
భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన 'ముఖేష్ అంబానీ' ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గడుపుతారని అందరికీ తెలుసు. వీరు విలాసవంతమైన నివాసంలో ఉంటూ.. ఖరీదైన కార్లను ఉపయోగిస్తుంటారు. ఇవి కాకుండా ఈయన వెయ్యి కోట్ల రూపాయల ఓ ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారు.
ముకేశ్ అంబానీ కొనుగోలు చేసిన ప్రైవేట్ జెట్ బోయింగ్ 737 మ్యాక్స్ 9. దీని విలువ రూ.1000 కోట్లు ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు ఇంత ఖరీదైన విమానం భారతదేశంలోని ఏ వ్యాపారవేత్త దగ్గరా లేదు. దీంతో అత్యంత ఖరీదైన విమానం కలిగిన వ్యాపారవేత్తగా అంబానీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.
బోయింగ్ 737 మ్యాక్స్ 9 ప్రైవేట్ జెట్ను.. వాషింగ్టన్లోని రెంటన్లోని బోయింగ్ ఉత్పత్తి కేంద్రంలో తయారు చేసి ఇండియాకు డెలివరీ చేశారు. బోయింగ్ చుట్టూ ఉన్న వివాదాల కారణంగా డెలివరీ కాస్త ఆలస్యం అయింది. మొత్తానికి అంబానీ భారతదేశపు మొట్టమొదటి బోయింగ్ 737 MAX 9 యజమానిగా నిలిచారు.
ఇదీ చదవండి: అమాంతం పెరిగిపోతున్న బంగారం ధరలు: నాలుగు రోజుల్లో..
బోయింగ్ 737 మ్యాక్స్ 9 ప్రైవేట్ జెట్ను ముకేశ్ అంబానీ ప్రేత్యేకంగా తయారు చేసుకున్నారు. ఈ జెట్ మాత్రమే కాకుండా.. బాంబార్డియర్ గ్లోబల్ 6000, ఎంబ్రేయర్ ERJ-135, రెండు డస్సాల్ట్ ఫాల్కన్ 900 వంటి తొమ్మిది ప్రైవేట్ విమానాలు అంబానీ వద్ద ఉన్నాయి.