Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

IndusInd Bank flags Rs 674 crore error as incorrectly recorded interest1
ఇండస్ఇండ్ లో మళ్లీ కలకలం

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో మరో అకౌంటింగ్‌ లోపం బైటపడింది. తమ ఖాతాల్లో ‘నిర్దిష్ట ఆధారాలు లేని’ రూ. 595 కోట్ల బ్యాలెన్స్‌ను అంతర్గత ఆడిట్‌ విభాగం (ఐఏడీ) గుర్తించినట్లు బ్యాంక్‌ తెలిపింది. స్టాక్‌ ఎక్సే్చంజీలకు బ్యాంకు ఇచ్చిన సమాచారం ప్రకారం, ప్రజా వేగు నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆడిట్‌ కమిటీ ‘ఇతర అసెట్స్‌’, ‘ఇతర లయబిలిటీస్‌’ ఖాతాల్లో లావాదేవీలపై విచారణ జరిపింది. మే 8న ఐఏడీ సమర్పించిన నివేదిక బట్టి, ‘ఇతర అసెట్స్‌’ కింద ఎలాంటి ఆధారాలు లేని రూ. 595 కోట్ల మొత్తం నమోదైంది. దీన్ని జనవరిలో ‘ఇతర లయబిలిటీల’ కింద సర్దుబాటు చేసినట్లుగా రికార్డయ్యింది. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో మొత్తం రూ. 674 కోట్లు, వడ్డీ ఆదాయం కింద ఖాతాల్లో తప్పుగా రికార్డు అయినట్లు, జనవరి 10న దీన్ని పూర్తిగా రివర్స్‌ చేసినట్లు బ్యాంకు వివరించింది ఈ మొత్తం వ్యవహారంలో కీలక ఉద్యోగుల పాత్రపై కూడా ఐఏడీ విచారణ జరిపినట్లు బ్యాంకు తెలిపింది. అంతర్గత విధానాలను పటిష్టం చేయడం, అవకతవకలకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవడం మీద బోర్డు దృష్టి పెట్టినట్లు వివరించింది. డెరివేటివ్‌ పోర్ట్‌ఫోలియోలో అకౌంటింగ్‌ లోపాల కారణంగా సంస్థ నికర విలువపై 2.35 శాతం మేర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందంటూ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం సుమారు రూ. 1,979 కోట్ల మేర ఉండొచ్చని, ఈ అంశంపై దర్యాప్తు చేసిన ఏజెన్సీ పీడబ్ల్యూసీ ఒక నివేదికలో పేర్కొంది. వివిధ స్థాయిల్లో చోటు చేసుకున్న అవకతవకలను, తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. ఇప్పటికే సీఈవో సుమంత్‌ కథ్పాలియా, డిప్యూటీ సీఈవో అరుణ్‌ ఖురానా రాజీనామా చేశారు. కొత్త ఎండీ, సీఈవో బాధ్యతలు చేపట్టే వరకు కార్యకలాపాల పర్యవేక్షణకు ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ ఏర్పాటైంది. అకౌంటింగ్‌ అవకతవకలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించేందుకు గ్రాంట్‌ థార్న్‌టన్‌ను బ్యాంకు నియమించుకుంది. అకౌంటింగ్‌లో అవకతవకల వార్తలతో శుక్రవారం ఉదయం బ్యాంక్‌ షేర్లు ఒక దశలో 6 శాతం క్షీణించినప్పటికీ తర్వాత కోలుకుని ఒక మోస్తరు లాభంతో ముగిశాయి. బీఎస్‌ఈలో కంపెనీ షేరు ఉదయం సెషన్లో 5.7% క్షీణించి రూ. 735.95కి తగ్గింది. చివరికి 0.26% పెరిగి రూ. 782.30 వద్ద క్లోజయ్యింది.

Mark Zuckerberg plans to give away 90pc of his wealth says Bill Gates2
ఉన్నదంతా ఇచ్చేస్తున్న జుకర్‌బర్గ్‌!

ప్రపంచ కుబేరులు అపర దానకర్ణులుగా మారుతున్నారు. తమ సంపదను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ మాతృసంస్థ టెక్‌ దిగ్గజం మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రకారం.. మెటా సీఈవో తన సంపదలో 90 శాతానికి పైగా దానధర్మాలకు ఇచ్చేస్తున్నారు.సుదీర్ఘకాలంగా పెద్ద ఎత్తున దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న బిల్‌ గేట్స్ ఫార్చ్యూన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆలోచనలను పంచుకున్నారు. జుకర్‌బర్గ్ దాతృత్వ సంస్థ చాన్ జుకర్ బర్గ్ ఇనిషియేటివ్ ను ఆయన తీవ్రమైన ఉద్దేశానికి సంకేతంగా పేర్కొన్నారు. జుకర్ బర్గ్ దాతృత్వ ప్రణాళికలను ప్రస్తావిస్తూ, "అతను చాలా మంచి ప్రారంభానికి వెళ్తున్నాడు" అని బిల్ గేట్స్ అన్నారు. తామిద్దరం తరచుగా దాతృత్వానికి సంబంధించిన అంశాలను మాట్లాడుకుంటామన్నారు.మార్క్‌ జుకర్‌బర్గ్‌, ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్ తమ జీవితకాలంలో 99 శాతం ఫేస్‌బుక్‌ షేర్లను విరాళంగా ఇస్తామని హామీ 2015లోనే ప్రకటించారు.అప్పటి నుంచి వారి ఫౌండేషన్ విద్య, వైద్యం, సైన్స్ రంగాల్లో ప్రాజెక్టులపై పనిచేస్తోంది.దాతృత్వ దృశ్యం ఎలా మారుతోందో గేట్స్ ఎత్తిచూపారు. వారెన్ బఫెట్, మెలిందా ఫ్రెంచ్ గేట్స్ తో కలిసి తాను 2010లో ప్రారంభించిన గివింగ్ ప్లెడ్జ్ క్యాంపెయిన్ ద్వారా తమ సంపదలో అధిక భాగాన్ని దాతృత్వానికి ఇచ్చేందుకు టెక్ పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

PURE Partners Charge Power Inc to Enter Canada US Energy Storage Markets3
కెనడా, అమెరికా మార్కెట్‌లోకి హైదరాబాద్‌ కంపెనీ

హైదరాబాద్‌కు చెందిన బ్యాటరీ టెక్నాలజీ, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ కెనడా, అమెరికా ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్లలోకి ప్రవేశిస్తోంది. ఈ మేరకు కెనడా సంస్థ చార్జ్ పవర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్యూర్ కంపెనీ తెలిపింది.ఈ భాగస్వామ్యంతో ప్యూర్ అధునాతన ఎనర్జీ స్టోరేజ్ ప్రొడక్ట్ లైన్ ను కో-బ్రాండింగ్ అరేంజ్‌మెంట్ ద్వారా కెనడా, అమెరికాలోని వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ ఉత్పత్తులు రెసిడెన్షియల్, కమర్షియల్ నుంచి గ్రిడ్ స్కేల్ అప్లికేషన్స్ వరకు ఉంటాయని పేర్కొంది.తమకున్న పటిష్టమైన తయారీ సౌకర్యాలతో బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్‌లో లోతైన నైపుణ్యాన్ని సాధించామని, తమ మా సృజనాత్మక, మన్నికైన, నమ్మదగిన ఇంధన నిల్వ ఉత్పత్తులకు యూఎస్, కెనడా మార్కెట్లలో విస్తృత ఆమోదం లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు ప్యూర్ ఫౌండర్, ఎండీ నిశాంత్ దొంగరి అన్నారు.

Jio leads in Trai Drive Test in Hyderabad4
హైదరాబాద్‌లో జియో టాప్‌.. ట్రాయ్‌ టెస్ట్‌లో బెస్ట్‌

హైదరాబాద్: రిలయన్స్ జియో హైదరాబాద్‌లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. కీలకమైన వాయిస్, డేటా పనితీరులో ఇతర టెల్కోలను జియో వెనక్కి నెట్టింది. ఇటీవల ట్రాయ్‌ (TRAI) నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్ (IDT)లో జియో తన బలమైన మొబైల్ నెట్‌వర్క్ సామర్ధ్యాన్ని నిరూపించుకుంది.ట్రాయ్ నివేదిక ప్రకారం రిలయన్స్ జియో తన 4G నెట్‌వర్క్‌లో 240.66 Mbps సగటు డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఇది నగరంలోని అన్ని ఆపరేటర్లలో అత్యధికం. ఈ అసాధారణ పనితీరు వల్ల జియో కస్టమర్‌లు గరిష్ట వినియోగ సమయాల్లో కూడా వేగవంతమైన వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, వేగవంతమైన యాప్ డౌన్‌లోడ్‌లు, అంతరాయం లేని బ్రౌజింగ్‌ను ఆస్వాదించేలా చేస్తుంది.ఈ ఫలితాలు.. జియోను అధిక డౌన్‌లింక్ వేగం, తక్కువ లేటెన్సీ కలిగిన ఉత్తమ నెట్‌వర్క్‌గా నిలబెట్టాయి. అతి తక్కువ లేటెన్సీ వినియోగదారులు, సర్వర్‌ల మధ్య డేటా ప్యాకెట్‌లు ప్రయాణించడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్ మరియు ఆన్‌లైన్ గేమింగ్ వంటి రియల్-టైమ్ అప్లికేషన్‌లకు అత్యంత అవసరం.మరోవైపు వాయిస్ సేవలలో కూడా జియో పనితీరు అంతే బలంగా ఉంది. జియో సేవలు అధిక కాల్ సెటప్ సక్సెస్ రేటు, తక్కువ కాల్ సెటప్ సమయం, అతి తక్కువ కాల్ డ్రాప్ రేటు, అద్భుతమైన వాయిస్ స్పష్టత అందిస్తున్నాయని ట్రాయ్ నివేదిక సూచిస్తోంది.

Google New Feature Makes Stolen Phones Useless5
గూగుల్‌ కొత్త ఫీచర్‌.. కొట్టేసిన ఫోన్‌ పనిచేయదు!

ఫోన్ల చోరీకి చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. చోరీకి గురైన ఫోన్లను దాదాపు నిరుపయోగంగా మార్చే లక్ష్యంతో గూగుల్ ఆండ్రాయిడ్ 16తో ముఖ్యమైన యాంటీ-థెఫ్ట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ అప్‌డేట్‌లో మెరుగైన భద్రతా సాధనాలు ఉంటాయి. ఇవి "ఓనర్‌ అనుమతి లేకుండా రీసెట్ చేసిన ఫోన్‌లు పనిచేయకుండా అవుతాయి" అని ఆండ్రాయిడ్ పరికరాల సమాచారాన్ని తెలిపే ‘ఆండ్రాయిడ్‌ పోలీస్’ అనే వెబ్‌సైట్‌ నివేదిక తెలిపింది.గూగుల్‌ ఇటీవల 'ది ఆండ్రాయిడ్ షో: ఐ/ఓ ఎడిషన్' సందర్భంగా ఈ కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఇది ప్రాథమికంగా ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ (ఎఫ్ఆర్‌పీ) ను పెంచుతుంది. ఇది చోరీకి గురైన ఫోన్లను నిరుపయోగంగా చేయడానికి రూపొందించిన భద్రతా ఫీచర్. గూగుల్ ఆండ్రాయిడ్ 15 లో ఎఫ్ఆర్‌పీకి అనేక మెరుగుదలలు చేసింది. తదుపరి ఆండ్రాయిడ్ అప్డేట్ దీనిని మరింత బలోపేతం చేస్తుంది.ఈ కొత్త ఫీచర్ గురించి గూగుల్ అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ, గూగుల్ ప్రణాళికలను తెలియజేసే ఒక స్క్రీన్ షాట్ ను ఆండ్రాయిడ్ పోలీస్ పబ్లిష్‌ చేసింది. ఈ స్క్రీన్ షాట్ ఫోన్ స్క్రీన్ పై ఫ్యాక్టరీ రీసెట్ వార్నింగ్ ఫ్లాషింగ్ ను చూపిస్తోంది. ఫోన్‌ను దొంగిలించినవారు ఒకవేళ సెటప్ విజార్డ్ ను చేయకపోతే రీసెట్‌ చేయకుండా ముందుకెళ్లలేరు. అంటే యూజర్‌ ఫోన్‌ను రీసెట్ చేసి మునుపటి లాక్ స్క్రీన్ లాక్ లేదా గూగుల్ ఖాతా క్రెడెన్షియల్స్‌ను నమోదు చేసే వరకు ఫోన్‌ పనిచేయదు. ఆండ్రాయిడ్ పోలీస్ ప్రకారం.. కొత్త ఫీచర్‌ ఈ సంవత్సరం చివరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

South Indian Bank Profit rise 19pc to Rs 342 crore in Q4 FY256
సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌కు లాభాలు.. షేర్లకు డివిడెండ్‌

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ సంస్థ సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 19 శాతం వృద్ధితో రూ. 342 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 288 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,621 కోట్ల నుంచి రూ. 2,946 కోట్లకు ఎగసింది.వాటాదారులకు బ్యాంక్‌ బోర్డు షేరుకి రూ. 0.4 డివిడెండ్‌ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్‌ నికర లాభం 22 శాతం జంప్‌చేసి రూ. 1,303 కోట్లను తాకింది. 2023–24లో రూ. 1,070 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో 4 శాతం ఎగసి రూ. 28 వద్ద ముగిసింది.

Stock market highlights May 16th 2025 Sensex sheds Nifty ends at7
నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

భారతీయ బెంచ్‌మార్క్‌ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీలు ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్‌ను నష్టాలతో ముగించాయి. ఇన్వెస్టర్లు అధిక స్థాయిలో లాభాల నమోదుకు పరుగులు తీయడంతో సూచీలకు నష్టాలు తప్పలేదు.శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 200.15 పాయింట్లు లేదా 0.24 శాతం క్షీణించి 82,330.59 వద్ద ముగిసింది. ఈ సూచీ ఈరోజు 82,514.81 నుంచి 82,146.95 మధ్య ట్రేడ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా 42.30 పాయింట్లు లేదా 0.17 శాతం క్షీణించి 25,019.80 వద్ద స్థిరపడింది.విస్తృత మార్కెట్లు బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. స్మాల్ క్యాప్ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.86 శాతం, 0.94 శాతం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ షేర్లలో హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 1.20 శాతం నుంచి 0.60 శాతం మధ్య లాభపడ్డాయి. అదేసమయంలో భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు 2.76 శాతం నుంచి 0.79 శాతం మధ్య నష్టపోయాయి.

CEO tells staff to return to office or find another job. Majority of them quit8
ఆఫీస్‌కు రాకపోతే వేరే ఉద్యోగం చూసుకోండి..

రిమోట్ వర్క్.. అదేనండి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌. చాలా మంది ఉద్యోగులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఓపక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరో వైపు ఉద్యోగాన్ని చూసుకుంటున్న వారికి ఈ విధానం చాలా అనువుగా ఉంటోంది. అయితే కోవిడ్-19 మహమ్మారి విజృంభణ సందర్భంగా అమలులోకి వచ్చిన ఈ రిమోట్‌ వర్క్‌ విధానం నెమ్మదిగా తొలగిపోతోంది. చాలా కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలుస్తున్నాయి.సౌకర్యవంతమైన ఈ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి అలవాటు పడినవారు ఆఫీసులకు తిరిగివెళ్లడానికి ఇష్టపడటం లేదు. చాలా కంపెనీలు ఉద్యోగులను బలవంతంగానైనా ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఇలాగే ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశించడం ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీలో ఎలా బెడిసికొట్టిందో.. ఉద్యోగులు ఏం చేశారో చెబుతూ ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తి రెడ్డిట్‌లో షేర్‌ చేసిన స్టోరీ ఆసక్తికరంగా మారంది.ఆఫీస్‌కు రాకపోతే ఏం చేస్తారు?కోవిడ్‌ సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేసిన కంపెనీ.. ఆ సమయంలో చాలా మందిని రిమోట్‌ వర్క్‌ విధానంలోనే నియమించుకుంది. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అందరూ క్రమంగా ఆఫీసులకు రావాలని యాజమాన్యం ఆదేశించింది. అసలు సమస్య ఏంటంటే.. దాదాపు చాలా మంది రిమోట్‌ వర్క్‌ విధానంలోనే ఉద్యోగాల్లో చేరారు. కొంత మంది తమ ప్రాంతాలకు మకాం మార్చారు. ఇప్పుడు వీళ్లకు ఎటువంటి ఆర్థిక సహకారం అందించకుండా ఏడాదిలోగా ఆఫీసులకు వచ్చేయాలని కంపెనీ చెబుతోంది.దీంతో ఉ‍ద్యోగులు గందరగోళంలో పడిపోయారు. ఈక్రమంలో కంపెనీ వైడ్ టౌన్ హాల్ సమావేశంలో ఆఫీస​్‌కు రావడానికి అయిష్టంగా ఉన్నవారికి మినహాయింపులేమైనా ఉంటాయా అని ఓ ఉద్యోగి నేరుగా సీఈవోనే అడిగేశారు. దానికి సీఈవో స్పందిస్తూ "మీరు ఇంటి నుండి పని చేయాలనుకుంటే, వేరే చోట ఉద్యోగం చూసుకోండి" అంటూ బదులిచ్చారు. దీంతో అవాక్కైన ఉద్యోగులు ఆన్‌లైన్‌ కాల్స్‌లోకి రావడం మానేశారు. చాలా మంది వెంటనే రాజీనామా చేశారు. ఎక్కువ మంది వెళ్లిపోవడంతో కంపెనీకి షాక్‌ తగిలింది. క్యూసీ ఉ‍ద్యోగులతోనే యాప్ డెవలప్‌మెంట్ చేయించాల్సి వచ్చింది.

KTM Hikes Bike Prices RC 200 250 Duke 390 Duke And More Get Expensive9
కేటీఎం బైక్‌ల ధరలు పెరిగాయ్‌..

ప్రముఖ ప్రీమియం బైక్‌ల తయారీ సంస్థ కేటీఎం ఇండియన్ మార్కెట్లో విక్రయించే తమ ద్విచక్ర వాహనాల ధరలను సవరించింది. ఈ మార్పులతో వివిధ బైక్‌ల ధర రూ.12,000 వరకు పెరిగింది. ఆయా మోడళ్లపై కనీసం రూ.1,000 మేర ధరలను కంపెనీ పెంచేసింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులతోపాటు ద్రవ్యోల్బణ వ్యత్యాసానికి అనుగుణంగా సర్దుబాటు చేయడంలో భాగంగా ఇతర కంపెనీలతోపాటు కేటీఎం కూడా తమ బైక్‌ల ధరలను పెంచింది.ఏ బైక్‌పై ఎంత పెరిగింది?🔺కేటీఎం 390 డ్యూక్‌పై అత్యల్పంగా రూ .1,000 పెరిగింది. దీంతో ఈ బైక్ ధర రూ.2.96 లక్షలకు (ఎక్స్ షోరూమ్) చేరింది. అయితే ఇంతకుముందు ఈ బైక్‌ ధరను రూ.18,000 తగ్గించింది. దాంతో అప్పుడు ఈ ద్విచక్ర వాహనం ధర రూ.3.13 లక్షల నుంచి రూ.2.95 లక్షలకు (ఎక్స్ షోరూమ్) తగ్గింది.🔺 ఇక కేటీఎం 250 డ్యూక్, ఆర్‌సీ 390 మోడళ్ల ధరలు రూ .5,000 కంటే ఎక్కువ పెరిగాయి. దీంతో 250 డ్యూక్ ధర రూ.2.30 లక్షలకు చేరగా, ఆర్‌సీ 390 ధర రూ.3.23 లక్షలకు (రెండూ ఎక్స్-షోరూమ్ ధరలు) చేరింది. ఇండియన్ మార్కెట్లో బజాజ్ పల్సర్ ఎన్ 250, హీరో ఎక్స్ ట్రీమ్ 250ఆర్, సుజుకి జిక్సర్ 250 వంటి ప్రసిద్ధ మోడళ్లలో కేటీఎం 250 డ్యూక్ కూడా ఒకటి.​🔺కేటీఎం ఆర్‌సీ 200 బైక్‌ ధర అత్యధికంగా రూ .12,000 పెరిగింది. ఈ మార్పుతో, ఈ బైక్ ప్రారంభ ధర రూ .2.21 లక్షల నుండి రూ .2.33 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. ఈ బైక్ హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్, బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200, సుజుకి ఎస్ఎఫ్ 250, యమహా ఆర్ 15 వీ4 వంటి మోడళ్లకు పోటీగా ఉంది.

Which Place Is Known As Land Of Gold Top 10 Largest Gold Producing Countries10
ఈ దేశాలు బంగారానికి పుట్టిళ్లు..!!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన లోహాల్లో బంగారం ఒకటి. బంగారాన్ని వేలాది సంవత్సరాలుగా ఐశ్వర్యానికి, హోదాకు ప్రతిరూపంగా పరిగణిస్తూ వస్తున్నారు. బంగారం మంచి విద్యుత్ వాహకం. దీని ఉపయోగాలు ఎలా ఉన్నా మృదువైన, అరుదైన, సులభంగా ఆకృతులు చేసేందుకు అనువైన ఈ లోహాన్ని ముఖ్యంగా ఆభరణాలలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. డిమాండ్‌ కారణంగా బంగారం విలువ అంతకంతకూ పెరుగుతూ అత్యంత ఖరీదైన లోహంగా మారింది. అందుకే దీన్ని పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తారు. శతాబ్దాలుగా మాంద్యం సమయంలో మంచి పెట్టుబడి మార్గంగా బంగారం కొనసాగుతోంది.ఈ దేశం బంగారు భూమిఘనాను బంగారు భూమి అంటారు. ఈ ప్రదేశం పశ్చిమ ఆఫ్రికాలో ఉంది. వైవిధ్యమైన బంగారు వనరులు, అభివృద్ధి చెందుతున్న వాణిజ్యం కారణంగా అరబ్ వ్యాపారులు ఘనాకు ఆ పేరు పెట్టారు. బంగారం ఈ ప్రాంత అత్యంత ముఖ్యమైన వస్తువుగా మారింది.అంతేకాకుండా జపాన్ లోని సాడో ద్వీపాన్ని కూడా ఎడో కాలంలో బంగారు భూమిగా పిలిచేవాళ్లు. ఎందుకంటే ఈ ప్రదేశం ఆ సమయంలో జపాన్ మొత్తం బంగారు ఉత్పత్తిలో దాదాపు సగం ఉత్పత్తి చేసేది. అపారమైన సంపదకు, బంగారానికి నిలయంగా ఉండే ఇండోనేషియాలోని ఒకప్పటి శ్రీవిజయ నగరాన్ని కూడా బంగారు ద్వీపంగా పరిగణించేశాళ్లు.👉ఇది చదవారా? బంగారం మాయలో పడొద్దు..టాప్ 10 అతిపెద్ద బంగారం ఉత్పత్తి దేశాలువరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇచ్చిన గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే టాప్ 10 దేశాల జాబితా ఇలా ఉంది. దేశం బంగారం ఉత్పత్తి (టన్నులు)1 చైనా 378.22 రష్యన్ ఫెడరేషన్ 321.83 ఆస్ట్రేలియా 293.84 కెనడా 191.95 యునైటెడ్‌ స్టేట్స్‌ 166.76 ఘనా 135.17 ఇండోనేషియా 132.58 పెరూ 128.89 మెక్సికో 126.610 ఉజ్బెకిస్తాన్ 119.6

బిజినెస్ పోల్

Advertisement
Advertisement
Advertisement
 

Business exchange section

Currency Conversion Rate

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 109000.00 2000.00 2.00
Gold 22K 10gm 88800.00 1650.00 1.90
Gold 24k 10 gm 96880.00 1800.00 1.90

Egg & Chicken Price

Title Price Quantity
Chicken (1 Kg skin less) 243.00 1.00
Eggs 64.00 12.00

Stock Action