ చొచ్చుకుపోయే ప్రణాళికలలో రిలయన్స్ ఉంది. తద్వారా అందుబాటు ధరలకే ఇంధనాలను తీసుకురావాలని, భారత్ను గ్రీన్ ఎనర్జీ తయారీలో ప్రముఖ దేశంగా మార్చే లక్ష్యంతో ఉంది. సోలార్ విద్యుదుత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగం ఇలా అన్ని విభాగాల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. సంప్రదాయ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్స్ కంపెనీగా ఉన్న రిలయన్స్ను.. రిటైల్, టెలికం వ్యాపారాలతో న్యూఏజ్ కంపెనీగా అంబానీ మార్చడం తెలిసిందే. పర్యావరణ అనుకూలమైన గ్రీన్ ఎనర్జీని ఆయన తదుపరి వ్యాపార అస్త్రంగా ఎంచుకున్నారు. అందుబాటు ధరలకే ‘‘ప్రపంచంలో వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ ధరలు భారత్లోనే తక్కువ. ఈ దశాబ్దంలోనే ప్రపంచంలోనే అత్యంత చౌక గ్రీన్ ఎనర్జీ దేశంగా అవతరిస్తాం. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా కర్బన ఉద్గారాల తగ్గింపులో సాయంగా నిలుస్తాం’’అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నాలుగు గిగా ఫ్యాక్టరీలను ప్రకటించడమే కాకుండా, రూ.5,500 కోట్లతో పలు కంపెనీలను కొనుగోలు చేసింది. 5జీ సేవలకు రెడీ: రిలయన్స్ జియో అతి త్వరలోనే 1,000 పట్టణాల్లో 5జీ సేవలు ఆరంభించనుంది. ఈ పట్టణాల్లో 5జీ ప్రణాళికలను పూర్తి చేసినట్టు, క్షేత్రస్థాయిలో రిలయన్స్ సొంత టెలికం పరికరాలతో పరీక్షించినట్టు అంబానీ ప్రకటించా రు. ఇటీవలే ముగిసిన 5జీ వేలంలో రూ.88 వేల కోట్లతో స్పెక్ట్రమ్ కొనుగోలు చేయడం తెలిసిందే. రెండో ఏడాది జీతం నిల్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీగా ముకేశ్ అంబానీ వరుసగా రెండో ఏడాది ఎటువంటి వేతనం తీసుకోలేదు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన 2020–21 సంవత్సరానికి వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే, గడిచిన ఆర్థిక సంవత్సరానికీ (2021–22) కూడా అదే విధానాన్ని కొనసాగించినట్టు వార్షిక నివేదిక స్పష్టం చేసింది. ఇక 2019–20 సంవత్సరానికి అంబానీ రూ.15 కోట్ల వేతనం తీసుకున్నారు. అంతేకాదు 2008–09 నుంచి ఆయన అదే స్థాయిలో వేతనాన్ని తీసుకుంటున్నారు. -
Fortune Global 500: రిలయన్స్ హైజంప్, ర్యాంకు ఎంతంటే?
సాక్షి,ముంబై: ఫార్చ్యూన్ ప్రచురించిన 2022 గ్లోబల్-500 ర్యాంకింగ్స్లో బీమారంగ సంస్థ ఎల్ఐసీ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో భారత్ నుంచి తొమ్మిది కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఐదు ప్రభుత్వ రంగానికి చెందినవి కాగా నాలుగు ప్రైవేటు రంగానికి చెందినవి. ప్రైవేటు రంగంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన ప్రత్యేకతను చాటుకుంది. (Edible Oil: బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు!) వరుసగా 19వ సంవత్సరం కూడా తాజా గ్లోబల్ 500 ర్యాంకింగ్స్లో చోటు సంపాదించుకోవడమేకాదు తన ర్యాంక్ను మరింత మెరుగుపర్చుకుంది రిలయన్స్. ఈ జాబితాలో భారతదేశపు అత్యున్నత ర్యాంక్సాధించిన ప్రైవేట్ రంగ సంస్థగా రిలయన్స్ నిలిచింది. ఈ ఏడాది 51 స్థానాలు మెరుగుపడి 104వ స్థానానికి చేరుకుంది. 2021 ఏడాదిలో ఈ జాబితాలో రిలయన్స్ ర్యాంక్ 155 మాత్రమే. అయితే ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్లో నిలిచిన ప్రైవేట్ రంగ కంపెనీలు టాటా మోటార్స్, టాట్ స్టీల్ ,రాజేష్ ఎక్స్పోర్ట్స్. కాగా గత ఏడాది ఐపీవోకు వచ్చిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏకైక ప్రభుత్వరంగ సంస్థ మాత్రమే కావడం విశేషం. ఈ సంవత్సరం ర్యాంకింగ్లో రిలయన్స్ను అధిగమించి మరీ 98వ స్థానంతో అగ్రస్థానంలో నిలిచింది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 142వ స్థానంలో ఉంది. ఐవోసీఎల్ భారతీయ కంపెనీలలో మూడో అత్యుత్తమ ర్యాంకును సాధించింది. ఓఎన్జీసీ 190వ స్థానంతో భారతీయ కంపెనీలలో నాల్గవ స్థానంలో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 236వ స్థానం, భారత్ పెట్రోలియం 295వ స్థానంలో ఉన్నాయి. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో మార్చి 31, 2022 లేదా అంతకు ముందు ముగిసిన సంబంధిత ఆర్థిక సంవత్సరాల్లోని మొత్తం రాబడుల ఆధారంగా కంపెనీలకు ర్యాంక్లను కేటాయిస్తుంది. (ఇదీ చదవండి: నెలకు 4వేల జీతంతో మొదలైన‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి!) -
రిలయన్స్కు భారీ దెబ్బ: బ్యారల్పై 12 డాలర్ల మార్జిన్ ఫట్!
న్యూఢిల్లీ: దేశీయ ముడి చమురు ఉత్పత్తి, ఇంధన ఎగుమతులపై ప్రభుత్వం విధించిన విండ్ఫాల్ ట్యాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు (ఆర్ఐఎల్) రిఫైనింగ్ మార్జిన్లలో బ్యారెల్కు 12 డాలర్ల వరకూ కోత పెట్టనుంది (ప్రస్తుత మార్జిన్ 25 డాలర్లు). ఇక ఓఎన్జీసీ ఆదాయంపై కూడా ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. కొత్త పన్నుల వల్ల ప్రభుత్వానికి రూ. 1.3 లక్షల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొన్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలతో భారీ లాభాలు వచ్చి పడుతున్నాయి. దీంతో దేశీయంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను లేదా బ్యారల్కు 40 డాలర్లు (విండ్ఫాల్ ట్యాక్స్) విధించింది. ఇక్కడి నుంచి ఎగుమతి చేసే లీటర్ పెట్రోల్పై రూ.6, విమాన ఇంధనం ఏటీఎఫ్పై రూ.6, లీటర్ డీజిల్ ఎగుమతిపై రూ.13 పన్ను విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ‘‘ఇటీవలి కాలంలో క్రూడ్ ధరలు గణనీయంగా పెరిగాయి. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఇది అనుకూలంగా మారింది. అంతర్జాతీయ ధరలకే దేశీ రిఫైనరీలకు అవి ముడి చమురును విక్రయిస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ముడి చమురు ఉత్పత్తి చేసే సంస్థలు భారీ లాభాలనార్జిస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆర్థిక శాఖ తెలిపింది. జూలై 1 నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. దీనితోపాటు పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 5 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 10.75 శాతం నుంచి 15 శాతానికి చేరింది. ఆయా అంశాలపై బ్రోకరేజ్ సంస్థల నివేదికలు పరిశీలిస్తే... రవాణా ఇంధనాలపై రూ.68,000 కోట్లు గత సంవత్సరంలో డీజిల్, గ్యాసోలిన్ ఎగుమతి పరిమాణం ఆధారంగా 2022–23 అంచనాలను మేము లెక్కగట్టాం. మేము మూడు రవాణా ఇంధనాలపై (పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్) రూ. 68,000 కోట్ల అదనపు ఆదాయాలను అంచనా వేస్తున్నాము. అదేవిధంగా, ముడి చమురుపై విండ్ఫాల్ పన్నులు అదనపు ఆదాయాలలో రూ. 70,000 కోట్లను పెంచే వీలుంది. దీనివల్ల రిలయన్స్ మార్జిన్ల విషయంలో బ్యారెల్కు 12 డాలర్ల మేర (వార్షిక ప్రాతిపదికన రూ. 47,000 కోట్లు) ప్రభావం చూపగలవని అంచనా. – నోమురా లోటు భర్తీ లక్ష్యం... : 2022 మేలో ప్రభుత్వం పెట్రోల్పై లీటరుకు రూ. 8, డీజిల్పై రూ. 6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల కేంద్రం ఆదాయాలు ఒక లక్ష కోట్లు తగ్గాయని అంచనా. అదనపు ఎక్సైజ్ సుంకం (విండ్ఫాల్ ట్యాక్స్) విధింపు ప్రకటన ఇప్పుడు వెలువడింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2022 మేలో తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఆదాయ అంతరాన్ని పూరించడమే లక్ష్యంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది. తాజా నిర్ణయం వల్ల రూ. 1.2 లక్షల కోట్ల ప్రభుత్వం ఆదాయాన్ని ఆర్జిస్తుందని భావిస్తున్నాం. దీనితోపాటు దేశీయ మార్కెట్ నుండి ఉత్పత్తుల ఎగుమతిని కూడా నిరుత్సాహపరచడానికి కూడా తాజా నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నాము. క్రూడ్ ఉత్పత్తిపై విండ్ ఫాల్ ట్యాక్స్ వల్ల రూ.65,600 కోట్లు, ఎగుమతి ఉత్పత్తులపై పన్నులు ఏడాది పాటు కొనసాగితే మరో రూ.52,700 కోట్ల ఆదాయం సమకూరుతుందని మా అంచనా. కొత్త పన్ను వల్ల ఓఎన్జీసీ ఆదాయాలు ఒక్కో షేరుకు రూ.30 తగ్గే అవకాశం ఉంది. ఆర్ఐఎల్పై దీని ప్రభావం రూ.36గా ఉంటుందని అంచనా. అయితే ఆర్ఐఎల్ దేశీయ మార్కెటింగ్ మార్జిన్లో నష్టం... ఎగుమతి పన్ను కంటే ఇంకా ఎక్కువగా ఉందని మేము విశ్వసిస్తున్నాము. అందువల్ల ఆర్ఐఎల్ గణనీయమైన మొత్తాలలో ఎగుమతి చేయడాన్ని కొనసాగించవచ్చని మేము భావిస్తున్నాము. – హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ భారీ పన్ను రాబడులు: ఇదే నిర్ణయం ఇకముందూ కొనసాగితే, పన్నుల వల్ల వార్షిక ప్రాతిపదికన కేంద్రానికి రూ. 1.3 లక్షల కోట్ల అదనపు పన్ను రాబడులు వస్తాయని భావిస్తున్నాం. 2023 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 లక్ష కోట్ల ఆదాయం ఒనగూడుతుందని అంచనా. - కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ 1.38 లక్షల కోట్ల అదనపు పన్ను : అదనపు పన్నుల ద్వారా ప్రభుత్వం ఏటా రూ. 1.38 లక్షల కోట్లను సేకరించవచ్చన్నది మా అంచనా. – యూబీఎస్ అంచనా -
రిలయన్స్కు భారీ షాక్, గంటల వ్యవధిలో లక్షల కోట్ల కంపెనీ సంపద ఆవిరి!
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్తో పాటు ఇంధన షేర్లు పతనంతో స్టాక్ సూచీలు మూడోరోజూ (శుక్రవారం) నష్టాలను మూటగట్టుకున్నాయి. జూన్లో తయారీ రంగం తొమ్మిది నెలల కనిష్టానికి చేరుకోవడం కూడా సెంటిమెంట్పై ఒత్తిడిని పెంచింది. ట్రేడింగ్లో భారీ నష్టాల్లో కదలాడిన సూచీలు చివరకు ఓ మోస్తారు నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడేలో 925 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 111 పాయింట్ల నష్టంతో 52,907 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 269 పాయింట్ల పతనం నుంచి కోలుకోని 28 పాయింట్ల నష్టంతో 15,752 వద్ద నిలిచింది. ఒక్క ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్సులు వరుసగా 0.74%, అర శాతం చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,138 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,378కోట్ల షేర్లను కొన్నారు. విండ్ఫాల్ ట్యాక్స్ ఎఫెక్ట్ విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంపై ఎగుమతి పన్ను, విండ్ఫాల్ ట్యాక్స్ విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఆయిల్అండ్ గ్యాస్ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ, రిలయన్స్, గెయిల్ షేర్లు 15 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఇంధన షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ నాలుగు శాతం నష్టపోయింది. రిలయన్స్కు రూ.1.25 లక్షల కోట్ల నష్టం కేంద్ర విధించిన విండ్ఫాల్ ట్యాక్స్తో దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ట్రేడింగ్లో రెండేళ్ల అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. ఇంట్రాడేలో తొమ్మిది శాతం నష్టపోయి రూ.2365 వద్ద స్థాయిని తాకింది. చివరికి ఏడుశాతం నష్టంతో రూ.2409 వద్ద నిలిచింది. షేరు భారీ పతనంతో రూ.1.25 లక్షల కోట్ల కంపెనీ సంపద ఆవిరైంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦ఏజీఆర్ బకాయిల చెల్లింపుల వాయిదాతో ఎయిర్టెల్ 2% క్షీణించి రూ. 673 వద్ద నిలిచింది. ♦బలహీన మార్కెట్లోనూ ఐటీసీ షేరు రాణించింది. ఎఫ్ఎంసీజీ షేర్ల ర్యాలీలో భాగంగా 4% లాభపడి రూ. 284 వద్ద స్థిరపడింది. ♦బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించడంతో టైటాన్ షేరు ఇంట్రాడేలో 7% నష్టపోయింది. చివరికి 0.20 శాతం లాభంతో రూ.1,946 వద్ద స్థిరపడింది. -
100 శాతం ఆర్గానిక్ కాఫీ: ఫుడ్ బిజినెస్లోకి రిలయన్స్
సాక్షి,ముంబై: బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ, రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (ఆర్బీఎల్) ఆహార పదార్థాలు, పానీయాల రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం యూకేకు చెందిన ఫుడ్ అండ్ ఆర్గానిక్ కాఫీ చెయిన్ ప్రెటా మౌన్రేతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు సంస్థ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రెటా మౌన్రేకు దీర్ఘకాలిక మాస్టర్ ఫ్రాంచైజీగా కంపెనీ వ్యవహరించనుంది. ముందుగా ప్రధాన నగరాలు, ట్రావెల్ హబ్లతో ప్రారంభించి, ఆ తరువాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నామని ఆర్బీఎల్ ప్రకటించింది. దేశీయ వినియోగదారులకు అభిరుచులకు అనుగుణంగా తాజా, సేంద్రీయ ఆహార పదార్థాల్ని అందించాలనేదే లక్ష్యమని రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ ఎండీ దర్శన్ మెహతా వెల్లడించారు. ఆసియాలో రెండు దశాబ్దాల క్రితం తొలి ప్రెట్ ఔట్లెట్ను ప్రారంభించిన ప్రెటా మౌన్రేకు ఆర్బీఎల్తో భాగస్వామ్యం సంతోషాన్నిస్తోందని సీఈఓ పనో క్రిస్టౌ తెలిపారు. కస్టమర్లకు ఫ్రెష్ ఫుడ్తోపాటు, 100% ఆర్గానిక్ కాఫీని అందిస్తామన్నారు. కాగా అతిపెద్ద రిటైల్ ప్లాట్ఫామ్గా ఉన్న ఆబీఎల్ గత 14 ఏళ్లుగా దేశంలో గ్లోబల్ బ్రాండ్ ఉత్పత్తులను అందిస్తోంది. అలాగే ‘రెడీ టు ఈట్' అంటూ తొలిసారిగా 1986లో లండన్లో ప్రారంభమైంది ప్రెటా మౌన్రే. యూకే, యూఎస్, హాంగ్కాంగ్, ఫ్రాన్స్, దుబాయి తదితర దేశాల్లో మొత్తం 550 ఔట్లెట్లను నిర్వహిస్తోంది. ఆర్గానిక్ కాఫీ, శాండ్విచ్లు, సలాడ్లు, ర్యాప్లను అందిస్తోంది ప్రెటా మౌన్రే -
రిలయన్స్: అంబానీ కుమార్తె ఇషాకు బాస్గా ప్రమోషన్?
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్రూప్ యాజమాన్యంలో తన వారసులకు బాధ్యతలను అప్పగించేందుకు భారీ మార్పులకు పారిశ్రామిక దిగ్గజం, బిలియనీర్ ముకేశ్ అంబానీ రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి టెలికం విభాగం రిలయన్స్ జియో చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. తాజాగా కుమార్తె ఇషాకు కూడా ప్రమోషన్ రానుంది. రిలయన్స్ రిటైల్ యూనిట్కు చైర్పర్సన్గా ఇషా ఎంపికైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన నేడు (బుధవారం) వెలువడనుందని అంచనా . ఆసియాలోని అత్యంత సంపన్న అంబానీ కుటుంబం వారసత్వ బాధ్యతల అప్పగింతలో ఒక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ రీటైల్ బిజినెస్ పగ్గాలను కుమార్తె ఈషా (30) చేతికి ఇవ్వనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్కి డైరెక్టర్గా ఉన్నారు. కాగా ముకేశ్, నీతా అంబానీ దంపతుల ముగ్గురు సంతానంలో ఆకాశ్, ఇషా ట్విన్స్ కాగా చిన్న కుమారుడు అనంత్. పిరమల్ గ్రూప్నకు చెందిన ఆనంద్ పిరమల్ను ఇషా వివాహం చేసుకున్న విషయం విదితమే. ఇషా యేల్ యూనివర్సిటీలో చదువుకున్నారు. -
అంబానీ రాజీనామా, జియోకి కొత్త బాస్ ఎవరో తెలుసా?
సాక్షి, ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం రిలయన్స్ జియో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అలాగే ఆయన కుమారుడు ఆకాష్ అంబానీ ఛైర్మన్గా నియమితులయ్యారు. జియో డైరెక్టర్ పదవి నుంచి ముఖేశ్ అంబానీ వైదొలగినట్టు జియో మంగళవారం తెలిపింది. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,ముఖేశ్ కుమారుడు ఆకాష్ అంబానీని కొత్త బోర్డు ఛైర్మన్గా సంస్థ ప్రకటించింది. కంపెనీ డైరెక్టర్ పదవికి ముఖేశ్ అంబానీ రాజీనామా చేయడంతో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా పంకజ్ మోహన్ పవార్ బాధ్యతలు స్వీకరించారని వెల్లడించింది. సోమవారం (జూన్ 27, 2022) జరిగిన జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు. -
జియో-ఫేస్బుక్ డీల్: రిలయన్స్కు ఝలక్
సాక్షి,ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు భారీ షాక్ తగిలింది. జియో-ఫేస్బుక్ డీల్కు సంబంధించి ఫెయిర్ డిస్క్లోజర్ నిబంధనలను ఉల్లంఘించిన రిలయన్స్ ఇండస్ట్రీస్, మరో ఇద్దరు అధికారులపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కొరడా ఝుళిపించింది. రిలయన్స్, సావిత్రి పరేఖ్, కె సేతురామన్కు రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు సెబీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ జరిమానాను 45 రోజుల్లోగా సంయుక్తంగా, లేదా వేర్వేరుగా చెల్లించాలని ఆదేశించింది. జియో-ఫేస్బుక్ డీల్కు సంబంధించిన వార్తలు 2020 మార్చి 24, 25 తేదీల్లో మీడియాలో వెలువడ్డాయని, 9.99 శాతం వాటా కొనుగోలుకు ఫేస్బుక్ రూ. 43,574 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మీడియాకు విడుదల చేసిన తరువాత కూడా ఇవ్వలేదనీ, రెగ్యులేటరీ సెబీకి సమాచారం అందించాల్సిన బాధ్యత ఉందని రిలయన్స్పై ఉందని సెబీ పేర్కొంది. అయితే ఆలస్యంగా 2020 ఏప్రిల్22న ఎక్స్ఛేంజీలకు అందించిందనీ తెలిపింది. ఈ 28 రోజుల ఆలస్యానికి జరిమానా విధించామని సెబీ అధికారి బర్నాలీ ముఖర్జీ తన ఉత్తర్వులో తెలిపారు. ఈ వార్తలతో రిలయన్స్ షేరు మంగళవారం మార్కెట్ ఆరంభంలో భారీగా నష్టపోయింది. ప్రస్తుతం స్వల్ప లాభాలతో కొనసాగుతోంది. మరోవైపు సెబీ జరిమానాపై రిలయన్స్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
అంబానీ మరో భారీ ప్లాన్: దిగ్గజ కంపెనీపై కన్నేసిన రిలయన్స్
సాక్షి, ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాకు చెందిన కాస్మెటిక్స్ సంస్థ రెవ్లాన్ను సొంతం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దివాలా పిటిషన్ దాఖలు చేసిన రెవ్లాన్ కొనుగోలు చేసే అంశాల్ని పరిశీలిస్తోందన్న వార్తలు ప్రాధాన్యతను సంతరించు కున్నాయి. అయితే ఈ పరిణామాలపై రిలయన్స్ , రెవ్లాన్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. రెవ్లాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ను టేకోవర్ చేయడానికి ఆసియా కుబేరుడు,రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. దీనికవసరమైన బిడ్డింగ్స్ దాఖలుకు రిలయన్స్ సంప్రదింపులు కేడా మొదలు పెట్టినట్లు సమాచారం. గ్లోబల్ సరఫరా గొలుసు అంతరాయాలు ముడిసరుకు ఖర్చులను పెంచి, ముందస్తు చెల్లింపులను డిమాండ్ చేసేలా విక్రేతలను ప్రేరేపించిన తర్వాత ఈ వారం ప్రారంభంలో రెవ్లాన్ దివాలా కోసం దాఖలు చేసినట్లు నివేదిక వచ్చింది. టెలికాం, ఇంధనం, రిటైల్ రంగాల్లో సత్తా చాటుతూ దూసుకుపోతున్న రిలయన్స్ వ్యక్తిగత కాస్మొటిక్స్ సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించేందుకు పావులు కదుపుతోందన్నమాట. మరోవైపు రిలయన్స్ ఇటీవలి కాలంలో భారీ విస్తరణ వ్యూహాల్లో ఉంది. ఇందులో భాగంగా జాతీయంగా అంతర్జాతీయంగా పలు కంపెనీల కొనుగోలు ప్రయత్నాల్లో ఉంది. అపోలోతో పాటు,యూకే-ఫార్మసీ చైన్ బూట్స్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ ఏడాది ప్రారంభంలో డన్జోలో వాటా కొనుగోలు చేసింది. చార్లెస్ అండ్ బ్రదర్స్ నేతృత్వంలోని 1932లోఏర్పాటైన కాస్మొటిక్స్ కంపెనీ ఇది. నెయిల్ పాలిష్లు, లిప్స్టిక్లకు పేరుగాంచింది. ఎలిజబెత్ అర్డెన్, ఎలిజబెత్ టేలర్ పేరుతో స్కిన్ కేర్, మేకప్, పెర్ఫ్యూమ్స్ విక్రయిస్తుంది. 90 ఏళ్ల నాటి రెవ్లాన్ కంపెనీ అమెరికన్ బిలియనీర్ రాన్ పెరెల్మ్యాన్ సారధ్యంలో ప్రస్తుతం మొత్తం 15 బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది. బ్యాంకు రుణాల భారం, కాస్మొటిక్స్ సెగ్మెంట్లో నెలకొన్న తీవ్ర పోటీ వంటి కారణాలు కంపెనీని దెబ్బ తీశాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి రెవ్లాన్ కంపెనీ రుణాలు 3.31 బిలియన్ డాలర్లు. కాగా తాజా వార్తలతో రెవ్లాన్ షేరుకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. -
అయ్యయ్యో అదానీ...అదరగొట్టిన అంబానీ
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి టాప్లోకి దూసుకొచ్చారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కి వెనక్కి నెట్టి ఇండియా, ఆసియా బిలియనీర్గా తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకున్నారు. శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) షేర్లు రికార్డు స్థాయిలో లాభపడటంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, రిలయన్స్ ఛైర్మన్ అంబానీ నికర సంపద విలువ 99.7 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఎనిమిదో స్థానానికి ఎగబాగారు. ఇక గౌతం అదానీ నికర విలువ 98.7 బిలియన్ డాలర్లు, సూచీలో తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రిలయన్స్ అంబానీని అధిగమించిన గౌతం అదానీ ఆసియాలో అత్యంత సంపన్నవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, ముఖేష్ అంబానీ నికర విలువ 104.7 డాలర్లు బిలియన్లకు పెరిగింది. మరోవైపు ఈ వారం అదానీ గ్రూప్ స్టాక్లలో అమ్మకాల నేపథ్యంలో గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ నికర సంపద 100.1 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. -
ఫోర్బ్స్ టాప్ 2000లో రిలయన్స్ జోరు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా 2000 టాప్ కంపెనీల జాబితాలో దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 53వ ర్యాంకు దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు ఎగబాకింది. 2022 సంవత్సరానికి గాను అగ్రశ్రేణి కంపెనీలతో రూపొందించిన ఈ జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. అమ్మకాలు, లాభాలు, అసెట్లు, మార్కెట్ విలువ ఆధారంగా ఈ దిగ్గజాలకు ర్యాంకింగ్లు ఇచ్చినట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఇందులో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 105వ ర్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 153వ స్థానం, ఐసీఐసీఐ బ్యాంక్ 204వ ర్యాంకు దక్కించుకున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ 104.6 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. తద్వారా 100 బిలియన్ డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసిన తొలి భారతీయ కంపెనీగా నిల్చిందని ఫోర్బ్స్ తెలిపింది. ‘గ్లోబల్ 2000 జాబితాలో రిలయన్స్ రెండు స్థానాలు ఎగబాకి 53వ ర్యాంకుకు చేరుకుంది. భారతీయ కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిల్చింది. ఈ ఏడాది తొలినాళ్లలో రిలయన్స్ అధినేత సంపద విలువ 90.7 బిలియన్ డాలర్లుగా లెక్కించాం. తద్వారా ఈ ఏడాది టాప్ బిలియనీర్ల జాబితాలో ఆయన 10వ స్థానంలో నిల్చారు‘ అని వివరించింది. గ్లోబల్ 2000 జాబితాలో ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్కు చెందిన బెర్క్షైర్ హాథ్వే అగ్రస్థానంలో నిల్చింది. 2003లో ఫోర్బ్స్ ఈ లిస్టును ప్రకటించడం ప్రారంభించినప్పట్నుంచి బఫెట్ కంపెనీ నంబర్ వన్ స్థానంలో నిలవడం ఇదే ప్రథమం. ఇక గత తొమ్మిదేళ్లుగా అగ్రస్థానంలో ఉంటున్న ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా తాజా లిస్టులో రెండో స్థానంలో నిల్చింది. సౌదీ ఆరామ్కో, జేపీమోర్గాన్ చేజ్, చైనా కన్స్ట్రక్షన్ బ్యాంకు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. లిస్టులో చోటు దక్కించుకున్న ఇతర సంస్థలు.. ► ఓఎన్జీసీ (228 ర్యాంకు), హెచ్డీఎఫ్సీ (268), ఐఓసీ (357), టీసీఎస్ (384), టాటా స్టీల్ (407), యాక్సిస్ బ్యాంక్ (431) ఈ జాబితాలో ఉన్నాయి. ► అపర కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన సంస్థలు ఈసారి లిస్టులో కొత్తగా చోటు దక్కించుకున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ (1,453 ర్యాంకు), అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (1,568), అదానీ గ్రీన్ ఎనర్జీ (1,570) అదానీ ట్రాన్స్మిషన్ (1,705), అదానీ టోటల్ (1,746) వీటిలో ఉన్నాయి. అదానీ ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో వారెన్ బఫెట్ను అధిగమించి అయిదో స్థానం దక్కించుకున్నారు. ► చమురు, గ్యాస్, మెటల్స్ దిగ్గజం వేదాంత ఏకంగా 703 స్థానాలు ఎగబాకి 593వ ర్యాంకు దక్కించుకుంది. ► ఫోర్బ్స్ గ్లోబల్ 2000 లిస్టులో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థల్లో అత్యధికంగా ఇంధన, బ్యాంకింగ్ రంగ కంపెనీలే ఉన్నాయి. -
రిలయన్స్ రికార్డులు..తొలి కంపెనీగా..
న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4 (జనవరి–మార్చి)లో నికర లాభం 22 శాతంపైగా ఎగసి రూ. 16,203 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 13,227 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 35 శాతం జంప్చేసి రూ. 2.32 లక్ష కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 8 డివిడెండ్ ప్రకటించింది. వివిధ బిజినెస్లలో 2.1 లక్షల మందికి కొత్తగా ఉపాధి కల్పించింది. పూర్తి ఏడాదికి... మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఆర్ఐఎల్ రూ. 67,705 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 7.92 లక్షల కోట్ల(102 బిలియన్ డాలర్లు)కు చేరింది. వెరసి తొలిసారి 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకున్న దేశీ కంపెనీగా చరిత్ర సృష్టించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలను సైతం సాధించింది. విభాగాల వారీగా చూస్తే ఆయిల్ టు కెమికల్ బిజినెస్(ఓటూసీ) 44% వృద్ధితో రూ. 1.45 లక్షల కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 28 శాతం బలపడి రూ. 33,968 కోట్లను తాకింది. ఇక రిటైల్ విభాగం టర్నోవర్ 27% పెరిగి రూ. 1,99,704 కోట్లయ్యింది. పన్నుకు ముందు లాభం 26% పుంజుకుని రూ. 12,381 కోట్లకు చేరింది. క్యూ4లో ఓటూసీ విభాగం 25 శాతం అధికంగా రూ. 14,241 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. రిలయన్స్ జియో లాభం జూమ్ రిలయన్స్ జియో స్టాండెలోన్ నికర లాభం గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 24 శాతం ఎగసి రూ. 4,313 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 3,360 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 20 శాతం వృద్ధితో రూ. 20,901 కోట్లకు చేరింది. 21 శాతం అధికంగా రూ. 167.6 ఏఆర్పీయూ సాధించింది. అయితే సిమ్ కన్సాలిడేషన్ కారణంగా కస్టమర్ బేస్ 10.9 మిలియన్లు తగ్గింది. నికరంగా 410.2 మిలియన్లకు చేరింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం 23 శాతం పెరిగి రూ. 14,854 కోట్లను తాకింది. సవాళ్లలోనూ జోరు కరోనా సవాళ్లు, భౌగోళిక రాజకీయ అస్థిరతల నేపథ్యంలోనూ గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పటిష్ట పనితీరును ప్రదర్శించింది. డిజిటల్ సర్వీసులు, రిటైల్ విభాగాల్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించామని చెప్పడానికి ఆనందిస్తున్నాను. ఇంధన మార్కెట్లలో నమోదైన ఆటుపోట్లను తట్టుకోవడం ద్వారా ఓటూసీ బిజినెస్ నిలకడను చూపింది. అంతేకాకుండా ప్రస్తావించదగ్గ రికవరీని సాధించింది. – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
టీవీఎస్తో జట్టు కట్టిన జియో
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా జియోబీపీ సంస్థ ప్రముఖ టూవీలర్ మేకర్ టీవీఎస్తో జట్టు కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న త్వరలో రాబోతున జియో బీపీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లలో టీవీఎస్ వాహనాలకు యాక్సెస్ లభిస్తుంది. దీని ద్వారా టీవీఎస్ ఈవీలలో ప్రయాణం చేయడం మరింత సౌకర్యవంతం కానుంది. రిలయన్స్ సబ్సిడరీ సంస్థ అయిన జియో బీపీ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున జియోబీపీ ప్లస్ పేరుతో ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లు అందుబాటులోకి తెస్తోంది. మరోవైపు ఐక్యూబ్ పేరుతో ఇప్పటికే ఈవీ సెగ్మెంట్లో అడుగు పెట్టిన టీవీఎస్ సంస్థ.. రాబోయే రోజుల్లో రూ.1000 కోట్లను ఈవీ రంగంపై ఖర్చు చేయనుంది. దీంతో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా జియోబీపీ, టీవీఎస్లు జట్టు కట్టాయి. -
రిలయన్స్, ఓఎన్జీసీకి బొనాంజా
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి మారనున్నాయి. గతేడాది కాలంగా ఇంధన ధరలు గణనీయంగా ఎగియడాన్ని పరిగణనలోకి తీసుకోనుండటంతో రేట్లు భారీగా పెరగనున్నాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ తదితర గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. ఓఎన్జీసీకి నామినేషన్ ప్రాతిపదికన కేటాయించిన క్షేత్రాల నుంచి వెలికితీసే గ్యాస్ రేటు ప్రస్తుత 2.9 డాలర్ల నుంచి 5.93 డాలర్లకు (యూనిట్ – ఎంబీటీయూ) పెరగనుంది. అలాగే రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ బీపీకి చెందిన కేజీ–డీ6 బ్లాక్లో సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర 6.13 డాలర్ల నుంచి 9.9–10.1 డాలర్లకు పెరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2019 ఏప్రిల్ తర్వాత ఈ గ్యాస్ రేట్లు పెరగడం ఇది రెండోసారి. అమెరికా, రష్యా తదితర గ్యాస్ మిగులు దేశాల్లో నిర్దిష్ట కాలంలో ధరలకు అనుగుణంగా దేశీయంగా సహజ వాయువు రేట్లను కేంద్రం ఆర్నెల్లకోసారి (ఏప్రిల్ 1, అక్టోబర్ 1) రేట్లను సవరిస్తుంది. ప్రస్తుతం 2021 జనవరి–డిసెంబర్ మధ్య కాలంలో అంతర్జాతీయంగా గ్యాస్ ధరలను బట్టి ఈ ఏడాది ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్య కాలానికి ప్రభుత్వం రేటు నిర్ణయించనుంది. గతేడాది రేటు భారీగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం ఈ ఏడాది నిర్ణయించే గ్యాస్ ధరలపై పడనుంది. గ్యాస్ రేటు పెరగడం వల్ల ఎరువుల ఉత్పత్తి వ్యయం పెరగనుంది. అయితే, ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నందున రేట్ల పెంపు పెద్దగా ఉండకపోవచ్చు. అలాగే, విద్యుదుత్పత్తి వ్యయాలూ పెరిగినా.. దేశీయంగా గ్యాస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా లేనందున.. వినియోగదారులపై అంతగా ప్రభావం ఉండదు. -
రిలయన్స్, ఏసీఆర్ఈ చేతికి సింటెక్స్ ఇండస్ట్రీస్!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, అసెట్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్ (ఏసీఆర్ఈ) దాఖలు చేసిన ఉమ్మడి రిజల్యూషన్ ప్రణాళికను సింటెక్స్ ఇండస్ట్రీస్ రుణదాతలు ఏకగ్రీవ (కమిటీ ఆఫ్ క్రెడిటార్స్– సీఓసీ) ఆమోదం తెలిపారు. తీవ్ర రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జౌళి ఉత్పత్తి సంస్థ సింటెక్స్ ఇండస్ట్రీస్ కోసం దివాలా పరిష్కా ప్రక్రియ కింద రిలయన్స్, ఏసీఆర్ఈలు ఉమ్మడి బిడ్ దాఖలు చేశాయి. శ్రీకాంత్ హిమత్సింకా, దినేష్ కుమార్ హిమత్సింకాతో పాటు వెల్స్పన్ గ్రూప్ సంస్థ ఈజీగో టెక్స్టైల్స్, జీహెచ్సీఎల్, హిమత్సింకా వెంచర్స్ వచ్చిన బిడ్స్ను కూడా కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ పరిశీలించినట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో సింటెక్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. బిడ్ విలువ రూ.3,000 కోట్లు? రెగ్యులేటరీ ఫైలింగ్లో ఆర్ఐఎల్, ఏసీఆర్ఈ ఉమ్మడి బిడ్ల విలువ వివరాలు తెలపనప్పటికీ, ఇది దాదాపు రూ.3,000 కోట్లని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బకాయిల్లో రుణదాతలు 50 శాతం కంటే ఎక్కువ హెయిర్కట్ (రాయితీ) తీసుకున్నట్లు కూడా సమాచారం. పరిష్కార ప్రణాళిక ప్రకారం, కంపెనీ ప్రస్తుత వాటా మూలధనం సున్నాకి తగ్గించడం జరుగుతుంది. అలాగే కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలు, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుండి డీలిస్ట్ అవుతుంది. సింటెక్స్ ఇండస్ట్రీస్పై దివాలా ప్రక్రియను గతేడాది ఏప్రిల్లో ప్రారంభించారు. కంపెనీపై దాదాపు రూ.7,500 కోట్ల క్లెయిమ్లు (రుణ బాకీలు) దాఖలయ్యాయి. దివాలా కోడ్ (ఐబీసీ)నిబంధనల ప్రకారం, కంపెనీ ఆర్థిక స్థితి... 2020–21 లో సింటెక్స్ ఇండస్ట్రీస్ ఆదాయం రూ. 1,689.15 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో, కన్సాలిటేడెడ్ నిర్వహణా ఆదాయం 80 శాతం పెరిగి, రూ.942.66 కోట్లకు చేరింది. ఇదే కాలంలో నికర నష్టం రూ.214.99 కోట్ల నుంచి రూ.103.25 కోట్లకు తగ్గింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ షేరు ఎన్ఎస్ఈలో సోమవారం 5 శాతం నష్టపోయి రూ.7.80 వద్ద ముగిసింది. -
రిలయన్స్ వెనకడుగు..! రష్యా ముడిచమురు మాకొద్దు..! కారణం అదే..!
ఉక్రెయిన్పై దాడి చేసినందుకు రష్యాపై అమెరికాతో పాటుగా, యూరప్దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ కల్గిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాపై ఆంక్షల నేపథ్యంలో తమ ప్లాంట్ల కోసం రష్యా ముడిచమురు కొనుగోలు విషయంలో రిలయన్స్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని కంపెనీకి చెందిన సీనియర్ అధికారి వెల్లడించారు. కొంతమేర ముడిచమురు సరఫరా రష్యా నుంచి వచ్చిన్నప్పటీకి..ఆంక్షల నేపథ్యంతో ఆ దేశ ముడిచమురును తిరస్కరించే అవకాశం ఉందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్ క్రాకర్ రాజేష్ రావత్ బుధవారం రోజున ఒక సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రిలయన్స్ తన రిఫైనరీ కాంప్లెక్స్ కోసం రష్యా యురల్స్ ముడిచమురును నేరుగా కొనుగోలు చేస్తోంది. రిఫైనరీలో సింహాభాగం మిడిల్ ఈస్ట్, అమెరికా నుంచి సేకరిస్తోంది. మార్కెట్ కంటే తక్కువ రేటుకే..! ఇటీవల ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలను విధించడంతో...చాలా దేశాలు రష్యా ముడిచమురు దిగుమతులకు స్వస్తి పలికాయి. దీంతో భారత్ లాంటి దేశాలకు రష్యా ముడిచమురుపై బంపరాఫర్ను ప్రకటించాయి. మార్కెట్ కంటే తక్కువ ధరకే క్రూడాయిల్ సప్లై చేస్తామని రష్యా వెల్లడించింది.దీంతో భారత ప్రభుత్వ రంగ ముడిచమురు సంస్థలు రష్యా క్రూడాయిల్ను కొనేందుకు సిద్దమయ్యాయి. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 3 మిలియన్ బ్యారెల్స్, హిందూస్థాన్ పెట్రోలియం 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ను కొనేందుకు ఒప్పందాలను చేసుకున్నాయి. కాగా పలు కారణాల నేపథ్యంలో రిలయన్స్ ముడిచమురు సేకరణలో వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. చదవండి: రష్యా దెబ్బకు ఆ దేశాలు ఉక్కిరిబిక్కిరి..! రంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్...! -
ముఖేష్ అంబానీ దూకుడు..! మరో వీదేశీ కంపెనీ రిలయన్స్ చేతిలోకి..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.కోబాల్ట్-రహిత లిథియం బ్యాటరీ టెక్నాలజీ కంపెనీ లిథియం వర్క్స్ బీవీ ఆస్తులను పూర్తిగా హస్తగతం చేసుకొనుంది. ఈ డీల్ విలువ సుమారు 61 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 465 కోట్లు). రిలయన్స్ న్యూ ఎనర్జీ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా చైనాలోని తయారీ కేంద్రం, కంపెనీకి సంబంధించిన పేటెంట్ పోర్ట్ఫోలియో, కీలక వ్యాపార ఒప్పందాలు రిలయన్స్ చేతిలోకి రానున్నాయి. కొద్ది రోజుల క్రితమే సోడియం-అయాన్ సెల్ కెమిస్ట్రీలో గ్లోబల్ లీడర్గా ఉన్న ఫారాడియన్ లిమిటెడ్ను రిలయన్స్ కొనుగోలుచేసింది.లిథియం వర్క్స్ కలయికతో గ్రీన్ ఎనర్జీ రంగంలో రిలయన్స్ ప్రణాళికలు మరింత బలపేతం కానున్నట్లు కంపెనీ అభిప్రాయపడింది. సెల్ కెమిస్ట్రీ, కస్టమ్ మాడ్యూల్స్, ప్యాకింగ్,పెద్ద ఎత్తున బ్యాటరీ తయారీ సౌకర్యాన్ని నిర్మించడంలో ఈ డీల్ ఉపయోగపడుతోందని రిలయన్స్ ఆశాభావం వ్యక్తపరిచింది. లిథియం వర్క్స్ బీవీ సంస్థను 2017లో స్థాపించారు. ఈ కంపెనీ బ్యాటరీల తయారీలో ప్రసిద్ధి చెందింది. అమెరికా, యూరప్,చైనాలో కార్యకలాపాలు అందిస్తోంది. ఈ కంపెనీ తయారుచేసే బ్యాటరీలు పారిశ్రామికంగా, వైద్య, సముద్ర, వాణిజ్య రవాణా ఇతర అత్యంత డిమాండ్ కల్గిన రంగాల్లో వాడుతున్నారు. కంపెనీకి చెందని నానోఫాస్ఫేట్ బ్యాటరీలు అత్యంత శక్తివంతమైనవే కాకుండా, గరిష్ట జీవిత కాలాన్ని అందిస్తాయి. చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంకు కీలక నిర్ణయం..! ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు భిన్నంగా..! -
కలిసొచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు...లక్ష 91 వేల కోట్లను ఇట్టే సంపాదించారు..!
దేశీయ మార్కెట్లపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అస్థిరత్వం కలిగి ఉన్నప్పటికీ, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో భారతీయ ఈక్విటీలు చివరి వారంలో భారీ లాభాలను గడించాయి. దాంతో పాటుగా ఉక్రెయిన్ నాటోలో చేరమనే సంకేతాలు, అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీచడంతో స్టాక్ మార్కెట్స్ మళ్లీ రంకెవేస్తూ లాభాల్లోకి వచ్చాయి. గత వారం స్టాక్ మార్కెట్స్లోని టాప్-10 కంపెనీలు భారీ లాభాలను గడించాయి. ఆయా కంపెనీలు మార్కెట్ క్యాప్కు సుమారు లక్ష 91 కోట్లను యాడ్ చేసుకున్నాయి. అత్యంత విలువైన పది షేర్లలో 9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,91,434.41 కోట్లను అందించడంతో చివరి వారం మార్కెట్లు సహాయపడ్డాయి. లాభాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ టాప్ ప్లేస్లో నిలిచాయి. కాగా గత వారం ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకు కొంత మేర నష్టాలను చవిచూసింది. మార్చి 11 శుక్రవారం రోజున సెన్సెక్స్ 55,550 పాయింట్ల వద్ద , నిఫ్టీ 16,630 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. ► బీఎస్ఈలో మార్కెట్ క్యాప్లో అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.49,492.7 కోట్ల లాభాలను గడించి, అతిపెద్ద కంట్రిబ్యూటర్గా నిలిచింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 16,22,543.06 కోట్లకు చేరుకుంది. ► ఐటి దిగ్గజాలు టిసిఎస్, ఇన్ఫోసిస్ మర్కెట్ క్యాప్ వాల్యుయేషన్కు వరుసగా రూ.41,533.59 కోట్లు, రూ 27,927.84 కోట్లు పెరిగింది. ► అదే సమయంలో భారతీ ఎయిర్టెల్ రూ. 22,956.67 కోట్లను జోడించి దాని మార్కెట్ క్యాప్ రూ.3,81,586.05 కోట్లకు చేరుకుంది. ► ఇక ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాప్ గత వారం రూ.17,610.19 కోట్లను జోడించి రూ.4,92,204.13 కోట్లకు చేరుకుంది . ► హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువలో రూ.16,853.02 కోట్లను జోడించి రూ. 7,74,463.18 కోట్లకు చేరుకుంది. ► హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేరెంట్ సంస్థ, హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాప్ రూ.2,210.49 కోట్లు పెరిగి రూ.4,04,421.20 కోట్లకు పెరిగింది. ► ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ క్యాప్లో రూ.7,541.3 కోట్లను జోడించి రూ. 4,19,813.73 కోట్లకు చేరుకుంది. ► బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.5,308.61 కోట్లు పెరిగి రూ.4,00,014.04 కోట్లకు చేరుకుంది. ► ఐసిఐసిఐ బ్యాంక్ తన మార్కెట్ క్యాప్లో రూ. 7,023.32 కోట్లు తగ్గి రూ. 4,71,047.52 కోట్లకు పడిపోయింది . చదవండి: 40 ఏళ్ల తరువాత కేంద్రం షాకింగ్ నిర్ణయం..! కారణం అదేనట..? -
రష్యా దెబ్బకు ఆ దేశాలు ఉక్కిరిబిక్కిరి..! రంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్...!
ప్రపంచ దేశాలను రష్యా-ఉక్రెయిన్ యుద్దం కలవరపెడుతోంది. ఎన్నడూ లేనంతగా క్రూడ్ ఆయిల్ ధరలు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడుతుంది. యూరప్ దేశాలకు ఇంధనాన్ని సరఫరా చేయడంలో రష్యా ముందుస్థానంలో ఉంది. యూరప్ దేశాల్లో రష్యా సుమారు 27 శాతం దిగుమతి వాటాలను కల్గి ఉంది. ఇప్పుడదే యూరప్ దేశాలకు పీడకలలాగా తయారైంది. ఐతే యూరప్దేశాలు ఇంధన సంక్షోభం నుంచి బయటపడేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం భారత పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కు కలిసి రానుంది. యూరప్కు సరఫరా..! ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉక్రెయిన్ సంక్షోభం మధ్య డీజిల్ కొరతతో సతమతమవుతున్న యూరప్కు సరఫరా చేయడానికి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. యూరప్లో డీజిల్కు పెరుగుతున్న డిమాండ్ను సద్వినియోగం చేసుకోవడానికి...రిలయన్స్ తన పాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కాగా ఈ విషయంపై రిలయన్స్ నేరుగా స్పందించలేదు. ఇప్పటికే యూరప్కు రిలయన్స్ ఇంధనాన్ని పంపుతుండగా..రాబోయే నెలల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని రిలయన్స్కు చెందిన రెండు రిఫైనరీల నుంచి రోజుకు 1.36 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ను ప్రాసెస్ చేయగలదు. ఇప్పడు యూరప్ దేశాల్లో డీజిల్ను సరఫరా చేసేందుకు రిలయన్స్ సమయాత్తమయ్యింది. భారీ లాభం..! రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ యూరప్ దేశాలకు డీజిల్ కొరతను తీర్చనుంది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు భారీ లాభం చేకూరనున్నట్లు తెలుస్తోంది. క్రూడ్ ఫీడ్స్టాక్ నిష్పత్తి , దిగుబడి మార్పుల పరంగా చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువ సౌలభ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ రిఫైనింగ్ ఉత్పత్తిలో 80 శాతం ఎగుమతి చేస్తుందని దక్షిణాసియా చమురు అధిపతి సెంథిల్ కుమరన్ అన్నారు. అంతేకాకుండా బలమైన మార్జిన్ సమయాల్లో రిలయన్స్కు గరిష్ట ప్రయోజనాన్ని ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ఇంధన కొరత..! ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత యూరప్లో ఇంధనం విపరీతంగా పెరగడంతో కొన్ని ఆసియా రిఫైనర్లు డీజిల్ను ఆయా యూరప్దేశాలకు సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఇది కాస్త రిలయన్స్ ఇండస్ట్రీస్ కలిసి రానుంది. జామ్నగర్లోని క్రూడ్ రిఫైనింగ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఒకదానిని ఈ నెల నుంచి మూడు వారాల పాటు మూసివేయాలని రిలయన్స్ ప్లాన్ చేయగా..ఈ నిర్ణయాన్ని రిలయన్స్ వెనక్కితీసుకుంది. ఇప్పుడు అది సెప్టెంబర్కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. చదవండి: అప్పుడెమో 900 మంది..ఇప్పుడు ఏకంగా 3వేల ఉద్యోగులకు ఉస్టింగ్..! -
జియో వరల్డ్ సెంటర్ ప్రారంభం
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తాజాగా ముంబైలో జియో వరల్డ్ సెంటర్ను ప్రారంభించింది. దీని విస్తీర్ణం దాదాపు 18.5 ఎకరాలు ఉంటుంది. జియో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో సాంస్కృతిక కేంద్రం, మ్యూజికల్ ఫౌంటెయిన్ మొదలైనవి ఉన్నాయి. ఇందులోని కన్వెన్షన్ సెంటర్ దేశంలోనే అతి పెద్దదిగా నిలవనుంది. 5జీ నెట్వర్క్ ఆధారిత కన్వెన్షన్ సెంటర్లో 1.61 లక్షల చ.అ. పైగా విస్తీర్ణం ఉండే మూడు ఎగ్జిబిషన్ హాల్స్, 1.07 లక్షల చ.అ. విస్తీర్ణం ఉండే రెండు కన్వెన్షన్ హాల్స్ ఉంటాయి. ఈ ఏడాది, వచ్చే ఏడాది దశలవారీగా ఇందులోని వివిధ విభాగాలను సంస్థ ఆవిష్కరించనుంది. నవ భారత ఆకాంక్షలకు ప్రతిరూపంగా జియో వరల్డ్ సెంటర్ ఉంటుందని ఆర్ఐఎల్ డైరెక్టర్, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ నీతా అంబానీ తెలిపారు. -
ఎలక్ట్రానిక్ రంగంలోకి ఆర్ఐఎల్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తాజాగా ఎలక్ట్రానిక్ తయారీలోకి ప్రవేశించింది. ఇందుకు వీలుగా అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఎస్బీవీఎల్) ద్వారా సాన్మినా కార్పొరేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. రెండు సంస్థల భాగస్వామ్యంతో ఎలక్ట్రానిక్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నాయి. ప్రధానంగా కమ్యూనికేషన్స్ నెట్వర్కింగ్, రక్షణ, ఏరోస్పేస్ తదితర హైటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్డ్వేర్పై దృష్టిపెట్టనున్నాయి. భాగస్వామ్య సంస్థ(జేవీ)లో ఆర్ఎస్బీవీఎల్ 50.1 శాతం వాటా పొందనుండగా.. సాన్మినాకు 49.9 శాతం వాటా లభించనుంది. సాన్మినాకు దేశీయంగా గల సంస్థలో ఆర్ఎస్బీవీఎల్ రూ. 1,670 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా జేవీలో వాటాను పొందనుంది. ఈ పెట్టుబడితో లభించనున్న 20 కోట్ల డాలర్ల(సుమారు రూ. 1,500 కోట్లు) నగదుతో వృద్ధి అవకాశాలను జేవీ అందిపుచ్చుకోనుంది. కాగా.. ఈ లావాదేవీకి నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించవలసి ఉంది. సాన్మినా కార్పొరేషన్, ఆర్ఎస్బీవీఎల్ సంయుక్తంగా వెల్లడించిన ఈ డీల్ 2022 సెప్టెంబర్కల్లా పూర్తికాగలదని అంచనా. సాన్మినా నిర్వహణలో చెన్నైలోగల సాన్మినా యాజమాన్యం జేవీకి చెందిన రోజువారీ బిజినెస్ కార్యకలాపాలను నిర్వహించనుంది. కంపెనీ ప్రధానంగా అత్యున్నత సాంకేతికతగల ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్డ్వేర్ తయారీకి ప్రాధాన్యత ఇవ్వనుంది. 5జీ, క్లౌడ్ ఇన్ఫ్రా, హైపర్స్కేల్ డేటా సెంటర్లు తదితర కమ్యూనికేషన్స్ నెట్వర్కింగ్, మెడికల్ అండ్ హెల్త్కేర్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ క్లీన్టెక్, డిఫెన్స్, ఏరోస్పేస్ తదితర వృద్ధికి వీలున్న కీలక రంగాలపై దృష్టి పెట్టనుంది. దేశీయంగా హైటెక్ తయారీకున్న భారీ అవకాశాలను అందిపుచ్చుకునే బాటలో సాన్మినాతో కలసి పనిచేయడానికి సంతోషిస్తున్నట్లు రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వృద్ధి, భద్రతరీత్యా టెలికం, ఐటీ, డేటా సెంటర్లు, 5జీ, నూతన ఇంధన రంగాలకు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీలో స్వయం సమృద్ధి సాధించవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా దేశ, విదేశాలలో నెలకొన్న డిమాండుకు అనుగుణమైన కొత్త ఆవిష్కరణలు, ప్రతిభలకు ప్రోత్సాహం లభించగలదని తెలియజేశారు. మేకిన్ ఇండియా విజన్కు అనుగుణంగా ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్ తయారీ కేంద్ర సృష్టి ఈ జేవీ లక్ష్యమని పేర్కొన్నారు. తొలుత చెన్నైలో... 2021 మార్చితో ముగిసిన ఏడాదిలో సాన్మి నా దేశీ యూనిట్.. సాన్మినా ఎస్సీఐ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ 16.5 కోట్ల డాలర్ల(దాదాపు రూ. 1,230 కోట్లు) ఆదాయం సాధించింది. ఎలక్ట్రానిక్ తయారీని తొలుత పూర్తిగా సాన్మినాకు చెన్నైలోగల 100 ఎకరాల క్యాంపస్లోనే చేపట్టనున్నట్లు ఆర్ఎస్బీవీఎల్ వెల్లడించింది. భవిష్యత్ విస్తరణకు సైతం ఇక్కడ వీలున్నట్లు తెలియజేసింది. ఆపై వ్యాపార అవసరాలరీత్యా దేశంలోని ఇతర ప్రాంతాలలో యూనిట్ల ఏర్పాటుకు వీలున్నట్లు వివరించింది. దేశీయంగా సమీకృత తయారీ సొల్యూషన్స్ కంపెనీ ఏర్పాటు కోసం రిలయన్స్తో జత కట్టడం తమకు ఉత్తేజాన్నిస్తున్నట్లు సాన్మినా చైర్మన్, సీఈవో జ్యూరె సోలా పేర్కొన్నారు. ఈ జేవీ దేశ, విదేశీ మార్కెట్లకు అవసరమైన ఉత్పత్తులను రూపొందించగలదని తెలియజేశారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో కీలక మైలురాయిగా నిలవగలదని పేర్కొన్నారు. -
ఫ్యూచర్ స్టోర్స్ రీబ్రాండింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భవన యజమానులకు బకాయిలు చెల్లించలేక మూతపడ్డ ఫ్యూచర్ రిటైల్ స్టోర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోవడం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తొలి దశలో 250 కేంద్రాలను రిలయన్స్ చేజిక్కించుకుంటోంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 20 వరకు ఔట్లెట్స్ ఉన్నట్టు సమాచారం. ఫ్యూచర్ గ్రూప్ నిర్వహణలో దేశవ్యాప్తంగా 1,700లకుపైగా కేంద్రాలు ఉన్నాయి. ఫ్యూచర్ రిటైల్ ఆస్తుల విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అమెజాన్ మధ్య లీగల్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాస్తా బకాయిలు పేరుకుపోవడానికి దారి తీయడం, అద్దెలు చెల్లించలేకపోవడంతో ఫ్యూచర్ రిటైల్ ఔట్లెట్స్ కాస్తా మూసివేతకు గురవుతున్నాయి. కాగా, రీబ్రాండింగ్తో ఎఫ్బీబీ స్టోర్లు ట్రెండ్స్ కేంద్రాలుగా మారనున్నాయి. బిగ్ బజార్ స్టోర్స్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ లేదా రిలయన్స్ మార్కెట్, ఈజీ డే ఔట్లెట్స్ రిలయన్స్ ఫ్రెష్గా పేరు మారనున్నాయి. ఫ్యూచర్ రిటైల్ నెట్వర్క్లో పని చేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని రిలయన్స్ నిర్ణయించింది. ఈ నిర్ణయం సుమారు 30,000 మందికి ఊరట కలిగించనుంది. ‘నెలల తరబడి కొనసాగిన అనిశ్చితికి తెరపడింది. విక్రేతలు, సరఫరాదార్లు తమ బకాయిలు పొందుతున్నారు. భవన యజమానులు సైతం తమ స్టోర్స్ను రిలయన్స్కు లీజుకు ఇస్తున్నారు. గత ఏడాది అద్దెలు ఫ్యూచర్ గ్రూప్ నుంచి వీరికి అందలేదు. ఆ బకాయిలను సంస్థ తీర్చింది. అయితే నష్టాలు వస్తున్న ఔట్లెట్స్ను కంపెనీ తీసుకోవడంతో దివాలా ప్రక్రియలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. సర్దుబాటు పథకం గనుక ఆమోదం పొందితే తమ బకాయిలు రాగలవని రుణదాతలు భావిస్తున్నారు’ అని రిలయన్స్ వెల్లడించింది. -
మరో కంపెనీలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ భారీగా పెట్టుబడులు..!
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సబ్సిడరీ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్వీఎల్) అబ్రహం & థాకూర్ ఎక్స్ పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టింది. రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ సహకారంతో ఈ అబ్రహం అండ్ ఠాకూర్ బ్రాండ్ను ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని భావిస్తోంది. 1992లో డేవిడ్ అబ్రహం రాకేష్ థాకోరే చే ప్రారంభించిన కొద్ది కాలంలోనే కెవిన్ నిగ్లీ ఇందులో చేరారు. ఆ తర్వాత అతి తక్కువ కాలంలో అబ్రహం & థాకూర్(ఎ అండ్ టి) పాపులర్ బ్రాండ్'గా మారింది. ఈ రంగంలో అబ్రహం & థాకూర్ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది. ఫ్యాషన్ రంగంలో భారతీయ వస్త్ర డిజైన్లకు ఆధునికతను జోడించింది. భారతీయ వస్త్రాలకు సంబంధించి A&T డిజైనింగ్ లాంజ్వేర్, హోమ్ కలెక్షన్లతో ప్రారంభమైంది, వీటిని మొదట లండన్లోని ది కాన్రాన్ షాప్లో విక్రయించారు. ఫ్యాషన్ సాంస్కృతిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో ముందున్న A&T బ్రాండ్ ఈ రంగంలో బలంగా పాతుకుపోయింది. అబ్రహం & ఠాకోర్ ఆసక్తికరమైన మెటీరియల్ ఉపయోగం, సాంప్రదాయ వస్త్ర సాంకేతికతలను తీసుకోవడం కోసం అత్యంత విలక్షణమైన డిజైన్ సంతకాన్ని రూపొందించింది. భారతీయ లగ్జరీ కస్టమర్లు తరతరాలుగా వినియోగ మార్పులకు లోనవుతున్నందున, అబ్రహం & ఠాకూర్ టైమ్లెస్ డిజైన్పై అధిక ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు భారతీయ హస్తకళ ప్రత్యేక వ్యక్తీకరణను తీసుకురావడానికి బ్రాండ్తో భాగస్వామ్యం చేయడానికి తాము సంతోషిస్తున్నట్టు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ అన్నారు. (చదవండి: మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎలాన్ మస్క్..!) -
రిలయన్స్ ఆధీనంలోకి ఫ్యూచర్ రిటైల్ స్టోర్స్
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) .. స్థల యజమానులకు లీజు బకాయిలు చెల్లించలేకపోవడంతో దాన్ని గట్టెక్కించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రంగంలోకి దిగింది. ఫ్యూచర్ రిటైల్కు చెందిన స్టోర్స్ను తన ఆధీనంలోకి తీసుకోవడం ప్రారంభించింది. సుమారు 200 స్టోర్స్ కార్యకలాపాలను రిలయన్స్ టేకోవర్ చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే వాటిల్లో పని చేసే సిబ్బందికి అక్కడే ఉద్యోగ ఆఫర్లు కూడా ఇచ్చిందని వివరించాయి. రిలయన్స్ రిటైల్లో ఫ్యూచర్ రిటైల్ను విలీనం చేసే డీల్పై ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్ మధ్య న్యాయ వివాదం కొనసాగుతున్న పరిస్థితుల్లో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన రిటైల్, లాజిస్టిక్స్ వ్యాపారాలను రూ. 24,713 కోట్లకు టేకోవర్ చేసేందుకు రిలయన్స్ రిటైల్ 2020 ఆగస్టులో అంగీకరించింది. ఫ్యాషన్ ఎట్ బిగ్ బజార్, కోర్యో, ఫుడ్హాల్, ఈజీడే మొదలైన విభాగాలు వీటిలో ఉన్నాయి. అయితే, ఫ్యూచర్ గ్రూప్ లోని ఫ్యూచర్ కూపన్స్లో వాటాలు ఉన్న అమెజాన్ వ్యతిరేకించడంతో ఈ డీల్ నిల్చిపోయింది. ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్–అమెజాన్ మధ్య న్యాయపోరాటం సాగుతోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 28న రెండు పక్షాల వాదనలను విననుంది. స్టోర్స్కు రీబ్రాండింగ్.. ఈ క్రమంలో రుణదాతలకు దాదాపు రూ. 3,494 కోట్ల బకాయిలను చెల్లించడంలో ఎఫ్ఆర్ఎల్ విఫలమైంది. మరోవైపు, ఎఫ్ఆర్ఎల్కు స్థలాలను లీజుకు ఇచ్చిన వారు .. తమ బాకీలను రాబట్టుకునేందుకు రిలయన్స్ రిటైల్ను సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో కొన్ని స్టోర్ల లీజులను రిలయన్స్ తన అనుబంధ సంస్థ ఆర్ఆర్వీఎల్ పేరిట బదిలీ చేయించుకుని, వాటిని ఫ్యూచర్కు సబ్ లీజుకు ఇచ్చినట్లు పేర్కొన్నాయి. అలాగే, స్టోర్స్కు పేర్లను కూడా రీబ్రాండింగ్ చేస్తున్నట్లు వివరించాయి. ఎఫ్ఆర్ఎల్ ప్రస్తుత సరఫదారులకు బాకీలను చెల్లించకపోవడంతో .. స్టోర్స్లో సింహభాగం ఉత్పత్తులను రిలయన్స్ జియోమార్ట్ సరఫరా చేస్తోంది. ఆయా స్టోర్స్ నుంచి బిగ్ బజార్ సైనేజీలు, బ్రాండింగ్ను తన సొంత బ్రాండ్తో మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బజార్ స్టోర్స్తో పాటు ఫ్యూచర్కు 1,700 అవుట్లెట్స్ ఉన్నాయి. డీల్ గడువు పొడిగింపు.. అయితే, ఈ అంశాలను నిర్దిష్టంగా ధృవీకరించకుండా ఫ్యూచర్ రిటైల్.. స్టాక్ ఎక్సే్చంజీలకు వివరణనిచ్చింది. అమెజాన్తో వివాదం దరిమిలా తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని పేర్కొంది. రిలయన్స్ రిటైల్తో డీల్కు సంబంధించి 2022 ఏప్రిల్ ప్రథమార్ధంలో షేర్హోల్డర్లు, రుణదాతలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపాదిత టేకోవర్ డీల్ గడువును సెప్టెంబర్ 30 వరకూ రిలయన్స్ పొడిగించిందని తెలిపింది. -
ఐపీఎల్ కోసం అమెజాన్, రిలయన్స్ మధ్య యుద్ధం..!
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్కు మరో జాక్పాట్ తగలబోతోందా? లీగ్ ప్రసార హక్కులు కనీవినీ ఎరుగని ధరకు అమ్ముడుపోనున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఐదేళ్ల కోసం ఐపీఎల్ ప్రసార హక్కుల ధర రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకూ పలుకుతుందని అంచనా. 2018 నుంచి 2022 వరకూ ఐదేళ్ల కాలానికిగానూ గతంలో రూ.16,347 కోట్లు చెల్లించి "స్టార్ ఇండియా" ఆ హక్కులను సొంతం చేసుకుంది. వచ్చే ఐదేళ్లకు అంతకంటే చాలా ఎక్కువ ధరే పలికే అవకాశాలున్నాయి. అయితే, ఈసారి ఐపీఎల్ ప్రసార హక్కులను పొందడం కోసం కార్పొరేట్ కంపెనీల మధ్య పోటీ వాతావరణం ఏర్పడింది. కోట్ల మంది వీక్షించే ఇండియన్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ ప్రసార హక్కుల కోసం అమెజాన్, రిలయన్స్, సోనీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈసారి వచ్చే ఐదేళ్ల కోసం ఐపీఎల్ ప్రసార హక్కులు రికార్డు స్థాయిలో రూ.50 వేల కోట్ల వరకు పలికే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ, సాంప్రదాయ మీడియా సంస్థలు ఇప్పుడు భారతదేశం అతిపెద్ద రిటైలర్ రిలయన్స్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలతో గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. అమెజాన్, రిలయన్స్ ఇప్పటికే ఫ్యూచర్ గ్రూప్ ఆస్తుల విషయంలో కోర్టుల వరకు వెళ్లాయి. రిలయన్స్ తన బ్రాడ్ కాస్టింగ్ జాయింట్ వెంచర్ వయాకామ్18 కోసం 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సేకరించడానికి విదేశీయులతో సహా ఇతర పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది. "ఈ బిడ్ గెలుచుకోవడం రిలయన్స్ జియో ప్లాట్ ఫారమ్, దాని డిజిటల్ విస్తరణ కోసం దీర్ఘకాలిక ప్రణాళికలలో కీలకం" అని కంపెనీకి చెందిన ఒక అధికారి తెలిపారు. ఇటీవల లైవ్ స్ట్రీమింగ్ క్రికెట్ మ్యాచ్లను ప్రారంభించిన అమెజాన్ తన ప్లాట్ ఫామ్ యూజర్ బేస్ పెంచుకోవడానికి ఐపీఎల్ ప్రసార హక్కులను గెలుచుకోవాలని అనుకుంటుంది. ఈ కంపెనీకి టీవి ఫ్లాట్ ఫారం లేదు, టీవిలో క్రికెట్ ప్రసార కోసం మరో భాగస్వామితో చేతులు కలిపే అవకాశం ఉంటుంది. (చదవండి: సీనియర్ సిటిజన్లకు ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త..!) -
ఆల్టిగ్రీన్లో రిలయన్స్కు వాటాలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల టెక్నాలజీ, సొల్యూషన్స్ కంపెనీ ఆల్టిగ్రీన్ ప్రొపల్షన్ ల్యాబ్స్లో వాటాలు కొనుగోలు చేసినట్లు పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వెల్లడించింది. అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ (ఆర్ఎన్ఈఎల్) ద్వారా కుదుర్చుకున్న ఈ డీల్ కోసం రూ. 50.16 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. ఆల్టిగ్రీన్లో రూ. 100 ముఖవిలువ గల 34,000 సిరీస్–ఎ కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లను కొనుగోలు చేసేందుకు ఆర్ఎన్ఈఎల్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ తెలిపింది. అయితే, ఈ పెట్టుబడులకు ప్రతిగా ఆల్టిగ్రీన్లో ఎంత వాటా లభిస్తుందన్నది మాత్రం వెల్లడించలేదు. 2013లో ఏర్పాటైన ఆల్టిగ్రీన్.. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. 2020–21లో కంపెనీ రూ. 1.03 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. వాణిజ్య రవాణాకు సంబంధించి 2/3/4 వీలర్ల ఎలక్ట్రిక్ వాహనాల టెక్నాలజీ, సొల్యూషన్స్ అందిస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ప్లాట్ఫాంపై సొంతంగా ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాన్ని తయారు చేసింది. ఎలక్ట్రిక్ మోటర్లు, వాహనాల కంట్రోల్స్, బ్యాటరీ నిర్వహణ మొదలైన టెక్నాలజీలు కంపెనీ వద్ద ఉన్నాయి. స్టెర్లింగ్లో వాటాల కొనుగోలు పూర్తి.. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్నకు చెందిన స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ (ఎస్డబ్ల్యూఆర్ఈఎల్)లో 40 శాతం వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు ఆర్ఐఎల్ తెలిపింది. గతేడాది నుంచి విడతలవారీగా జరిగిన ఈ డీల్ కోసం రూ. 2,845 కోట్లు వెచ్చించింది. -
కీలక రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు..!
ముంబై: భారత వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొంతకాలంగా వ్యూహాత్మక పెట్టుబడులతో ముందుకు వెళుతోంది. కొత్త కొత్త రంగంలో పెట్టుబడులు పెడుతూ రిలయన్స్ సంస్థ ప్రస్తుతం దేశంలో దూసుకెళ్తుంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కొత్త కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దం అవుతుంది. ఆల్టిగ్రీన్ ప్రొపల్షన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో రూ.50.16 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ తెలిపింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ప్రొపల్షన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలకు లాస్ట్ మైలేజ్ రవాణాకు సంబంధించి సేవలను అందిస్తూ ఉంటుంది. 2/3/4 చక్రాల వాహనాలకు తమ సేవలను అందిస్తుంది. 100 శాతం తన సొంత టెక్నాలజీతో సదరు సంస్థ ఎలక్ట్రిక్ ఆటోను తయారు చేసింది. 2013లో ప్రారంభమైన ఈ సంస్థ 2020-21 ఆర్థిక సంవస్సరంలో రూ.104 కోట్ల టర్నోవర్ చేసింది. ఈ పెట్టుబడుల ప్రక్రియ మార్చి 2022 నాటికి పూర్తవుతుందని తెలిపింది. "కొత్త శక్తి, కొత్త మొబిలిటీ పర్యావరణ వ్యవస్థలలో సృజనాత్మక కంపెనీలతో సహకరించాలనే మా కంపెనీ వ్యూహాత్మక ఉద్దేశ్యంలో ఈ పెట్టుబడి భాగం" అని ఆర్ఐఎల్ తెలిపింది. (చదవండి: కారు తయారీ దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్..!) -
తుది దశకు సింటెక్స్ రిజల్యూషన్
న్యూఢిల్లీ: దివాలా చట్ట చర్యలలో ఉన్న సింటెక్స్ ఇండస్ట్రీస్ రుణ పరిష్కార ప్రణాళిక(రిజల్యూషన్) తుది దశకు చేరింది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)సహా నాలుగు కంపెనీలు సవరించిన బిడ్స్ను దాఖలు చేశాయి. వీటిని రుణదాతల కమిటీ(సీవోసీ) పరిశీలించనుంది. రుణ సమస్యల్లో చిక్కుకున్న టెక్స్టైల్స్ కంపెనీ సింటెక్స్ ఇండస్ట్రీస్ కొనుగోలుకి అసెట్స్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్తో జత కట్టిన ఆర్ఐఎల్ రూ. 2,800 కోట్ల విలువలో బిడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ బాటలో ఈజీగో టెక్స్టైల్స్(వెల్స్పన్ గ్రూప్), జీహెచ్సీఎల్, హిమంత్సింగ్కా వెంచర్స్ సైతం బిడ్స్ను దాఖలు చేసినట్లు గత వారమే సింటెక్స్ వెల్లడించింది. సవరించిన బిడ్స్ను మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ సమీక్షించనున్నట్లు కంపెనీ పేర్కొంది. -
అంబానీ కారూ ఖరీదే..
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ భారత్లో అత్యంత సంపన్నుడు. మరి ఆ స్థాయి వ్యక్తి వినియోగించే కారు ఖరీదు మామూలుగా ఉంటుందా? తాజాగా అల్ట్రా లగ్జరీ రోల్స్ రాయిస్ కలినన్ హ్యాచ్బ్యాక్ను ఆయన కొనుగోలు చేశారు. దీని కోసం ఏకంగా రూ.13.14 కోట్లు ఖర్చు చేశారట. భారత్లో అత్యంత ఖరీదైన కార్లలో ఇది ఒకటి. 2018లో విడుదలైనప్పుడు ఈ కారు బేస్ ధర రూ.6.95 కోట్లు. కస్టమైజేషన్ కారణంగా కారు ధర భారీగా పెరుగుతుందని వాహన పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఆర్ఐఎల్ పేరిట కారు రిజిష్టర్ అయింది. రూ.12 లక్షలు చెల్లించి 0001 నంబరును కంపెనీ సొంతం చేసుకుంది. ఆర్ఐఎల్/ముకేశ్ ఖాతాలో ఇది మూడవ కలినన్ మోడల్ కావడం విశేషం. 6.7 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ12 ఇంజన్ పొందుపరిచారు. టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు. -
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టిన రిలయన్స్..!
ఆసియాలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 31 డిసెంబర్, 2021తో ముగిసిన 3వ త్రైమాసికం(క్యూ3 ఎఫ్ వై22) ఫలితాలను విడుదల చేసింది. ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ ₹18,549 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది క్రితం 3వ త్రైమాసికంలో పొందిన లాభం కంటే (₹13,101 కోట్ల) 41 శాతం ఎక్కువ. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన చమురు-రిటైల్-టెలికామ్ ఆదాయం ₹1.23 లక్షల కోట్లతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 54% పెరిగి ₹1.91 లక్షల కోట్లకు చేరుకుంది. ఫలితాల విడుదల ముందు శుక్రవారం రిలయన్స్ ఎన్ఎస్ఈలో ₹2,476 ధర వద్ద ముగిసింది. ఈ ఇండెక్స్ హెవీవెయిట్ స్టాక్ గత ఏడాది కాలంలో 18.26% పెరిగింది. రిలయెన్స్ జియో అసమాన పనితీరుతో 102 కోట్ల మంది కొత్త కస్టమర్లను పొందింది. 2021-22 మూడవ త్రైమాసికంలో, జియో మొత్తం ఆదాయాలు 13.8 శాతం పెరిగి రూ.24,176 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో పన్నుకు ముందు లాభం రూ.10,008 కోట్లకు చేరుకోగా, నికర లాభం రూ.3,795 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 8.9 శాతం వృద్ధి నమోదైంది. డిసెంబర్ 31 వరకు కంపెనీ కస్టమర్ల సంఖ్య 42.10 కోట్లుగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో 1.02 కోట్ల కొత్త కస్టమర్లు చేరారు. "మా రిలయన్స్ అన్ని వ్యాపారాల నుంచి బలమైన సహకారం అందడంతో క్యూ3 ఎఫ్ వై22లో సంస్థ అత్యుత్తమ పనితీరును కనబరిచింది అని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. మా వినియోగదారుల వ్యాపారాలు, రిటైల్ & డిజిటల్ సేవలు రెండూ అత్యధిక ఆదాయాలు నమోదు చేశాయి. ఈ త్రైమాసికంలో, మేము భవిష్యత్తు వృద్ధిని నడపడానికి మా వ్యాపారాలలో వ్యూహాత్మక పెట్టుబడులు & భాగస్వామ్యాలపై దృష్టి సారించడం కొనసాగించాము" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. (చదవండి: యాపిల్ అదిరిపోయే డీల్.. ఏకంగా రూ.23 వేల తగ్గింపు..!) -
గుజరాత్ ప్రభుత్వంతో రిలయన్స్ భారీ ఒప్పందం..!
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా గుజరాత్ ప్రభుత్వంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురువారం రోజున జరిగిన వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్- 2022లో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా వివిధ ప్రాజెక్టుల ద్వారా గుజరాత్లో సుమారు రూ. 5.955 లక్షల కోట్లను ఆర్ఐఎల్ ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో గుజరాత్లో 10 లక్షల ప్రత్యక్ష/పరోక్ష ఉపాధి అవకాశాలను రిలయన్స్ కల్పించనుంది. కర్బన రహిత రాష్ట్రంగా..! ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు భారత్ను కర్భన రహిత దేశంగా మార్చేందుకు రిలయన్స్ కట్టుబడి ఉందని తెలిపింది. అంతేకాకుండా కర్బన రహితంగా రాష్ట్రంగా గుజరాత్ను మార్చేందుకుగాను రాష్ట్రంలో 100గిగావాట్ల పునరుత్పాదక శక్తి పవర్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ ఎకో-సిస్టమ్ రిలయన్స్ అభివృద్ధి చేయనుంది. 10 నుంచి 15 సంవత్సరాల వ్యవధిలో 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రిలయన్స్ పెట్టనుంది. ఊతమిచ్చేలా..! చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా, పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్ క్యాప్టివ్ వినియోగానికి దారితీసే కొత్త సాంకేతికతలను, ఆవిష్కరణలను ఆయా సంస్థలకు ప్రోత్సహం లభిస్తోందని రిలయన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. గుజరాత్లోని కచ్, బనస్కాంత, ధోలేరాల్లో గిగా ఫ్యాక్టరీల నిర్మాణం కోసం సంబంధించి భూమి కోసం రిలయన్స్ ఇప్పటికే అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలుపెట్టింది. కాగా కచ్లో 4.5 లక్షల ఎకరాల భూమి కావాలని రిలయన్స్ గుజరాత్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. మరో రూ. 60 వేల కోట్లు..! న్యూ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్-ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ మాన్యుఫ్యాక్చరింగ్ను ఏర్పాటు చేసేందుకుగాను రిలయన్స్ గుజరాత్లో మరో రూ. 60,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ఇన్వెస్ట్మెంట్తో సోలార్ పీవీ మాడ్యూల్ ఫ్యాక్టరీ, ఎలక్ట్రోలైజర్, ఇంధన నిల్వ, ఫ్యుయెల్ సెల్స్ కేంద్రాలను ఏర్పాటుచేయనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో ప్రస్తుత ప్రాజెక్టుల్లో, కొత్త వెంచర్లలో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. జియో నెట్వర్క్ను 5జీ అప్గ్రేడ్ చేసేందుకుగాను రూ.7,500 కోట్లు, రిలయన్స్ రిటైల్లో మరో రూ. 3,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని రిలయన్స్ ప్రతిపాదించింది. చదవండి: Indian Premier League: తెరపైకి మరో ప్లాన్తో టాటా..! సానుకూలంగా బీసీసీఐ..! -
ఆర్ఐఎల్కు భారీ నిధులు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) విదేశీ కరెన్సీ బాండ్ల జారీ ద్వారా 4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 30,000 కోట్లు) సమీకరించింది. తద్వారా గరిష్టస్థాయిలో ఫారెక్స్ బాండ్లను జారీ చేసిన తొలి దేశీ కార్పొరేట్గా నిలిచింది. మూడు దశలలో జారీ చేసిన ఈ బాండ్ల ద్వారా సమకూర్చుకున్న నిధులను రుణ చెల్లింపులకు వినియోగించే ప్రణాళికల్లో ఉంది. ఫిబ్రవరిలో గడువు తీరనున్న 1.5 బిలియన్ డాలర్ల రుణం దీనిలో కలసి ఉన్నట్లు తెలుస్తోంది. ఫారెక్స్ బాండ్ల ఇష్యూకి దాదాపు 3 రెట్లు అధిక రెస్పాన్స్ లభించినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. వెరసి 11.5 బిలియన్ డాలర్లమేర డిమాండ్ కనిపించినట్లు వెల్లడించింది. అతిపెద్ద ఇష్యూగా రికార్డు... ఆర్ఐఎల్ తాజా నిధుల సమీకరణ దేశంలోనే అతిపెద్ద విదేశీ కరెన్సీ బాండ్ లావాదేవీగా నమోదైంది. గతంలో పీఎస్యూ దిగ్గజం ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ 2014లో చేపట్టిన 2.2 బిలియన్ డాలర్ల ఫారెక్స్ బాండ్ల ఇష్యూ ఇప్పటివరకూ రికార్డుగా నమోదైంది. ఆర్ఐఎల్ 2.875 శాతం కూపన్ రేటుతో 10 ఏళ్ల కాలపరిమితి బాండ్ల జారీ ద్వారా 1.5 బిలియన్ డాలర్లను సమీకరించింది. ఈ బాటలో 3.625 శాతం రేటుతో 30ఏళ్ల కాలావధిగల బాండ్ల జారీ ద్వారా 1.75 బిలియన్ డాలర్లను అందుకుంది. ఇదేవిధంగా 3.75 శాతం రేటుతో 40 ఏళ్ల బాండ్ల జారీ ద్వారా 0.75 బిలియన్ డాలర్లను సమకూర్చుకుంది. జపాన్ వెలుపల బీబీబీ రేటింగ్ కలిగిన ఒక ఆసియా కంపెనీ 40 ఏళ్ల కాలపరిమితిగల డాలర్ బాండ్లను జారీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం! మూడు కాలావధులుగల ఈ బాండ్ల గడువు 2032–2062 మధ్య కాలంలో ముగియనుంది. యూఎస్ ట్రెజరీలతో వీటి కూపన్(వడ్డీ) రేట్లు అనుసంధానమై ఉన్నట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. తద్వారా వీటి కూపన్ రేట్లను ట్రెజరీలకంటే 1.2 శాతం, 1.6 శాతం, 1.7 శాతం చొప్పున అధికంగా నిర్ణయించినట్లు తెలియజేసింది. అంతేకాకుండా అతితక్కువ కూపన్ రేటుతో వీటిని జారీ చేసినట్లు తెలియజేసింది. డన్జోలో రిలయన్స్ రిటైల్కు వాటాలు 25.8 శాతం కొనుగోలు డీల్ విలువ రూ. 1,488 కోట్లు దేశీ రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్.. ఆన్లైన్ నిత్యావసర సరుకుల డెలివరీ విభాగంలో కార్యకలాపాలు విస్తరించడంపై మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా క్విక్ కామర్స్ సంస్థ డన్జోలో 25.8 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,488 కోట్లు). ప్రస్తుత ఇన్వెస్టర్లు లైట్బాక్స్, లైట్రాక్, 3ఎల్ క్యాపిటల్, అల్టీరియా క్యాపిటల్ కూడా ఈ విడతలో మరికొంత పెట్టుబడులు పెట్టాయి. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నిర్వహించే రిటైల్ స్టోర్లకు అవసరమయ్యే హైపర్లోకల్ లాజిస్టిక్స్ సర్వీసులు కూడా డన్జో అందిస్తుంది. అలాగే జియోమార్ట్ వ్యాపారుల నెట్వర్క్కు డెలివరీల సదుపాయాలు కూడా కల్పిస్తుంది. -
మీడియా ప్రచారంలోనూ రిలయన్సే నంబర్1
న్యూఢిల్లీ: ఆదాయం, లాభం, మార్కెట్ విలువ పరంగా దేశంలోనే నంబర్–1 కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. మీడియా ప్రచారంలో ఎక్కువగా కనిపించే కార్పొరేట్ సంస్థగా గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత మీడియా ప్రాచుర్యాన్ని పొందడంలో ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ ఉంది. భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మేరకు విజికీ న్యూస్ స్కోర్ రిపోర్ట్ 2021 విడుదలైంది. వార్తల్లో ప్రాధాన్యం మేరకు కంపెనీలకు విజికీ ర్యాంకులను కేటాయిస్తుంది. ప్రధాన వార్తల్లో చోటు, మొత్తం మీద ఎన్ని వార్తల్లో కనిపించాయి, ఎంతమందికి చేరువ అయింది తదితర అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయిస్తుంది. 5,000కు పైగా ప్రచురణలను పరిశీలించి.. సంస్థలకు 0 నుంచి 100 వరకు స్కోర్ కేటాయిస్తుంది. మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్కు 2021 సంవత్సరానికి కేటాయించిన స్కోరు 84.9 కావడం గమనార్హం. అంతర్జాతీయంగా చూస్తే ఫేస్బుక్ మొదటి స్థానంలో ఉంది. ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్, యాపిల్, శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్, నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా 8వ స్థానం రిలయన్స్ దేశీయంగా మొదటి స్థానంలో ఉంటే, అంతర్జాతీయంగా 8వ స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో హెచ్డీఎఫ్సీ 6వ స్థానంలో, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టీసీఎస్, మారుతి సుజుకీ ఇండియా, వొడాఫోన్ ఐడియా, ఐసీఐసీఐ బ్యాంకు వరుసగా ఉన్నాయి. ఎన్టీపీసీ 13వ ర్యాంకును సొంతం చేసుకుంది. అత్యధిక ర్యాంకును దక్కించుకున్న ప్రభుత్వరంగ సంస్థగా నిలిచింది. మీడియాలో చక్కని ప్రాధాన్యం, కవరేజీ లభించేందుకు శక్తిమంతమైన, అవగాహన కలిగిన కార్పొరేట్ కమ్యూనికేషన్ బృందం కీలకమని విజికీ పేర్కొంది. హాటెస్ట్ స్టార్టప్లు.. ‘హాటెస్ట్ స్టార్టప్లు 2021’ పేరుతో విజికీ మరో నివేదికనూ విడుదల చేసింది. భారత్లో వివిధ రంగాల్లో ప్రభావం చూపించిన టాప్–200 స్టార్టప్లకు ఇందులో చోటు కల్పించింది. ఓలా, డ్రీమ్11, స్విగ్గీ, ఓయో, ఓలా ఎలక్ట్రిక్, భారత్పే, బైజూస్, క్రెడ్, మొబిక్విక్, అన్అకాడమీ టాప్–10 హాటెస్ట్ స్టార్టప్లుగా విజికీ తెలిపింది. ఈ బ్రాండ్లకు వార్తల్లో వచ్చిన ప్రాధాన్యం ఆధారంగానే ఈ స్కోరు ఇచ్చింది. ప్రచారం విషయంలో బ్రాండ్లు ఏ స్థానంలో ఉన్నాయి, వాటి ప్రజా సంబంధాలు, కార్పొరేట్ సమాచారం బలాన్ని తెలియజయడమే తమ నివేదిక లక్ష్యమని విజీకీ సీఈవో అన్షుల్ తెలిపారు. -
2021లో నాకు సాయం చేసినవి ఇవే!: ముకేష్ అంబానీ
Mukesh Ambani.. Most Helped Five Books In 2021: ఒక చిన్నటేబుల్, ఒక కుర్చీ సెటప్తో చిన్న స్టార్టప్గా మొదలైంది రిలయన్స్. మైక్రో-ఎంటర్ప్రైజ్గా ఎదిగి.. ఇప్పుడు ఏకంగా ఇప్పుడు ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎంటర్ప్రైజ్లలో ఒకటిగా పేరు దక్కించుకుంది. గ్లోబల్ ట్రేడ్లో ఏదో ఒక మైలు రాయిని అధిగమించినప్పుడల్లా తన తండ్రి ధీరుభాయ్ అంబానీ పడ్డ కష్టమే తనకు స్ఫూర్తి అంటూ రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ చెప్తుండడం చూస్తున్నాం. అయితే కరోనా కాలంలో తనలో కొత్త ఉత్సహాన్ని నింపింది తద్వారా రిలయన్స్ ఎదుగుదలకు సాయం చేసింది కొందరి రచనలే అని ఆయన అంటున్నాడాయన. బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ డిగ్రీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ చేసిన ముకేష్.. వ్యాపార దిగ్గజాలు, మేధావులు రాసే పుస్తకాలను క్రమం తప్పకుండా చదువుతుంటారు. అంతేకాదు వాటి రివ్యూలను సైతం ఇస్తూ.. వర్తమాన వ్యాపారులకు చదవమని సూచిస్తుంటారు కూడా. 2021 బిజినెస్ ఇయర్ని అర్థం చేసుకోవడానికి.. 2022కి సన్నద్ధం కావడానికి ముకేష్ అంబానీకి ఐదు పుస్తకాలు సాయపడ్డాయట. అవేంటో చూద్దాం ఇప్పుడు.. టెన్ లెస్సన్స్ ఫర్ ఏ పోస్ట్-ప్యాండెమిక్ వరల్డ్ ఇండో-అమెరికన్ జర్నలిస్ట్ ఫరీద్ జకారియా రాసిన పుస్తకం ఇది. కోవిడ్-19 మహమ్మారి, ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని అత్యంత వినాశకరమైన సంఘటనల మధ్య కొన్ని స్పష్టమైన సారూప్యతలను సంగ్రహించి ఫరీద్ ఈ పుస్తకం రాశారు. ప్రపంచ సంక్షోభాలనేవి తరచుగా నిలకడలేని జీవనశైలి పద్ధతులు.. బలహీనమైన పాలనా నిర్మాణాల నుండి ఉద్భవించాయని చెప్తుంది ఈ పుస్తకం. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంటుందని, సమర్థవంతమైన నాయకత్వం, జీవనశైలి మార్పు, సమర్థవంతమైన అంతర్జాతీయ సహకారం ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుందని ఈ పుస్తకం చెబుతుంది. ‘‘వ్యాప్తి అనివార్యం, కానీ మహమ్మారి ఐచ్ఛికం’’ పుస్తకంలో ముకేష్కి బాగా నచ్చిన కొటేషన్ అంట!. ప్రిన్సిపుల్స్ ఫర్ డీలింగ్ విత్ ది ఛేంజింగ్ వరల్డ్ ఆర్డర్: వై నేషన్స్ సక్సీడ్ అండ్ ఫెయిల్ అమెరికన్ బిలియనీర్ ఇన్వెస్టర్ రే దాలియో రాసిన పుస్తకం ఇది. ప్రధాన దేశాలకు సంబంధించిన చరిత్రలో ఐదు వందల ఏళ్ల విజయాలను, వైఫల్యాలను స్థిరంగా పరిశీలించి.. అన్ని కోణాల్లోనూ అంశాలను స్పృశించిన ఆసక్తికరమైన పుస్తకం. ప్రస్తుతం, రాబోయే కాలాల మార్పుల మీద సమగ్రంగా చర్చ జరిపిన పుస్తకం ఇది. పాలసీ మేకర్లు, వ్యవస్థాపకులు(ఎంట్రప్రెన్యూర్లు), కార్యనిర్వాహకులు(ఎగ్జిక్యూటివ్స్) మరీముఖ్యంగా యువత తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది. ది రాగింగ్ 2020s: కంపెనీస్, కంట్రీస్, పీపుల్ అండ్ ది ఫైట్ ఫర్ అవర్ ఫ్యూఛర్ అమెరికన్ ఆథర్ అలెక్ రాస్ రాసిన పుస్తకం ఇది. ఆధునిక నాగరికతలో అనేక దశాబ్దాలు కొనసాగిన సామాజిక ఒప్పందం, ప్రభుత్వాలు, వ్యాపారాలు, ప్రజల మధ్య అనధికార ఒప్పందాలనేవి.. డిజిటల్ యుగపు ప్రాథమిక మార్పునకు ఎలా లోనయ్యాయో ఇది లోతుగా పరిశోధించింది. ఈ మార్పునకు దోహదపడ్డ రాజకీయ- ఆర్థిక శక్తులపై, నాగరికతకు ముందున్న విషయాలపై ఈ కాలపు మేధావుల అభిప్రాయాలతో ఇంటర్వ్యూలు ఉన్నాయి ఈ పుస్తకంలో. 2030: హౌ టుడేస్ బిగ్గెస్ట్ ట్రెండ్స్ విల్ కొలిడే అండ్ రీషేప్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్ స్పానిష్ సోషియాలజిస్ట్ మౌరో గుయిల్లెన్ రాసిన పుస్తకం ఇది. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ బుక్. 2030లో ప్రపంచ స్థితి గురించి, ముఖ్యంగా జనాభాలో సంభావ్య మార్పులు, దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక అవకాశాలపై ఎలా ఉంటుంది అనే విషయాలతో నిండి ఉంటుంది. కోవిడ్ అనంతర ప్రపంచాన్ని రూపొందించడానికి కట్టుబడి ఉన్న పట్టణీకరణ, సాంకేతికత, గిగ్ ఎకానమీ, ఆటోమేషన్లోని పోకడలను కూడా అన్వేషించింది. బిగ్ లిటిల్ బ్రేక్త్రోస్: హౌ స్మాల్, ఎవ్రీడే ఇన్నొవేషన్స్ డ్రైవ్ ఓవర్సైజ్డ్ రిజల్ట్స్ అమెరికన్ ఎంట్రెప్రెన్యూర్ జోష్ లింక్నర్ రాసిన బుక్ ఇది. వ్యాపారవేత్తలంతా తప్పక చదవాల్సిన బుక్ ఇది. వ్యాపారంలో భారీ లాభాలకు మూలకారణం.. సృజనాత్మకంగా చేపట్టే చిన్న చిన్న చర్యలు, నిర్ణయాలే అని ఈ బుక్ సారాంశం. రోజువారీ సూక్ష్మ-ఆవిష్కరణలను పెంపొందించడం ద్వారా, వ్యక్తులు మరియు సంస్థలు కఠినమైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. తద్వారా కోవిడ్ అనంతర ప్రపంచంలో పరివర్తన అవకాశాలను స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చు. చదవండి: క్రిప్టో కరెన్సీ బిల్లుపై ముఖేష్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు -
నాలుగు రోజుల తర్వాత లాభాలు
ముంబై: స్టాక్ సూచీలకు నాలుగు రోజుల తర్వాత గురువారం లాభాలొచ్చాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ కమిటీ నిర్ణయాలు ఇన్వెస్టర్లను మెప్పించాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రికవరీ కలిసొచ్చింది. ఐటీ షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు రాణించాయి. ఈ పరిణామాలతో సెన్సెక్స్ 113 పాయింట్లు పెరిగి 57,901 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు ఎగిసి 17,248 వద్ద నిలిచింది. ఫలితంగా సూచీల నాలుగురోజుల వరుస నష్టాలకు విరామం పడినట్లైంది. ఐటీ, ఇంధన, కన్జూమర్ షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించింది. మిగతా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల ఎక్కువగా నష్టపోయాయి. యూఎస్ ఫెడ్ చైర్మన్ పావెల్ పాలసీ కమిటీ నిర్ణయాలను బుధవారం రాత్రి ప్రకటించారు. ద్రవ్యోల్బణ కట్టడికి బాండ్ల కొనుగోళ్లను మరింత వేగవంతం చేస్తామన్నారు. అలాగే వచ్చే ఏడాది(2022)లో మూడుసార్లు., తర్వాత రెండేళ్లూ రెండుసార్లు చొప్పున వడ్డీ రేట్ల పెంపు ఉంటుందన్నారు. ఫెడ్ పరపతి నిర్ణయాలు అంచనాలకు తగ్గట్లు ఉండటంతో ప్రపంచ మార్కెట్లలో సానుకూలతలు నెలకొన్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం రాత్రి రెండున్నర లాభపడ్డాయి. ఆసియాలో ఒక్క ఇండోనేషియా గురువారం మినహా అన్ని దేశాలకు స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు రెండు నుంచి ఒకటిన్నర శాతం దూసుకెళ్లాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్... ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న సూచీలు ఉదయం భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 455 పాయింట్ల లాభంతో 58,243 వద్ద, నిఫ్టీ 152 పాయింట్లు పెరిగి 17,373 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. తొలి అరగంట కొనుగోళ్ల మద్దతు లభించడంతో మరింత ముందుకు కదిలాయి. అయితే విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి భయాలు తదితర ప్రతికూలతలతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్లో తీవ్ర ఒడుదుడుకులకు లోనయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(58,337) నుంచి 654 పాయింట్లను కోల్పోయి 57,683 వద్ద, నిఫ్టీ డే హై(17,379) నుంచి 194 పాయింట్లు పతనమై 17,185 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. చివరి గంటలో మరోసారి కొనుగోళ్ల మద్దతుల అభించడంతో సూచీలు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► మలేషియాలో సింగ్టెల్ డెలివరీ సెంటర్ను చేజిక్కించుకోవడంతో ఇన్ఫోసిస్ షేరు బీఎస్ఈలో రెండున్నర శాతం లాభపడి రూ.1,777 వద్ద స్థిరపడింది. ► రైల్వే సంస్థ నుంచి ఆర్డర్లను దక్కించుకోవడంతో సుబ్రాస్ షేరు నాలుగున్నర శాతం పెరిగి రూ.392 వద్ద ముగిసింది. ► ఇండియాబుల్ హౌసింగ్ ఫైనాన్స్ షేరు నాలుగు శాతం నష్టపోయి రూ.254 వద్ద స్థిరపడింది. సమీర్ గెహ్లాట్ పారీస్ సంస్థ తన వాటాను పదిశాతానికి తగ్గించుకోవడం షేరు పతనానికి కారణమైంది. -
సుమారు రూ. 15 వేల కోట్లు..! అబుదాబీ కంపెనీతో జతకట్టిన రిలయన్స్..! ఎందుకంటే..!
అబుదాబి ప్రభుత్వ యాజమాన్యంలోని కెమికల్స్ డెరివేటివ్స్ కంపెనీ (TA'ZIZ)తో రిలయన్స్ ఇండస్ట్రీస్ జత కట్టింది. అబుదాబిలోని రువైస్లో రసాయన ప్రాజక్టులో భాగంగా ఇరు కంపెనీలు కలిసి పనిచేయనున్నాయి. యూఎఈలో పెట్రోకెమికల్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పడానికి సంయుక్తంగా 2 బిలియన్ల డాలర్ల(సుమారు రూ. 15 వేల కోట్ల)ను పెట్టుబడి పెట్టనున్నాయి. పశ్చిమ అబుదాబిలోని రువైస్లో రసాయన ప్రాజెక్టు సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి అబుదాబి రాష్ట్ర ఇంధన దిగ్గజం (ADNOC) రాష్ట్ర హోల్డింగ్ కంపెనీ (ADQ) ఇటీవల ఏర్పరిచిన TA'ZIZ జాయింట్ వెంచర్లో రిలయన్స్ చేరనుంది. ఈ కొత్త ‘TA'ZIZ EDC & PVC’ జాయింట్ వెంచర్తో 2 బిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడితో క్లోర్-ఆల్కలీ, ఇథిలీన్ డైక్లోరైడ్ , పాలీ వినైల్ క్లోరైడ్ ఉత్పత్తి సౌకర్యాన్ని నిర్మించి, నిర్వహించనున్నాయి. యూఎఈ ఆర్థిక వ్యవస్థను బలోపేతం, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి TA'ZIZ మిషన్ మద్దతునివ్వనుంది.రెగ్యులేటరీ అనుమతులకు లోబడి జాయింట్ వెంచర్ నిబంధనలపై ఇరు కంపెనీలు సంతకం చేశాయి. ADNOC మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈవో, యూఎఈ ఇండస్ట్రీస్ మినిష్టర్ డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ , రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అధినేతల సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈ జాయింట్ వెంచర్ ప్రారంభంపై ముఖేష్ అంబానీ మాట్లాడుతూ...భారత్, యూఎఈ మధ్య దీర్ఘకాల, విలువైన సంబంధాలను మరింత సుస్థిరం చేస్తోందని అన్నారు. చదవండి: 120 సెకండ్లలో హాట్కేకుల్లా అమ్ముడైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఇవే...! -
డేటా గోప్యత, క్రిప్టో కరెన్సీ బిల్లులపై ముఖేష్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు
బిలియనీర్ ముఖేష్ అంబానీ నేడు డేటా గోప్యత, క్రిప్టోకరెన్సీ బిల్లులకు మద్దతు ఇచ్చారు. భారతదేశం అత్యంత ముందుచూపు విధానాలను అనుసరిస్తూ.. కొత్త కొత్త నిబంధనలను అమలులోకి తెస్తోందని ఆయన అన్నారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్ఎస్సీఏ) నిర్వహించిన ఇన్ఫినిటీ ఫోరంలో ఈ విషయంపై ఆయన తన అభిప్రాయలు వ్యక్తం చేశారు. దేశంలో డిజిటల్ సమాచారాన్ని ఎలా నిల్వ చేయాలి, ఎలా పంచుకోవాలో గురుంచి కఠినమైన నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉంది అని అయన అభిప్రాయపడ్డారు. వ్యూహాత్మక డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, రక్షించడానికి దేశాలకు హక్కు ఉందని అన్నారు. డేటా ఒక 'కొత్త చమురు' అని పేర్కొంటూ.. ప్రతి పౌరుడి గోప్యత హక్కును కాపాడాలని ఆయన అన్నారు. "భారతదేశం అత్యంత ముందుచూపుతో విధానాలు, నిబంధనలను అమలు చేస్తోంది. ఆధార్,డిజిటల్ బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ చెల్లింపుల ద్వారా దేశం ఇప్పటికే గొప్ప డిజిటల్ ఫ్రేమ్ వర్క్ కలిగి ఉందని ఆయన అన్నారు. మేము డేటా గోప్యతా బిల్లు, క్రిప్టోకరెన్సీ బిల్లును ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాము. మేము సరైన మార్గంలో ప్రయాణిస్తున్నాము నేను అనుకుంటున్నాను" అని ఫోరంలో పేర్కొన్నారు. చిన్న పెట్టుబడిదారులను కాపాడుతూ క్రిప్టోకరెన్సీలను ఆర్థిక ఆస్తిగా పరిగణించడానికి ప్రభుత్వం పార్లమెంటులో కొత్త బిల్లును తీసుకురావాలని చూస్తున్నందున ఫోరంలో ముఖేష్ అంబానీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. డిజిటల్ కరెన్సీలలో పెట్టుబడులకు కనీస మొత్తాన్ని చట్టం నిర్దేశించవచ్చు, అదే సమయంలో చట్టపరమైన టెండర్గా వాటి ఉపయోగాన్ని నిషేధించవచ్చు అని అన్నారు. నవంబర్ 29న ప్రారంభమైన పార్లమెంటు ప్రస్తుత శీతాకాల సమావేశాల కోసం శాసన ఎజెండా "క్రిప్టోకరెన్సీ అంతర్లీన సాంకేతికత, దాని ఉపయోగాలను ప్రోత్సహించడానికి కొన్ని మినహాయింపులు" మినహా అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే బిల్లును తీసుకురానున్నట్టు పేర్కొంది. క్రిప్టోకరెన్సీ నుంచి వచ్చే లాభాలపై పన్ను విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీలపై పూర్తి నిషేధాన్ని కోరుతోంది. ఎందుకంటే, ఇది దేశం స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుందని ఆర్బీఐ భావిస్తుంది. (చదవండి: నవంబర్లో ఎక్కువగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే!) డేటా, డిజిటల్ మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యం "డేటా, డిజిటల్ మౌలిక సదుపాయాలు భారతదేశంతో సహ ప్రపంచంలోని ప్రతి ఇతర దేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి. ఈ వ్యూహాత్మక డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, రక్షించడానికి ప్రతి దేశానికి హక్కు ఉంది" అని ఆయన అన్నారు. సరిహద్దు లావాదేవీలు, సహకారాలు & భాగస్వామ్యాలకు ఆటంకం కలిగించకుండా ఏకరీతి ప్రపంచ ప్రమాణం అవసరమని ఆయన అన్నారు. ప్రతి పౌరుడి గోప్యతహక్కును కాపాడాలని పేర్కొంటూ, సరైన విధానాలు, సరైన నియంత్రణ గల ఫ్రేమ్ వర్క్ రూపొందించి డేటా & డిజిటల్ మౌలిక సదుపాయాలను కాపాడాల్సిన అవసరం ఉంది ముఖేష్ అంబానీ అన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీని నమ్ముతున్నాను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అంబానీ ఇంకా మాట్లాడుతూ.. "నేను బ్లాక్ చైన్ టెక్నాలజీని నమ్ముతున్నాను, ఇది క్రిప్టోకరెన్సీకి భిన్నంగా ఉంటుంది" అని అన్నారు. "బ్లాక్ చైన్ ఆధారిత టెక్నాలజీ సమాజానికి చాలా ముఖ్యమైనది" అని తెలిపారు. క్రిప్టోకరెన్సీని నియంత్రించే బిల్లు పనిలో కేంద్రం ఉండగా, కరెన్సీ లేకుండా కూడా క్రిప్టోకరెన్సీలకు ఆధారమైన బ్లాక్ చైన్ టెక్నాలజీ తనంతట తానుగా ఉనికిలో ఉండవచ్చని భావించే వారిలో ఆర్ బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఉన్నారు. “బ్లాక్చెయిన్ని ఉపయోగించి, మేము అపూర్వమైన భద్రత, నమ్మకం, ఆటోమేషన్ సామర్థ్యాన్ని దాదాపు ఏ రకమైన లావాదేవీలకైనా అందించగలము” అని అంబానీ చెప్పారు. (చదవండి: టిమ్ కుక్కు కొత్త తలనొప్పులు, చివాట్లు పెడుతున్న ఐఫోన్ యూజర్లు!) -
రిలయన్స్ సబ్సిడరీకి ‘సిన్గ్యాస్’ బదిలీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ తన జామ్నగర్ సిన్గ్యాస్ ప్రాజెక్టును పూర్తి స్థాయి అనుబంధ సంస్థకు బదలాయించనుంది. ఈ ప్రాజెక్టుకు మరింత విలువను చేకూర్చడమే ఈ చర్యల ప్రధానోద్దేశమని రిలయన్స్ ప్రకటించింది. ఇంధన ఉత్పత్తిలో ఉపయోగించే ఈ సిన్గ్యాస్ (సింథసిస్ గ్యాస్) అనేది హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ అలాగే కొంత మొత్తంలో కార్బన్ డయాక్సై డ్లతో కూడిన సమ్మేళనం. ఘన హైడ్రోకార్బన్ ఇంధనాన్ని గ్యాసిఫికేషన్ చేయడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. ‘ఈ బదలాయింపు అనేది సిన్గ్యాస్ విలువను అన్లాక్ చేయడానికి తోడ్పడుతుంది అలాగే కంపెనీ ప్రధాన ఇంధన వనరుగా పునరుత్పాదకాల వైపు మళ్లడానికి సహాయపడుతుంది’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇంధన వ్యయాల్లో తీవ్ర హెచ్చుతగ్గులను తగ్గించడానికి అలాగే నమ్మకమైన ఇంధన సరఫరాకు సిన్గ్యాస్ భరోసాగా నిలుస్తోంది. జామ్నగర్ రిఫైనరీలో హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. -
ముఖేష్ అంబానీ తన ఆస్తులన్ని ఎవరి పేరిట రాశారో తెలుసా?
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్తు కోసం ఆసియాలోని అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తన వారసుడు ఎవరు అనే దాని విషయంలో ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. వారుసుల విషయంలో ఆసియాలోని ఇతర సంపన్న కుటుంబాలు చేసిన తప్పులను తను చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ముకేష్ అంబానీ కుటుంబంలో అంతర్యుద్ధం రాకుండా ఉండటానికి నిపుణులతో చర్చిస్తున్నట్లు వార్తా సంస్థ బ్లూమ్ బెర్గ్ ఒక కథనం ప్రచురితం చేసింది. బ్లూంబర్గ్ కథనం ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వారసత్వ విషయంలో ప్రణాళికలను రచిస్తున్నారు. కంపెనీ ఫైలింగ్స్ ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో అంబానీ కుటుంబం ప్రస్తుత వాటా మార్చి 2019లో ఉన్న 47.27 శాతం నుంచి 50.6 శాతానికి పెరిగింది. రిలయన్స్ వైభవం భవిష్యత్తులో కూడా తగ్గకుండా ఉండటానికి యువ తరం అంబానీలను సిద్ధం చేస్తున్నారు. జూన్ నెలలో జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం) ముఖేష్ అంబానీ ఇలా మాట్లాడారు.. "ఇషా, ఆకాశ్, అనంత్ నేతృత్వంలో రిలయన్స్ మరి౦త సుసంపన్న౦ అవుతుంది అనడంలో నాకు స౦దేహ౦ లేదు" అన్నారు. (చదవండి: రూ.10 వేల పెట్టుబడితో రూ. 2 లక్షలు లాభం!) ప్రస్తుతం అతని కవల పిల్లలు ఆకాశ్, ఇషా అంబానీలు ఇద్దరూ రిటైల్ & టెలికామ్ వ్యాపారాలలో చురుకుగా పాల్గొంటున్నారు. 2014లో వారిద్దరూ ఆర్ఐఎల్ టెలికాం, రిటైల్ వ్యాపారాల బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ప్రస్తుతం, అతని చిన్న కుమారుడు అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన జియో ప్లాట్ లిమిటెడ్లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అతను డైరెక్టర్గా రిలయన్స్ పునరుత్పాదక శక్తి, చమురు & రసాయన యూనిట్ల భాద్యతలు కూడా చూస్తున్నాడు. అంబానీ వారసత్వ ప్రణాళిక 208 బిలియన్ డాలర్ల(సుమారు రూ.15.60 లక్షల కోట్ల) విలువైన ఈ వ్యాపార సామ్రాజ్యం అన్నీ రంగాలలో విస్తరించి ఉంది. ఇదే వైభవం భవిష్యత్తులోనూ కోనసాగాలంటే పక్కా ప్లాన్, అంతకుమించిన వ్యూహం అవసరం. అందుకోసం కసరత్తు చేస్తున్న ముకేశ్ అంబానీ తాజాగా వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు శామ్ వాల్టన్ నడిచిన బాటను ఫాలో కావాలన్న యోచనలో ఉన్నట్లుగా బ్లూంబర్గ్ కథనం పేర్కొంది. ఇందుకోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భాద్యతలను దానికి పూర్తిగా అప్పగించాలని ముఖేష్ అంబానీ చూస్తున్నారు. కొత్త సంస్థలో బోర్డు సభ్యులుగా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, అతని ముగ్గురు పిల్లలు మరికొందరు కుటుంబ సభ్యులు ఉంటారు. ముఖేష్ అంబానీ సన్నిహిత సహచరులు రిలయన్స్ సామ్రాజ్యాన్ని పర్యవేక్షించే సంస్థ బోర్డులో స్థానం కల్పించానున్నారు. కంపెనీ ప్రధాన కార్యకలాపాలను పూర్తిస్థాయి ప్రొఫెషనల్స్కు అప్పగిస్తారు. వారంతా బయటవారే ఉంటారు. అంబానీ కుటుంబ అంతర్యుద్ధం రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరజ్ లాల్ హిరాచంద్ అంబానీ 1973లో రిలయన్స్ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ అంచలంచెలుగా ఎదిగింది. కానీ, 2002లో ధీరుబాయ్ అంబానీ ఆకస్మిక మరణం తర్వాత కుటుంబం అనిశ్చితిలో మునిగిపోయింది. ఆ సమయంలో ముఖేష్, అతని సోదరుడు అనిల్ అంబానీ ఇద్దరూ వ్యాపారంలో పాల్గొన్నప్పటికీ, ఒకరినొకరు అడగకుండా మరొకరు నిర్ణయాలు తీసుకువిస్తున్నారని నమ్మడంతో విభేదాలు రావడం ప్రారంభించాయి. (చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్లు, ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసా..?) కొన్ని విషయాలలో ఇద్దరూ సోదరులు ప్రధాన నిర్ణయాలపై విభేదించడంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. 2005లో వారి తల్లి కోకిలాబెన్ రిలయన్స్ ఆస్తులను విభజించడానికి ముందు ఈ అంతర్యుద్ధం మూడు సంవత్సరాలు వరకు కొనసాగింది. ముఖేష్ అంబానీకి రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, చమురు, గ్యాస్, వస్త్ర వ్యాపారాలను అందించగా.. అనిల్ అంబానీకి టెలికమ్యూనికేషన్స్, ఆస్తి-నిర్వహణ, వినోదం, విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాలకు బాధ్యతలు అప్పజెప్పింది. ఆ తర్వాత ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంచలంచెలుగా అభివృద్ది చేసి ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. వాల్టన్ కుటుంబ వారసత్వ ప్రణాళిక ప్రముఖ వాల్ మార్ట్ సంస్థ అమెరికన్ వ్యాపారవేత్త శామ్ వాల్టన్ చేత స్థాపించబడింది. ప్రస్తుతం ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్ సంస్థగా ఎదిగింది. అతని కుమారుడు రాబ్ వాల్టన్, అతని మేనల్లుడు స్ట్యూర్ట్ వాల్టన్, ఇద్దరూ వాల్ మార్ట్ బోర్డులో ఉన్నారు. సామ్ మనవడు గ్రెగ్ పెన్నర్ 2015లో కంపెనీ చైర్మన్ గా నియమితులయ్యారు. శామ్ వాల్టన్ తాను చనిపోవటానికి 40 ఏళ్ల ముందే కుటుంబ వాటాల్ని ట్రస్టుకు బదిలీ చేసి.. కుటుంబ సభ్యులకు ఆ సంస్థ బోర్డు డైరెక్టర్ బాధ్యతల్ని అప్పజెప్పారు. ఇప్పటికీ ఆ సంస్థ చీలిపోకుండా ఉందంటే అందుకు ఆయన అనుసరించిన వ్యూహమేనని నిపుణులు చెబుతారు. ఇప్పటికి వాల్ మార్ట్ సంస్థలో 47 శాతం వాటాను ట్రస్టులు, వాల్టన్ ఎంటర్ ప్రైజెస్ రూపంలో వాల్ మార్ట్ కుటుంబీకుల చేతుల్లోనే ఉండటం గమనార్హం.ఇప్పుడు అదే విధంగా, ముకేశ్ అంబానీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భాద్యతలను దానికి పూర్తిగా అప్పగించాలని చూస్తున్నారని బ్లూంబర్గ్ పేర్కొంది. -
రిలయన్స్తో డీల్ క్యాన్సల్..! భారత్ను వదులుకునే ప్రసక్తే లేదు...!
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన పెట్రో కెమికల్ వ్యాపారంలో సౌదీ ఆరామ్కో ప్రతిపాదిత పెట్టుబడుల డీల్పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. రిలయన్స్ ఓ2సీ(ఆయిల్ టూ కెమికల్స్)లో భాగంగా ఆరామ్కోతో చేసుకున్న 15 బిలియన్ డాలర్ల ఒప్పందం పూర్తిగా రద్దైనట్లుగా కన్పిస్తోంది.ఇక ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల విషయంలో సౌదీ ఆరామ్కో తమకు ప్రాధాన్య భాగస్వామిగా కొనసాగుతుందని రిలయన్స్ (ఆర్ఐఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: వారు వెంటనే రాజీనామా చేయండి: ఎలన్ మస్క్ ఆర్డర్స్ భారత్లో పెట్టుబడి పెట్టేందుకు ఎప్పుడూ సిద్దమే..! రిలయన్స్తో భారీ ఒప్పందం నిలిచిపోవడంతో సౌదీ ఆరామ్కో కంపెనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్లో పలు రంగాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఆరామ్కో వదులుకోదని కంపెనీ వెల్లడించింది. లాంగ్టర్మ్ పిరియడ్స్లో భారత్ అద్బుతమైన వృద్దిను అందిస్తోందని ఆరామ్కో అభిప్రాయపడింది. అనువైన రంగాల్లో కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ ఎప్పుడు సిద్దంగా ఉంటుందని ఆరామ్కో పేర్కొంది. చదవండి: రిలయన్స్, సౌదీ ఆరామ్కో డీల్ రద్దు -
సౌదీ ఆరామ్కోకి గుడ్బై చెప్పిన రిలయన్స్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన పెట్రోకెమికల్ (ఓ2సీ) వ్యాపారంలో సౌదీ ఆరామ్కో ప్రతిపాదిత పెట్టుబడుల డీల్ రద్దయింది. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకుని విలువను మరోసారి మదింపు చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించుకున్నాయి. ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల విషయంలో సౌదీ ఆరామ్కో తమకు ప్రాధాన్య భాగస్వామిగా కొనసాగుతుందని రిలయన్స్ (ఆర్ఐఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. 2019 ఆగస్టులో రిలయన్స్ తమ ఓ2సీ వ్యాపారం విలువను 75 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. దీన్ని ప్రత్యేక విభాగంగా కూడా విడగొట్టాలని భావించింది. నిర్దిష్ట ప్రతిపాదనల ప్రకారం ఓ2సీ విభాగంలో సౌదీ ఆరామ్కో సంస్థకు 15 బిలియన్ డాలర్లకు 20 శాతం వాటాలు విక్రయించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందుకు ముందుగా 2020 మార్చి డెడ్లైన్గా పెట్టుకుంది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తి కాగలదని ప్రకటించింది. అయితే, ఈలోగా పర్యావరణ హిత ఇంధనాల ఉత్పత్తి దిశగా కంపెనీ కొత్తగా భారీ ప్రణాళికలు ప్రారంభించడం, క్రమంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు, ఓ2సీని ప్రత్యేక విభాగంగా విడగొట్టే ప్రతిపాదనను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి రిలయన్స్ వెనక్కి తీసుకుంది. ఈ అంశాల నేపథ్యంలో తాజాగా రిలయన్స్ ఓ2సీ విభాగంలో సౌదీ ఆరామ్కో పెట్టుబడుల ప్రతిపాదన రద్దు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిలయన్స్ బ్రాండ్స్తో వెస్ట్ ఎల్మ్ జట్టు.. ఫర్నిచర్, హోమ్ డెకరేషన్ ఉత్పత్తుల సంస్థ వెస్ట్ ఎల్మ్ తాజాగా భారత మార్కెట్లో ప్రవేశించింది. ఇందుకోసం రిలయన్స్ బ్రాండ్స్తో చేతులు కలిపింది. జియో వరల్డ్ డ్రైవ్లో తొలి స్టోర్ను అక్టోబర్లో ప్రారంభించగా, గత వారం రెండో స్టోర్ను గుర్గావ్లో ఆరంభించింది. అటు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ ఆశీష్ షాతో కూడా జట్టు కట్టింది. రిలయన్స్ బ్రాండ్స్ ఇప్పటికే దాదాపు 35 అంతర్జాతీయ బ్రాండ్స్ను దేశీ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు చెందిన ఎంఎం స్టైల్స్లో 40 శాతం వాటాలు కొనుగోలు చేసింది. -
ఇల్లు కోసం కొనలేదు.. హెరిటేజ్ ప్రాపర్టీగా!
ముంబై: భారతీయ అపరకుభేరుడు, అసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ లండన్లోని బకింగ్ హామ్లో గల స్టోక్ పార్క్లో 300 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ 300 ఎకరాల స్థలంలో ఉన్న 49 బెడ్ రూమ్లు ఉన్న ఇంటిని ప్రత్యేకంగా రూ.592 కోట్లతో సొంతం చేసుకున్నట్లు మీడియాలో వస్తున్నాయి. లండన్లోని స్టోక్ పార్క్లో నివాసం ఉండనున్నట్లు ఒక వార్తాపత్రికలో ఇటీవలి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఆ కంపెనీ స్పందించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీకి, అతని కుటుంబానికి లండన్/ప్రపంచంలో మరెక్కడా నివసించాలనే ప్రణాళికలు లేవని స్పష్టం కంపెనీ చేసింది. ఇంకా, ఇటీవల స్టోక్ పార్క్ ఎస్టేట్ను కొనుగోలు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ అక్కడి ప్లానింగ్ మార్గదర్శకాలు, స్థానిక నిబంధనలను పూర్తిగా పాటిస్తూనే.. హెరిటేజ్ ప్రాపర్టీని కోనుగోలు చేసినట్లు పేర్కొంది. దానిని ప్రధాన గోల్ఫింగ్ కేంద్రంగా, స్పోర్టింగ్ రిసార్ట్గా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేసింది. అదే సమయంలో భారతదేశ ప్రఖ్యాత హాస్పిటాలిటీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని చూస్తునట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: ఎన్ఎఫ్టీ అమ్మకాల్లో అమితాబ్ బచ్చన్ రికార్డు!) -
నవంబర్ 5న జియో వరల్డ్ డ్రైవ్ ప్రారంభం!
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ప్రీమియం రిటైల్ షాపింగ్ మాల్ జియో వరల్డ్ డ్రైవ్(JWD)ను ఆవిష్కరించింది. ముంబైలోని వాణిజ్య కేంద్రమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో దీన్ని ఏర్పాటు చేశారు. మేకర్ మాక్సిటీ వద్ద 17.5 ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. జియో వరల్డ్ డ్రైవ్ ముంబైలో సరికొత్త ఆవిష్కరణ అని చెప్పొచ్చు. ఈ ప్రాంగణంలో 72 ప్రముఖ అంతర్జాతీయ, భారతీయ బ్రాండ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాపులరైన 27 ఫుడ్ ఔట్లెట్స్ ఉన్నాయి. ఇది ముంబైలోని తొలి మొదటి అంతస్థులో ఉండే డ్రైవ్ ఇన్ థియేటర్. ఇది ఓపెన్ ఎయిర్ వీకెంట్ కమ్యూనిటీ మార్కెట్. భారతదేశంలో అత్యుత్తమ గ్లోబల్ సౌకర్యాలను కల్పించాలని, భారతదేశంలోని అత్యుత్తమమైన వాటిని ప్రపంచానికి ప్రదర్శించాలనే దృక్పథంతో దీనిని రూపొందించారు. ఈ ప్రాంగణం భారతీయ, అంతర్జాతీయ ప్రజల అత్యంత విభిన్న కళలను గుర్తు చేస్తుంది. ప్రఖ్యాత కళాకారులు, వినియోగదారులను సృజనాత్మకత, కళాత్మక దృశ్యమాన చట్రంలో కనువిందు చేస్తున్నాయి. ముంబై స్ఫూర్తిని, ఇక్కడి అనేక విచిత్రాలను హైలైట్ చేసే వ్యక్తీకరణలు కూడా ఇక్కడ ఉంటాయి. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్-ఎయిర్ రూఫ్టాప్ థియేటర్ జియో వరల్డ్ డ్రైవ్(JWD)ను నవంబర్ 5న తెరవనున్నారు. (చదవండి: దేశీయ ఈవీ మార్కెట్లో చైనా కారు విడుదల.. రేంజ్ ఎంతో తెలుసా?) పీవీఆర్ నిర్వహిస్తున్న జియో డ్రైవ్-ఇన్ 290 కార్లతో పట్టణంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్ను కలిగి ఉంది. తమ స్వంత కారులో కూర్చొని సినిమాలు చూడవచ్చు. కొత్త కాన్సెప్ట్ 6 అత్యాధునిక మల్టీప్లెక్స్ థియేటర్లు, ప్రివ్యూతో ప్రారంభించబడింది. వీఐపీలకు, అతిథులకు థియేటర్లో ప్రత్యేక ప్రవేశం ఉంటుంది. హోమ్ డెకర్ బెహెమోత్- వెస్ట్ ఎల్మ్, హామ్లీస్ గ్లోబల్-ఫస్ట్ కాన్సెప్ట్ స్టోర్ హామ్లీస్ ప్లే కూడా ఇక్కడ ఉంటుందని తెలిపారు. దీన్ని ప్రఖ్యాత ఆర్కిటెక్ డిజైనర్లు రాస్ బోన్థోర్న్, ఆండీ లాంపార్డ్ డిజైన్ చేశారు. జియో వరల్డ్ డ్రైవ్ ముఖభాగం ఫ్రెంచ్ కాన్సెప్ట్ న్యూజ్, ఇది క్లౌడ్ లాంటి నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ విస్తరించిన స్కైలైట్తో హై స్ట్రీట్ అనుభవం లభిస్తుంది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనిల్ అంబానీ దంపతులు
సాక్షి, తిరుమల: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత అనీల్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. టీటీడీ అధికారులు అనీల్ అంబానీకి దర్శన ఏర్పాట్లు చేసారు. చదవండి: (ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల)