business
-
సొంతిల్లు, వ్యాపారం దీర్ఘకాల లక్ష్యాలు
ముంబై: సొంతిల్లు సమకూర్చుకోవడం, వ్యాపారం ప్రారంభించడం, ఆర్థిక స్వేచ్ఛ.. మిలీనియల్స్ (1980–1996 మధ్య జన్మించినవారు) టాప్–3 దీర్ఘకాలిక ప్రాధాన్యతలుగా ఉన్నాయి. ‘ఫైబ్–మిలీనియల్ అప్గ్రేడ్ ఇండెక్స్’ నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. మెట్రోలు, నాన్ మెట్రో పట్టణాల్లో 8,000 మంది వ్యక్తుల అభిప్రాయాలను ఈ అధ్యయనంలో భాగంగా తెలుసుకున్నారు. ముఖ్యమైన అంశాలు.. → 30 ఏళ్లలోపు వయసు వారిలో 41 శాతం మంది సొంతంగా ఇల్లు సమకూర్చుకోవడం తమ తొలి లక్ష్యంగా చెప్పారు. → ఒంటరి పురుషులతో పోల్చితే, ఒంటరి మహిళల్లో సొంతంగా ఇల్లు కొనుగోలు చేయడం ఎక్కువ ప్రాధాన్య లక్ష్యంగా ఉంది. → వ్యాపారం ప్రారంభించడం, దాన్ని వృద్ది చేయడం 21 మంది లక్ష్యంగా ఉంది. → దీర్ఘకాలంలో ఆర్థిక స్వేచ్ఛ సాధించడమే తమ లక్ష్యమని 19 శాతం మంది చెప్పారు. → ఇక స్వల్పకాల లక్ష్యాలను గమనించినట్టయితే.. వృత్తిలో ఎదుగుదల, కొత్త గ్యాడ్జెట్, వాహనం కొనుగోలు, ఆరోగ్యం విషయంలో దృఢంగా ఉండాలని (కంటి సర్జరీలు, దంత చికిత్సలు తదితర) మిలీనియల్స్ కోరుకుంటున్నారు. → పోటీ పెరగడంతో మంచి ఉద్యోగం సంపాదించే విషయంలో మెట్రోల్లోని మిలీనియల్స్ ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఇలా భావిస్తున్నవారు 60 శాతంగా ఉన్నారు. → తాము పొదుపు చేస్తామని, ఆర్థిక అంశాలకు వ్యూహాత్మకంగా ప్రణాళిక వేసుకుంటామని 39 శాతం మంది చెప్పారు. → 21 శాతం మంది ఇతర ఆదాయ వనరుల కోసం అన్వేషిస్తామని చెబితే, దీర్ఘకాల లక్ష్యాల కోసం రుణ సాయం తీసుకుంటామని 29 శాతం మంది తెలిపారు. → 15 శాతం మందిలో దీర్ఘకాల ఆర్థిక ప్రణాళిక లేనే లేదు. → స్వల్పకాల ఆకాంక్షలను తీర్చుకునేందుకు ఫైనాన్షియల్ ఇనిస్ట్యూషన్స్ నుంచి రుణాలు తీసుకుంటామని చాలా మంది చెప్పారు. → ఈ విషయంలో యువతరానికి మార్గదర్శనం అవసరమని ఈసర్వే నివేదిక అభిప్రాయపడింది. బాధ్యతాయుతమైన రుణాల దిశగా వారిని చైతన్యవంతం చేయాలని, తద్వారా తమ రుణ పరపతిని కాపాడుకుంటూనే కలలను సాకారం చేసుకోగలరని పేర్కొంది. -
ట్రంప్ ఎఫెక్ట్!.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం కూడా నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1031.25 పాయింట్లు లేదా 1.31 పాయింట్ల నష్టంతో 76,296.55 వద్ద, నిఫ్టీ 309.80 పాయింట్లు లేదా 1.32 శాతం నష్టంతో.. 23,071.80 వద్ద నిలిచాయి. ఈ వారంలో రెండూ రోజు కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాను.అదానీ ఎంటర్ప్రైజెస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ట్రెంట్, భారతి ఎయిర్టెల్, హిందాల్కో ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన, ఉక్కు దిగుమతులపై కొత్త సుంకాలకు సంబంధించి ఇన్వెస్టర్లలో ఆందోళనలు మొదలయ్యాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో స్టీల్ కంపెనీల షేర్లు గణనీయంగా తగ్గాయి. అంతే కాకుండా అమెరికా వస్తువులపై చైనా అదనపు సుంకాలు విధించడం వంటి ఇతర దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక సమస్యలు కూడా భారతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్
-
ఈ స్కూటర్ను 18 లక్షల మంది కొనేశారు
టీవీఎస్ ఎన్టార్క్ 125 (TVS Ntorq 125) అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. 2024 డిసెంబర్ చివరి నాటికి కంపెనీ 18,88,715 యూనిట్లను విక్రయించింది. దీంతో హోండా యాక్టివా, టీవీఎస్ జుపిటర్, సుజుకి యాక్సెస్ తరువాత.. ఎన్టార్క్ 125 అత్యధికంగా అమ్ముడైన నాల్గవ స్కూటర్గా రికార్డ్ క్రియేట్ చేసింది.టీవీఎస్ మోటార్ 2018 ప్రారంభంలో ఎన్టార్క్ను ప్రవేశపెట్టింది. ఆ సమయంలో భారతదేశంలో 125సీసీ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉండేది. అప్పటి నుంచి కంపెనీ దీనిని అప్డేట్ చేస్తూ.. కొత్త వేరియంట్లను ప్రవేశపెడుతూనే ఉంది. కంపెనీ అమ్మకాలు పెరగడానికి కూడా ఈ స్కూటర్ దోహదపడింది.ఎన్టార్క్ స్కూటర్ బేస్ (డ్రమ్/డిస్క్), రేస్ ఎడిషన్, సూపర్ స్క్వాడ్ ఎడిషన్, రేస్ XP, రేస్ XT అనే ఆరు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 84,600 నుంచి రూ. 1,04,600 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. రేస్ XP ఎడిషన్ 10.2 హార్స్ పవర్, 10.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. మిగిలిన వేరియంట్స్ 9.4 హార్స్ పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి.ఇదీ చదవండి: సరికొత్త ఫీచర్లతో.. వచ్చేస్తోంది యాక్టివా 7జీఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. విదేశాల్లో కూడా 'ఎన్టార్క్'కు మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే కంపెనీ 2024 ఏప్రిల్ - డిసెంబర్ మధ్య 50640 ఎన్టార్క్ స్కూటర్లను ఎగుమతి చేసింది. ఇవి అంతకు ముందు ఏడాది కంటే 16 శాతం ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే దీనికి గ్లోబల్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. -
మహిళలూ, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా?
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ముద్ర లోన్స్ఈ వారం స్కీమ్ ‘ముద్ర లోన్స్’.ప్రాథమిక అర్హతలు కలిగిన పేద, మహిళలందరూ స్వల్ప వ్యవధిలో సూక్ష్మ, చిన్నతరహా వ్యావపారాలు మొదలుపెట్టేలా ప్రత్సహించే పథకమే ‘ముద్ర లోన్స్’. 2015, ఏప్రిల్లో ప్రారంభమైన కేంద్రప్రభుత్వ పథకమిది. ‘క్రెడిట్ గ్యారంటీ ఫండ్’ద్వారా ప్రభుత్వమే రుణ గ్యారంటీ సదుపాయాన్ని కల్పిస్తోంది. రూ. 20 లక్షల వరకు లోన్ దొరుకుతుంది. దీన్ని గ్రామీణ, వాణిజ్య, కో–ఆపరేటివ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి పొందదవచ్చు. ఈ రుణాలను మూడు విభాగాల్లో అందిస్తారు. శిశు: 50 వేల రూపాయల వరకు రుణం అందుతుంది. అతి చిన్న, వీథి వ్యాపారాలు, కుటీర పరిశ్రమలకు అనుకూలమైనది. ఇందులో అత్యధికంగా 44 వేల 891 కోట్ల రూపాయల వరకు రుణాలు అందించారు. కిశోర: దీనికింద రూ. 50 వేల నుంచి అయిదు లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. పూచీకత్తు అవసరం లేదు. తరుణ: రూ. 5 లక్షల పైబడి పది లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. లబ్ధి పొంది, రుణాన్ని విజయవంతంగా తిరిగి చెల్లిస్తున్నవారు అదనంగా మరో 20 లక్షల రూపాయల వరకు ‘తరుణ్ ప్లస్’ రుణాన్ని పొంది, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశమూ కల్పిస్తోంది ఇది. కనీస అర్హతలు: రుణాల్లో ఎగవేత రికార్డ్ ఉండకూడదు. క్రెడిట్ ట్రాక్ బాగుండాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ అవసరం. దరఖాస్తుతో ఆధార్, పాన్కార్డ్, ఓటరు ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఏడాది బ్యాంక్ స్టేట్మెంట్, వ్యాపారానికి సంబంధించిన స్కిల్ సర్టిఫికెట్ను జత చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలయితే క్యాస్ట్ సర్టిఫికెట్నూ పెట్టాలి. తరుణ్ ప్లస్ లోన్కి ఐటీఆర్ కూడా పొందుపరచాలి. ఇదీ చదవండి : Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి! 18 ఏళ్లు పైబడి 60 ఏళ్లలోపు వారందరూ అర్హులే! మంచి వ్యాపార ప్రణాళికతో బ్యాంకులను సంప్రదించాలి. బ్యాంకువారు.. మనం వ్యాపారం పెట్టాలనుకుంటున్న ప్రాంతం, వ్యాపార వృద్ధికి అక్కడున్న అవకాశాలను బట్టి ఎంత రుణమివ్వాలో నిర్ణయిస్తారు. తీసుకున్న రుణాన్ని అయిదేళ్లలోపు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. సబ్సిడీ సదుపాయం లేదు. కానీ టాప్ అప్, సీసీ లోన్స్ను పొందే వీలుంటుంది. దీనికి వస్తు ఉత్పత్తి, మార్కెట్, సేవారంగాల్లో మంచి అవకాశాలున్నాయి. కూరగాయల అంగళ్లు, విస్తరాకుల తయారీ, పేపర్ కప్స్, సారీ రోలింగ్, లాండ్రీ, కిరాణా షాప్స్, కర్రీపాయింట్స్, పిండి మరలు, జిరాక్స్, ఇంటర్నెట్, డయాగ్నస్టిక్స్, స్టేషనరీ నుంచి ఆటో, క్యాబ్, ట్రాక్టర్, వరికోత మిషన్లు, జేసీబీల దాకా దేనికైనా రుణాన్ని పొందవచ్చు. ఈ వ్యాపారం ఎలా ప్రారంభించాలి, సమస్యలను ఎలా అధిగమించాలి వంటివాటి మీద MSME,DIC, బ్యాంకింగ్ రంగాల వారు అవగాహనా సదస్సులను నిర్వహిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం కూడా శిక్షణ కార్యక్రమాలనూ చేపడుతోంది.-బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ ownership.sakshi@gmail.comనిర్వహణ : సరస్వతి రమ -
Mahakumbh-2025: పెట్టుబడి పిసరంత.. ఆదాయం కొండంత.. ఏం ఐడియాలు గురూ!
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా ఎంతో వైభవంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 26 వరకూ ఈ పవిత్ర ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా కోట్లాదిమంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఉత్సవం నేపధ్యంలో కొందరు రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోగా, మరోవైపు చిరువ్యాపారులు లక్షలు సంపాదిస్తున్నారు.టూత్ స్టిక్స్ విక్రయిస్తూ..మహా కుంభమేళా(Kumbh Mela)లో కొందరు చిరువ్యాపారులు లక్షలు సంపాదిస్తున్న ఉదంతానికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారుతున్నాయి. వీరిలో కొందరు టూత్ స్టిక్స్ విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తుండగా, మరికొందరు టీ విక్రయిస్తూ అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇటీవల ఒక కుర్రాడు కుంభమేళాలో టూత్ స్టిక్స్ అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆ కుర్రాడు ఈ ఐడియా తన గర్ల్ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పాడు. టూత్ స్టిక్స్ అమ్ముతూ తాను రోజూ వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు ఆ కుర్రాడు ఆ వీడియోలో తెలిపాడు.టీ అమ్ముతూ రోజుకు రూ. 15 వేలుమరోవ్యక్తి మహా కుంభ్లో టీ స్టాల్ ఏర్పాటు చేసుకుని టీ తోపాటు భేల్ పూరి విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ కుర్రాడు తాను భేల్ పూరీలు తయారు చేస్తూ, టీ తయారు చేసే పనికోసం మరో కుర్రాడిని నియమించి, రోజుకు రూ. 15 వేలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. ఇలాంటి మరో వీడియోలో ఒక కుర్రాడు తన చేతిలో కెటిల్ పట్టుకుని కుంభమేళా ప్రాంతమంతా కలియతిరుగుతూ టీ విక్రయిస్తున్నాడు. తాను టీ విక్రయిస్తూ(Selling tea) రోజుకు ఎనిమిది నుంచి 10 వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు.తిలకం దిద్దుతూ రోజుకు రూ. 20 వేలుమహా కుంభమేళాకు వచ్చిన భక్తులకు తిలకం దిద్దతూ ఒక వ్యాపారి రోజుకు పది వేల నుంచి 20 వేల రూపాయల వరకూ సంపాదిస్తున్నాడంటే ఎవరైనా ఆశ్యర్యపోతారు. ఇది నిజం.. ఆ వ్యాపారి తెలిపిన వివరాల ప్రకారం అతను తాను తిలకం దిద్దిన ఒక్కో వ్యక్తి నుంచి రూ. 10 చొప్పున వసూలు చేస్తున్నాడు. రోజుకు తాను రెండువేల మందికి తిలకం దిద్దుతున్నానని తెలిపాడు. ఈ మహా కుంభమేళా ముగిసేనాటికి తాను ఎనిమిది లక్షల రూపాయల వరకూ సంపాదించగలనని ఆ వ్యాపారి చెబుతున్నాడు.నాణేలు ఏరుతూ రోజుకు రూ. 4 వేలుకుంభమేళా వీడియోల్లో మరో వీడియో అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఆ వీడియోలో ఒక కుర్రాడు గంగానదిలో ఐస్కాంతం సాయంతో నాణేలను వెదుకుతున్నాడు. భక్తులు గంగానదిలో విసిరిన నాణేలను సేకరిస్తున్నట్లు ఆ కుర్రాడు చెప్పాడు. ఈ విధంగా తాను రోజుకు నాలుగు వేల రూపాయల వరకూ సంపాదిస్తున్నట్లు తెలిపి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇది కూడా చదవండి: Delhi Election: కుటుంబ ప్రతిష్టకు అగ్నిపరీక్ష -
మళ్ళీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మళ్ళీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 211.41 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 77,846.74 వద్ద, నిఫ్టీ 43.40 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టంతో 23,559.95 పాయింట్ల వద్ద నిలిచాయి.టాటా స్టీల్, భారతి ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యు స్టీల్, ట్రెంట్, హిందాల్స్కో ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), ఐటీసీ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.రెపో రేటు తగ్గించిన ఆర్బీఐరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 6.25 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కొత్త బిజినెస్లోకి అడుగుపెట్టనున్న అనన్య బిర్లా (ఫోటోలు)
-
కొత్త బిజినెస్లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!?
అందానికి ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో.. చాలామంది ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు భారతీయ ధనవంతులలో ఒకరు.. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ 'కుమార్ మంగళం బిర్లా' పెద్ద కుమార్తె 'అనన్య బిర్లా' (Ananya Birla) చేరనున్నారు. ఈమె బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు.ఫిబ్రవరి 5న, అనన్య బిర్లా ఒక బ్యూటీ బ్రాండ్ను ప్రారంభించాలనే తన ప్రణాళికలను వెల్లడించింది. ఇది టాటాస్, హిందుస్తాన్ యూనిలీవర్ (HUL), లోరియల్ (L'Oréal) వంటి వాటితో పాటు ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ 'తిరా'కు కూడా పోటీ ఇవ్వనున్నట్లు సమాచారం.భారతదేశంలో అందానికి సంబంధించిన ఉత్పత్తుల వినియోగం పెరుగుతోంది. కాబట్టి ఈ రంగం ఏటా 10-11 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ఇది 2028 నాటికి 34 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. దీనిని దృష్టిలో ఉంచుకుని మేకప్, సువాసనలతో సహా అన్ని విభాగాలలో వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని.. దశలవారీగా తమ వ్యాపారం ప్రారంభమవుతుందని అనన్య బిర్లా వెల్లడించారు.అనన్య బిర్లా ప్రారంభించనున్న వెంచర్ పేరు, అది ఏ బ్రాండ్స్ అందిస్తుందనే విషయాలు అధికారికంగా వెల్లడికాలేదు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులను భారత మార్కెట్కు తీసుకురావడం లక్ష్యంగా ఈ వెంచర్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈమె ప్రారంభించనున్న వ్యాపారానికి బాలీవుడ్ నటి 'జాన్వీ కపూర్' బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం.అనన్య బిర్లాఅనన్య బిర్లా.. ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత, దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన కుమార మంగళం బిర్లా కుమార్తె. సాంప్రదాయ వ్యాపారాలను విడిచిపెట్టి తనకంటూ సొంత మార్గాన్ని ఎంచుకుంది. ఒక్క బిజినెస్లోనే కాకుండా వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సింగర్, రైటర్ కూడా.అనన్య బిర్లా ముంబైలోని అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది. ఆ తరువాత యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉన్నత చదువులు చదివింది. చదువు పూర్తయిన తరువాత ప్రారంభించిన 'స్వతంత్ర మైక్రోఫైనాన్స్' సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అల్పాదాయ వర్గాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సేవలను అందిస్తోంది. ఈ సంస్థకు ఆమె సీఈవోగా కూడా ఉన్నారు. అలాగే క్యూరోకార్టే అనే లగ్జరీ ఈ-కామర్స్ సంస్థను కూడా ఆమె ప్రారంభించారు. హస్త కళాకృతులు, శిల్పకళా ఉత్పత్తులను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది.ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతనుకు టాటా మోటార్స్లో కీలక బాధ్యతలుస్వతంత్ర మైక్రోఫిన్అనన్య బిర్లా తన 17ఏళ్ల వయసులోనే.. మైక్రో లెండింగ్ కంపెనీ 'స్వతంత్ర మైక్రోఫిన్' ప్రారంభించింది. ఈ సంస్థ ఇప్పుడు దేశంలోని రెండో అతిపెద్ద ఎన్బీఎఫ్సీ ఎంఎఫ్ఐగా రికార్డ్ సృష్టించింది. అంతే కాకుండా ఈమె ఏఐ ప్లాట్ఫామ్ బీటా వెర్షన్ను కూడా ప్రారంభించింది. ఇప్పుడు ముచ్చటగా మూడో వెంచర్ ప్రారభించడానికి సిద్ధమైంది. -
రతన్ టాటా ఫ్రెండ్.. శంతనుకు టాటా మోటార్స్లో కీలక బాధ్యతలు
దివంగత వ్యాపార దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) మిత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్న 'శంతను నాయుడు' (Shantanu Naidu)కు టాటా మోటార్స్లో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈయన కంపెనీలో జనరల్ మేనేజర్ & స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని తానె స్వయంగా తన లింక్డ్ఇన్లో వెల్లడించారు.''టాటా మోటార్స్లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్ & జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నా తండ్రి తన తెల్లటి చొక్కా, నేవీ ప్యాంటుతో టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి ఇంటికి నడిచి వచ్చేవారు. ఆయన కోసం నేను కిటికీలో చూస్తూ ఉండేవాడిని. ఆ సంఘటన నాకు ఇంకా గుర్తుంది'' అని శంతను నాయుడు తన లింక్డ్ఇన్లో రాశారు.ఎవరీ శంతను నాయుడు?శంతను నాయుడు ఒక ఆటోమొబైల్ డిజైన్ ఇంజినీర్. ఇతడు ఒక రోజు రోడ్డు మధ్యలో వీధి కుక్క చనిపోయి ఉండటాన్ని గమనించిన చలించిపోయాడు. ఆ తరువాత వీధి కుక్కుల సంరక్షణకు ఏదో ఒకటి చేయాలని ఆలోచనలో పడ్డాడు. తన స్నేహితులతో కలిసి వీధి కుక్కల కోసం రేడియం స్టిక్కర్లతో తయారు చేసిన కాలర్స్ని తయారు చేశాడు. తన ఇంటి పరిసరాల్లోని కుక్కలకు వాటిని అమర్చాడు. ఆ పనికి మరుసటి రోజే స్థానికుల నుంచి మెప్పు పొందాడు.ముంబైలో ఉన్న వీధి కుక్కలన్నింటికీ ఈ రేడియం కాలర్ అమర్చాలని నిర్ణయించారు. కానీ అది డబ్బుతో కూడకున్న వ్యవహారం కావడంతో విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. ఆయన ‘వీధి కుక్కలను కాపాడేందుకు సాయం చేయాల్సిందిగా రతన్ టాటాని అడుగు. ఆయనకు కుక్కలంటే ఇష్టం’ అని సలహా ఇచ్చాడు.మోటోపాస్ పేరుతో స్టార్టప్వీధి కుక్కలను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేందుకు ‘మోటోపాస్’ పేరుతో స్టార్టప్ ఏర్పాటు చేశానని, దానికి సాయం చేయాల్సిందిగా కోరుతూ పూర్తి వివరాలు కలిగిన ఈ మెయిల్ను ఏకంగా రతన్టాటాకే పంపాడు. రోజులు గడుస్తున్నా ఎలాంటి రిప్లై లేకపోవడంతో తన పనిలో తాను నిమగ్నమయ్యాడు.చివరకు రెండు నెలల తర్వాత నేరుగా తనని కలవాలంటూ రతన్టాటా నుంచి ఆహ్వానం అందింది. అదే రతన్టాటాతో శంతన్ నాయుడికి తొలి పరిచయం ఏర్పడేలా చేసింది. వ్యక్తిగతంగా రతన్ టాటాను కలిసి తన ప్రాజెక్టు గురించి వివరించాడు. వీధి కుక్కల పట్ల అతను చూపించే ప్రేమకు రతన్టాటా ఫిదా అయ్యారు. వెంటనే సాయం చేసేందుకు అంగీకరించారు. అలా మోటోపాస్ స్టార్టప్నకు ఆర్థికసాయం అందింది.కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు రావడంతో శంతను అమెరికా బయల్దేరాడు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత టాటా గ్రూపులో పని చేయాలని శంతను నిర్ణయించుకున్నాడు. MBA పూర్తి చేసి ఇండియాకు వచ్చిన తర్వాత టాటా ట్రస్టులో డిప్యూటీ జనరల్ మేనేజర్(డిజీఎం) హోదాలో చేరారు. అయితే కొద్ది కాలానికే శంతను నాయుడును పిలిపించుకున్న రతన్ టాటా..తనకు వ్యక్తిగత సహాయకుడిగా ఉండాలని కోరారు. దాంతో 2018 నుంచి టాటా తుది శ్వాస వరకు వెన్నంటి ఉన్నాడు.ఇదీ చదవండి: కొత్త టోల్ విధానం.. ముందుగా చెప్పిన నితిన్ గడ్కరీగుడ్ఫెలోస్సాటి జీవుల పట్ల శంతను నాయుడికి ఉన్న ప్రేమ రతన్టాటాను ఆకట్టుకున్నాయి. శంతన్ నాయుడి ఆలోచణ సరళి టాటాను ఆకర్షించింది. మోటోపాస్తోపాటు శంతన్ సెప్టెంబర్ 2022లో ‘గుడ్ఫెలోస్’ను స్థాపించారు. ఇది యువకులను మమేకం చేసి సీనియర్ సిటిజన్ల ఒంటరితనం పోగొట్టేందుకు పనిచేస్తోంది. అతను ‘ఐ కేమ్ అపాన్ ఎ లైట్హౌస్’ పేరుతో రతన్ టాటాతో ఉన్న జ్ఞాపకాలు, తన నుంచి నేర్చుకున్న విషయాలపై పుస్తకం రాశారు. -
ఇండియన్ కి గ్రీన్ కార్డ్ రావడానికి ఎంత టైం పడుతుంది..!
-
నాడు నెలకు 10 వేలు.. నేడు లక్షలు.. సందీప్ జీవితం మారిందిలా..
ఉద్యోగం కన్నా ఉపాధి మార్గం ఉత్తమం అని కొందరు అంటుంటారు. ఈ దిశగా పయనిస్తూ చాలామంది విజయం సాధించారు. ఇదే తరహాలో ముందడుగు వేసిన ఒక యువకుడు అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదిగాడు. అందరికి స్ఫూర్తిని అందిస్తున్నాడు. మరి ఆ యువకుడు ఎవరో ఏం సాధించాడో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ఇటీవలి కాలంలో పర్యాటకరంగ వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో చాలామందికి ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ జాబితాలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచిందని చెబుతుంటారు. పర్యాటకరంగం అభివృద్ధి కారణంగా గుజరాత్లోని యువత నూతన స్టార్టప్(New startup)లతో జీవనోపాధి పొందుతున్నారు. అలాంటివాటిలో ఒకటే టాక్సీ సర్వీస్ నిర్వహణ.కుటుంబంతో సహా ఎక్కడికైనా వెళ్లాలనుకునేవారు టాక్సీ ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తుంటారు. టాక్సీ బుక్ చేసుకుని పర్యాటక ప్రదేశాల్లో విహరిస్తుంటారు. గుజరాత్లోని జామ్నగర్లో ఒక గ్యారేజీలో పనిచేసే సందీప్ ప్రజాపతి ట్యాక్సీ సర్వీస్ ప్రారంభించాడు. అతనుంటున్న ప్రాంతానికి సమీపంలోని ద్వారకతో పాటు శివరాజ్పూర్ బీచ్, సుదర్శన్ సేతు, హర్షద్ అండ్ భన్వాడ్ తదితర పర్యాటక ప్రదేశాలకు(tourist places) ట్యాక్సీని నడపడం ప్రారంభించాడు. దీనికి అనతి కాలంలోనే పరిమితమైన ఆదరణ దక్కింది.సందీప్ ప్రజాపతి గుజరాత్(Gujarat)లో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాల గురించి అధ్యయనం చేశాడు. ‘ఖుషి క్యాబ్’ పేరుతో టాక్సీ సర్వీస్ మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా అతని వ్యాపారం(Business) అభివృద్ధి చెందింది. ప్రస్తుతం నాలుగు ట్యాక్సీలు, ఎనిమిది మంది డ్రైవర్లతో సందీప్ ప్రజాపతి వ్యాపారం అందరూ మెచ్చుకునేలా నడుస్తోంది. తన కార్లకోసం గ్యారేజీని ఏర్పాటు చేసిన సందీప్ ఇద్దరు వర్కర్లను కూడా నియమించుకున్నాడు. కిలోమీటరుకు రూ. 10 నుండి రూ. 15 వరకూ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నాడు. గతంలో మెకానిక్గా పనిచేస్తూ నెలకు రూ. 10 వేలు సంపాదించే సందీప్ నేడు లక్షల్లో ఆదాయాన్ని అందుకుంటున్నాడు.ఇది కూడా చదవండి: కుంభమేళా నుంచి అయోధ్యకు జనప్రవాహం -
Iran: ముగ్గురు భారతీయులు అదృశ్యం
ఇరాన్లో ముగ్గురు భారత పౌరులు అదృశ్యమయ్యారు. ఈ ముగ్గురు పౌరులు వ్యాపార ప్రయోజనాల కోసం ఇరాన్కు వెళ్లారు. తరువాత అదృశ్యమయ్యారు. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం ఈ సమస్యను ఇరాన్ ప్రభుత్వం ముందు ఉంచింది. ఈ ఉదంతంలో మరింత సమాచారం కోసం ఇరాన్లో అదృశ్యమైన భారత పౌరుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం గతఏడాది డిసెంబర్ నెలలో ముగ్గురు భారతీయ పౌరులు వ్యాపార ప్రయోజనాల కోసం ఇరాన్కు వెళ్లారు. అయితే వారు అక్కడికి చేరుకున్నాక వారికి వారి కుటుంబాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఘటన గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది. దీనిపై దర్యాప్తు కోసం భారత్.. ఇరాన్పై ఒత్తిడి తీసుకువచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.ఈ విషయాన్ని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంతో పాటు టెహ్రాన్లోని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేశామని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. దీంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ, టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం దీనిపై ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయన్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఈ బావిలో అదృశ్య ‘సరస్వతి’ ప్రవాహం -
జపాన్కు మేడ్ ఇన్ ఇండియా కారు
భారతదేశంలో తయారవుతున్న వాహనాలకు.. విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే పలు వాహనాలు మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా 'మారుతి సుజుకి' (Maruti Suzuki) కంపెనీకి చెందిన 'జిమ్నీ' (Jimny) జపాన్కు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఈ కారుకు జపాన్లో కూడా అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది.2023లో జరిగిన ఆటో ఎక్స్పోలో కనిపించిన మారుతి జిమ్నీ.. ప్రస్తుతం 5 డోర్ వెర్షన్ రూపంలో కూడా అమ్మకానికి ఉంది. ఇదే ఇప్పుడు జపాన్లో విక్రయానికి సిద్ధమైంది. అంతే కాకుండా 2024-25 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి అత్యధికంగా ఎగుమతి చేసిన వాహనాల్లో ఇది రెండో మోడల్ అని తెలుస్తోంది.జిమ్నీ 5 డోర్ కారు హర్యానాలోని గురుగ్రామ్లో.. మారుతి సుజుకి తయారీ కేంద్రంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇది గ్లోబల్ ఆఫ్ రోడర్గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే ఈ కారును కంపెనీ దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు జపాన్కు కూడా తరలించింది. మొత్తం మీద కంపెనీ ఇప్పటి వరకు 3.5 లక్షల కంటే ఎక్కువ జిమ్నీ కార్లు గ్లోబల్ మార్కెట్లో అమ్ముడయ్యాయి.జిమ్నీ 5 డోర్ మోడల్ జపాన్లో ప్రారంభమైన సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ హిసాషి టకేయుచి (Hisashi Takeuchi) మాట్లాడుతూ.. జపాన్లో 'మేడ్ ఇన్ ఇండియా' జిమ్నీ 5-డోర్ను ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆగష్టు 2004లో కంపెనీ అత్యధికంగా ఎగుమతిచేసిన కార్లలో 'ఫ్రాంక్స్' తరువాత.. జిమ్నీ ఉంది. మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి మార్కెట్లలో అమ్మకాల పరంగా ఇది గొప్ప విజయం సాధించిందని అన్నారు.జిమ్నీ 5 డోర్రూ. 12.47 లక్షల ప్రారంభ ధర వద్ద మార్కెట్లో లాంచ్ అయిన మారుతి జిమ్నీ.. ప్రత్యేకంగా ఆఫ్ రోడింగ్ విభాగంలో ఓ పాపులర్ మోడల్. కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ మోడల్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 105 హార్స్ పవర్, 134 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వంటివి పొందుతుంది. -
వచ్చే రెండేళ్లలో రూ. 1000 కోట్లు: రియల్టీ దిగ్గజం
చెన్నై: కార్యకలాపాల విస్తరణలో భాగంగా రియల్టీ దిగ్గజం జీ స్క్వేర్ రియల్టర్స్ వచ్చే రెండేళ్లలో రూ. 1,000 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం హైదరాబాద్, కోయంబత్తూర్ తదితర నగరాల్లో ప్లాట్లను విక్రయిస్తున్న కంపెనీ ఇక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడువ్యాప్తంగా రెసిడెన్షియల్ విభాగంలోకి విస్తరించాలని భావిస్తోంది. విల్లాలు, అపార్ట్మెంట్లను కూడా నిర్మించనుంది. ప్లాట్ మార్కెట్లో విజయవంతమైన నేపథ్యంలో గృహాల మార్కెట్లోకి కూడా ప్రవేశిస్తున్నట్లు సంస్థ ఎండీ బలరామజయం తెలిపారు. జీ స్క్వేర్ ఇప్పటివరకు 127 ప్రాజెక్టులను పూర్తి చేసిందని, 15,000 మంది పైగా కస్టమర్లకు సేవలు అందించిందని వివరించారు. -
ప్లాస్టిక్ మెటీరియల్స్ రీసైక్లింగ్ కోసం.. తొలి జాయింట్ వెంచర్
ముంబై: రీ సస్టెయినబిలిటీ కంపెనీ (ReSL)లో భాగమైన రీ సస్టెయినబిలిటీ అండ్ రీసైక్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (Re Sustainability and Recycling Private Limited (ReSRL)) మరియు స్పెషాలిటీ కెమికల్స్ విభాగంలో పేరొందిన ఆర్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్ (AIL) అనుబంధ సంస్థ ఆర్తి సర్క్యులారిటీ లిమిటెడ్ (Aarti Circularity Limited (ACL)) కలిసి జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు చేతులు కలిపాయి. ప్లాస్టిక్ వనరుల రికవరీ మరియు పర్యావరణహిత వనరుల నిర్వహణ విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే దిశగా భారతదేశవ్యాప్తంగా ప్లాస్టిక్ మెటీరియల్స్ రీసైక్లింగ్ ఫెసిలిటీలను (PMRF) అభివృద్ధి చేసే క్రమంలో భారత్లో ఈ తరహాలో ఇదే తొలి జాయింట్ వెంచర్గా నిలవనుంది.ప్లాస్టిక్స్ సహా వివిధ వ్యర్ధాలను వేరు చేసి, వనరులను వెలికి తీసి, రీసైక్లింగ్ చేయడం ద్వారా ముడి సరుకుగా, ఇంధనాలుగా లేదా రీసైకిల్డ్ పాలిమర్ ఫీడ్స్టాక్గా ఉపయోగపడే అడ్వాన్స్డ్ సర్క్యులర్ మెటీరియల్స్ (ఏసీఎం) ఉత్పత్తి చేయడంపై పీఎంఆర్ఎఫ్లు ప్రధానంగా దృష్టి పెడతాయి. 2030 నాటికి రోజుకు కనీసం సుమారు 500 టన్నుల వనరుల రికవరీ సామర్థ్యాన్ని సాధించాలని భాగస్వామ్యం నిర్దేశించుకుంది. అలాగే మెటీరియల్, పవర్ సర్క్యులారిటీని గరిష్ట స్థాయిలో మెరుగుపర్చే దిశగా, ReSL కార్యకలాపాల ద్వారా కూడా ఉత్పత్తయ్యే వాటితో సహా వివిధ ఫీడ్స్టాక్స్ను పరిశీలించాలని కూడా నిర్దేశించుకుంది.ఈ భాగస్వామ్యం కింద తొలి ప్లాస్టిక్స్ మెటీరియల్స్ రీసైక్లింగ్ ప్లాంటు తెలంగాణలోని హైదరాబాద్లో ఏర్పాటు కానుంది. ప్రాంతీయంగా అధునాతన రీసైక్లింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఇది బాటలు వేస్తుంది. పర్యావరణహితమైన విధంగా వ్యర్ధాల నిర్వహణను చేపట్టే దిశగా సాగుతున్న భారత ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయిగా నిలవగలదు. సుస్థిరత మరియు సాంకేతిక ఆవిష్కరణల విషయంలో ఇరు సంస్థలకు గల నిబద్ధతకు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం నిదర్శనంగా నిలుస్తుంది. భారతదేశపు రీసైక్లింగ్ మరియు వ్యర్ధాల నిర్వహణ రంగాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పేలా, అధునాతన పీఎంఆర్ఎఫ్లను రూపొందించి, నిర్వహించేందుకు తగిన అగ్రగామి సాంకేతిక భాగస్వాములను జాయింట్ వెంచర్ కంపెనీ ఎంచుకుంటుంది.“పర్యావరణహితంగా వనరులను నిర్వహించే దిశగా సాగుతున్న మా ప్రస్థానంలో ఈ భాగస్వామ్యం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది. వ్యర్ధాల నిర్వహణ మరియు వనరుల రికవరీకి సంబంధించి మాకున్న అపార అనుభవం మరియు ఆర్తి ఇండస్ట్రీస్ యొక్క సుసంపన్నమైన వారసత్వం మరియు స్పెషాలిటీ కెమికల్స్ తయారీలో ఆ సంస్థకున్న 40 ఏళ్ల అనుభవం ఈ భాగస్వామ్య ఒప్పందానికి దన్నుగా నిలవనున్నాయి. క్రిటికల్ వ్యర్ధాల సవాళ్లను పరిష్కరించే అధునాతన మౌలిక సదుపాయాలను నిర్మించడంలో మాకు తోడ్పడనున్నాయి. అత్యాధునిక టెక్నాలజీలు మరియు పర్యావరణహిత విధానాలను ఉపయోగించడం ద్వారా వనరులను సమర్ధంగా నిర్వహించుకోవడం మరియు సర్క్యులారిటీ తోడ్పాటుతో పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించి, ఆర్థిక వృద్ధిని పెంపొందించే పటిష్టమైన వ్యవస్థను సృష్టించాలనేది మా లక్ష్యం. భారత్లోను, ఇతర ప్రాంతాల్లోనూ సుస్థిర అభివృద్ధికి సంబంధించి మేము సమష్టిగా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతాం” అని రీ సస్టెయినబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో Mr. మసూద్ మాలిక్ తెలిపారు.“ACL, ReSRL మధ్య భాగస్వామ్యమనేది, రెండు దిగ్గజ సంస్థల శక్తి, సామర్థ్యాల మేలు కలయిక ద్వారా, సుస్థిరతకు నవకల్పనలను మేళవించి తీవ్రమైన పర్యావరణ సవాళ్లను పరిష్కరించేందుకు తోడ్పడగలదు. ఈ జేవీ ద్వారా భారతదేశంలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ప్లాస్టిక్ రీసైక్లింగ్లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలనేది మా లక్ష్యం. సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, వ్యర్ధాల ఉత్పత్తిని తగ్గించడం, సహజ వనరుల వినియోగంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం మరియు పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించడమనే ఏసీఎల్ విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉంటుంది” అని ఆర్తి సర్క్యులారిటీ లిమిటెడ్ డైరెక్టర్ Mr. మిరిక్ గోగ్రి (Mirik Gogri) తెలిపారు. -
ఎయిర్క్రాఫ్ట్ ఎంఆర్వో సేవల్లోకి స్టార్ ఎయిర్
ముంబై: ప్రాంతీయ విమానయాన సంస్థ స్టార్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ ఎంఆర్వో సేవల వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. 2019లో ప్రారంభమైన బెంగళూరుకు చెందిన ఈ సంస్థ ఆరేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. మార్చి నాటికి ఫ్లీట్ సంఖ్య 14కు చేర్చనున్నట్టు వెల్లడించింది. అలాగే సర్వీసుల సంఖ్యను 100కు పెంచనున్నట్టు తెలిపింది.ప్రస్తుతం సంస్థ వద్ద ఎంబ్రాయర్ తయారీ తొమ్మిది విమానాలు ఉన్నాయి. 23 కేంద్రాలను అనుసంధానిస్తూ రోజుకు 44 సర్వీసులను నడుపుతోంది. 15 లక్షల మందికిపైగా కస్టమర్లకు సేవలు అందించింది. ఉడాన్ స్కీమ్ కింద కంపెనీకి కేటాయించిన రూట్లలో 90 శాతంపైగా కవర్ చేసినట్టు స్టార్ ఎయిర్ సీఈవో సిమ్రాన్ సింగ్ తివానా తెలిపారు. నెట్వర్క్కు మరో అయిదు కేంద్రాలు తోడు కానున్నట్టు చెప్పారు. -
బ్యాటరీ రంగంలో భారీ పెట్టుబడులు: ఐఈఎస్ఏ
న్యూఢిల్లీ: బ్యాటరీ, మొబిలిటీ స్టార్టప్ వ్యవస్థలో.. భారతదేశానికి 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు ఏడాదిలో రావొచ్చని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) అంచనా వేసింది.పెట్టుబడులు నూతన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధిని నడిపించడంతోపాటు ఈ స్టార్టప్లు తయారు చేసే ఉత్పత్తుల పురోగతికి దోహదం చేస్తుందని ఐఈఎస్ఏ తెలిపింది. అంతేగాక బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సేఫ్టీ మేనేజ్మెంట్, విడిభాగాల తయారీ కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని వివరించింది.స్టార్టప్, ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ద్వా రా అంకుర కంపెనీలను ప్రోత్సహించడానికి ఐఈఎస్ఏ చురుకుగా పని చేస్తోంది. ఇప్పటికే 400 స్టార్టప్లు, యూనిడో, ఐక్రియేట్, ఇండి యా యాక్సిలరేటర్, ఇతర ప్రముఖ సంస్థల తో చేతులు కలిపింది. స్టార్టప్లకు పెట్టుబడి మద్దతు, మార్గదర్శకత్వం, సాంకేతిక ధ్రువీకరణ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యానికి సాయపడుతోంది. -
ఆఫర్లే.. ఆఫర్లు!..ఐదు రోజులు మాత్రమే
రిపబ్లిక్ డే దగ్గర పడుతున్న సందర్బంగా.. ఇప్పటికే పలు ఈ కామర్స్ సంస్థలు ఆఫర్స్ అందించడం మొదలుపెట్టేశాయి. ఈ తరుణంలో స్మార్ట్ బజార్ (SMART Bazaar) 'ఫుల్ పైసా వసూల్ సేల్' ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ సేల్ 2025 జనవరి 22 నుంచి 26 వరకు మాత్రమే ఉంటుంది.స్మార్ట్ బజార్ ప్రారంభించనున్న ఈ ఫుల్ పైసా వసూల్ సేల్ ద్వారా భారీ డిస్కౌంట్స్ లభించనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 900 కంటే ఎక్కువ స్టోర్లలో కస్టమర్లు ఈ డిస్కౌంట్స్ పొందవచ్చు. కేవలం 799 రూపాయలకే 5 కేజీల బియ్యం 3 లీటర్ల నూనె, కూల్ డ్రింక్స్ మూడు కొంటే.. ఒకటి ఫ్రీ, బిస్కెట్లు రెండు కొంటే.. ఒకటి ఫ్రీ, డిటర్జెంట్లపై 33 శాతం తగ్గింపు వాణి వాటితో పాటు చాక్లెట్లు, గృహాలంకరణ, దుస్తులపై కూడా మంచి డిస్కౌంట్స్ లభిస్తాయి.నిల్వ చేసుకోగలిగిన నిత్యావసర వస్తువులు, కిరాణా వస్తువులను కొనుగోలు చేయడానికి ఇది ఓ మంచి అవకాశం. స్మార్ట్ బజార్ ఫుల్ పైసా వసూల్ సేల్ ద్వారా కస్టమర్లు కొంత మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. కంపెనీ దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియోను తన ఎక్స్ (Twitter) ఖాతాలో షేర్ చేసింది.Delhi, Goa, Kashmir, Kerala. Secure karo apne travel plans best luggage ke saath. Visit SMART Bazaar Full Paisa Vasool Sale. Live from 22nd to 26th January. #SMARTBazaar #FullPaisaVasoolSale #MehengaiKaMeter#Sale pic.twitter.com/a2ygGiuqhE— SMART Bazaar (@SMARTBazaarIn) January 20, 2025 -
క్షమించండి.. మళ్ళీ ఇలా జరగదు: జొమాటో సీఈఓ
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ 'జొమాటో' (Zomato) సీఈఓ 'దీపిందర్ గోయల్' (Deepinder Goyal) వినియోగదారులకు క్షమాపణలు చెప్పారు. ఇంతకీ గోయల్ ఎందుకు సారీ చెప్పారు? దీనికి కారణం ఏమిటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.జొమాటో వెజిటేరియన్ ఫుడ్ డెలివీలపై ప్రత్యేకంగా ఎక్కువ చార్జీలు వసూలు చేస్తోంది. ఈ విషయాన్ని రోహిత్ రంజన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'వెజ్ మోడ్ ఎనేబుల్మెంట్ ఫీ' పేరుతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. అంతే కాకుండా.. ఈ రోజుల్లో భారతదేశంలో శాఖాహారిగా ఉండటం శాపంలా అనిపిస్తుందని లింక్డ్ఇన్లో పేర్కొన్నారు.సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించడం మాత్రమే కాకుండా.. ఫీజుకు సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు జొమాటోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్విగ్గీలో శాకాహార డెలివరీలపై ఎటువంటి ఛార్జీలు వసూలుచేయడం లేదని.. వెజిటేరియన్లను కూడా సమానంగా చూస్తున్నందుకు స్విగ్గీకి ధన్యవాదాలు తెలిపారు.ఈ కొత్త ఛార్జ్ సమస్యపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇలాంటి ప్లాట్ఫామ్ ఫీజులను ఎందుకు వసూలు చేస్తున్నారు. ఇలా ఎన్ని రకాలుగా ఫీజులు వసూలు చేస్తారని ఆగ్రహించారు. ఈ పోస్టుపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్పందిస్తూ.. దీనిని మా దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. తప్పు జరిగినందుకు క్షమించండి. ఈ ఫీజును ఈ రోజు నుంచే తొలగిస్తున్నామని, ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూస్తామని ఆయన అన్నారు.ఇదీ చదవండి: జొమాటో సీఈఓ కీలక ప్రకటన.. మరో రెండేళ్లు జీతం తీసుకోను -
Maha Kumbh: యధేచ్ఛగా ఎఫ్ఎంసీజీ కంపెనీల ప్రచార దందా
మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు, పర్యాటకులు రికార్డు స్థాయిలో తరలివస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రముఖ వినియోగ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు సంగమ ప్రాంతంలో తమ ప్రచార దందాను యధేచ్చగా కొనసాగిస్తున్నాయి.ప్రముఖ అగ్రశ్రేణి బ్రాండ్లు, కార్పొరేట్ సంస్థలు(Corporate organizations) ప్రయాగ్ రాజ్లో తమ కొత్త దుకాణాలను తెరిచాయి. ఇవి తమ ఉత్పత్తుల శాంపిల్ ప్యాక్లను పర్యాటకులకు ఉచితంగా పంపిణీ చేస్తూ, వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మార్కెట్లలో ధరలు పెరగడం, అమ్మకాలు తగ్గడం లాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న పలు బ్రాండ్లు మహా కుంభ్కు వచ్చే వినియోగదారులతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాయి. ఈ బ్రాండ్లు 45 రోజుల పాటు జరిగే కుంభమేళాను తమ ఉత్పత్తుల ప్రచారానికి సద్వినియోగం చేసుకుంటున్నాయి.మహా కుంభమేళాకు 40 కోట్ల మంది హాజరవుతారనే అంచనాలున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries)కు చెందిన ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్సీపీఎల్) సంగమ స్థలిలో కొత్తగా కార్యాలయం ఏర్పాటు చేసి, తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తోంది. ప్రముఖ పరిశుభ్రత బ్రాండ్ డెటాల్ కుంభమేళాలో దాదాపు 15 వేల మంది పారిశుధ్య కార్మికులకు శిక్షణ ఇచ్చింది. వారికి సబ్బులను ఉచితంగా పంపిణీ చేసింది.డాబర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మోహిత్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ ‘ఇటువంటి సాంప్రదాయ కార్యక్రమాల సమయంలో, మేము వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాన్ని కోరుకుంటామన్నారు. మా బ్రాండ్లు డాబర్ చ్యవన్ప్రాష్, డాబర్ హనీ, డాబర్ రెడ్ పేస్ట్, ఆమ్లా హెయిర్ ఆయిల్, వాటిక, హజ్మోలా, హోనిటస్ల గురించి వినియోగదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇదేవిధంగా మంగళ్దీప్ అగరుబత్తుల కంపెనీ ఇక్కడ విరివిగా ప్రచారం సాగిస్తోంది.కోకా-కోలా ఇండియా ఆసియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ గ్రీష్మా సింగ్ మాట్లాడుతూ కుంభమేళాలో పునర్వినియోగ ప్యాకేజింగ్ను ప్రోత్సహిస్తున్నామని, వినియోగదారులలో రీసైక్లింగ్పై అవగాహన పెంచేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఐటీసీ ప్రతినిధి మాట్లాడుతూ, మంగళ్దీప్ అగర్బత్తితో సహా ఐటీసీకి చెందిన ఎఫ్ఎంసీజీ బ్రాండ్లను ప్రజలకు దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నామని’ అన్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh: ఉత్సాహం ఉరకలేస్తోంది: బల్గేరియా పర్యాటకులు -
సులభతర వ్యాపారానికి పది చర్యలు
వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు పది పాయింట్ల అజెండాను భారతీయ పరిశ్రమల సమాఖ్య (CII) కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. నిబంధనల అమలు భారాన్ని తగ్గించడం, నియంత్రణపరమైన కార్యాచరణను సులభంగా మార్చడం, పారదర్శకతను పెంచడం లక్ష్యాలుగా బడ్జెట్కు ముందు సీఐఐ ఈ సూచనలు చేయడం గమనార్హం. కేంద్రం, రాష్ట్రం, స్థానిక స్థాయిలో అన్ని నియంత్రణపరమైన అనుమతులను జాతీయ సింగిల్ విండో విధానంలోనే మంజూరు చేయాలి.కోర్టుల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వివాదాల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాన్ని (ADR) తీసుకురావాలి.పర్యావరణ నిబంధనల అమలును క్రమబద్దీకరించేందుకు వీలుగా ఏకీకృత కార్యాచరణను ప్రవేశపెట్టాలి. అన్నింటితో ఒకే డాక్యుమెంట్ను తీసుకురావాలి.వ్యాపార విస్తరణ, కొత్త వ్యాపారాలకు భూమి ఎంతో అవసరం. ఆన్లైన్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ అథారిటీని అభివృద్ధి చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహించాలి. భూమి రికార్డులను డిజిటైజ్ చేయడం, వివాదాల్లో ఉన్న భూముల సమాచారం అందించడం లక్ష్యాలుగా ఉండాలి.భూసమీకరణలో పరిశ్రమకు సహకరించేందుకు వీలుగా.. చాలా రాష్ట్రాల్లో భూముల సమాచారాన్ని అందించే ‘ఇండియా ఇండ్రస్టియల్ ల్యాండ్ బ్యాంక్ (IILB)’ను కేంద్రం నిధుల సహకారంతో జాతీయ స్థాయి ల్యాండ్ బ్యాంక్గా అభివృద్ధి చేయొచ్చు. పరిశ్రమల దరఖాస్తుల మదింపును నిర్ణీత కాల వ్యవధిలో ముగించేందుకు, కేంద్ర ప్రభుత్వ శాఖల సేవలకు చట్టబద్ధమైన కాల పరిమితి నిర్ణయించాలి.కార్మిక చట్ట నిబంధనలు ఇప్పటికీ కష్టంగానే ఉన్నాయి. నాలుగు లేబర్ కోడ్ల అమలు చేయాలి. అన్ని రకాల కేంద్ర, రాష్ట్ర కారి్మక చట్ట నిబంధనల అమలుకు కేంద్రీకృత పోర్టల్గా శ్రమ్ సువిధ పోర్టల్ను అమలు చేయాలి. అథరైజ్డ్ ఎకనమిక్ ఆపరేటర్ (AEO) కార్యక్రమాన్ని తీసుకురావాలి. ఎన్నో ప్రాధాన్య అనుమతులకు మార్గం సుగమం అవుతుంది. ఇదీ చదవండి: మహా కుంభమేళాకు సైబర్ భద్రతఆర్థిక వృద్ధి కోసం తప్పదు..‘నియంత్రణ కార్యాచరణను సులభతరం చేయ డం, నిబంధనల అమలు భారాన్ని తగ్గించడం, పారదర్శకతను పెంచడం వచ్చే కొన్నేళ్ల కాలానికి ప్రాధాన్య అజెండాగా ఉండాలి. భూమి, కార్మికు లు, వివాదాల పరిష్కారం, పన్ను చెల్లింపులు, పర్యావరణ అంశాలకు సంబంధించి నిబంధనల అమలు భారాన్ని తగ్గించేందుకు ఎంతో అవకాశం ఉంది. ఇది పోటీతత్వాన్ని పెంచడంతోపాటు ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు ఊతమిస్తుంది’అని సీఐ ఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. -
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
సరికొత్త ప్రచారం!
సాక్షి, అమరావతి : వాట్సాప్ లేదా మెసేజ్లు తెరవగానే ప్రెస్టేజ్ నుంచి ప్రత్యేక ఆఫర్లు.. తనిష్క్ మీ కోసం ప్రత్యేకమైన ఆఫర్లు.. అంటూ పలు కంపెనీల మెసేజ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి బిజినెస్ మెసేజింగ్పై కంపెనీలు పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్నాయి. సాధారణ మెసేజ్లతో పోలిస్తే బిజినెస్ మెసేజ్లు 90 శాతంపైగా చదువుతుండటంతో వ్యాపార సంస్థలు తమ ప్రచారం కోసం బిజినెస్ మెసేజింగ్ను ఎంచుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో బిజినెస్ మెసేజింగ్ రూపు రేఖలు వేగంగా మారిపోతున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వ్యాపార ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇందుకోసం రిచ్ కమ్యూనికేషన్స్ సర్విసెస్ (ఆర్సీఎస్), జెనరేటివ్ ఏఐ, చాట్బోట్ వంటి సాధనాలపై దృష్టి సారిస్తున్నాయి. సాధారణ స్పామ్ మెసేజ్లు, ఇతర మెసేజ్లతో పోలిస్తే ఈ బిజినెస్ మెసేజ్లు ఎటువంటి మోసాలకు ఆస్కారం లేకుండా సెక్యూరిటీ ఉండటం, చూడగానే ఆకర్షించే విధంగా విజువల్ ఆడియోతో ఉంటుండటంతో కంపెనీలు వీటిపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ప్రతి కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారం, లేదా సమాచారం ఎప్పటికప్పుడు అందించడం కోసం గూగుల్, యాపిల్ వంటి సంస్థలు అందిస్తున్న సర్విసు సేవలను వినియోగించుకుంటున్నాయి. రూ.26 వేల కోట్ల మార్కెట్దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్ పరిమాణం 2024లో రూ.6,885 కోట్లుగా ఉండగా, 2025లో బిలియన్ డాలర్లు అంటే రూ.8,500 కోట్ల మార్కును అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ పరిమాణం మూడు రెట్లు పెరిగి రూ.26,000 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీలు అందిస్తున్న వాయిస్ బోట్స్ సర్విసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 4 శాతం కంపెనీలు ఈ బిజినెస్ మెసేజింగ్ సేవలు వినియోగించుకుంటుండగా, మరో 30 శాతం కంపెనీలు జనరేటివ్ ఏఐపై ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్లో 50 శాతం వాటాను వాట్సాప్ అందిస్తున్న ఆర్సీఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉందంటున్నారు. 2029 నాటికి దేశవ్యాప్తంగా ఆర్సీఎస్ లావాదేవీల సంఖ్య 2.54 కోట్లు దాటడంతోపాటు ఈ వ్యాపార పరిమాణం ఒక్కటే రూ.4,624 కోట్లు దాటుందని అంచనా వేస్తున్నారు. -
ఎగ్సలెంట్ ఎక్సలెంట్ ఐడియా - నెలపాటు గుడ్లు ఫ్రెష్
కోడిగుడ్డు ఓ మంచి పౌష్టికాహారం, ప్రతి రోజు ఓ గుడ్డు తినమని వైద్యులు సైతం సలహాలిస్తుంటారు. కాబట్టి చాలామంది రోజుకో గుడ్డు తినేస్తుంటారు. అయితే ప్రతి రోజూ గుడ్లు తెచ్చుకోవడం, వాటిని నిల్వ చేసుకోవడం కొంత కష్టమైన పనే. అయినా తగ్గేదేలే అన్నట్టు కొందరు గుడ్లు నిల్వచేయడానికి వివిధ పద్ధతులను అనుసరిస్తుంటారు. కానీ చాలా రోజులు నిల్వ చేసుకోవడం మాత్రం దాదాపు అసాధ్యమే. దీనిని సుసాధ్యం చేయడానికి 'ఎగ్సలెంట్' (EGGcellent) ముందుకు వచ్చింది. దీని గురించి తెలుసుకోవడానికి సంస్థ ఫౌండర్ 'విశాల్ నారాయణస్వామి'తో సంభాషించాము.మీ గురించి చెప్పండినా పేరు 'విశాల్ నారాయణస్వామి'. నేను ఎగ్సలెంట్ ప్రారభించడానికి ముందు హైడ్రోపోనిక్ వ్యవసాయంతో పంటలు పండించాను. తరువాత ఆహార వ్యర్థాలను తగ్గించడానికి.. వాటిని ఫ్రీజింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో భాగంగానే గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ చేసి అందించాలని ఈ సంస్థ ప్రారంభించాను.గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?ఇతర దేశాల్లో అయితే చిప్స్, నూడుల్స్ వంటి ఆహార పదార్థాల మాదిరిగా.. ఉడికించిన గుడ్లను కూడా షాపింగ్ మాల్స్ లేదా ఇతర స్టోర్లలో కొనుగోలు చేసి తింటున్నారు. ఈ విధానం మనదేశంలో లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారతీయులకు కూడా ఉడికించిన గుడ్లనే నేరుగా అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆలోచన వచ్చింది.ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయా?ఎగ్సలెంట్ గుడ్లు నెల రోజులు (30 రోజులు) తాజాగా ఉంటాయి. ఇప్పటికే దీనిపై రీసెర్చ్ చేసి సక్సెస్ కూడా సాధించాము. ప్రస్తుతం 60 రోజుల నుంచి 90 రోజులు నిల్వ చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా త్వరలోనే రానున్నాయి.గుడ్లను నిల్వ చేయడానికి ఏమైనా ద్రావణాలు ఉపయోగిస్తున్నారా?అవును, మేము గుడ్లను నిల్వ చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన 'ఎగ్సలెంట్ ఎగ్స్టెండర్' (EGGcellent EGGstender) ద్రావణం ఉపయోగిస్తున్నాము.ఎగ్సలెంట్స్ ప్రారంభించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?ఒకేసారి ఎక్కువ గుడ్లను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడం కష్టం. అంతే కాకుండా గుడ్ల ధరలు ప్రతి రోజూ మారుతూ ఉంటాయి. ఉదాహరణకు.. ఈ రోజు గుడ్డు ధర రూ.5 అనుకుంటే, మరుసటి రోజు అది రూ.5.50 పైసలు కావొచ్చు, 6 రూపాయలు కూడా కావొచ్చు. అలాంటప్పుడు వారానికి 10 గుడ్లు, నెలకు 30 గుడ్లు చొప్పున కొంటే.. ఎంత ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రజలు కూడా కొంత డబ్బుకు ఆదా చేసుకోవాలని.. మళ్ళీ మళ్ళీ గుడ్ల కోసం స్టోర్స్కు వెళ్లే పని తగ్గించాలని అనుకున్నాను.ఇప్పటికి కూడా చాలా మంది కొనుగోలు చేసిన గుడ్లలో.. చెడిపోయినవి లేదా పాడైపోయినవి కనిపిస్తూనే ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువగా గుడ్లను కొనుగోలు చేస్తే.. కొన్ని రోజులకు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ దూరాలకు గుడ్లను ఎగుమతి చేయాలనంటే అవి తప్పకుండా పాడైపోకుండా ఉండాలి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఎగ్సలెంట్స్ ప్రారభించాలనుకున్నాను.ఎగ్సలెంట్స్ గుడ్ల వల్ల ఉపయోగాలు ఏమిటి?భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా సంకోచం లేకుండా ఎగ్సలెంట్స్ గుడ్లను ఎగుమతి చేసుకోవచ్చు. రిమోట్ ఏరియాలలో గుడ్లను విక్రయించాలనుకునే వారు కూడా కొన్ని రోజులు నిల్వ చేసుకుని వీటిని అమ్ముకోవచ్చు.ఎగ్సలెంట్స్ గుడ్ల ధరలు ఎక్కువగా ఉంటాయా?ఎగ్సలెంట్స్ గుడ్ల ధరలు సాధారణ మార్కెట్ ధరల కంటే 6 పైసల నుంచి 15 పైసలు మాత్రమే ఎక్కువ. కానీ ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ గుడ్లను కొనుగోలు చేస్తే.. ధరలు పెరిగినప్పుడు ఆ ప్రభావం ప్రజల మీద పడకుండా ఉంటుంది. విక్రయదారులు కూడా వాటిని అప్పటి పెరిగిన ధరలకే విక్రయించుకోవచ్చు. -
ఆరు నెలల్లో 40000 మంది కొన్న బైక్ ఇది
ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్జీ (CNG) బైక్ లాంచ్ చేసిన బజాజ్ ఆటో (Bajaj Auto) ఉత్తమ అమ్మకాలను పొందుతోంది. 'ఫ్రీడమ్ 125' బైకును ఆరు నెలల్లో.. 40,000 కంటే ఎక్కువ మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ వెల్లడించారు.బజాజ్ సీఎన్జీ బైక్.. అతి తక్కువ కాలంలోనే ఎక్కువమంది వాహన వినియోగదారులకు ఆకర్శించింది. మేము దాదాపు 40,000 బైక్లను రిటైల్ చేసాము. ఇది 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుండంతో.. రోజువారీ వినియోగానికి కూడా దీనిని ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారని రాకేష్ శర్మ (Rakesh Sharma) పేర్కొన్నారు.బజాజ్ సీఎన్జీ బైకును ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో.. ఇప్పటికి సుమారు 350 పట్టణాలకు విస్తరించినట్లు రాకేష్ శర్మ వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రధాన నగరాలలో ఈ బైకును ప్రదర్శించడానికి, అక్కడ విక్రయాలను కొనసాగించడానికి కావలసిన ఏర్పాట్లను చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.బజాజ్ ఫ్రీడమ్ 125బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో మార్కెట్లో లాంచ్ అయిన సీఎన్జీ బైక్ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్థుంది. ఇది చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.బజాజ్ ఫ్రీడమ్ 125 బైకులో 2 కేజీల కెపాసిటీ కలిగిన సీఎన్జీ ట్యాంక్, అదే పరిమాణంలో పెట్రోల్ ట్యాంక్ ఉంటారు. పెట్రోల్, సీఎన్జీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుంటే బైక్ మైలేజ్ 330 కిమీ వరకు ఉంటుంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 8000 rpm వద్ద 9.5 Bhp పవర్, 6000 rpm వద్ద 9.7 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది.ఫ్రీడమ్ 125 బైక్ డిజైన్.. మార్కెట్లోని ఇతర కమ్యూటర్ మోటార్సైకిళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, డర్ట్ బైక్ స్టైల్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన సింగిల్ పీస్ సీటు వంటివి ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. -
Success Story: రూ. 5 కోట్ల టర్నోవర్కు మార్గం చూపిన ‘గుడిమల్కాపూర్’
నేటి కాలంలో యువత ఉద్యోగం చేసేకన్నా వ్యాపారం చేయడమే ఉత్తమమని భావిస్తోంది. ఈ దిశగా అడుగులు వేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ కోవలో అమోఘమైన విజయాలు సాధించినవారు కూడా ఉన్నారు. వారిలో ఒకరే అరూప్ కుమార్ ఘోష్. హైదరాబాద్లోని గుడిమాల్కాపూర్ను చూసిన ఆయన తన జీవితాన్నే పూలబాటగా మలచుకున్నారు.కలలు సాకారమయ్యేందుకు..పశ్చిమ బెంగాల్లోని కోలాఘాట్(Kolaghat)కు చెందిన అరూప్ కుమార్ ఘోష్ (33) కాలేజీ డ్రాపౌట్. అయితే ఆయన తన వ్యాపారంలో చూపిన అంకితభావం, కృషి అతనిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయి. చాలామంది యువకులు కలలను కనడంవరకే పరిమితమైతే అరూప్ మాత్రం ఆ కలలను సాకారం చేసుకున్నాడు. ఒకప్పుడు రూ.3500 జీతానికి పనిచేసిన అరూప్ ఇప్పుడు భారీ స్థాయిలో పూల వ్యాపారం చేస్తున్నాడు. బంతి పూలు, వాటి విత్తనాలను విక్రయిస్తూ, తన వ్యాపార వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్లను దాటించాడు. అయితే ఈ దిశగా సాగిన ప్రయాణంలో ఎన్నో ఒడిదుకులను ఎదుర్కొన్నాడు.పూల దుకాణంలో పనికి కుదిరి..అరూప్కి చిన్నప్పటి నుంచి పూలంటే ఎంతో ఆసక్తి ఉంది. అరూప్ కుటుంబం తొలుత వరి సాగు చేసేది. అయితే దాని నుండి వచ్చే సంపాదన అంతంత మాత్రంగానే ఉండేది. ఇదే సమయంలో పూల వ్యాపారంలో అరూప్కు మంచి అవకాశాలు కనిపించాయి. దీంతో అరూప్ కళాశాల చదువును వదిలివేసి, పూల వ్యాపారం(Flower business)లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. తన 17 ఏళ్ల వయస్సులోనే పూల అమ్మకందారులతో కలసి పనిచేయడం మొదలుపెట్టాడు. పూల వ్యాపారం గురించి మరింత తెలుసుకునేందుకు హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్ను సందర్శించాడు. తరువాత నెలకు రూ.3,500 జీతం వచ్చేలా ఒక పూల దుకాణంలో పనికి కుదిరాడు. జీతం చాలా తక్కువే అయినప్పటికీ, పూల వ్యాపారం నేర్చుకునేందుకు మంచి అవకాశం వచ్చిందని అరూప్ భావించాడు. ఉద్యోగం చేస్తూ పూల వ్యాపారంలోని సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నాడు.ఆరంభంలో భారీ నష్టాలుకొంతకాలం తరువాత అరూప్ కోలాఘాట్లోని తన ఇంటికి తిరిగి చేరుకున్నాడు. దేశంలోని వివిధ నగరాల్లోని పూల దుకాణాలకు బంతి పూలను విక్రయించడం మొదలుపెట్టాడు. మొదట్లో రూ.2000 నుంచి రూ.3000 వరకు లాభం వచ్చింది. దీంతో 2011లో కొంత భూమిని కౌలుకు తీసుకుని అరూప్ బంతిపూల సాగును ప్రారంభించాడు. ఆరంభంలో అరూప్ భారీ నష్టాలను చవిచూశాడు. తొలుత కోల్కతా రకం బంతి పూలు(Kolkata type marigolds) సాగుచేశాడు. ఆ పూలు చిన్నవిగా ఉండటంతో అమ్ముడుపోయేవికాదు. దీంతో అరూప్కు వ్యాపారంలో నష్టం వచ్చింది. అయినా అరూప్ నిరాశపడలేదు. 2011లో థాయ్ లాండ్ వెళ్లి మూడు నెలల పాటు అక్కడే ఉండి, పూల సాగులో మెళకువలు నేర్చుకున్నాడు. టెన్నిస్ బాల్ మేరిగోల్డ్ పూలు, వాటి విత్తనాలను ఉత్పత్తి చేసే సాంకేతికతను తెలుసుకున్నాడు. అక్కడి నుంచి ఒక్కో బంతిపూల రకానికి చెందిన విత్తనాలు తీసుకుని కోలాఘాట్కు చేరుకున్నాడు.ఏటా రూ. 5 కోట్లకుపైగా ఆదాయంథాయ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన అరూప్ మరింత భూమిని లీజుకు తీసుకుని, అక్కడ టెన్నిస్ బాల్ రకం బంతి పూలను సాగుచేశాడు. కోలాఘాట్ మార్కెట్లో కిలో 100 రూపాయల చొప్పున బంతిపూలను విక్రయించాడు. డిమాండ్ పెరగడంతో బంతి పూల సాగును మరింతగా పెంచాడు. బంతిపూల విత్తనాలను కూడా అమ్మడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అరూప్ బంతిపూలు, మొక్కలు, విత్తనాలను విక్రయించడం ద్వారా ఏటా రూ.5 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.ఇది కూడా చదవండి: Paramahansa Yogananda: ‘ఒక యోగి ఆత్మకథ’తో ఆధ్యాత్మిక మార్గాన్ని చూపి.. -
కొత్త ఏడాది సరికొత్త మ్యూచువల్ ఫండ్: జనవరి 16 వరకు ఛాన్స్!
ముంబై: యూటీఐ మ్యూచువల్ ఫండ్ (UTI) తమ యూటీఐ క్వాంట్ ఫండ్ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇది ప్రెడిక్టివ్ మోడలింగ్ను పెట్టుబడుల పరిశోధనల్లో యూటీఐకి గల విస్తృత అనుభవం, పెట్టుబడి ప్రక్రియలో అది పాటించే విధానాలను మేళవించి నిర్వహించబడే ఒక యాక్టివ్ ఈక్విటీ ఫండ్. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మల్చుకుంటూ, ఒడిదుడుకులను అధిగమిస్తూ, విస్తృత సూచీలకు మించిన రాబడులను స్థిరంగా అందించడమనేది ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం. ఈ ఎన్ఎఫ్వో 2025 జనవరి 2న ప్రారంభమై 2025 జనవరి 16న ముగుస్తుంది.యూటీఐ క్వాంట్ ఫండ్ అనేది అధునాతనమైన క్వాంటిటేటివ్ పెట్టుబడుల వ్యూహాన్ని పాటించే ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీము. బెంచ్మార్క్లను మించిన రాబడులు అందించే లక్ష్యంతో ఈ ఫండ్, ‘మూమెంటం, నాణ్యత, లో వోలటైలిటీ (Low Volatility), విలువ’ అనే నాలుగు అంశాలకు డైనమిక్గా వెయిటేజీని కేటాయించేలా ‘ఫ్యాక్టర్ అలొకేషన్’ విధానాన్ని పాటిస్తుంది.విస్తృత మార్కెట్లో సాధారణంగా కనిపించే హెచ్చుతగ్గులను అధిగమించేందుకు ఈ ఫ్యాక్టర్ మోడల్ సహాయకరంగా ఉంటుంది. మిగతా విధానాలతో పోలిస్తే మరింత మెరుగ్గా రిస్కుకు తగ్గ రాబడులను పొందేందుకు తోడ్పడుతుంది. వివిధ మార్కెట్ సైకిల్స్కి అనుగుణంగా మారగలిగే సామర్థ్యాల కారణంగా మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లు వివిధ ఫ్యాక్టర్స్వ్యాప్తంగా కేటాయింపులను సర్దుబాటు చేసుకునేందుకు వీలవుతుంది.ఎలాంటి మార్కెట్ పరిస్థితుల్లోనైనా ముందుకెళ్లేందుకు ఇది ఒక పటిష్టమైన సాధనంగా ఉపయోగపడగలదు. రిస్కుకు తగ్గట్లుగా రాబడులనిచ్చే విషయంలో నిర్వహించిన పరీక్షల్లో ఈ ఫండ్ పటిష్టమైన పనితీరు కనపర్చింది. కాబట్టి వివిధ మార్కెట్ పరిస్థితులవ్యాప్తంగా మెరుగైన రాబడులు పొందే అవకాశాలను కోరుకునేవారికి ఇది ఆకర్షణీయమైన ఆప్షన్ కాగలదు.“మార్కెట్ సంక్లిష్టతలను అధిగమించి, పెట్టుబడుల విషయంలో మరింత సమాచారంతో తగిన నిర్ణయాలు తీసుకునేలా ఇన్వెస్టర్లకు ఒక క్రమబద్ధమైన మరియు పరిశోధన ఆధారితమైన విధానాన్ని అందించాలనేది మా లక్ష్యం. మా పెట్టుబడి ప్రక్రియ స్కోర్ ఆల్ఫాను (Score Alpha) మా సొంత ఫ్యాక్టర్ అలొకేషన్ మోడల్తో (Factor Allocation Model) మేళవించి ఈ ఫండ్ ఒక ‘సమగ్ర పెట్టుబడుల’ విధానాన్ని అమలు చేస్తుంది.2022 ఏప్రిల్ నుంచి యూటీఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ తన ఈక్విటీ పోర్ట్ఫోలియో నిర్వహణ కోసం ఈ ప్రక్రియను అమలు చేస్తోంది. ఈక్విటీ ఫండ్కి సంబంధించి ఈ అనుభవాన్ని & విధానాన్ని మరింతగా అందుబాటులోకి తేవడంపై మేము సంతోషిస్తున్నాం” అని యూటీఐ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ శ్రీ వెట్రి సుబ్రమణియం (Vetri Subramaniam) తెలిపారు.“రుజువుల ఆధారిత వ్యూహాలతో ఇన్వెస్టర్లకు సాధికారత కల్పించేలా యూటీఐ క్వాంట్ ఫండ్ ఉంటుంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాలు అందించలేని సరళత్వాన్ని, పరిస్థితులకు తగ్గట్లుగా మారగలిగే సామర్థ్యాలను ఇది అందించగలదు. డైనమిక్గా ఉండే నిధుల కేటాయింపు మోడల్ దన్నుతో ఒకవైపు రిస్కులను జాగ్రత్తగా ఎదుర్కొంటూనే మరోవైపు అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఈ ఫండ్ పనిచేస్తుంది. ఇలా రిస్కులు మరియు రాబడుల మధ్య సమతౌల్యతను పాటించగలిగే సామర్థ్యాల కారణంగా, వివిధ మార్కెట్ పరిస్థితులవ్యాప్తంగా మెరుగైన రాబడులను కోరుకునే వారికి ఈ ఫండ్ ఆకర్షణీయమైన ఆప్షన్గా ఉండగలదని ఆశిస్తున్నాం” అని యూటీఐ ఏఎంసీ హెడ్ (ప్యాసివ్, ఆర్బిట్రేజ్ & క్వాంట్ స్ట్రాటెజీస్) శర్వన్ కుమార్ గోయల్ (Sharwan Kumar Goyal) తెలిపారు.ప్రధాన అంశాలు•ఎన్ఎఫ్వో వ్యవధి: 2025 జనవరి 2 నుంచి 2025 జనవరి 16 వరకు•పెట్టుబడి లక్ష్యం: క్వాంటిటేటివ్ పెట్టుబడి థీమ్ను అనుసరించడం ద్వారా ఈక్విటీ మరియు సంబంధిత సాధనాలలో పెట్టుబడి పెట్టి, దీర్ఘకాలిక మూలధన వృద్ధి ప్రయోజనాలను అందించడం. అయితే, స్కీము యొక్క లక్ష్యాలు నెరవేరతాయనే కచ్చితమైన హామీ ఉండదు.•బెంచ్మార్క్: BSE 200 TRI•కనిష్ట పెట్టుబడి: కనిష్ట పెట్టుబడి రూ.1,000.•పథకాలు: రెగ్యులర్ అండ్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి, రెండింటిలో కూడా గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంది.•లోడ్ స్వరూపం: సెబీ నిబంధనల ప్రకారం ఎంట్రీ లోడ్ లేదు. అయితే, అలాట్మెంట్ తేదీ నుంచి 90 రోజుల్లోపుగా రిడీమ్/స్విచ్ అవుట్ చేస్తే 1% ఎగ్జిట్ లోడ్ వర్తిస్తుంది, ఆ తర్వాత ఉండదు. -
పదే పది నిమిషాలు.. "ఇదెక్కడి టార్చర్ భయ్యా..!"
ఢిల్లీ : వ్యాపార వేత్త పునీత్ ఖురానా ఆత్మహత్య ఘటనలో సంచలన ఆడియో,వీడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్ వీడియోల్లో బ్రతికుండగానే భర్త పునీత్ ఖురానాకు భార్య మనీకా పహ్వా ఎలాంటి నరకం చూపించిందో స్పష్టంగా తెలుస్తోంది. ఇంట్లోనే భర్తకు ఎదురుగా కూర్చున్న పహ్వా చెప్పుకోలేని విధంగా బూతులు తిడుతున్న ఆడియో,వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఢిల్లీలో ప్రముఖ వుడ్బాక్స్ కేఫ్ సహ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా(40) భార్య మనికా జగదీష్ పహ్వా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.2016లో పునిత్కు,పహ్వాకు వివాహం జరిగింది. ఇద్దరు ఉడ్బాక్స్ కేఫ్, ఫర్గాడ్ కేక్ పేరుతో బేకరీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారం జోరందుకుంది. అంతా సాఫిగా సాగుతున్న జీవితంలో మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో విడాకుల తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కోర్టు ద్వారా విడాకుల కోసం అప్లయ్ చేశారు.#PuneetKhurana did not commit suicide just because being humiliated on a late night phone call by his wife. This harassment and extortion was going on since long. Suicide is never easy. Suicide is never a choice for anyone. Its the extreme helplessness which turns people… pic.twitter.com/ip69yCS4Bd— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) January 1, 2025 పరస్పర అంగీకారంతో కోర్టు ఇద్దరికి విడాకులు ఇచ్చేందుకు అంగీకరించింది. నా డిమాండ్లను నెరవేరిస్తే విడాకులు ఇస్తానునని పహ్వా కోర్టుకు తెలిపింది. కోర్టు సైతం పహ్వా షరతులకు లోబడి ఆమె డిమాండ్లు నెరవేర్చాలని పూనిత్కు సూచించింది. అందుకు పునిత్ సైతం అంగీకరిస్తూ సంతకం కూడా చేశాడు. 180 రోజుల్లో కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది.ఈలోగా భార్య,భర్తలు వ్యాపారాలు వేర్వేరుగా చేసుకుంటున్నారు. కానీ కోర్టు ఎదుట విధించిన షరతులు కాకుండా అంతకు మించి పహ్వా కుటుంబ సభ్యులు పునిత్ను వేధించడం మొదలు పెట్టారు. దీంతో తట్టుకోలేక 59 నిమిషాల వీడియోను రికార్డ్ చేసి డిసెంబరు 31న మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వీడియోలో తన భార్య పహ్వా, ఆమె కుటుంబసభ్యులు ఎంతలా వేధించారో చెప్పారు.ఆ వీడియోలో ‘నా భార్య నా తాహతకు మించి డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఐదు డిమాండ్లను నెరవేర్చా. లాయర్ ఫీజు కింద నెలకు రూ.70వేలు ఇచ్చా. అవి సరిపోలేదని మరో రూ.10లక్షలు ఇవ్వాలని భార్య,అత్తమామలు వేధిస్తున్నారు. ఇంకా డబ్బులు కావాలని నన్ను పీక్కుతింటున్నారు. ఇంతుకు మించి ఇవ్వలేను. డబ్బులు కావాలని నా తల్లిదండ్రులను అడగలేను ’ అని తెలిపారు.పునీత్ ఖురానా ఆత్మహత్యపై డిసెంబరు 31న మధ్యాహ్నం 4:30 గంటలకు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా పునీత్ ఖురానా ఇంట్లో సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చాయి. ఆ ఫుటేజీలు ఎప్పటివి అనేది తెలియాల్సి ఉండగా భార్య మనికా జగదీష్ పహ్వా భర్త పునీత్ ఖురానాను బ్రతికి ఉండగానే ఎంతటి నరకం చూపించిందో తెలుస్తోంది.ఆ సీసీటీవీ ఆడియో,వీడియో ఫుటేజీలో ఓ పది నిమిషాలు సమయం నీకు ఇస్తున్నా అంటూ ‘ఓ బిచ్చగాడ. నువ్వు ఏమి అడిగావో చెప్పు. నీ మొహం చూడటం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు నా ముందుకు వచ్చావనుకో నీ రెండు చెంపలు వాయిస్తా. ఏంటి నీకు విడాకులు కావాలి. నన్ను వ్యాపారం చేసుకోనివ్వవా?అంటూ భర్తను,అతని కుటుంబ సభ్యుల్ని అనరాని మాటలు అన్నది. అయినా సరే ఇవన్నీ పర్వాలేదు. నీకేం కావాలో చెప్పు’ అని భర్త బదులివ్వడం గమనించవచ్చు. వాటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జొమాటో చరిత్రలోనే తొలిసారి.. ఒక్కడే రూ.5 లక్షల బిల్లు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ 'స్విగ్గీ' (Swiggy) 2024కు సంబంధించిన యాన్యువల్ డేటా విడుదల చేసిన తరువాత 'జొమాటో' (Zomato) కూడా వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ఎక్కువ మంది ఆర్డర్ చేసిన ఫుడ్ 'బిర్యానీ' అని తేల్చి చెప్పింది. అయితే ఒక్క వ్యక్తి మాత్రం ఒక రెస్టారెంట్లో రూ. 5 లక్షల కంటే ఎక్కువ బిల్ చెల్లించినట్లు సమాచారం.2024లో జొమాటో ద్వారా 9 కోట్ల కంటే ఎక్కువ బిర్యానీ ఆర్డర్లు చేసినట్లు సమాచారం. అంతే సెకనుకు మూడు బిర్యానీల కంటే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా ఎక్కువమంది ఆర్డర్ చేసుకున్న ఫుడ్గా బిర్యానీ రెకార్డ్ క్రియేట్ చేసింది. అయితే స్విగ్గీలో రైస్ డిష్ అత్యధికంగా ఆర్డర్ చేయబడిన ఆహారం అని తెలుస్తోంది.బిర్యానీ తరువాత ఎక్కువగా ఆర్డర్ చేయబడిన ఆహార పదార్థాల జాబితాలో పిజ్జా రెండవ స్థానంలో ఉంది. 2024లో జొమాటో ఏకంగా 5 కోట్ల కంటే ఎక్కువ పిజ్జాలను డెలివరీ చేసింది. ఫుడ్ విషయం పక్కన పెడితే 77,76,725 కప్పుల 'టీ', 74,32,856 కప్పుల కాఫీ ఆర్డర్లను జొమాటో స్వీకరించింది.అగ్రస్థానములో ఢిల్లీజొమాటో ఆఫర్లతో, ఢిల్లీ నివాసితులు తమ భోజన ఖర్చులపై ఏకంగా రూ. 195 కోట్లను ఆదా చేసినట్లు జొమాటో వెల్లడించింది. ఆ తరువాత జాబితాలో బెంగళూరు, ముంబై వంటివి ఉన్నాయి. ఈ సంవత్సరం భారతీయులు జనవరి 1 నుంచి డిసెంబర్ 6 మధ్య 1 కోటి కంటే ఎక్కువ టేబుల్లను రిజర్వ్ చేసుకోవడానికి జొమాటోను ఉపయోగించారు. ఇందులో ఎక్కువగా ఫాదర్స్ డే రోజు రిజర్వ్ చేసుకున్నారు.ఒకే వ్యక్తి రూ.5.13 లక్షల బిల్లుఒక్కసారికి మహా అయితే ఓ వెయ్యి లేదా ఫ్యామిలీతో కలిసి వెళ్తే.. ఒక పది వేలు ఖర్చు అవుతుంది అనుకుందాం. కానీ బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఒక రెస్టారంట్లో ఏకంగా రూ. 5.13 లక్షలు బిల్ చెల్లించినట్లు జొమాటో వెల్లడించింది. డైనింగ్ సేవల్లో సింగిల్ బిల్లు ఇంత చెల్లించడం జొమాటో చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
11 నెలల్లో.. లక్షమంది కొన్న కొరియన్ బ్రాండ్ కారు ఇదే!
కియా మోటార్స్ (Kia Motors) 2024 జనవరిలో కొత్త 'సోనెట్' లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన కేవలం 11 నెలల్లో ఏకంగా లక్ష కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలను పొందింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి నవంబర్ 2024 వరకు ఈ కారు అమ్మకాలు 1,03,353 యూనిట్లు.కియా సోనెట్ (Kia Sonet) మొత్తం అమ్మకాల్లో పెట్రోల్ మోడల్స్ 76 శాతం కాగా.. 24 శాతం మంది డీజిల్ కార్లను కొనుగోలు చేసారు. మరో 34 శాతం మంది ఆటోమాటిక్ ఐఎంటీ వేరియంట్స్ కొనుగోలు చేశారు. కాగా సోనెట్ కారును కియా కంపెనీ మూడు ఇంజిన్ ఆప్షన్లలో విక్రయిస్తోంది.సోనెట్ కారులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం వంటివి పొందుతుంది. వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్రూఫ్, లెవెల్ 1 ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. 79 శాతం మంది సన్రూఫ్లతో కూడిన సోనెట్ వేరియంట్లను కొనుగోలు చేశారు.టాటా నెక్సాన్ (Tata Nexon), మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue), మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ, స్కోడా కైలాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కియా సోనెట్ ధరలు రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.77 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి. -
ఇది కదా ఇప్పుడు కావాల్సింది: ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తే..
జీవితానికి క్రమశిక్షణ ఎంత ముఖ్యమో.. ఆర్ధిక అంశాల్లోనూ అంతే పద్ధతిగా ఉండకపోతే కొంపలారిపోతాయి, అన్నది తోసిపుచ్చలేని వాస్తవం. మన జీవితంలో ఆర్ధికం, ఆరోగ్యం.. అత్యంత ప్రాధాన్యాంశాలు. డబ్బుండి ఆరోగ్యం లేకపోయినా.. ఆరోగ్యం ఉండి డబ్బు లేకపోయినా ఆ వ్యక్తి జీవితం లేదా కుటుంబం అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంచేత ప్రతి వ్యక్తికీ ఆర్ధిక క్రమశిక్షణ అనేది అత్యంత ముఖ్యం. చాలామంది చేతులు కాలాక మేలుకుంటారు. అప్పటికి వారి జీవితం నిండా మునిగిపోయి ఉంటుంది.. ఈ పరిస్థితి రాకుండా మొదటినుంచీ మెలకువతో వ్యవహరిస్తే వారి జీవితాలు బాగుపడతాయి. కానీ ఇలా చేసేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు.22 -24 ఏళ్ల వయసులో సంపాదనలో పడేటప్పుడే మనం భవిష్యత్ అవసరాలను మదింపు చేయగలగాలి. గతంలో మన పూర్వీకులకు ఆర్ధిక అంశాలపై అంత అవగాహన లేకపోవడం, పెద్ద పెద్ద కుటుంబాల వల్ల వచ్చింది వచ్చినట్లుగా ఖర్చుపెట్టేయడం, పెట్టుబడి మార్గాలు పెద్దగా లేకపోవడం.. ఇత్యాది అంశాలన్నీ ఆర్ధిక క్రమశిక్షణ విషయంలో అవరోధాలుగా నిలిచేవి. ఇప్పుడలా కాదు. రకరకాల ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత సమాచారం అందుబాటులోకి ఉంటోంది. అదే సమయంలో విభిన్న పెట్టుబడి మార్గాలు మన కళ్ల ముందు ఉంటున్నాయి. ఇది ఒక రకంగా వరమనే చెప్పొచ్చు. కానీ ఎంతమంది వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారన్నదే ప్రధాన ప్రశ్న.ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తే ఏమవుతుంది.. అన్న విషయాన్ని ఉదాహరణ పూర్వకంగా వివరిస్తాను.రాహుల్ వయసు 24 ఏళ్ళు. అతనో ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. నెల జీతం రూ. 50,000. అందులోంచి రూ. 10,000 ఊళ్ళో ఉండే తల్లిదండ్రులకు పంపిస్తూ ఉంటాడు. అతనుండే సిటీలో రూము అద్దె, కరెంటు బిల్, తిండి ఖర్చులు, సాదరు, రవాణా ఖర్చులకు దాదాపు రూ. 20,000 దాకా అవుతుంది. మిగిలిన సొమ్ములో రూ. 10,000 వరకు హెల్త్ ఇన్సూరెన్సు(తనకు, తల్లిదండ్రులకు), డిపాజిట్లు, పెట్టుబడుల కోసం కేటాయించాడు. మిగతా రూ.10,000 ను పొదుపు చేస్తాడు. ఇదీ అతని నెలవారీ ప్రణాళిక.పొదుపు ద్వారా ఏడాదికి రూ.1,20,000 దాచుకోగలిగాడు. మరోపక్క డిపాజిట్లు, పెట్టుబడుల ద్వారా రూ. ఏడాదికి 1,50,000 దాకా కూడబెట్టాడు. ఏడాది మొత్తానికి అతను రూ.2,70,000 వెనకేయగలిగాడు. ఇందులోంచి అత్యవసర ఖర్చులు, అనుకోని ఖర్చుల కోసం ఏడాది మొత్తం మీద ఇంకో 70,000 ఖర్చు చేశాడు అనుకుందాం. నికరంగా అతని దగ్గర ఏడాది తిరిగేసరికి కనీసం రూ. 2 లక్షలు ఉంటాయి. ఇప్పుడతను కాస్త పర్వాలేదు అనుకునే స్థాయికి వచ్చాడు.ఈ మొత్తాన్ని అనుభవజ్ఞుల సలహా, సాధకబాధకాలు అన్నీ పరిగణనలోకి తీసుకుని రిస్కు తక్కువగా ఉండేలా చూసుకుంటూ కొంత షేర్లలోకి మరికొంత బాండ్లలోకి మళ్ళించాడు. దీనిపై వచ్చే రాబడి తక్కువగా ఉన్నప్పటికీ తన క్యాపిటల్కు నష్టం రాకుండా ప్లాన్ చేసుకున్నాడు. తద్వారా ఏడాది తిరిగేసరికి ఆ రూ. 2 లక్షల మీద అతనికి రూ. 1.50 లక్షలు వచ్చాయి. ఇప్పుడతని పెట్టుబడుల్లో సొమ్ము రూ. 3.5 లక్షలు అయింది. మరోపక్క ఈ రెండేళ్లలో అతని శాలరీ ఇంకో రూ.10,000 పెరిగింది. అయితే ఖర్చులు కూడా పెరగడం వల్ల ఆ పెరిగింది కాస్తా వాటికే సరిపోయేది. కాబట్టి అతని చేతికి కొత్తగా రూపాయి వచ్చిందీ లేదు, పోయిందీ లేదు. కానీ పెట్టుబడులు, పొదుపు మాత్రం క్రమం తప్పక కొనసాగిస్తూనే వచ్చాడు. ఇలా నాలుగేళ్లు గడిచాయి.శాలరీ పెరుగుతూ వస్తున్నా పెరిగే ఖర్చులు, పుట్టుకొచ్చే కొత్త అవసరాలతో అది అక్కడికి అయిపోతుంది. కానీ ఈ నాలుగేళ్లలో అతని పొదుపు 4X120000 = 4,80,000 + వడ్డీ కలిపి దాదాపు రూ.5 లక్షల దాకా జమ అయింది. అదే సమయంలో పెట్టుబడులను ఎప్పటికప్పుడు తిరగేస్తూ రిస్క్ డోస్ను కొద్దికొద్దిగా పెంచుతూ వచ్చాడు. అంటే బాండ్లలో పెట్టుబడులు తగ్గిస్తూ.. షేర్లలో ఫ్రంట్ లైన్ స్టాక్స్ను ఎంచుకుంటూ.. వాటి రేట్లు దిగివచ్చిన ప్రతిసారీ కొనుగోలు చేస్తూ వచ్చాడు. తద్వారా మంచి లాభాలు కళ్లజూడగలిగాడు. ఇలా మూడో ఏడాది తిరిగేసరికి తన పెట్టుబడులు రూ.6 లక్షల దాకా అయ్యాయి. మరో ఏడాది పూర్తయ్యేసరికి అవి కాస్తా రూ.12,00,000 అయ్యాయి.పొదుపు ద్వారా సమకూర్చుకున్న రూ.5 లక్షలు కలిపితే ఇప్పుడు అతని చేతిలో దాదాపు రూ.17 లక్షల దాకా ఉన్నాయి. వయసు 28 ఏళ్ళు వచ్చాయి. మళ్ళీ అన్ని లెక్కలు బేరీజు వేసుకుని రూ. 50 లక్షల రేటులో సిటీకి కాస్త దూరమే అయినప్పటికీ ఒక డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాడు. తన దగ్గరున్న 17 లక్షల్లో 10 లక్షలు ఇంటికోసం కేటాయించాడు. 7 లక్షలు చేతిలో ఉంచుకున్నాడు. 40 లక్షలు లోన్ తీసుకున్నాడు. దీనిపై కాల పరిమితి ఎక్కువ పెట్టుకుని ఈఎంఐ రూ. 25,000 మించకుండా చూసుకున్నాడు.తర్వాత అతను కంపెనీ మారడంతో (ఇది కూడా ప్లాన్ ప్రకారమే చేశాడు. మార్కెట్లో తనకున్న పొటెన్షియాలిటీ, ఉద్యోగంలో సంపాదించిన అనుభవం) శాలరీ పెరిగి దాదాపు రూ.లక్షకు చేరుకుంది. కొత్త ఉద్యోగంలో చేరితే (జాబ్ మారినప్పుడు కొన్ని బ్యాంకుల్లో లోన్ తీసుకోవడానికి కొంత ఇబ్బంది అవుతుంది. కొన్ని బ్యాంకులు మొత్తం అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని లోన్ ఇస్తాయి) లోన్కు ఇబ్బంది కావొచ్చన్న అంచనాతో జాబ్ మారడానికి ముందే చాలా తెలివిగా ఇంటి కొనుగోలుకు సిద్ధమయ్యాడు.ఇల్లు కొనడం, కొన్నాళ్లకే జాబ్ మారడం జరిగిపోయాయి. పెట్టుబడులు కొనసాగిస్తూనే ఉన్నాడు ఎక్కడా 'అతి' కి పోకుండా ప్లాన్కు తగ్గట్లే సాగుతూ వచ్చాడు. ఇంతలోనే పెళ్లి కుదిరింది. తన దగ్గరున్న సొమ్ముల్లోనే ఓ 2 లక్షలు వెచ్చించి ఇంటికి అవసరమైన సామాన్లు కొనుక్కున్నాడు. పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్లోకి అడుగుపెట్టాడు.ఒక రూ.50,000 ఉద్యోగి.. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో జీవితాన్ని స్థిరపరుచుకునే స్థాయికి ఎదిగాడు. ఇదంతా జరగడానికి అతను చేసిందల్లా...1. ఆర్ధిక క్రమశిక్షణ ఎక్కడా తప్పలేదు. 2. అత్యాశకు పోలేదు.3. తనకు ఉన్న దానితోనే సరిపెట్టుకున్నాడు. 4. పక్కవాళ్ళను చూసో, స్నేహితులను బట్టో అక్కర్లేని వస్తువులు కొనేయలేదు.5. లాభాలు వస్తున్నాయి కదా అని మొత్తం డబ్బులు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టేయలేదు.6. రిస్క్ స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాడే తప్ప నూటికి నూరు శాతం రిస్క్ తీసుకోలేదు.7. ఆడంబరాలకు పోలేదు. మార్కెట్లో 50,000 ఖరీదు చేసే ఫోన్లు దొరుకుతున్నా తన స్థాయికి మించి 10,000-15,000 ఫోన్తోనే సరిపెట్టుకున్నాడు. 8. లోన్ పెట్టుకుంటే కారు కొనుక్కునే అవకాశం ఉన్నప్పటికీ కొనేయాలని ఉబలాటపడలేదు. 9. స్థిరపడేవరకు టూర్లు, విందులు, వినోదాలు, విలాసాల జోలికి పోకూడనే నిర్ణయం తీసుకుని కచ్చితంగా పాటిస్తూ వచ్చాడు. 10. వేలకు వేలు పోసి ఖరీదైన బట్టలని కొనేయలేదు.ఇలా చెప్పుకుంటూ పోతే... చాలానే ఉన్నా అతను పాటించింది మాత్రం పూర్తిగా ఆర్ధిక క్రమశిక్షణ. అదే అతని జీవితాన్ని ఇప్పుడు చాలా హుందాగా నిలబెట్టింది. కొత్త జీవితంలోకి అడుగు పెట్టేలా చేసింది. అతను త్వరలోనే కారూ కొనుక్కోగలడు, అవసరమైతే ఖరీదైన ఫోనూ కొనగలడు. చిన్న వయసులోనే ఇంత ఆర్ధిక క్రమశిక్షణ పాటించిన వ్యక్తి భవిష్యత్తులో గాడి తప్పకుండా ముందుకు సాగుతాడనే భావిద్దాం. మీరూ ఇలా చేసి చూడండి. మీ జీవితం కచ్చితంగా పూలమయం అవుతుంది. అలా కాదు.. నాకు తాత్కాలిక ప్రయోజనాలే ముఖ్యం.. అంటూ అర్ధం పర్ధం లేకుండా విచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటూ పోతే ఏం జరుగుతుందో తదుపరి కథనంలో చూద్దాం. -బెహరా శ్రీనివాస రావు, పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు. -
అంబానీ చేతికి మరో కంపెనీ: రూ.375 కోట్ల డీల్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా హెల్త్కేర్ ప్లాట్ఫామ్ కార్కినోస్ హెల్త్కేర్ను కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.375 కోట్లు. కార్కినోస్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ (RSBVL) దక్కించుకుంది.కార్కినోస్ 2020లో ప్రారంభం అయింది. క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడం, నిర్ధారణ చేయడం, వ్యాధి నిర్వహణ కోసం సాంకేతికతతో కూడిన వినూత్న పరిష్కారాలను అందిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.22 కోట్ల టర్నోవర్ను ఆర్జించింది.కంపెనీ 2023 డిసెంబర్ వరకు దాదాపు 60 ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఉంది. అనుబంధ కంపెనీ ద్వారా మణిపూర్లోని ఇంఫాల్లో 150 పడకల మల్టీస్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తోంది. కార్కినోస్ దివాళా పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ ఆమోదించింది. ఆర్ఎస్బీవీఎల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఆమోదించినట్టు డిసెంబర్ 10న రిలయన్స్ ప్రకటించింది. -
ఎంఏ చాయ్వాలా.. ఏటా లక్షల సంపాదన
దేశంలో చదువుకున్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగం దొరకడం అనేది సాధ్యమయ్యే పనికాదు. అలా ఉద్యోగాలు దొరకనివారిలో చాలామంది ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు. వీరిలో కొందరు సక్సెస్ అవుతున్నారు. అలాంటివారిని చూసి, ఇతరులు స్ఫూర్తి పొందుతున్నారు. ఈ జాబితాలోకే వస్తారు యూపీకి చెందిన ఎంఏ చాయ్వాలా. వివరాల్లోకి వెళితే..చదువుకు ఫుల్స్టాప్ పెట్టి..ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాకు చెందిన ఓ యువకుడు టీ వ్యాపారం ప్రారంభించి, ఇప్పుడు ఏటా లక్షల్లో టర్నోవర్ చేస్తున్నాడు. అతని పేరు రాజ్ జైస్వాల్. అతను మీడియాతో మాట్లాడి తన వ్యాపారానికి సంబంధించిన వివరాలను తెలియజేశాడు. అవి అతని మాటల్లోనే.. ‘నేను ఎంఏ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్నాను. అయితే ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో మధ్యలోనే చదువు మానేయవలసి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లోనే గోండాలోని ఎల్బీఎస్ చౌరస్తాలో ఒక టీ దుకాణాన్ని ప్రారంభించాను. దానికి ఎంఏ చాయ్వాలా అని పేరు పెట్టాను’ అని తెలిపారు.తల్లి ఇచ్చిన డబ్బుతో..రాజ్ జైస్వాల్ బీఏ పూర్తి చేశాక ఎంఏ చదువుకుందామనుకున్నాడు. ఆర్థిక పరిస్థుతుల కారణంగా అతని కల నెరవేరలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా, అవేవీ అతనికి సంతృప్తి నివ్వలేదు. దీంతో టీ దుకాణం తెరవాలని అనుకుని ఎంఏ చాయ్ వాలా పేరుతో దుకాణం ప్రారంభించాడు. అయితే ఈ పని అతని తండ్రికి అస్సలు నచ్చలేదు. తల్లి మాత్రం రాజ్ జైస్వాల్కు అండగా నిలిచింది. ఆమె తన తగ్గరున్న డబ్బు ఇచ్చి, టీ దుకాణం తెరవాలని ప్రోత్సహించింది.రోజుకు 300 టీల విక్రయంఅందరూ ఇంట్లో తయారుచేసుకునే టీలకు భిన్నంగా తాము కొన్ని మసాలాలను టీ తయారీకి ఉపయోగిస్తామని, దీంతో తమ దగ్గర టీ మరింత రుచిగా ఉంటుందని రాజ్ జైస్వాల్ తెలిపాడు. కాగా ఇక్కడి టీ రుచి చాలా బాగుంటుందని, అందుకే ఇక్కడికి రోజూ వచ్చి టీ తాగుతామని పలువురు వినియోగదారులు మీడియాకు తెలిపారు. ఇక్కడ రూ.10 నుంచి రూ.40 ధరతో అనేక రకాల టీలు లభ్యమవుతాయి. ప్రతిరోజూ రాజ్ 250 నుంచి 300 కప్పుల టీ విక్రయిస్తుంటాడు. ఈ లెక్కన రాజ్ ప్రతీనెలా టీ విక్రయాలతో కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడని అర్థం చేసుకోవవచ్చు. ఇది కూడా చదవండి: 14 ఏళ్ల పాటు వైద్యం అందించిన డాక్టర్కు రూ. 10 లక్షల జరిమానా -
విలువలు నేర్పిన అజరామరుడు.. రతన్ టాటా జయంతి నేడు (ఫొటోలు)
-
పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడుల కోసం తెలంగాణలో అత్యంత అనుకూల వాతావరణం ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మలేషియా పారిశ్రామికవేత్తలను కోరారు. శ్రీధర్బాబు గత నెలలో మలేషియా తెలుగు మహాసభలకు హాజరైన సందర్భంగా అక్కడి పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించారు.ఈ మేరకు పలువురు పారిశ్రామికవేత్తలు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ చొరవతో సోమవారం సచివాలయంలో మలేషియా వాణిజ్య ప్రతినిధులతో మంత్రులు శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సౌర విద్యుత్ రంగం, డ్రైపోర్టుల నిర్మాణం, మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, మహిళా పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలకు విదేశాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి హుస్సేన్ సాగర్లో పూడికతీత, మురుగు నీటి శుద్ధికోసం అత్యాధునిక సీవరేజీ ప్లాంట్ల ఏర్పాటులో పాలు పంచుకోవాలని మలేషియా పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్బాబు కోరారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న డ్రైపోర్టుల నిర్మాణంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ... ప్రస్తుతం మలేషియా నుంచి పామాయిల్ మొలకలు దిగుమతి చేసుకుంటున్నామని, అలా కాకుండా విత్తనాలు సరఫరా చేయడానికి గానీ, ఇక్కడే నర్సరీ ఏర్పాటు చేయడానికి గానీ ముందుకొస్తే సహకరిస్తామని చెప్పారు. -
భారత్లో అపార వ్యాపారావకాశాలు: కెనాన్ ఇండియా ప్రెసిడెంట్
భారత్లో చిప్ ఫ్యాబ్రికేషన్కి సంబంధించి గణనీయంగా వ్యాపార అవకాశాలు ఉన్నట్లు జపాన్కి చెందిన ఇమేజింగ్ ఉత్పత్తుల దిగ్గజం కెనాన్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో తొషియాకి నొమురా తెలిపారు. తమ సెమీకండక్టర్ లిథోగ్రఫీ మెషిన్లను సరఫరా చేసేందుకు, దేశీయంగా సెమీకండక్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు.చిప్ల ఉత్పత్తికి పలు చిప్ తయారీ సంస్థలకు ఇప్పుడు భారత్ కొత్త గమ్యస్థానంగా మారుతోందని పేర్కొన్నారు. మరోవైపు 2024లో తమ వృద్ధి దాదాపు రెండంకెల స్థాయిలో ఉండగలదని, ఏటా ఇదే తీరును కొనసాగించగలమని ఆశిస్తున్నట్లు నొమురా వివరించారు.ప్రధాన వ్యాపారమైన ఇమేజింగ్, ప్రింటింగ్, సరై్వలెన్స్ ఉత్పత్తులతో పాటు కెనాన్ ఇండియా సంస్థ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలతో పాటు డయాగ్నోస్టిక్ మెడికల్ ఇమేజింగ్ సొల్యూషన్స్పై (సీటీ, ఎక్స్-రే, అ్రల్టాసౌండ్ మొదలైనవి) కూడా దృష్టి పెడుతోంది. హెల్త్కేర్ విభాగంలో తమ వ్యాపార వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని నొమురా తెలిపారు. అటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. ఐటీ, బీఎఫ్ఎస్ఐ, ఫార్మా తదితర పరిశ్రమలపైనా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. -
ఫండ్స్ పెట్టుబడులకు హెడ్జింగ్ వ్యూహం?
ఫండ్స్లో పెట్టుబడులు ఉన్నాయి. హెడ్జింగ్ చేసుకోవడం ఎలా? – శ్యామ్ ప్రసాద్ఈక్విటీ మార్కెట్ నష్టపోయే క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ, స్మాల్క్యాప్ ఇండెక్స్ ఇలా అన్ని సూచీలు పడిపోతుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో హెడ్జింగ్ ఆప్షన్ అంతర్గతంగా ఉండదు. కనుక పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడమే ఇన్వెస్టర్ల ముందున్న మార్గం. వివిధ సాధనాల మధ్య పెట్టుబడుల కేటాయింపుల (అసెట్ అలోకేషన్) ప్రణాళిక కలిగి ఉండడం ఈ దిశగా మంచి వ్యూహం అవుతుంది.ఉదాహరణకు మీ మొత్తం పెట్టుబడుల్లో 50 శాతాన్ని ఈక్విటీలు లేదా ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. మరో 50 శాతాన్ని డెట్ సెక్యూరిటీలు లేదా డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు పెరగడం కారణంగా ఈక్విటీ పెట్టుబడుల విలువ 70 శాతానికి చేరినప్పుడు.. 20 శాతం మేర విక్రయించి ఆ మొత్తాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈక్విటీ/డెట్ రేషియో 50:50గా ఉంటుంది. ఉదాహరణకు రూ. లక్ష పెట్టుబడిలో రూ.50 వేలను ఈక్విటీల్లో, రూ.50 వేలను డెట్లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. కొంత కాలానికి ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.70 వేలకు చేరి, డెట్ పెట్టుబడుల విలువ రూ.55 వేలకు వృద్ధి చెందిందని అనుకుందాం. అప్పుడు ఈక్విటీల నుంచి రూ.7,500 పెట్టుబడిని వెనక్కి తీసుకుని డెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు రెండు సాధనాల్లో పెట్టుబడులు సమానంగా ఉంటాయి.ఒకవేళ ఈక్విటీ మార్కెట్ల పతనంతో ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.50 వేల నుంచి రూ.40 వేలకు తగ్గి, డెట్ పెట్టుబడులు రూ.55వేలుగా ఉన్నాయనుకుంటే.. అప్పుడు డెట్ పెట్టుబడుల నుంచి రూ.7,500ను వెనక్కి తీసుకుని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక సాధనంలో పెట్టుబడుల విలువ మరో సాధనంలోని పెట్టుబడుల విలువ కంటే 10–15 శాతం అధికంగా ఉన్నప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవాలి. అసెట్ అలోకేషన్ ఆటోమేట్ చేసుకోవడం, రీబ్యాలన్స్ వ్యూహాన్ని సరిగ్గా అమలు చేయడం ద్వారా మార్కెట్ల పతనంపై ఆందోళన చెందకుండా రాబడులను పెంచుకోవచ్చు.రూ.50 లక్షలను 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని 12 నెలల సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – శ్రీ కైవల్యకొంత రక్షణాత్మక ధోరణిలో అయితే మూడేళ్ల పాటు నెలసరి సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొంత రిస్క్ తీసుకునే ధోరణితో ఉంటే 18 - 24 నెలల సమాన వాయిదాల్లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మార్కెట్లో దిద్దుబాట్లు పెట్టుబడుల అవకాశాలకు అనుకూలం.ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ మొత్తం విలువ తగ్గిపోతే విచారించాల్సి వస్తుంది. అందుకని ఒకే విడత కాకుండా క్రమంగా నెలకు కొంత చొప్పున కొంత కాలం పాటు ఇన్వెస్ట్ చేసుకోవడం సూచనీయం. వైవిధ్యమైన నేపథ్యంతో ఉండే ఫ్లెక్సీ క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి వృద్ధి, రిస్్కను సమతుల్యం చేస్తుంటాయి. దీర్ఘకాల లక్ష్యాలకు ఇవి అనుకూలం. మీ వద్దనున్న మొత్తాన్ని లిక్వి డ్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్లో ముందు ఇన్వెస్ట్ చేసుకోవాలి. వాటి నుంచి ప్రతి నెలా నిరీ్ణత మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా ఎంపిక చేసుకున్న ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
క్లాసిక్ లుక్లో రాయల్ ఎన్ఫీల్డ్ న్యూ మోడల్ (ఫొటోలు)
-
రూ.750 కోట్ల ఇంట్లో నివాసం.. బిలియనీర్తో వివాహం: ఎవరో గుర్తుపట్టారా? (ఫోటోలు)
-
ఇల్లు ఇంద్రభవనం.. కుబేరుడిలాంటి భర్త: ఎవరీ ఫ్యాషన్ ఐకాన్?
సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సీఈఓ అదర్ పూనావాలా భార్య 'నటాషా పూనావాలా' (Natasha Poonawalla) గురించి బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె వ్యాపార రంగంలో కీలక పాత్ర పోషించడం మాత్రమే కాకుండా.. అనేక సామాజిక, దాతృత్వ కార్యక్రమాలు చేసే ముఖ్యమైన వ్యక్తులలో ఒకరుగా ప్రసిద్ధి పొందారు.నటాషా పూనావాలా.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తూ.. వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలపై దృష్టి సారిస్తూనే, విల్లో పూనావల్లా ఫౌండేషన్కు అధ్యక్షత వహిస్తున్నారు.పూణేలో జననం1981 నవంబర్ 26న మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన నటాషా.. పాఠశాల విద్యను పూణేలోని సెయింట్ మేరీస్ స్కూల్లో, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయంలో పూర్తి చేసింది. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందింది.750 కోట్ల భవనంనటాషా 2006లో అదర్ పూనావాలాను వివాహం చేసుకుంది. ఈ జంటకు సైరస్, డారియస్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు సుమారు 750 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం లింకన్ హౌస్లో నివాసం ఉంటున్నారు. ఈ భవనం యూరోపియన్ స్టైల్లో ఉంది. దీనిని అదర్ పూనావాలా తండ్రి 2015లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది సుమారు 247 ఎకరాలలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రూ. 10వేల అప్పుతో రూ.32000 కోట్ల సామ్రాజ్యం: ఎవరీ 'రవి మోదీ'?నటాషా వ్యాపారం.. దాతృత్వం రెండింటిలోనూ కీలక వ్యక్తిగా స్థిరపడింది. ఆమె నాయకత్వంలో, SII ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారులలో ఒకటిగా మారింది. ఇక ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపడుతూ.. నిరుపేద వర్గాల కోసం విద్య, ఆరోగ్య సంరక్షణ మొదలైనవాటిని అందిస్తోంది. నటాషా భర్త నికర విలువ రూ. 1 లక్ష కోట్ల కంటే ఎక్కువ. -
దుస్తులు పాతబడ్డాయా.. అమ్మేయండి..!
సాక్షి, అమరావతి: ఇంటినిండా బట్టలున్నట్టే ఉంటాయి. కానీ సమయానికి కట్టుకుందామంటే ఒక్కటీ సరైనది కనిపించదు. ఇలా పాతబడిపోయిన దుస్తులను ఏం చేయాలో తెలియదు. ఎవరికైనా ఇద్దామంటే ఏమనుకుంటారోననే సందేహం. వాటిని దాచుకోలేక, పడేయలేక సతమతమవుతుంటారు చాలామంది. ముఖ్యంగా మహిళలు. ఇకపై ఆ సందేహాలు, సతమతాలు అవసరం లేకుండా ఇళ్లల్లో ఉన్న పాత దుస్తులను కొనే యాప్లు, వెబ్సైట్లు వచ్చేశాయి. వీటిద్వారా వాడకుండా పక్కన పెట్టేసిన దుస్తులను ఆన్లైన్లో అమ్మేసేయొచ్చు. అంటే..పాత దుస్తులకూ డబ్బులొస్తాయన్నమాట. వాటిని కొనేందుకు కొన్ని వెబ్సైట్లు ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తుంటాయి. ఆలస్యమెందుకు.. ఆ యాప్లు, వెబ్సైట్లు ఏమీటో తెలుసుకొని.. పాత వాటిని అమ్మేద్దాం..అమ్మడానికి ఆన్లైన్లో అనేక వేదికలుఆన్లైన్ల్లో పాత దుస్తులు కొనే వెబ్ సైట్లు, యాప్లు చాలానే ఉన్నాయి. ప్రీ అప్, బేచ్ దే, పోష్ మార్క్, ఓఎల్ఎక్స్, పీ పాప్, ఒయేలా, క్లాతింగ్ క్లిక్, ఈబే, ఓల్డ్ కార్ట్..వంటి పేర్లతో ఆన్లైన్ వ్యాపారాలు జరుగుతున్నాయి. కొన్ని సైట్లు, యాప్లు నేరుగా దుస్తులు కొనుగోలు చేసి వాటికి కొంత నగదును ఇస్తున్నాయి. అందుకోసం మీ దుస్తులను యాడ్ చేసి ధరను నిర్ణయించిన తర్వాత, కంపెనీ వాటిని చెక్ చేసి ఆమోదిస్తుంది. అనంతరం వాటిని నేరుగా వినియోగదారులకు విక్రయిస్తుంది. మరికొన్ని వినియోగదారులకు నేరుగా అమ్మకందారులే దుస్తులను విక్రయించేందుకు అవకాశం ఇస్తున్నాయి. ఈ యాప్లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయ్యాక సేల్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి, అమ్మాలనుకుంటున్న దుస్తులను క్లోజప్లో ఫొటో తీసి పోస్ట్ చేయాలి. వాటికి సంబంధించిన చిన్నపాటి సమాచారం (డిస్క్రిప్షన్)ను కూడా రాయాలి. ఆ తర్వాత డ్రెస్ ఏ కండీషన్లో ఉంది, ఎవరికి సరిపోతుంది (కేటగిరీ) అనే వివరాలను సెలక్ట్ చేసి దాని ధర (అమౌంట్) ను కూడా తెలపాలి. కొన్ని సంస్థలు అమ్మకం రుసుము (సెల్లింగ్ ఫీజు) తీసుకోవు. ఇంటికే వచ్చి మనం అమ్మిన పాత దుస్తులను తీసుకెళుతున్నాయి. దుస్తులు అమ్మే సమయంలో క్రెడిట్ పాయింట్స్ లేదా క్యాష్ ఆప్షన్ పెట్టుకునే వీలు కూడా ఉంటుంది. బట్టలతో పాటు వాచీలు, చైన్లు, రింగులు, క్యాపులు, బూట్లు వంటి యాక్ససరీస్, డెకరేటివ్ ఐటమ్స్ కూడా అమ్ముకునేలా, కొనుక్కునేలా ఈ యాప్లలో ఆప్షన్లు ఉన్నాయి. మీషో వెబ్సైట్లో దేశవ్యాప్తంగా ఎవరైనా మీ దుస్తులను కొనే అవకాశం ఉంటుంది. ఫ్రీఅప్ అనే వెబ్ సైట్ కూడా మరో ఫేమస్ వెబ్ సైట్. ఈ యాప్ లో మీరు మీ పాత బట్టల ఫొటోలు పెట్టగానే వాటి క్వాలిటీని బట్టి ధర నిర్ణయిస్తుంది. ధర నచ్చితే హ్యాపీగా అమ్మేయొచ్చు. రీలవ్ వెబ్ సైట్ ద్వారా కూడా ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవచ్చు. క్లెటెడ్ అనేది ప్రత్యేకంగా ఇంటింటికీ సేవలందించడంలో ప్రసిద్ధి చెందిన యాప్. వెబ్ సైట్ నిర్వాహకులే ఇంటికొచ్చి పాత దుస్తుల బ్రాండ్, ప్రస్తుత పరిస్థితిని చూసి సరైన ధర నిర్ణయించి డబ్బులు కూడా ఇస్తారు. వ్యాపారం మీరే చేయొచ్చుఆన్లైన్లో పాత దస్తులను సేకరించి విక్రయించే వ్యాపారం చేయడానికి ఇటీవల యువత కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. కొంత మంది లాభాలు కూడా ఆర్జిస్తున్నారు. ఒక యాప్ లేదా వెబ్ సైట్ తయారు చేసి సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేయొచ్చు. నగరాల్లో కమిషన్ పద్ధతిలో సిబ్బందిని నియమించుకుని దుస్తులు సేకరించవచ్చు. వాటిని రీసైక్లింగ్ చేసే కంపెనీలకు బల్్కగా అమ్మొచ్చు. ఇలా కొన్న పాత బట్టలను ఉపయోగించి కొందరు పిల్లోస్, పరుపులు, డెకరేషన్ ఐటమ్స్ తయారు చేస్తారు. అలాంటి వారిని సంప్రదించి మంచి ధరకు అమ్మేయొచ్చు. దీని ద్వారా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1,064.12 పాయింట్లు లేదా 1.30 శాతం నష్టంతో 80,684.45 పాయింట్ల వద్ద, నిఫ్టీ 332.25 పాయింట్లు లేదా 1.35 శాతం నష్టంతో 24,336.00 వద్ద నిలిచాయి.సిప్లా, విప్రో, హిందూస్తాన్ యూనీలీవర్, ఐటీసీ కంపెనీ, ఇన్ఫోసిస్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, జేఎస్డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈ బైక్ కొనుగోలుపై రూ.45000 డిస్కౌంట్
2024 ముగుస్తోంది. ఈ తరుణంలో చాలా వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపైన డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఇందులో టూ వీలర్ బ్రాండ్ 'కవాసకి' కూడా ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు నింజా 500కొనుగోలుపైన రూ.15,000, నింజా 650 బైక్ కొనుగోలుపై రూ.45,000 తగ్గింపు ప్రకటించింది. ఈ డిస్కౌంట్ డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.కవాసకి నింజా 650 బైకులో 649 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8000 rpm వద్ద 67 Bhp పవర్, 6700 rpm వద్ద 64 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. ఈ బైక్ ఎల్ఈడీ లైట్స్, టీఎఫ్టీ డిస్ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి.నింజా 650 బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ వంటివి పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఇది 300 మిమీ డ్యూయల్ ఫ్రంట్, 220 మిమీ రియర్ సింగిల్ డిస్క్ సెటప్ పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 120/70, వెనుక 160/60 టైర్లు ఉన్నాయి. ఇవి 17 ఇంచెస్ వీల్స్ పొందుతాయి. కాబట్టి ఇది రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్లు.. చవక మాత్రమే కాదు! -
బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్లు.. చవక మాత్రమే కాదు!
ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయల స్కూటర్ లభిస్తోంది. రూ.14.90 లక్షలకు కూడా స్కూటర్ లభిస్తోంది. దేశీయ విఫణిలో ఎన్నెన్ని స్కూటర్లు అందుబాటులో ఉన్నా.. కొనుగోలుదారులు మాత్రం తక్కువ ధర వద్ద లభించే స్కూటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కథనంలో సరసమైన టాప్ 5 స్కూటర్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.హీరో ప్లెజర్ ప్లస్మహిళలకు ఇష్టమైన స్కూటర్ల జాబితాలో ఒకటైన 'హీరో ప్లెజర్ ప్లస్' సరసమైన స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ. 70577. రెండు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్ 110 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 Bhp పవర్, 8.7 Nm టార్క్ అందిస్తుంది. దీనిని మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా రోజువారీ వినియోగం కోసం కొనుగోలు చేస్తారు.టీవీఎస్ జెస్ట్ 110టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన జెస్ట్ 110 స్కూటర్ ధర మార్కెట్లో రూ. 73728 మాత్రమే. ఇది కూడా రెండు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.7 Bhp పవర్, 8.8 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన స్కూటర్ల జాబితాలో ఒకటిగా ఉంది.హోండా డియోఅతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన లేదా అత్యధిక అమ్మకాలు పొందిన స్కూటర్ల జాబితాలో ఒకటి ఈ హోండా డియో. ఈ స్కూటర్ ధర రూ. 75409. ఇది మూడు వేరియంట్లు, తొమ్మిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్కూటర్లోని 109 సీసీ ఇంజిన్ 7.75 Bhp, 9.03 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మార్కెట్లో ఇప్పటికి 30 లక్షల కంటే ఎక్కువ హోండా డియో స్కూటర్లు అమ్ముడైనట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే దీనికి భారతదేశంలో ఎంత డిమాంద్ ఉందో అర్థం చేసుకోవచ్చు.హీరో జూమ్ (Hero Xoom)హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన జూమ్ స్కూటర్ 110 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.05 Bhp పవర్, 8.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 75656. ఈ స్కూటర్ చూడటానికి కొంత ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. ఇది నాలుగు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: తక్కువ ధరతో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే CNG కార్లుహీరో డెస్టినీ ప్రైమ్ఇక చివరగా మన జాబితాలో చివరి సరసమైన స్కూటర్ 'హీరో డెస్టినీ ప్రైమ్'. ఈ స్కూటర్ ధర రూ. 76,806. ఇందులో 124.6 సీసీ ఇంజిన్ 9 Bhp పవర్, 10.36 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం ఒక వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. కానీ మూడు కలర్ ఆప్షన్స్ పొందుతుంది. -
10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..
చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) ఇటీవలే మార్కెట్లో 'కైలాక్' పేరుతో ఓ కాంపాక్ట్ ఎస్యూవీ లాంచ్ చేసింది. అయితే 10 రోజుల ముందే దీని కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా ఇప్పటికి ఈ ఎస్యూవీ బుకింగ్స్ 10,000 దాటినట్లు సమాచారం. కాగా బుక్ చేసుకున్న కస్టమర్లకు 2025 జనవరి 27న డెలివరీలు ప్రారంభమవుతాయి.స్కోడా కైలాక్ అనేది MQB A0-IN ప్లాట్ఫామ్ ఆధారంగా నిర్మితమైన మొదటి కాంపాక్ట్ ఎస్యూవీ. ఇది ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న కుషాక్ కింద ఉంటుంది. క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టీజ్ అనే నాలుగు వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ. 7.89 లక్షలు (ఎక్స్ షోరూమ్).మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ , మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న స్కోడా కైలాక్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 113 Bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.ఇదీ చదవండి: భారత్లోని బెస్ట్ 5 డీజిల్ కారు ఇవే!.. పూర్తి వివరాలుఫీచర్స్ విషయానికి వస్తే.. కైలాక్ 8 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన 10.1 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, కాంటన్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. -
15X15X15 ఫార్ములా.. కోటీశ్వరులు అవ్వడానికి ఉత్తమ మార్గం!
డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులవ్వాలని అందరికీ ఉంటుంది. అయితే ఆలోచన ఒక్కటి ఉంటే సరిపోదు, ఆచరణ కూడా అవసరం. ఈ కథనంలో 15 సంవత్సరాల్లో కోటీశ్వరులు ఎలా అవ్వాలో అనే విషయాన్ని.. 15X15X15 ఫార్ములా ద్వారా తెలుసుకుందాం.తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే.. దానికి అత్యుత్తమ మార్గం ఇన్వెస్టిమెంట్ అనే చెప్పాలి. అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? అనే విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి.ఇక 15X15X15 ఫార్ములా విషయానికి వస్తే, 15 సంవత్సరాల్లో నెలకు రూ. 15వేలు ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు అవుతుందనేదే.. ఈ ఫార్ములా సందేశం. అంటే మీరు 15 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్స్లో నెలకు 15,000 ఇన్వెస్ట్ చేసి 15 శాతం వార్షిక రిటర్న్స్ ఆశించాలి. ● పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 15,000 ● వ్యవధి: 15 సంవత్సరాలు ● వడ్డీ రేటు: 15 శాతంపైన చెప్పిన దాని ప్రకారం నెలకు 15,000 రూపాయలు పెట్టుబడి పెడితే.. 15 సంవత్సరాలకు అసలు రూ. 27 లక్షలు అవుతాయి. వడ్డీ రేటు 15 శాతం (రూ. 73 లక్షలు), కాబట్టి ఇలా మీరు కోటి రూపాయలు సంపాదించవచ్చు.ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!15X15X15 ఫార్ములా ద్వారా కోటీశ్వరులవ్వాలంటే.. త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. మీరు 25 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. 40 ఏళ్లకే మీకు కోటి రూపాయలు వస్తాయి. 30 ఏళ్లకు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే 45 సంవత్సరాలకు మీ చేతికి డబ్బులు వస్తాయి. కాబట్టి దీన్ని బట్టి చూస్తే.. మీరు ఎంత తొందరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే, అంత త్వరగా కోటీశ్వరులు అవ్వొచ్చన్నమాట. -
టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్
ఎస్యూవీలు, ఎంపీవీలు, సెడాన్లు, హ్యాచ్బ్యాక్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే దేశీయ విఫణిలో ఉన్న కార్ మోడల్స్ కోకొల్లలు. మార్కెట్లో ఎన్నెన్ని కార్లున్నా బడ్జెట్ కార్లకే ఎక్కువ డిమాండ్ ఉందనేది అందరికీ తెలిసిన సత్యం. బడ్జెట్ కార్ల విభాగంలో కూడా లెక్కకు మించిన కార్లు ఉండటం వల్ల.. ఇందులో బెస్ట్ కార్లు ఏవి అనేది కొందరికి అంతుచిక్కని ప్రశ్న. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.మారుతి సుజుకి ఆల్టో 800భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న, ఎక్కువ మంది ప్రజలను ఆకర్శించడంలో విజయం పొందిన కార్లలో 'మారుతి సుజుకి ఆల్టో 800' ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. రూ.3.25 లక్షల నుంచి రూ.5.12 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధరతో లభించే ఈ కారు చూడటానికి పరిమాణంలో కొంత చిన్నదిగా ఉన్నప్పటికీ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి. పనితీరు ఉత్తమంగానే ఉంటుంది.మారుతి సుజుకి స్విఫ్ట్మారుతి అంటే అందరికి గుర్తొచ్చేది స్విఫ్ట్. మంచి పర్ఫామెన్స్, ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ కారు డ్యూయల్ టోన్ స్పోర్టీ స్టైల్, క్రాస్డ్ మెష్ గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్లైట్స్ వంటి వాటితో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, నావిగేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ గేర్ స్విచ్, మల్టీ-కలర్ ఇన్ఫర్మేషన్ మానిటర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ వంటి ఎన్ని ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.60 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్హ్యుందాయ్ కంపెనీకి చెందిన గ్రాండ్ ఐ10 నియోస్ కూడా ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న పాపులర్ బడ్జెట్ కారు. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అప్డేటెడ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొత్త ప్లాట్ఫామ్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇది రీడిజైన్ హెడ్ల్యాంప్లు, ఫ్రంట్ గ్రిల్ వంటివి పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ.5.92 లక్షలు (ఎక్స్ షోరూమ్).టాటా టియాగోదేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా సరసమైన ధర వద్ద లభించే కార్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఇందులో ఒకటి టియాగో. 2016లో పరిచయమైన ఈ కారు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో వస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు 242 లీటర్ బూట్ స్పేస్ పొందుతుంది. హైట్ అడ్జస్టబుల్ సీటు, రియర్వ్యూ కెమెరా, టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ క్లస్టర్, 8 స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి అనేక ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి. దీని ధర రూ.5 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఇదీ చదవండి: దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం: భారీగా పెరగనున్న ధరలుమారుతి సుజుకి వ్యాగన్ ఆర్రూ.5.41 లక్షల నుంచి రూ.7.12 లక్షల మధ్య లభించే 'మారుతి సుజుకి వ్యాగన్ ఆర్' మన జాబితాలో చెప్పుకోదగ్గ కారు. 2400 మిమీ వీల్బేస్ కలిగి ఐదుమంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఈ కారు పెద్ద క్యాబిన్ కలిగి ఉంది. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ పొందిన క్యాబిన్లోని డ్యాష్బోర్డ్ హై క్వాలిటీ ప్లాస్టిక్తో తయారైంది. మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. -
స్వెట్టీస్.. స్టైల్..
నగరంలో చలికాలం ప్రారంభమైంది. చలికాలం వస్తుందంటే చాలు స్వెటర్ల కోసం నగరవాసి కళ్లు వెతుకుతుంటాయి. మార్కెట్లోకి స్టైలిష్ స్వెటర్లు కొనేందుకు చూస్తుంటారు. నవంబర్ రాగానే నగరంలో స్వెటర్ దుకాణాలు భారీగా వెలుస్తుంటాయి. ఈ ఏడాది కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో స్వెటర్ దుకాణాలు వెలిశాయి. రంగురంగుల ఉన్ని దుస్తులతో పాటు రగ్గులు, దుప్పట్లు, టోపీలు, మఫ్లర్లు, చేతి గ్లౌజులు కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు.నవంబర్ రెండో వారం నుంచి జనవరి మూడో వారం వరకూ నగరంలో చలికాలం ఉంటుంది. ప్రత్యేకంగా డిసెంబర్, జనవరి నెలలో నగర ఉష్ణోగ్రతలు 12.5 డిగ్రీల కనిష్ట స్థాయిలో నమోదు అవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది నవంబర్ రెండో వారంలో చలి ప్రారంభమైంది. కానీ తుఫాను ప్రభావంతో చలి తీవ్రత తగ్గింది. ఈ వారం నుంచి చలి వాతావరణం మళ్లీ పుంజుకుంది. దీంతో స్వెటర్ల వ్యాపారాలు జోరుగా పెరిగాయి. నేపాల్ నుంచి వచ్చి.. చలికాలం ప్రారంభం కాగానే నేపాల్ వ్యాపారులు నగరానికి భారీగా తరలివచ్చి స్లాళ్లు ఏర్పాటు చేసుకుని మరీ అమ్మకాలు జరుపుతుంటారు. కోఠికి వెళ్లేవారు ఇలాంటి దుకాణాలను వరుసగా చూసే ఉంటారు. వీటితోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్ల వెంబడి స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. చాలా మంది నగర వాసులు ఇక్కడే కొనుగోలు చేస్తుంటారు. మూడు నెలల పాటు ఇక్కడే ఉండి విక్రయిస్తుంటామని, తమ ఉత్పత్తులకు ఇక్కడ డిమాండ్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. బ్రాండెడ్ దుకాణాలు సైతం.. ఇటీవల స్వెటర్ల వ్యాపారం రోడ్లపై నుంచి బ్రాండెడ్ షాపుల వరకూ చేరింది. గతంలో చేతితో తయారు చేసిన స్వెటర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరుందిన బ్రాండెడ్ కంపెనీలు తయారు చేస్తున్న స్వెటర్లను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లు వేసుకుంటున్న స్వెటర్ల కోసం బ్రాండెడ్ దుకాణాల్లో వెతుకుతున్నారు. వారి అభిరుచిని బట్టి వ్యాపారులు కూడా బ్రాండెడ్ ఉన్ని దుస్తులను తెప్పిస్తున్నారు. ధర ఎక్కువైనా కూడా వాటిని కొనేందుకు ముందుకొస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. తగ్గిన వ్యాపారం..నగరంలో ఏటా చలికాలం ప్రారంభానికి ముందు నుంచే పలువురు వ్యాపారులు తాత్కాలిక స్వెటర్ల షాపులు, రోడ్డుల పక్కన స్టాళ్లు ఏర్పాటు చేసి, మైదానాల్లో అమ్మకాలు చేస్తుండేవారు. అయితే ఈ ఏడాది నవంబర్ రెండో వారం నుంచి చలి ప్రారంభమైనప్పటికీ బంగాళాఖాతంలో తుపాన్ రావడంతో నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. చలి తగ్గింది. తిరిగి డిసెంబర్ నెల్లో కూడా సైక్లోన్ రావడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యాయి. దీంతో చలికాలం కోసం నగర వ్యాపారులు దేశ, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వివిధ రకాల స్వెటర్లతో పాటు ఇతర దుస్తువుల వ్యాపారం అనుకున్న స్థాయిలో జరగడంలేదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. స్టైల్ కోసం..చలిని తట్టుకోడంతో పాటు.. ధరించినప్పుడు హుందాగా కనబడేందుకు పలు స్వెటర్ తయారీ సంస్థలు వివిధ రకాల మోడల్స్ను రూపొందిస్తున్నాయి. ఇవి వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. ఏఎన్ఆర్, ఎనీ్టఆర్, చిరంజీవి లాంటి ఆ తరం నటులు సినిమాల్లో ధరించిన స్వెటర్లను అప్పట్లో వాడేవారని, ఇప్పుడు ఈ తరం హీరోలు, హీరోయిన్లు ధరించే స్వెటర్లను వాడేందుకు ఇప్పటి యువత ఆసక్తి చూపిస్తోందని పేర్కొంటున్నారు. కొంత మంది యువతీ యువకులు ఫలానా సినిమాల్లో హీరోహీరోయిన్ ధరించిన స్వెటర్ తయారు చేసి ఇవ్వాలని ఆర్డర్లు కూడా చేస్తుంటారని చెబుతున్నారు. ఉలెన్తో పాటు క్యాష్మిలన్ ఫ్యాబ్రిక్.. గతంలో ఉన్నితో తయారు చేసిన స్వెటర్లు ధరించేందుకు నగరవాసులు ఆసక్తి చూపేవారు. మందంగా ఉండే ఉన్ని దుస్తులను ధరించేందుకు ఇప్పుడు కొందరు ఆసక్తి చూపట్లేదు.. దీంతో తయారీదారులు తేలికగా ఉండే క్యాష్మిలన్ ఫ్యాబ్రిక్తో స్వెటర్లను తయారు చేస్తున్నారు. చలికాలంతో పాటు సాధారణ సీజన్లో కూడా ధరించేందుకు వీలుగా ఉండటంతో పాటు స్టైల్గానూ ఉంటున్నాయని యువత ఎక్కువగా ఈ ఫ్యాబ్రిక్తో తయారు చేసిన స్వెటర్లను వాడుతున్నారు. తేలికగా ఉండే చలిని తట్టుకునే స్వెటర్లు, గ్లౌజ్లతో పాటు సాక్స్ ఎక్కువగా అడుగుతున్నారు. – మహ్మద్ ఇల్యాస్ బుఖారీ, వ్యాపారి, మదీనా సర్కిల్సరసమైన ధరల్లో.. ఏటా కోఠిలో వెలిసే స్వెటర్ దుకాణాల్లో కొనుగోలు చేస్తుంటాం. తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి. డిజైన్స్తో పాటు మంచి నాణ్యమైనవి ఇక్కడ దొరుకుతాయని మేం వస్తుంటాం. పిల్లలతో పాటు పెద్ద వారికి కూడా ఇక్కడ లభిస్తుంటాయి. – మల్లికార్జున్, హైకోర్టు లాయర్ -
జిమ్నీ కార్లు వెనక్కి.. మారుతి సుజుకి కీలక ప్రకటన
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన జిమ్నీ ఆఫ్-రోడర్ కారుకు రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు మార్కెట్లో విక్రయించిన అన్ని వేరియంట్లు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయి.మారుతి సుజుకి జిమ్నీ కారు 80 కిమీ వేగంతో వెళ్తున్న సమయంలో బ్రేక్ వేస్తే వైబ్రేషన్స్ వస్తున్నట్లు, వేగం 60 కిమీకి తగ్గితే ఈ వైబ్రేషన్ పోతుందని చాలామంది కస్టమర్లు ఫిర్యాదు చేశారు. దీంతో కంపెనీ ఈ సమస్యను పరిష్కరించుడనికి రీకాల్ ప్రకటించింది. కారులో సమస్యను కంపెనీ ఉచితంగానే పరిష్కరిస్తుంది.మారుతి సుజుకి దేశీయ విఫణిలో.. ఆఫ్-రోడ్ విభాగంలో కూడా తన హవాను చాటుకోవడానికి, 'మహీంద్రా థార్'కు ప్రత్యర్థిగా నిలువడానికి జిమ్నీ ఎస్యూవీని లాంచ్ చేసింది. ప్రారంభంలో ఈ కారు ఉత్తమ అమ్మకాలను పొందినప్పటికీ.. క్రమంగా అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం కారు కొంత చిన్నదిగా ఉండటమే కాకుండా.. థార్ కంటే కూడా ధర కొంత ఎక్కువగా ఉండటం అనే తెలుస్తోంది.ఇదీ చదవండి: జనవరి నుంచి పెరగనున్న కార్ల ధరలు: ఎంతంటే..మారుతి జిమ్నీ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులోని 1.5 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్.. 104.8 పీఎస్ పవర్, 134.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మార్కెట్లో ఈ కారు ధర 12.74 లక్షల నుంచి రూ. 15.05 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. -
17ఏళ్ల యువకుడి కొత్త ఆలోచన.. నెలకు రూ.16 లక్షల సంపాదన
ఆలోచన ఉండాలే గానీ.. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు కనిపిస్తాయి. ఈ డిజిటల్ యుగంలో అయితే.. కంటెంట్ క్రియేషన్ & డిజిటల్ మార్కెటింగ్ వంటి రంగాల్లో యువకులు డబ్బు సంపాదించడానికి సిద్దమైపోతున్నారు. ఇలాంటి మార్గాలను అనుసరించే ఓ బ్రిటీష్ యువకుడు నెలకు ఏకంగా రూ.16 లక్షల కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.17 ఏళ్ల బ్రిటీష్ యువకుడు కెలన్ మెక్డొనాల్డ్.. పండుగ సీజన్లో ప్రత్యేకమైన స్టిక్కర్లను విక్రయించడం ద్వారా నెలకు 19000 డాలర్లు (రూ. 16,08,748) సంపాదిస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా అతని తల్లి ఇచ్చిన డిజిటల్ డ్రాయింగ్, కటింగ్ & ప్రింటింగ్ మెషీన్ను ఉపయోగించే ఇంత పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్నాడు.కెలన్ మెక్డొనాల్డ్ రూపొందించిన స్టిక్కర్ల ఫోటోలను తన ఫేస్బుక్లో షేర్ చేశారు. సొంతంగా రూపొందించిన స్టిక్కర్లను గాజు వస్తువులు, యాక్రిలిక్పై అంటించి.. డబ్బు సంపాదించేవారు. ప్రతి రోజూ కాలేజ్ పూర్తయిన తరువాత స్టిక్కర్ల వర్క్ మీద మూడు గంటలకు పనిచేసేవాడు.ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతను నాయుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?ఇప్పటి వరకు కెలన్ 94,410.31 డాలర్లు సంపాదించినట్లు సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 79.93 లక్షల కంటే ఎక్కువే. నాకు లభించిన క్రిస్మస్ కానుక ద్వారా ఇంతలా డబ్బు సంపాదించవచ్చని నేను ఊహించనే లేదు. ప్రస్తుతం నా సమయం కూడా చాలా వేగంగా సాగిపోతోంది కెలన్ మెక్డొనాల్డ్ వెల్లడించారు. -
సవాల్ ఉంటేనే సక్సెస్... తగ్గేదేలే!
‘గృహిణిగా బోలెడన్ని బాధ్యతలు ఉంటాయి ఇంక వ్యాపారాలు ఏం చేస్తారు?’ అనుకునేవారికి ‘చేసి చూపుతాం..’ అని నిరూపిస్తోంది నేటి మహిళ. ‘ఒకప్పుడు మేం గృహిణులమే ఇప్పుడు వ్యాపారులం కూడా’ అంటున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా, నచ్చిన పని చేస్తూ అందరూ మెచ్చేలా విజయావకాశాలను అందుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలు కలిశారు. సవాళ్ళను ఎదుర్కోవడమే తమ సక్సెస్ మంత్ర అని చెప్పారు. ఆ వివరాలు వారి మాటల్లో... – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి స్ట్రాంగ్గా ఉంటే.. వింటారు సివిల్ ఇంజినీరింగ్ చేశాను. నాకు ఇంటీరియర్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. దీంతో ఇంటీరియర్ అడ్వాన్స్ కోర్స్ 2018లో పూర్తి చేశాను. గేటెడ్ కమ్యూనిటీలు, సెలబ్రిటీ హౌజ్లు డిజైన్ చేశాను. కస్టమర్ బడ్జెట్, ఆలోచనలు తీసుకొని ప్రత్యేకంగా చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఇప్పటి వరకు 200లకు పైగా ్ర΄ాజెక్ట్స్ పూర్తి చేశాను. ఇంటీరియర్ డిజైనింగ్లో మహిళలు రాణించలేరు అనుకుంటారు. కానీ, నేను డామినేటింగ్గా ఉంటాను. స్ట్రాంగ్గా ఉంటే ఎవ్వరైనా మన మాట వింటారు. – అనూష మేకప్ ఒక ఆర్ట్ మేకప్ ఆర్ట్ నాకు చాలా ఇష్టమైన వర్క్. అందుకే, ప్రొఫెషనల్ కోర్స్ తీసుకొని, ముందు మా కమ్యూనిటీలోనే స్టార్ట్ చేశాను. ఇంటివద్దకే వచ్చి మేకప్ చేయించుకునేవారు. రెండేళ్ల క్రితం స్టూడియో ఏర్పాటు చేశాను. 7–8 రాష్ట్రాలలో మా స్టూడియో ద్వారా మేకప్ సర్వీస్ అందిస్తున్నాను. చాలా మంది మేకప్ అనగానే ఫౌండేషన్, కాజల్.. బ్యుటీషియన్ వర్క్ అనుకుంటారు. అలాగే మేకప్ అనేది చాలా మందికి పెళ్లి వంటి ప్రత్యేకమైన సందర్భం తప్పితే అంతగా అవసరం లేనిదిగా చూస్తారు. కానీ, పెళ్లి, వెస్టర్న్ పార్టీలు, బర్త్ డే పార్టీలు... ఇలా సందర్భానికి తగినట్టు మేకప్ స్టైల్స్ ఉన్నాయి. మేకప్ ఆర్టిస్టులకి మార్కెట్లో చాలా పెద్ద పోటటీ ఉంటుంది. కానీ, వారి నెట్వర్క్తో ప్రొఫెషనల్గా చేసే మేకప్కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. – శ్రీలేఖ, మేకప్ సెంట్రల్ నిరూపించుకోవాలనుకుంటే సాధించగలంలక్సస్ డిజైన్ స్టూడియోస్పెషల్గా బ్రైడల్ వేర్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికీ డిజైన్ చేస్తాను. కార్పొరేట్ యూనిఫార్మ్స్, ఫస్ట్ బర్త్డే పార్టీలకు డ్రెస్ డిజైన్ చేస్తాను. 2013లో చెన్నైలో మొదటి బ్రాంచ్ స్టార్ట్ చేశాను. తర్వాత హైదరాబాద్లో ఏర్పాటు చేశాం. సెలబ్రిటీలకు దాదాపు 50 తమిళ సినిమాలకు, 50 తెలుగు సినిమా స్టార్స్కి డిజైన్ చేశాను. ఫ్యాబ్రిక్ ఎంపికలో, ఉద్యోగుల విషయంలోనూ, డిజైనింగ్లోనూ.. ప్రతిదీ సవాల్గా ఉంటుంది. మనల్ని మనం నిరూపించుకోవాలనుకుంటే ఏమైనా సాధించగలం. - అమూల్య, అమూల్య అండ్ కృష్ణ కొచర్ పనిలో ప్రత్యేకత చూపాలికేక్ బేకింగ్ తయారు చేసేటప్పుడు నా చుట్టూ ఉన్నవారు ‘ఇప్పటికే మార్కెట్లో చాలామంది హోమ్ మేకర్స్ ఉన్నారు, నీవేం సక్సెస్ అవుతావు’ అన్నారు. కానీ, వారి మాటలు పట్టించుకోలేదు. నా హార్డ్ వర్క్నే నమ్ముకున్నాను. కస్టమైజ్డ్ కేక్స్ హాఫ్ కేజీవి కూడా తయారు చేస్తాను. ఎగ్లెస్ డిజర్ట్స్ కేక్స్ మా ప్రత్యేకత. మొదట మా కమ్యూనిటీలోని వారికే చేసేదాన్ని. వాటిని ఇన్స్టాగ్రామ్లో ΄ోస్ట్ చేయడం, ఆ తర్వాత ఒక్కో ఆర్డర్ రావడం మొదలయ్యింది. టైమ్ ప్రకారం డెలివరీ చేసేదాన్ని. ఒకసారి ఒక జంటకు వారి బేబీ షవర్కి బహుమతులు ఆర్డర్పై అందించాను. ఇటీవల వారి రెండవ బేబీ షవర్ కోసం అతిథులకు ప్రత్యేకమైన కేక్ వర్క్షాప్ నిర్వహించాను. దాదాపు 400 మంది కస్టమర్లు ఆర్డర్స్ ఇస్తుంటారు. ఫైనాన్స్ సబ్జెక్ట్లో మాస్టర్స్ చేశాను. నాదైన సొంత ఆలోచనతో స్టార్టప్ నడ΄ాలని బేకింగ్ తయారీ మొదలుపెట్టాను. సక్సెస్ అవుతుందా అనే ఆలోచన లేకుండా, ఆందోళన పడకుండా రుచికరమైన కేక్స్ తయారుచేసివ్వడంలోనే దృష్టిపెట్టాను. – రాధిక, ఆర్బేక్ హౌజ్ఇదీ చదవండి: 13 బంగారు పతకాలు, తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : ఎవరీ శ్రద్ధా -
స్వర్గాన్ని తలపించే వెహికల్.. జర్నీ కోసం మాత్రమే కాదు: అంతకు మించి (ఫోటోలు)
-
100 రూపాయల టికెట్ రూ.54కే.. మంత్రి కీలక వ్యాఖ్యలు
రైల్వే టికెట్ల తగ్గింపుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి 'అశ్విని వైష్ణవ్' లోక్సభలో మాట్లాడుతూ.. ప్రతి టికెట్పై 46 శాతం రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణీకులందరికీ ప్రభుత్వం అందించిన మొత్తం సబ్సిడీ రూ.56,993 కోట్లు అని స్పష్టం చేశారు.ఒక టికెట్ ధర రూ.100 అయినప్పుడు.. ప్రభ్యుత్వం దీనిని 54 రూపాయలకు అందిస్తుంది. అంటే ఒక టికెట్ మీద అందిస్తున్న రాయితీ 46 శాతం. ఇది అన్ని కేటగిరీ ప్రయాణికులను వర్తిస్తుందని మంత్రి వెల్లడించారు. వేగవంతమైన ట్రైన్ సర్వీసులకు సంబంధించిన ప్రశ్నకు జావాబిస్తూ.. అటువంటి సర్వీస్ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొన్నారు.వేగవంతమైన ట్రైన్ సర్వీస్.. భుజ్ & అహ్మదాబాద్ మధ్య ప్రారంభమైంది. నమో భారత్ ర్యాపిడ్ రైల్ భుజ్ - అహ్మదాబాద్ మధ్య 359 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లో అధిగమించడం ద్వారా ఇంటర్సిటీ కనెక్టివిటీని మెరుగుపరిచిందని వివరించారు. ఈ సేవ ప్రయాణికులకు చాలా సంతృప్తికరంగా ఉందని కూడా మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.ఎలాంటి జాప్యం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మేము ఎప్పుడూ ముందడుగు వేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. సరసమైన ధరలతో సులభమైన ప్రయాణం అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. రైలు ప్రమాదాల సంఖ్య కూడా బాగా తగ్గిందని.. 2014లో రూ.29,000 కోట్లుగా ఉన్న రైల్వే బడ్జెట్ను రూ.2.52 లక్షల కోట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు. -
మహిళా ‘సూపర్’ మార్ట్
చిత్తూరు యాసలో వినిపించే ‘పుష్పా–2’ డైలాగ్....‘పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా... ఇంటర్నేసనల్’ బాగా పేలింది.చిత్తూరు జిల్లా తవణంపల్లె మహిళా మార్ట్కు కూడా ఈ డైలాగ్ను అన్వయించుకోవచ్చు.‘మా మహిళా మార్ట్ అంటే స్టేట్ అనుకుంటివా... ఇప్పుడు నేషనల్... రేపు ఇంటర్నేషనల్’ఆనాటి వై.ఎస్.జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘మారనున్న అక్కాచెల్లెమ్మల భవిత’ నినాదంతో పురుడు పోసుకున్న ‘మహిళా మార్ట్’లు ఇంతై ఇంతింతై అన్నట్లుగా ఎదిగి పోయాయి.కార్పొరేట్ సూపర్ మార్కెట్లతో సమానంగా సత్తా చాటుతున్నాయి.తాజాగా... చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లె ‘మహిళా మార్ట్’ జాతీయస్థాయిలో పురస్కారం పొందింది.చిన్న దుకాణాన్ని నడపడానికి కూడా ఎన్నోవిధాల ఆలోచించాల్సి ఉంటుంది. ఎంతో కొంత డబ్బు కావాల్సి ఉంటుంది. అలాంటిది కార్పొరేట్ మార్ట్లకు దీటుగా ఒక్క అడుగు వెనక్కి తగ్గకుండా సాధారణ మహిళల ‘మహిళా మార్ట్’లు విజయం సాధించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. వ్యాపారంలో ఓనమాలు కూడా తెలియని వారు, భర్త ఆదాయంపైనే పూర్తిగా ఆధారపడేవారు, పల్లెకే పరిమితమైన వారు ‘మహిళా మార్ట్’ల పుణ్యమా అని వ్యాపారంలో మెలకువలు తెలుసుకున్నారు. ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడే శక్తిని తెచ్చుకున్నారు. పల్లె దాటి ప్రపంచాన్ని చూస్తున్నారు.‘ఇది మా వ్యాపారం. మా టర్నోవర్ ఇంత...’ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగారు.వై.ఎస్.జగన్ ప్రభుత్వంలో మండల సమాఖ్య ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యుల భాగస్వామ్యంతో రాష్ట్రంలోనే రెండో ‘చేయూత మహిళా మార్ట్ ను తవణంపల్లెలో 2023 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. మండలంలోని 1,431 స్వయం సహాయక సంఘాల్లోని 14,889 మంది సభ్యుల వాటా ధనం రూ.26 లక్షలతో ‘చేయూత మహిళా మార్ట్’(ప్రస్తుతం వెలుగు మహిళ మార్ట్గా పేరు మార్చారు)ను ్రపారంభించారు.ఆర్థిక అవగాహన, పొదుపు, అప్పుల రికవరీలు, సిఐఎఫ్ చెల్లింపులు. స్త్రీనిధి, పారదర్శక నిర్వహణ, రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా రైతులకు అందిస్తున్న సేవలతో తవణంపల్లె మహిళా మార్ట్ ముందంజలో ఉంది. మండల సమాఖ్య ద్వారా సభ్యుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ మహిళా మార్ట్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో, జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ యూసఫ్గూడలోని నేషనల్ ఇ¯Œ స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కార్యాలయంలో తవణంపల్లె మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శి అనిత సర్టిఫికేట్, షీల్డు, ్రపోత్సాహక నగదు (రూ.75 వేలు) అందుకున్నారు.‘ఇది ఒకరిద్దరి విజయం కాదు. ఎంతోమంది మహిళల సామూహిక విజయం. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విజయం’ అంటున్నారు రేఖ, అనిత.– తగీరు జగన్నాథం, సాక్షి, తవణంపల్లె, చిత్తూరు జిల్లా.పారదర్శకత... మా బలం‘అన్నీ తెలిసిన వారు లేరు. ఏమీ తెలియని వారు లేరు’ అనే సామెత ఉంది. ఏమీ తెలియకుండా ఎవరూ ఉండరు. మనకు తెలిసినదాన్ని మరింత మెరుగుపరుచుకుంటే ఏదీ అసాధ్యంగా అనిపించదు. ‘మహిళా మార్ట్’ అనే బడిలో వ్యాపారంలో ఓనమాలు దిద్దుకున్నాం. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఏ వ్యాపారానికి అయినా పారదర్శకత అనేది ముఖ్యం. ఆ పారదర్శకత వల్లే జాతీయ గుర్తింపు వచ్చింది. మహిళా సంఘాలు ‘వెలుగు మహిళా మార్ట్’ను పారదర్శకంగా నిర్వహించడంతో జాతీయ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. గుర్తింపు అనేది ఉత్సాహాన్ని ఇవ్వడమే కాదు మరిన్ని విజయాలు సాధించడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది.– అనిత మహిళా సమాఖ్య మండల కార్యదర్శిఆ నమ్మకమే ముందుకు నడిపిస్తుందివ్యాపారంలో ఫలానా మహిళ ఉన్నత స్థాయికి చేరింది... లాంటి ఎన్నో విజయగాథలను వినేవాళ్లం. అలాంటి ఒక స్థాయికి ఏదో ఒకరోజు చేరుకోగలమా అనిపించేది. ‘మహిళా మార్ట్’ ద్వారా మమ్మల్ని గొప్ప అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. మాకు ధైర్యాన్ని ఇచ్చింది. ముందుకు నడిపించింది. ‘మీ విజయ రహస్యం ఏమిటి?’ అడిగే వాళ్లకు నేను చెప్పే జవాబు... ‘నేను సాధించగలను’ అనే నమ్మకం. ఆ నమ్మకానికి కష్టం, అంకితభావం తోడు కావాలి. తవణంపల్లెలోని వెలుగు మహిళా మార్ట్లో సభ్యులకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు విక్రయిస్తున్నాం. బయట మార్కెట్ కంటే తక్కువ ధరలకు అన్నిరకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. డ్వాక్రా సభ్యులు మార్ట్లోని వస్తువులే కొంటున్నారు.– రేఖ మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు -
కోర్టు మెట్లెక్కిన ఇండిగో: మహీంద్రా ఎలక్ట్రిక్పై దావా
దేశీయ వాహన తయారీ దిగ్గజం ఇటీవల 'బీఈ 6ఈ' ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. మహీంద్రా ఎలక్ట్రిక్ కొత్తగా లాంచ్ చేసిన కారు పేరులో '6ఈ'ని ఉపయోగించడంపై.. భారత విమానయాన సంస్థ ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. మహీంద్రా కంపెనీ ట్రేడ్మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది.మంగళవారం ఈ కేసు జస్టిస్ 'అమిత్ బన్సల్' ముందుకు వచ్చింది. అయితే ఈయన ఈ కేసు నుంచి తప్పకున్నారు. కాబట్టి విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా పడింది. మహీంద్రా ఎలక్ట్రిక్ ఇండిగోతో సామరస్య పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇండిగో సంస్థ తన బ్రాండింగ్ కోసం మాత్రమే కాకుండా.. ప్రయాణికులకు '6ఈ' పేరుతో సేవలందిస్తోంది. ఎయిర్లైన్ 6ఈ ప్రైమ్, 6ఈ ఫ్లెక్స్, బ్యాగేజ్ ఎంపికలు, లాంజ్ యాక్సెస్ వంటి వాటి కోసం కూడా 6ఈను ఉపయోగిస్తోంది. ఇప్పుడు మహీంద్రా '6ఈ'ను ఉపయోగించడం పట్ల ఇండిగో కోర్టును ఆశ్రయించింది.నిజానికి మహీంద్రా ఎలక్ట్రిక్ నవంబర్ 25న 'బీఈ 6ఈ' నమోదు కోసం దరఖాస్తును చేసుకుంది. దీనిని రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్మార్క్ అంగీకరించింది. ద్విచక్ర వాహనాలను మినహాయించి, ఫోర్ వీలర్ వాహనాలకు '6E' హోదాను ఉపయోగించడానికి హక్కులను కంపెనీ సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు ఇండోగో అభ్యంతరం చెబుతోంది. దీనిపై తీర్పు త్వరలోనే వెల్లడవుతుంది. -
అమ్మకాల్లో అదరగొట్టిన నిస్సాన్: ఏకంగా..
నిస్సాన్ ఇండియా అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. మార్కెట్లో 5 లక్షల కార్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. సంస్థ 2010లో తన కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి మొత్తం 5,13,241 యూనిట్ల సేల్స్ సాధించింది. నవంబర్ 2024లో నిస్సాన్ 9,040 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇందులో దేశీయ విక్రయాలు 2,342 యూనిట్లు కాగా.. ఎగుమతులు 6,698 యూనిట్లు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది కంపెనీ సేల్స్ గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.నిస్సాన్ కంపెనీ అమ్మకాలు పెరగటానికి మాగ్నైట్ ప్రధాన కారణం. రూ. 6 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వల్ల లభించే ఈ కారును చాలామంది కస్టమర్లు ఇష్టపడి కొనుగోలు చేశారు. ఇది ప్రస్తుతం ఎక్స్-ట్రైల్తో పాటు అమ్ముడవుతోంది.ఇదీ చదవండి: ట్రైన్ ఆలస్యమైతే.. అవన్నీ ఫ్రీ: రీఫండ్ ఆప్షన్ కూడా..సన్రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జర్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన నిస్సాన్ మాగ్నైట్ 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతాయి. -
రోజుకు 1000 మంది కొన్న కారు ఇదే..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా.. ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన 4వ తరం డిజైర్ కోసం రోజుకు 1,000 బుకింగ్స్ పొందుతోంది. ఇందులో సగం కంటే ఎక్కువ మంది కస్టమర్లు మొదటి రెండు వేరియంట్లను ఎంచుకుంటున్నట్లు సమాచారం.నవంబర్ 11న డిజైర్ బుకింగ్స్ ప్రారంభించిన మారుతి సుజుకి.. మొత్తం 30వేల కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. కాగా సంస్థ 5000 మందికి ఈ కొత్త కారును డెలివరీ చేసింది.LXi, VXi, ZXi & ZXi+ అనే నాలుగు వేరియంట్లలో లభించే మారుతి సుజుకి డిజైర్ ధరలు రూ. 6.79 లక్షల నుంచి రూ. 10.14 లక్షల మధ్య ఉన్నాయి. ఎక్కువమంది జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ కార్లను బుక్ చేసుకుంటున్నట్లు సమాచారం. డిజైర్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో 61% వాటాను కలిగి ఉంది.అమ్మకాల్లో హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న మారుతి డిజైర్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా ఇది ఉత్తమంగా ఉంటుంది.2024 డిజైర్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ క్రిస్టల్ విజన్ హెడ్ల్యాంప్, ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్స్, 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్స్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, రియర్ ఏసీ వెంట్స్, రియర్ ఆర్మ్రెస్ట్, సుజుకి కనెక్ట్ వంటి అనేక ఫీచర్స్ పొందుతుంది. -
2024 విజికీ మీడియా విజిబిలిటీ ర్యాంకింగ్స్: రిలయన్స్ టాప్
ఆదాయం, లాభాలు, మార్కెట్ వాల్యూ, సామాజిక ప్రభావం వంటి వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. 2024 విజికీ వెలువరించిన న్యూస్ స్కోర్ ర్యాంకింగ్లో సంస్థ ప్రథమ స్థానంలో నిలిచింది. భారతదేశంలోని ప్రముఖ FMCG లేదా బ్యాంకింగ్ & ఫైనాన్స్ కంపెనీల కంటే కూడా రిలయన్స్ విజిబిలిటీ చాలా ఎక్కువగా ఉందని ఏఐ బేస్డ్ మీడియా ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది.రిలయన్స్ సంస్థ.. 2024 న్యూస్ స్కోర్లో 100కి 97.43 స్కోర్ చేసింది. ఈ స్కోర్ 2023 (96.46), 2022 (92.56), 2021 (84.9) కంటే ఎక్కువని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే సంస్థ ప్రతి ఏటా వృద్ధి నమోదు చేస్తూనే ఉంది. రిలయన్స్ కంపెనీ విజికీ న్యూస్ స్కోర్ వార్షిక ర్యాంకింగ్స్లో మొదటి నుంచి గత ఐదేళ్లలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.విజికీ న్యూస్ స్కోర్ అనేది న్యూస్ పరిమాణం, హెడ్లైన్ ప్రజెంటేషన్, పబ్లికేషన్ రీచ్ & రీడర్షిప్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్.. మీడియా ఇంటెలిజెన్స్ని ఉపయోగించి బ్రాండ్లు, వ్యక్తుల కోసం వార్తల దృశ్యమానతను కొలవడానికి ప్రపంచంలోని మొట్టమొదటి ప్రామాణిక కొలమానం.రిలయన్స్ తరువాత ర్యాంకింగ్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (89.13), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (86.24), వన్97 కమ్యూనికేషన్స్ (84.63), ఐసీఐసీఐ బ్యాంక్ (84.33), జొమాటో (82.94) ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్ ఏడో స్థానంలో ఉండగా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ITC తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 40వ స్థానంలో ఉంది. -
అసలే ఖరీదైన బైకులు.. మరింత పెరగనున్న ధరలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్.. తన బైకుల ధరలను 2.5 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు 2024 జనవరి 1నుంచే అమలులోకి రానున్నట్లు సమాచారం. ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల ధరలను పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.ఏప్రిల్ 2017లో బీఎండబ్ల్యూ ఇండియా అనుబంధ సంస్థగా, తన కార్యకలాపాలను ప్రారంభించిన బీఎండబ్ల్యూ మోటోరాడ్.. ఖరీదైన బైకులను, స్కూటర్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ జాబితాలో బీఎండబ్ల్యూ జీ310 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ జీ310 ఆర్, బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ జీ 310 జీఎస్, బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ సీఈ 02, బీఎండబ్ల్యూ సీఈ 04 మొదలైనవి ఉన్నాయి.ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యంత ఖరీదైన స్కూటర్గా బీఎండబ్ల్యూ సీఈ 04 (రూ. 14.90 లక్షలు). ప్రస్తుతం, దేశంలో విక్రయించే అన్ని బీఎండబ్ల్యూ బైక్లు, స్కూటర్లు ప్రామాణికంగా 3 సంవత్సరాల, అపరిమిత మైలేజ్ వారంటీతో వస్తున్నాయి. బీఎండబ్ల్యూ ఇండియన్ పోర్ట్ఫోలియోలో మొత్తం 27 మోడల్స్ ఉన్నట్లు సమాచారం. వీటి ధరలన్నీ జనవరి 1నుంచి గణనీయంగా పెరుగుతాయి. -
ఆన్లైన్ షాపింగ్ కోసం అత్యుత్సాహం వద్దు!: హెచ్చరికలు జారీ
ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఎదురుచూస్తున్న బ్లాక్ఫ్రైడే సేల్స్ మొదలైపోయాయి, షాపింగ్ హడావిడి కూడా పెరిగిపోయింది. దీనిని అదనుగా తీసుకున్న స్కామర్లు.. ప్రజలను దోచుకోవడానికి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే, ఈ సారి జరిగే మోసాలు 89 శాతం ఎక్కువని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. దాదాపు 80 శాతం షాపింగ్ సంబంధిత ఇమెయిల్లు స్కామ్లుగా గుర్తించారు. వినియోగదారులను మోసం చేయడానికి స్కామర్లు గూగుల్ సెర్చింగ్ ఫలితాలను కూడా తారుమారు చేస్తున్నట్లు సమాచారం.బ్లాక్ఫ్రైడే సేల్స్ సందర్భంగా చాలా మోసాలు జరుగుతున్నాయని.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ఆన్లైన్ షాపింగ్ చేసే వారికి హెచ్చరికలు జారీ చేసింది. బ్లాక్ఫ్రైడే, సైబర్ మండే, మిగిలిన సెలవు సీజన్లలో మోసాల నుంచి తమను తాము రక్షించుకోవాలని.. మోసాల బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని ఎఫ్బీఐ పేర్కొంది.యూఎస్ మార్కెట్లో 95 శాతం ఆధిపత్యం చెలాయించే క్రోమ్, సఫారీ, ఎడ్జ్ వంటి ప్రసిద్ధ వెబ్ బ్రౌజర్ల వినియోగదారులను కూడా ఎఫ్బీఐ హెచ్చరిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆన్లైన్లో షాపింగ్ చేసే సమయంలో ఆఫర్ లేదా డిస్కౌంట్ వంటి వాటిలో ఏ మాత్రం అనుమానం అనిపించినా వెంటనే జాగ్రత్త పడాలి.ఆఫర్లు చూసిన మోసపోయి.. స్కామర్లకు బాధితులవ్వకండి. ప్రతి సంవత్సరం, వేలాది మంది ప్రజలు ఈ స్కాములకు బలైపోతున్నారని ఎఫ్బీఐ వెల్లడించింది. స్కామర్ల చేతికి చెక్కితే.. సంపాదించినా డబ్బు, వ్యక్తిగత సమాచారం వంటి వాటిని దోచుకుంటారు.ఎఫ్బీఐ ముందు జాగ్రత్త చర్యలుఆన్లైన్లో కొంతమంది వస్తువులపై ఎక్కువ ఆఫర్స్ ప్రకటిస్తూ ఆకర్షిస్తారు. ఇది నిజమని నమ్మి డబ్బు చెల్లించి, మీరు దానిని బుక్ చేసుకుంటే మీకు ఎప్పటికీ డెలివరీ రాదు. ఇలాంటి తరహా నాన్ డెలివరీ స్కామ్లు, నాన్ పేమెంట్ స్కామ్లు, గిఫ్ట్ కార్డ్ మోసాలు జరుగుతుంటాయి. ఇలాంటివి అస్సలు నమ్మకూడదు.Don't let #holiday excitement cloud your judgment! Always verify the legitimacy of online retailers and be cautious with unsolicited offers. Learn how to spot a holiday scam at https://t.co/rg1Twt4Nq2. pic.twitter.com/RBgftlHngh— FBI (@FBI) November 29, 2024 -
బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి?.. ఎప్పుడు, ఎలా మొదలైందంటే..
మన దేశంలో సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలకు వచ్చే ఆఫర్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తారన్న విషయం తెలుసు. అయితే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది బ్లాక్ఫ్రైడే ఆఫర్స్ కోసం ఎదురు చూస్తారు. ఆ బ్లాక్ఫ్రైడే (నవంబర్ 29) రానే వచ్చింది. ఇంతకీ ఈ బ్లాక్ఫ్రైడే ఎలా పుట్టింది? నిజంగానే అనుకున్నంత డిస్కౌంట్స్ లభిస్తాయా? అనే ఆసక్తికరమైన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.బ్లాక్ఫ్రైడే ఎలా వచ్చింది?ప్రతి ఏటా నవంబర్ చివరి వారంలో వచ్చే శుక్రవారాన్నే బ్లాక్ఫ్రైడేగా పిలుస్తారు. అమెరికాలో అయితే.. బ్లాక్ఫ్రైడే ముందు రోజును థాంక్స్ గివింగ్ డే పేరుతో సెలబ్రేట్స్ చేసుకుంటారు. బ్లాక్ఫ్రైడే ఎలా వచ్చింది? అనటానికి చాలా సంఘటనలు ఉదాహరణలుగా చెబుతారు.నిజానికి బ్లాక్ఫ్రైడే అనే పదానికి.. షాపింగ్కు సంబంధమే లేదు. 1969 ఆర్ధిక సంక్షోభం సమయంలో ఒక శుక్రవారం రోజు బంగారం ధరలు భారీ పడిపోవడంతో.. దాన్నే బ్లాక్ఫ్రైడేగా పిలుచుకున్నారు. అంతే కాకుండా 20వ శతాబ్దంలో.. ఒకసారి అమెరికాలో కార్మికుల సెలవు రోజుల తరువాత విధులకు లేటుగా వెళ్లారు.. దీన్ని కూడా బ్లాక్ఫ్రైడే అని పిలిచారు. ఫిలడెల్ఫియాలో శుక్రవారం రోజు షాపింగ్ వల్ల రద్దీ ఎక్కువగా ఏర్పడటంతో.. పోలీసులు దాన్ని బ్లాక్ఫ్రైడేగా పిలిచారు. ఆ తరువాత బ్లాక్ఫ్రైడే అనేది ఆన్లైన్ కొనుగోళ్ళకు.. డిస్కౌంట్లకు పర్యాయపదంగా మారిపోయింది.శుక్రవారం రోజు మొదలయ్యే వ్యాపారం.. వారాంతంలో కూడా బాగా సాగుతుంది. ఇది సోమవారం వరకు సాగేది. ఇలా బ్లాక్ఫ్రైడేను వ్యాపారానికి ఆపాదించేసారు. ఆ తరువాత సోషల్ మీడియా / ఇంటర్నెట్ కారణంగా.. బ్లాక్ఫ్రైడే అనే పదం ప్రపంచానికి పరిచయమైంది.2023 బ్లాక్ఫ్రైడే సేల్2023 బ్లాక్ఫ్రైడే సేల్స్ సమయంలో ప్రపంచంలోని వినియోగదారులు ఏకంగా రూ. 6 లక్షల కోట్లకంటే ఎక్కువ విలువైన షాపింగ్ చేసినట్లు.. అమెరికన్ సాఫ్ట్వేర్ సంస్థ సేల్స్ ఫర్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ సేల్స్ 2022తో పోలిస్తే 8 శాతం ఎక్కువ. ఈ ఏడాది అమ్మకాలు 2023 కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని అంచనా.గొప్ప ఆఫర్స్ ఉంటాయా?మంచి ఆఫర్స్ ఉంటాయా? అనే విషయాన్ని పరిశీలిస్తే.. బ్లాక్ఫ్రైడే సేల్స్ సమయంలో ప్రకటించే ఏడు ఆఫర్లతో ఒకటి మాత్రమే నిజమైందని బ్రెటర్ వినియోగదారుల బృందం 2022లో వెల్లడించింది. కాబట్టి బ్లాక్ఫ్రైడే ఆఫర్స్ కంటే క్రిస్మస్ షాపింగ్ ఉత్తమం అని తెలిపారు.ఇదీ చదవండి: పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలుకొన్ని దేశాల్లో అయితే బ్లాక్ఫ్రైడే వస్తోందని ముందుగానే ధరలను పెంచేసి.. ఆ రోజు తగ్గించినట్లు ప్రకటిస్తాయి. దీనిని ప్రజలు బ్లాక్ ఫ్రాడ్ అని విమర్శించారు. కాబట్టి బ్లాక్ఫ్రైడే సమయంలో ఆఫర్స్ ఉపయోగించే ఉత్పత్తులను కొనాలని చూసేవారు తప్పకుండా జాగ్రత్తగా పరిశీలించాలి. స్కామర్లు కూడా దీనిని అదనుగా చూసుకుని.. మోసాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు ఆదమరిస్తే మోసపోవడం ఖాయం. -
ఫార్మా పవర్హౌస్గా భారత్: 2030 నాటికి అదే టార్గెట్..
ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా (ఓపీపీఐ) బీసీజీ భాగస్వామ్యంతో 'విన్నింగ్ ఇన్ ఇండియన్ హెల్త్కేర్' పేరుతో కొత్త నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను ఓపీపీఐ యాన్యువల్ సమ్మిట్ 2024: వికసిత్ భారత్ 2047థీమ్తో ప్రారంభించారు. భారతదేశాన్ని ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ నుంచి ఫార్మా పవర్హౌస్గా ప్రపంచానికి పరిచయం చేయాలి.. అనేది దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమానికి పరిశ్రమలకు సంబంధించిన ప్రముఖులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, ఇతర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.ప్రస్తుతం భారతదేశ ఔషధ మార్కెట్.. విలువ సుమారు 60 బిలియన్లు. ఈ విలువ 2030 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. భారత ఆరోగ్య సంరక్షణ రంగం ఒక బలమైన ఔషధ పర్యావరణ వ్యవస్థ ద్వారా త్వరిత విస్తరణకు సిద్ధంగా ఉంది. దేశ ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మార్చడంలో.. గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయి. దీనికోసం వినూత్న సాంకేతికతలను ప్రవేశపెట్టారు. రోగుల సహాయ కార్యక్రమాలను అమలు చేశారు. కమ్యూనిటీ అవసరాలను తీర్చడానికి స్థానిక సామర్థ్యాలలో గణనీయమైన పెట్టుబడులు పెట్టారు.సుమారు 70 శాతం గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు.. వచ్చే ఐదేళ్లలో భారతదేశంలో 10 శాతం కంటే ఎక్కువ వార్షిక వృద్ధిని సాధించగలవని అంచనా. ఇది వికసిత భారత్ లక్ష్యానికి కూడా ఉపయోగపడుతుంది.ఈ కార్యక్రమంలో ఓపీపీఐ డైరెక్టర్ జనరల్ అనిల్ మాతాయ్ మాట్లాడుతూ.. భారతదేశ బలమైన ఫార్మా పర్యావరణ వ్యవస్థ, దూరదృష్టితో కూడిన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా దేశాన్ని ప్రపంచ ఫార్మా పవర్హౌస్గా నిలిపింది. 2030 నాటికి భారతీయ ఫార్మా మార్కెట్ 120 బిలియన్లకు చేరుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీజీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీనియర్ పార్టనర్ ప్రియాంక అగర్వాల్ మాట్లాడుతూ.. 2030 నాటికి భారతీయ ఫార్మా మార్కెట్ రెట్టింపు అవుతుందని చెబుతూ.. ప్రపంచ ఫార్మాస్యూటికల్ కంపెనీలకు గణనీయమైన అవకాశాలను అందజేస్తుందని తెలిపారు. గ్లోబల్ ఫార్మా కంపెనీలు ఇప్పటికే గణనీయమైన వ్యాపారాలను నిర్మించాయి. దేశీయ మార్కెట్కు సేవ చేయడానికి మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి బలమైన ఆసక్తిని చూపుతున్నాయని అన్నారు. -
బ్లాక్ ఫ్రైడే సేల్స్ షురూ: ఆఫర్స్ ఇవే..
రిలయన్స్ డిజిటల్ బ్లాక్ ఫ్రైడే సేల్ మొదలైపోయింది. ఈ సేల్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, గృహోపకరణాలు వంటి వాటిని ఆఫర్ ధరతో కొనుగోలు చేయాలంటే.. రిలయన్స్ డిజిటల్ లేదా మైజియో స్టోర్లలో లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్లలో కొనుగోలు చేయవచ్చు.రిలయన్స్ డిజిటల్ బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా.. ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, వన్ కార్డ్ నుంచి ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 10వేలు వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లను ఎంచుకునే వారికి, ఫైనాన్స్ భాగస్వాములైన బజాజ్ ఫిన్సర్వ్.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్తో రూ.22,500 వరకు క్యాష్బ్యాక్ కూడా పొందవచ్చు.యాపిల్ ఉత్పత్తులను తక్కువ ధరలో కొనుగోలు చేయాలంటే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ఓ బెస్ట్ ఆప్షన్. ఐఫోన్ 16ను ఇప్పుడు రూ. 70,900లకు, ఐప్యాడ్లను 1,371 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేస్తే రూ.25,000 తక్షణ తగ్గింపుగా పొందవచ్చు. అదే సమయంలో రూ.8,995 విలువైన ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ 1,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.బీపీఎల్ 1.5 టన్స్ 3 స్టార్ ఏసీను రూ. 29,990కే కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీలపై కూడా సూపర్ కూల్ ఆఫర్లు ఉన్నాయి. ల్యాప్టాప్ల మీద కూడా అద్భుతమైన తగ్గింపులను పొందవచ్చు. ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీలపై రూ. 26000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. రూ. 8990 విలువైన సోనీ సీ510 ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ. 3990కే సొంతం చేసుకోవచ్చు. గృహోపకరణాల కొనుగోలుపై కూడా తగ్గింపును పొందవచ్చు.ట్రెండ్స్ బ్లాక్ ఫ్రైడే సేల్బ్లాక్ ఫ్రైడే సేల్లో కస్టమర్లకు మరింత ఉత్సాహాన్ని అందించడానికి.. ట్రెండ్స్ కూడా ప్రత్యేక చొరవను అమలు చేస్తోంది. ఇక్కడ 3,499 రూపాయలకు షాపింగ్ చేస్తే.. రూ.2,000 విలువైన ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు. ట్రెండ్స్ స్టోర్లు.. భారతదేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ వంటి వాటితో పాటు ఇతర ఫ్యాషన్ యాక్ససరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కస్టమర్లు బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో తగ్గింపు ధరలతో మంచి షాపింగ్ అనుభూతిని పొందవచ్చు. -
ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి: ఇది లాభామా? నష్టమా?
ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి (Buy Now Pay Later).. ఈ విధానం కేవలం ఈ కామర్స్ వెబ్సైట్లలో మాత్రమే కాకుండా, కొన్ని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు కూడా అవలంబించాయి. ఈ విధానం ద్వారా ఏదైనా కొనుగోలు చేసే వ్యక్తి.. ముందుగా వస్తువును కొనుగోలు చేస్తాడు. ఆ తరువాత ఇన్స్టాల్మెంట్ రూపంలో చెలించాలి. ఇంతకీ దీనివల్ల వినియోగదారునికి ఏమైనా లాభం ఉందా? లేక్ నష్టం ఉందా? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..ఏదైనా అత్యవసరమైన వస్తువులను.. చేతిలో డబ్బు లేని సమయంలో కొనుగోలు చేయాలంటే 'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి' అనేది ఉపయోగకరమైన విధానమే. అయితే వస్తువును కొనే ముందే ఎన్ని రోజుల్లో పే చేయాలి? సమయానికి చెల్లించకపోతే వచ్చే నష్టాలు ఏంటి? అనేవన్నీ కూడా తప్పకుండా తెలుసుకోవాలి.మీరు సకాలంలో డబ్బు చెల్లిస్తే.. ఎటువంటి నష్టాన్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ డబ్బు చెల్లించడంలో ఆలస్యం అయితే మాత్రం.. లేట్ పేమెంట్ ఫీజు, సర్వీస్ ఛార్జెస్ వంటివి ఎన్నో విధిస్తారు. కాబట్టి వీటన్నింటిని ముందుగానే తెలుసుకోవాలి.కొన్ని ఈ కామర్స్ కంపెనీలు అద్భుతమైన ఆఫర్స్.. డిస్కౌంట్స్ పేరుతో కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. చేతిలో డబ్బు లేకపోయినా ఇప్పుడు కోనేయండి.. మళ్ళీ చెల్లించండి అంటూ ఊరిస్తుంటాయి. ఈ మాయలో పడ్డారంటే.. సమయానికి డబ్బు చెల్లించకపోత.. మీ చెబుకు చిల్లు పడ్డట్టే.ఇదీ చదవండి: జియో, ఎయిర్టెల్ కథ కంచికేనా?.. వచ్చేస్తోంది స్టార్లింక్మీరు ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి విధానంలో వస్తువులను కొనుగోలు చేయాలంటే మీకు సిబిల్ స్కోర్ వంటివి ఉండాల్సిన అవసరం లేదు. అయితే మీరు సకాలంలో డబ్బు చెల్లించకపోతే.. ఈ విషయాన్ని క్రెడిట్ బ్యూరోకు తెలియజేస్తుంది. ఆ తరువాత మీకు భవిష్యత్తులో లోన్ వచ్చే అవకాశం లేదు.ఆర్ధిక పరమైన విషయాల్లో తప్పకుండా క్రమశిక్షణ ఉండాలి. సకాలంలో తప్పకుండా నేను చెల్లించగలను అనే నమ్మకం మీకున్నప్పుడు, కొనుగోలు చేసే వస్తువు అత్యవసరమైనప్పుడు ''ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి'' ఎంచుకోవచ్చు. అయితే అప్పటికే ప్రతి నెలా ఏదైనా లోన్స్ వంటివి చెల్లిస్తుంటే.. ఈ సర్వీస్ ఉపయోగించుకోకపోవడం చాలా ఉత్తమం. -
జపనీస్ బైక్ కొనుగోలుపై రూ.1.14 లక్షల డిస్కౌంట్
జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి భారతీయ విఫణిలోని తన నింజా 'జెడ్ఎక్స్ 10ఆర్' బైక్ ధరను రూ. 1.14 లక్షలు తగ్గించింది. దీంతో ఈ బైక్ ధర 17.34 లక్షలకు చేరింది.కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ 2025 ఎడిషన్ ప్రారంభ ధర సెప్టెంబర్లో రూ. 17.13 లక్షలు. మార్కెట్లో అడుగుపెట్టిన తరువాత.. ఈ బైక్ ధర కొద్దిసేపటికే రూ.18.50 లక్షలకు చేరింది. అయితే ప్రస్తుతం ఇయర్ ఎండ్ సమయంలో మంచి అమ్మకాలను పొందాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ భారీ డిస్కౌంట్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది.నింజా జెడ్ఎక్స్-10ఆర్ బైక్ 998 సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఇది 13200 rpm వద్ద 203 hp పవర్, 11400 rpm వద్ద 114.9 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్.. బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ వంటివి పొందుతుంది.ఇదీ చదవండి: తెలంగాణలో బీజం.. ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశంబ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT కన్సోల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, క్రూయిజ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అనేక లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్.. ఇప్పుడు రూ. 1.14 లక్షల తగ్గుదలతో లభిస్తోంది. -
విద్యార్థులకు ఇండిగో స్పెషల్ ఆఫర్..
దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ 'ఇండిగో' విద్యార్థుల కోసం 'స్టూడెంట్ స్పెషల్' అనే ప్రత్యేకమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఇండిగో కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో విద్యార్థులకు ప్రత్యేక ఛార్జీలు, అదనపు ప్రయోజనాలు లభించనున్నట్లు ప్రకటించింది.విమాన టికెట్ మీద 6 శాతం రాయితీ కల్పించడం మాత్రమే కాకుండా.. 10 కేజీల వరకు అదనపు లగేజ్ తీసుకెళ్లడానికి ఇండిగో అనుమతించింది. విద్యార్థులు కోసం తీసుకొచ్చిన ఈ స్పెషల్ ఆఫర్ ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు అందుబాటులో ఉంటుందో.. స్పష్టంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: తెలంగాణలో బీజం.. ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశంఇండిగో ప్రకటించిన ఈ స్పెషల్ ఆఫర్ కేవలం హైదరాబాద్లో మాత్రమే కాకుండా గోవా, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మొత్తం 80 రూట్లలో నడిచే విమాన సర్వీసుల్లో అందుబాటులో ఉంటుంది. 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న విద్యార్థులు తమ స్కూల్ లేదా యూనివర్సిటీకి సంబంధించిన ఐడీ కార్డును కలిగి ఉండాలి. ఐడీ కార్డు కలిగిన వారు మాత్రమే ఈ ఆఫర్ ఉపయోగించుకోవడానికి అర్హులు. -
రెండు గంటల్లో డెలివెరీ!.. సిద్దమవుతున్న మింత్రా
లైఫ్స్టైల్ ఈ కామర్స్ దిగ్గజం మింత్రా క్విక్కామర్స్లోకి అడుగుపెట్టడానికి యోచిస్తోంది. కేవలం రెండు గంటల్లో డెలివరీ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బెంగుళూరులోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సర్వీస్ అందించడానికి ప్రయోగాలను చేస్తోంది.మింత్రా తన కస్టమర్లకు వేగంగా డెలివరీ చేయడానికి కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే.. ఎంపిక చేసిన ఉత్పత్తులను డెలివరీ చేయనుంది. దీనికోసం పైలట్ ప్రాజెక్ట్, 'M-Now' బెంగళూరులో కొన్ని పిన్ కోడ్లలో పనిచేస్తోంది. ఇది ఎలా పని చేస్తుందో చూడటానికి ప్రయోగాత్మకంగా సేవలు అందిస్తోంది.నిజానికి 2022లోనే మింత్రా బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఎం ఎక్స్ప్రెస్ అనే డెలివరీ సర్వీస్ ప్రారంభించింది. ఈ సర్వీస్ ఉద్దేశ్యం ఏమిటంటే.. ఆర్డర్ పెట్టిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే ఉత్పత్తులను డెలివరీ చేయడం. ఇప్పుడు రెండు గంటల్లో డెలివరీ చేయడానికి సంకల్పించింది. -
పెరగనున్న బీఎండబ్ల్యూ ధరలు: ఎప్పటి నుంచో తెలుసా?
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బీఎండబ్ల్యూ' (BMW) 2025 జనవరి 1నుంచి కార్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుంది అనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.భారతదేశంలోని బీఎండబ్ల్యూ చెన్నై సదుపాయంతో 10 మోడళ్లను అసెంబుల్ చేసింది. ఇందులో ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7, ఎం340ఐ, 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్ లాంగ్ వీల్బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్బేస్, 7 సిరీస్ మొదలైనవి ఉన్నాయి. ఇక సీబీయూ మార్గం ద్వారా ఐ4, ఐ5, ఐ7, ఐ7 ఎం70, ఐఎక్స్1, ఐఎక్స్ వంటి ఎలక్ట్రిక్ కార్లు దిగుమతి అవుతాయి.ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ తన ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ కంపెనీ కూడా జనవరి 1 నుంచి తన వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బెంజ్ ధరల పెరుగుదలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న తరువాత, బీఎండబ్ల్యూ కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. కాబట్టి బీఎండబ్ల్యూ కార్ల ధరలు వచ్చే ఏడాది ప్రారంభం నుంచే పెరగనున్నాయి. -
గోవాలో 'సారా అలీ ఖాన్' వెల్నెస్ అండ్ యోగా రిట్రీట్
ఫిట్నెస్, ట్రావెలింగ్ పట్ల అమితాసక్తి చూపించే ప్రముఖ నటి.. 'సారా అలీ ఖాన్' మొదటి సారి గోవాలోని ఎయిర్బీఎన్బీలో స్పెషల్ వెల్నెస్ అండ్ యోగా రిట్రీట్ను నిర్వహించనున్నారు. దీనికోసం సూర్యరశ్మి, పచ్చటి ప్రకృతి మధ్య ఒక సెటప్ సెట్ చేసుకున్నారు.సినిమా రంగంలో ఫిట్నెస్ పట్ల అమితమైన అభిరుచి కలిగిన సారా అలీ ఖాన్.. ఇప్పుడు ఆరోగ్యం, యోగా పట్ల తనకున్న అభిరుచిని వెల్లడిస్తుంది. అద్భుతమైన ప్రదేశంలో పచ్చని ప్రకృతి మధ్య సారాతో నలుగురు వ్యక్తులు యోగా చేసే అవకాశం పొందవచ్చు.ఇక్కడ సారా వ్యక్తిగత వెల్నెస్ ఆచారాలు, ఇతర ఆరోగ్య రహస్యాలను గురించి కూడా తెలుసుకోవచ్చు. గోవాలో ఈ వెల్నెస్ మరియు యోగా రిట్రీట్ కోసం బుకింగ్లు నవంబర్ 27న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి.గోవాలో ఎయిర్బిఎన్బిలో మాత్రమే జరిగే ఈ ప్రత్యేక వెల్నెస్ అండ్ యోగా రిట్రీట్కు అతిథులను స్వాగతించడానికి నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఇక్కడ ప్రకృతి అందాల నడుమ.. మనస్సు, శరీరం, ఆత్మను పోషించడంపై దృష్టి పెట్టవచ్చు. జీవితంలో మరచిపోలేని సాధారణ ఆనందాలను స్వీకరించడానికి ఇది ఒక మంచి అవకాశం అని సారా అలీ ఖాన్ అన్నారు. View this post on Instagram A post shared by Viralbollywood (@viralbollywood) -
స్మార్ట్ఫోన్ కంపెనీ కారు.. లక్ష మంది కొనేశారు
చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ 'షియోమీ' (Xioami) గత ఏడాది ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే కంపెనీ డిసెంబర్ 2024లో ఎస్యూ7 (SU7) పేరుతో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. షియోమీ లాంచ్ చేసిన ఈ కారును ఇప్పటికి లక్ష మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..షియోమీ ఎస్యూ7 మార్కెట్లో అడుగు పెట్టి ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు, అప్పుడే లక్ష యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది అంటే.. చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఎస్యూ7 కారు లక్ష యూనిట్ల సేల్స్ పొందిన విషయాన్ని కంపెనీ ఫౌండర్ & సీఈఓ 'లీ జున్' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో కూడా షేర్ చేశారు. ఈ ఏడాది చివరి నాటికి షియోమీ ఎస్యూ7 మొత్తం 1.30 లక్షల సేల్స్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు.షియోమీ ఎస్యూ7షియోమీ ఎస్యూ7 ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్, ప్రో, మ్యాక్స్ అనే మూడు వెర్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.25.18 లక్షలు, రూ. 28.67 లక్షలు, రూ. 34.97 లక్షలు. ఇవి మూడు చూడటానికి చాలా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువమంది వీటిని ఇష్టపడి కొనుగోలు చేశారు. కంపెనీ కూడా తన కస్టమర్లకు డెలివరీలను వేగంగా చేయడానికి.. ఉత్పత్తిని కూడా వేగవంతం చేసింది.ఇదీ చదవండి: ఆఫ్రికన్ దేశాలకు ఇండియన్ బైకులు: ప్యూర్ ఈవీ ప్లాన్ ఇదే..ఆరు కలర్ ఆప్షన్లలో లభించే షియోమీ ఎస్యూ7 ఎలక్ట్రిక్ కారు 5.28 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ/గం కాగా.. ఇది 400 న్యూటన్ మీటర్ టార్క్, 299 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 73.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జీతో గరిష్టంగా 800కిమీ రేంజ్ అందిస్తుంది.The 100,000th Xiaomi SU7 has found its owner! She chose Radiant Purple and shared, "I’ve always been a Xiaomi Fan and picked the Pro for its smart driving and range." pic.twitter.com/c8G8GrVzwO— Lei Jun (@leijun) November 18, 2024 -
అమ్మకానికి గూగుల్ క్రోమ్?.. త్వరలో తీర్పు
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ).. గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ బ్రౌజర్ను విక్రయించేలా దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్పై ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బ్లూమ్బెర్గ్ వెల్లడిస్తూ.. గూగుల్ సెర్చింజన్ మార్కెట్పై చట్ట విరుద్ధంగా ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తోందని ఆగస్టులో ఒక న్యాయమూర్తి రూలింగ్ కూడా ఇచ్చారు. అదే జడ్జి ముందు డీఓజే ఈ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ఏఐ, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించిన చర్యలు తీసుకోవాలి ఇందులో పేర్కొన్నట్లు సమాచారం.గూగుల్ క్రోమ్ను విక్రయించమని.. గూగిల్ ప్లే నుంచి ఆండ్రాయిడ్ను వేరు చేయమని అడగడంతో పాటు, ప్రకటనదారులతో మరింత డేటా.. సమాచారాన్ని భాగస్వామ్యం చేయమని న్యాయమూర్తి గూగుల్ను అడగవచ్చు. అయితే దీనిపైన డీఓజే వ్యాఖ్యానించలేదు.గూగుల్ రెగ్యులేటరీ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ లీ అన్నే ముల్హోలాండ్ స్పందిస్తూ.. డీఓజే ఒక ర్యాడికల్ అజెండాను ముందుకు తెస్తోందని అన్నారు. ఇది వినియోగదారులకు నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.ఈ విషయం మీద న్యాయమూర్తి చివరికి ఏమి తీర్పు ఇస్తారో చూడాల్సి ఉంది. గూగుల్ గుత్తాధిపత్యం నిజమే అని పరిగణలోకి తీర్పు ఇస్తే.. గూగుల్ తప్పకుండా క్రోమ్ను వదులుకోవాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు. యూఎస్ ఎన్నికల ప్రచార సమయం గూగుల్ ఏక పక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.ఇదీ చదవండి: 30 నిమిషాల్లో.. ఢిల్లీ నుంచి అమెరికాకు: సాధ్యమే అంటున్న మస్క్గూగుల్ కేసుకు సంబంధించిన తీర్పును అమెరికన్ కోర్టు వచ్చే ఏడాది ఇచ్చే అవకాశం ఉంది. అంతకంటే ముందే కంపెనీ.. క్రోమ్ను విక్రయించకుండా ఉండటానికి కావలసిన ఏర్పాట్లను చేసుకునే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి గూగుల్ క్రోమ్ ఈ సమస్య నుంచి బయటపడుతుందా? లేదా? అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 189.28 పాయింట్లు లేదా 0.24 శాతం లాభంతో 77,528.29 వద్ద, నిఫ్టీ 46.45 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో 23,500.25 పాయింట్ల వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ట్రెంట్, ఐచర్ మోటార్స్ వంటి కంపెనీలు చేరాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, హిందాల్కో, రిలయన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎస్బీఐలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆఫ్రికన్ దేశాలకు ఇండియన్ బైకులు: ప్యూర్ ఈవీ ప్లాన్ ఇదే..
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ''ప్యూర్ ఈవీ'' (Pure EV).. క్లారియన్ ఇన్వెస్ట్మెంట్ ఎల్ఎల్సీ అనుబంధ సంస్థ 'అర్వా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎల్ఎల్సీ'తో చేతులు కలిపింది. ఈ సహకారంతో కంపెనీ తన పరిధిని విస్తరిస్తూ.. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ ప్రాంతాల వినియోగదారులకు చెరువవుతుంది.ప్యూర్ ఈవీ, అర్వా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎల్ఎల్సీ సహకారంతో.. ద్విచక్ర వాహనాల పంపిణీ, విక్రయాలను చేపట్టడం వంటివి చేస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ మొదటి బ్యాచ్లో 50,000 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేయనుంది. ఆ తరువాత నుంచి సంవత్సరానికి 60,000 యూనిట్లను ఎగుమతి చేయనున్నట్లు సమాచారం.ప్యూర్ ఈవీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'నిశాంత్ డొంగరి' (Nishanth Dongari) మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం కేవలం అమ్మకాలను మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ మోటార్సైకిళ్లకు డిమాండ్ ఉన్న ప్రాంతాలకు చేరువవ్వడం కూడా. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ దేశాల్లో ప్యూర్ ఈవీ బ్రాండ్ వాహనాలను పరిచయం చేస్తూ.. గ్లోబల్ మార్కెట్లో కూడా మా ఉనికిని చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.ఇదీ చదవండి: పండుగ సీజన్: ఎంతమంది వెహికల్స్ కొన్నారో తెలుసా?ప్యూర్ ఈవీ ఎగుమతి చేయనున్న ఎలక్ట్రిక్ బైకులలో 'ఎకోడ్రిఫ్ట్' (ecoDryft), 'ఈట్రిస్ట్ ఎక్స్' (eTryst X) ఉంటాయి. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 1,19,999 (ఎక్స్ షోరూమ్), రూ. 1,49,999 (ఎక్స్ షోరూమ్). ఎకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఒక ఫుల్ ఛార్జీతో 151 కిమీ రేంజ్ అందిస్తే.. ఈట్రిస్ట్ ఎక్స్ 171 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఈ రెండు బైకులు ఉత్తమంగానే ఉంటాయి. -
నిఫ్టీకి ఏడోరోజూ నష్టాలే..
ముంబై: ఐటీ, ఆయిల్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో నిఫ్టీ ఏడోరోజూ నష్టాలు చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్పై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు నష్టపోయి 77,339 వద్ద స్థిరపడింది. ఈ సూచీకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు. నిఫ్టీ 79 పాయింట్లు కోల్పోయి 23,454 వద్ద నిలిచింది. ప్రథమార్థంలో సెన్సెక్స్ 615 పాయింట్లు క్షీణించి 76,965 వద్ద, నిఫ్టీ 209 పాయింట్లు కోల్పోయి 23,350 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి.అయితే మిడ్సెషన్ నుంచి మెటల్, రియలీ్ట, ఆటో, సరీ్వసెస్, కన్జూమర్ బ్యాంకులు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంతమేర భర్తీ అయ్యాయి. రంగాలవారీగా.., ఐటీ ఇండెక్స్ 2.50%, ఆయిల్అండ్గ్యాస్ 2%, ఫార్మా, మీడియా సూచీలు 1% చొప్పున పతనమయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నందున తక్షణ వడ్డీరేట్ల తగ్గింపు ఇప్పట్లో అవసరం లేదంటూ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ⇒ డిసెంబర్లో ఫెడ్ రేట్ల కోత ఉండకపోవచ్చనే సంకేతాలతో టీసీఎస్, ఎంఫసీస్, ఎల్టీఐఎం షేర్లు 3% క్షీణించగా.. ఇన్ఫీ 2.50% విప్రో 2% పడ్డాయి. ⇒ డిసెంబర్ నుంచి చైనా కమోడిటీలకు సంబంధించి ఎగుమ తులపై పన్ను రాయి తీలను తగ్గించడం లేదా రద్దు చేయాలనే ప్రతిపాదనలతో మెటల్ షేర్లు మెరిశాయి. నాల్కో 9 శాతం, హిందాల్కో 4%, వేదాంత 3%, టాటా స్టీల్ 2%, ఎన్ఎండీసీ 1.50%, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒకశాతం లాభపడ్డాయి. ⇒ ప్రభుత్వం నేచరల్ గ్యాస్ సరఫరాను నెలలో రెండోసారి తగ్గించడంతో గ్యాస్ పంపిణీ సంస్థల షేర్లు పతనమయ్యాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ 20% క్షీణించి రూ.325 వద్ద, మహానగర్ గ్యాస్ 14% పడి రూ.1,131 వద్ద ముగిశాయి. -
భారత్లో 6 లక్షల మంది కొన్న కారు ఇదే..
అత్యంత ప్రజాదరణ పొందిన 'హ్యుందాయ్ వెన్యూ' కారును దేశీయ విఫణిలో ఆరు లక్షల మంది కొనుగోలు చేశారు. 2019లో ప్రారంభమైన ఈ ఎస్యూవీ ఐదున్నర సంవత్సరాల్లో ఈ మైలురాయిని చేరుకుంది. అత్యధికంగా 2024 ఆర్ధిక సంవత్సరంలో 1,28,897 యూనిట్లు అమ్ముడయ్యాయి.హ్యుందాయ్ వెన్యూ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత.. మొదటి ఆరు నెలల్లో 50,000 యూనిట్ల మైలురాయిని చేరుకుంది. ఆ తరువాత 15 నెలల్లో లక్ష యూనిట్లు, 25 నెలల్లో రెండు లక్షల యూనిట్లు, 36 నెలల్లో మూడు లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2023 నవంబర్ నాటికి వెన్యూ సేల్స్ ఐదు లక్షల యూనిట్లు కావడం గమనార్హం. ఆ తరువాత లక్ష యూనిట్లు అమ్ముడు కావడానికి 12 నెలల సమయం పట్టింది.ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..హ్యుందాయ్ వెన్యూ మొత్తం 26 వేరియంట్లు, 3 ఇంజన్లు, 3 గేర్బాక్స్ ఎంపికలలో లభిస్తుంది. దీని ధరలు రూ. 7.94 లక్షల నుంచి రూ. 13.44 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. కాగా కంపెనీ 2025 వెన్యూ కారును వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. రాబోయే 2025 వెన్యూ మోడల్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. -
డబ్ల్యూఈఎఫ్లో చేరిన 'ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్'
ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఈఎఫ్)కు చెందిన ''ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇనిషియేటివ్''లో చేరింది. CO2e ఉద్గారాలను తగ్గించడం, ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పించడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని ఏఎం గ్రీన్ డబ్ల్యూఈఎఫ్లో చేరింది.మూడు బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడితో.. సుమారు 10,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించడానికి ఏఎం గ్రీన్ సన్నద్ధమైంది. దీని ద్వారా స్థానికి, జాతీయ ఆర్థిక వ్యవస్థలను పెంచడమే కాకుండా.. నిర్మాణం, పరికరాల తయారీ, గృహ నిర్మాణం వంటి పరిశ్రమలకు మద్దతు ఇస్తుంది.ఏఎం గ్రీన్ ఛైర్మన్ 'అనిల్ చలమలశెట్టి' ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా మేము అవిశ్రాంతంగా పని చేస్తున్నాము. ఇప్పుడు ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇనిషియేటివ్లో చేరే అవకాశం లభించింది. డబ్ల్యుఈఎఫ్ చొరవతో పాలుపంచుకోవడానికి.. క్లస్టర్ ట్రాన్సిషన్ లక్ష్యాలను నెరవేర్చడానికి ఎదురుచూస్తున్నామని అన్నారు.ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇనిషియేటివ్లో సభ్యునిగా.. ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్ డీకార్బనైజేషన్ క్లస్టర్లపై ప్రపంచవ్యాప్త పనికి మద్దతు ఇవ్వడం.. ఫోరమ్తో అభివృద్ధి పనులను పంచుకోవడం వంటి వాటితో పాటు ఇతర ఫోరమ్ క్లస్టర్ల నుంచి ఉత్తమ అభ్యాసాలను పొందడం లక్ష్యంగా పెట్టుకుందని చలమల శెట్టి పేర్కొన్నారు.25 పారిశ్రామిక సమూహాలతో కూడిన మా గ్లోబల్ నెట్వర్క్కు.. ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్ను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక వనరులతో.. కాకినాడ క్లస్టర్ గ్రీన్ అమ్మోనియా & హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రాంతీయంగా అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కమ్యూనిటీలో భాగంగా, ఏఎం గ్రీన్ కాకినాడకు అంతర్దృష్టులను పంచుకోవడానికి.. పారిశ్రామిక డీకార్బనైజేషన్లో సామూహిక పురోగతికి దోహదపడే అవకాశం ఉంది, అని సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ హెడ్ & ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు 'రాబర్టో బొక్కా' అన్నారు. -
పండుగ సీజన్: ఎంతమంది వెహికల్స్ కొన్నారో తెలుసా?
భారతదేశంలో మొత్తం పండుగ సీజన్లో 42 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, త్రీ వీలర్స్ అన్నీ ఉన్నాయి. 2023 ఇదే పండుగ సీజన్లో అమ్ముడైన మొత్తం వాహనాలు 38.37 లక్షల యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో వాహన విక్రయాలు పెరిగినట్లు తెలుస్తోంది.ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) 2024 పండుగ సీజన్లో 45 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడవుతాయని అంచనా వేసింది. అయితే ఊహించిన అమ్మకాలు జరగలేదు, కానీ 2023 కంటే 2024లో సేల్స్ ఉత్తమంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది.2023లో ద్విచక్ర వాహనాల సేల్స్ 29.10 లక్షల యూనిట్లు కాగా.. 2024లో 33.11 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే ఈ ఏడాది అమ్మకాలు 13.8 శాతం వృద్ధి చెందాయి. త్రీ వీలర్స్ సెల్స్ 2023లో 1.50 లక్షల యూనిట్లు.. 2024లో 6.8 శాతం పెరిగి 1.60 లక్షల యూనిట్లకు చేరింది.ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..కమర్షియల్ వాహన విక్రయాలు 2023లో 1.27 లక్షల యూనిట్లు.. కాగా 2024లో 1.29 లక్షల యూనిట్లు. ఈ విభాగంలో అమ్మకాలు 1 శాతం పెరిగింది. ప్యాసింజర్ వాహన సేల్స్ 2023లో 5.63 లక్షల యూనిట్లు, 2024లో 6.03 లక్షల యూనిట్లు. ఇలా మొత్తం మీద 2024లో మొత్తం వాహనాల సేల్స్ 42 లక్షల యూనిట్లను అధిగమించింది. -
అడుగు పెడితే ఫస్టో.. సెకెండో.. అంతే!
న్యూఢిల్లీ: ‘చేస్తున్న, ప్రవేశించే ప్రతి వ్యాపారంలో మొదటి లేదా రెండవ స్థానంలో ఉండాలనుకుంటున్నాం. కాబట్టి సామర్థ్యం పెంపు ఏకైక మార్గం. అలా కాని పక్షంలో ఈ రోజు మనుగడ సాగించడం చాలా కష్టమని నేను భావిస్తున్నాను. లేదంటే అధిక మార్జిన్లను అందించే చాలా ప్రత్యేక, ఉన్నత సాంకేతికత ఉండాలి’ అని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కేఎం బిర్లా అన్నారు.ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఆదిత్య బిర్లా గ్రూప్ దాదాపు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు చేసింది. ప్రధానంగా తయారీ రంగంలో పెట్టుబడి పెట్టాం. కంపెనీ నిర్వహించే అన్ని విభాగాలలో మొదటి రెండు స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా చేసుకున్నాం. గ్రూప్ పెట్టుబడులు చాలా వరకు రాబోయే 15–20 ఏళ్లలో వ్యాపార దృక్పథం దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలికంగా ఉంటాయి. విలువలు, వ్యక్తులు, సామర్థ్యం పెంపు, దీర్ఘకాలిక లక్ష్యంతో వ్యాపారాల నిర్వహణ అనేది సంస్థ వ్యాపార విధానాన్ని నిర్వచించే కీలక వ్యూహాలు’ అని వెల్లడించారు.కఠినమైన నిర్ణయాలు..గ్రూప్ సంస్థ హిందాల్కో ద్వారా నోవెలిస్ను కొనుగోలు చేయడంతో సహా అనేక కఠినమైన నిర్ణయాలను తీసుకున్నామని బిర్లా తెలిపారు. నోవెలిస్ను దక్కించుకోవడానికి 6 బిలియన్ డాలర్లు వెచ్చించినట్టు చెప్పారు. ‘నేను ఒక కంపెనీని (నోవెలిస్) కొనుగోలు చేశాను. అది చాలా పెద్దది. షేరు దెబ్బతింది. ముఖ్యమైనది కాదని పెట్టుబడిదారులు స్పష్టం చేశారు. తిరిగి పుంజుకోవడానికి దాదాపు ఏడాది పట్టింది. ఆ నిర్ణయం తీసుకున్న ఏ ప్రొఫెషనల్ సీఈవో అయినా తొలగించబడతారు. ఎందుకంటే ఆ సమయంలో అది తప్పుగా అనిపించింది’ అని అన్నారు.దీర్ఘకాలానికి వ్యాపారాలు నిర్వహించడం అనేది మనలో ఒక సంస్కృతి అని వివరించారు. కంపెనీ 36 ఏళ్లలో 100 మిలియన్ టన్నుల సిమెంట్ సామర్థ్యాన్ని నిర్మించింది. వచ్చే 5 ఏళ్లలో దీనిని 150 మిలియన్ టన్నులకు, 10 ఏళ్లలో 200 మిలియన్ టన్నులకు పెంచుతామని ఆయన తెలిపారు. -
పాకిస్తాన్ చాయ్వాలాకు భారీ ఫండింగ్: ఏకంగా..
పాకిస్తాన్ చాయ్వాలా 'అర్షద్ ఖాన్' షార్క్ ట్యాంక్ పాకిస్తాన్ తాజా ఎపిసోడ్లో తన కేఫ్ బ్రాండ్ చాయ్వాలా & కో కోసం కోటి రూపాయలు (పాకిస్తాన్ కరెన్సీ) పెట్టుబడిన పొందాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.చాలా సంవత్సరాలు కేఫ్ నడుపుతూ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్న.. అర్షద్ ఖాన్ ఇటీవల షార్క్ ట్యాంక్ పాకిస్తాన్ ఎపిసోడ్లో పాల్గొని, అక్కడి వ్యాపారవేత్తలను తన వ్యాపారం గురించి వివరిస్తూ ఎంతగానో ఆకట్టుకున్నాడు. దీంతో వారు ఈ భారీ పెట్టుబడిన ఆఫర్ చేశారు. దీంతో అర్షద్.. చాయ్వాలా & కో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి సిద్దమవుతున్నాడు.వ్యాపార వేత్తల నుంచి కోటి రూపాయల ఆఫర్ అందుకున్న తరువాత.. ఈ విషయాన్ని అర్షద్ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా తనకు మద్దతు తెలిపిన అందరికీ కూడా అతడు ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఒప్పందం తన జీవితంలోనే కీలక మైలురాయి అని పేర్కొన్నాడు.అర్షద్ ఖాన్ చాయ్ కేఫ్ ఇస్లామాబాద్లో ప్రారంభమైంది. ఇదే ఇప్పుడు అక్కడ బాగా ఫేమస్ అయింది. ఇక్కడ కేవలం చాయ్ మాత్రమే కాకుండా.. స్నాక్స్, బర్గర్స్, పాస్తా, శాండ్విచ్ వంటివి కూడా లభిస్తున్నాయి. ఇప్పుడు షార్క్ ట్యాంక్ ఫండింగ్ గెలుచుకున్న అర్షద్ తన వ్యాపారాన్ని పెంచడానికి సన్నద్ధమవుతున్నారు. View this post on Instagram A post shared by Arshad Khan (@arshadchaiwala1)