Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

SEBI Chairman Tuhin Kanta Pandey called MCX breakdown unacceptable1
మాటిమాటికీ.. బ్రేక్‌డౌన్‌లేంటి..

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌(ఎంసీఎక్స్‌)లో పదే పదే సాంకేతిక సమస్యలు వస్తుండటంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే అసహనం వ్యక్తం చేశారు. తాజా సమస్యను అధ్యయనం చేసిన మీదట అవసరమైతే సెబీ స్వయంగా తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఇలాంటి విషయాల్లో సెబీ ప్రామాణికమైన ప్రోటోకాల్స్‌ను పాటిస్తుందని పాండే పేర్కొన్నారు.‘జూలైలో ఒకసారి సమస్య వచ్చింది. ఇదిగో ఇప్పుడు మరొకటి. ఇలా మాటిమాటికీ సమస్యలు వస్తుండటం సరికాదు’ అని ఆయన చెప్పారు. డిజిటలీకరణ వేగవంతం అవుతున్న నేపథ్యంలో వ్యాపారాలకు అంతరాయాలు తలెత్తకుండా మార్కెట్‌ ఇంటర్మీడియరీలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, క్లయింట్ల డేటా..కీలకమైన మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లకుండా సైబర్‌ సెక్యూరిటీపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పాండే పేర్కొన్నారు. గత నెల ఎంసీఎక్స్‌లో పెద్ద స్థాయిలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ట్రేడింగ్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: గోపీచంద్‌ హిందూజా కన్నుమూత

India launched third round of PLI scheme for specialty steel2
స్పెషాలిటీ స్టీల్‌కు మరో విడత ప్రోత్సాహకాలు

స్పెషాలిటీ స్టీల్‌ తయారీలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో కేంద్ర సర్కారు మరో విడత ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ)ను తీసుకొచ్చింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం, దిగుమతులను తగ్గించడం ఈ పథకం ఉద్దేశ్యం. ‘పీఎల్‌ఐ 1.2’ పథకాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రారంభించారు.ఈ పథకం కింద మొదటి రెండు విడతల్లో స్పెషాలిటీ స్టీల్‌ రంగంలోకి రూ.43,874 కోట్ల పెట్టుబడులకు హామీలను పొందినట్టు మంత్రి చెప్పారు. వీటి ద్వారా 14.3 మిలియన్‌ టన్నుల కొత్త స్పెషాలిటీ స్టీల్‌ తయారీ సామర్థ్యం దేశీయంగా ఏర్పాటవుతుందన్నారు. 2025 సెప్టెంబర్‌ నాటికి రూ.22,973 కోట్ల పెట్టుబడులు రాగా, 13,284 మందికి ఉద్యోగ అవకాశాలు లభించినట్టు చెప్పారు. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం, ఆటోమొబైల్, ఇన్‌ఫ్రాలోకి వినియోగించే అధిక విలువ కలిగిన, ఉన్నత శ్రేణి స్టీల్‌ తయారీని ప్రోత్సహించేందుకు 2021 జూలైలో పీఎల్‌ఐ పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.మొదటి రెండు విడతల పీఎల్‌ఐ పథకానికి మంచి స్పందన లభించినట్టు చెప్పారు. అధిక శ్రేణి స్టీల్‌ తయారీకి భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా మలిచేందుకు పీఎల్‌ఐ 1.2ను తీసుకొచి్చనట్టు వెల్లడించారు. సూపర్‌ అలాయ్స్, సీఆర్‌జీవో స్టీల్, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ లాంగ్, ఫ్లాట్‌ ఉత్పత్తులు, టైటానియం అలాయ్స్, కోటెడ్‌ స్టీల్‌ విభాగాల్లో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పథకం సాయపడుతుందన్నారు. ప్రస్తుత కంపెనీలతోపాటు కొత్త కంపెనీలకు పీఎల్‌ఐ 1.2 అవకాశాలు కల్పిస్తుందన్నారు. దేశ అవసరాలకే కాకుండా ప్రపంచ మార్కెట్లకు సరఫరా చేసేందుకు ఈ పథకాన్ని చేపట్టినట్టు మంత్రి కుమారస్వామి చెప్పారు.ఇదీ చదవండి: గోపీచంద్‌ హిందూజా కన్నుమూత

Nirmala Sitharaman reaffirmed that India become world third largest economy3
మూడో భారీ ఎకానమీగా భారత్‌!

అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ త్వరలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తం చేశారు. వివిధ అంశాల్లో భారత్‌ చాలా వేగంగా ముందుకు దూసుకెళ్తోందని ఆమె పేర్కొన్నారు. 2014లో పదో స్థానంలో ఉన్న భారత్‌ క్రమంగా అయిదు, నాలుగో స్థానాలకు ఎదిగిందని, త్వరలోనే మూడో స్థానానికి చేరుతుందని చెప్పారు. భారతీయులంతా తమ సామర్థ్యాలపై, దేశ ఆర్థిక సామర్థ్యాలపై నమ్మకం కలిగి ఉండాలని ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ (డీఎస్‌ఈ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి సూచించారు. బయటి వ్యక్తుల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.‘140 కోట్ల జనాభా గల మన దేశాన్ని నిర్జీవ ఎకానమీగా ఎవరైనా ఎలా అనగలరు? బయటి నుంచి ఎవరైనా ఏవైనా మాట్లాడొచ్చు గాక, కానీ మన కృషి, మన విజయాలను మనం తక్కువ చేసుకోరాదు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కృషి చేస్తున్న మనందరికీ మనం సొంతంగానే లక్ష్యాలను సాధించగలమనే ఆత్మవిశ్వాసం ఉండాలి‘ అని మంత్రి చెప్పారు. వృద్ధి సాధనలో టెక్నాలజీ చాలా కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు. సాంకేతిక లేకపోయి ఉంటే స్థలం, కారి్మక శక్తి, పెట్టుబడులు నిరుపయోగంగా ఉండేవని వివరించారు. అన్నింటా సాంకేతికతచిన్న రైతు పొలాన్ని గుర్తించడం నుంచి కొత్త మోడల్స్‌ను అత్యంత వేగంగా కృత్రిమ మేథ తీర్చిదిద్దుతున్న తయారీ రంగం వరకు అన్నింటా సాంకేతికత కీలకంగా ఉంటోందని మంత్రి చెప్పారు. కృత్రిమ మేథ వల్ల ఉద్యోగాలు పోతాయని కొందరిలో ఆందోళన నెలకొన్నప్పటికీ మరికొందరు మాత్రం ఏఐని ఉపయోగించి దీర్ఘకాలిక సవాళ్లను పరిష్కరిస్తున్నారని తెలిపారు. భారత్‌లో పరిశోధనలు నిర్వహించడంపై, వర్ధమాన దేశాలకు అనువైన మోడల్స్‌ను రూపొందించడంపై మరింతగా దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. ద్రవ్య లోటు లక్ష్యాన్ని సాధిస్తాం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 4.4 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పక సాధించగలదని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 2024–25లో 4.8 శాతంగా ఉన్న ద్రవ్య లోటును ఈసారి 4.4 శాతానికి (సుమారు రూ. 15.69 లక్షల కోట్లు) పరిమితం చేయాలని బడ్జెట్‌లో ప్రభుత్వం నిర్దేశించుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల ఆర్థిక సమ్మిళితత్వం, జాతీయ ప్రయోజనాల లక్ష్యాలకు భంగం వాటిల్లుతుందన్న ఆందోళనలను ఆమె తోసిపుచ్చారు. బ్యాంకులను జాతీయీకరణ చేసి 50 ఏళ్లు గడిచినా ఆర్థిక సమ్మిళితత్వ విషయంలో ఆశించిన ఫలితాలు కనిపించలేదని..వాటిని ప్రొఫెషనల్‌ విధానంలో తీర్చిదిద్దిన తర్వాత నుంచి చక్కని ఫలితాలు కనిపిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.ఇదీ చదవండి: గోపీచంద్‌ హిందూజా కన్నుమూత

Gopichand Hinduja chairman of the Hinduja Group passed away4
గోపీచంద్‌ హిందూజా కన్నుమూత

వ్యాపార దిగ్గజం, బ్రిటన్‌లో అత్యంత సంపన్నుడు గోపీచంద్‌ పి. హిందూజా (85) కన్నుమూశారు. గత కొద్ది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపీచంద్, లండన్‌ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి. హిందూజాకు భార్య (సునీత), ఇద్దరు కుమారులు (సంజయ్, ధీరజ్‌), ఒక కుమార్తె (రీటా) ఉన్నారు. వ్యాపార వర్గాల్లో జీపీగా పేరొందిన గోపీచంద్‌ 1940లో జన్మించారు. ఆటోమోటివ్, ఎనర్జీ, బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో తమ గ్రూప్‌ను అగ్రగామిగా విస్తరించిన నలుగురు హిందుజా సోదరుల్లో ఆయన రెండో వారు. 2023లో అన్న శ్రీచంద్‌ హిందూజా మరణానంతరం 35 బిలియన్‌ పౌండ్ల గ్రూప్‌ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. విజనరీ వ్యాపారవేత్త..ముంబైలోని జైహింద్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ (1959) అనంతరం తమ కుటుంబానికి టెహ్రాన్‌లో ఉన్న ట్రేడింగ్‌ వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా జీపీ(గోపీచంద్‌ హిందూజా) తన కెరియర్‌ ప్రారంభించారు. ఆయన సారథ్యంలో 1984లో గల్ఫ్‌ ఆయిల్‌ని, ఆ తర్వాత 1987లో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశీ ఆటోమోటివ్‌ సంస్థ అశోక్‌ లేల్యాండ్‌ను గ్రూప్‌ కొనుగోలు చేసింది. అప్పట్లో అశోక్‌ లేల్యాండ్‌లో పెట్టుబడి తొలి భారీ ఎన్నారై ఇన్వెస్ట్‌మెంట్‌గా నిలిచింది. భారతీయ కార్పొరేట్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన టర్న్‌ అరౌండ్‌ గాథగా నిలిచపోయేలా కంపెనీని తీర్చిదిద్దడంలో జీపీ కీలకంగా వ్యవహరించారు. ఇక విద్యుత్, మౌలిక రంగాల్లోకి హిందూజా గ్రూప్‌ ప్రవేశించడంలోనూ ముఖ్య పాత్ర పోషించారు. బోఫోర్స్‌ మరకలు..స్వీడన్‌కి చెందిన గన్నుల తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్‌కి భారత్‌లో కాంట్రాక్టులు ఇప్పించేందుకు రూ. 64 కోట్లు అక్రమంగా కమీషన్లు తీసుకున్నట్లు జీపీతో పాటు ఆయన ఇద్దరు సోదరులపై (శ్రీచంద్, ప్రకాశ్‌) ఆరోపణలు వచ్చాయి. అయితే, 2005లో ఢిల్లీ హైకోర్టు వాటిని కొట్టివేసింది. కార్పెట్లు, టీ, సుగంధ ద్రవ్యాల ట్రేడింగ్‌తో సింధూ ప్రాంతంలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) పరమానంద్‌ 1914లో హిందూజా వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఇరాన్‌కి వెళ్లి, అక్కడి నుంచి వ్యాపారాన్ని విస్తరించారు. ప్రస్తుతం తాజా ది సండే టైమ్స్‌ రిచ్‌ లిస్టులో గోపీచంద్‌ హిందూజా కుటుంబం 35.3 బిలియన్‌ పౌండ్ల సంపదతో బ్రిటన్‌లోనే అత్యంత సంపన్న కుటుంబంగా అగ్రస్థానంలో ఉంది.భారతీయులకు చెందిన ఏకైక స్విస్‌ బ్యాంక్‌ ‘బ్యాంకీ ప్రైవీ’ కూడా హిందూజా సామ్రాజ్యంలో భాగమే. పెద్దన్న శ్రీచంద్‌ మరణానంతరం వ్యాపారాధిపత్యం కోసం కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి అవి సద్దుమణిగినట్లు కుటుంబం చెబుతున్నప్పటికీ, విభేదాలు కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: దేశంలోనే ధనిక జిల్లాగా రంగారెడ్డి

New Hyundai Venue launched at Rs 7. 89 lakh5
హ్యుందాయ్‌ వెన్యూ సరికొత్త వెర్షన్‌

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యుందాయ్‌ తాజాగా తమ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ వెన్యూకి సంబంధించిన కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.89 లక్షలనుంచి ప్రారంభమవుతుంది. లేటెస్ట్‌ వెన్యూని అభివృద్ధి చేయడంపై రూ. 1,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు, పుణేలో కొత్తగా ప్రారంభించిన ప్లాంటులో మాత్రమే దీన్ని ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొంది. 2028 నాటికి ఈ ప్లాంటు స్థాపిత సామర్థ్యం 2.5 లక్షల యూనిట్లుగా ఉంటుందని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్, వచ్చే ఏడాది జనవరిలో ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న తరుణ్‌ గర్గ్‌ తెలిపారు.ఇప్పటివరకు 7 లక్షలకు పైగా వెన్యూ వాహనాలను విక్రయించినట్లు చెప్పారు. దేశీయంగా కస్టమర్లు చిన్న కార్లకు తగ్గకుండా కాంపాక్ట్‌ ఎస్‌యూవీలకు అప్‌గ్రేడ్‌ అవుతున్నారని గర్గ్‌ చెప్పారు. తమ మొత్తం అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 71 శాతంగా ఉందని, 2030 నాటికి ఇది 80 శాతానికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. 2030 నాటికి రూ. 45,000 కోట్ల పెట్టుబడులతో, 26 కార్లను ప్రవేశపెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

SBI reports 10 Percent rise in Q2 net profit to Rs 20160 crore6
ఎస్‌బీఐ భళా

మొత్తం బిజినెస్‌ రూ. 100 లక్షల కోట్లను తాకింది. ఆస్తుల రీత్యా ఎస్‌బీఐ ప్రపంచంలో 43వ ర్యాంకులో నిలుస్తోంది. వీటిలో ఎంఎస్‌ఎంఈ విభాగం రూ. 25 లక్షల కోట్లను ఆక్రమిస్తోంది. – సీఎస్‌ శెట్టి, చైర్మన్, ఎస్‌బీఐన్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జూలై– సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 7 శాతం వృద్ధితో రూ. 21,137 కోట్లను తాకింది. యస్‌ బ్యాంక్‌లో వాటా విక్రయం ద్వారా లభించిన రూ. 4,593 కోట్లు ఇందుకు దోహదపడ్డాయి. స్టాండెలోన్‌ నికర లాభం సైతం 10 శాతం ఎగసి రూ. 20,160 కోట్లకు చేరింది.గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 18,331 కోట్లు ఆర్జించింది. కాగా.. రుణాల్లో 12.7 శాతం వృద్ధి నేపథ్యంలోనూ నికర వడ్డీ ఆదాయం 3 శాతమే పుంజుకుని రూ. 42,984 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు నామమాత్రంగా 0.17 శాతం బలహీనపడి 2.97 శాతాన్ని తాకాయి. అంచనాలకు అనుగుణంగా పూర్తి ఏడాదికి 3 శాతం మార్జిన్లు సాధించనున్నట్లు బ్యాంక్‌ చైర్మన్‌ శెట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వడ్డీయేతర ఆదాయం 30 శాతం జంప్‌చేసి రూ. 19,919 కోట్లకు చేరగా.. మొత్తం ఆదాయం రూ. 1,29,141 కోట్ల నుంచి రూ. 1,34,979 కోట్లకు బలపడింది. ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు బీఎస్‌ఈలో 0.7% లాభంతో రూ. 957 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 959 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది.రుణ నాణ్యత ఓకే ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్‌బీఐ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.13 శాతం నుంచి 1.73 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.53 శాతం నుంచి 0.42 శాతానికి దిగివచ్చాయి. ఇవి గత రెండు దశాబ్దాలలోనే కనిష్టమని శెట్టి వెల్లడించారు. అయితే తాజా స్లిప్పేజీలు రూ. 4,754 కోట్లకు పరిమితమైనప్పటికీ.. మొత్తం ప్రొవిజన్లు రూ. 4,505 కోట్ల నుంచి రూ. 5,400 కోట్లకు పెరిగాయి.ప్రస్తుతం బ్యాంక్‌ బ్రాంచీల సంఖ్య 23,050కు చేరగా.. పూర్తి ఏడాదిలో మరో 500 జత చేసుకోనున్నట్లు శెట్టి తెలియజేశారు. జీఎస్‌టీ రేట్ల సవరణల తదుపరి రుణాలకు ప్రధానంగా ఆటో రంగంలో డిమాండ్‌ భారీగా పుంజుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సెక్యూరిటీలలో రూ. 3.5 లక్షల కోట్ల మిగులు పెట్టుబడులున్నట్లు తెలియజేశారు. వీటికితోడు ఇటీవల సమీకరించిన రూ. 25,000 కోట్ల మూలధనంతో రూ. 12 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసే వీలున్నట్లు వివరించారు.

Advertisement
Advertisement
Advertisement