Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

GitLab Cuts Jobs Globally Double Down AI Expands Hiring in India Tech Layoff Wave1
ఏఐ కోసం 30 శాతం సిబ్బందిపై వేటు..

అంతర్జాతీయ టెక్ రంగంలో ఉద్యోగాల కోత పరంపర కొనసాగుతోంది. ప్రముఖ అమెరికన్ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘గిట్‌ల్యాబ్’ తన మొత్తం శ్రామిక శక్తిలో ఏకంగా 30 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పెట్టుబడులను పెంచడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. అయితే, ఒకవైపు గ్లోబల్ స్థాయిలో తొలగింపులు జరుగుతున్నా భారత్‌లో మాత్రం కొత్త నియామకాలకు కంపెనీ మొగ్గు చూపుతుండటం గమనార్హం.ఏఐ కోసం పునర్నిర్మాణంజనవరి 2026 నాటికి గిట్‌ల్యాబ్‌లో మొత్తం 2,580 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా ప్రకటించిన 30 శాతం కోత ప్రకారం వందలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కంపెనీ సీఈఓ బిల్ స్టేపుల్స్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో ఈ మార్పులను ధ్రువీకరించారు. ‘ఏజెంటిక్ ఏఐ యుగంలో మాకున్న ప్రత్యేక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వ్యయ నియంత్రణ ద్వారా వచ్చే పొదుపును తిరిగి ఏఐ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు.ఈ పునర్నిర్మాణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని, ఇందులో భాగంగా వాలంటరీ సెవరెన్స్ విండో (స్వచ్ఛంద విరమణ) అవకాశం కూడా కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 1, 2026 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.భారత్‌పై గిట్‌ల్యాబ్ ఆసక్తిప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తగ్గించుకుంటున్నప్పటికీ భారత్‌లో మాత్రం గిట్‌ల్యాబ్ విస్తరణకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం లింక్డ్‌ఇన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో భారతదేశానికి సంబంధించి 20కి పైగా ఉద్యోగ ప్రకటనలను కంపెనీ పోస్ట్ చేసింది. అందులో ఫార్వర్డ్ డిప్లాయ్‌డ్ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్, కస్టమర్ సక్సెస్ ఇంజినీర్ వంటి పాత్రలున్నాయి. ఈ ఉద్యోగాలన్నీ రిమోట్ (ఇంటి నుంచే పని) పద్ధతిలో ఉండటం విశేషం. గిట్‌ల్యాబ్ తన కార్యకలాపాలు సాగించే దేశాల సంఖ్యను తగ్గించుకుని భారత్, అమెరికా వంటి కీలక మార్కెట్లపై దృష్టి సారించడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.నిజమైన పెట్టుబడా? తొలగింపులకు సాకా?గిట్‌ల్యాబ్ నిర్ణయంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఏఐ ఏజెంట్ల గురించి వ్యాసాలు రాస్తూ, మరోవైపు సిబ్బందిని తొలగించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ అన్నట్లుగా.. కొన్ని కంపెనీలు తమ అసమర్థతను దాచుకోవడానికి లేదా ఖర్చు తగ్గించుకోవడానికి ఏఐని ఒక సాకుగా వాడుతున్నాయా? అనే సందేహాలను నిపుణులు లేవనెత్తుతున్నారు. ‘ఇది వాస్తవంగా ఏఐ కోసం చేస్తున్న మార్పా? లేక 2026లో ఏఐ పేరు చెప్పి చేస్తున్న సాధారణ తొలగింపా?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.మెటా, అమెజాన్ వంటి దిగ్గజాల బాటలోనే గిట్‌ల్యాబ్ పయనిస్తున్నప్పటికీ వ్యూహాత్మకంగా భారత్ వంటి దేశాల్లో నియామకాలు చేపట్టడం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు స్వల్ప ఊరటనిచ్చే అంశం. ఏది ఏమైనా టెక్ ప్రపంచంలో మనుషుల స్థానాన్ని యంత్రాలు (ఏఐ) భర్తీ చేస్తున్నాయా అనే చర్చకు గిట్‌ల్యాబ్ తాజా నిర్ణయం మరింత ఆజ్యం పోసింది.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన

India Russian Crude Imports Drop in April Amid Refinery Halt Price Surge2
రష్యా నుంచి తగ్గిన చమురు దిగుమతులు

రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు ఏప్రిల్‌లో 15 శాతం తగ్గినట్లు ‘సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌’ (సెరా) వెల్లడించింది. మార్చిలో €5.3 బిలియన్‌ యూరోల విలువైన ముడి చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోగా, ఏప్రిల్‌లో €4.5 బిలియన్ల యూరోలకు తగ్గాయి. నయారా ఎనర్జీకి చెందిన వాదినార్‌ రిఫైనరీలో ఉత్పత్తిని నిర్వహణ పనుల వల్ల నిలిపివేయడం ఇందుకు ప్రధాన కారణమని సెరా తెలిపింది. ఏప్రిల్‌లో రష్యా చమురు విషయంలో చైనా తర్వాత భారత్‌ రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది.మొత్తం మీద ఏప్రిల్‌లో రష్యా నుంచి హైడ్రోకార్బన్ల కొనుగోలు (ముడి చమురు, గ్యాస్‌) 5 బిలియన్‌ యూరోలుగా ఉంది. ఇరాన్‌తో అమెరికా యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగిపోవడమే కాకుండా హర్మూజ్‌ జలసంధి మూసివేతతో సరఫరాలు తగ్గిపోవడం తెలిసిందే. దీంతో ధరలను తగ్గించేందుకు గాను రష్యా చమురు నౌకలపై అమెరికా ఆంక్షలు సడలించడంతో ప్రభుత్వ రంగ రిఫైనరీలు మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించాయి.రష్యా యూరల్స్‌ ముడి చమురు ధర ఏప్రిల్‌లో బ్యారెల్‌కు 112.3 డాలర్లకు చేరింది. ఐరోపా నిర్దేశించిన గరిష్ట ధర 44.1 డాలర్లు కంటే రెండింతలు ఎక్కువ కావడం గమనార్హం. భారత్, టర్కీ వంటి దేశాల్లో శుద్ధి చేసిన రష్యా చమురు ఉత్పత్తులు తిరిగి ఐరోపా దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకే ఎగుమతి అవుతున్నట్టు సెరా తెలిపింది.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన

Gen Z Entrepreneurs Redefine Success Build Multiple Income Streams AI Power3
జెన్‌ జెడ్‌ పారిశ్రామికవేత్తలు చాలా స్మార్ట్‌

యువ పారిశ్రామికవేత్తలు ఎంతో స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక్క విభాగానికి పరిమితం కాకుండా ఒకటికి మించిన ఆదాయ మార్గాలతో విజయాల మోత మోగిస్తున్నారు. దాదాపు 75 శాతం మంది జెన్‌ జెడ్‌ పారిశ్రామికవేత్తలు (1997–2012 మధ్య జన్మించిన వారు) ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులను కలిగి ఉన్నట్టు లింక్డ్‌ఇన్‌ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. పాత తరంతో పోలిస్తే నేటి యువత మరింత సరళతర పని నమూనాల వైపు అడుగులు వేస్తున్నారు. జెన్‌ జెడ్‌లో ప్రతీ నలుగురిలో ముగ్గురు (75 శాతం) తమకు ఒకటికి మించి ఆదాయ వనరులున్నట్టు చెప్పారు. జెన్‌ ఎక్స్‌ (1965–1980 కాలంలో జన్మించిన వారు)లో కేవలం 62 శాతం మందికి మాత్రమే ఒకటికి మించిన ఆదాయ వనరులు ఉన్నాయి. వృత్తిపై పూర్తి నియంత్రణ సాధించడంతో పాటు, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ తరం తమ కెరీర్‌ను మలుచుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వ్యాపార ధోరణులకు భారత్‌ నిదర్శనంగా నిలుస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. గడిచిన ఏడాది కాలంలో భారత్‌లో తమ ప్రొఫైల్‌లో ‘వ్యవస్థాపకుడు’ అని జోడించుకున్న వారి సంఖ్య 104 శాతం పెరిగింది. ఏ ఇతర దేశంతో పోల్చినా భారత్‌లోనే ఇది అధికమని ఈ నివేదిక తెలిపింది. 500 మంది చిన్న వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధిలోని వారిని ప్రశ్నించి లింక్డ్‌ఇన్‌ ఈ వివరాలు రూపొందించింది. వ్యయాలు, అనుభవం లేకపోవడం వంటి సంప్రదాయ అవరోధాలను ఏఐ, డిజిటల్‌ టూల్స్‌ తగ్గిస్తున్నాయి. దీని వల్ల వ్యాపారం ప్రారంభించడం కొత్త తరానికి సులభతరంగా మారింది. 85 శాతం మంది యువ వ్యవస్థాపకులు తమ వ్యాపార వృద్ధికి ఏఐ ఎంతో కీలకమని భావిస్తున్నారు. తమ నేపథ్యంతో సంబంధం లేకుండా పారిశ్రామికేవేత్తలుగా అవతరించే అవకాశాలు ప్రస్తుం ఉన్నట్టు 80 శాతం మంది చెప్పారు. గతంతో పోలి్చతే నేడు మరింత సులభతరం అయినట్టు 81 శాతం మంది తెలిపారు. భారత్‌లో జెన్‌జెడ్‌ విజయం అంటే కేవలం డబ్బు అనుకోవడం లేదు. 64 శాతం మంది స్వేచ్ఛ, సౌలభ్యం, 56 శాతం వ్యక్తిగత అభివృద్ధి, 55 శాతం మంది ఆర్థిక సంపదను నిజమైన విజయంగా భావిస్తున్నారు. వీటిని సాధించేందుకు రిస్క్‌ తీసుకునేందుకూ వెనుకాడడం లేదు. ఏఐతో అందరికీ అవకాశాలు..‘‘ఒకప్పుడు అసాధ్యం అనుకున్న వ్యాపార కలలను నేడు ఏఐ నిజం చేస్తోంది. ఒకే ఉద్యోగానికి పరిమితం కాకుండా, రకరకాల ఆదాయ మార్గాలను సృష్టించుకునేందుకు, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తోంది’’ అని లింక్డ్‌ఇన్‌ భారత మేనేజర్‌ కుమారేష్‌ పట్టాభిరామన్‌ పేర్కొన్నారు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన

Bharti Airtel Q4 Profit Falls Revenue Surges Dividend Announced4
సౌండ్‌ తగ్గిన ఎయిర్‌టెల్‌

మొబైల్‌ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 34 శాతం క్షీణించి రూ. 7,325 కోట్లకు పరిమితమైంది. ఇందుకు ప్రధానంగా చట్టబద్ధ పన్ను లయబిలిటీలకు చేపట్టిన వన్‌టైమ్‌ కేటాయింపులు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో రూ.11,022 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 24 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది.మొత్తం ఆదాయం మాత్రం 16 శాతం ఎగసి రూ. 55,383 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 47,876 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఆదాయంలో దేశీ విభాగం నుంచి 8 శాతం వృద్ధితో రూ. 39,566 కోట్లు లభించింది. మొబైల్‌ సరీ్వసుల విభాగం నుంచి దీనిలో రూ. 28,831 కోట్లు లభించింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 245 నుంచి రూ. 257కు మెరుగుపడింది. ఇది 5 శాతం వృద్ధికాగా.. పెట్టుబడి వ్యయాలు 12 శాతం పెరిగి రూ. 16,066 కోట్లుగా నమోదయ్యాయి. పోస్ట్‌పెయిడ్‌ విభాగంలో 8 లక్షల కస్టమర్లు జత కలవడంతో ఈ సంఖ్య 2.9 కోట్లకు చేరింది.పూర్తి ఏడాదికి..మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎయిర్‌టెల్‌ నికర లాభం 20 శాతం నీరసించి రూ. 26,995 కోట్లకు చేరింది. 2024–25లో రూ. 33,556 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 22 శాతం జంప్‌చేసి రూ. 2,10,973 కోట్లను తాకింది. వెరసి తొలిసారి ఆదాయం రూ. 2 లక్షల కోట్లను దాటడంతోపాటు.. 66.5 కోట్ల కస్టమర్ల మార్క్‌ను అధిగమించిన దేశీ కంపెనీగా నిలిచినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌చైర్మన్‌ గోపాల్‌ విఠల్‌ పేర్కొన్నారు. పూర్తిఏడాదికి కంపెనీ పెట్టుబడి వ్యయాలు స్వల్పంగా తగ్గి రూ. 47,522 కోట్లకు చేరాయి. నికర రుణ భారం రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 1.65 లక్షల కోట్లకు తగ్గింది.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన

Duty Advantage Dubai to Become Indias Primary Gold Gateway5
బంగారానికి ఇక దుబాయే దిక్కు!

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా దుబాయ్‌ నుంచి పసిడి, వెండి దిగుమతులు పెరిగే అవకాశం ఉందని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్ సంస్థ (జీటీఆర్‌ఐ) తెలిపింది. 2022లో 120 టన్నులతో మొదలైన కోటా 2027లో 200 టన్నులకు పెరగనుంది. ఇది భారత్‌ పసిడి దిగుమతుల్లో నాలుగో వంతుకు సమానం. కొత్త ఎంఎఫ్‌ఎన్‌ టారిఫ్‌ 15 శాతంగా ఉండగా, దుబాయ్‌ నుంచి దిగుమతులకి 14 శాతానికి పరిమితమవుతుందని జీటీఆర్‌ఐ పేర్కొంది. ఒక్క శాతం వ్యత్యాసం ప్రయోజనం పొందేందుకు దుబాయ్‌ మార్గం ద్వారా వ్యాపారులు పసిడిని మరింతగా దిగుమతి చేసుకునే అవకాశం ఉందని వివరించింది. సుంకాలు ఇలా .. 2012కి ముందు విలువతో సంబంధం లేకుండా 10 గ్రాములకు రూ. 300 చొప్పున సుంకం ఉండేది. 2012 జనవరిలో బంగారం విలువలో 2 శాతం కస్టమ్స్‌ సుంకం విధించారు. అదే ఏడాది మార్చిలో బడ్జెట్‌లో 4 శాతానికి పెంచారు. 2013లో రుపాయి మారకం, విదేశీ మారకం నిల్వలు పడిపోయిన కారణాలతో పసిడిపై దిగుమతి సుంకాలు మూడు సార్లు పెరిగాయి. మొదట 4 నుంచి 6 శాతానికి, తర్వాత 8 శాతానికి, ఆ పైన 10 శాతానికి పెరిగాయి. 2014–18 మధ్యకాలంలో 10 శాతమే అమల్లో ఉండగా, 2019లో దాన్ని 12.5 శాతానికి పెంచారు. 2021 బడ్జెట్‌లో 10.75 శాతానికి తగ్గించి, మళ్లీ 2022లో 15 శాతానికి పెంచారు. 2024లో దేశీయంగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 6 శాతానికి తగ్గించారు. ప్రత్యామ్నాయాల్లేవా..?2014లో మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ సర్కారు కొలువైన తర్వాత భౌతిక రూపంలో పసిడి దిగుమతులు తగ్గించేందుకు కొన్ని ప్రయత్నాలు చేసింది అవేంటంటే..ప్రభుత్వ గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌ 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ఇళ్లలో ఉన్న నిరుపయోగ బంగారాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నది ఈ పథకం లక్ష్యం. భౌతిక రూపంలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తే, ఆ విలువపై 2.25–2.5 శాతం రాబడిని ఆఫర్‌ చేశారు. భౌతిక బంగారంపై భారతీయులకు ఉన్న మక్కువ వల్ల ఆశించిన స్పందన రాలేదు. దీంతో 2025లో ఈ పథకాన్ని నిలిపివేశారు. సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ (ఎస్‌జీబీ) భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2015లో సార్వభౌమ బంగారం బాండ్లకు శ్రీకారం చుట్టింది. 8 ఏళ్ల కాలవ్యవధి. బాండ్‌ కొనుగోలు ధరపై ఏటా 2.5 శాతం వడ్డీ ఎనిమిదేళ్ల పాటు రాబడిగా అందుతుంది. దీంతో ఈ పథకం విజయవంతమైంది. 8 ఏళ్ల కాలవ్యవధి తర్వాత నుంచి బాండ్లు క్రమంగా మెచ్యూరిటీకి రావడం.. ఈ కాలంలో పసిడి ధరలు గణనీయంగా పెరిగిపోవడంతో ప్రభుత్వంపై చెల్లింపుల భారం భారీగా పెగిపోయింది. పెట్టుబడిపై 150–200 శాతం అధికంగా చెల్లించాల్సి వచి్చంది. దీంతో 2025 నుంచి అనధికారికంగా ఈ పథకానికీ ప్రభుత్వం గుడ్‌బై చెప్పింది. ఈటీఎఫ్‌లు బంగారం, వెండి ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌లు), డిజిటల్‌ గోల్డ్‌ తదితర డిజిటల్‌ సాధనాల్లోనూ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ, కొనుగోలు విలువకు సరిపడా భౌతిక లోహాలను ఫండ్స్‌ సంస్థలు సమకూర్చుకుని ఖజానాల్లో భద్రపరచాల్సి ఉంటుంది. కనుక ఒక రకంగా భౌతికంగా ఆ మేరకు కొనుగోలు చేయాల్సిందే. కానీ, ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు దేశీయంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న బంగారాన్ని బ్యాకెండ్‌గా వినియోగించుకుంటే విదేశాల నుంచి అదనంగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బంగారం, వెండి డిజిటల్‌ రూపంలో ఉంటే కావాల్సినప్పడు విక్రయించి, కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. దీంతో చలామణి పెరుగుతుంది. పసిడిపై సుంకాల విధింపు దేశీయంగా గోల్డ్, సిల్వర్‌ ఈటీఎఫ్‌లకి సానుకూలంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Google techie spends RS 2 8 lakh every month to fly for work6
విమానమెక్కి ఆఫీసుకి.. నెలకు రూ. 2.8 లక్షల ఖర్చు!

సాధారణంగా ఉద్యోగులు ఆఫీసుకి వెళ్లాలంటే బైకో, కారో లేదా మెట్రో రైలో ఎక్కుతారు. కాస్త ట్రాఫిక్ ఎక్కువైతేనే విసిగిపోతుంటారు. కానీ, ఈ గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కథ వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. తన వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఆయన ఏకంగా ఒక నగరం నుండి మరో నగరానికి విమానంలో ప్రయాణిస్తూ ‘సూపర్ కమ్యూటర్’గా వార్తల్లో నిలిచారు. గూగుల్ సంస్థలో ‘ఫ్లో-AI’ (ఇమేజ్ అండ్‌ వీడియో జనరేషన్) విభాగంలో పనిచేస్తున్న హాంగ్ (జాసన్) వై, తన వినూత్న జీవనశైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.ప్రేమ కోసం సాహసోపేత నిర్ణయంఈ కఠినమైన ప్రయాణాల వెనుక ఒక బలమైన కారణం ఉంది. వై బే ఏరియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో చేరాలని ఆశపడ్డారు. అయితే, ఆయన జీవిత భాగస్వామి సీటెల్‌లోని అమెజాన్ కార్యాలయంలో మంచి కెరీర్ వృద్ధిలో ఉన్నారు. "ఆమె కెరీర్‌ను దెబ్బతీయకుండా, నా వృద్ధిని కొనసాగిస్తూనే మా బంధాన్ని కాపాడుకోవడానికి నేను తీసుకున్న నిర్ణయమే ఈ ‘ఫ్లైట్ కమ్యూటింగ్’" అని వై పేర్కొన్నారు.షెడ్యూల్, ఖర్చుల లెక్కలు ఇలా..ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబం ఏడాదికి సంపాదించే మొత్తాన్ని ఈయన తన ప్రయాణాల కోసం నెలకే ఖర్చు చేస్తున్నారు. ప్రతి సోమవారం లేదా మంగళవారం సీటెల్ నుండి శాన్ జోస్ (కాలిఫోర్నియా)కు విమాన ప్రయాణం. తిరిగి గురువారం లేదా శుక్రవారం మళ్లీ సీటెల్ పయనం. ఇదీ వై షెడ్యూల్.రెండు నగరాల్లో ఇంటి అద్దెలు, విమాన టిక్కెట్లు, ఉబర్ ఛార్జీలు, కాలిఫోర్నియా పన్నులు కలిపి నెలకు సుమారు 3,000 డాలర్లు (సుమారు రూ.2.8 లక్షలు) ఖర్చు అవుతోంది. "సౌకర్యం కంటే ఎదుగుదలను ఎంచుకోవాలి" అనే సిద్ధాంతాన్ని వై నమ్ముతారు. 16 ఏళ్ల వయసులో దక్షిణ కొరియా నుండి అమెరికాకు వలస వచ్చిన ఆయనకు సవాళ్లను ఎదుర్కోవడం కొత్తేమీ కాదు.బిజీ లైఫ్.. అయినా సైడ్ హజిల్!ఇంతటి కఠినమైన షెడ్యూల్ ఉన్నప్పటికీ, వై తన సృజనాత్మకతను వదులుకోలేదు. గూగుల్‌లో AI ప్రాజెక్టులతో పాటు, ఖాళీ సమయంలో సుమారు 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న ఒక పర్సనల్ న్యూస్‌లెటర్ కూడా నడుపుతున్నారు. "కాగితం మీద చూస్తే ఇది అర్థం లేని నిర్ణయంలా అనిపించవచ్చు. కానీ, ఈ ప్రయాణం వల్ల నేను పొందుతున్న వృద్ధి, అనుభవం.. నేను పెట్టే ఖర్చు కంటే చాలా విలువైనవి" అని వై ధీమాగా చెబుతున్నారు. నేటి తరం యువత కెరీర్, రిలేషన్ షిప్ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుందనడానికి జాసన్ వై ఒక నిదర్శనం.

Advertisement
Advertisement
Advertisement