ఇషా అంబానీకి ఆరేళ్లున్నప్పటినుంచీ..తొలి ఫీజు రూ. 25లే : వీణా | Celebrity mehendi artist Veena Nagda First Fee Was Rs. 25 At The Ambani familyis | Sakshi
Sakshi News home page

ఇషా అంబానీకి ఆరేళ్లున్నప్పటినుంచీ..తొలి ఫీజు రూ. 25లే : వీణా

Published Sat, Aug 31 2024 8:00 PM | Last Updated on Sat, Aug 31 2024 8:00 PM

Celebrity mehendi artist Veena Nagda  First Fee Was Rs. 25 At The Ambani familyis

అంబానీలతో 38 ఏళ్ల అనుబంధం  - మెహిందీ ఆర్టిస్ట్‌ వీణా నగ్దా

కోకిలాబెన్‌ నుంచి నీతా అంబానీ వరకు ప్రత్యేక అనుబంధం

సెలబ్రిటీ మెహందీ కళాకారిణి, వీణా నగ్దా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తనదైన ప్రత్యేక మెహందీ కళతో  సెలబ్రిటీ వధువుల  ఫస్ట్‌ ఆప్షన్‌  ఆమె. బాలీవుడ్ క్వీన్స్‌ అందాల హీరోయిన్‌ శ్రీదేవి మొదలు ఈతరం దీపికా పదుకొనే, అలియా భట్, ట్వింకిల్ ఖన్నా, కృతి ఖర్బందా దాకా ఆమే హాట్‌ ఫ్యావరేట్‌. పలు బాలీవుడ్ సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. వీణా. అంతేకాదు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ కుటుంబంతో ఆమెకు సుదీర్ఘం అనుబంధం ఉంది. అంబానీలతో తన 38 ఏళ్ల అనుబంధం గురించి ప్రస్తావించిన వీణా రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌ నీతా అంబానీపై ప్రశంసలు కురిపించడం విశేషం.

వీణా నగ్దా మెహందీ ఆర్ట్‌పై తన  తనకున్న ప్రేమను వివరించడంతోపాటు, 38 ఏళ్ల  అంబానీ కుటుంబంలో కోకిలాబెన్ అంబానీ నుండి నీతా అంబానీ వరకు తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అంబానీ కుటుంబంలో  రెండు చేతుల నిండా నిండుగా గోరింటాకు పెట్టినందుకు తీసుకున్నతొలి రెమ్యునరేషన్‌ రూ, 25 రూపాయలట. ఆ సమయంలో ముఖేష్‌ అంబానీ కోకిలాబెన్‌ ఫోన్‌ నెంబరు, కార్డు ఉండాలని  సలహా ఇచ్చాడు. దీంతో ఆమె సలహా పాటించినట్టు వీణా తెలిపారు. తనను ఎంతో మెచ్చుకునేవారని ఆమె చెప్పారు.  అంతేకాదు అంబానీ ఇంటికి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు, ఎక్కువ ఫీజు వసూలు చేయాలని సూచించారట పొరుగింటివారు. కానీ తాను ఎన్నడూ అలాగ చేయ లేదని వెల్లడించింది. అంబానీలతో కలిసి పని చేయడమే గొప్ప అవకాశంగా భావించి సాధారణ కస్టమర్‌ల నుంచి పొందే ఛార్జీనే తీసుకోవాలని తన తల్లి కోరిందట. ఆ సలహా తనకు ఎప్పుడూ గుర్తుండేదంటూ చెప్పుకొచ్చారు.

ఇషాకు ఆరేళ్లప్పటినుంచి  గోరింటాకు పెడుతున్నా
ఇషా అంబానీ , శ్లోకా మెహతాకు 6 సంవత్సరాల వయస్సులో గోరింటాకు వారి చేతులను అలంకరించిన విషయాన్ని వీణా నగ్దా గుర్తు చేసుకుంది ఇషాకు ఆరేళ్ల వ‌య‌సు ఉన్న‌ప్ప‌టి నుంచి వీణా న‌గ్దాను మెహందీ ఆర్టిస్ట్‌గా ఉన్నారు. ధీరూభాయ్ అంబానీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి తాను హాజరయ్యానని, ఆయన కుమార్తెల చేతులకు కూడా మెహందీ పెట్టానని తెలిపింది. అప్పుడు శ్లోకాకి కూడా ఆరేళ్లు అని కూడా వీణా  గుర్తు చేశారు. వారంతా చదువుల కోసం సింగపూర్‌లో ఉండేవారికి ఇంటికి  వచ్చినప్పుడల్లా మెహందీ పార్టీలు చేసుకునే వారని వివరించారు.

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024, మెహిందీ  ఆర్ట్‌
పారిస్ ఒలింపిక్స్ 2024కి  ఆహ్వానించినపుడు తానెంతో  పొంగిపోయానని, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటేందుకు నీతా అంబానీ చేసిన పనికి థ్రిల్ అయ్యానని వీణా వెల్లడించింది.  పారిస్‌ ఒలింపిక్స్‌లో ఇండియన్ హౌస్‌లోని మెహందీ స్టాల్ గురించి మాట్లాడటం,  ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది ఒలింపిక్‌ రింగ్‌ను మెహందీ డిజైన్‌ వేయించుకోవడం గురించి కూడా ప్రస్తావించారు. 'మెహెందీ క్వీన్ ఆఫ్ బాలీవుడ్' అని ట్యాగ్ ఇచ్చిన  బాలీవుడ్‌ నిర్మాత కరణ్ జోహార్ తన కళకు విస్తరణకు అందించిన సహాయాన్ని  కూడా వీణా గుర్తు చేసుకున్నారు.



 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement