ప్రధాన వార్తలు
ఆధార్, క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి కీలక మార్పులు
వచ్చే జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇవి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ఆధార్ కార్డుదారులు, క్రెడిట్ కార్డు వినియోగదారులు, పాస్పోర్ట్ దరఖాస్తుదారులు, బ్యాంకు ఖాతాదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఆధార్లో ఈమెయిల్ అప్డేట్కు ఉచిత అవకాశం, క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్ నిబంధనల్లో మార్పులు, పాస్పోర్ట్ ఫీజుల పెంపు, బ్యాంకుల మిస్-సెల్లింగ్పై ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.ఐటీఆర్ దాఖలుకు జూలై 31 చివరి తేదీ2025-26 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2026-27) సంబంధించిన ఐటీఆర్-1, ఐటీఆర్-2 రిటర్నులు దాఖలు చేయడానికి జూలై 31, 2026 చివరి గడువు. గడువు దాటితే ఆలస్య రుసుములు, కొన్ని పన్ను విధానాలను ఎంచుకునే అవకాశాలపై పరిమితులు, అర్హత ఉన్న నష్టాలను తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆధార్లో ఈమెయిల్ అప్డేట్యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆధార్ మొబైల్ యాప్ ద్వారా నమోదిత ఈమెయిల్ చిరునామాను అప్డేట్ చేసుకునే సేవను పూర్తిగా ఉచితంగా అందించనుంది. దీని కోసం ఇప్పటి వరకు రూ.75 రుసుము ఉండేది. అయితే ఈ రాయితీ కేవలం అధికారిక ఆధార్ మొబైల్ యాప్ ద్వారా చేసే అప్డేట్లకే వర్తిస్తుంది.ఎస్బీఐ కార్డుల రివార్డ్ నిబంధనల్లో మార్పులుఫోన్పే ఎస్బీఐ క్రెడిట్ కార్డు PURPLE, SELECT BLACK కార్డులకు సంబంధించిన రివార్డ్ పాయింట్ల విధానంలో మార్పులు అమల్లోకి రానున్నాయి. రివార్డ్ పాయింట్లు పొందే లావాదేవీలపై కొత్త పరిమితులు విధించడంతో పాటు, పాయింట్లు లభించని లావాదేవీల జాబితాను కూడా విస్తరించారు.హెచ్డీఎఫ్సీ లాంజ్ యాక్సెస్హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డుదారులు ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో మూడు ఉచిత దేశీయ విమానాశ్రయ లాంజ్ సందర్శనలను పొందాలంటే, అంతకుముందు త్రైమాసికంలో కనీసం రూ.60,000 ఖర్చు చేసి ఉండాలి. ఉదాహరణకు జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి లాంజ్ సదుపాయం పొందాలంటే ఏప్రిల్-జూన్ మధ్య ఈ ఖర్చు పూర్తిచేయాల్సి ఉంటుంది.పాస్పోర్ట్ ఫీజుల పెంపుజూలై 1 నుంచి సాధారణ, తత్కాల్ పాస్పోర్ట్ల ఫీజులు పెరుగుతున్నాయి. తాజా నోటిఫికేషన్ ప్రకారం 36 పేజీల సాధారణ పాస్పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కు, తత్కాల్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు పెరిగింది. ఇతర కేటగిరీల ఫీజులను కూడా కేంద్ర ప్రభుత్వం సవరించింది.బ్యాంకుల మిస్-సెల్లింగ్పై ఆర్బీఐ కఠిన చర్యలుబ్యాంకులు ఆర్థిక ఉత్పత్తులను తప్పుదోవ పట్టిస్తూ విక్రయించే ఘటనలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ కొత్త ఫ్రేమ్వర్క్ను అమల్లోకి తెస్తోంది. ఈ నిబంధనల ప్రకారం మిస్-సెల్లింగ్కు గురైన వినియోగదారులు పూర్తి రీఫండ్తో పాటు జరిగిన నష్టానికి తగిన పరిహారం పొందే హక్కు కలిగి ఉంటారు. బ్యాంకులు ఉత్పత్తుల విక్రయంలో మరింత పారదర్శకత పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు కూడా జూలై 1 నుంచే అమల్లోకి వస్తాయి.
డెడ్లైన్ అలర్ట్: ఈ-కేవైసీ, ఐటీ రిటర్న్.. ఇంకా..
జూన్ నెల ముగింపునకు వచ్చేసింది. జూన్ 30 పలు కీలక విషయాలకు గడువు తేదీ. ఎల్పీజీ సబ్సిడీ పొందుతున్న లబ్ధిదారుల ఈ-కేవైసీ నుంచి ఆదాయపు పన్ను శాఖ పరిశీలన (స్క్రూటినీ) నోటీసుల వరకు, అలాగే త్రైమాసిక ముగింపు నేపథ్యంలో వ్యాపారాల జీఎస్టీ, టీడీఎస్ సంబంధిత సన్నాహాల వరకు పలు ముఖ్యమైన గడువులు ఈ నెలాఖరుతో ముగియనున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక నష్టాలు లేదా పరిపాలనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఎల్పీజీ సబ్సిడీ నిలిచిపోయే అవకాశంప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు ప్రతి సంవత్సరం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటివరకు ధ్రువీకరణ పూర్తి చేయని ఇతర ఎల్పీజీ సబ్సిడీ లబ్ధిదారులు కూడా జూన్ 30లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేనిపక్షంలో వారి బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీ జమ కావడం తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. అయితే గ్యాస్ సిలిండర్ బుకింగ్పై ఎలాంటి ప్రభావం ఉండదు. పూర్తి ధర చెల్లించి సిలిండర్ పొందవచ్చు. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ-కేవైసీ పూర్తి చేసిన లేదా సబ్సిడీకి అర్హులు కాని వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు.ఐటీఆర్ స్క్రూటినీ నోటీసులకు కీలకం2025-26 ఆర్థిక సంవత్సరానికి దాఖలైన ఆదాయపు పన్ను రిటర్నులపై సెక్షన్ 143(2) కింద స్క్రూటినీ నోటీసులు జారీ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు జూన్ 30 చివరి గడువు. ఇది పన్ను చెల్లింపుదారులు రిటర్న్ దాఖలు చేయాల్సిన గడువు కాదు. కేవలం ఇప్పటికే దాఖలైన రిటర్నులను పరిశీలనకు ఎంపిక చేస్తే నోటీసులు పంపేందుకు శాఖకు ఉన్న చట్టబద్ధమైన చివరి తేదీ మాత్రమే. రిటర్నులో చూపిన వివరాలు, ఫారం 26AS, AIS, TIS, బ్యాంకు లావాదేవీలు లేదా అధిక విలువ గల ఆర్థిక లావాదేవీల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తే స్క్రూటినీకి ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) కూడా జూన్ 30నే ఈ గడువుగా స్పష్టం చేసింది.వ్యాపారాలకు త్రైమాసిక ముగింపుజూన్ 30తో 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ముగియనుంది. దీంతో కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ ఖాతాల పుస్తకాలు, టీడీఎస్, టీసీఎస్ నమోదులు, జీఎస్టీ రికార్డులు, ఇతర చట్టబద్ధమైన లెక్కలను నవీకరించుకోవాల్సి ఉంటుంది. తద్వారా జూలైలో దాఖలు చేయాల్సిన జీఎస్టీ రిటర్నులు, టీడీఎస్/టీసీఎస్ స్టేట్మెంట్లను సకాలంలో సమర్పించేందుకు వీలు కలుగుతుంది.ఈ గడువులను చివరి నిమిషానికి వాయిదా వేయకుండా ముందుగానే పూర్తి చేస్తే అనవసరమైన జరిమానాలు, సబ్సిడీ జాప్యాలు, పన్ను సంబంధిత ఇబ్బందులను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
బంగారం, వెండి ధరలు ఇప్పుడిలా..
దేశంలో రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
150 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు షాక్.. అందరూ లేఆఫ్
అమెరికాకు చెందిన రిటైల్ టెక్నాలజీ సంస్థ హై-వీ (Hy-Vee) భారత్లోని తన ఇంజినీరింగ్ సెంటర్ను ఆకస్మికంగా మూసివేయడంతో సుమారు 150 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఒక్కరాత్రిలోనే ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగులను రాత్రి 9 గంటలకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ వీడియో కాల్కు ఆహ్వానించిన సంస్థ, రీస్ట్రక్చరింగ్లో భాగంగా భారత ఇంజినీరింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే వారి కార్పొరేట్ యాక్సెస్ కూడా నిలిపివేయబడింది.ఈ ఘటనపై మాజీ ఉద్యోగి ఒకరు రెడ్డిట్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఇంటర్న్గా చేరి దాదాపు రెండేళ్లలో పూర్తి స్థాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఎదిగిన తాను, "ఒక్క సమావేశంతో అంతా ముగిసిపోయింది" అని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా సంస్థ నుంచి సెవరెన్స్ ప్యాకేజీ లేదా ఎటువంటి ఆర్థిక పరిహారం కూడా అందలేదని పేర్కొన్నాడు. రియాక్ట్, నోడ్ జేఎస్, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ వంటి టెక్నాలజీల్లో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ, ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోవడం తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని తెలిపాడు.ఈ అకస్మాత్తు తొలగింపులపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. ఉద్యోగులకు కనీస నోటీసు లేకుండా మొత్తం టీమ్ను తొలగించడం చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. కొందరు ఉద్యోగుల ఆరోపణల ప్రకారం, తొలగింపుల అనంతరం సంస్థ భారత విభాగానికి సంబంధించిన లింక్డ్ఇన్ పేజీతో పాటు పలు పోస్టులను కూడా తొలగించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై సంస్థ అధికారికంగా స్పందించలేదు.ఇదిలా ఉండగా, హై-వీ ఇండియా ఇంజినీరింగ్ డైరెక్టర్ అమిత్ గోయల్ లింక్డ్ఇన్లో స్పందిస్తూ, భారత ఇంజినీరింగ్ కేంద్రాన్ని మూసేసినట్లు ధ్రువీకరించారు. ప్రభావితమైన ఇంజినీర్లు అత్యుత్తమ ప్రతిభ కలిగినవారని, వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సహకరించాలని తన పరిచయ వర్గాలను కోరారు. అయితే ఉద్యోగుల ఆరోపణల్లో పేర్కొన్న సెవరెన్స్ ప్యాకేజీ, నోటీసు వంటి అంశాలపై సంస్థ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదివారా? ఐటీ కంపెనీలు కనుమరుగవుతాయా?
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ దుర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున తిరుమలలోని శ్రీవారి ఆలయంలో నిర్వహించిన సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి, దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. అలాగే శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు.అనంత్ అంబానీ అంతకుముందు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు వెల్లడించారు. ఆ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల జీతభత్యాలు కూడా తామే భరిస్తామన్నారు.ఈ 25 ఎలక్ట్రిక్ బస్సులను నడిపే 50 మంది బస్సు డ్రైవర్ల జీతభత్యాలు చెల్లించడంతో పాటు, తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్ను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. గుజరాత్లోని వంతారా తహరాలో టీటీడీ గోశాలను ఆధునికీకరించేందుకు అంగీకారం తెలినట్లుగా తెలుస్తోంది.
కొత్త కారు: సిట్రోయెన్ నుంచి ‘ఎయిర్క్రాస్ కంఫర్ట్’ ఎడిషన్
హైదరాబాద్: ఆటోమొబైల్ సంస్థ సిట్రోయెన్ ఇండియా, బ్రాండ్ యొక్క 108వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా తన ఎస్యూవీ ‘ఎయిర్క్రాస్ కంఫర్ట్ ఎడిషన్’ను పరిమిత సంఖ్యలో విడుదల చేసింది. ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ. 9.09 లక్షలుగా ఉంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ లోని అన్ని వేరియంట్లలో ప్రీమియం ‘మెట్రోపాలిటాన్ బీజ్ లెదరేట్ ఇంటీరియర్లను’ ప్రామాణికంగా చేర్చి కేబిన్ కంఫర్ట్ను మరింత పెంచారు.వినియోగదారుల బడ్జెట్కు తగినట్లుగా ఇందులో యూ, ప్లస్, మ్యాక్స్ పేర్లతో మూడు ప్రత్యేక యాక్ససరీ ప్యాక్లను పరిచయం చేశారు. వీటి ద్వారా 10 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్లెస్ ఛార్జర్, ప్రీమియం జేబీఎల్ స్పీకర్లు జోడించారు. భద్రత కోసం ఫ్రంట్ కొలిషన్ హెచ్చరికలు చేసే అడ్వాన్స్డ్ డాష్ క్యా మ్ను అదనంగా పొందవచ్చు. ఈ ఆకర్షణీయమైన మోడల్ బు కింగ్లు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్షిప్లలో, అధికారిక డిజిటల్ వేదికలలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు కంపెనీ పేర్కొంది.
కార్పొరేట్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ
ఏఐ.. రూ.450 లక్షల కోట్లు
ఐటీ ఆదాయాలకు ఏఐ బూస్ట్
భారత కంపెనీలకు ఉపశమనం
పర్సిస్టెంట్ సిస్టమ్స్ చేతికి నగారో
భారత్లో ఓపెన్ఏఐకి కొత్త బాస్.. ఎవరీ ప్రభ్జీత్ సింగ్?
భారత్ ట్యాక్సీ.. అమిత్ షా కీలక ప్రకటన!
జాబ్ ఇంటర్వ్యూకు 11 గంటల స్లాట్ వద్దా? కెరీర్ కోచ్ సూచనపై చర్చ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు లీగల్ క్లీన్ చిట్..
ఏఐ మెమరీచిప్స్ విస్తరణకు రూ. 1,000 కోట్లు
బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులో రివర్స్!
దేశంలో బంగారం, వెండి ధరల పతనానికి బ్రేక్ పడింది. ...
స్టాక్ మార్కెట్: ట్రేడింగ్ బంద్
మొహర్రం సందర్భంగా శుక్రవారం (జూన్ 26) దేశీయ స్టాక్...
కొండ దిగుతున్న కనకం
న్యూఢిల్లీ: పసిడి, వెండి గురువారం కూడా దేశీ మార్కె...
అంతలోనే ఇంతలా.. బంగారం కొత్త ధరలు ఇలా!
భారతదేశంలో బంగారం తగ్గుదలకు బ్రేక్ పడింది. వరుసగా ...
ఆదాయపన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ ను...
స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల డబ్బులు
న్యూఢిల్లీ/జ్యురిక్: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల...
యూకే–భారత్ వాణిజ్యానికి రెక్కలు
న్యూఢిల్లీ: యూకే, భారత్ మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్...
డబ్ల్యూపీఐకి గుడ్బై.. పీపీఐకి మారనున్న కేంద్రం!
ధరల తీరును మరింత ప్రతిఫలించే విధంగా వస్తు, సేవలకు ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఐటీ కంపెనీలు కనుమరుగవుతాయా?
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల స్థానాన్ని కృత్రిమ మేథ (ఏఐ) ఎన్నటికీ ఆక్రమించలేదని ఇన్ఫోసిస్ సహ–వ్యవస్థాపకుడు, చైర్మన్ నందన్ నీలేకని స్పష్టం చేశారు. ఏఐతో ఐటీ కంపెనీలు మరింత పటిష్టమవుతాయని ఆయన తెలిపారు. 2030 నాటికి 400 బిలియన్ డాలర్ల భారీ ఏఐ ఆధారిత సర్వీసులకు సంబంధించిన అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఇన్ఫీ మరింతగా దృష్టి పెడుతోందని నీలేకని చెప్పారు.కంపెనీ 45వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. సాంకేతిక విప్లవాలు వేగవంతమవుతున్న నేపథ్యంలో ఐటీ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందన్న సందేహాలపై నీలేకని స్పందించారు. జెన్ఏఐ మనుగడలోకి వచ్చిన మూడేళ్ల వ్యవధిలో ఇన్ఫోసిస్ మరింత పటిష్టంగా మారిందని, రాబోయే దశాబ్దకాలాన్ని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అత్యుత్తమ కోడింగ్ టూల్స్ని ఉపయోగించుకుని ఉత్పాదకతను మరింతగా పెంచుకున్నప్పటికీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించి జీవిత కాలంలో చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉంటాయన్నారు. కంపెనీలకు అవసరమైన సొల్యూషన్స్కి కఠినతరమైన పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని, అలాగే సైబర్సెక్యూరిటీ, కఠినతరమైన డేటా గవర్నెన్స్లాంటి వాటిని బైటివాళ్లకి ఔట్సోర్సింగ్ చేయడానికి ఉండదని పేర్కొన్నారు.‘పెద్ద కంపెనీల్లో ఏఐ వినియోగానికి సంబంధించి చాలా మటుకు అంతరాలు ఉంటున్నాయి. వాటిని భర్తీ చేయడమే మా పని. ఏఐ అనేది మాలాంటి కంపెనీలను ఆక్రమించదు. పరిస్థితులకు అనుగుణంగా, వేగంగా తమను తాము మల్చుకునే సంస్థలను మరింత పటిష్టం చేస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తమ టాప్ 200 క్లయింట్లలో 90 శాతం సంస్థలకి ఏఐ వినియోగంపరమైన సేవలు అందిస్తున్నట్లు నీలేకని వివరించారు. ఇదీ చదవండి: రికార్డులు సృష్టిస్తోన్న ఆధార్ యాప్..
ఇంట్లోకి దూసుకెళ్లిన టెస్లా: స్పందించిన మస్క్!
అమెరికాలోని టెక్సాస్లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. ఒక టెస్లా మోడల్ 3 కారు అధిక వేగంతో ఓ ఇంటిలోకి దూసుకెళ్లడంతో 76 ఏళ్ల మహిళ మరణించింది. ప్రమాద సమయంలో కారులో డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టం ఉపయోగించినట్లు సమాచారం రావడంతో, టెస్లా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీపై ప్రశ్నలు తలెత్తాయి.ప్రమాదం ఎలా జరిగింది?స్థానిక అధికారుల సమాచారం ప్రకారం.. 44 ఏళ్ల మైఖేల్ బట్లర్ కారును డ్రైవ్ చేసే సమయంలో ఒక ఇంటిని ఢీకొట్టాడు. ఈ ప్రమాద సమయంలో డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ యాక్టివ్గా ఉన్నట్లు అతను విచారణాధికారులకు తెలిపారు. కారు ఇంటి గోడను బలంగా ఢీకొట్టి లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 76 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినప్పటికీ, కొంతసేపటి తరువాత మరణించారు.కుటుంబ సభ్యుల ప్రకారం.. కారు ఢీకొట్టిన ప్రదేశంలో (ఇంట్లో) పిల్లలు తరచుగా ఉండేవారు. కానీ ఆ రోజు ఎవరూ లేదు. మహిళ తప్పా.. మరెవరికి ప్రమాదం జరగలేదు.ప్రమాదంలో డ్రైవర్ కూడా గాయపడ్డాడు. అయితే అధికారులు అతడు మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలను సేవించినట్లు లేదని తెలిపారు. కాగా ప్రస్తుతం అతను దర్యాప్తుకు సహకరిస్తున్నాడు. ఇప్పటివరకు అతనిపై ఎటువంటి కేసులు లేదా అభియోగాలు నమోదు కాలేదని స్పష్టం చేశారు.దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రమాదం సమయంలో కారు ఏ సిస్టమ్ను ఉపయోగిస్తోందో స్పష్టంగా తెలియలేదు. అది టెస్లా 'ఆటోపైలట్' వ్యవస్థనా, లేక ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD)నా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.BUSINESS INSIDER you lying fucks. Prepare to be sued. pic.twitter.com/k68q64QvrB— Pete Balls to the wall FSD 🤖🚕 (@kylaschwaberow) June 22, 2026ఎలాన్ మస్క్ స్పందనఈ ఘటనపై వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ స్పందిస్తూ, డ్రైవింగ్ సిస్టమ్ కారణంగా ప్రమాదం జరిగిందనే ఆరోపణలను ఖండించారు. ఆయన ప్రకారం.. FSD వ్యవస్థను నివాస ప్రాంతాల్లో చాలా తక్కువ వేగంతో ప్రయాణించేలా రూపొందించినట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదం అధిక వేగంతో జరిగింది కాబట్టి, ఈ ఆరోపణలు సరైనవిగా కనిపించడం లేదని చెప్పారు.టెస్లా ఏఐ విభాగం వివరణటెస్లా ఏఐ హెడ్ అశోక్ ఎల్లుస్వామి కూడా స్పందించారు. డ్రైవర్ యాక్సిలరేటర్ను పూర్తిగా (100%) నొక్కి స్వయంచాలక డ్రైవింగ్ను మాన్యువల్గా ఓవర్రైడ్ చేశాడు. ప్రమాదం సమయంలో కారు గంటకు సుమారు 73 మైళ్ల (దాదాపు 117 కి.మీ.) వేగంతో ప్రయాణించింది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా యాక్సిలరేటర్ నొక్కిన స్థితిలోనే ఉందని టెస్లా డేటా సూచిస్తోందని తెలిపారు.Yup. In this case, the driver manually overrode self-driving by pressing the accelerator all the way to 100% of the accel pedal in this residential area. They reached a speed of 73 mph during the crash, and had the accelerator pressed even after the crash.— Ashok Elluswamy (@aelluswamy) June 22, 2026
రికార్డులు సృష్టిస్తోన్న ఆధార్ యాప్..
ఆధార్ యాప్ డౌన్లోడ్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఆరంభించిన ఐదు నెలల్లోనే 3.1 కోట్ల మంది యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. కొత్త ఆధార్ యాప్ ద్వారా ఇప్పటికే 40 లక్షల మంది తమ మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకోగా, 8.5 లక్షల మంది యాప్ సాయంతో తమ చిరునామానూ సైతం మార్చుకున్నారు.ఆధార్ యాప్నకు ఆమోదం పెరుగుతున్నట్టు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ నుంచే సులభంగా సేవలు పొందే విషయంలో పౌరుల్లో విశ్వాసం పెరుగుతున్నట్టు తెలిపింది. మొబైల్, చిరునామా అప్డేట్తోపాటు భౌతిక కార్డుకు బదులు యాప్లోని క్యూఆర్ సాయంతో తమ కాంటాక్టు వివరాలను డిజిటల్గా పంపుకునే సదుపాయం ఇందులో ఉన్నట్టు వెల్లడించింది. బయోమెట్రిక్ లాక్/అన్లాక్, ముఖ గుర్తింపు ధ్రువీకరణ, క్యూఆర్ ఆధారిత కాంటాక్టు కార్డ్ తదితర ఎన్నో ఫీచర్లు ఉన్నట్టు పేర్కొంది.ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండిలా..మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ఓపెన్ చేయండి.సెర్చ్ బార్లో "Aadhaar App" అని టైప్ చేయండి.UIDAI విడుదల చేసిన అధికారిక యాప్ను ఎంపిక చేసుకోండి.Install/Download బటన్పై క్లిక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.ఇన్స్టాలేషన్ పూర్తయ్యాక మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి.OTP ధ్రువీకరణ అనంతరం ఆధార్కు సంబంధించిన సేవలను వినియోగించుకోవచ్చు.మొబైల్ నంబర్, చిరునామా అప్డేట్, బయోమెట్రిక్ లాక్/అన్లాక్, ఫేస్ ఆథెంటికేషన్, క్యూఆర్ కోడ్ షేరింగ్ వంటి సేవలను యాప్లోనే పొందవచ్చు.
ఒక్క ఏడాదిలో 21,000.. ఒరాకిల్ ఉద్యోగాల కోత
అమెరికాకు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్, డేటాబేస్ సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ (Oracle Corporation) గత ఏడాదిలో సుమారు 21 వేల మంది ఉద్యోగులను తగ్గించినట్లు తాజా రెగులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. 2026 మే 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి సంస్థలో పూర్తి స్థాయి ఉద్యోగుల సంఖ్య 1.41 లక్షలకు పడిపోయింది. అంతకుముందు ఏడాది ఇది 1.62 లక్షలుగా ఉండేది. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు 13 శాతం శ్రామిక శక్తి తగ్గినట్లైంది.తమ కార్యకలాపాల్లో కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతలను వేగంగా అమలు చేయడం, ఆటోమేషన్ను విస్తరించడం వల్ల ఉద్యోగుల అవసరం తగ్గుతోందని ఒరాకిల్ తన వార్షిక ఫైలింగ్లో స్పష్టంగా పేర్కొంది. ఏఐ వినియోగం కారణంగా భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సంఖ్యపై ప్రభావం కొనసాగవచ్చని సంస్థ హెచ్చరించింది.ఈ పునర్వ్యవస్థీకరణ కారణంగా సంస్థకు సుమారు 1.84 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.15,000 కోట్లకు పైగా) వ్యయం వచ్చినట్లు వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఖర్చు భారీగా పెరిగింది. ఉద్యోగుల తొలగింపులతో పాటు సంస్థాగత మార్పులు, విభాగాల పునర్వ్యవస్థీకరణ, నిర్వహణ మార్పులు కూడా ఈ వ్యయానికి కారణమయ్యాయి.ప్రస్తుతం ఒరాకిల్ భారీ ఏఐ డేటా సెంటర్ల నిర్మాణంపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా ఓపెన్ఏఐ (OpenAI) వంటి సంస్థలకు క్లౌడ్ మౌలిక సదుపాయాలు అందించేందుకు బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. ఏఐ మౌలిక వసతుల విస్తరణ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 70 బిలియన్ డాలర్ల మూలధన వ్యయం చేయాలని కంపెనీ ప్రణాళికలు రూపొందించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.మే చివరి నాటికి ఒరాకిల్లో అమెరికాలో సుమారు 49 వేల మంది, ఇతర దేశాల్లో 92 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2022లో ఆరోగ్య సాంకేతిక సంస్థ సెర్నర్ కార్పొరేషన్ను 28 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన తర్వాత ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగినా, తాజా కోతలతో సంస్థ హెడ్కౌంట్ మళ్లీ ఆ స్థాయికి దిగువకు చేరింది.టెక్నాలజీ రంగంలో ఏఐ ఆధారిత ఆటోమేషన్ వేగంగా పెరుగుతున్న సమయంలో, ఉద్యోగాల తగ్గింపును ఏఐతో నేరుగా అనుసంధానించిన అరుదైన పెద్ద కంపెనీలలో ఒరాకిల్ ఒకటిగా నిలిచింది. దీంతో భవిష్యత్తులో ఏఐ కారణంగా ఉద్యోగ మార్కెట్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై చర్చ మళ్లీ మొదలైంది.
పర్సనల్ ఫైనాన్స్
12 కోట్లు దాటిన క్రెడిట్ కార్డులు..
దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డుల సంఖ్య మరో కీలక మైలురాయిని చేరుకుంది. 2026 మే నాటికి దేశంలో క్రియాశీల (యాక్టివ్) క్రెడిట్ కార్డుల సంఖ్య 12.04 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.3 శాతం అధికం. మే నెలలోనే నికరంగా 10.17 లక్షల కొత్త క్రెడిట్ కార్డులు జారీ కావడం విశేషం. ఇది ఏడాది ప్రాతిపదికన 33.7 శాతం, ఏప్రిల్తో పోలిస్తే 26.9 శాతం పెరుగుదలను సూచిస్తోందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి.క్రెడిట్ కార్డుల వినియోగం కూడా స్థిరంగా కొనసాగుతోంది. మే నెలలో మొత్తం కార్డు లావాదేవీల విలువ రూ.2.02 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 6.3 శాతం అధికం. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా మార్చిలో నమోదైన రికార్డు స్థాయి రూ.2.19 లక్షల కోట్ల ఖర్చుతో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉంది. ఏప్రిల్లో నమోదైన రూ.1.97 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం స్వల్పంగా మెరుగుదల కనిపించింది. ఒక్కో క్రెడిట్ కార్డుపై సగటు నెలవారీ వ్యయం రూ.16,778గా నమోదైంది.కొత్త కార్డుల జారీలో ఎస్బీఐ కార్డ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వంటి మధ్యస్థాయి బ్యాంకులు కూడా కార్డు జారీలో వేగంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు కొన్ని బ్యాంకులు అసురక్షిత రుణాల రిస్క్ను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాయి.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దేశంలో డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్ విస్తరణతో క్రెడిట్ కార్డుల వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఖర్చుల వృద్ధి గతంతో పోలిస్తే కొంత మితంగా సాగుతోంది. దీంతో బ్యాంకులు మార్కెట్ వాటాను పెంచుకోవడమే కాకుండా, లాభదాయకతను కాపాడుకోవడం, బకాయిలు పెరగకుండా రిస్క్ మేనేజ్మెంట్పై మరింత దృష్టి సారిస్తున్నాయి.
బంగారం మరింత కొనే సమయం వచ్చిందా?
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రపంచ ప్రఖ్యాత ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) బంగారం ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతుండటం మంచి వార్తేనని ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు. అయితే తాను ప్రస్తుతం మరింత బంగారం కొనుగోలు చేసే సమయం వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవడానికి సాంకేతిక చార్టులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.ధరలు తగ్గుతున్నాయనే కారణంతోనే పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఒక ఇంటి ధర తగ్గితే కేవలం తక్కువ ధర చూసి కొనుగోలు చేయరని, ఆ ఇంటి చుట్టుపక్కల ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతోందో కూడా పరిశీలిస్తామని ఉదాహరణగా వివరించారు. అదే విధంగా బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? ఆర్థిక వ్యవస్థలో ఏమి జరుగుతోంది? అనే అంశాలను తెలుసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు.ఆర్థిక పరిస్థితులు బలహీనపడుతున్నాయని భావిస్తే తాను బంగారం కొనుగోలుకు దూరంగా ఉండవచ్చని, కానీ ఆర్థిక వ్యవస్థ మెరుగుదల దిశగా సాగుతోందని సంకేతాలు కనిపిస్తే తక్కువ ధరల వద్ద బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న బంగారంలో చాలా భాగాన్ని 2000 ప్రాంతంలో ఔన్స్కు సుమారు 300 డాలర్ల ధర వద్ద కొనుగోలు చేశానని కియోసాకి గుర్తుచేశారు.మార్కెట్ ధోరణి (ట్రెండ్)ను గమనించడం పెట్టుబడిదారులకు అత్యంత కీలకమని, ధరల కంటే వాటి వెనుక ఉన్న ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడమే విజయవంతమైన పెట్టుబడులకు మూలమని ఆయన తన పోస్ట్లో సూచించారు.GREAT NEWS: Gold continues to drop in price. Watching technical charts to know when to buy more.TREND is your FRIEND!!!!! Repeating past lesson.Price is like knowing the price of a house is going down.What I want to know what is happening in the neighborhood?If…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 24, 2026
ఇంట్లోని బంగారం కొండంత అండ!
ముంబై: ఇళ్లల్లో ఉన్న బంగారం క్రమంగా బ్యాంక్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఖజానాల్లోకి చేరుతోంది. పసిడిని నిరుపయోగంగా ఉంచకుండా, దానిపై రుణాలు తీసుకునే ధోరణి ఇటీవలి కాలంలో విస్తృతమవుతోంది. కుటుంబాల ఆర్థిక అవసరాల్లో బంగారం కొండంత అండనిస్తోంది. ఫలితంగా బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు, ప్రత్యేక పసిడి రుణ సంస్థల మధ్య పోటీ మరింత పెరిగింది. డేటా విశ్లేషణ, క్రెడిట్ సమాచార సంస్థ ‘ఎక్స్పీరియన్’ విడుదల చేసిన నివేదిను పరిశీలించినప్పుడు పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. పసిడి రుణాలకు ఆమోదం పెరుగుతోంది. విశ్వసనీయమైన రుణ సాధనంగా వినియోగదారులు చూస్తున్నారు. ఫలితంగా గడిచిన రెండేళ్లలో రుణాల కోసం తనఖా పెట్టిన పసిడి విలువ గణనీయంగా పెరిగింది. 2024–25లో 69 శాతం పెరిగితే, 2025–26లో 84 శాతం వృద్ధి చెందింది. 2023 మార్చి నాటికి రూ.6.3 లక్షల కోట్ల రుణాలు పసిడి తనఖాపై మంజూరు కాగా (గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో), 2026 మార్చి నాటికి ఈ మొత్తం రూ.19.4 లక్షల కోట్లకు చేరింది. ముఖ్యంగా బంగారం ధర భారీగా పెరిగిపోవడం తెలిసిందే. దీంతో తమ వద్దనున్న పసిడిపై మరింత మొత్తం రుణంగా పొందే వెసులుబాటు లభించింది. దీంతో సగటు పసిడి రుణం గత మూడేళ్లలో రూ.98వేల నుంచి రూ.1.96 లక్షలకు ఎగిసింది. 2025–26 చివరి త్రైమాసికంలో కొత్త రుణాల్లో 75 శాతం పాత రుణ గ్రహీతలు పొందినవే ఉన్నాయి. రుణాల వృద్ధికి, అందరికీ ఆర్థిక సేవల చేరువలో పసిడి ముఖ్యపాత్ర పోషిస్తోందని ఎక్స్పీరియన్ నివేదిక పేర్కొంది. ఇక ఇప్పటి వరకు బంగారం రుణాల వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించగా, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ మార్కెట్ విస్తృతమవుతోంది. అయితే, ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాల వాటాయే అధికంగా ఉంది. 2025–26లో ఉత్తరప్రదేశ్లో పసిడి రుణాలు 138 శాతం పెరగ్గా, పశ్చిమ బెంగాల్లో 112 శాతం, రాజస్థాన్లో 105 శాతం, మహారాష్ట్రలో 102 శాతం చొప్పున పసిడి రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి చెందాయి. ప్రాధాన్య రంగానికి సంబంధించి పసిడి రుణాలు (పీఎస్జీఎల్) సమ్మిళిత వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మొత్తం పసిడి రుణాల్లో వీటికి సంబంధించినవే 23 శాతానికి చేరాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని వ్యాపార సంస్థలు, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు, రుణ సదుపాయం అంతగా అందుబాటులో లేని వర్గాలకు పసిడి రుణాలు అండగా నిలుస్తున్నాయి. ఈ వర్గాలు ఇళ్లల్లోని బంగారంతో తమ నిధుల అవసరాలను (వ్యాపారం, కుటుంబ అవసరాలు, సాగు కోసం) తీర్చుకుంటున్నాయి. బంగారం రుణ గ్రహీతల్లో ఇతర రుణ సాధనాల వినియోగం కూడా పెరుగుతోంది. 2021 డిసెంబర్ నాటికి ఈ తరహా కస్టమర్లు 10 శాతంగా ఉంటే, 2025 డిసెంబర్ నాటికి 17 శాతానికి పెరిగారు. పసిడి రుణాల్లో ఎగవేతలు కూడా చాలా తక్కువగా ఉంటుండడం విశేషం. 90 రోజులకు పైగా చెల్లింపుల్లేని రుణాలు 2023 మార్చి నాటికి ఉన్న 0.4 శాతం నుంచి 2026 మార్చి నాటికి 0.2 శాతానికి తగ్గాయి. గొప్ప ఆర్థిక సాధనం.. ‘‘కుటుంబాల వద్ద పసిడి నిల్వలు గణనీయంగా ఉన్నాయి. దీంతో పసిడి రుణాలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో సంప్రదాయంగా నిల్వ ఉంచుకునే ఆస్తి కాస్తా రుణ సాధనంగా మారిపోయింది. ఎన్నో వ్యక్తిగత, జీవన అవసరాలను తీర్చడం ద్వారా ఆర్థిక సేవల చేరువలో పసిడి గొప్ప పాత్ర పోషిస్తోంది’’అని ఎక్స్పీరియన్ ఇండియా ఎండీ మనీష్జైన్ పేర్కొన్నారు. పోటాపోటీ పసిడి రుణాలకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండడంతో ఈ మార్కెట్లో వాటా కోసం ప్రభుత్వరంగ బ్యాంక్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), ప్రత్యేక పసిడి రుణ సంస్థలు మధ్య పోటీ తీవ్రతరమైంది. ఇంతకాలం ఈ విభాగంలో ప్రభుత్వ బ్యాంక్లదే ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు ఎన్బీఎఫ్సీలు, గోల్డ్ ఎన్బీఎఫ్సీల నుంచి వాటికి గట్టి పోటీ ఎదురవుతోందని ఎక్స్పీరియన్ నివేదిక వెల్లడించింది. పంపిణీ విభాగం బలంగా ఉండడం, కస్టమర్లు సైతం నాన్ బ్యాంక్ గోల్డ్ లోన్ సంస్థలవైపే మొగ్గు చూపిస్తుండడం వాటికి జోష్నిస్తోంది.ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా 2025–26 క్యూ4లో (2026 జనవరి–మార్చి) 37 శాతానికి తగ్గింది. సరిగ్గా అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ4లో ఇది 45 శాతంగా ఉంటే, అంతక్రితం త్రైమాసికంలోనూ (2025 డిసెంబర్ క్వార్టర్) 53% ఉండడం గమనార్హం. ఇక ఇదే కాలంలో పసిడి రుణాల్లో ఎన్బీఎఫ్సీల వాటా 33% నుంచి 44 శాతానికి పెరిగింది. ప్రాధాన్యరంగ పసిడి రుణాల్లో మాత్రం 88% వాటా ప్రభుత్వరంగ బ్యాంకుల చేతుల్లోనే ఉంది.
డాలర్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుల నుంచి డాలర్లను ఆకర్షించే దిశగా కొత్త ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్లపై బ్యాంకులకు ఆర్బీఐ డాలర్–రూపీ ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకులు సదరు ఖాతాలపై రేట్లను సవరించాయి. ఈ డిపాజిట్లపై బంధన్ బ్యాంక్ ఆకర్షణీయ వడ్డీ రేట్లను ప్రకటించింది. 3 నుంచి 5 ఏళ్ల వ్యవధికి 1 మిలియన్ డాలర్లకు పైగా డిపాజిట్లపై 7.1 శాతం వడ్డీ రేటు ఉంటుందని బ్యాంకు తెలిపింది. 1 మిలియన్ డాలర్ల వరకు డిపాజిట్లపై 7 శాతం ఉంటుందని పేర్కొంది. రూపాయి క్షీణతపరమైన రిసు్కలను అధిగమించి మెరుగైన రాబడులను అందుకునేలా ఎన్ఆర్ఐ కస్టమర్లకు ఇది సహాయకరంగా ఉంటుందని బ్యాంక్ ఈడీ రాజీందర్ కుమార్ బబ్బర్ తెలిపారు.మరోవైపు, బ్యాంక్ ఆఫ్ బరోడా .. తమ లెజెండ్ ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్ స్కీము కింద డాలర్ డిపాజిట్లపై 6.25 శాతం వరకు, బ్రిటీష్ పౌండ్ స్టెర్లింగ్ .. ఆస్ట్రేలియన్ డాలర్పై 4.75 శాతం, యూరో డిపాజిట్లపై 3.75 శాతం, కెనడియన్ డాలర్ డిపాజిట్లపై 5.15 శాతం వడ్డీ రేట్లను ప్రకటించింది. ఇవి మూడు నుంచి ఐదేళ్ల కాలవ్యవధికి వర్తిస్తాయి. అటు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఈ డిపాజిట్లపై వడ్డీ రేటును 7.13 శాతం వరకు పెంచినట్లు తెలిపింది. ఇక సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్లపై 6.50 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది.సాధారణంగా ఈ విధానంలో ప్రవాస భారతీయులు డాలర్ల మారకంలో ఎఫ్సీఎన్ఆర్ (బి) ఖాతాలో డిపాజిట్ చేస్తారు. ఆ డాలర్లను సదరు బ్యాంకు నిర్దిష్ట రిఫరెన్స్ రేటుకు ఆర్బీఐకి విక్రయించి, రూపాయి మారకంలో నిధులు సమకూర్చుకుంటుంది. మెచ్యూరిటీ సమయంలో మళ్లీ అదే రేటుకి ఆర్బీఐ నుంచి డాలర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఈ క్రమంలో రూపాయి బలహీనపడితే బ్యాంకు నష్టపోకుండా ఆర్బీఐ ఆ రిసు్కను భరిస్తుంది.


