ప్రధాన వార్తలు
మాటిమాటికీ.. బ్రేక్డౌన్లేంటి..
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(ఎంసీఎక్స్)లో పదే పదే సాంకేతిక సమస్యలు వస్తుండటంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అసహనం వ్యక్తం చేశారు. తాజా సమస్యను అధ్యయనం చేసిన మీదట అవసరమైతే సెబీ స్వయంగా తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఇలాంటి విషయాల్లో సెబీ ప్రామాణికమైన ప్రోటోకాల్స్ను పాటిస్తుందని పాండే పేర్కొన్నారు.‘జూలైలో ఒకసారి సమస్య వచ్చింది. ఇదిగో ఇప్పుడు మరొకటి. ఇలా మాటిమాటికీ సమస్యలు వస్తుండటం సరికాదు’ అని ఆయన చెప్పారు. డిజిటలీకరణ వేగవంతం అవుతున్న నేపథ్యంలో వ్యాపారాలకు అంతరాయాలు తలెత్తకుండా మార్కెట్ ఇంటర్మీడియరీలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, క్లయింట్ల డేటా..కీలకమైన మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లకుండా సైబర్ సెక్యూరిటీపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పాండే పేర్కొన్నారు. గత నెల ఎంసీఎక్స్లో పెద్ద స్థాయిలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ట్రేడింగ్కి తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: గోపీచంద్ హిందూజా కన్నుమూత
స్పెషాలిటీ స్టీల్కు మరో విడత ప్రోత్సాహకాలు
స్పెషాలిటీ స్టీల్ తయారీలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో కేంద్ర సర్కారు మరో విడత ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ)ను తీసుకొచ్చింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం, దిగుమతులను తగ్గించడం ఈ పథకం ఉద్దేశ్యం. ‘పీఎల్ఐ 1.2’ పథకాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రారంభించారు.ఈ పథకం కింద మొదటి రెండు విడతల్లో స్పెషాలిటీ స్టీల్ రంగంలోకి రూ.43,874 కోట్ల పెట్టుబడులకు హామీలను పొందినట్టు మంత్రి చెప్పారు. వీటి ద్వారా 14.3 మిలియన్ టన్నుల కొత్త స్పెషాలిటీ స్టీల్ తయారీ సామర్థ్యం దేశీయంగా ఏర్పాటవుతుందన్నారు. 2025 సెప్టెంబర్ నాటికి రూ.22,973 కోట్ల పెట్టుబడులు రాగా, 13,284 మందికి ఉద్యోగ అవకాశాలు లభించినట్టు చెప్పారు. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం, ఆటోమొబైల్, ఇన్ఫ్రాలోకి వినియోగించే అధిక విలువ కలిగిన, ఉన్నత శ్రేణి స్టీల్ తయారీని ప్రోత్సహించేందుకు 2021 జూలైలో పీఎల్ఐ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.మొదటి రెండు విడతల పీఎల్ఐ పథకానికి మంచి స్పందన లభించినట్టు చెప్పారు. అధిక శ్రేణి స్టీల్ తయారీకి భారత్ను అంతర్జాతీయ కేంద్రంగా మలిచేందుకు పీఎల్ఐ 1.2ను తీసుకొచి్చనట్టు వెల్లడించారు. సూపర్ అలాయ్స్, సీఆర్జీవో స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ లాంగ్, ఫ్లాట్ ఉత్పత్తులు, టైటానియం అలాయ్స్, కోటెడ్ స్టీల్ విభాగాల్లో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పథకం సాయపడుతుందన్నారు. ప్రస్తుత కంపెనీలతోపాటు కొత్త కంపెనీలకు పీఎల్ఐ 1.2 అవకాశాలు కల్పిస్తుందన్నారు. దేశ అవసరాలకే కాకుండా ప్రపంచ మార్కెట్లకు సరఫరా చేసేందుకు ఈ పథకాన్ని చేపట్టినట్టు మంత్రి కుమారస్వామి చెప్పారు.ఇదీ చదవండి: గోపీచంద్ హిందూజా కన్నుమూత
మూడో భారీ ఎకానమీగా భారత్!
అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ త్వరలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. వివిధ అంశాల్లో భారత్ చాలా వేగంగా ముందుకు దూసుకెళ్తోందని ఆమె పేర్కొన్నారు. 2014లో పదో స్థానంలో ఉన్న భారత్ క్రమంగా అయిదు, నాలుగో స్థానాలకు ఎదిగిందని, త్వరలోనే మూడో స్థానానికి చేరుతుందని చెప్పారు. భారతీయులంతా తమ సామర్థ్యాలపై, దేశ ఆర్థిక సామర్థ్యాలపై నమ్మకం కలిగి ఉండాలని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ (డీఎస్ఈ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి సూచించారు. బయటి వ్యక్తుల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.‘140 కోట్ల జనాభా గల మన దేశాన్ని నిర్జీవ ఎకానమీగా ఎవరైనా ఎలా అనగలరు? బయటి నుంచి ఎవరైనా ఏవైనా మాట్లాడొచ్చు గాక, కానీ మన కృషి, మన విజయాలను మనం తక్కువ చేసుకోరాదు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కృషి చేస్తున్న మనందరికీ మనం సొంతంగానే లక్ష్యాలను సాధించగలమనే ఆత్మవిశ్వాసం ఉండాలి‘ అని మంత్రి చెప్పారు. వృద్ధి సాధనలో టెక్నాలజీ చాలా కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు. సాంకేతిక లేకపోయి ఉంటే స్థలం, కారి్మక శక్తి, పెట్టుబడులు నిరుపయోగంగా ఉండేవని వివరించారు. అన్నింటా సాంకేతికతచిన్న రైతు పొలాన్ని గుర్తించడం నుంచి కొత్త మోడల్స్ను అత్యంత వేగంగా కృత్రిమ మేథ తీర్చిదిద్దుతున్న తయారీ రంగం వరకు అన్నింటా సాంకేతికత కీలకంగా ఉంటోందని మంత్రి చెప్పారు. కృత్రిమ మేథ వల్ల ఉద్యోగాలు పోతాయని కొందరిలో ఆందోళన నెలకొన్నప్పటికీ మరికొందరు మాత్రం ఏఐని ఉపయోగించి దీర్ఘకాలిక సవాళ్లను పరిష్కరిస్తున్నారని తెలిపారు. భారత్లో పరిశోధనలు నిర్వహించడంపై, వర్ధమాన దేశాలకు అనువైన మోడల్స్ను రూపొందించడంపై మరింతగా దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. ద్రవ్య లోటు లక్ష్యాన్ని సాధిస్తాం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 4.4 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పక సాధించగలదని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 2024–25లో 4.8 శాతంగా ఉన్న ద్రవ్య లోటును ఈసారి 4.4 శాతానికి (సుమారు రూ. 15.69 లక్షల కోట్లు) పరిమితం చేయాలని బడ్జెట్లో ప్రభుత్వం నిర్దేశించుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల ఆర్థిక సమ్మిళితత్వం, జాతీయ ప్రయోజనాల లక్ష్యాలకు భంగం వాటిల్లుతుందన్న ఆందోళనలను ఆమె తోసిపుచ్చారు. బ్యాంకులను జాతీయీకరణ చేసి 50 ఏళ్లు గడిచినా ఆర్థిక సమ్మిళితత్వ విషయంలో ఆశించిన ఫలితాలు కనిపించలేదని..వాటిని ప్రొఫెషనల్ విధానంలో తీర్చిదిద్దిన తర్వాత నుంచి చక్కని ఫలితాలు కనిపిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.ఇదీ చదవండి: గోపీచంద్ హిందూజా కన్నుమూత
గోపీచంద్ హిందూజా కన్నుమూత
వ్యాపార దిగ్గజం, బ్రిటన్లో అత్యంత సంపన్నుడు గోపీచంద్ పి. హిందూజా (85) కన్నుమూశారు. గత కొద్ది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపీచంద్, లండన్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి. హిందూజాకు భార్య (సునీత), ఇద్దరు కుమారులు (సంజయ్, ధీరజ్), ఒక కుమార్తె (రీటా) ఉన్నారు. వ్యాపార వర్గాల్లో జీపీగా పేరొందిన గోపీచంద్ 1940లో జన్మించారు. ఆటోమోటివ్, ఎనర్జీ, బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో తమ గ్రూప్ను అగ్రగామిగా విస్తరించిన నలుగురు హిందుజా సోదరుల్లో ఆయన రెండో వారు. 2023లో అన్న శ్రీచంద్ హిందూజా మరణానంతరం 35 బిలియన్ పౌండ్ల గ్రూప్ చైర్మన్గా ఆయన బాధ్యతలు చేపట్టారు. విజనరీ వ్యాపారవేత్త..ముంబైలోని జైహింద్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ (1959) అనంతరం తమ కుటుంబానికి టెహ్రాన్లో ఉన్న ట్రేడింగ్ వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా జీపీ(గోపీచంద్ హిందూజా) తన కెరియర్ ప్రారంభించారు. ఆయన సారథ్యంలో 1984లో గల్ఫ్ ఆయిల్ని, ఆ తర్వాత 1987లో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశీ ఆటోమోటివ్ సంస్థ అశోక్ లేల్యాండ్ను గ్రూప్ కొనుగోలు చేసింది. అప్పట్లో అశోక్ లేల్యాండ్లో పెట్టుబడి తొలి భారీ ఎన్నారై ఇన్వెస్ట్మెంట్గా నిలిచింది. భారతీయ కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన టర్న్ అరౌండ్ గాథగా నిలిచపోయేలా కంపెనీని తీర్చిదిద్దడంలో జీపీ కీలకంగా వ్యవహరించారు. ఇక విద్యుత్, మౌలిక రంగాల్లోకి హిందూజా గ్రూప్ ప్రవేశించడంలోనూ ముఖ్య పాత్ర పోషించారు. బోఫోర్స్ మరకలు..స్వీడన్కి చెందిన గన్నుల తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్కి భారత్లో కాంట్రాక్టులు ఇప్పించేందుకు రూ. 64 కోట్లు అక్రమంగా కమీషన్లు తీసుకున్నట్లు జీపీతో పాటు ఆయన ఇద్దరు సోదరులపై (శ్రీచంద్, ప్రకాశ్) ఆరోపణలు వచ్చాయి. అయితే, 2005లో ఢిల్లీ హైకోర్టు వాటిని కొట్టివేసింది. కార్పెట్లు, టీ, సుగంధ ద్రవ్యాల ట్రేడింగ్తో సింధూ ప్రాంతంలో (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) పరమానంద్ 1914లో హిందూజా వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఇరాన్కి వెళ్లి, అక్కడి నుంచి వ్యాపారాన్ని విస్తరించారు. ప్రస్తుతం తాజా ది సండే టైమ్స్ రిచ్ లిస్టులో గోపీచంద్ హిందూజా కుటుంబం 35.3 బిలియన్ పౌండ్ల సంపదతో బ్రిటన్లోనే అత్యంత సంపన్న కుటుంబంగా అగ్రస్థానంలో ఉంది.భారతీయులకు చెందిన ఏకైక స్విస్ బ్యాంక్ ‘బ్యాంకీ ప్రైవీ’ కూడా హిందూజా సామ్రాజ్యంలో భాగమే. పెద్దన్న శ్రీచంద్ మరణానంతరం వ్యాపారాధిపత్యం కోసం కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి అవి సద్దుమణిగినట్లు కుటుంబం చెబుతున్నప్పటికీ, విభేదాలు కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: దేశంలోనే ధనిక జిల్లాగా రంగారెడ్డి
హ్యుందాయ్ వెన్యూ సరికొత్త వెర్షన్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ తాజాగా తమ కాంపాక్ట్ ఎస్యూవీ వెన్యూకి సంబంధించిన కొత్త వెర్షన్ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.89 లక్షలనుంచి ప్రారంభమవుతుంది. లేటెస్ట్ వెన్యూని అభివృద్ధి చేయడంపై రూ. 1,500 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు, పుణేలో కొత్తగా ప్రారంభించిన ప్లాంటులో మాత్రమే దీన్ని ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొంది. 2028 నాటికి ఈ ప్లాంటు స్థాపిత సామర్థ్యం 2.5 లక్షల యూనిట్లుగా ఉంటుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, వచ్చే ఏడాది జనవరిలో ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న తరుణ్ గర్గ్ తెలిపారు.ఇప్పటివరకు 7 లక్షలకు పైగా వెన్యూ వాహనాలను విక్రయించినట్లు చెప్పారు. దేశీయంగా కస్టమర్లు చిన్న కార్లకు తగ్గకుండా కాంపాక్ట్ ఎస్యూవీలకు అప్గ్రేడ్ అవుతున్నారని గర్గ్ చెప్పారు. తమ మొత్తం అమ్మకాల్లో ఎస్యూవీల వాటా 71 శాతంగా ఉందని, 2030 నాటికి ఇది 80 శాతానికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. 2030 నాటికి రూ. 45,000 కోట్ల పెట్టుబడులతో, 26 కార్లను ప్రవేశపెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఎస్బీఐ భళా
మొత్తం బిజినెస్ రూ. 100 లక్షల కోట్లను తాకింది. ఆస్తుల రీత్యా ఎస్బీఐ ప్రపంచంలో 43వ ర్యాంకులో నిలుస్తోంది. వీటిలో ఎంఎస్ఎంఈ విభాగం రూ. 25 లక్షల కోట్లను ఆక్రమిస్తోంది. – సీఎస్ శెట్టి, చైర్మన్, ఎస్బీఐన్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై– సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 7 శాతం వృద్ధితో రూ. 21,137 కోట్లను తాకింది. యస్ బ్యాంక్లో వాటా విక్రయం ద్వారా లభించిన రూ. 4,593 కోట్లు ఇందుకు దోహదపడ్డాయి. స్టాండెలోన్ నికర లాభం సైతం 10 శాతం ఎగసి రూ. 20,160 కోట్లకు చేరింది.గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 18,331 కోట్లు ఆర్జించింది. కాగా.. రుణాల్లో 12.7 శాతం వృద్ధి నేపథ్యంలోనూ నికర వడ్డీ ఆదాయం 3 శాతమే పుంజుకుని రూ. 42,984 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు నామమాత్రంగా 0.17 శాతం బలహీనపడి 2.97 శాతాన్ని తాకాయి. అంచనాలకు అనుగుణంగా పూర్తి ఏడాదికి 3 శాతం మార్జిన్లు సాధించనున్నట్లు బ్యాంక్ చైర్మన్ శెట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వడ్డీయేతర ఆదాయం 30 శాతం జంప్చేసి రూ. 19,919 కోట్లకు చేరగా.. మొత్తం ఆదాయం రూ. 1,29,141 కోట్ల నుంచి రూ. 1,34,979 కోట్లకు బలపడింది. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు బీఎస్ఈలో 0.7% లాభంతో రూ. 957 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 959 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది.రుణ నాణ్యత ఓకే ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్బీఐ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.13 శాతం నుంచి 1.73 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 0.53 శాతం నుంచి 0.42 శాతానికి దిగివచ్చాయి. ఇవి గత రెండు దశాబ్దాలలోనే కనిష్టమని శెట్టి వెల్లడించారు. అయితే తాజా స్లిప్పేజీలు రూ. 4,754 కోట్లకు పరిమితమైనప్పటికీ.. మొత్తం ప్రొవిజన్లు రూ. 4,505 కోట్ల నుంచి రూ. 5,400 కోట్లకు పెరిగాయి.ప్రస్తుతం బ్యాంక్ బ్రాంచీల సంఖ్య 23,050కు చేరగా.. పూర్తి ఏడాదిలో మరో 500 జత చేసుకోనున్నట్లు శెట్టి తెలియజేశారు. జీఎస్టీ రేట్ల సవరణల తదుపరి రుణాలకు ప్రధానంగా ఆటో రంగంలో డిమాండ్ భారీగా పుంజుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సెక్యూరిటీలలో రూ. 3.5 లక్షల కోట్ల మిగులు పెట్టుబడులున్నట్లు తెలియజేశారు. వీటికితోడు ఇటీవల సమీకరించిన రూ. 25,000 కోట్ల మూలధనంతో రూ. 12 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసే వీలున్నట్లు వివరించారు.
కార్పొరేట్
గోపీచంద్ హిందూజా కన్నుమూత
17 ఏళ్ల ఉద్యోగం పోయింది: జీవితమంటే తెలిసింది!
ఫిన్టెక్ గ్లోబల్ కమాండ్ సెంటర్గా హైదరాబాద్
ఆధార్ కార్డ్ అప్డేట్: అమల్లోకి కొత్త ఛార్జీలు!
వంతారాకు ఐరాస సంస్థ ‘సైట్స్’ ప్రశంసలు
48 గంటల్లో టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే..
సీఎంతో జర్మనీ, ఏడబ్ల్యూఎస్ ప్రతినిధులు భేటీ
వొడాఫోన్-ఐడియా బకాయిలపై మదింపు చేయవచ్చు.. సుప్రీంకోర్టు
ఇండస్ఇండ్–ఇన్వెస్కో సంయుక్త ఫండ్స్ వ్యాపారం
ఎయిర్టెల్ లాభం రెట్టింపు
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
లిస్టింగ్కు మరో 7 కంపెనీలు సై!
పబ్లిక్ ఇష్యూల తాకిడితో దలాల్ స్ట్రీట్ దుమ్మురే...
ముగిసిన స్టడ్స్ ఐపీఓ
హెల్మెట్ల తయారీ కంపెనీ స్టడ్స్ యాక్సెసరీస్ ఐపీఓ ...
యాక్సిస్ కొత్త మ్యూచువల్ ఫండ్
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తాజాగా ఇన్కం ప్లస్ ఆర...
అక్టోబర్లో రాణించిన తయారీ రంగం
వస్తు, సేవల పన్నులో (జీఎస్టీ) తీసుకొచ్చిన సంస్కరణ...
యూపీఐ కొత్త రికార్డు!
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ)...
పెళ్లిళ్ల సీజన్: రూ.6.5 లక్షల కోట్ల బిజినెస్!
భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది. నవంబర్ 1 ...
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు వాడకూడదు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక క...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఒక్క రూపాయికే జియో హాట్స్టార్!?
మనలో చాలా మంది వినియోగించే స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అదీ ప్రీమియం ఫీచర్లతో ఒక్క రూపాయికే వస్తే.. సూపర్ ఆఫర్ అనుకుంటున్నారు కదా.. ఇలాంటి ఆఫరే సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘ఎక్స్’ (ట్విట్టర్) లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అనేక మంది వినియోగదారులు రూ.1కే డిస్నీ+ హాట్స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ పొందినట్లు పోస్ట్లు చేస్తున్నారు. దానికి సంబంధించిన పేమెంట్ స్క్రీన్షాట్లు కూడా షేర్ చేయడంతో ఈ ఆఫర్పై ఉత్సుకత మరింత పెరిగింది.అయితే, జియో లేదా డిస్నీ+ హాట్స్టార్ మాత్రం ఇప్పటివరకు ఈ ఆఫర్పై అధికారిక ప్రకటన చేయలేదు. సాధారణంగా జియో ఇలాంటి ఆఫర్లు పరిమితంగా ఎంపిక చేసిన కొంత కస్టమర్లకు మాత్రమే ఇస్తుంటుంది. ఇది కూడా అలాంటి పరిమిత ట్రయల్ లేదా అంతర్గత టెస్టింగ్ దశలో భాగం కావచ్చని అంచనా.ఏముంది ప్లాన్లో?ఈ ఆఫర్ను పొందిన వినియోగదారుల చెబుతున్నదాని ప్రకారం.. జియోస్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్లో ఉన్న అన్ని ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, స్పోర్ట్స్, షోలను ప్రకటనలు లేకుండా చూడొచ్చు. డాల్బీ విజన్ , డాల్బీ అట్మోస్ 4కే నాణ్యతతో వీడియోలు ఏకకాలంలో నాలుగు డివైజ్లలో వరకు చూసే అవకాశం. మొబైల్, టీవీ, టాబ్లెట్, ల్యాప్ టాప్లలో సబ్స్క్రిప్షన్ను పంచుకునే అవకాశం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నట్లు కనిపిస్తోంది.కొన్ని స్క్రీన్షాట్ల ప్రకారం.. 1 రూపాయికి 3 నెలల సబ్స్క్రిప్షన్ అని ఉండగా మరొకొన్నివాటిల్లో వార్షిక సబ్స్క్రిప్షన్గా కూడా ఉంది. అయితే, ట్రయల్ కాలం 30 రోజులు మాత్రమే ఉండవచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్ రిన్యూవల్ సమయంలో పూర్తి చార్జీలు వర్తించవచ్చు.ఈ ఆఫర్ జియో సిమ్ వినియోగదారులు మాత్రమే కాకుండా కొంతమంది నాన్-జియో యూజర్లు కూడా వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది యూజర్లు రూ.1కే ఒక సంవత్సరం ప్రీమియం ప్లాన్ యాక్టివేట్ అయినట్లు చెబుతున్నారు. ఇది యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే కనిపించే ప్రమోషన్ కావచ్చని భావిస్తున్నారు.
ఆల్ఫాబెట్, అమెజాన్ల పంట పండించిన స్టార్టప్
టెక్ దిగ్గజాలు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, అమెజాన్ ఇటీవల ప్రకటించిన తమ మూడో త్రైమాసికం (క్యూ3) లాభాల్లో అద్భుతమైన వృద్ధి సాధించాయి. దీనికి ప్రధాన కారణం ఈ రెండు కంపెనీలు ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్లో చేసిన పెట్టుబడులు గణనీయంగా పెరగడమే. క్లాడ్ చాట్బాట్ సర్వీసులు అందిస్తున్న ఆంత్రోపిక్ లాభాలు పెరగడం ఈ కంపెనీలకు కలిసొచ్చింది.క్యూ3లో భారీ లాభాలుగత వారం వెలువడిన ఫలితాల ప్రకారం ఆల్ఫాబెట్ తన లాభంలో ఈక్విటీ సెక్యూరిటీలపై నికరంగా 10.7 బిలియన్ డాలర్లు సంపాదించినట్లు తెలిపింది. ఇందులో ప్రధానంగా ఆంత్రోపిక్ వాటా విలువ పెరిగినట్లు చెప్పింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ క్యూ3 లాభం 38% పెరిగింది. ఆంత్రోపిక్లో దాని పెట్టుబడి నుంచి వచ్చిన 9.5 బిలియన్ డాలర్లు నాన్-ఆపరేటింగ్ ఆదాయంలో ప్రతిబింబించింది.ఆంత్రోపిక్ అందించే సేవలుక్లాడ్ (Claude) - జనరేటివ్ ఏఐ అసిస్టెంట్క్లాడ్ అనేది ఆంత్రోపిక్ ప్రధాన ఉత్పత్తి. ఇది నెక్స్ట్ జనరేషన్ ఏఐ అసిస్టెంట్. దీన్ని సంభాషణాత్మక, టెక్స్ట్ ప్రాసెసింగ్ పనుల కోసం రూపొందించారు. ఇది లార్జ్ డాక్యుమెంట్లు లేదా సంభాషణల సారాంశాన్ని అందిస్తున్నారు. కథనాలు, కంటెంట్, కోడ్ రాయడంలో సహాయం చేస్తుంది. రాసిన కోడింగ్ను డీబగ్గింగ్ చేస్తుంది. ఇది చాట్ ఇంటర్ఫేస్ ద్వారా (Claude.ai), డెవలపర్ల కోసం ఏపీఐ ద్వారా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా?
స్మార్ట్ ఫ్రిజ్: ఫ్రెష్.. ఫ్రెష్గా!
ఫ్రిజ్ అంటే కేవలం చల్లగా ఉంచే పెట్టెగా మాత్రమే కాదు. ఇప్పుడది స్మార్ట్, ఫ్రెష్, ఫన్నీ అసిస్టెంట్గా కూడా మారింది.రోలింగ్ ఎగ్స్!ఫ్రిజ్ నుంచి గుడ్లను పగిలిపోకుండా బయటకు తీసేటప్పుడు పడే టెన్షన్ కోడి గుడ్డు పెట్టేటప్పుడు కూడా పడి ఉండదేమో అని అనిపిస్తుంటుంది! ఎందుకంటే, ఫ్రిజ్లో గుడ్లను పెట్టడం, తీయటం ఒక పెద్ద పని, పైగా వాటికి స్థలం కూడా చాలా కావాలి. ఇక ఆ కష్టాలు మర్చిపోండి! రింకిఫై ఆటోమాటిక్ ఎగ్ రోల్డౌన్ వచ్చింది. ఇది నాలుగు లేయర్ల ఆటోమాటిక్ రోల్డౌన్ సిస్టమ్, గ్రావిటీ ఫీడ్ డిజైన్తో వస్తుంది. అందుకే, ఒక చివరి గుడ్డు తీసుకున్న వెంటనే మరో గుడ్డు మీ ముందుకు వస్తుంది. కాబట్టి గుడ్లను తీసుకోవడం చాలా సులభం. ఇందులో ముప్పై గుడ్ల వరకు భద్రంగా నిల్వ చేస్తుంది. వర్టికల్ స్టాక్ డిజైన్ వల్ల ఫ్రిజ్లో స్థలం ఎక్కువ సేవ్ అవుతుంది. హై–క్వాలిటీ ప్లాస్టిక్తో తయారవడంతో, దీన్ని క్లీనింగ్ చేయడం కూడా సులభం. ధర: రూ. 300.స్మార్ట్ ఫ్రిజ్!రోజూ ఉదయాన్నే పాలు అయిపోయాయి అని ఫ్రిజ్ డోర్ తెరిస్తే కాని తెలియడం లేదా? దీంతో, ఉదయం పాలకోసం వాకింగ్ తప్పడం లేదా. బాధ పడకండి. ఇప్పుడు ఈ విషయాన్ని ఫ్రిజ్ గమనిస్తుంది. ‘బ్రో, ఉదయం కాఫీకి పాలు లేవు!’ అని ఎప్పటికప్పుడు మీకు ఫోన్లో నోటిఫికేషన్ పంపిస్తుంది. ఇంకా పెరుగు, గుడ్లు, కూల్ డ్రింక్స్ అన్నీ చెక్ చేసి, ఏవి లేవో వాటన్నింటితో కలిపి షాపింగ్ జాబితాను కూడా పంపిస్తుంది. ఇలా ఫ్రిజ్ తలుపు తెరవకుండానే, లోపల ఏముందో అన్నది ఫోన్లోనే చూసుకోవచ్చు! అంతేకాదు, ఎవరు చివరి చాక్లెట్ తిన్నారో కూడా తెలుసుకోవచ్చు. ఇదంతా ఎలా సాధ్యమయ్యిందంటే? ఇందులో వై–ఫై, టచ్ స్క్రీన్, వాయిస్ కంట్రోల్ ఉన్నాయి. ‘ఫ్రిజ్, కూల్ చెయ్!’ అని చెబితే అది వినేస్తుంది కూడా! వివిధ బ్రాండ్ల ఆధారంగా ధర రూ. 50,000 నుంచి రూ. 1,00,000 వరకు ఉండొచ్చు.ఫ్రెష్.. ఫ్రెష్గా!ఫ్రిజ్ తెరిస్తే కొత్తిమీర, పుదీనా, పాలకూర ఇలా ఆకుకూరలు వాడిపోతున్నాయా? పైగా ఎప్పుడూ కొత్త ఆకులు కొనుకోవడం మర్చిపోతుంటారా? టెన్షన్ వద్దు! వేకిజ్ హెర్బ్ కీపర్ తీసుకోండి. ఎందుకంటే ఇది సాధారణ కంటైనర్ కాదు. వేకిజ్ హెర్బ్ కీపర్ ఏబీఎస్ గ్రేడ్ ప్లాస్టిక్ తో తయారైంది, స్ట్రాంగ్ అండ్ సేఫ్. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఏదైనా ఆకుకూర పెట్టి, కొంచెం నీరు వేసి మూత పెట్టండి అంతే! ఇది ట్రాన్స్పరెంట్గా ఉండటం వల్ల లోపల ఏముందనేది స్పష్టంగా చూడొచ్చు. పైగా, ఎయిర్ గ్రూవ్ ఉన్న మూత వల్ల ఆకులు తడిగా, పచ్చగా, ఫ్రెష్గా ఉంటాయి. ప్రతి మూడు నుంచి ఐదు రోజుల్లో నీరు మార్చినపుడు, ఆకులు మూడు వారాల వరకు పచ్చగా ఉంటాయి. ధర రూ. 350.
జియోమార్ట్లో ఐఫోన్పై భారీ తగ్గింపు!
యాపిల్ హాలిడే సేల్ను మిస్ అయ్యారా? ఆందోళన అవసరం లేదు. జియోమార్ట్ ఇప్పుడు ఐఫోన్ ప్రేమికుల కోసం అత్యంత లాభదాయకమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఐఫోన్ 16 ప్లస్ (iPhone 16 Plus) (128బీజీ)మోడల్ ఇప్పుడు జియోమార్ట్లో కేవలం రూ.65,990లకే లభిస్తోంది.ఐఫోన్ 16 ప్లస్ 128బీజీ వేరియంట్ అసలు ధర రూ.89,900 కాగా నేరుగా రూ. 23,910 తగ్గింపు అందిస్తోంది. అదనంగా ఎస్బీఐ కో-బ్రాండెడ్ ప్లాటినం క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ (EMI) లావాదేవీలపై 5% క్యాష్ బ్యాక్ (రూ.1,000 వరకు) లభిస్తుంది. తద్వారా ఫోన్ ధర రూ.64,990 లకు తగ్గుతుంది.అంతేకాకుండా పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా మరింత అదనపు తగ్గింపు పొందవచ్చు. యాపిల్ అధికారికంగా ఐఫోన్ 17 (iPhone 17) విడుదల నేపథ్యంలో ఐఫోన్ 16 సిరీస్ ధరను తగ్గించినప్పటికీ, జియోమార్ట్ ధరలు అధికారిక స్టోర్ సవరించిన ధర రూ.79,900 కంటే గణనీయంగా తక్కువగా ఉన్నాయి.ఐఫోన్ 16 ప్లస్ ప్రధాన స్పెక్స్డిస్ప్లే: 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ ఓఎల్ఈడీ, సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ప్రాసెసర్: యాపిల్ ఏ18 చిప్, 6-కోర్ సీపీయూ, 5-కోర్ జీపీయూకెమెరా సెటప్: 48MP మెయిన్ ఫ్యూజన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 2x ఆప్టికల్ క్వాలిటీ టెలిఫోటో జూమ్, కొత్త కెమెరా కంట్రోల్ బటన్ ద్వారా త్వరిత యాక్సెస్బ్యాటరీ: 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్డిజైన్: అల్యూమినియం ఫ్రేమ్, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్కలర్ ఆప్షన్లు: బ్లాక్, వైట్, పింక్, టీల్, అల్ట్రామెరైన్స్టోరేజ్ ఆప్షన్లు: 128GB / 256GB / 512GB
పర్సనల్ ఫైనాన్స్
బ్యాంకులో డబ్బు సేఫేనా? ‘రిచ్ డాడ్’ అబద్ధాలు!
ప్రఖ్యాత రచయిత, ఆర్థిక విద్యావేత్త రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki).. తన బెస్ట్ సెల్లింగ్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad)కు ప్రసిద్ధి చెందారు. డబ్బు, భద్రత, విజయంపై సమాజం దీర్ఘకాల నమ్మకాల గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చను రేకెత్తించారు.రాబర్ట్ కియోసాకి తాజాగా ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ చేశారు. "ఇప్పటివరకు చెప్పిన అతిపెద్ద అబద్ధాలు" ఇవే అంటూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. అవి. "వాళ్లు ఎప్పటికీ సంతోషంగా ఉంటున్నారుబాండ్లు సురక్షితం.బ్యాంకులో డబ్బు సురక్షితం.నాకు ఉద్యోగ భద్రత ఉంది.కళాశాల డిగ్రీ ఆర్థిక విజయానికి కీలకం"ఈ ట్వీట్ వెంటనే వైరల్ అయింది. ఆయన ప్రస్తావించిన ప్రతి పాయింట్ ను చర్చించడంతో వేలాది లైక్లు, షేర్లు వచ్చాయి. కియోసాకి సందేశం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ ప్రధాన తత్వాన్ని ప్రతిధ్వనిస్తుంది. సాంప్రదాయ ఉపాధి విద్య వ్యవస్థల కంటే ఆర్థిక స్వాతంత్ర్యం పెట్టుబడి అక్షరాస్యత సంపదకు మరింత నమ్మదగిన మార్గాలు అన్నది కియోసాకి అభిప్రాయం.👉 ఇది చదవలేదా ఇంకా: అదిగో భారీ క్రాష్.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్!BIGGEST LIES EVER TOLD:1: “They lived happily ever after.”2: “Bonds are safe.”3: “Safe as money in the bank.”4: “I have job security.”5: “ A college degree is the key to financial success.”— Robert Kiyosaki (@theRealKiyosaki) November 2, 2025
సామాన్యులకు తెలియని నగదు సూత్రాలు
ధనవంతులుగా మారడం కేవలం అదృష్టం లేదా అధిక జీతం వల్ల మాత్రమే సాధ్యం కాదు. నిరంతర కృషి, తెలివైన ఆర్థిక నిర్ణయాలు, కొంతమందికి తెలియని ఆర్థిక రహస్యాలు తెలుసుకొని వాటిని అనుసరించడం వంటివి ఉంటాయి. భారీగా డబ్బు సంపాదించే వారు పాటించే కొన్ని ఆర్థిక రహస్యాలను తెలుసుకుందాం.ముందు పెట్టుబడి తర్వాతే ఖర్చుసామాన్య ప్రజలు జీతం వచ్చిన తర్వాత ఖర్చులన్నీ పోగా మిగిలిన డబ్బును పొదుపు చేస్తారు. కానీ ధనవంతులు దీనికి పూర్తి విరుద్ధమైన సూత్రాన్ని పాటిస్తారు. ముందే పొదుపు తర్వాతే ఖర్చు నియమాన్ని అనుసరిస్తారు. జీతం/ఆదాయం రాగానే తమ ఆర్థిక లక్ష్యాల కోసం నిర్దిష్ట శాతాన్ని (ఉదాహరణకు 20% లేదా అంతకంటే ఎక్కువ) వెంటనే పెట్టుబడికి మళ్లిస్తారు. ఆ తర్వాతే మిగిలిన మొత్తంతో తమ ఖర్చులను ప్లాన్ చేసుకుంటారు. అత్యంత ధనవంతుడైన వారెన్ బఫెట్ కూడా ఈ సూత్రాన్నే సిఫార్సు చేస్తారు. ఇది ఖర్చులను నియంత్రించడమే కాక, ప్రతి నెలా సంపద సృష్టికి తప్పనిసరిగా నిధులు కేటాయించే క్రమశిక్షణను అలవాటు చేస్తుంది.అప్పులో మంచి-చెడుఅప్పు అంటేనే ఆర్థిక సమస్యలకు మూలం అని సామాన్యులు భావిస్తారు. కానీ ధనవంతులు అప్పును ఒక ఆర్థిక సాధనంగా ఉపయోగిస్తారు. మంచి అప్పు.. ఇది ఆదాయాన్ని సృష్టించే ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించే అప్పు. ఉదాహరణకు, అద్దెకు ఇవ్వడానికి రియల్ ఎస్టేట్ ఆస్తులు కొనడానికి తీసుకునే రుణం లేదా వ్యాపారం విస్తరణకు తీసుకునే రుణం. ఈ అప్పు ద్వారా వచ్చే ఆదాయం, రుణం వడ్డీ కంటే ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తారు.చెడు అప్పు వినియోగ వస్తువుల కోసం లేదా త్వరగా విలువ తగ్గే వస్తువుల కోసం తీసుకునే అప్పు. ఉదాహరణకు, క్రెడిట్ కార్డు రుణాలు, ఖరీదైన కార్ల ఈఎంఐలు, విలాసవంతమైన విహారయాత్రలకు తీసుకునే రుణాలు. ధనవంతులు ఇలాంటి చెడు అప్పులకు దూరంగా ఉంటారు.సంపద సృష్టికి ఆదాయ మార్గాలుసామాన్య ఉద్యోగులు కేవలం ఒకే ఒక్క ఆదాయ వనరుపై (ఉద్యోగం) ఆధారపడతారు. అందుకే వారి ఆర్థిక ఎదుగుదల పరిమితంగా ఉంటుంది. ధనవంతులు తమ ప్రధాన ఆదాయంతో పాటు అదనంగా కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయ వనరులను సృష్టిస్తారు. ఉదాహరణకు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, అద్దె ఆదాయం ఇచ్చే ఆస్తులు, రాయల్టీలు, లేదా ఒక సైడ్ బిజినెస్ వంటివి నిర్వహిస్తారు.దీర్ఘకాలిక పెట్టుబడులుత్వరగా ధనవంతులు అవ్వాలనే ఆశతో సామాన్యులు షార్ట్ కట్లు లేదా ఊహాజనిత పెట్టుబడుల్లో డబ్బును కోల్పోతారు. ధనవంతులు తక్కువ సమయంలో అధిక లాభాల కోసం వెంపర్లాడకుండా దీర్ఘకాలిక వృద్ధిని లక్ష్యంగా చేసుకుని పెట్టుబడి పెడతారు. వారు పెట్టుబడి పెట్టే కంపెనీలు, ఆస్తుల గురించి లోతుగా పరిశోధన చేస్తారు.వడ్డీపై వడ్డీదీర్ఘకాలంలో పెట్టుబడులను అలాగే ఉంచడం ద్వారా వారు కేవలం అసలుపై మాత్రమే కాక, అప్పటి వరకు వచ్చిన లాభాలపై కూడా రాబడిని పొందుతారు. ఇది సంపదను భారీగా పెంచే అసలైన రహస్యం.ఆర్థిక అక్షరాస్యత, నిరంతర అభ్యాసండబ్బు సంపాదించడం కంటే డబ్బును ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం ధనవంతుల ముఖ్య రహస్యం. ధనవంతులు ఎప్పుడూ ఆర్థిక అంశాల గురించి తెలుసుకుంటూనే ఉంటారు. వారు పన్ను నియమాలు, పెట్టుబడి పోకడలు, ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై నిరంతరం అప్డేట్ అవుతారు. సరైన ఆర్థిక ప్రణాళికలు, పన్ను ఆదా వ్యూహాల కోసం వారు మంచి ఆర్థిక సలహాదారులను, అకౌంటెంట్లను నియమించుకుంటారు. ఇది వారి డబ్బును మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.ఇదీ చదవండి: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు వాడకూడదు
అదిగో భారీ క్రాష్.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్!
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టింగ్ గురూ రాబర్ట్ కియోసాకి పెట్టుబడుల గురించి మరోసారి హెచ్చరించారు. అంతర్జాతీ మార్కెట్ల ఒడిదొడుకుల నేపథ్యంలో ‘భారీ క్రాష్ మొదలంది’ అంటూ ‘ఎక్స్’లో (గతంలో ట్విట్టర్) పోస్ట్ పెట్టారు.లక్షల మంది ఇన్వెస్టర్లు ఆర్థికంగా వినాశనానికి గురవుతారని అంచనా వేశారు. సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థలు హాని కలిగిస్తున్నాయని ఆయన నొక్కిచెప్పారు. వెండి (silver), బంగారం (gold) వంటి విలువైన లోహాలు, బిట్ కాయిన్, ఎథేరియం లాంటి క్రిప్టోకరెన్సీలు తిరోగమనం సమయంలో రక్షణ కవచాలుగా ఉపయోగపడతాయని సూచించారు.‘భారీ క్రాష్ మొదలంది. కోట్ల కొద్దీ పెట్టుబడులు తుడిచిపెట్టుకుపోతాయి. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం పెట్టుబడులే మిమ్మల్ని కాపాడేదది’ అంటూ తన ట్వీట్లో రాబర్ట్ కియోసాకి రాసుకొచ్చారు.కియోసాకి (Robert Kiyosaki) ఇలా హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. 2025 ప్రారంభం ఫిబ్రవరిలో కూడా ఇలాగే "చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్" రాబోతోందంటూ అంచనా వేస్తూ ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.MASSIVE CRASH BEGININING: Millions will be wiped out. Protect yourself. Silver, gold, Bitcoin, Ethereum investors will protect you. Take care— Robert Kiyosaki (@theRealKiyosaki) November 1, 2025
ఈపీఎఫ్ క్లెయిమ్ చేసుకోవాలా?
ఉద్యోగులు తమ అత్యవసర ఆర్థిక అవసరాల కోసం పీఎఫ్ (PF) నిధులను పొందే ప్రక్రియను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) విప్లవాత్మకంగా మార్చింది. క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్ పరిమితిని ఈ ఏడాది జూన్లో రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దాంతో క్లెయిమ్ ప్రక్రియ వేగవంతం అయింది. దీనివల్ల లక్షలాది మంది సభ్యులు ఇకపై తమ అడ్వాన్స్ క్లెయిమ్లను కేవలం 72 గంటల్లో పరిష్కరించుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో ఈపీఎఫ్ సెటిల్మెంట్ విధానాన్ని పరిశీలిద్దాం.పీఎఫ్ క్లెయిమ్ చేసుకునే విధానంEPF సభ్యులు (ఉద్యోగులు) ఆన్లైన్లో అడ్వాన్స్ లేదా తుది సెటిల్మెంట్ క్లెయిమ్ను సమర్పించడానికి ఈ కింది దశలను అనుసరించాలి.మీ UAN యాక్టివ్గా ఉండాలి.UANతో ఆధార్, PAN, బ్యాంక్ ఖాతా (IFSCతో సహా) లింక్ అయి ఉండాలి.KYC వివరాలు EPFO రికార్డుల్లో ధ్రువీకరించుకోవాలి.ముందుగా EPFO అధికారిక యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ను సందర్శించాలి.UAN, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి.హోం పేజీలో ఆన్లైన్ సేవలను ఎంచుకోవాలి.Online Services టాబ్పై క్లిక్ చేసి, డ్రాప్డౌన్ మెనూలో ‘Claim (Form-31, 19, 10C)’ ఎంచుకోవాలి.ఏ ఫారమ్ ఎందుకోసమంటే.. Form-31: అనారోగ్యం, విద్య, ఇల్లు మొదలైన వాటి కోసం పాక్షిక ఉపసంహరణ.Form-19: తుది సెటిల్మెంట్ - ఉద్యోగం మానేసిన తర్వాత.Form-10C: పెన్షన్ ఉపసంహరణ - ఉద్యోగం మానేసిన తర్వాత.తరువాత పేజీలో మీ బ్యాంక్ ఖాతా నంబర్ను నమోదు చేసి ‘Verify’పై క్లిక్ చేయాలి.నిబంధనలను అంగీకరించి ‘Proceed for Online Claim’పై క్లిక్ చేయండి.క్లెయిమ్ ఫారం వివరాలు నింపాలి.‘I Want To Apply For’ విభాగంలో మీకు అవసరమైన క్లెయిమ్ రకాన్ని ఎంచుకోవాలి.ఆన్లైన్ ఫామ్లో Amount (కావలసిన మొత్తం), ‘Employee Address (ఉద్యోగి చిరునామా)’ వంటి వివరాలను నింపాలి.డాక్యుమెంట్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.షరతులకు అంగీకరించడానికి టిక్ బాక్స్ను ఎంచుకుని, ‘Get Aadhaar OTP’పై క్లిక్ చేయాలి.మీ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చిన OTPని ఎంటర్ చేసి Submit చేయాలి.భవిష్యత్తు క్లెయిమ్ ట్రాకింగ్ కోసం ప్రాసెస్ను ధ్రువీకరిస్తూ పీడీఎఫ్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి.ఇదీ చదవండి: ఆటోమేషన్తో క్లెయిమ్ సెటిల్మెంట్ వేగవంతం


