Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Flipkart Launches AI Powered Exchange Program1
ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఎక్స్చేంజ్‌ ప్రోగ్రామ్‌

దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, లార్జ్ అప్లయన్సెస్‌తో సహా 26 ఉత్పత్తి విభాగాలలో ఒక వినూత్న ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. వినియోగదారులకు తక్షణ విలువ, మెరుగైన అప్‌గ్రేడ్లను అందించడానికి దీన్ని రూపొందించారు. ఇందుకోసం సరికొత్త ఏఐ-ఆధారిత 10-దశల డయాగ్నొస్టిక్ టూల్ ఏర్పాటు చేస్తోంది. ఇది రియల్‌ టైమ్‌ , పారదర్శక ఉత్పత్తి విలువలను నిమిషాల్లో అందిస్తుంది.ప్రోగ్రామ్‌ ముఖ్యాంశాలుక్రాస్-కేటగిరీ ఎక్స్ఛేంజ్: కస్టమర్లు పాత ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లు వంటి వస్తువులను విస్తృత శ్రేణి కొత్త ఉత్పత్తుల కోసం ఎక్స్ఛేంజ్‌ చేయవచ్చు.రియల్ టైమ్ ఏఐ డయాగ్నస్టిక్స్: పాత ఉత్పత్తుల వేగవంతమైన, ఖచ్చితమైన, పారదర్శక విలువను నిర్ధారిస్తుంది.స్థిరమైన వాణిజ్యం: పనికిరాని గృహ ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల పునర్వినియోగం, రీసైక్లింగ్ ను ప్రోత్సహిస్తుంది. వాటిని "ఇంట్లో కరెన్సీ"గా మారుస్తుంది.టైర్ 2 & 3 సిటీ ఫోకస్: ప్రీమియం ఉత్పత్తులకు అందుబాటును పెంచడం, చిన్న పట్టణాల్లోనూ ప్రీమియం ఉత్పత్తులు కొనే వెసులుబాటు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.పండుగ సీజన్ బూస్ట్: రాబోయే షాపింగ్ సీజన్లో కస్టమర్ విలువను పెంచడానికి సమయం.స్థిరమైన వినియోగాన్ని పెంచే తెలివైన, సాంకేతికతతో కూడిన రీకామర్స్ వ్యవస్థను నిర్మించడానికి ఫ్లిప్‌కార్ట్ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని ఆ సంస్థ సీనియర్ డైరెక్టర్ & రీ-కామర్స్ బిజినెస్ హెడ్ అశుతోష్ సింగ్ చందేల్ పేర్కొన్నారు.

new changes to office work space2
అధునాతన మార్పులతో ఆఫీస్‌లకు నయాలుక్‌

ఎప్పటికప్పుడు మారుతున్న అధునాతన జీవనశైలికి అనుగుణంగా భాగ్యనగరం తన వైవిధ్యాన్ని మార్చుకుంటోంది. సహజత్వం మొదలు సాంకేతికత వరకు నిత్య జీవనశైలిలో తన గుర్తింపును సుస్థిరపరుచుకుంటోంది. ప్రధానంగా ఆధునిక కార్యాలయాలు, ఉత్పాదకత, శ్రేయస్సుకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, కార్పొరేట్‌ కార్యాలయాలన్నీ నయాలుక్‌ సంతరించుకుంటున్నాయి. ఆఫీస్‌ అందంగా, అత్యాధునికంగా ఉండాలనే స్థాయి నుంచి ఉద్యోగుల పని సామర్థ్యం పెంచగలిగేలా ఆఫీస్‌ స్పేస్‌ డిజైన్‌ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోపాతకాలపు క్యాబిన్‌ డెస్క్‌లు, క్లోస్డ్‌ క్యాబిన్‌ స్పేస్‌లు తీసేసి వాటి స్థానంలో ఉద్యోగుల శ్రేయస్సు, సృజనాత్మకత, జట్టు సహకారం పెరిగే విధంగా డిజైన్‌ చేయబడిన క్రియేటివ్‌ స్పేస్‌లు వచ్చాయి. 2025లో మనం చూస్తున్న కార్యాలయాలు ఒకవైపు అధునాతన సౌకర్యాలతో పాటు మరోవైపు ప్రకృతి, సహజత్వాన్ని సమ్మేళనంగా అందిస్తున్నాయి. ఈ కల్చర్‌ భవిష్యత్‌ వర్క్‌ కల్చర్‌ను సరికొత్త దారిలోకి తీసుకెళ్లనుంది.ఓపెన్‌ ఫ్లోర్‌ లేఔట్‌.. ఆఫీస్‌ లోపల గోడలు లేకుండా ఓపెన్‌గా ఉన్న సీటింగ్, క్యాబిన్లు ఉద్యోగుల మధ్య సంభాషణలు పెంచుతాయి. అడ్డంకులు లేకపోవడంతో అవసరమైన చర్చలు, ఆలోచనలు పంచుకోవడం, సాంకేతిక సమస్యలపై కలిసి పనిచేయడం మంచి ఫలితాలను అందిస్తోందని సరికొత్త కార్యాలయాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి వాతావరణం టీమ్‌ స్పిరిట్‌ను పెంచుతోంది.ఫర్నీచర్‌ సౌకర్యవంతంగా.. ఈ తరం గ్లోబల్‌ ట్రెండ్‌లో ఆఫీస్‌లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. వీటికి అనువైన ఫర్నీచర్‌ కూడా సౌకర్యవంతంగా ఉండాలి. ఎత్తు మార్చుకునే డెస్క్‌లు, మడతపెట్టే టేబుల్స్, ఎక్కడికైనా మార్చుకోగలిగే కురీ్చలు.. పైగా ఇవి సరికొత్త డిజైనింగ్‌తో ఆకర్షణీయంగా ఉండటంతో పాటు స్టోరేజ్‌ సదుపాయంతో ఉండే డెస్క్‌లు వంటి వినూత్న మార్పులు వస్తున్నాయి. ఇందులో భాగంగా వైట్‌ బోర్డ్‌లు, డిజిటల్‌ స్క్రీన్లు, మాడ్యులర్‌ ఫరి్నచర్‌తో మోడ్రన్‌ ఇంటీరియర్‌ స్పేస్‌ ఏర్పాటు చేస్తారు. ఇలా విభిన్న అవసరాలకు అనువైన ప్రదేశాలు ఉండటంతో ఉద్యోగులందరికీ సౌకర్యంగా ఉంటుంది.సహజమైన కాంతి వచ్చేలా.. ప్రకృతి, సహజత్వం మన ఆరోగ్యం, మనసుకు హాయి, ఆహ్లాదం అందిస్తుంది. అందుకే ఇప్పుడు కార్యాలయాల్లో కూడా బయోఫిలిక్‌ డిజైన్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇందులో ముఖ్యంగా ఇండోర్‌ ప్లాంట్స్, వాటర్‌ ఫౌంటెయిన్లు, ఉడ్‌ డిజైనింగ్, పెద్ద పెద్ద కిటికీలు లేదా విశాలమైన ఓపెన్‌ గ్లాస్‌ విండోస్‌తో సహజ కాంతి రావడం వంటి అంశాలు ట్రెండ్‌గా మారాయి. గోడలపై గ్రీన్‌ ప్లాంట్‌ ఇన్‌స్టాలేషన్లు ఇతర సహజ పద్ధతులు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి.

Man Drops Brand New iPhone 17 Pro In Front Of Tim Cook3
యాపిల్‌ సీఈవో ముందే కొత్త ఐఫోన్‌ పడేసుకున్నాడు..

ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్‌కు ఉన్న క్రేజ్‌ తెలిసిందే కదా.. తాజాగా విడుదలైన ఐఫోన్‌ 17 సిరీస్‌ ఫోన్‌లను కొనేందుకైతే యాపిల్‌ స్టోర్ల ముందు కస్టమర్లు క్యూకట్టారు. కొత్త ఫీచర్లతో లాంచ్‌ అయిన బ్రాండ్‌ న్యూ ఐఫోన్‌ను కొనుక్కొని తమ చేతుల్లోకి ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని గంటల కొద్దీ కస్టమర్లు క్యూలో వేచిఉన్న దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా కనిపించాయి.అయితే ఓ కస్టమర్‌ తన కొత్త ఐఫోన్ 17ను యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ముందే పడేసుకున్న సంఘటన ఓ యాపిల్‌ స్టోర్‌లో జరిగింది. ముచ్చటపడి కొనుక్కున్న కొత్త ఫోన్‌పై సీఈవో టిమ్‌ కుక్‌తో ఆటోగ్రాఫ్‌ చేయించుకోవాలనుకున్న యువకుడు ఆ ఆత్రుతలో ఇంకా ఓపెన్‌ చేసిన సరికొత్త ఐఫోన్‌ను చేజార్చుకున్నాడు.తన ముందు కస్టమర్‌ కొత్త ఫోన్‌ పడేసుకున్నప్పుడు టిమ్‌ కుక్‌ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. కింద పడిన ఫోన్‌ను తీసుకునేందుకు కస్టమర్‌ కిందికి ఒంగగా ​టిమ్‌ కుక్‌ కూడా అతనికి సాయం చేసుందుకు అన్నట్టుగా కిందికి ఒంగారు. అతను ఫోన్‌ చేతిలోకి తీసుకున్నాక ఏం కాలేదులే అని అభినందించి ఆ తర్వాత ఆ ఫోన్‌పై తన ఆటోగ్రాఫ్‌ చేశారు.ఈ సంఘటన ఎక్కడి యాపిల్‌ స్టోర్‌ జరిగిందో తెలియదు కానీ, దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో తెగ తిరుగుతూ వైరల్‌గా మారింది. ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు యూజర్ల నుంచి విపరీతమైన కామెంట్లు వచ్చాయి.this is so embarrassing 😭 pic.twitter.com/AkrKd41Kn3— Holly - I like tech (@AnxiousHolly) September 20, 2025

Things to consider when buying a commercial property4
కమర్షియల్‌ ప్రాపర్టీ కొనేందుకు ఇదే సరైన సమయం!

సాక్షి, సిటీబ్యూరో: వాణజ్య సముదాయాల్లో పెట్టే పెట్టుబడిపై 8 నుంచి 11 శాతం అద్దె గిట్టుబాటయితే.. ఇళ్లపై రాబడి రెండు నుంచి నాలుగు శాతం వరకే ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. రానున్న ఐదేళ్లలో ఎంతలేదన్నా 2కోట్ల చ.అ. వాణిజ్య భవనాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఇప్పటికే కొన్ని నగరాల్లో వాణిజ్య స్థలాల ధరలు తగ్గాయి. దీంతో వీటిలో పెట్టుబడి పెట్టడానికిదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశీలించాల్సిన అంశాలేమిటో ఓ సారి చూద్దాం.వాణిజ్య సముదాయాల్లో స్థలం కొన్న తర్వాత దాన్ని అమ్ముకోగానే మెరుగైన ఆదాయం గిట్టుబాటవుతుంది. ఇదొక్కటే కాదు ప్రతినెలా ఆశించిన స్థాయిలో అద్దె కూడా లభిస్తుంది. కాకపోతే అన్ని విధాలా అభివృద్ధికి ఆస్కారం ఉన్న చోట నిర్మితమయ్యే వాణిజ్య కట్టడాల్లో స్థలం తీసుకోవాలి. కాకపోతే పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి.ఇవే కీలకం.. వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయనం, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో మదుపు చేయాలి.ఒక ప్రాంతంలో నిర్మించే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని బేరీజు వేయాలి. భవనాన్ని నిర్మించే డెవలపర్‌ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి భవనాల్లో నిర్వహణ మెరుగ్గా ఉంటేనే గిరాకీ ఉంటుంది.మీరు వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగానికి ఆస్కారం ఉందా? అక్కడ జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి.మీరు కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడ ఉంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి.వాణిజ్య సముదాయంలో స్థలం కొనాలన్న నిర్ణయానికి వచ్చేముందు.. నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం బీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోరుకున్న రాబడి గిట్టుబాటవుతుంది.

World's first 3D Printed Resort Living Community at Ridhira Zen5
రియల్‌ ఎస్టేస్‌లో ఫస్ట్‌ టైమ్‌.. ‘త్రీడీ రిసార్ట్‌’

సాక్షి, సిటీబ్యూరో: నిర్మాణ రంగంలో త్రీడీ ప్రింటింగ్‌ విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుంది. హైదరాబాద్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్, హాస్పిటాలిటీ సంస్థ రిధిర గ్రూప్‌ త్రీడీ ముద్రణ సాంకేతికతను వినియోగించింది. ప్రపంచంలోనే తొలిసారిగా కమ్యూనిటీ లివింగ్‌ ‘రిధిర జెన్‌’ రిసార్ట్‌ను త్రీడీలో ముద్రించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.రీసైకిల్‌ చేసిన, స్థానిక వనరులతో అవసరమైన మెటీరియల్స్‌ మాత్రమే త్రీడీలో ముద్రించే వీలు కలుగుతుందని, దీంతో వ్యర్థాల విడుదల గణనీయంగా తగ్గుతుందని సంస్థ ఎండీ రితేష్‌ మస్తిపురం తెలిపారు. భారీ యంత్రాలు, కార్మికుల వినియోగంతో పాటు కర్బన ఉద్ఘారాల విడుదల 50 శాతం వరకు తగ్గుతుందని పేర్కొన్నారు.

US H-1B visas 2025 TCS emerges as 2nd largest recipient with 5500 approvals6
H-1B visas: టీసీఎస్‌వే ఎక్కువ..

అమెరికాలో అత్యధిక నైపుణ్యమున్న విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్ -1బీ వీసాలకు సంబంధించి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025లో రెండవ అతిపెద్ద గ్రహీతగా అవతరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,500కి పైగా ఆమోదాలతో అమెజాన్ (10,044) తర్వాత స్థానంలో నిలిచింది.2025 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ తర్వాత అత్యధిక హెచ్‌ 1బీ వీసా అప్రూవల్స్‌ పొందిన కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), ఆపిల్ (4,202), గూగుల్ (4,181), డెలాయిట్ (2,353), ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా అమెరికాస్ (951) ఉన్నాయి.అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులను గణనీయంగా ప్రభావితం చేసే చర్యను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్నారు. వార్షిక హెచ్ -1 బి వీసా ఫీజు 100,000 డాలర్లకు పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.2025 సెప్టెంబర్ 21 తర్వాత దాఖలు చేసిన పిటిషన్లకు ఈ పరిమితి వర్తిస్తుంది. పొడిగించకపోతే 12 నెలల తర్వాత ముగుస్తుంది. "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు హెచ్‌-1బీ వ్యవస్థను దుర్వినియోగం చేశాయి. కంప్యూటర్ సంబంధిత రంగాలలో అమెరికన్ ఉద్యోగులకు గణనీయంగా హాని కలిగిస్తున్నాయి" అని పేర్కొంటూ ఐటీ అవుట్ సోర్సింగ్ కంపెనీలు హెచ్‌-1బీ ఆమోదాలపై ఎంతలా ఆధిపత్యం చెలాయించాయో ప్రభుత్వ ప్రకటన హైలైట్ చేసింది.

Advertisement
Advertisement
Advertisement