Samantha
-
సమంత సినిమాలు ఎప్పుడూ చూడలేదు: రాజ్ సోదరి
హీరోయిన్ సమంత గతేడాది రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. తాజాగా 'మా ఇంటి బంగారం' సినిమాతో చాన్నాళ్ల తర్వాత వచ్చి సక్సెస్ అందుకుంది. అయితే సమంత ఓ రోజు రాత్రంతా నిద్రపోకుండా తనకు ఎలాంటి సపర్యాలు చేసిందో రాజ్ సోదరి శీతల్ బయటపెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: సమంత రచ్చ.. రెండు రోజుల్లోనే అన్ని కోట్ల కలెక్షన్)'సమంత-రాజ్ పెళ్లయిన తర్వాత కొన్నిరోజుల తర్వాత వాళ్లింటికి వెళ్లాను. ఓరోజు అర్థరాత్రి వాంతులు, తలనొప్పి కారణంగా నేను మంచం కూడా దిగలేని పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్యామిలీ గ్రూప్లో నా గురించి మెసేజ్ పెట్టగా.. సమంత తాను వస్తున్నట్లు చెప్పింది. మందులు, నీళ్లు తీసుకుని తనే వచ్చింది. దుప్పట్లు లేకపోతే నాపై టవర్స్ కప్పింది. ఆ టైంకి సమంతకి చాలా పనులున్నాయి. ఉదయం షూటింగ్ ఉంది. కానీ రాత్రంతా నిద్రపోకుండా నా ఆరోగ్యాన్ని గమనిస్తూనే ఉంది. అందుకే ఇప్పటికీ బాధగా ఉంది''సమంత సినిమాలు నేను ఎప్పుడూ చూడలేదు. కానీ తర్వాతి రోజు సెట్కి వెళ్లాను. అప్పుడు సమంత చీరలో స్టంట్స్ చేస్తూ నవ్వుతూ కనిపించింది. బ్రేక్ టైంలో నా దగ్గరికి వచ్చి నీ ఆరోగ్యం ఎలా ఉంది? అని అడిగింది. ఆమె ముఖంలోని ఆందోళన నాకు ఇప్పటికీ గుర్తుంది. రాత్రంతా నిద్రపోకుండా ఎలా నటిస్తోందో అనిపించింది. సినిమాలో ఆ సీన్స్ చూసినవాళ్లెవరికీ ఆమె అలసట గురించి తెలీదు. ఆ నవ్వు వెనకున్న సున్నితమైన మనసు గురించి తెలీదు' అని శీతల్ రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Sheetal Nidimoru (@sheetalnidimoru) -
సమంత రచ్చ.. రెండు రోజుల్లోనే అన్ని కోట్ల కలెక్షన్
చాన్నాళ్ల తర్వాత 'మా ఇంటి బంగారం' సినిమాతో వచ్చిన సమంత.. బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తోంది. టాక్ ఓ మాదిరిగా వచ్చినప్పటికీ, స్కూల్స్ కూడా తెరిచేసినప్పటికీ ఫ్యామిలీ ఈ మూవీ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అదంతా కలెక్షన్స్ రూపంలో కనిపిస్తోంది. రెండు రోజుల్లో ఊహించని వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఎన్ని కోట్లు వచ్చాయి?(ఇదీ చదవండి: సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ)సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మా ఇంటి బంగారం'. ఇందులో హీరో ఎవరూ లేరు. నందిని రెడ్డి దర్శకత్వం వహించగా.. సామ్ భర్త రాజ్ నిడిమోరు, స్టోరీ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. విడుదలకు ముందు ఓ మాదిరి హైప్ ఉన్నప్పటికీ థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత మంచి వసూళ్లు రాబడుతోంది. తొలిరోజు రూ.13.15 కోట్ల గ్రాస్ రాగా.. రెండు రోజులకు కలిపి రూ.28 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే రెండో రోజు ఏకంగా దాదాపు రూ.15 కోట్లు వచ్చినట్లే.ఈ నంబర్స్ బట్టి సమంత సినిమా.. తొలి రెండు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేసింది. ఈ సినిమా సక్సెస్ అవడంతో పాటు సమంత జీవితంలోనూ మరో ముందడుగు వేసింది. ప్రస్తుతం ఈమె ప్రెగ్నెన్సీతో ఉంది. శనివారం జరిగిన సక్సెస్ సెలబ్రేషన్లో బేబీ బంప్తో కనిపించింది. ఈ ఏడాది డిసెంబరులోనే బిడ్డకు జన్మనివ్వబోతుందని కూడా మాట్లాడుకుంటున్నారు. గతేడాది డిసెంబరులో దర్శకుడు రాజ్ నిడిమోరుని సమంత పెళ్లి చేసుకుంది.(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్) -
ట్రెండింగ్లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు)
-
సమంత గుడ్ పార్టనర్
-
సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్
హీరోయిన్ సమంత ప్రెగ్నెన్సీతో ఉందనే రూమర్స్ గత రెండు మూడు రోజుల నుంచి వచ్చాయి. అయితే 'మా ఇంటి బంగారం'తో నిన్ననే థియేటర్లలోకి వచ్చిన సామ్.. వరసగా సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ బేబీ బంప్తో కనిపించి పుకార్లని నిజం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు?)చెన్నైకి చెందిన సమంత.. తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ తదితర స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉంది. మధ్యలో మయోసైటిస్ వ్యాధి వల్ల రెండేళ్లు ఇండస్ట్రీకి దూరమైంది. దర్శకుడు రాజ్ నిడిమోరుని సమంత.. గతేడాది డిసెంబరులో పెళ్లి చేసుకుంది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లే.ఇప్పుడు లీడ్ రోల్ చేసి నిర్మాతగా 'మా ఇంటి బంగారం' సినిమాతో వచ్చింది. థియేటర్లలో దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. తొలిరోజు రూ.13.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కూడా వచ్చాయి. మూవీ సక్సెస్ని శనివారం టీమ్ అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో సమంత బేబీ బంప్తో కనిపించింది. ఈమె సన్నిహితులు ప్రెగ్నెన్సీ అని చెప్పారు కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇదిగో రామ్ చరణ్ కూతురు క్లీంకార)Not everyone can make a cake-cutting look like a queen's victory parade... Samantha can 👑🎂❤️🔥✨#Samantha #SamanthaRuthPrabhu #MaaIntiBangaaram pic.twitter.com/bHypABnDKP— Cinewoods (@Cinewoodsoffl) June 20, 2026 -
ఇన్స్టా నుంచి సినిమాల్లోకి.. ఎవరయ్యా సమంత ఫ్రెండ్?
ఈ వీకెండ్ థియేటర్లలో రిలీజైన సినిమాల్లో సమంత 'మా ఇంటి బంగారం'కి పర్లేదనిపించే టాక్ వచ్చింది. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.13 కోట్లకు గ్రాస్ కలెక్షన్స్ సాధించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సరే ఈ విషయం పక్కనబెడితే మూవీలో సమంత అదరగొట్టేసినప్పటికీ ఈమె ఫ్రెండ్ కిరణ్మయి పాత్ర చేసిన నటి కూడా ఆకట్టుకుంది. 'లెట్స్ కమాన్' అంటూ అందరినీ నవ్విస్తోంది. ఇంతకీ ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ)ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా నడుస్తోంది. ఇన్ స్టా, యూట్యూబ్లో తన ప్రతిభ చూపిస్తూ చాలామంది గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలానే 'మా ఇంటి బంగారం'లో సమంత స్నేహితురాలిగా మంజూష ముక్కవిల్లి అవకాశం దక్కించుకుంది. పాతతరం నటీమణులైన సూర్యకాంతం, ఛాయాదేవి, నిర్మలమ్మ రీల్స్ చేస్తూ ఇన్ స్టాలో గుర్తింపు మంజూష చాలానే తెచ్చుకుంది.ఓ రోజు డైరెక్టర్ నందిని రెడ్డి అనుకోకుండా మంజూష రీల్ పడింది. దీంతో ఈమెని పిలిపించి ఆడిషన్ తీసుకుంది. మూడుసార్లు ఆడిషన్ చేసి సమంత ఫ్రెండ్ క్యారెక్టర్కి ఎంపిక చేసింది. నందిని రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రూవ్ చేసుకున్న మంజూష.. ఇప్పుడు పలువురు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది.లాడ్జిలో ఉంటూ తెల్లవారుజామునే వంటలు చేసొచ్చి ఫ్రెండ్ సమంతకు రహస్యంగా చేరవేసి ఆమెను గట్టెక్కించే పాత్రలో మంజుష భలే నటించింది. ఓవైపు అమాయకంగా మరోవైపు గడుసుతనం ప్రదర్శించే సీన్స్లో ఈమె యాక్టింగ్ తెగ నవ్విస్తోంది. ఇదే తొలి సినిమా అయినప్పటికీ చాలా సహజంగా పాత్రలో సెట్ అయిపోయి, అనుభవమున్న నటిలా హావభావాలు పలికించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. హైదరాబాద్లోనే ఉంటున్న ఈమెకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు పలకరిస్తాయేమో చూడాలి?(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు?) View this post on Instagram A post shared by Manjusha Mukkavilli (@manju_kuttilu) -
షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు?
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సమంత లాంగ్ గ్యాప్ తీసుకుని చేసిన సినిమా 'మా ఇంటి బంగారం'. ఈమె భర్త రాజ్ నిడిమోరు కథ అందించగా, సమంత లీడ్ రోల్ చేయడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించింది. ఓ మాదిరి అంచనాలతో నిన్న(జూన్ 19) థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరి తొలిరోజు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయి? సమంత ఎలాంటి మ్యాజిక్ చేసింది?(ఇదీ చదవండి: రెండేళ్ల పాటు నరకం చూశా.. తినాలని ఉన్నా తినలేకపోయా: సమంత)నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్లకే తాను మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డట్లు సమంత బయటపెట్టింది. ఆ టైంలోనే విజయ్ దేవరకొండతో 'ఖుషి' చేసింది. తర్వాత మళ్లీ సినిమాలు చేయడం మానేసింది. గతేడాది వచ్చిన 'శుభం'తో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు 'మా ఇంటి బంగారం'తో హీరోయిన్గా కమ్ బ్యాక్ ఇచ్చింది.'బాషా' టెంప్లేట్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఫస్టాప్ బాగున్నప్పటికీ సెకండాఫ్లో కొన్ని మైనస్లు ఉన్నాయని చూసినోళ్లు చెబుతున్నారు. ఇలా టాక్ సంగతి పక్కనబెడితే తొలిరోజు రూ.13.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు పోస్టర్ వైరల్ అవుతుంది. సమంతకు ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే ఇంకా ఈమెకు కాస్తోకూస్తో మార్కెట్ బాగానే ఉందని చెప్పొచ్చు. వీకెండ్ నిలబడిన దానిబట్టి లాభాలు రావడం లేనిది క్లారిటీ వస్తుంది.'మా ఇంటి బంగారం' విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో స్వర్ణ(సమంత) అనాథాశ్రమంలో పెరుగుతుంది. ఓ పెద్దింటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. ఇంట్లో చెప్పకుండా వివాహం చేసుకున్నాడని అనిరుధ్ని అతడి కుటుంబం దూరం పెట్టేస్తుంది. తన కారణంగానే దూరమైన కుటుంబాన్ని తన భర్తకు మళ్లీ తిరిగివ్వాలనేది స్వర్ణ కోరిక. ఇంతలో ఆ ఇంట్లో ఓ శుభకార్యం కలిసొస్తుంది. అలా తొలిసారి అత్తారింట్లోకి అడుగు పెడుతుంది స్వర్ణ. అత్త ఇంటి ఆచారాలు, కట్టుబాట్లు ఏమాత్రం తెలియని స్వర్ణ ఎలాగైనా అన్నీ నేర్చేసుకుని అందరి ప్రేమని పొందాలనుకుంటుంది. అందుకోసం ఏం చేసింది? ఆమెని వెంటాడిన గతం వల్ల ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంది? ఇంతకీ ఆమె గతమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ) -
తమిళంలో మరిన్ని చిత్రాల్లో నటించాల్సింది : సమంత
నటి సమంత. ఈ పేరే ఒక సంచలనం. కథానాయకిగా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా, అగ్ర కథానాయికిగా రాణిస్తుంది మాత్రం టాలీవుడ్ లోనే. అక్కడ స్టార్ హీరోలందరితోనూ జత కట్టేశారనే చెప్పాలి. కాగా వెబ్ సిరీస్ ద్వారా ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం అయిన సమంత ఇటీవల నిర్మాతగానూ అవతారమెత్తారు. తొలి ప్రయత్నంగా శుభం అనే చిత్రాన్ని నిర్మించారు. మలి ప్రయత్నంగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై తన భర్త రాజ్ నిడిమోరు తో కలిసి నిర్మించి, నాయకిగా నటించిన చిత్రం మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలోనూ ఎంగళ్ తంగం పేరుతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల సామ్ తన చిత్ర టీమ్ తో చెన్నైలో సందడి చేశారు. ఈ సందర్భంగా నటి సమంత మాట్లాడుతూ ‘‘చెన్నై తనకు ఎప్పుడూ ప్రత్యేకమే. సత్యం ధియేటర్, ఈ పక్కనే నేను చదివిన కళాశాల ఇవన్నీ మంచి మెమోరీస్. తమిళంలో మరిన్ని చిత్రాలు చేసి ఉండాల్సింది. అయినా ఇంకా చాలా కాలం ఉంది. తమిళంలో మంచి కథా చిత్రాల కోసం ఎదురు చూస్తున్నాను. ఇక ఎంగళ్ తంగం చిత్రం విషయానికి వేస్తే చిత్రాన్ని నిర్మించడం, విడుదల చేయడంలో నిర్మాతల కష్టం తెలీసి వచ్చింది. అయినా మంచి చిత్రం చేశారనే సంతోషం కలిగింది. ఇది యాక్షన్ తో కూడిన అనుబంధాలు మేళవించిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది. చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో ప్రేక్షకులను అలరిస్తాయి. ఎలాంటి కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నారని అడుగుతున్నారని, అయితే మంచి జనరంజకమైన కథా చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు పాటలు సన్నివేశాల్లో నటించడం కంటే యాక్షన్ సన్నివేశాల్లో నటించడమే ఈజీగా ఉందని అన్నారు. ఎంగళ్ తంగం చిత్రం బాగా వచ్చిందని సమంత చెప్పారు. కాగా ఈమె పనిలో పనిగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో దిగిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
రెండేళ్ల పాటు నరకం చూశా.. తినాలని ఉన్నా తినలేకపోయా
సమంత ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా వరస సినిమాలు చేసింది. కానీ విడాకులు, మయోసైటిల్ వ్యాధి దెబ్బకు కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. చివరగా 'ఖుషి' మూవీలో కనిపించింది. చాన్నాళ్ల తర్వాత 'మా ఇంటి బంగారం'తో వచ్చింది. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. అయితే కొన్నాళ్ల క్రితం సామ్ బాగా బక్కచిక్కిపోవడం చూసి అంతా షాకయ్యారు. అయితే దాని వెనకున్న కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈమె బయటపెట్టింది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా 'అతిరథి' తెలుగు రివ్యూ)'ఎందుకు అంతలా బరువు తగ్గిపోయావని.. చాలామంది ఎప్పుడూ నన్ను అడుగుతుంటారు. అవతలి వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ పూర్తిగా తెలియదు. నేను కావాలని డైటింగ్ చేసి బరువు తగ్గలేదు. నాకు తినాలని ఉన్నా కూడా తినలేని పరిస్థితి. అందుకే తినలేకపోయాను. అనారోగ్యం కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆ రెండేళ్లు నా తిండిపై ఎన్నో కండీషన్స్ ఉన్నాయి. ఏం తిన్నా సరే నా కడుపు చెడిపోయేది. మయోసైటిస్ మళ్లీ ఎక్కువయ్యేది. అందుకే రెండేళ్ల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒకే రకమైన ఎలాంటి రుచి లేని ఆహారాన్ని తిన్నా. ఆ నరకు చూసిన తర్వాత నా డైట్లో చేర్చుకోవడానికి డాక్టర్స్ పర్మిషన్ ఇచ్చిన మొదటి స్వీట్ ఐటమ్.. పంచదార, డెయిరీ లేని జెలాటో ఐస్క్రీమ్. ఆ టైంలో దీనికోసం ఎంతో ఎదురుచూసేదాన్ని. అందుకే దాని పేరుని నా పిల్లికి పెట్టుకున్నాను''కెరీర్లో పీక్ స్టేజీలో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నా కెరీర్ ముగింపు చూశాను. అది నన్ను చాలా మార్చింది. ఒకవేళ మళ్లీ ఇండస్ట్రీకి వస్తే నా పాత పద్ధతులను, లైఫ్ స్టైల్ను పూర్తిగా మార్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఆహారం పట్ల నాకున్న ఆలోచనా విధానమే పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆ కష్టమైన ఫేజ్ నుంచి బయటపడి, కాస్త కంఫర్టబుల్గా తినగలుగుతున్నాను' అని సమంత చెప్పుకొచ్చింది.నందిని రెడ్డి దర్శకత్వం వహించిన 'మా ఇంటి బంగారం' సినిమాలో సమంతనే మెయిన్ లీడ్. ఈమె భర్త రాజ్ నిడిమోరు.. స్టోరీ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. అయితే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. మరి బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు నిలబడుతుందనేది చూడాలి?(ఇదీ చదవండి: సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ) -
మా ఇంటి బంగారం రివ్యూ.. సమంత ఖాతాలో హిట్ పడిందా?
టైటిల్: మా ఇంటి బంగారంనటీనటులు: సమంత, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గౌతమి తదితరులుదర్శకత్వం: నందిని రెడ్డినిర్మాణ సంస్థ: ట్రాలాలా పిక్చర్స్మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ నారాయణన్సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్విడుదల తేదీ: 19 జూన్ 2026టాలీవుడ్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో యాంకర్ శ్రీముఖి కీలక పాత్రలో కనిపించింది. అభిమానుల అంచనాల మధ్య జూన్ 19న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. సామ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.కథేంటంటే..స్వర్ణ(సమంత) , అనిరుధ్ ప్రేమ వివాహం చేసుకుంటారు. ఇది అనిరుధ్ ఫ్యామిలీ కి నచ్చకపోవడంతో కొన్నాలపాటు దూరంగా ఉంటారు. అయితే అనిరుద్ చెల్లెలు పెళ్లి ఫిక్స్ అవ్వడంతో స్వర్ణ, అనిరుద్ ఇంటికి తిరిగి వస్తారు. సాంప్రదాయ కుటుంబం కావడంతో వారికి నచ్చేలా ఉండేందుకు స్వర్ణ ప్రయత్నిస్తుంది. అదే సమయంలో స్వర్ణ గురించి జైల్లో ఉన్న కరుణ (గుల్షన్ దేవయ్య) ఆరా తీస్తాడు. ఆమె కోసమే జైలు నుంచి తప్పించుకొని వస్తాడు. అసలు స్వర్ణకు జైల్లో ఉన్న కరుణకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్వర్ణ గతం ఏంటి? ఝాన్సీ ఎవరు ? కరుణ నుంచి తన ఫ్యామిలీకి ఆపద ఉందని తెలిసిన తర్వాత స్వర్ణ ఏం చేసింది? చివరకు తన ఫ్యామిలీని ఎలా రక్షించుకుంది? అన్నదే మిగతా కథ.ఎలా ఉందంటే..ఓ బేబీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందిని రెడ్డి , సమంత కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో మా ఇంటి బంగారంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి . అయితే ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేదని చెప్పాలి. అలా అని తీసిపారేసే సినిమా ఏమి కాదు. ఓ బేబీ మాదిరే ఇది కూడా కుటుంబ నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్.సమంత లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక సంప్రదాయ కుటుంబంలోకి కొత్త కోడలిగా అడుగుపెడుతుంది. ఇంట్లో జరిగే రోజువారీ ఫ్యామిలీ డ్రామా, శ్రీముఖితో వచ్చే సరదా సన్నివేశాలు, సున్నితమైన హాస్యంతో ఫస్టాఫ్ సాఫీగా సాగిపోతుంది. అయితే ఇంటర్వెల్ సమయంలో సమంత గతానికి సంబంధించిన వ్యక్తులు ఎంటర్ అవ్వడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.అసలు సమంత ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్తో ఇంటర్వెల్ ట్విస్ట్ పడుతుంది. సెకండాఫ్లో ఆమె ఫ్లాష్బ్యాక్, గుల్షన్ దేవయ్య పాత్రతో ఆమెకు ఉన్న పరిచయం, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె చేసే పోరాటం చుట్టూ కథ నడుస్తుంది. ఫస్టాఫ్ కామెడీ సన్నివేశాలతో సరదాగా సాగిన సెకండాఫ్ మాత్రం కొంతమేర సాగదీసినట్లుగా అనిపిస్తుంది. దానికి తోడు విలన్ ట్రాక్ బలంగా లేకపోవడంతో చాలా సన్నివేశాలు అనవసరంగా పెట్టారన్న ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనం చాలావరకు అతడు సినిమాను గుర్తు చేస్తుంది. సెకండ్ హాఫ్ కథను ఇంకాస్త బలంగా రాసుకుని.. మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే..సమంత వన్ ఉమెన్ షో చూపించింది. ఈ మూవీలో కొత్త కోడలి పాత్రలో.. అలాగే యాక్షన్ సీక్వెన్స్లలో సమంత అద్భుతంగా నటించింది. శ్రీముఖి తన పాత్రలో ఒదిగిపోయింది. గుల్షన్ దేవయ్య మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం బాగుంది. బీజీఎం ఈ సినిమాకు ప్లస్. ఎడిటింగ్పై మరింత దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
సమంతకు ప్రెగ్నెన్సీ.. అందుకే అలా కనిపించారా?
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ 19 నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది. సమంత యాక్షన్ సీన్స్లో అదరగొట్టేసిందని సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీ సామ్ హిట్ కొట్టేసిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.ఇదే సమయంలో సమంతపై సోషల్ మీడియాలో రూమర్స్ పెద్దఎత్తున వైరలవుతున్నాయి. మా ఇంటి బంగారం ప్రమోషన్ల తర్వాత సామ్పై ఓ టాక్ నెట్టింట హల్చల్ చేస్తోంది. సమంత త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని టాక్ వినిపిస్తోంది. ఆమెను చూస్తుంటే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు తెలుస్తోందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇదే నిజమైతే సమంత ఫ్యాన్స్కు ఆనందం డబుల్ అని పోస్ట్ చేస్తున్నారు. అయితే వీటిపై సమంత టీమ్ నుంచి ఎలా స్పందన రాలేదు.చీరకట్టు వల్లే..ముఖ్యంగా మా ఇంటి బంగారం మూవీ ప్రమోషన్లకు సమంత చీరకట్టులోనే హాజరయ్యారు. ఏ ఈవెంట్కు నిండు చీరలో అందంగా కనిపించారు. సినీ గ్లామర్ ప్రపంచంలో ఈవెంట్స్కు చీరలో వెళ్లడం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ సామ్ సంప్రదాయబద్ధంగా శారీలో కనిపించడం ప్రెగ్నెన్సీ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. కొందరైతే నెటిజన్ ఏకంగా సామ్ బేబీ బంప్తో ఉందని.. అందుకే కనిపించకుండా శారీలోనే ప్రమోషన్లలో పాల్గొన్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ రూమర్స్పై సమంత కానీ.. ఆమె టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో సామ్- రాజ్ నిడిమోరు వివాహం జరిగింది. -
సమంత మా ఇంటి బంగారం.. ఆడియన్స్ రివ్యూ
టాలీవుడ్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో వచ్చిన సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమా ఇవాళే థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే ప్రీమియర్స్ ప్రదర్శించడంతో ఆడియన్స్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సమంత మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఫస్ట్ హాఫ్ తొలి గంట అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది మాస్ ఎలిమెంట్స్తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అదిరిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటంర్వెల్ ట్విస్ట్ క్రేజీగా ఉందంటున్నారు. ఈ సారి సమంత యాక్షన్తో అదరగొట్టేసిందని ట్విటర్ వేదికగా ప్రశంసిస్తున్నారు. #MaaIntiBangaaram Premier review from 🇬🇧🇬🇧🇬🇧First half:@Samanthaprabhu2 nailed it 🔥🔥🔥Bgm 🔥🔥🔥Story plot is nice and solid base for second halfSimply a good first half with decent start and ended interval with crazy twist.Waiting for second half @PrathyangiraUS pic.twitter.com/FmkOFHZDtQ— UK X roads (@UKTFI) June 18, 2026 #MAAiNTiBangaaram is a MEE INTLO vallatho happy ga velli chudachu type of film ❤️ An Engaging Entertainer with Goof action blocks and brilliant score 👌 @Samanthaprabhu2 truly deserves the lady Super Star tag. She literally made a Big BANG with this Bangaram 🔥 pic.twitter.com/Pr8nXDQTqn— Dileep Kumar Kandula (@TheLeapKandula) June 18, 2026 #MaaIntiBangaaram | Interval Samantha, Friend Character, Temple Seq, Pre Interval Fyt, Cooking Comedy 👍Its pretty Good so far!— Christopher Kanagaraj (@Chrissuccess) June 18, 2026 #MaaIntiBangaaram review 🇬🇧🇬🇧 is complete family entertainer blended with mass elements.@Samanthaprabhu2 esari mamuluga ledu uthiki aresindi 🔥🔥🔥Pre interval to climax 🔥🔥🔥A good movie I'm theaters after long time.Overall: 3/5 A blockbuster bomma from @rajndk team. pic.twitter.com/AXbiZu6YpR— UK X roads (@UKTFI) June 18, 2026 Unexpected banger 💥 from #samanthaBest film so far from Tollywood in this year 🔥 ⭐️ ⭐️ ⭐️ ⭐️ Summer winner sammmmmmm @Samanthaprabhu2 #maaintibangaaram #samantharuthprabhu #tollywood #telugu #telugufilm #vennelakishore #sreemukhi #london #maaintibangaram pic.twitter.com/kPnvRE4Kts— Jaswanth (@alwayssJaswanth) June 18, 2026 -
తిరుమల శ్రీవారి సేవలో 'మా ఇంటి బంగారం' టీమ్ (ఫోటోలు)
-
ముఖ్యమంత్రిగా విజయ్.. ముందే ఊహించిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత చాన్నాళ్ల తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా 'మా ఇంటి బంగారం'. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. దీన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కోసం బుధవారం చెన్నై వెళ్లిన సమంత.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ని కూడా కలిసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: హీరోయిన్-సీఎం విజయ్.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు)'చెన్నై చేరుకోగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యమంత్రి విజయ్ని కలిసే అవకాశం రావడం మరింత ప్రత్యేకంగా అనిపించింది. ఈయన హీరోగా మాత్రమే పరిమితం కావాల్సిన వ్యక్తి కాదు, ఈయన వ్యక్తిత్వం, ప్రజలతో ఏర్పడిన అనుబంధం చూసిన తర్వాత విజయ్ మరింత పెద్ద బాధ్యతలు అందుకుంటారని అనిపించేది. కెరీర్ పరంగా పీక్లో ఉన్నప్పుడు నటన వదిలేసి మరిన్ని సవాళ్లు, బాధ్యతలున్న కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ధైర్యంతో కూడిన పని''సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, విజయ్ నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తోంది. జీవితంలో ఒక దశలో ప్రతి ఒక్కరికీ తమకోసం మాత్రమే కాకుండా సమాజం కోసం కూడా ఏదైనా చేయాలనే పిలుపు వస్తుంది. ఆ పిలుపునకు స్పందించే వారు చాలా అరుదు.విజయ్ ఇప్పటికే ఆయనను విశ్వసిస్తున్న వారిని కూడా ఆశ్చర్యపరుస్తున్నారనే నమ్మకం ఉంది. ఆయన విజయం కేవలం పదవి వల్ల కాకుండా ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధత, స్పష్టమైన ఉద్దేశ్యంతోనే సాధ్యమవుతుంది' అని సమంత రాసుకొచ్చింది.యువతకు విజయ్ గెలుపు ఒక ప్రేరణగా నిలవాలని, జీవితంలో ప్రారంభంలో కలలు కన్న దానికంటే ఎంతో పెద్ద లక్ష్యాలను సాధించే అవకాశాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయని సమంత చెప్పుకొచ్చింది. సమంత పోస్ట్ బట్టి చూస్తే విజయ్తో కలిసి నటిస్తున్న టైంలోనే ముఖ్యమంత్రి లాంటి పెద్ద పొజిషన్కి వెళ్తారని ఊహించింది. ఇప్పుడు అది నిజమవడంతో ఆయన్ని కలిసి ఆనందం వ్యక్తం చేసింది. విజయ్-సమంత.. కత్తి, మెర్సల్, తెరి మూవీలో నటించారు.(ఇదీ చదవండి: ముఖ్యమంత్రి విజయ్ ని డార్లింగ్ అని పిలవడం నా అదృష్టం) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
నా గతంలో నేను చాలా బాధ అనుభవించాను, కానీ... రాజ్ నా లైఫ్ లోకి వచ్చాక...!
-
శ్రీముఖి నీ పెళ్లెప్పుడు?.. యాంకర్ ఫుల్ క్లారిటీ..!
టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి అందరికీ పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ను సొంతం చేసుకుంది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో వస్తోన్న మా ఇంటి బంగారం ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తళుక్కున మెరిసింది. పట్టుచీరలో కనిపించి తన గ్లామర్తో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్కు హాజరైన శ్రీముఖిని మరో స్టార్ యాంకర్ సుమ తన ప్రశ్నలతో చిక్కుల్లో పడేసింది.మామూలుగా బంగారం ఎప్పుడు కొంటారని శ్రీముఖిని సుమ ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ పెళ్లిళ్ల సమయంలో బంగారం ఎక్కువగా కొంటారని చెప్పింది. మరి నీ పెళ్లెప్పుడు అంటూ సుమ మరో ప్రశ్న వేసింది. దీనికి శ్రీముఖి సరదాగా సమాధానం ఇచ్చింది. సమంతను చూపిస్తూ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు సమంత పెళ్లి జరిగింది. ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రిలీజై పెద్ద బ్లాక్బస్టర్ అయ్యాక నా పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నా అని నవ్వుతూ శ్రీముఖి కామెంట్స్ చేసింది. దీంతో శ్రీముఖి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సమంత నటించిన 'మా ఇంటి బంగారం' జూన్ 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీముఖ కీలక పాత్ర పోషించింది. -
ఆ టైమ్లో నాలో అహంకారం పెరిగింది: సమంత షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారంతో ప్రేక్షకులను పలకరించనుంది. తన సొంత బ్యానర్లో ఈ మూవీని నిర్మించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇటీవలే హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. రిలీజ్ టైమ్ దగ్గర పడడంతో సామ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత తన సినీ ప్రయాణంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఒక సమయంలో స్టార్డమ్ అనే మత్తుకు బానిసయ్యానని సమంత చెప్పుకొచ్చింది. తన సినిమాలు వరుస హిట్స్ కావడంతో నాలో అహంకారం కూడా మెల్లగా పెరుగుతూ వచ్చిందని సామ్ పేర్కొంది. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఓ అమ్మాయికి స్టార్డమ్ దక్కడం నాకే ఆశ్చర్యంగా అనిపించిందని వెల్లడించింది. ఓకే ఏడాదిలో ఐదు సినిమాలు చేశా.. అన్నీ హిట్ కావడంతో నాది ‘గోల్డెన్ లెగ్’ అని అందరు అనేవారని గుర్తు చేసుకుంది. అలా నాపై ఒత్తిడి కూడా పెరిగిందని చెప్పుకొచ్చింది. దీంతో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలనుకున్నా.. నటిగా నా కెరీర్లో ముగింపు ఉండదనుకున్నానని సామ్ తెలిపింది.అయితే అనారోగ్యం, సినిమాలకు బ్రేక్ రావడం నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసిందని సమంత తెలిపింది. అప్పుడే తిరిగి సినిమాల్లోకి వస్తే కొన్ని పాత అలవాట్లు మార్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నానని వెల్లడించింది. విరామం తర్వాత తన జీవితం, కెరీర్ను కొత్త కోణంలో చూసేలా చేసిందని పేర్కొంది. కాగా.. 2022 నుంచి సామ్ మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. -
పెళ్లయిపోయింది.. మిగిలింది అదొక్కటే
సాధారణంగా హీరో లేదా హీరోయిన్లకు పెళ్లయిన తర్వాత అదృష్టం కూడా కలిసొస్తుందని అంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే పలువురు హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత హిట్స్ కొడుతుంటారు. జీవితంలోనూ సంతోషాన్ని పొందుతూ ఉంటారు. ఇప్పుడు రష్మిక, సమంత కూడా పెళ్లి తర్వాత సక్సెస్ అందుకుంటారా? ఒకేవారం రిలీజ్ అవుతున్న వీళ్ల సినిమాలపై హైప్ ఎలా ఉంది?(ఇదీ చదవండి: విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం)సమంత గురించి మాట్లాడుకుంటే తెలుగులో ఒకప్పుడు మహేశ్ బాబు, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. స్టార్డమ్ అనుభవించింది. కానీ హీరో నాగచైతన్యతో విడాకులు, తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడటం లాంటివి జరిగేసరికి నటించడం చాలావరకు తగ్గించేసింది. హీరోయిన్గా అయితే చివరగా విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి'లో కనిపించింది. ఇది ఫ్లాప్ అయింది. దీని తర్వాత ఓ సిరీస్ చేసింది గానీ ఇదీ వర్కౌట్ కాలేదు.ఇక గతేడాది 'శుభం' మూవీతో నిర్మాతగా మారింది. కంటెంట్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ బడ్జెట్ పరంగా సేఫ్ అయిపోయింది. గతేడాది చివరలో డైరెక్టర్ రాజ్ నిడిమోరుని రెండో పెళ్లి చేసుకుంది. ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు లీడ్ రోల్ చేసి నిర్మాతగా 'మా ఇంటి బంగారం' అనే సినిమాని పూర్తి చేసింది. పలుమార్లు వాయిదా పడి ఈ వారమే ఇది థియేటర్లలోకి రానుంది. మార్కెట్లో అయితే దీనిపై పెద్దగా హైప్ అయితే లేదు. సమంత కోసమే ఈ మూవీకి ఆడియెన్స్ రావాలి. అలానే కంటెంట్ కూడా అదిరిపోయిందనే టాక్ రావాల్సి ఉంటుంది. 'పెద్ది' కూడా నెమ్మదించింది కాబట్టి పాజిటివ్ టాక్.. సమంత 'బంగారం'కి చాలా కీలకం. మరి పెళ్లి సామ్కి హిట్ రూపంలో అదృష్టాన్ని తీసుకొస్తుందేమో చూడాలి?రష్మిక విషయానికొస్తే కెరీర్ పరంగా పీక్ స్టేజీలో ఉంది. ఇలాంటి టైంలో పెళ్లి గురించి సాధారణంగా హీరోయిన్లు ఆలోచించారు. కానీ ఈమె ఆలోచించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసింది. ఇది జరగడానికి ముందే హిందీలో 'కాక్టెయిల్ 2' అనే మూవీ చేసింది. ఓ కుర్రాడు ఇద్దరమ్మాయిలని ప్రేమించడం, వీళ్ల ముగ్గురు కలిసే ఉండటం అనే బోల్డ్ కాన్సెప్ట్తో తీసిన ఈ సినిమాకి ప్రస్తుతానికి హిందీలో మాత్రమే బజ్ ఉంది. తెలుగులో రిలీజ్ చేయట్లేదు. ఇప్పటివరకు యాక్టింగ్ ఓరియెంటెడ్ పాత్రలతో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. ఇందులో పూర్తిగా గ్లామర్ షో చేసింది. పెళ్లి తర్వాత ఈమె నుంచి వస్తున్న తొలి చిత్రమిదే. మరి సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్) -
శ్రీలీల బర్త్ డే సెలబ్రేషన్స్.. శ్రీదేవి క్యూట్నెస్
హీరోయిన్ శ్రీలీల బర్త్ డే సెలబ్రేషన్స్లంగా ఓణీలో ముద్దుగుమ్మలా శ్రీదేవికాక్టెయిల్ 2 కోసం కృతిసనన్ ఇలాపిల్లలు పుట్టాక కూడా ప్రణీత గ్లామర్పసుపు చీరలో సమంత సోయగాలుఅందాల బొమ్మలా యాంకర్ శ్రీముఖి View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Siri (@srideviactor) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13) View this post on Instagram A post shared by Sonam Bajwa (@sonambajwa) View this post on Instagram A post shared by Rajisha Vijayan (@rajishavijayan) View this post on Instagram A post shared by Meenakshi Dixit (@meenakshidixit) -
‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్లో మెరిసిన శ్రీముఖి (ఫోటోలు)
-
సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)
-
'ఫస్ట్ టైమ్ ఇలా చూస్తున్నా'.. సమంత భర్త ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సామ్ తన సొంత బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. ఈ సినిమాలో సమంత గృహిణి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్లో యాక్షన్ సన్నివేశాల్లోనూ సామ్ నటన ఆకట్టుకుంది.తాజాగా ఈ మూవీ రిలీజ్కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు సామ్ భర్త రాజ్ నిడిమోరు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ నిడిమోరు ఆసక్తికర కామెంట్స్ చేశారు. హిందీలో చాలా సినిమాలు చేశానని.. కానీ ఈ మూవీకి వస్తున్నంత రెస్పాన్స్ ఎక్కడా చూడలేదన్నారు. తిరుపతి నుంచి నాకు ఫోటోలు వస్తున్నాయి.. మా అమ్మ కాలేజీ దగ్గర హోర్డింగ్స్ పెట్టారని తెలిసింది. నేను ఫస్ట్ టైం ఇంత హడావిడి చూస్తున్నానని రాజ్ నిడిమోరు ఆనందం వ్యక్తం చేశారు. . -
క్యూట్ పూజా స్మైల్.. సమంత చీరకట్టు
నవ్వుతూ మాయ చేస్తున్న పూజా హెగ్డేపట్టుచీరలో అందంగా హీరోయిన్ సమంతదేవకన్యలా మెరిసిపోతున్న దివ్యభారతిపింక్ డ్రస్లో గ్లామరస్గా శిల్పాశెట్టిపట్టుచీరలో మెప్పించేస్తున్న శివానీచెన్నై షూటింగ్ జ్ఞాపకాలతో మాళవిక View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sai Dhanshika (@saidhanshika) -
రాజ్ నా లైఫ్ లోకి వచ్చిన తరువాత జరిగింది ఇదే...
-
అప్పుడు మా ఇంట్లోవాళ్లే నన్ను ట్రోల్ చేశారు: సమంత
సమంత.. వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు నిర్మాతగాను రాణిస్తోంది. ఆమె హీరోయిన్గా నటిస్తూ నిర్మించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సమంత. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను కూడా పంచుకుంటున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కోసం ఓ అభిమాని గుడి కట్టిన విషయం తెలిసిన తర్వాత ఏం జరిగిందో వివరించింది.ఆంధ్రప్రదేశ్ని బాపట్లకు చెందిన ఓ వీరాభిమాని సమంత కోసం 2023లో ఓ గుడి కట్టిన విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం ఆమె పుట్టినరోజు నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదానంతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే గుడి కట్టారనే విషయం తెలిసి తాను కూడా షాకయ్యానంటోంది సమంత.‘గుడి కట్టించుకునేంత అర్హత నాకు లేదు. నేనేం స్పెషల్ కాదు. ఇంతమంది అభిమానుల ప్రేమను పొందే అదృష్టం ఆ దేవుడు నాకిచ్చాడు. అంతేకాని నేను అంత గొప్పదాన్ని ఏం కాదు. ఇలా గుడి కట్టడం కూడా నాకు నచ్చదు. అయితే ఆ అభిమానితో నేను మాట్లాడాను. నా ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆయన ఆ గుడి కట్టి పూజలు చేశాడట. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడట. ఈ విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యా. అయితే గుడి కట్టిన విసఁం తెలిసిన తర్వాత మాత్రం మా ఇంట్లోవాళ్లు, చుట్టూ ఉన్నవాళ్లు నవ్వారు. నీకోసం గుడి కట్టారట అంటూ ఇంట్లో వాళ్లే ట్రోల్ చేశారు(నవ్వుతూ..)’ అని సమంత చెప్పుకొచ్చింది. -
సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ HD స్టిల్స్
-
పెళ్లి తర్వాత ఆ మూవీస్ పైనే ఫోకస్
-
సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
శృతి హాసన్ టు పూజ హెగ్డే... ‘స్పెషల్’ స్పెషలిస్ట్గా సీనియర్ భామలు
ఒకప్పుడు కేవలం ఐటెమ్ సాంగ్స్ కోసమే ప్రత్యేకంగా కొందరు డ్యాన్సర్లు ఉండేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్లో మెరుస్తూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్తో పాటు సౌత్, నార్త్ సినిమాలలో సీనియర్ మోస్ట్ స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్కు ‘కేరాఫ్’గా నిలుస్తున్నారు. వరుస అవకాశాలతో బిజీగా ఉంటూనే, కేవలం మూడు నాలుగు నిమిషాల పాటతో సినిమా స్థాయిని మార్చేయగల సత్తా ఈ సీనియర్ హీరోయిన్లకు ఉంది. అందుకే నిర్మాతలు సైతం కోట్ల రూపాయలు కుమ్మరించి మరీ ఈ భామలను స్పెషల్ సాంగ్స్ కోసం ఎంచుకుంటున్నారు.‘పెద్ది’ హాసన్ మాస్ స్టెప్పులుటాలెంట్, గ్లామర్ కలబోసిన శృతి హాసన్ ఇటు మెయిన్ లీడ్ రోల్స్ చేస్తూనే, అటు స్పెషల్ సాంగ్స్లోనూ అదరగొడుతోంది. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ చిత్రంలో శృతి హాసన్ ప్రత్యేక పాటకు రామ్ చరణ్తో కాలు కదిపింది. గతంలో మహేశ్ బాబు ‘ఆగడు’ సినిమాలో ‘జంక్షన్ లో..’ అంటూ మాస్ స్టెప్పులేసిన శృతి, ఇప్పుడు చరణ్తో స్టెప్పులేయబోతుంది. నాని ‘హాయ్ నాన్న’ చిత్రంలోనూ ఓ స్పెషల్ అప్పియరెన్స్తో ప్రేక్షకులను అలరించింది.‘స్పెషల్ సాంగ్స్’ స్పెషలిస్ట్గా తమన్నామిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కెరీర్ ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చుట్టూనే తిరుగుతోంది. కేవలం పాట కోసమే థియేటర్లకు వచ్చేలా చేయగల క్రేజ్ తమన్నా సొంతం. జై లవకుశ: ‘స్వింగ్ జరా..’ అంటూ ఎన్టీఆర్తో పోటీపడి డ్యాన్స్ చేసింది. అలాగే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేశ్ బాబుతో కలిసి ‘డాంగ్ డాంగ్..’ అంటూ ఆర్మీ బ్యాక్డ్రాప్లో దుమ్మురేపింది. రజనీకాంత్ ‘జైలర్’లో ‘కావాలయ్యా..’ పాట దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. అలాగే హిందీ మూవీ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కీ రాత్’ అంటూ బాలీవుడ్ను కూడా షేక్ చేసింది.ఒక్కసారే..రికార్డులు బ్రేక్స్టార్ హీరోయిన్ సమంత కెరీర్లోనే మైలురాయిగా నిలిచే స్పెషల్ సాంగ్ ‘పుష్ప: ద రైజ్’ లోని ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’. అల్లు అర్జున్ సరసన సమంత చేసిన ఈ ఊరమాస్ సాంగ్ కేవలం టాలీవుడ్లోనే కాదు, అంతర్జాతీయంగా ట్రెండ్ అయింది. యూట్యూబ్లో భారీ వ్యూస్తో రికార్డులు సృష్టించింది. సమంత గ్లామర్, ఎక్స్ప్రెషన్స్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాయి.‘మొనికా’ హంగామాబుట్టబొమ్మ పూజా హెగ్డే సైతం స్పెషల్ సాంగ్స్తో థియేటర్లలో పూనకాలు తెప్పించింది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన ‘కూలీ’ చిత్రంలో ‘మొనికా..’ అనే స్పెషల్ సాంగ్లో పూజా హెగ్డే తన అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు, గ్లామర్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అంతకు ముందు రామ్ చరణ్ ‘రంగస్థలం’లో ‘జిగేల్ రాణి’గా పూజ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 2’ చిత్రంలోనూ స్పెషల్ సాంగ్తో మెరిసింది. వీళ్లు మాత్రమే కాదు.. శ్రీలీల, మృణాల్తో పాటు మరికొంత మంది యంగ్ హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. -
సమంతని ఇలా చూసుండరేమో.. హన్సిక జీరో సైజ్!
షాకింగ్ లుక్లో కనిపించిన సమంతనడుము అందాలతో హన్సిక పోజులుబీచ్లో నోరా ఫతేహి గ్లామరస్ డ్యాన్స్పూల పక్కన మెరిసిపోతున్న నయనతారకళ్లద్దాలతో రెచ్చగొట్టేస్తున్న కేతిక శర్మకొత్త హెయిర్ స్టైల్తో ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Savleen kaur manchanda (@savleenmanchanda) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) -
హీట్ పెంచిన పూజా హెగ్డే.. తమన్నా కూడా తగ్గట్లే!
గ్లామర్ హీట్ పెంచేసిన పూజా హెగ్డేబక్కచిక్కిపోయిన హీరోయిన్ సమంతఒంపుసొంపులు చూపిస్తున్న తమన్నామెరుపుతీగలా మెరిసిపోతున్న రాశీ సింగ్పట్టుచీరలో నిండుగా మృణాల్ ఠాకుర్ఎర్రగులాబీ అంత అందంగా కృతిశెట్టి View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) -
లుక్ మార్చిన సమంత.. గ్లామర్ డోస్ పెంచిన భాగ్యశ్రీ
స్టైలిష్ లుక్లో మెరుపుతీగలా సమంతపెళ్లి వీడియో షేర్ చేసిన మెహ్రీన్గ్లామర్ డోస్ పెంచేసిన భాగ్యశ్రీ బోర్సేకాంచీపురం ట్రిప్లో బిందుమాధవిడార్క్ చాక్లెట్లా మెరిసిపోతూ ఈషారెబ్బాపద్ధతిగా చీరకట్టులో అందంగా మానస View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
అనుకున్నదే అయింది.. సమంత బంగారం వాయిదా..!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సామ్ సొంత బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మే 15న విడుదల కానుందని ప్రకటించారు.ఈ సినిమాలో సమంత గృహిణి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్లో యాక్షన్ సన్నివేశాల్లోనూ సామ్ అదరగొట్టేసినట్లు తెలుస్తోంది. జూన్కు వాయిదా..అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా వాయిదా పడనుందని వార్తలొచ్చాయి. ముందుగా ఊహించినట్లుగానే మా ఇంటి బంగారాన్ని పోస్ట్పోన్ చేశారు. ఈ మూవీని ఏకంగా నెల రోజుల పాటు వాయిదా వేశారు. వచ్చేనెల అంటే జూన్ 19న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. -
సమంత 'బంగారం'.. ఇలా అయిందేంటి?
సమంత ఒకప్పుడు స్టార్ హీరోయినే కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎంతలా అంటే ఈమె సినిమా మరో రెండు వారాల్లో రిలీజ్ అవుతుందనే సంగతే జనాలకు తెలియనంతగా! కొన్నిరోజుల క్రితం కమెడియన్ వెన్నెల కిశోర్తో ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఒకటి రిలీజ్ చేశారు గానీ అదేం వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. తీరా కట్ చేస్తే 'పెద్ది' వల్ల ఏర్పడిన కన్ఫ్యూజన్ దెబ్బకు సమంత సినిమా ఏకంగా రెండు నెలలు వాయిదా పడిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య)చివరగా విజయ్ దేవరకొండ 'ఖుషి'లో హీరోయిన్గా కనిపించిన సమంత.. తర్వాత ఓ వెబ్ సిరీస్ చేసింది గానీ సక్సెస్ అందుకోలేకపోయింది. గతేడాది రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి మరోసారి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే 'మా ఇంటి బంగారం' సినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ వేసవిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్లే మే 15న వస్తుందని పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు.మరి ఏమైందో ఏమో జూన్ తొలివారానికి వాయిదా పడే అవకాశముందనే రూమర్స్ వచ్చాయి. ఇంతలో 'పెద్ది'.. జూన్ 4 అనేసరికి 'మా ఇంటి బంగారం' ఆలోచనలో పడింది. ఇప్పుడు మే, జూన్ కాదు ఏకంగా జూలైకి వాయిదా వేశారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమో కాదో రాబోయే కొన్నిరోజుల్లో క్లారిటీ వస్తుంది.నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత.. గృహిణి పాత్ర చేసింది. కానీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని టీజర్తో క్లారిటీ వచ్చేసింది. అయితే ఔట్పుట్ అంతా సిద్ధమైన వాయిదా వేయడం, అది కూడా రెండు నెలలు పాటు అనేది కాస్త చిత్రంగా అనిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మూవీపై ఉన్న హైప్ కూడా తగ్గిపోయే ప్రమాదముంది. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: రజనీ సినిమాలో చిరంజీవి భార్య.. భర్తని తలుచుకుని ఎమోషనల్) -
అరుదైన దృశ్యం.. ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య..!
నాగచైతన్య హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ ‘వృషకర్మ’. ఇందులో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ చిత్రానికి విరూపాక్ష’ఫేం కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. నెల రోజుల క్రితమే వృషకర్మ’ గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీని బీవీఎస్ఎన్ ప్రసాద్ ,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇక సినిమా సంగతి పక్కన పెడితే టాలీవుడ్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గతంలో విడిపోయిన నాగచైతన్య, సమంత ఓకే వేడుకలో మెరిశారు. చైతూ తన భార్య శోభిత ధూళిపాళ్లతో పెళ్లి రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు. ఇదే రిసెప్షన్కు సమంత సైతం తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి హాజరైంది. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. వీరిద్దరు ప్రముఖ నిర్మాత, ఏషియన్ సునీల్ కూతురు సిమ్రాన్ పెళ్లి రిసెప్షన్ హాజరు కావడం విశేషం.వీరిద్దరు విడిపోయి పెళ్లిళ్లు చేసుకున్నాక ఓ వేడుకలో కనిపించడం ఇదే మొదటిసారి. అందుకే ఒక్కసారిగా అందరి కళ్లు వీరిద్దరిపైనే పడ్డాయి. ఇదే రిసెప్షన్లో నాగార్జున, అమల సైతం కనిపించారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Naga Chaitanya and Sobhita Dhulipala at Simran (Sunil Narang's daughter) - Krish wedding reception. pic.twitter.com/zgVOmb4ABa— idlebrain.com (@idlebraindotcom) May 3, 2026 #TFNExclusive: All smiles as #Samantha along with her husband #RajNidimoru graced #SunilNarang’s daughter’s reception ❤️✨#SimranKrish #TeluguFilmNagar pic.twitter.com/twIKpdrAAz— Telugu FilmNagar (@telugufilmnagar) May 2, 2026 -
సమంత మా ఇంటి బంగారం.. పెద్దితో పోటీ పడనుందా?
టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సామ్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. సమంత యాక్షన్ సీన్స్లో అదరగొట్టేసిందని పలువురు కొనియాడారు. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సామ్ సొంత బ్యానర్లోనే నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మే 15న విడుదలకు సిద్ధమైంది.ఈ సినిమా కోసం సమంత ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మా ఇంటి బంగారం వాయిదా పడనుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న కారణంగా మూవీని పోస్ట్పోన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఫుల్ క్రేజ్ ఉన్న ఐపీఎల్ టైమ్లో మూవీని రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ భావిస్తున్నారట. అందువల్లే మా ఇంటి బంగారాన్ని జూన్ 4న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై మేకర్స్ ఇంకా ఎటువంటి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.మరోవైపు రామ్ చరణ్ పెద్దిని కూడా జూన్ 4న రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యశ్ మూవీ టాక్సిక్ పోటీ నుంచి తప్పుకోవడంతో పెద్దిని ముందే తీసుకు రానున్నారని టాక్. టాక్సిక్ వాయిదా పడడంతో టాలీవుడ్ చిత్రాలకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. ఇదే జరిగితే బాక్సాఫీస్ వద్ద పెద్ది మూవీతో సామ్ చిత్రం పోటీ పడే అవకాశముంది. మరి రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. -
అభిమానులతో కలిసి సమంత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
సమంత బర్త్ డే స్పెషల్.. ఫుల్ యాక్షన్ వీడియో రిలీజ్
ఇవాళ హీరోయిన్ సమంత పుట్టిన రోజు కావడంతో స్పెషల్ వీడియో రిలీజైంది. సామ్కు బర్త్ డే విషెస్ చెబుతూ ప్రశంసలు కురిపించారు మా ఇంటి బంగారం టీమ్. ఈ ప్రత్యేకమైన రోజున రిలీజ్ చేసిన వీడియో సామ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సామ్ ఫైట్ సీన్స్ అద్భుతంగా ఉండనున్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.ఈ సందర్భంగా సామ్ నటనపై ప్రశంసలు కురిపించారు. సమంత స్టంట్స్ అదరగొట్టేశారని హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ కొనియాడారు. సమంతను బీస్ట్ అంటూ ఆకాశానికెత్తారు. ఎలాంటి సీన్స్లోనైనా అద్భుతంగా చేయగలదని డైరెక్టర్ నందిని రెడ్డి ప్రశంసించారు. సామ్ అద్భుతమైన ప్రతిభ కలిగిన నటి అని డీవోపీ ఓంప్రకాశ్ అన్నారు. ఆమె యాక్షన్ సీన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. సామ్ భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు సైతం సమంత నటన ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందన్నారు. అభిమానులకు విపరీతంగా నచ్చుతుందని తెలిపారు. కాగా.. సమంత తన సొంతం బ్యానర్లో నిర్మిస్తోన్న ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సమంత, కీర్తి సురేశ్, పూజా హెగ్డే.. హిట్ పడాల్సిందే!
ఒకప్పుడు సినిమా అంటే కేవలం ఒక స్టార్ హీరో, పేరున్న నటీనటులు, నలుగురు వెన్నెముక లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండాల్సిందే. అప్పుడే ఆ సినిమాకు కలెక్షన్లు వచ్చేవి, ప్రేక్షకులు థియేటర్ల వైపు అడుగులు వేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది.. ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది.ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తోంది ఎవరన్నది కాదు, ఏం చూపిస్తున్నారన్నదే ముఖ్యం. భాషా బేధాలు చెరిగిపోయాయి.. కేవలం కంటెంట్ ఉంటే చాలు, నటీనటులు కొత్తవారైనా సరే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కథలో దమ్ముంటే, ఆ సినిమాను నెత్తిన పెట్టుకుని గ్లోబల్ రేంజ్కు తీసుకెళ్తున్నారు.అదే కథలో వైవిధ్యం లేకపోతే.. స్టార్ హీరో సినిమా అయినా సరే.. రెండో రోజే థియేటర్స్ ఖాలీ అయిపోతున్నాయి. అందుకే ఇప్పుడు హీరోల పరిస్థితి దారుణంగా ఉంది. ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కొత్త ప్రయోగాలు చేయాల్సిందే. హీరోయిన్ల పరిస్థితి కూడా అంతే. వైవిధ్యమైన పాత్రలతో అలరించపోతే.. వారిని ఈజీగా పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పటికే అనుష్క, తమన్నా లాంటి హీరోయిన్లను తెలుగు ప్రేక్షకులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇక సమంత, కీర్తి సురేశ్, పూజా హెగ్డే లాంటి తారలు కూడా హిట్లేక అల్లాడిపోతున్నారు. ఒకప్పుడు కమర్షియల్ హీరోయిన్గా రాణించిన సమంత..ఇటీవల తన పంథాను మార్చేసింది. స్టార్ హీరోల పక్కన నటించడం ఆపేసి.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ చేసింది. దీంతో దర్శక నిర్మాతలు కమర్షియల్ సినిమాలకు సమంత పేరుని పరిశీలించడం కూడా మానేశారు. మరోవైపు ఆమె సోలోగా చేసిన శాకుంతలం, యశోద సినిమాలు బక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ ‘మా ఇంటి బంగారం’పైనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్లో నిర్మించడంతో అటు నిర్మాతగా, ఇటు నటిగా ఈ మూవీ సమంతకు చాలా ముఖ్యం. ఈ మూవీ హిట్ అయితేనే.. సమంత స్టార్ లిస్ట్లో మరికొంతకాలం కొనసాగుతుంది. లేదంటే ఆమెను కూడా తెలుగు ప్రేక్షకులు మర్చిపోయే ప్రమాదం ఉంది. మే 15న ఈ మూవీ విడుదల కానుంది.ఇక కీర్తి సురేశ్ పరిస్థితి కూడా సమంతలాగే ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన కీర్తి.. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఎల్లమ్మ సినిమాలు అవకాశం వచ్చినట్లే వచ్చి.. చేజారిపోయింది. ఇప్పుడు వెంకటేశ్-అనిల్ రావిపూడి చిత్రంలో చాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రౌడీ జనార్థన చిత్రంలోనూ విజయ్కి జోడీగా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితేనే కీర్తి సురేశ్కు మరిన్ని అవకాశాలు వచ్చే చాన్స్ ఉంది.ఇక పూజా హెగ్డె.. ‘అల..వైకుంఠపురములో’ మూవీతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఒకప్పుడు తెలుగు,తమిళ, హిందీ సినిమాలతో బిజీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆమెకు ఎక్కడ అవకాశాలు రావట్లేదు. తెలుగులో అయితే పూజా హెగ్డే పేరునే మర్చిపోతున్నారు. నాని – సుజిత్ కాంబోలో వస్తున్న ‘బ్లడీ రోమియో’ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అయితేనే పూజా కూడా కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్ లిస్ట్లో కొనసాగుతుంది. లేదంటే పూజా పేరుని కూడా టాలీవుడ్ మర్చిపోతుంది. అందుకే సమంత, కీర్తి, పూజా హెగ్డేలకు అర్జెంట్గా హిట్ అవసరం. మరి ఈ కొత్త చిత్రాలన్ని విజయం సాధించి.. ఈ తారలను మరికొంతకాలం స్టార్ హీరోయిన్లుగా కొనసాగిస్తాయో లేదో చూడాలి. -
ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన సమంతని ఇప్పుడెవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అడపాదడపా మూవీస్ చేస్తున్నప్పటికీ.. వాటి కంటే విడాకులు, ఆరోగ్య సమస్యలు, రెండో పెళ్లి తదితర అంశాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈమె లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం' మరో రెండు వారాల్లో రిలీజ్ కానుంది. అలానే మంగళవారం ఈమె పుట్టినరోజు కూడా. ఇంతలోనే చిన్నపాటి షాకిచ్చింది. తన దగ్గర ఇప్పుడేముంది? వేటిని వదులుకున్నానని ఓ పోస్ట్ రూపంలో బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా)పని మీద ప్రేమ, నడిపించే శక్తి, మనసు చెప్పే విషయం, సంకల్పం, నమ్మిన నిజం, ఓ లక్ష్యం తనతో పాటు ఉన్నాయని చెప్పుకొచ్చిన సమంత.. ఎవరో వచ్చి ఎంపిక చేస్తారని ఎదురుచూడటం, నియంత్రించే ఆలోచన, నచ్చినట్లు ఉండాలనుకునే లక్షణం, పట్టుకుని వేలాడటం, హడావుడి పడటం లాంటి అంశాలని వదిలేశానని తెలిపింది. ఇందుకు సంబంధించి నాలుగు ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.చూస్తుంటే సమంత.. గత కొన్నేళ్లలో తన జీవితంలో జరిగిన సంఘటనలు, వాటి వల్ల తనలో వచ్చిన మార్పుల గురించి పరోక్షంగా ఈ పోస్టుతో చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. ఇక 'మా ఇంటి బంగారం' విషయానికొస్తే.. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ ఇది. ఓ ఇంటికి కోడలిగా వచ్చిన హీరోయిన్(సమంత).. రౌడీలని ఎందుకు చితక్కొట్టాల్సి వచ్చిందనేది కాన్సెప్ట్. ఈ చిత్రానికి సామ్ భర్త రాజ్ నిడిమోరు స్టోరీ, నిర్మాణ పరంగా సహకారం అందించారు.(ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
తస్సాదియ్యా.. సమంత ఇంత సింపుల్గా ఉందేంటి! (ఫొటోలు)
-
‘తస్సాదియ్యా’.. సమంత డ్యాన్స్ అదిరిందయ్యా!
సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీకి సమంత స్నేహితురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. సమంత భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు స్టోరీ అందించారు. సమంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేశారు మేకర్స్. 'తస్సాదియ్యా... తగ్గేదీ లేదు హొయ్య. అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే...' అంటూ సాగే ఈ పాటకి రెహమాన్ లిరిక్స్ అందించగా చిన్మయి, పుణ్య సెల్వ అద్భుతంగా ఆలపించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక చీరకట్టులో సమంత వేసిన స్టెప్పులు హైలెట్ అని చెప్పొచ్చు. -
సమంత మెచ్చిన ఇన్స్టా రీల్.. ఆమె టాలెంట్కు ఫిదా..!
ఇప్పుడంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది. మనం ఏదైనా ప్రత్యేకంగా చేస్తే చాలు.. అది క్షణాల్లోనే వైరలైపోతుంది. ఇప్పుడున్న జమానాలో ఇన్స్టా రీల్స్లో మునిగిపోతున్నారు జనాలు. కొంచెం గ్యాప్ దొరికితే ఇన్స్టా ఓపెన్ చేసిన రీల్స్ తెగ చూసేస్తున్నారు. కేవలం చూడడమే కాదు.. తమ క్రియేటివిటీని అంతా బయటికి తీస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టా ప్రపంచం పచ్చని పల్లె ప్రజల టాలెంట్ను కూడా అందరికీ పరిచయం చేస్తోంది.తాజాగా ఓ మహిళ టైలర్ చేసిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అచ్చం హీరోయిన్ సమంతతో మాట్లాడుతున్నట్లుగా చేసిన ఈ రీల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల సమంత-యాంకర్ సుమ ఉగాది సందర్భంగా చేసిన వీడియోను సింక్ చేస్తూ ఆ మహిళ టైలర్ చేసిన ప్రమోషన్ నెట్టింట వైరల్గా మారింది. ఆమె హీరోయిన్తో నేరుగా మాట్లాడుతున్నట్లుగా అద్భుతంగా ఎడిట్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఆ మహిళ క్రియేటివిటీని మెచ్చుకుంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ సమంత సైతం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి. సమంతను మెప్పించిన రీల్సోషల్ మీడియాలో నెటిజన్ల క్రియేటివిటీకి అద్దం పట్టేలా ఓ మహిళా టైలర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో యాంకర్ సుమతో సమంత మాట్లాడిన వీడియో కాల్ క్లిప్ను వాడుకుని, హీరోయిన్ నేరుగా తనతోనే మాట్లాడుతున్నట్లుగా ఆమె అద్భుతంగా ఎడిట్ చేశారు. ఈ వీడియో చూసి… pic.twitter.com/xMtp5jsGXs— ChotaNews App (@ChotaNewsApp) April 1, 2026 -
క్షమాపణలు చెప్పనక్కర్లేదు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని చోట్ల మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వృత్తి జీవితంలో సర్దుకొని పోవాల్సి వస్తుంది. చాలా సందర్భాలలో తమ అభిప్రాయాలు, లక్ష్యాలు, ప్లాన్లు అన్నీ ఇతరులకు అనుకూలంగా మార్చుకుంటారని, అది త్యాగమని కూడా భావించకుండా..ముందుకు సాగుతున్నారు’ అని స్టార్ హీరోయిన్ సమంత ఆవేదన వ్యక్తం చేసింది. సమాజంలో గుర్తింపు పొందేందుకు పురుషులతో పోలిస్తే మహిళలలు మరింత కష్టపడాల్సి వస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ సంస్థ నిర్వహించిన ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు.ఆ అలవాటుని మార్చుకోవాలిఈ సందర్భంగా మహిళల స్థితిగతులపై సమంత మాట్లాడుతూ.. ‘సమాజంలో ఇతరులు సౌకర్యంగా ఉండటానికి మహిళలు తమ అభిప్రాయాలు, షెడ్యూళ్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. తమ ఆశయాలను వదులుకుంటూ , ఇతరుల కోసం బతకడం మహిళలకు అలవాటైపోయింది. ఇకనైనా మహిళలు ఈ అలవాటును మార్చుకోవాలి. తమకు తాము విలువ ఇచ్చుకోవడం చాలా అవసరం. సాధించిన విజయాలను గర్వంగా స్వీకరించాలి’ అని అన్నారు.ఆ రోజులు రావాలిసినిమా ఇండస్ట్రీలో మహిళలు..తగిన గుర్తింపు సంపాదించుకోవడానికి రెట్టింపు కష్టం చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలను ఒక రిస్క్ లాగా లేదా ఒక ప్రత్యేక కేటగిరి లాగా చూస్తున్నారు. ఆ రోజులు పోవాలి. వాటిని కూడా డిఫరెంట్ కథలు అని చెప్పుకునే రోజులు రావాలి.తెరపై మహిళలు కేవలం హీరోకి భార్యగానో .. హీరోకి ధైర్యం చెప్పడానికో పరిమితం కాకుండా నిజజీవితంలో ఉండే మహిళల లాగానే క్లిష్టమైన మనస్తత్వంతో ఉండాలి’అని సమంత తెలిపింది.సారీ..అక్కర్లేదుపురుషులతో పోలిస్తే.. మహిళలే ఎక్కువ సార్లు క్షమాపణలు కోరుతున్నారు. ఒకే పరిస్థితిలో పురుషుల కంటే మహిళలు దాదాపు పది రెట్లు ఎక్కువ సారీ అంటారని మీకు తెలుసా?, ఇది వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోవడానికి ఒక సూచనగా పరిగణించవచ్చు. ప్రతి చిన్న విషయానికి క్షమాపణలు కోరాల్సిన అవసరం లేదు. ఇక చాలు.. మహిళలు ఇలా తమని తాము తగ్గించుకోవడం ఆపాలి.క్రెడిట్ తీసుకోవడం తప్పు కాదు. అంబిషన్ ఉండటం తప్పు కాదు. ఎవరో పొగిడితే సింపుల్గా థాంక్యూ అనడం అహంకారం కాదు. మీరు కష్టపడి సంపాదించుకున్న గౌరవాన్ని అనుభవించే హక్కు పూర్తిగా మీకు ఉంది’ అని సమంత చెప్పుకొచ్చింది. -
పవన్కు‘తొలిప్రేమ.. నాకు ‘దీవాన’: యంగ్ హీరో హర్షిత్ రెడ్డి
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". స్మేహ మణిమేగలై హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. "దీవాన" సినిమా ఈ వేసవికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈరోజు ఈ చిత్రం నుంచి ఇది ప్రేమ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ - దీవాన కథ నా దగ్గర చాలా కాలంగా ఉంది. దీన్ని సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. ఈ సినిమా మీరు చూశాక ఈ పాయింట్ ను స్క్రీన్ ప్లే చేసి సినిమాగాచూపించవచ్చా అనుకుంటారు. ఎంతో ధైర్యంగా వాసు, శ్రీదేవి ఈ మూవీ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. ఈ చిత్రంలోని మున్నా మిడిల్ క్లాస్ అబ్బాయి. అతని లైఫ్ ను, అతని జర్నీ చూస్తారు. చివరలో మీ మనసును కదిలిస్తుంది. అంత బ్యూటిఫుల్ క్లైమాక్స్ ఈ చిత్రంలో చూస్తారు. మీ మనసులో ఒక స్థానం సంపాదించుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాం’ అన్నారు.హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ‘ నేను షారుఖ్ ఖాన్ అభిమానిని. ఆయన మొదటి చిత్రం పేరు కూడా దీవాననే అని తెలుసుకున్న తర్వాత ఈ సినిమా నాకు వర్కవుట్ అవుతుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమాకు నేచర్ బాగా సపోర్ట్ చేస్తోంది. రెండేళ్లు షూటింగ్ చేశాం. ఈ సినిమాకు ఏమేం కావాలో అన్నీ అలా కలిసివచ్చేవి. హీరోయిన్ లేకుండానే సగం సినిమా షూటింగ్ చేశాం. మంచి హీరోయిన్ వస్తుందనే నమ్మకం మాలో ఉండేది. మా డైరెక్టర్ సినిమా విషయంలో దీవాన. ఒక్క సీన్ బాగా రాకున్నా ఆయన టెన్షన్ పడేవారు. కమల్ హాసన్ గారికి సద్మా, నాగార్జున గారికి గీతాంజలి, పవన్ గారికి తొలి ప్రేమ, విజయ్ దేవరకొండ గారికి అర్జున్ రెడ్డి ఎలాగో ఈ హర్షిత్ కు దీవాన అలా పేరు తెస్తుంది’ అన్నారు. సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో ప్రముఖ దర్శకులు వెంకీ అట్లూరి, రవికిరణ్ కోలా, నందినీరెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. -
అసలు వంట వచ్చా..? సమంతకు కోపం తెప్పించిన సుమ
-
సమంత ఉగాది పచ్చడి .. భర్త రాజ్ షాకింగ్ కామెంట్..!
టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఆమె పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ జరిగింది. పవిత్రమైన భూతశుద్ధి పేరుతో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వివాహానికి కొద్దిమంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.అయితే ఇవాళ ఉగాది కావడంతో సామ్ సైతం పండుగను సెలబ్రేట్ చేసుకుంది. యాంకర్ సుమ, డైరెక్టర్ నందిని రెడ్డితో కలిసి ఉగాది పచ్చడి చేసింది. ఈ సందర్భంగా తన భర్త రాజ్ నిడిమోరుకు లైవ్లో ఫోన్ చేసి మాట్లాడింది. ఉగాది పచ్చడి చేశానంటూ తన భర్తకు చెప్పింది. నువ్వు చేశావా? అంటూ రాజ్ అనడంతో పక్కనే ఉన్న సుమ, నందిని నవ్వు ఆపుకోలేపోయారు. అంతకుముందు సామ్.. హాయ్ బాబు అని రాజ్ను ముద్దుపేరుతో పిలవడంతో యాంకర్ సుమ ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది.కాగా.. వీరిద్దరు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట గతేడాది డిసెంబర్ 1న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇక సినిమాల విషయానికొస్తే సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం చిత్రంలో నటిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. -
Viral Video: ఉగాది పచ్చడి చేసిన సమంత..
-
బాపు బొమ్మలా సమంత.. మీనాక్షి సోయగాలు
బాపు బొమ్మలా మెరిసిపోతున్న సమంతకూర్చుని క్యూట్ పోజులిచ్చిన మీనాక్షి చౌదరిరెడ్ డ్రస్లో గ్లామరస్గా బ్యూటీ అషూరెడ్డిమెగా డాటర్ నిహారిక లేటెస్ట్ స్టిల్స్గోవాలో షూటింగ్ బిజీలో బిగ్బాస్ దివిఇండోనేసియా ట్రిప్లో రాయ్ లక్ష్మీ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) -
హైదరాబాద్ : ఓ షాపింగ్ మాల్లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)
-
సల్మాన్ తో జోడీ?
సల్మాన్ ఖాన్ , సమంత జోడీగా నటించనున్నారా? అంటే... బాలీవుడ్లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా రాజ్ అండ్ డీకే ద్వయం సూపర్హీరో జానర్లో ఓ సినిమా తెరకెక్కనుందని బాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు సమంతను సంప్రదిస్తున్నారట మేకర్స్. ఈ చిత్ర దర్శకుల్లో సమంత భర్త రాజ్ నిడిమోరు కూడా ఉన్నారు కనుక సమంత భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని భోగట్టా. అయితే ఈ సినిమాలో సమంత నటించడం లేదని, నిర్మాతగా బాధ్యతలు తీసుకుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి.. సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలో సమంత హీరోయిన్ గా స్క్రీన్ పై కనిపిస్తారా? లేక నిర్మాతగా భాగం అవుతారా? అనేది చూడాలి. ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం మే 15న రిలీజ్ అవుతోంది. -
సల్మాన్ సినిమాలో హీరోయిన్ సమంత..
-
సమంత నయా గ్లామర్.. 'కోర్ట్' శ్రీదేవి వయ్యారాలు!
గ్లామరస్ పోజులతో సరికొత్త సమంత హంగామాలంగా ఓణీలో అందంగా 'కోర్ట్' ఫేమ్ శ్రీదేవిదుబాయిలో చిల్ అయిపోతున్న రాయ్ లక్ష్మిక్యూట్ అండ్ స్వీట్ లుక్స్లో ఆషికా రంగనాథ్అందం చూపిస్తూ రచ్చ లేపుతున్న అంజలిరాణీ ముఖర్జీ, రేఖతో కలిసి కీర్తి సురేశ్ ఫొటోలు View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Jabili 🌝 (@srideviactor) View this post on Instagram A post shared by Namitha Vankawala (@namita.official) View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) -
ట్రోల్స్ లెక్క చేయను.. నా ఇంటివరకు వస్తే మాత్రం!
దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్నాక సమంత ముఖం వెలిగిపోతోంది. ఒకప్పుడు విచారంగా కనిపించే తన ముఖం ఇప్పుడు వెయ్యి ఓట్ల బల్బులా ప్రకాశిస్తోంది. ప్రస్తుతం సంతోషకర జీవితం గడుపుతున్న సామ్ మా ఇంటి బంగారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెళ్లి తర్వాత ఆమె నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం! ఈ చిత్రం మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఏదీ నన్ను కదిలించలేదుఇదిలా ఉంటే తాజాగా తను సోషల్ మీడియాలో అభిమానులతో చిట్చాట్ చేసింది. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రశంసలు, విమర్శలపై మీరు ఎలా స్పందిస్తారు? అని ఓ వ్యక్తి అడిగారు. అందుకు సమంత స్పందిస్తూ.. ప్రశంసలు నన్ను కదిలించలేవు. అలాగే విమర్శలు కూడా నన్ను ఎఫెక్ట్ చేయవు. కానీ, నెగెటివిటీని నా ఇంటివరకు తీసుకొస్తే మాత్రం మిమ్మల్ని బ్లాక్ చేస్తాను.దానర్థం అదే..అలా నా స్పేస్ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటాను. మిమ్మల్ని బ్లాక్ చేశానంటే నేను బాధపడ్డానని కాదు. మీలాంటివారికి నాదగ్గర చోటు లేదని అర్థం అని రిప్లై ఇచ్చింది. మీలోని ఓ ఫన్నీ థింగ్ ఏంటని అడగ్గా.. కిందపడి మరీ నవ్వుతానంది. ఎక్కువ బాధ లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఏం చేస్తారని అడగ్గా.. ధ్యానం చేస్తానని బదులిచ్చింది.సినిమామా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. ఇందులో సమంత పెళ్లయిన అమ్మాయిగా కనిపించనుంది. అలాగే ఆపద వచ్చినప్పుడు కత్తి పట్టేందుకు కూడా వెనుకాడని శివంగిగానూ అలరించనుంది. గుల్షన్ దేవయ్య కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది.చదవండి: ఇంకా అదే బాధలో ఉన్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ -
సమంత నుంచి సర్ప్రైజ్.. పోస్ట్ వైరల్
సమంత.. టాలీవుడ్లో ఈ పేరు వినిపించి చాలాకాలమైపోయింది. ఆరేడేళ్ల ముందు వరకు వరస సినిమాలు చేసి హీరోయిన్గా స్టార్డమ్ అనుభవించిన ఈమె.. నాగచైతన్యకు విడాకులు ఇవ్వడం, మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడటంతో పూర్తిగా మూవీస్ చేయడం తగ్గించేసింది. మూడేళ్ల క్రితం అంటే 2023లో విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' చేసింది. ఇదేం పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో యాక్టింగ్ పక్కనబెట్టేసింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు పోస్ట్ పెట్టింది.నటిగా అలరించిన సమంత.. ట్రలాలా పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించింది. 'శుభం' అనే సినిమాతో గతేడాది ప్రేక్షకుల్ని పలకరించింది. ఇది ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈమెనే నిర్మాత కమ్ లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం'.. థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. అసలు ఈ చిత్రం ఒకటుందని ఆడియెన్స్కి గుర్తులేదు. అలాంటిది ఇప్పుడు విడుదల తేదీ ప్రకటించి అందరికీ సామ్.. సర్ప్రైజ్ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్.. పాతిరాత్రి రివ్యూ)నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత చాన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న సామ్.. 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్లలో ఒకటైన రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు వీళ్లిద్దరూ డేటింగ్ చేశారు. అయితే గతేడాది వీళ్ల ప్రేమ గురించి చాలా రూమర్స్ వచ్చాయి. వాటిని నిజం చేస్తూ డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సామ్ ఏమైనా విశ్రాంతి తీసుకుంటుందేమో అనుకుంటే.. 'మా ఇంటి బంగారం' సినిమాని రెడీ చేసింది.నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత.. ఓ సంప్రదాయ ఇల్లాలి పాత్రలో కనిపించనుంది. అలానే ఆపద వచ్చినప్పుడు యాక్షన్తో అదరగొట్టే పాత్రలోనూ కనిపించనుండటం విశేషం. కొన్నాళ్ల క్రితం రిలీజ్ చేసిన టీజర్తో స్టోరీ ఏంటో చూచాయిగా క్లారిటీ వచ్చింది. ట్రైలర్ వస్తే అసలు కథేంటో తెలుస్తుంది. మరి ఈ మూవీతో సమంత కమ్ బ్యాక్ ఇస్తుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఇది ఉత్తరాది-దక్షిణాది మధ్య యుద్ధం కాదు అంతకు మించి) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
స్టన్నింగ్ ఔట్ఫిట్తో సమంత.. వైరల్ ఫోటోలు
-
పింక్ శారీలో ది రాజాసాబ్ బ్యూటీ.. బ్లాక్ డ్రెస్లో సమంత పోజులు..!
వజ్రాల్లాంటి బ్లాక్ డ్రెస్లో సమంత హోయలు..హీరోయిన్ అమలాపాల్ డిఫరెంట్ లుక్..సెలయేరు వద్ద హీరోయిన్ ప్రియమణి చిల్..పింక్ డ్రెస్లో ది రాజాసాబ్ బ్యూటీ అందాలు..పట్టుశారీలో మరింత అందంగా బిగ్బాస్ సోనియా...ఎల్లో చీరలో కాయాదు లోహర్ బ్యూటీపుల్ లుక్స్.. View this post on Instagram A post shared by Soniya Yash (@soniya.yashofficial) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Amala Paul 🩷 (@amalapaul) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) -
ఫుల్ హ్యాపీగా సమంత- రాజ్ నిడిమోరు.. ఎందుకంటే?
టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో వీరిద్దరి వివాహా వేడుక జరిగింది. డిసెంబర్ 1, 2025న భూత శుద్ధి వివాహం పేరుతో ఈ వేడుక నిర్వహించారు. ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులు, ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు.అయితే సామ్ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీలో నటిస్తోంది. ఓ బేబీ మూవీ తర్వాత సామ్తో దర్శకురాలు నందిని రెడ్డి చేస్తున్న రెండో మూవీ కావడం విశేషం. సమంత స్థాపించిన ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఈ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.ప్రస్తుతం సామ్ తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్ బాల్ లీగ్ను ఆస్వాదిస్తోంది. ఈ లీగ్లో తన టీమ్ విజయాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంది. గట్టిగా అరుస్తూ.. కేకలు వేస్తూ.. చప్పట్లు కొడుతూ సందడి చేసింది. అదే సమయంలో రాజ్ నిడిమోరు కూడా అక్కడే ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. సామ్, రాజ్ నిడిమోరు సినిమాల్లో కలిసి పనిచేశారు. రాజ్ తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్ల్లో సామ్ నటించారు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది. #TFNExclusive: #Samantha & #RajNidimoru celebrating and cheering with joy for their team 🤩#MaIntiBangaram #TeluguFilmNagar pic.twitter.com/H9nmfS2Lew— Telugu FilmNagar (@telugufilmnagar) February 8, 2026 -
తమన్నా కొత్త బిజినెస్ లాంచ్.. హీరోయిన్ల సందడి (ఫొటోలు)
-
భర్త కోసం పేరు మార్చుకోనున్న సమంత.. కొత్త పేరేంటో తెలుసా?
సమంత రూత్ప్రభు.. ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే..మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. ఇటీవల సొంత ప్రొడక్షన్ని స్టార్ట్ చేసి.. మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’గతేడాది మేలో రిలీజై మంచి విజయాన్ని సాధించింది. మరోవైపు హీరోయిన్గా ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా కూడా చేస్తుంది. ఇలా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గుడపుపుతోంది.నాగచైతన్యతో విడాకుల తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న సామ్..ఇటీవల బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఎక్కువ సమయం భర్తతో గడిపేందుకు కేటాయిస్తుంది సామ్. వీలైనంత వరకు ఇద్దరు కలిసే బయటకు వెళ్తున్నారు. ఏదైనా ఈవెంట్ ఉన్నా.. జంటగా హారవుతున్నారు. దాంతప్య జీవితమే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్ని కూడా ఇద్దరు కలిసే షేర్ చేసుకుంటున్నారు. సమంత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి రాజ్ నిడిమోరు క్రియేటర్గా వ్యవహరిస్తున్నాడు. నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సమంత సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇలా పెళ్లి తర్వాత రాజ్ నిడిమోరు- సమంత జంట అటు దాంపత్య జీవితాన్ని, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ని ఆనందంగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో భర్త రాజ్ నిడిమోరు కోసం సామ్ కీలక నిర్ణయం తీసుకుందంటూ ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. భర్త కోసం తన ఇంటి పేరుని మార్చకోబోతుందట. ఇన్నాళ్లు సమంత రూత్ప్రభుగా ఉన్న తన పేరుని..ఇప్పుడు సమంత నిడిమోరుగా మార్చుకోబోతుందట. ‘మా ఇంటి బంగారం’ సినిమాతోనే తన కొత్త పేరుని ఫ్యాన్స్కి పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ కార్డ్సులో సమంత పేరుని ‘సమంత నిడిమోరు’గా వేయాబోతున్నారట. అంతేకాదు తన సోషల్ మీడియా ఖాతాల్లోనూ ఇదే పేరుని మార్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి సమంత నిజంగానే పేరు మార్చుకుంటుందా లేదా అనేది తెలియాలంటే.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ వరకు ఆగాల్సిందే. -
రాజ్తో పెళ్లి తర్వాత ఫుల్ హ్యాపీగా సమంత.. వీడియో వైరల్!
డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంత ఫుల్ బిజీ అయిపోయింది. ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూనే ఉంటోంది. ఇటీవలే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న సామ్.. ఆ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. తాను కలలో ఇక్కడికి వస్తానని ఊహించలేదని రాసుకొచ్చింది. అయితే ప్రస్తుతం సామ్- రాజ్ నిడిమోరుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పికిల్ బాల్ మ్యాచ్ వీక్షిస్తున్న నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో సమంత ఫుల్ హ్యాపీగా మ్యాచ్ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. క్యూట్ కపుల్ అంటూ పోస్టులు పెడుతున్నారు.కాగా.. సామ్- రాజ్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ -2, సిటాడెల్: హనీ బన్నీ వంటి ప్రాజెక్టుల్లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. ఆ రూమర్స్ను నిజం చేస్తూ గతేడాది డిసెంబర్ 1న వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో వీరిద్దరి పెళ్లి జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఇక్కడికి వస్తానని కలలో కూడా ఊహించుకోలేదు: సమంత
రిపబ్లిక్ డే వేడుకల్లో హీరోయిన్ సమంత కనిపించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను ఒక రోజు ఇక్కడికి వస్తానని నా అంతరాత్మ కూడా ఎప్పుడు అనుకోలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.సమంత తన పోస్ట్లో రాస్తూ..' నేను ఎదుగుతున్నప్పుడు నన్ను ప్రోత్సహించేవారు ఎవరూ లేరు... నేను ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తానని నా అంతరాత్మ కూడా ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఎలాంటి మార్గదర్శకత్వం లేదు... ఇలాంటి కలలు ఒకప్పుడు ఊహించుకోవడానికి కూడా చాలా పెద్దగా అనిపించేవి. ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన ఈ దేశంలో నేను కేవలం నా పని చేసుకుంటూ ముందుకు సాగిపోయాను. ఎప్పటికీ కృతజ్ఞురాలిని' అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఆ హీరోతో సినిమా.. సమంత ఓకే చెబుతుందా?
కోలివుడ్లో సంచలన కథానాయకుడిగా ముద్ర వేసుకున్న నటుడు శింబు. మంచి విజయాన్ని అందుకుని చాలాకాలమైంనే చెప్పాలి. ఇటీవల కమలహాసన్తో కలసి నటించిన థగ్స్ లైఫ్ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నిర్మాణంలో ఉంది. వి.క్రియేషన్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరసన్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇది ఉత్తర చెన్నై యూనివర్సల్లో సాగే ఒక కథతో రూపొందుతున్న చిత్రమని యూనిట్ వర్గాలు ఇప్పటికే పేర్కొన్నాయి. కాగా మదురైకి చెందిన ఒక సాధారణ కబడ్డీ క్రీడాకారుడు అనూహ్య పరిస్థితుల్లో చెన్నైకి రావడం, ఆ తర్వాత అక్కడ ఒక డానుగా మారడం వంటి కథాంశంతో సాగే చిత్రం అరసన్ అని సమాచారం. దర్శకుడు వెట్రిమారన్, శింబు కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇది కావడం గమనార్హం. ఇందులో శింబు యువకుడిగా, మధ్య వయసు్కడిగాను రెండు గెటప్పుల్లో కనిపించనున్నారని తెలిసింది. ఇకపోతే ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రను విజయ్ సేతుపతి పోషించనున్నారు. దీంతో ఇది మల్టీ స్టారర్ చిత్రంగా మారుతోంది. తాజాగా ఈ చిత్రంలో శింబుకు జంటగా సమంతను కథానాయకిగా నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. సమంతతో నిర్మాతల వర్గం చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. ఇదే కనుక నిజమైతే శింబు, సమంత కలసి నటించే తొలి చిత్రం కూడా ఇదే అవుతుంది. ఇంతకుముందు విజయ్, సూర్య, విజయ్ సేతుపతి, వంటి స్టార్ హీరోల సరసన నటించిన సమంత తమిళంలో నటించి కూడా చాలాకాలమైంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తర్వాత షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం అవుతుందని సమాచారం. -
వినోదాల డుం డుం
‘శుభం’ మూవీ ఫేమ్ గవిరెడ్డి శ్రీను హీరోగా, బ్రిగిడా సాగా హీరోయిన్గా ‘చీన్ టపాక్ డుం డుం’ అనే మూవీ షురూ అయింది. వై.ఎన్. లోహిత్ దర్శకత్వంలో విలేజ్ టాకీస్ పతాకంపై శ్రీను నాగులపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్లో జరిగాయి. దర్శకుడు మల్లిడి వశిష్ఠ కెమెరా స్విచ్చాన్ చేయగా, ముహూర్తపు సన్నివేశానికి నటి–నిర్మాత సమంత క్లాప్ ఇచ్చారు.తొలి షాట్కి దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. దర్శకురాలు నందినీ రెడ్డి, రచయిత బీవీఎస్ రవి, గౌతమి కలిసి.. స్క్రిప్ట్ను యూనిట్కి అందించి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘ప్రేక్షకులను అలరించే పూర్తి వినోదాత్మక చిత్రం ‘చీన్ టపాక్ డుం డుం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: పీఆర్. -
మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్న సమంత
-
భర్తతో తొలి సంక్రాంతి వేడుక.. ఫోటో షేర్ చేసిన సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ డైరక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో వీరి వివాహా వేడుక జరిగింది. ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. డిసెంబర్ 1, 2025న భూత శుద్ధి వివాహం పేరుతో ఈ వేడుక నిర్వహించారు.తాజాగా సమంత సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంది. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి ఈ పండుగను జరుపుకుంది. సంక్రాంతి వైబ్స్ అంటూ రాజ్ నిడిమోరుతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ సామ్ జంటకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ జంట సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఫోటో నెట్టింట వైరల్గా మారింది.కాగా.. సామ్, రాజ్ నిడిమోరు సినిమాల్లో కలిసి పనిచేశారు. రాజ్ తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్ల్లో సామ్ నటించారు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది. -
పెళ్లి తర్వాత మరింత కళగా సమంత (ఫోటోలు)
-
జై జై నాయిక..!
ఒకవైపు హీరోయిన్స్ గా సినిమాలు చేస్తూనే, సమయం దొరికినప్పుడల్లా ఉమెన్స్ సెంట్రిక్ సినిమాలూ చేస్తున్నారు కొందరు కథానాయికలు. సందేశాత్మక చిత్రాలే కాదు.. ఫుల్ యాక్షన్స్ చిత్రాలకూ సై అంటున్నారు. మరి.. ఏ హీరోయిన్స్ ఏ సినిమా చేస్తున్నారు? తొలిసారిగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న హీరోయిన్స్ ఎవరు? అనే అంశాలపై ఓ లుక్ వేయండి.మా ఇంటి బంగారం‘ఓ.. బేబీ’ వంటి సూపర్హిట్ మూవీ తర్వాత హీరోయిన్స్ సమంత, దర్శకురాలు నందినీరెడ్డి కాంబినేషన్స్ లో రూపొందుతున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఇటీవల ఈ సినిమా టీజర్ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సమంత ఓ గృహిణి పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు..ఈ చిత్రంలో సమంత క్యారెక్టరైజేషన్స్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్లుగా, ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇక ఈ సినిమాలో సమంత పాత్ర వివాహం చేసుకుని, అత్తగారిఇంటికి వెళ్లడం, ఆమె ఊహించుకున్న కొన్ని పరిస్థితులు, అంచనాలు తలకిందులు కావడం, మరోవైపు సడన్స్ గా సమంత ఫైట్స్ చేయడం వంటి విజువల్స్ కూడా కనిపించాయి. ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజూషా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు, హిమాన్స్ ్క దువ్వూరు ‘మా ఇంటి బంగారం’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుందని తెలిసింది. మరోవైపు 2023లో విజయ్దేవరకొండ, సమంత కలిసి ‘ఖుషి’ సినిమాలో నటించారు. ఈ చిత్రం తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన మరో మూవీ ఆడియన్స్ ముందుకు రాలేదు. సమంత నిర్మించిన ‘శుభం’ సినిమా గత ఏడాది మేలో విడుదలైంది. ఈ చిత్రంలో సమంత గెస్ట్ రోల్ మాత్రమే చేశారు. మరి..సమంత చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా ఈ ఏడాది థియేటర్స్లో విడుదలైతే, కొంతగ్యాప్ తర్వాత సమంతను ఓ ఫుల్ లెంగ్త్ రోల్లో ఆడియన్స్, ఆమె ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతారని ఊహించవచ్చు. పవర్ఫుల్ మైసారష్మికా మందన్నా నటించిన తొలి ఉమెన్స్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది గర్ల్ఫ్రెండ్’ గత ఏడాది విడుదలై, సూపర్హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు..ఈ చిత్రంలో రష్మిక మందన్నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ జోష్లో ‘మైసా’ అనే మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్కు గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చారు రష్మిక. ఈ ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్స్ ఎంటర్టైనర్ సినిమాకు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. అన్స్ ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సినిమా కోసం రష్మికా మందన్నా అద్భుతంగా మేకోవర్ అయ్యారు. గోండ్ తెగకు చెందిన శక్తివంతమైన మహిళగా ఇందులో నటిస్తున్నారు రష్మిక. తెలంగాణ, కేరళలోని దట్టమైన అడవుల్లో ‘మైసా’ చిత్రీకరణ జరిపారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు సిల్వర్స్క్రీన్స్ పై రష్మిక మందన్నా ఎక్కువగా రొటీన్స్ గ్లామర్ రోల్స్, కాలేజీ అమ్మాయి, గృహిణి.. వంటి పాత్రలు చేశారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు రష్మిక మందన్నా తొలిసారి ఓ పూర్తి స్థాయి యాక్షన్స్ సినిమా చేస్తుండటంతో, ‘మైసా’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.ది బ్లాక్గోల్డ్‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతో నటిగా మంచి పేరు సంపాదించు కున్నారు హీరోయిన్స్ సంయుక్త. ఈ సక్సెస్లతో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారామె. అయితే ఈ బ్యూటీ తొలిసారిగా ఉమెన్స్ సెంట్రిక్ ఫిల్మ్స్ జానర్లో ఎంట్రీ ఇచ్చి, ‘ది బ్లాక్గోల్డ్’ అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలోపోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు సంయుక్త. యోగేష్ కేఎమ్సీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్పై ఓ క్లారిటీ వస్తుంది. ప్రస్తుత సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూని టచ్ చేస్తూ, ‘ది బ్లాక్గోల్డ్’ను తెరకెక్కిస్తున్నారట యోగేష్. సంయుక్త పూర్తిస్థాయి యాక్షన్స్ చేస్తున్న ఈ ‘ది బ్లాక్గోల్డ్’ సినిమాపై ఆడియన్స్్సలో అంచనాలు ఉన్నాయి.భార్యాభర్తల గొడవలుభార్యాభర్తల గొడవలు, వారి అనుబంధాలు, గిల్లికజ్జాలు, విడాకులు... వంటి అంశాల నేపథ్యంతో రూపొందుతున్న సినిమా ‘సతీ లీలావతి’. ఈ సినిమాలో లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో దేవ్ మోహన్స్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో దేవ్, లావణ్య భార్యాభర్తలు నటించారు. ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘ఎస్ఎంఎస్’ (శివ మనసులో శృతి) చిత్రాల ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్లో రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుందని తెలిసింది.సస్పెన్స్ థ్రిల్లర్హీరోయిన్స్ శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్ర చేసిన సినిమా ‘చీకటిలో..’. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సురేష్ ప్రోడక్షన్స్ పతాకంపై డి.సురేష్బాబు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సంధ్య అనే పాత్రలో నటించారు శోభిత. సంధ్య వద్ద శిక్షణ పొందుతున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చని΄ోతాడు. ఈ మరణం గురించి సంధ్యకు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అవి ఏంటి? అనేది సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా జనవరి 23 నుంచి ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.క్రేజీ కల్యాణంపెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందుతున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’. ఈ చిత్రంలో అనుపమా పరమే శ్వరన్స్ లీడ్ రోల్ చేస్తుండగా, నరేష్ వీకే, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్ మెహన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణను జరుపుతున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ΄్లాన్స్ చేస్తున్నారు. ఇక ఈ సంగతి ఇలా ఉంచితే.. గత ఏడాది ‘పరదా’ అనే ఉమెన్స్ సెంట్రిక్ సినిమా చేశారు అనుపమా పరమేశ్వరన్స్ . ఈ సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.గరివిడి లక్ష్మిఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రముఖ జానపద గాయని, కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం వెండితెరపైకి వస్తోంది. ‘గరివిడి లక్ష్మి’ టైటిల్తో ఆమె బయోపిక్ తెరకెక్కుతోంది. హీరోయిన్స్ ఆనంది టైటిల్ రోల్ చేస్తున్నారు.1990 నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుంది. ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాకు గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీపై సరైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇలా ఈ కోవలో మరికొన్ని ఉమెన్స్ సెంట్రిక్ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. మరి.. జై జై నాయిక అంటూ ప్రేక్షకులు, హీరోయిన్ల అభిమానులు ఈ తరహా చిత్రాలను ఈ ఏడాదిలో ఎంత మేరకు ఆదరిస్తారో చూడాలి.⇒ లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ రూపకల్పనకు సన్నాహాలు మొదలైనట్లుగా తెలిసింది. నిర్మాత రాక్లైన్స్ వెంకటేశ్ ఈ బయోపిక్కు సంబంధిన పనులపై వర్క్ చేస్తున్నారని, ఈ సినిమా నిర్మాణంలో తాను అసోసియేట్ అవుతానన్నట్లుగా ఇటీవల ‘ఈషా’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు. ఈ రకంగా ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు మొదలైనట్లుగా తెలుస్తోంది.అయితే ఈ బయోపిక్లో ఎంఎస్ సుబ్బలక్ష్మిగా ఎవరు నటించనున్నారు? అనే విషయంపై సరైన స్పష్టత రావడం లేదు. హీరోయిన్స్ సాయిపల్లవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి పేరు తెరపైకి వచ్చింది. మరి.. వెండితెరపై ఎంఎస్ సుబ్బలక్ష్మిగా సాయిపల్లవి నటిస్తారా? లేక మరోక హీరోయిన్స్ ఎవరైనా ఈ పాత్రను చేస్తారా? అన్న అంశాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.⇒ వరుస సినిమాలతో టాలీవుడ్లో వన్నాఫ్ ది టాప్ హీరోయిన్స్ గా దూసుకెళ్తున్నారు హీరోయిన్స్ శ్రీలీల. అయితే ఈ యంగ్ బ్యూటీ ఇప్పటì æవరకు ఉమెన్స్ సెంట్రిక్ ఫిల్మ్ జానర్లో సినిమా చేయలేదు. అయితే ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్స్ లో సూపర్హిట్ ఫిల్మ్ ‘మంగళవారం’ చిత్రానికి సీక్వెల్ రానుందని, ఈ చిత్రంలో శ్రీలీల మెయిన్స్ లీడ్ రోల్ చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అలాగే అనుష్కా శెట్టి నటించిన బ్లాక్బస్టర్ సినిమా ‘అరుంధతి’ హిందీలో రీమేక్ కానుందని, ఈ చిత్రంలో శ్రీలీల నటించనున్నానే ప్రచారం సాగింది. అయితే ఈ విషయాలపై పూర్తిస్థాయి అధికారిక సమాచారం అందాల్సి ఉంది.⇒ రవితేజ ‘మిస్టర్ బచ్చన్స్ ’, విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’, రామ్ ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యారు హీరోయిన్స్ భాగ్యశ్రీ బోర్సే. కాగా తాజాగా ఉమెన్స్ సెంట్రిక్ ఫిల్మ్ జానర్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట ఈ హీరోయిన్స్ . ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’ అనే టైటిల్తో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా రానుందని, ఈ చిత్రంలో భాగ్యశ్రీ మెయిన్స్ లీడ్ రోల్ చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.ఈ సినిమాను రమేష్ అనే ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మద్యపాన నిషేధం నేపథ్యంతో సాగే ఈ పీరియాడికల్ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. స్వప్న సినిమా నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుందనే ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – ముసిమి శివాంజనేయులు -
పెళ్లి తరువాత అభిమానులకు సమంత గుడ్ న్యూస్
-
సమంత వింత పోజు.. అనసూయ ఫన్నీ ఫేస్!
చీరలో అనసూయ.. ఫన్నీగా ఫేస్ పెట్టి వయ్యారాలుమేకప్ లేకుండా శ్రద్ధా కపూర్ మార్నింగ్ వైబ్స్కేరళ బ్యూటీలా మారిపోయిన రుక్సార్ ధిల్లాన్గ్లామరస్ పోజులిచ్చేసిన యాంకర్ రష్మీ గౌతమ్'మా ఇంటి బంగారం' టీజర్ రెస్పాన్స్కి సామ్ ఫన్నీ థ్యాంక్స్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Riddhi Kumaar (@riddhikumar_) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
మా ఇంటి బంగారం టీజర్: అదరగొట్టేసిన సామ్
హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం'. 'ఓ బేబీ' తర్వాత సామ్తో దర్శకురాలు నందిని రెడ్డి చేస్తున్న రెండో మూవీ ఇది. సమంత స్థాపించిన ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మిస్తోంది. శుక్రవారం (జనవరి 9న) మా ఇంటి బంగారం టీజర్ రిలీజ్ చేశారు.టీజర్ రిలీజ్'ఎట్లాగో ఇక్కడివరకు వచ్చినాం కదా.. ఉండిపోదాం...' అన్న సామ్ డైలాగ్తో వీడియో మొదలవుతుంది. అత్తగారిల్లిది.. ఇంకోసారి ఆలోచించుకో అంటే 'అందరూ ఎంతో మంచోల్లలాగా ఉండారు. నాకు చూస్తాంటే ఎప్పటినుంచో తెలిసినట్లుంది. నువ్వు చూస్తా ఉండు, వారం రోజుల్లో ఫుల్లుగా కలిసిపోతాం..' అని సామ్ అత్తారింట్లో అందరితో బాగుండేందుకు ప్రయత్నిస్తుంది. అటు క్లాస్, ఇటు మాస్చీర కట్టు, బొట్టుతో సింపుల్గా అమాయకంగా కనిపిస్తూనే.. యాక్షన్ సీన్స్ అదరగొట్టేసింది. ముఖ్యంగా బస్లో, ఏకంగా అత్తగారింట్లో సమంత ఫైట్ సీన్స్ చేసినట్లు చూపించారు. టీజర్ అయితే అదిరిపోయింది. సామ్ అటు క్లాస్, ఇటు మాస్ లుక్లో కనిపించేసరికి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు, వసంత్ మారిగంటి కథ అందించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. -
సమంత మాస్ లుక్.. సంక్రాంతికి సర్ప్రైజ్
స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ని స్థాపించి.. తొలి ప్రయత్నంగా 'శుభం' అనే చిత్రాన్ని నిర్మించి సక్సెస్ అందుకుంది. అదే బ్యానర్పై ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా చాలా రోజుల కిందటే ప్రకటించారు. ఇందులో ఆమే హీరోయిన్. ‘ఓ బేబీ’ తర్వాత సామ్తో కలిసి నందిని రెడ్డి చేస్తున్న రెండో సినిమా ఇది. అయితే దర్శకురాలు పేరు తప్ప.. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ని పంచుకుంది సమంత. (చదవండి: ఓటీటీలో తమిళ ఫీల్గుడ్ మూవీ.. ఎక్కడంటే?)సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి.. ఫ్యాన్స్కి సర్ప్రైజ్ చేసింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ని కూడా విడుదల చేశారు. ‘మీరు చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది’ అంటూ ఆ పోస్టర్కి క్యాప్షన్ రాసుకొచ్చారు. జనవరి 9న ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. (చదవండి: పెళ్లి చేసుకుంటానని చెప్తోన్న బ్యూటీ.. ఎప్పుడో మరి!)ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించగా..సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలకపాత్ర పోషిస్తున్నాడు. 1980 నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కుఉతున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
క్లోజ్ ఫ్రెండ్తో సమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత హీరోయిన్ సమంత ఫుల్గా చిల్ అవుతోంది. గతేడాది క్రిస్మస్ వేడుకలు చేసుకున్న సామ్.. ఇటీవల భర్తతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంది ముద్దుగుమ్మ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ సమంతకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.అయితే తాజాగా సమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో సామ్తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఈ సెలబ్రేషన్స్ ఎక్కడనేది మాత్రం సామ్ రివీల్ చేయలేదు.కాగా.. సామ్ - తమన్నా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్గా నటించిన అల్లుడు శీనులో తమన్నా స్పెషల్ సాంగ్లో మెరిసింది. మరోవైపు సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మా ఇంటి బంగారంలో నటిస్తోంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్లో కేవలం స్పెషల్ సాంగ్స్లో మాత్రమే కనిపిస్తోంది. -
భర్తతో సమంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది రెండోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. వీరిద్దరు కలిసి ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ వెబ్ సిరీస్ల్లో కలిసి పనిచేశారు. ఆ పరిచయమే వీరిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. కొన్నేళ్లుగా వీరిపై రూమర్స్ వస్తున్నా పట్టించుకోలేదు. చివరికీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఆ రూమర్స్ను నిజం చేశారు.తాజాగా ఈ నూతన జంట న్యూ ఇయర్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సమంతతో కలిసి ఆమె భర్త రాజ్ నిడిమోరు కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ వీడియో సామ్ నవ్వుతూ సంతోషంగా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్, అభిమానులు సమంతకు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా..సమంత- రాజ్ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో లింగ భైరవి సన్నిధిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. Unplanned moments will be one of those nights where boundaries quietly disappeared ❤️😍Samantha with her husband and frnds at a celebration 😍 Happy New Year🔥#Samantha pic.twitter.com/ykKy16Gre3— Dhruv Arjun (@Dhruv_Arjunan) January 1, 2026 -
భర్తతో హనీమూన్ ట్రిప్లో సమంత..! (ఫొటోలు)
-
సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!
హీరోయిన్ సమంత.. ఈ నెల ప్రారంభంలో రెండో పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్ల నుంచి వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో లింగ భైరవి సన్నిధిలో వివాహం చేసుకున్నారు. తర్వాత పెద్దగా సోషల్ మీడియాలో సామ్ కనిపించలేదు. ఇప్పుడు భర్తతో కలిసి ఫారిన్ ట్రిప్లో ఉన్నట్లు ఫొటోలు పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: అడ్రస్ చెప్పిన మారుతి.. కడుపు నింపేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్)డిసెంబరు 1న సమంత పెళ్లి జరగ్గా.. నాలుగు రోజులకే సినిమా షూటింగ్లో బిజీ అయిపోయింది. 'మా ఇంటి బంగారం' పేరుతో తీస్తున్న ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ చేస్తోంది. నిర్మాత కూడా ఈమెనే. ఇప్పుడు చిత్రీకరణలో కాస్త గ్యాప్ దొరకడంతో భర్త రాజ్తో కలిసి పోర్చుగల్లోని లిస్బన్ సిటీకి వెళ్లిపోయింది. అక్కడే షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. చెప్పాలంటే సమంతకు ఇది హనీమూన్ ట్రిప్ అనొచ్చు!సమంత గతంలో నాగచైతన్యని పెళ్లిచేసుకుంది. కానీ నాలుగేళ్లకే విడిపోయారు. గత కొన్నాళ్ల నుంచి ఒంటరిగానే ఉంటున్న సామ్.. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్కి కనెక్ట్ అయింది. ఇతడికి గతంలో శ్యామోలి అనే రచయితతో పెళ్లయింది. కానీ ఆమెకు విడాకులు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అలా పెళ్లి బంధంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్న వీళ్లిద్దరూ.. రీసెంట్గా కలిసి కొత్త జీవితం ప్రారంభించారు. సమంత నిర్మిస్తున్న సినిమాలకు రాజ్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ థ్రిల్లర్ సినిమా) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఈ ఏడాది మధుర జ్ఞాపకాలను షేర్ చేసిన సమంత.. (ఫోటోలు)
-
రాజ్తో పెళ్లి తర్వాత తొలి క్రిస్మస్.. ఫోటోలు పంచుకున్న సమంత..!
టాలీవుడ్ హీరోయిన్ సమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరుపుకుంది. రెండో పెళ్లి తర్వాత చేసుకున్న మొదటి క్రిస్మస్ ఇదే కావడంతో సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పాటు ఈ ఏడాది తన ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని సంతోషం వ్యక్తం చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి జరిగిన ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ ఏడాదిలో తన మధుర జ్ఞాపకాలను సైతం పోస్ట్ చేసింది. ఇటీవలే సామ్ రెండో సారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.రాజ్ నిడిమోరుతో ఏడడుగులు..సమంత ఇటీవలే రెండో పెళ్లి చేసుకుంది. రూమర్స్ని నిజం చేస్తూ 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూర్లోని ఈశా ఫౌండేషన్లోని లింగ భైరవి దేవి సన్నిధిలో ఈ శుభాకార్యం జరిగింది. అయితే 'భూత శుద్ధి ఆచారం' పద్దతిలో ఈ పెళ్లి వేడుక జరిగింది. డిసెంబర్ 1న, కేవలం30 మంది అతిథులతో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)
-
శోభిత, సమంతతో నాగచైతన్య.. ఫోటో వైరల్
అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ జంట ఇటీవలే మొదటి పెళ్లిరోజును సింపుల్గా జరుపుకున్నారు. ఫస్ట్ యానివర్సరీ రోజు తమ పెళ్లిరోజు వీడియోను అభిమానులతో పంచుకున్నారు. వీరిద్దరూ కలిసున్న ఫోటోలను తరచూ కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వదులుతూ ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేస్తుంటారు. అయితే ఈసారి చై-శోభితతో పాటు సమంత కూడా కలిసున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఫ్యామిలీ ఫోటోఅవును, చై, శోభిత, సమంత.. ముగ్గురూ కలిసి సెల్ఫీకి పోజిచ్చారు. కాకపోతే ఇక్కడ సమంత అంటే హీరోయిన్ సామ్ కాదులెండి. శోభిత సోదరి! ఆమె పేరు కూడా సమంతనే కావడంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. చై మాజీ భార్య పేరు, మరదలి పేరు ఒకటే కావడంతో ఈ ఫోటో చర్చనీయాంశంగా మారింది.చై వైవాహిక జీవితంహీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత.. ఏ మాయ చేసావే మూవీలో తొలిసారి జంటగా నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమను పెద్దలు కూడా ఒప్పుకోవడంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. క్యూట్ కపుల్గా కనిపించే ఈ జంట మధ్య తర్వాత తెలియని అగాధం ఏర్పడింది. దీంతో నాలుగేళ్ల వైవాహిక బంధానికి ఫుల్స్టాప్ పెడుతూ 2021లో విడాకులు తీసుకున్నారు.రెండో పెళ్లితర్వాత చై.. హీరోయిన్ శోభిత ధూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2024 డిసెంబర్ 4న వీరి వివాహం జరిగింది. అటు సమంత కూడా కొంతకాలంగా ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం నడిపింది. 2025 డిసెంబర్ 1న ఆ ప్రేమను పెళ్లి బంధంగా మార్చింది. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో సామ్-రాజ్ రెండో పెళ్లి చేసుకున్నారు. #NagaChaitanya seen with his wife #Sobhita and her sister #Samantha pic.twitter.com/FxOsh9ldFS— Milagro Movies (@MilagroMovies) December 21, 2025 -
జూబ్లీహిల్స్లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)
-
నటి సమంతకు చేదు అనుభవం..
హైదరాబాద్లో ఓ షాపింగ్మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమంతకు చేదు అనుభవం ఎదురైంది. సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. కొద్దిరోజుల్లోనే సమంత ఒక కార్యక్రమం కోసం వస్తున్నడంతో ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా జనం ఎగబడటంతో భద్రతా సిబ్బంది ఆమెను కారు వరకు తీసుకెళ్లడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సెలబ్రిటీల పట్ల పెరుగుతున్న ఈ వెర్రి అభిమానంపై నెట్టింట తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. చదువుకున్న యువతనే ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తున్నడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం కోసం పట్టుచీరలో ఎంతో హుందాగా వెళ్లిన సమంత.. ఆ కార్యక్రమం ముగించుకుని కారు వైపు వెళ్తుండగా చాలామంది ఆమెను చుట్టుముట్టారు. దీంతో భద్రతా సిబ్బంది అతికష్టంతో ఆమెను సురక్షితంగా కారు వరకు చేర్చారు. అక్కడికి వచ్చిన వారిని అదుపు చేయడం కూడా వారికి కష్టంగా మారింది. వారి మధ్యలో సమంత నడవలేని పరిస్థితి ఉన్నప్పటికీ ఆమె చిరునవ్వుతోనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ లులూ మాల్లో నిధి అగర్వాల్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. 'ది రాజా సాబ్' సినిమా సాంగ్ ఈవెంట్ నుంచి ఆమె తిరిగి వెళ్తుండగా తనకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తనపై చేతులు కూడా వేయడంతో నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిధి కూడా ఇదే ఘటనపై ఈవెంట్ నిర్వాహుకులను తప్పుబట్టింది. వరుసుగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సెలబ్రిటీలకు కనీస ప్రైవసీ కూడా ఉండదా..? అంటూ భగ్గుమంటున్నారు. అభిమానం హద్దులు దాటుతోందని విమర్శలు వస్తున్నాయి. Why do some fans in the South still struggle with boundaries, even after the Rajasaab incident? Passion is great, but respect and personal space matter too.#SamanthaRuthPrabhu pic.twitter.com/FgIqH51OCg— Cineholic (@Cineholic_india) December 21, 2025 -
సమంతలో కొత్త పెళ్లికూతురి కళ.. కల్యాణి గ్లామర్!
సమంత ఫేస్లో కొత్త పెళ్లికూతురి కళగ్రీన్ డ్రస్లో మెరిసిపోతున్న కల్యాణి ప్రియదర్శన్డ్యాన్స్ చేస్తూ మాయ చేస్తున్న 'ఫౌజీ' ఇమాన్వీ'బలగం' ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్ వీకెండ్ ట్రిప్జిగేలుమనేలా దడపుట్టించేస్తున్న సంయుక్తబ్యాంకాక్ ట్రిప్లో సీరియల్ బ్యూటీ నవ్వస్వామి View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
తొలిసారి అలా కనిపించిన సామ్ దంపతులు.. వీడియో వైరల్
అందరూ ఊహించినట్లుగానే సమంత రెండోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్ను నిజం చేస్తూ రెండో పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు సామ్ పెళ్లాడింది. భూత శుద్ధి వివాహం పేరుతో ఇషా ఫౌండేషన్లో వీరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పెళ్లిలో సమంత అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.అయితే ఈ పెళ్లి తర్వాత వీరిద్దరు మొదటిసారి జంటగా బయట కనిపించారు. ఎయిర్పోర్ట్లో వెళ్తుండగా ఈ నూతన వధువరులు కెమెరాలకు చిక్కారు. ఈ జంటను చూసిన కొందరు కంగ్రాట్స్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. సమంత మొదట టాలీవుడ్ హీరో నాగ చైతన్యను పెళ్లాడారు. ఆ తర్వాత వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. గతేడాది నాగచైతన్య.. మరో హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను పెళ్లాడారు. తాజాగా ఈ ఏడాది సామ్ రెండోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. #Samantha was seen at the airport with husband #RajNidimoru for the first time after their wedding. 😍#FilmfareLens pic.twitter.com/ohc48wCUgj— Filmfare (@filmfare) December 13, 2025 -
సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది!: రాజ్ పిన్ని
హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కోయంబత్తూరులోని ఈషా సెంటర్లో భూతశుద్ధి పద్ధతిలో వీరి పెళ్లి ఎంతో సింపుల్గా జరిగింది. ఈ వివాహం గురించి సంగీత విద్వాంసురాలు శోభారాజు మాట్లాడారు. ఈమె ఎవరంటే.. అన్నమాచార్య సంకీర్తనలతో పాటు సంగీత దర్శకురాలిగా మంచి పేరు గడించింది డాక్టర్ శోభారాజు. శోభారాజు రియాక్షన్2010లో ఈమెను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈమెకు రాజ్ నిడిమోరు బంధువవుతాడు. శోభారాజు అక్క రమాదేవి కొడుకే రాజ్ నిడిమోరు. కోడలి వరసయ్యే సమంత గురించి శోభారాజు మాట్లాడుతూ.. ఒక ఆధ్యాత్మిక పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఆశ్రమంలో స్వామివారి ఆధ్వర్యంలో ఈ వివాహ వేడుక జరిగింది. రాజ్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే..వాడు చిన్నగా ఉన్నప్పుడే ముద్దుగారే యశోద.. వంటి పాటలు నేర్చుకుని పాడేవాడు. మీ పిన్ని పేరు నిలబెట్టావని అందరూ వాడిని మెచ్చుకునేవాళ్లు. అది నాకు చాలా సంతోషంగా అనిపించేది. తను సంగీతం నేర్చుకుని ఎన్నో పాటలు పాడాడు. వాడికి స్పిరిచ్యువాలిటీ ఎక్కువ. సమంతకు కూడా ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఉందని తెలిసింది.పక్కన కూర్చోవాలంటే సిగ్గేసిందిఓ రెండుసార్లు తను వచ్చినప్పుడు చూశాను, చాలా సన్నగా ఉంది. తన పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది. సన్నగా అవాలంటే ఎలా? అని అడిగినప్పుడు ఏవో ఎక్సర్సైజ్లు చెప్పింది, కానీ నేను చేయలేనన్నాను. తను మూడు నెలలకోసారి ఈషా ఆశ్రమానికి వెళ్లి మౌనం పాటిస్తూ సాధన చేస్తుందని తెలిసి సంతోషంగా అనిపించింది. బహుమతులు ఏమిచ్చారంటే?ఎంతో బిజీ నటి అయుండి ఇలా ధ్యానానికి సమయం కేటాయిస్తుందంటే ముచ్చటేసింది. అలాంటి అమ్మాయి రాజ్కు దొరకడం హ్యాపీ. సమంత (Samantha Ruth Prabhu) వాడిని మరింత ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుందని ఆశిస్తుందన్నాను. పెళ్లిలో ఆరోగ్యకరమైన ఆహారమే వడ్డించారు. అలాగే కెమికల్స్ వాడని పర్ఫ్యూమ్స్ కానుకగా ఇచ్చారు అని శోభా రాజు చెప్పుకొచ్చారు. చదవండి: పవన్ కల్యాణ్.. బిగ్బాస్ చరిత్ర తిరగరాయనున్నాడా? -
సమంత రాజ్.. నో హనీమూన్, నో రిలాక్స్
హీరోయిన్ సమంత.. నాలుగు రోజుల క్రితం మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సాధారణంగా వివాహం తర్వాత సెలబ్రిటీలు చాలామంది హనీమూన్ ప్లాన్ చేస్తుంటారు. కానీ సామ్ మాత్రం పనిలో పడిపోయింది. అందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.చివరగా విజయ్ దేవరకొండతో 'ఖుషి' సినిమాలో సమంత కనిపించింది. తర్వాత తానే నిర్మాతగా మారి 'శుభం' అనే మూవీ తీసింది. ఈ ఏడాది మే నెలలో చిత్రం రిలీజై ఓకే ఓకే అనిపించుకుంది. తానే నిర్మాత, హీరోయిన్గా సమంత.. 'మా ఇంటి బంగారం' అనే చిత్రం చేస్తోంది. గత నెలలోనే షూటింగ్ మొదలుపెట్టారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు.(ఇదీ చదవండి: సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?)మధ్యలో సమంత పెళ్లి వల్ల కాస్త గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని సమంత బయటపెట్టింది. సెట్స్లో దర్శకురాలు నందినీ రెడ్డితో ఉన్న ఫొటోని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అలా పెళ్లయిన నాలుగు రోజులకే హనీమూన్ లాంటివి ప్లాన్ చేసుకోకుండా పనిలో పడిపోయిందనమాట.'మా ఇంటి బంగారం' సినిమా విషయానికొస్తే.. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. కొన్నాళ్ల ముందే నందినీ రెడ్డి దర్శకత్వంలో మొదలైంది. ఈ సినిమాని సమంత నిర్మిస్తున్నప్పటికీ.. రాజ్ కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బోల్డ్ వెబ్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
కలర్ఫుల్ శారీలో సమంత ఫ్రెండ్ శిల్పా రెడ్డి అందాలు (ఫోటోలు)
-
విడాకుల నుంచి వివాహం దాకా సమంతను చెక్కిన ‘శిల్పం’, ఆమేనా?
దక్షిణాది అందాల ప్రపంచంలో ఆమెది చిరపరిచితమైన పేరు. మిసెస్ వరల్డ్ టైటిల్ను గెలుచుకున్న తొలి తెలుగు మహిళ అనే ఘనత దగ్గర నుంచి ఆ తర్వాత ఆమె మరెన్నో ఘనతల్ని స్వంతం చేసుకుంటూ సినిమా సెలబ్రిటీలకు తీసిపోని పాప్యులారిటీని దక్కించుకుంది. ఆమే తెలంగాణకు చెందిన హైదరాబాద్ వాసి శిల్పారెడ్డి. సినిమా రంగంలోని కుటుంబాలతో దగ్గర సంబంధం, బంధుత్వాలు కూడా శిల్ప(Shilpa Reddy) కుటుంబానికి ఉన్నాయి. ఆమె సోదరుడు కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున కుటుంబంతో శిల్పారెడ్డికి దగ్గర బంధుత్వం ఉంది. నాగార్జున మేనల్లుడు సుమంత్ మాజీ భార్య కీర్తిరెడ్డి కూడా శిల్పారెడ్డి కి బంధువే. గతంలో నాగార్జున తో శిల్పారెడ్డి, ఆమె భర్త వ్యాపార భాగస్వాములుగా కూడా ఉన్నారు. బంజారాహిల్స్లో టచ్ పబ్ పేరిట ఒక అత్యంత అధునాతన రెస్టారెంట్ను వీరు భాగస్వాములుగా కొంత కాలం పాటు నిర్వహించారు కూడా.ఈ నేపధ్యంలోనే నాగచైతన్యకు కొంత కాలం పాటు ప్రియురాలిగా, ఆ తర్వాత భార్యగా ఉన్న సమంత(Samantha ) కూడా శిల్పారెడ్డికి క్లోజ్ ఫ్రెండ్గా మారింది. మోడలింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనర్గా మారిన శిల్ప డిజైన్లను సమంత బాగా ఇష్టపడేది. అలాగే ఫిట్నెస్ నిపుణురాలిగానూ ఆమెకు శిల్ప చాలా రకాలుగా సలహాలు సూచనలు అందించేది. వీరిద్దరి స్నేహం నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా అంతే గాఢంగా ఇంకా చెప్పాలంటే మరింత సన్నిహితంగా కొనసాగడం విశేషం.ఇప్పటికీ సమంత కి సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సింగర్ చిన్మయి, శిల్పా రెడ్డి లే అని చెబుతారు. ఫ్యాషన్ నుంచి రిలేషన్స్ దాకా ఎన్నో జీవిత పాఠాలను శిల్పా నేర్పింది అని అంటుంటారు. జీవితంలో వచ్చిన కష్టాలు, సంతోషాలు అన్నింటిలో శిల్ప చేదోడు వాదోడుగా నిలిచింది. విడాకుల తరువాత విపరీతమైన ఒంటరితనాన్ని అనుభవించి అనారోగ్యానికి కూడా గురైన సమంత కోలుకోవడానికి అండదండలు అందించిన వారిలో శిల్ప మొదటి స్థానంలో ఉటుంది. అలా బెస్ట్ ఫ్రెండ్స్ అనే పదానికి వీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు. సమంత తన జీవితంలో తీసుకునే కీలక నిర్ణయాలు అన్నింటిలోనూ శిల్పారెడ్డి పాత్ర ఉంటుందని సన్నిహితులు చెబుతారు. ఇక రాజ్ నిడిమోరుతో ప్రేమ, పెళ్లి విషయంలో కూడా శిల్ప తన వంతు సలహాలు అందించినట్టు సమాచారం. రాజ్, సమంతల పెళ్లి వేడుకలో శిల్ప సెంటరాఫ్ అట్రాక్షన్గా మారింది. సమంత పెళ్లి ఫోటోలను శిల్ప సైతం అభిమానులతో షేర్ చేసుకుంది. శిల్పా తన జీవితంలోకి వచ్చాక ఎంత మార్పు వచ్చిందో సమంత మాటల్లోనే చెప్పాలంటే... ’శిల్పా రెడ్డి నువ్వు నా జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చావో అది నీకు కూడా తెలియదు. , నువ్వు నన్ను ధ్యానంలోకి నెట్టిన ఆ 15 నిమిషాలు నా జీవిత గమనాన్ని నిజంగా మార్చాయి. అలాంటి గొప్ప బహుమతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ సమంత తన కృతజ్ఞతన వ్యక్తం చేసింది. ఏదేమైనా..అవసరాలే ప్రాతిపదికగా వర్ధిల్లే స్నేహాలకు చిరునామా లాంటి సినీ రంగంలో ఇలాంటి అపురూప స్నేహాలు అప్పుడప్పుడయినా తారసపడుతుండడం స్నేహపిపాసులకు కొంతయినా ఉపశమనమే అనాలి. -
సమంత, రాజ్ పెళ్లి .. బ్రేకింగ్ న్యూస్ కోసం ఎదురుచూడొద్దు: శ్యామాలి
నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం తర్వాత నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే రాజ్ మాజీ భార్య శ్యామాలి (Shhyamali) పట్ల చాలామంది సానుభూతి చూపుతూ పోస్టులు పెడుతున్నారు. దీంతో తాజాగా ఆమె ఒక పోస్ట్ చేశారు. తాను ఎవరి సానుభూతి కోసం పాకులాడటం లేదని ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. చాలామంది తన ఇంటర్వ్యూల కోసం అడుతున్నారని చెప్పారు. అయితే, తాను ఈ అవకాశం ఎవరికీ ఇవ్వనని పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితిలో తన నుంచి బ్రేకింగ్ న్యూస్లతో పాటు ఇంటర్వ్యూలు ఎవరూ ఆశించవద్దని కోరారు. సమంత - రాజ్ నిడిమోరు వివాహ గురించి తాను పట్టించుకోవడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.సమంత- రాజ్ల వివాహం తర్వాత తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారని శ్యామాలి ఇప్పటికే ఒక పోస్ట్ చేశారు. చాలా మంది నాపై అభిమానం చూపారు. వారందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం నేను ఎవరి గురించి మాట్లాడే పరిస్థితిలో లేను. మా గురువు గారు క్యాన్సర్తో పోరాడుతున్నారు. నేను ఆయన కోసం ప్రార్థిస్తున్నాను. నా సోషల్మీడియా ఖాతాను కూడా నేనే మెయిన్టెన్ చేస్తాను. అందుకోసం నేను పీఆర్ను పెట్టుకోలేదు. మా గురువు గారి ఆరోగ్యం పట్ల ఇప్పటికే చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా అలసిపోయాను. కాబట్టి ఎవరూ కూడా నా నుంచి బ్రేకింగ్లు ఆశించకండి. ఆపై ఇంటర్వ్యూల కోసం ఎదురుచూడకండి.' అని శ్యామాలి కోరారు. -
సమంత రెండో పెళ్లి.. కొత్త ఫోటోలు వైరల్ (ఫొటోలు)
-
సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?
హీరోయిన్ సమంత రీసెంట్గానే మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్లో లింగభైరవి సన్నిధిలో చాలా సింపుల్గా ఈ వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లికి ముందే సమంతకు రాజ్ ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడని అంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?దర్శకుడు రాజ్తో సమంతకు గత నాలుగైదేళ్లుగా పరిచయం. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ రెండో సీజన్ చేసే టైంలో ఏర్పడిన పరిచయం కాస్త తర్వాత ప్రేమగా మారింది. ఇన్నాళ్లకు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లినే. నాగచైతన్యకు సమంత విడాకులు ఇవ్వగా.. రాజ్ కూడా తన తొలి భార్య శ్యామోలికి 2022లో విడాకులు ఇచ్చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి పోలీస్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్) ప్రస్తుతం రాజ్.. దర్శకుడు, నిర్మాతగా ఉన్నారు. సమంత కూడా ప్రస్తుతం తన నిర్మాణ సంస్థలోనే 'మా ఇంటి బంగారం' అనే మూవీ చేస్తోంది. ఈ సంస్థలోనే సమంతతో పాటు రాజ్ కూడా భాగస్వామిగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. అయితే అక్టోబరులో సమంత.. కొన్ని ఫొటోలని పోస్ట్ చేసింది. వాటిలో కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ లగ్జరీ హౌస్ని రాజ్.. సమంతకు పెళ్లి గిఫ్ట్గా ముందే ఇచ్చాడని అంటున్నారు. పెళ్లిరోజు సామ్ వేలికి ఉన్న రింగ్ కూడా రాజ్ బహుమతిగా ఇచ్చాడని అంటున్నారు. దీని విలువ కూడా లక్షల్లోనే ఉంటుందట.ప్రస్తుతం సమంత-రాజ్.. గోవాకు హనీమూన్కి వెళ్లారని, తిరిగి వచ్చిన తర్వాత ఎవరి ప్రాజెక్ట్లతో వారు బిజీ కానున్నారని తెలుస్తోంది. రాజ్ కూడా 'ద ఫ్యామిలీ మ్యాన్' నాలుగో సీజన్ తీయాల్సి ఉంది.(ఇదీ చదవండి: రోజుకు 500 కాల్స్.. తలనొప్పిపడలేక వీడియో చేశా: హేమ) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంత, నాగ చైతన్య, శోభిత కలిసి నటించారా..! ఆ సినిమా ఏదంటే..?
-
అత్తారింట్లోకి సామ్.. రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్
హీరోయిన్ సమంత- దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం (డిసెంబర్ 1న) రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమం వేదికగా నిలిచింది. గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయం గురించి ఎన్నడూ పెదవి విప్పి మాట్లాడలేదు. ఇప్పుడేకంగా పెళ్లి చేసుకుని అభిమానులను సర్ప్రైజ్ చేశారు.ఆనంద భాష్పాలుఈ క్రమంలో సమంత.. తన భర్త కుటుంబంతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఫోటోను రాజ్ సోదరి శీతల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది. ప్రదోషకాలంలో శివుడిని పూజిస్తుంటే నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి. అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కావు, ఆనంద భాష్పాలు. నేడు మా కుటుంబం పరిపూర్ణమైంది. సమంత-రాజ్ కలిసికట్టుగా ముందుకు సాగడం చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది. మా ఆశీర్వాదం..మా కుటుంబం అన్నివేళలా వారికి అండగా, తోడుగా నిలబడుతుంది. మా అందరి ఆశీర్వాదాలు వారికి ఎల్లప్పుడూ ఉంటాయి. అందులో ఎటువంటి సందేహమూ లేదు. కొన్ని బంధాలు మన జీవితాల్లోకి ఎంతో ప్రశాంతతను తీసుకొస్తాయి. ఇది కూడా అలాంటిదే! ప్రతి ఒక్కరూ ఇలాంటి స్వచ్ఛమైన, శాంతియుత ప్రేమను పొందాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్కు సమంత (Samantha Ruth Prabhu) స్పందిస్తూ లవ్ యూ అని కామెంట్ చేసింది. View this post on Instagram A post shared by Sheetal Nidimoru (@sheetalnidimoru) చదవండి: నాతో పనిచేసినోళ్లంతా పెద్ద హీరోలయ్యారు.. నేనే సక్సెస్ లేక.. -
సమంత రెండో పెళ్లి.. ఆమె ఆస్తుల విలువ అన్ని కోట్లా?
ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే హీరోయిన్ సమంత రెండో సారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అది కూడా మామూలుగా కాదు.. భూత శుద్ధి వివాహం పేరుతో ఇషా ఫౌండేషన్లో వీరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో సమంత అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసిన సమంతకు అభినందనలు వెల్లువెత్తాయి. 2021లో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సామ్.. మరో పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించింది.అయితే వీరిద్దరి పెళ్లి తర్వాత టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోయింది. కొందరేమో వీరి వయస్సుల గురించి చర్చిస్తే.. మరికొందరు డేటింగ్, పరిచయం ఎలా మొదలైంది అంటూ ఆరా తీస్తున్నారు. సమంత టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ కావడం.. రాజ్ నిడిమోరు సైతం తెలుగువాడు కావడంతో బ్యాక్ గ్రౌండ్ గురించి తెగ వెతికేస్తున్నారు. అదే క్రమంలో సామ్-రాజ్ ఆస్తులు కూడా హాట్ టాపిక్గా మారాయి. ఎవరికెంత ఆస్తులున్నాయి?.. ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ ఉన్నాయని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం.ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. కొద్ది కాలంలోనే స్టార్ హోదాను సొంతం చేసుకుంది. తెలుగులో అగ్రహీరోల సరసన వరుసపెట్టి సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే దక్షిణ భారత సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే హరోయిన్లలో ఒకరిగా నిలిచింది. సమంత ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రకటనల ద్వారా భారీగానే సంపాదించింది సామ్. పలు టాప్ కంపెనీలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు. దీంతో ఓవరాల్గా డిసెంబర్ 2025 నాటికి సమంత ఆస్తుల విలువ దాదాపు రూ.110 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం.సమంత ఆస్తులే ఎక్కువ.. ఇక రాజ్ నిడిమోరు ఆస్తుల విషయానికొస్తే బాగానే వెనకేసినట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం రాజ్ నిడిమోరు ఆస్తుల విలువ దాదాపు రూ.85 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన రాజ్ కంటే సమంతనే 29 శాతం అధికంగా ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వీరిద్దరి ఆస్తులను కలిపితే ఏకంగా రూ.200 కోట్ల వరకు ఉంటుందని నెటిజన్స్ అంచనా వేస్తున్నారు.కాగా.. వీరిద్దరు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట డిసెంబర్ 1న వివాహబంధంలోకి అడుగుపెట్టింది. -
సమంత రెండో పెళ్లి.. నాగచైతన్య పాత వీడియో వైరల్
డేటింగ్ వార్తలకు తెరదించుతూ సమంత- రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఉన్న లింగభైరవి దేవి సన్నిధిలో యోగ సంప్రదాయం ప్రకారం ‘భూత శుద్ధి వివాహం’ ద్వారా సామ్-రాజ్ ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. అటు సామ్(Samantha)కి, ఇటు రాజ్కి ఇది రెండో పెళ్లి. 2017లో సమంత.. నాగ చైతన్య(Naga Chaitanya)ను ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత 2021లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్నప్పటికీ.. సామ్ మాత్రం ఒంటరిగా ఉంది. రాజ్తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చినా.. ఆమె స్పందించలేదు. ఇప్పుడు సడెన్గా పెళ్లి చేసుకొని అందరికి షాకిచ్చింది. (చదవండి: సమంత రెండో పెళ్లి.. అలా చేసుకున్న స్టార్ హీరోయిన్స్ వీళ్లే..!)ఇదిలా ఉంటే.. సామ్ పెళ్లి చేసుకున్న ఫోటోలు బయటకు రాగానే.. సోషల్ మీడియా నాగచైతన్యకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. గతంలో ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చైతన్య విడాకుల విషయంపై ఎమోషనల్గా మాట్లాడారు.‘నా జీవితంలో ఏదైనా జరిగింది(విడాకులు).. అలా చాలా మంది జీవితాల్లో కూడా జరిగింది. కానీ నన్ను ఒక్కడినే క్రిమినల్గా ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదు. మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం.ఈ విడాకుల బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుండే బ్రోకెన్ ఫ్యామిలీ నుండి వచ్చాను. అందుకే ఒక బంధాన్ని బ్రేక్ చేసుకునే సమయంలో ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించాను. వెయ్యి సార్లు ఆలోచించాకే ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం. ఆ సమయంలో మాకు ప్రైవసీ ఇవ్వాలి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు అది హెడ్ లైన్గా అయిపోయి.. గాసిప్లా మార్చేసి.. చివరకు ఆ టాపిక్ని ఒక ఎంటర్టైన్మెంట్లా మార్చేశారు. నేను చాలా సార్లు ఆలోచించాను. బయటకు వచ్చి దాని గురించి మాట్లాడితే.. దాని మీద కూడా ఇంకొన్ని ఆర్టికల్స్ పుడతాయి. అందుకే మాట్లాడలేదు. రాసేవాళ్లే దీనికి ఫుల్స్టాఫ్ పెట్టాలి’ అని చైతూ చెప్పుకొచ్చాడు. The moment he's speaking with a well-disciplined expression I'm came here from a broken family, Naaku thelusu aa pain ento.Hatts off to your Maturity levels 📈 #NagaChaitanya ❤️🩹🛐 pic.twitter.com/8aYYqCU9HX— Amoxicillin (@__Amoxicillin_) December 1, 2025 -
పక్క ఇల్లు కూల్చేయడం కరెక్ట్ కాదు.. పూనమ్ పోస్ట్ ఎవరి గురించి?
టాలీవుడ్లో అప్పట్లో హీరోయిన్గా పలు సినిమాలు చేసిన పూనమ్ కౌర్.. ఎప్పటికప్పుడు ఏదోలా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్పై గతంలో పలుమార్లు సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతానికి యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ట్వీట్ చేస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే ఓ మహిళ గురించి పరోక్షంగా ప్రస్తవించింది.(ఇదీ చదవండి: సమంతకు ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం అయిపోయిందా?)'మన ఇల్లు బాగుండాలని పక్క ఇల్లు కూల్చేయడం సరికాదు. అది కూడా ఓ శక్తిమంతమైన బాగా చదువుకున్న ఎక్కువ ప్రాధాన్యం గల మనిషి ఇలా చేయడం చాలా బాధాకరం. డబ్బు ఏదైనా చేయిస్తుంది' అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. సరిగ్గా ఈమె ట్వీట్ చేసినప్పుడే సమంత మరో పెళ్లి చేసుకుంది. దీంతో పూనమ్.. సమంతని ఉద్దేశిస్తూనే ఈ ట్వీట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.సమంతకు ఇది రెండో పెళ్లి. 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుల్లో ఒకడైన రాజ్ నిడిమోరునే వివాహం చేసుకుంది. రాజ్కి కూడా ఇది రెండో పెళ్లినే. 2015లో శ్యామోలి అనే మహిళతో ఇతడికి పెళ్లి జరిగింది. ఆమెకు మూడేళ్ల క్రితమే విడాకులు ఇచ్చేశాడని అంటున్నారు గానీ దాని గురించి పెద్దగా క్లారిటీ లేదు. అలాంటిది ఇప్పుడు సామ్-రాజ్.. ఈశా ఫౌండేషన్లోని ఓ ఆశ్రమంలో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సమంతనే బయటపెట్టింది. కొన్ని ఫొటోలు కూడా పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?) -
ఎప్పుడో హింట్ ఇచ్చిన సమంత.. ఇప్పుడు పెళ్లి జరిగేసరికి
హీరోయిన్ సమంత మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తీసిన దర్శకుల్లో ఒకరైన దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కోయంబత్తూర్లోని ఈశా ఫౌండేషన్లో ఈ శుభకార్యం జరిగింది. ఈ క్రమంలోనే నెటిజన్లు.. ఈ పెళ్లి గురించి తెగ డిస్కషన్ చేస్తున్నారు. ఇక్కడివరకు అందరికీ తెలుసు. అయితే సమంతకు చాన్నాళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగిందా? ఆ మేరకు హింట్ కూడా ఇచ్చిందా? అనేది ఇప్పుడు వైరల్ అవుతోంది.రాజ్తో సమంత స్నేహం ఇప్పటిది కాదు. 'ద ఫ్యామిలీ మ్యాన్' షూటింగ్ చేస్తున్న టైంలోనే అంటే 2020 నుంచే వీళ్లకు పరిచయముంది. కాకపోతే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ల మధ్య బాండింగ్ పెరిగినట్లుంది. మరి ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలియదు గానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం సామ్-రాజ్ ఎప్పటికప్పుడు జంటగానే కనిపిస్తూ వచ్చారు. దీంతో వీళ్ల డేటింగ్ గురించి రూమర్స్ చాలానే వచ్చాయి. అయితే ఇలా సడన్గా పెళ్లి చేసుకుని షాక్ ఇస్తారని మాత్రం ఎవరూ అనుకోలేదు.(ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)పెళ్లి తర్వాత ఫొటోలని సమంత.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఒకదానిలో చేతికి డైమండ్ రింగ్ ఉంది. అయితే ఈ రింగ్ గతంలో సామ్ పోస్ట్ చేసిన ఓ ఫొటోలోనూ కనిపించింది. అది కూడా ఈ ఏడాది వాలంటైన్స్ డేకి ముందు రోజు. అంటే 10 నెలల క్రితమే సమంతకు నిశ్చితార్థం అయిపోయిందా? అనే సందేహం వస్తోంది. అప్పుడే చేతికి రింగ్తో హింట్ ఇచ్చింది కానీ అభిమానులు పసిగట్టలేకపోయారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.సమంత.. గతంలో తెలుగు హీరో నాగచైతన్యని 2017లో పెళ్లి చేసుకుంది. కాకపోతే మనస్పర్థల కారణంగా 2021లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు రాజ్ నిడిమోరు కూడా శ్యామోలి అనే మహిళని 2015లో పెళ్లి చేసుకున్నాడు. 2022లో వీళ్లు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలా సామ్, రాజ్.. ఇద్దరికీ ఇది రెండో పెళ్లినే కావడం విశేషం.(ఇదీ చదవండి:'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. అసలేంటిది?) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
నిజాయతీతో పనిచేయాలి.. నాగచైతన్య ట్వీట్
సినీ నటుడు నాగచైతన్య సోషల్మీడియాలో ఒక పోస్ట్ చేశారు. తను నటించిన తొలి వెబ్సిరీస్ 'దూత' రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. నిజాయతీగా ఒక ప్రాజెక్ట్ కోసం పనిచేస్తే ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారని దూత నిరూపించిందని నాగచైతన్య అభిప్రాయపడ్డారు. నటుడిగా సృజనాత్మకమైన కథను ఎంపిక చేసుకుని అందుకు తగ్గట్టుగా నిజాయతీతో పని చేసి ఆపై మంచి ప్రదర్శన ఇస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆయన అన్నారు. ‘దూత’ రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రాజెక్ట్లో భాగమైన అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఒక పోస్ట్ చేశారు.దూత వెబ్సిరీస్ చాలా బాగా నచ్చిందంటూ అభిమానులు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. సీజన్-2 ఎప్పుడు తీసుకోస్తారంటూ వారు కోరుతున్నారు. దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన ఈ సిరీస్ 2023 డిసెంబరు 1న ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో విడుదలైంది. ఇందులో జర్నలిస్టు సాగర్ వర్మ పాత్రలో నాగచైతన్య మెప్పించారు. నాగచైతన్య దూత వెబ్ సిరీస్ గురించి ట్వీట్ చేయడంతో సమంత పెళ్లి గురించి కూడా కామెంట్ల రూపంలో అడుగుతున్నారు. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
రాజ్తో సమంత రెండో పెళ్లి.. ఇంత ఏజ్ గ్యాప్ ఏంటి సామీ..!
గత కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్కు నేటితో చెక్ పడింది. సామ్-రాజ్ ఎక్కడా కనిపించినా డేటింగ్ రూమర్స్ వైరలయ్యాయి. అంతేకాకుండా వీరిద్దరు మరింత సన్నిహితంగా మెలగడంతో అభిమానులతో పాటు నెటిజన్స్ సైతం దాదాపు ఫిక్సయిపోయారు. అందరూ అంచనాలను నిజం చేస్తూ రెండో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది సమంత. ఊహించిందే అయినప్పటికీ.. సామ్ స్టార్ హీరోయిన్ కావడంతో హాట్ టాపిక్గా మారింది. ఎట్టకేలకు ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఇషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో వివాహం చేసుకుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం.ఇక పెళ్లి విషయం పక్కనపెడితే అందరి నోటా ఒకటే చర్చ నడుస్తోంది. రెండో పెళ్లి ఓకే.. కానీ వీరిద్దరు వయస్సు మధ్య తేడా ఎంత అనేది ప్రశ్న. ప్రేమ, పెళ్లికి వయసుతో పనేంటని అందరూ అంటూనే ఉంటారు. కానీ జీవితాంతం కలిసి ఉండాల్సిన ఇద్దరి మధ్య వయసు తేడా అనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు సామ్- రాజ్ ఏజ్ గ్యాప్ ఎంతనేది కూడా నెట్టింట చర్చ మొదలైంది. పెళ్లి చేసుకునే జంటకు పదేళ్ల లోపు ఏజ్ గ్యాప్ ఉంటే మంచిదని అందరూ అనడ మనం వింటుంటాం. మరి వీరి మధ్య ఏంత తేడా ఉంది? అసలు సమంత- రాజ్ మధ్య ఎంత గ్యాప్ ఉందో తెలుసుకుందాం.సమంత రూత్ ప్రభు 1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించారు. ఈ లెక్కన సమంతకు ప్రస్తుతం 38 ఏళ్లు. అయితే రాజ్కు సంబంధించిన అఫీషియల్ పుట్టినరోజు లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాజ్ 1975 ఆగస్టు 4వ తేదీన తిరుపతలో జన్మించారని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆయనకు ఇప్పుడు 50 ఏళ్లు. ఈ లెక్కన సామ్- రాజ్కు మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు 12 సంవత్సరాలు. వయస్సుల పరంగా చూస్తే ఇద్దరి మధ్య ఇంత అంతరం ఉండడం చర్చకు దారితీసింది. దీంతో సమంత నిర్ణయంపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ప్రేమకు వయస్సుతో పనిలేదని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా ఇద్దరి మధ్య పదేళ్ల లోపు ఏజ్ గ్యాప్ ఉంటే మంచిదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. సమంత రూత్ ప్రభు 2017లో టాలీవుడ్ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2021లో వివాహాబంధానికి గుడ్ బై చెప్పేసింది. తాజాగా మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. రాజ్ నిడిమోరును పెళ్లాడింది. రాజ్ సైతం గతంలో శ్యామలి దేను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. సామ్- రాజ్.. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ల్లో కలిసి పనిచేశారు. -
'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. అసలేంటిది?
సమంత మరో పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్స్ని నిజం చేస్తూ 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూర్లోని ఈశా ఫౌండేషన్లోని లింగ భైరవి దేవి సన్నిధిలో ఈ శుభాకార్యం జరిగింది. అయితే 'భూత శుద్ధి ఆచారం' అనే సంప్రదాయం ప్రకారం సమంత.. ఈ వివాహం చేసుకుంది. ఇంతకీ ఏంటిది? దీనికి అర్థం ఏంటి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం సమంత పెళ్లిని నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియే ఇది. నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు.. పంచభూతాలు శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటి కావడమే ఈ 'భూత శుద్ధి వివాహం'.ఈశా యోగ కేంద్రలో ప్రాణ ప్రతిష్ట చేసిన లింగ భైరవి దేవి.. స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర, కారుణ్య స్వరూపం. జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో విశిష్ట ఆచారాలకు ఈ ఆలయం నెలవు. విశ్వంలోని సృజనాత్మక శక్తికి ప్రతీకగా నిలిచే ఈ ఎనిమిది అడుగుల శక్తి స్వరూపం. భక్తుల మనశ్శరీరాలకు, శక్తులని స్థిరపరుస్తూ, పుట్టుక నుంచి మరణం వరకు జీవితంలోని ప్రతిదశలోనూ వారికి అండగా నిలుస్తుంది. ఈ విషయాన్ని ఈశా ఓ ప్రకటన రూపంలో తెలియజేసింది. ప్రస్తుతం సమంత పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంత .. రాజ్ పెళ్లిపై మొదటి భార్య షాకింగ్ పోస్ట్.!
-
సమంత రెండో పెళ్లి ఫోటోలు వైరల్..
-
సమంత- రాజ్ రెండో పెళ్లి ఫోటోలు చూశారా..
-
Coimbatore: 30 మంది అతిథుల సమక్షంలో.. సమంత రెండో పెళ్లి!!
-
రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
హీరోయిన్ సమంత.. దర్శకుడు రాజ్ని పెళ్లి చేసుకుంది. సోమవారం ఉదయం నుంచి తెగ వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ సమంత అధికారికంగా ప్రకటించింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లోని ఓ ఆశ్రమంలో ఈ శుభకార్యం జరిగింది. సరే ఇదంతా పక్కనబెడితే ఇంతకీ రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? ఇతడు తెలుగోడే అని మీలో ఎంతమందికి తెలుసు?రాజ్ పూర్తి పేరు రాజ్ నిడిమోరు. పుట్టి పెరిగింది అంతా తిరుపతిలోనే. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసిన వెంటనే ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిపోయాడు. అక్కడే ఇతడికి సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న డీకేతో (కృష్ణ దాసరి) పరిచయం ఏర్పడింది. అలా వీళ్లిద్దరూ స్నేహితులు అయ్యారు. కలిసి మొదటగా ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. అది సక్సెస్ కావడంతో 'ఫ్లేవర్స్' అనే ఇంగ్లీష్ మూవీ తీశారు. తర్వాత స్వదేశానికి తిరిగొచ్చేశారు.మొదటగా హిందీలో '99' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. తర్వాత తెలుగులో 'ఇంకోసారి' అనే చిత్రానికి రైటర్స్గా పనిచేశారు. మళ్లీ హిందీలో 'షోర్ ఇన్ ద సిటీ', గో గోవా డాన్ అనే మూవీస్ తెరకెక్కించారు. అనంతరం తెలుగులో 'డీ ఫర్ దోపిడీ' అనే సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇందులో నవీన్ పొలిశెట్టి ఓ హీరోగా నటించాడు. తర్వాత పూర్తిగా బాలీవుడ్కే పరిమితమైపోయారు. బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే రాజ్-డీకేకి 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్తో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 2019లో తొలి సీజన్ రిలీజ్ కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. రెండో సీజన్ కోసం విలన్ పాత్ర కోసం సమంతని ఎంపిక చేశారు. అలా సమంత-రాజ్ మధ్య తొలి పరిచయం ఏర్పడింది. వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతున్న టైంలో వీళ్లిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది.కొన్నాళ్ల తర్వాత రాజ్-డీకే తీసిన 'సిటాడెల్' వెబ్ సిరీస్లో సమంత లీడ్ రోల్ చేసింది. అప్పటినుంచి పలు సందర్భాల్లో రాజ్తో ఉన్న ఫొటోలని సమంత పోస్ట్ చేస్తుండేది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ మాట్లాడుకున్నారు. గత కొన్ని నెలల్లో ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి. దీంతో త్వరలో గుడ్ న్యూస్ చెబుతారేమోనని అంతా అనుకున్నారు. ఇప్పుడు సడన్గా సమంతతో రాజ్ పెళ్లి అయిపోయింది. ఈ మేరకు సమంత ప్రకటన చేసింది.సమంతకి ఇది రెండో పెళ్లి. అలానే రాజ్కి కూడా ఇది రెండో పెళ్లినే. 2015లో శ్యామోలిని పెళ్లి చేసుకున్న రాజ్.. 2022లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. రాజ్ ఆస్తుల విషయానికొస్తే.. దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ.90 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయట. మిత్రుడు డీకేతో కలిసి డీ2ఆర్(D2R) అనే నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఇందులో ఇప్పటికే పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు నిర్మించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ట్రెండింగ్లో సమంత (ఫొటోలు)
-
మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత
-
మరో పెళ్లి చేసుకున్న సమంత
హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్ల నుంచి ఈమె.. దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే చాలాసార్లు వీళ్లు జంటగా కనిపించారు. ఇప్పుడు ఆ వార్తలని నిజం చేస్తూ సింపుల్గా వివాహం చేసుకున్నారు.పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఈరోజు (డిసెంబరు 01) ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో కేవలం 20 మంది అతిథుల సమక్షంలోనే సామ్-రాజ్ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ మేరకు మొదట వార్తలు బయటకొచ్చాయి. కాసేపటికే సమంత.. తన సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)'ఏ మాయ చేశావె' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. తర్వాత ఎన్టీఆర్, మహేశ్ బాబు తదితర స్టార్ హీరోలతో పనిచేసింది. నాగచైతన్యతోనూ పలు చిత్రాల్లో కలిసి పనిచేసింది. అలా చేస్తున్న టైంలోనే సామ్-చైతూ ప్రేమలో పడ్డారు. పెద్దల్ని ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు.విడాకుల తర్వాత హీరోయిన్ శోభితతో నాగచైతన్య ప్రేమలో పడ్డారు. గతేడాది వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ చేస్తున్న టైంలో సమంత-రాజ్ మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. తర్వాత వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు వివాహంతో ఒక్కటయ్యారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)(ఇదీ చదవండి: భరణి ఉగ్రరూపం.. నామినేషన్స్లో ఆరుగురు) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
డిజిటల్ హింసపై యునైట్ ఫైట్
‘బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు’ సరదాగా పాడుకున్న పాట. బుల్లిపెట్టెలో ఆ బూచాడు లేకపోవచ్చు. కాని ఇప్పటి బుల్లిపెట్టెలలో (స్మార్మ్ఫోన్స్, ల్యాప్టాప్, ట్యాప్)లలో ఒక రాక్షసుడు దాగి ఉన్నాడు. మహిళలను లక్ష్యంగా చేసుకొని క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ రాక్షడుసుడి పేరు... ‘డిజిటల్ హింసాసురుడు’‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయోలెన్స్ అగేనెస్ట్ ఉమెన్’ సందర్భంగా ఐక్యరాజ్య సమితి డిజిటల్ హింసకు వ్యతిరేకంగా పదహారు రోజుల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాలలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమంది భాగస్వాములు అవుతున్నారు... కాలంతో పాటు మహిళలపై జరిగే హింసా రూపాలు మారుతున్నాయి.‘డిజిటల్ వయోలెన్స్’ అనేది ఇప్పుడు సరికొత్త సాంకేతిక హింస.వైరల్ అయినా ప్రమాదమేనా?!కేవలం రెండు సెకన్ల వీడియోతో ఇటీవల ఇంటర్నెట్ అబ్సెషన్గా మారింది ప్రియంగన. తక్కువ టైమ్లోనే ఈ వీడియో క్లిప్ 50 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు... ఆమె ఏఐ వీడియోలు ఆల్లైన్లో వెల్లువెత్తాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఆమె ఏఐ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. పరిస్థితి ప్రమాదం వైపు వెళుతుందని గ్రహించిన ప్రియంగన మెల్లగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లను తొలిగించడం మొదలుపెట్టింది. తన వీడియో క్లిప్ వైరల్ కావడం వల్ల ఎదురైన సమస్యలను ఏకరువు పెట్టిన ప్రియంగన తన ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఇమేజ్ల వల్ల తాను, తన కుటుంబం ఇబ్బందులు పడినట్టు తెలియజేసింది. ఇది మచ్చుకు చిన్న ఉదాహరణ మాత్రమే!అవమానాలు...ఆత్మహత్యలుడిజిటల్ హింస భరించలేక మానసిక సమస్యల బారిన పడుతున్నవారూ, ఆత్మహత్యలు చేసుకుంటున్నవారూ దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. టెక్నాలజీ–ఫెసిలేటెడ్ జెండర్–బేస్డ్ వయోలెన్స్(టీఎఫ్జీబివి) వల్ల మన దేశంలోని ఆన్లైన్ స్పేస్లు మహిళల పాలిట ప్రమాదకరంగా మారుతున్నాయని ఒక నివేదిక హెచ్చరించింది. బహిరంగంగా అవమానించడం, అవహేళన చేయడం, బెదిరింపులు... మొదలైన రూపాల్లో మహిళలపై డిజిటల్ హింస జరుగుతోంది. ఫొటోల డిజిటల్ మాన్యుపులేషన్, ఫేక్ ఎకౌంట్స్, సైబర్ బుల్లీయింగ్, కోఆర్డినేటెడ్ ఎటాక్స్.. మొదలైనవి డిజిటల్ హింస తాలూకు వివిధ రూపాలు. అశ్లీల సైట్లు, చాట్ ప్లాట్ఫామ్లలో తాము టార్గెట్ చేసిన మహిళల చిత్రాలను పోస్ట్ చేసి అసభ్య రాతలు రాస్తుంటారు. ‘ఇది నా ఫోన్ నంబర్ కాల్ చేయండి’ అని ఫోన్ నెంబర్ పెడుతుంటారు.ఫిర్యాదు చేయాలా, వద్దా?డిజిటల్ వేదికలలో కొందరు నేరస్థులు మంచి మాటలతో అమ్మాయిలను పరిచయం చేసుకొని, స్నేహం చేస్తారు. ఆ తరువాత రకరకాలుగా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంత జరుగుతున్నా చాలామంది బాధితులు పోలిస్స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.‘ఫిర్యాదు చేయడం అనేది మరొకరకమైన హింస. నా దురదృష్టం అని బాధపడి ఊరుకున్నాను’ అంటుంది దిల్లీకి చెందిన ఒక బాధిత మహిళ. పదిమందికి తెలిస్తే పరువు పోతుంది అనుకోవడం, కుటుంబ ఒత్తిళ్లు, న్యాయం జరగదు అనే అపోహల వల్ల చాలా మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి దూరంగా ఉంటున్నారు. కొందరు బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసినా, ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి ఎంతో కాలం పట్టడం లేదు. భద్రతతో పాటు ఇంకా ఎన్నో అంశాలు ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి కారణం అవుతున్నాయి. ఫిర్యాదులు అందినప్పుడు కొన్ని కేసులకు సంబంధించి ఎలా స్పందించాలో పోలీసులకు తెలియడం లేదు.చట్టం ఉన్నా సరే...మన దేశంలో సైబర్ నేరాలను నిరోధించే ప్రధాన చట్టం సమాచార సాంకేతిక చట్టం–2000 (ఐటీ చట్టం) అయితే ఇది ప్రధానంగా ఆస్తి, డేటాకు సంబంధించిన నేరాలపై మాత్రమే ప్రధానంగా దృష్టి సారిస్తోంది.‘మహిళలపై జరిగే డిజిటల్ హింసకు సంబంధించి ఈ చట్టం సమర్ధంగా ఉపయోగపడడం లేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొందరు.‘ఫిర్యాదు అందిన వెంటనే హానికరమైన కంటెంట్ను తక్షణమే తొలగించాలి. ఈ విషయంలో కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది బెంగళూరుకు చెందిన ఒక బాధితురాలు.‘డిజిటల్ స్పేస్లను సురక్షితంగా మార్చడానికి తగిన న్యాయ, విధాన సంస్కరణలు, బలమైన చట్టాలు అవసరం. వేగంగా న్యాయం జరగాలి. టెక్ కంపెనీలు తమ వేదికలపై జరిగే హానికి బాధ్యత తీసుకోవాలి’ అంటుంది విద్యావేత్త, రచయిత్రి అమంద. ‘ఆన్లైన్ కేసుల నుంచి తప్పించుకోవడానికి చట్టంలోని లొసుగులను వాడుకుంటున్నారు. అలాంటివి జరగకుండా చూడాలి’ అంటోంది ముంబైలోని ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న జీవని.డిజిటల్ హింసపై వార్జెండర్–ఆధారిత హింసకు వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ విమెన్ ఇండియా పదహారు రోజుల ప్రచారకార్యక్రమం నిర్వహిస్తోంది. నవంబర్ 25న మొదలైన ఈ ప్రచార కార్యక్రమాలు డిసెంబర్ 10 వరకు కొనసాగుతాయి. ఈ జెండర్బేస్డ్ వయోలెన్స్ వ్యతిరేక క్యాంపెయిన్లో యునెటైడ్ విమెన్ ఇండియాతో కలిసి పనిచేస్తోంది సినీ నటి, నిర్మాత సమంత.‘మహిళలు, పిల్లలపై జరిగే హింసను అంతం చేయడాకి ఐక్యం అవ్వండి’ అనే నినాదంతో ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. పెరుగుతున్న ఆన్లైన్ వేధింపుల గురించి సమంత అవగాహన పరుస్తుంది. అప్రమత్తం చేస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్పై అమ్మాయిలు, మహిళలు ఎదుర్కొంటున్న స్టాకింగ్, డాక్సింగ్. డీప్ఫేక్స్, ఇమేజ్ మాన్యుపులైజేషన్పై గట్టిగా గొంతు విప్పుతోంది. ‘హింస అనేది ఇప్పుడు శారీరక హింస మాత్రమే కాదు. అది స్క్రీన్ రూపంలో కూడా వెంటాడుతుంది. మన గొంతులను నొక్కి మౌనంగా చేస్తుంది. మహిళలే లక్ష్యంగా చేసుకునే జరిగే డిజిటల్ హింస వారి భద్రత, గుర్తింపు,ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది’ అంటుంది సమంత. సోషల్ మీడియాలో లక్షలాది ఫాలోవర్స్ ఉన్న సమంత డిజిటల్ హింసకు సంబంధించి తన వ్యక్తిగత చేదు అనుభవాలను పంచుకుంటుంది. క్యాంపెయిన్లో భాగంగా ‘వీడియో మెసేజ్’ను విడుదల చేసింది ‘యూఎన్ విమెన్ ఇండియాతో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. డిజిటల్ ప్లాట్ఫామ్లకు జవాబుదారీతనం పెరగాలి. రక్షణ చట్టాలను బలోపేతం చేయాలి’ అంటుంది సమంత.ఐశ్వర్య... హైకోర్టు వరకుతన వ్యక్తిగత హక్కులను రక్షించుకోవడానికి కోర్టును ఆశ్రయించింది బాలీవుడ్ సెలబ్రిటీ ఐశ్వర్యరాయ్ బచ్చన్. దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజñన్స్(ఏఐ), డీప్ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి తన చిత్రాలను మార్ఫింగ్ చేస్తున్నారని, అసభ్యకరమైన వీడియోలు సృష్టిస్తున్నారని తన పిటిషన్లో తెలియజేసింది ఐశ్వర్య. తన వ్యక్తిగత గోప్యతా హక్కును పరిరక్షించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ‘ఐశ్వర్య ఫొటోలు దురిన్వియోగం చేయడం అనేది ఆమె గౌరవ, ప్రతిష్ఠలను దెబ్బతియడమే’ అని పేరొన్న న్యాయస్థానం పిటిషన్లో ఐశ్వర్య పేర్కొన్న యూఆర్ఎల్లను బ్లాక్ చేయాలని గూగుల్తో సహా రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్లను ఆదేశించిది. -
ఆన్లైన్ హింసను అరికట్టాలి
‘‘మనం హింస గురించి ఆలోచించినప్పుడు వీధుల్లో, ఇంట్లో, పని ప్రదేశాల్లో జరుగుతుందనుకుంటాం. కానీ, ప్రస్తుతం ఆన్లైన్లో కూడా జరుగుతోంది. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ హింసని ఎదుర్కొంటోంది’’ అని పేర్కొన్నారు సమంత. మహిళలపై పెరుగుతోన్న ఆన్లైన్ వేధింపులకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితితో కలిసి పని చేయనున్నారామె. మహిళల గౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యత అంటూ యూఎన్ విమెన్ ఇండియా నిర్వహిస్తున్న ‘నో ఎక్స్క్యూజ్’ కార్యక్రమానికి సమంత మద్దతుగా నిలిచారు. నవంబరు 25న ప్రారంభమైన ఈ కార్యక్రమం డిసెంబర్ 10 వరకు జరగనుంది. ‘‘సోషల్ మీడియాలో కామెంట్స్, ఆన్లైన్ బెదిరింపులు, డీప్ ఫేక్ ఫొటోలు వంటివన్నీ జరుగుతున్నాయి. ఇవి మహిళలు నలుగురిలో తమ గొంతు వినిపించడానికి కూడా భయపడేలా చేస్తున్నాయి... అభద్రతాభావాన్ని కలిగిస్తున్నాయి. నేను ఎన్నోసార్లు ఈ పరిస్థితిని అనుభవించాను. వేధింపుల వల్ల చాలామంది మహిళల జీవితాలు, కెరీర్ ఆగిపోయాయి. ఆన్లైన్లో అబ్యూజ్ చేయడాన్ని జోక్గా ట్రీట్ చేయడం ఆపేస్తే మనం ఇంటర్నెట్ని బెటర్గా మార్చొచ్చు. ఆన్లైన్ హింసను అరికట్టడానికి మరింత బలమైన వ్యవస్థలు రావాలి. ఇది మహిళలకు భద్రతగా మారుతుంది. ఇలాంటి వాటిపై మహిళల్లో అవగాహన పెరగాలి’’ అని సమంత పేర్కొన్నారు. -
'అలా నాకు సాధ్యం కాదని అనుకునేదాన్ని'.. సమంత పోస్ట్ వైరల్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో బిజీగా ఉంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించింది. ఈ చిత్రానికి సామ్ నిర్మాత కాగా.. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కొద్దికాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా ఉంటూ వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడికెళ్లినా రాజ్, సామ్ జంటగా కనిపించడంతో పాటు అత్యంత సన్నిహితంగా మెలగడంతో దాదాపు కన్ఫామ్ అయినట్లేనని ఆడియన్స్ భావిస్తున్నారు.ఇదిలా ఉంటే సమంత తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. జిమ్లో వర్కవుట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా సుదీర్ఘమైన నోట్ కూడా రాసుకొచ్చింది. ఫుల్ యాక్షన్ మోడ్.. బీస్ట్ మోడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కొన్నేళ్ల క్రితం నా బ్యాక్ బలంగా లేదని వదిలేశా.. ఎందుకంటే నా జీన్స్లో అలా లేదని అనుకునేదాన్ని అని తెలిపింది. ఎవరినైనా అలాంటి వారిని చూసినప్పుడు.. నాకు అలా సాధ్యం కాదని అనుకుంటానని సామ్ పోస్ట్ చేసింది.కానీ అదంతా తప్పని ఇప్పుడు తెలిసింది. నిజాయితీగా చెప్పాలంటే ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నా.. దాన్ని ఇప్పుడు చూపించబోతున్నా.. ఎందుకంటే ఇక్కడికి చేరుకోవడానికి చాలా తీవ్రంగా శ్రమించానని సామ్ తెలిపింది. బాడీలో కండరాన్ని నిర్మించడం చాలా ముఖ్యం.. మీరు ఎలా కనిపిస్తారనే దాని కోసం మాత్రమే కాదు.. మీరు ఎలా జీవిస్తారు.. ఎలా కదులుతారు.. మీ వయస్సు ఎలా పెరుగుతుందనే దాని కోసమని తెలిపింది.అలాగే మీ వయసు పెరిగే కొద్ది.. బలమైన శిక్షణే మీ బెస్ట్ ఫ్రెండ్గా మారాలని సూచించింది. ఈ బలమైన శిక్షణే నాకు అన్నింటికంటే ఎక్కువ మేలు చేసింది.. క్రమశిక్షణ, సహనం నేర్పింది.. ఇదంతా జన్యువుల వల్ల వచ్చింది కాదని అర్థమైంది. అదంతా మనం చెప్పే ఒక సాకు మాత్రమేనని తనకు తెలిసొచ్చిందని సమంత పోస్ట్ చేసింది. నువ్వు ఏదైనా వదులుకునే దశలో ఉంటే.. ఇప్పుడు అస్సలు వదులుకోవద్దు.. నువ్వు అలానే ముందుకు సాగితే నీ భవిష్యత్తు చాలా బాగుంటుందని సామ్ అంటోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
మాస్ కాంబినేషన్ సెట్..!
-
రవితేజతో సమంత.. ఓ క్రైమ్ థ్రిల్లర్!
ఫలితంతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేసే టాలీవుడ్ హీరో రవితేజ.. కొన్నిరోజుల క్రితమే 'మాస్ జాతర'తో వచ్చాడు. కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండేసరికి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ప్రస్తుతం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే ఫ్యామిలీ మూవీ చేస్తున్నాడు. ఇది సంక్రాంతికి రిలీజ్ కానుంది. రీసెంట్గానే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయగా.. ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడనిపిస్తుంది.ఇప్పుడు రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్గా సమంతని తీసుకోబోతున్నారనే రూమర్ తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం టాలీవుడ్లో ఇది ఫ్రెష్ కాంబో అవుతుంది. ఇకపోతే ఈ ప్రాజెక్టుకు 'నిన్ను కోరి', 'మజిలీ' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తారని అంటున్నారు.(ఇదీ చదవండి: 'ఐ బొమ్మ' క్లోజ్.. మరి మిగతా వాటి సంగతి?)శివ నిర్వాణ సినిమాలు అనగానే దాదాపు ఫ్యామిలీ సబ్జెక్టులే గుర్తొస్తాయి. చివరగా తీసిన 'ఖుషి' లవ్ స్టోరీనే. అందులో హీరోయిన్ సమంతనే. అయితే శివ ఈసారి ఓ క్రైమ్ థ్రిల్లర్ కథ రాసుకున్నాడని.. దీనికి రవితేజ ఓకే చెప్పారని తెలుస్తోంది. ఇప్పుడు సమంత హీరోయిన్గా కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. ఈ నెలలోనే లాంచ్ ఉండొచ్చని టాక్.ఈ మధ్యే సమంత.. 'మా ఇంటి బంగారం' అనే సినిమా మొదలుపెట్టింది. హీరోయిన్ కమ్ నిర్మాత ఈమెనే. నందినీ రెడ్డి దర్శకురాలు. ఇప్పుడు రవితేజతోనూ మూవీ చేయనుందని టాక్ వచ్చిందంటే.. హీరోయిన్గా చేసేందుకు ఆసక్తి చూపిస్తుందనమాట. మరి వస్తున్న పుకార్లలో నిజమెంత అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
కొత్త చాప్టర్ మొదలైంది..: సమంత
హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఫోకస్ అంతా సినిమాల కన్నా బిజినెస్ వైపే ఎక్కువగా ఉంది. మొన్నటికి మొన్న కొత్త పర్ఫ్యూమ్ లాంచ్ చేసిన సామ్ ఇప్పుడు మరో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ 'ట్రూలీ స్మా' అనే క్లాతింగ్ బ్రాండ్ను లాంచ్ చేసింది. ఈ బ్రాండ్కు సామ్ సహ వ్యవస్థాపకురాలిగా ఉంది. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు హీరోయిన్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.బిజినెస్ ఉమెన్సమంత యాక్టింగ్కే కాదు, లుక్స్కు కూడా చాలా మంది ఫిదా అవుతుంటారు. ఎప్పుడూ కొత్త డిజైనరీ డ్రెసెస్ ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పటికే సామ్.. 'సాకీ' పేరుతో బట్టల బిజినెస్ చేస్తోంది. 2020లో ఈ వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ట్రూలీ స్మా అనే క్లాతింగ్ బ్రాండ్లో భాగమైంది. ఇవే కాకుండా తను 'ట్రలాలా' అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. ఈ బ్యానర్లో 'శుభం' అనే సినిమాతో మంచి బోణీ కొట్టింది. ఇదే బ్యానర్లో తను హీరోయిన్గా మా ఇంటి బంగారం మూవీ చేస్తోంది. ఈ మధ్యే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: 'శివ' చైల్డ్ ఆర్టిస్ట్కు 36 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన ఆర్జీవీ -
నాగార్జున కుటుంబంపై మరోసారి స్పందించిన కొండా సురేఖ
సినీ నటుడు నాగార్జున గురించి తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సోషల్మీడియా ద్వారా మరోసారి స్పందించారు. 'నాగార్జునకు సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు తన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశంతో చేయలేదని స్పష్టంగా తెలుపుతున్నాను. అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులను బాధపెట్టాలని లేదా పరువు తీయాలని నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. వారి కుటుంబ విషయంలో నేను చేసిన ప్రకటనలలో ఏదైనా అనుకోని పొరపాటు జరిగివుంటే దానికి చింతిస్తున్నాను. ఆపై ఆ వాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నాను.' అని మంత్రి కొండా సురేఖ ఒక పోస్ట్ చేశారు.కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్పై విమర్శలు చేసిన సందర్భంలో నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ మాట్లాడిన సంగతి తెలిసిందే. తన కుటుంబ గౌరవాన్ని కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని తప్పుబట్టిన నాగార్జున సురేఖపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members. I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members. I regret any unintended impression…— Konda Surekha (@iamkondasurekha) November 11, 2025 -
రాజ్తో సమంత డేటింగ్.. ఈ ఫోటోతో క్లారిటీ ఇచ్చేసిందిగా!
ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ సమంత (samantha) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె ఏ ఈవెంట్కెళ్లినా అతను కూడా వాలిపోతున్నాడు. గత కొన్ని నెలలుగా వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వీటిపై ఎప్పుడు కూడా స్పందించలేదు. కానీ ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఇటీవల సమంత కొత్త సినిమా ప్రారంభోత్సంలోనూ అతను కనిపించాడు.తాజాగా మరోసారి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు జంటగా కనిపించారు. అయితే ఎప్పటిలాగా కంటే ఈ సారి మరింత సన్నిహితంగా మెలిగారు. ఈ ఫోటోల్లో రాజ్ నిడిమోరును హగ్ చేసుకోవడం పెద్దఎత్తున చర్చ మొదలైంది. దీంతో అందరూ ఊహించినట్లుగానే రాజ్తో సామ్ డేటింగ్ చేస్తోందని కన్ఫామ్ చేసిందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. రాజ్ నిడిమోరు, సామ్ ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీసుల్లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత సామ్, రాజ్ మధ్య స్నేహం ఏర్పడింది. ఈ ఏడాది సమంత నిర్మించిన శుభం మూవీకి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. ప్రస్తుతం సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం మూవీకి కూడా పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
జ్యూవెల్లరీ ఎగ్జిబిషన్ కోసం సమంత గ్లామరస్ లుక్ (ఫొటోలు)
-
సమంత 'బంగారం'లో కాంతార విలన్
కొన్నిరోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'కాంతార 1'.. ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ శుక్రవారం ఓటీటీలోకి కూడా రానుంది. అయితే ఈ మూవీలో విలన్గా చేసిన గుల్షన్ దేవయ్య తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. గతంలో హిందీలో పలు చిత్రాలు, వెబ్ సిరీసులు చేసిన ఇతడు.. ఇప్పుడు తెలుగులో నటించేందుకు రెడీ అయిపోయాడు.(ఇదీ చదవండి: 'సలార్' కాటేరమ్మ ఫైట్లో నేనే చేయాలి.. కానీ: టాలీవుడ్ హీరో)మయాసైటిస్ కారణంగా చాన్నాళ్లుగా యాక్టింగ్ పక్కనబెట్టేసిన సమంత.. ఈ ఏడాది నిర్మాతగా 'శుభం' అనే మూవీని రిలీజ్ చేసింది. ఇప్పుడు తనే నిర్మాత కమ్ హీరోయిన్గా 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో నటిస్తోంది. దసరాకు పూజతో లాంఛనంగా మొదలైన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా ఇప్పుడు షురా అయిపోయింది. ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు.నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత.. గృహిణిగా ఉంటూనే గన్ పట్టి యాక్షన్ కూడా చేయబోతుంది. ఇదే మూవీలో 'కాంతార 1' ఫేమ్ గుల్షన్ దేవయ్య కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇతడే స్వయంగా బయటపెట్టాడు. సమంత పోస్ట్ని తన ఇన్ స్టా స్టోరీలో రీ పోస్ట్ చేసిన ఇతడు.. 'నేను కూడా ఇందులో ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. ఇదే ఇతడికి తెలుగులో మొదటి సినిమా. మరి సమంత పక్కన నటిస్తాడా లేదంటే విలన్గా చేయబోతున్నాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: కొందరు నటులు అసలు సెట్కే రారు.. 'ఓజీ' విలన్ కామెంట్స్) -
బంగారం ఆన్ సెట్
‘‘సన్నిహితులు, స్నేహితుల ప్రేమ, ఆశీర్వాదాల నడుమ ‘మా ఇంటి బంగారం’ ముహూర్తంతో మా ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈ స్పెషల్ మూవీ ఆరంభించిన సందర్భంగా అందరి ప్రేమ, సహకారం మాకు కావాలి’’ అని సమంత పేర్కొన్నారు. ఆమె లీడ్ రోల్లో ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించి కొన్ని నెలలైంది. ఫైనల్గా సోమవారం ఈ చిత్రం సెట్స్కి వెళ్లింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ‘శుభం’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సమంత నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య తదితరులు ప్రధానపాత్రల్లో, గౌతమి, మంజుషా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు. ‘ఓ బేబి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ యాక్షన్ మూవీకి సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: ఓం ప్రకాశ్. -
ఫైనల్లీ సమంత హీరోయిన్గా కొత్త సినిమా (ఫొటోలు)
-
సమంత కొత్త సినిమా.. పూజ కార్యక్రమంలో రాజ్ నిడిమోరు!
టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) ఇటీవల దీపావళి పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. తన బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఈ వేడుకల్లో సందడి చేసింది. అఫీషియల్గా బయటికి చెప్పకపోయినా వీరిద్దరి రిలేషన్పై గత కొన్ని నెలలుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడా కూడా వీరిద్దరు నోరు విప్పలేదు. ఇదంతా పక్కనపెడితే సామ్ తెలుగులో మరో సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె మరోసారి జతకట్టింది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ దసరా సందర్భంగా సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం నిర్వహించారు. ముహుర్తం షాట్తో ఈ మూవీ షూటింగ్ను ప్రారంభించారు. ఈ పూజకు సంబంధించిన వీడియోను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా.. ఓ బేబీ మూవీ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డితో సమంత చేస్తోన్న రెండో చిత్రం కావడం విశేషం. ఈ మూవీని తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సామ్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ని స్థాపించిన సామ్.. శుభం అనే తొలి సినిమా నిర్మించింది. ఇందులో అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం మా ఇంటి బంగారంతో పాటు ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్లో నటిస్తోంది. Started our journey with the Muhurtham of #MaaIntiBangaram, surrounded by love & blessings. ✨We can’t wait to share with you what we’re creating… need all your love and support as we begin this special film. ❤️#MIB #Samantha #TralalaMovingPictures @TralalaPictures… pic.twitter.com/PwICPNsP8R— Samantha (@Samanthaprabhu2) October 27, 2025 -
సమంత 'మా ఇంటి బంగారం' షురూ!
హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) నటిస్తున్న తాజా చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaram Movie). ఇందులో సామ్ గృహిణిగా యాక్ట్ చేస్తోంది. సమంత బర్త్డే సందర్భంగా 2024లోనే ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. కానీ, షూటింగ్ ప్రారంభించలేదు. అయితే ఈ వారంలోనే సినిమా చిత్రీకరణ షురూ అయిందని ఫిలిం నగర్ సమాచారం. ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. హైదరాబాద్లోని ఓ స్టూడియోలో వేసిన సెట్లో సమంత పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఇక ఈ సినిమాలో నటించడంతో పాటు సమంత తన నిర్మాణ సంస్థ ట్రలాలా పిక్చర్స్పై నిర్మిస్తున్నారు.సినిమాసమంత టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. మహేశ్బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, రామ్చరణ్, నాగచైతన్య, నాని, నితిన్, విజయ్ దేవరకొండ... ఇలా పలువురు హీరోలకి జోడీగా నటించింది. ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లోనూ తనదైన నటనతో ఆకట్టుకుంది. ‘ఖుషి’ (2023) చిత్రం తర్వాత హీరోయిన్గా మరే సినిమా చేయలేదు. కాగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ని స్థాపించి శుభం అనే తొలి సినిమా నిర్మించింది. ఇందులో అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం మా ఇంటి బంగారంతో పాటు ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్లో నటిస్తోంది.చదవండి: కమల్-రజనీ మూవీ.. శృతి హాసన్, సౌందర్య ఏమన్నారంటే? -
రాజ్తో సమంత.. వైరలవుతోన్న దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
డేటింగ్ వార్తల వేళ.. రాజ్ కుటంబంతో సమంత దీపావళి సెలబ్రేషన్స్
సౌత్ ఇండియా నటి సమంతతో బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) డేటింగ్లో ఉన్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై వారిద్దరూ క్లారిటీ ఇవ్వకపోడం తరుచుగా కలిసి కెమెరా కంటపడుతున్నడంతో నిజమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే, తాజాగా రాజ్ కుటుంబంతో పాటుగా సమంత(Samantha) దీపావళి సెలబ్రేట్ చేసకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్మీడియాలో పంచుకోవడంతో వైరల్ అవుతున్నాయి. ఈ డేటింగ్ రూమర్స్ విషయంలో ఇప్పుడు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా సమంత పోస్ట్ చేశారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 నుంచి రాజ్ నిడిమోరుతో సమంతకు పరిచయం ఉంది. ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.ఈ దీపావళి సందర్బంగా పలు ఫోటోలతో పాటు నా హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండిపోయిందని సమంత ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఆపై ఆమె షేర్ చేసిన ఫోటోలలో రాజ్ తల్లిదండ్రులు ఉన్నారు. కానీ, అతని సతీమణి శ్యామాలి లేదు. దీంతో ఈ రూమర్స్కు మరింత బలాన్ని ఇచ్చేసినట్లు అయింది. శ్యామాలి కూడా రాజ్తో దూరంగా ఉన్నారని సమాచారం. అయితే, సమంత- రాజ్ రిలేషన్ గురించి ఆమె అప్పుడప్పుడు పరోక్షంగా పోస్టులు చేసేవారు. శ్యామాలి చివరిసారి 2023లో రాజ్తో దిగిన ఒక ఫొటోను పంచుకున్నారు. ఆ సమయం తర్వాత వారిద్దరు కలిసి ఎక్కడా కూడా కనిపించలేదు. రాజ్తో ఆమె విడిపోతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి. ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఆపై సమంత- రాజ్లు కూడా డేటింగ్ అంశంపై స్పందించలేదు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
పిల్లలతో కలిసి సమంత దీపావళి సెలెబ్రేషన్స్ (ఫోటోలు)
-
బన్నీ, అట్లీ మూవీలో సమంత.. మళ్ళీ ఊ అంటావా అననుందా..?
-
గృహప్రవేశం చేసిన సామ్.. కొత్తింట్లో పూజలు
హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఈ మధ్యే కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. ఆల్రెడీ సినిమాలు చేస్తోంది, నిర్మిస్తోంది. ఓ పక్క ఆరోగ్యం గురించి అవేర్నెస్ కల్పిస్తోంది, మరోవైపు ఫ్యాషన్, పర్ఫ్యూమ్ బిజినెస్ చేస్తోంది. అలాగే ఏకం అనే లెర్నింగ్ సెంటర్ని నడిపిస్తోంది. ఆ మధ్య పికిల్బాల్ టీమ్ కూడా కొనుగోలు చేసి వార్తల్లోకెక్కింది. ఇంకా కొత్త జర్నీ ఏంటనుకుంటున్నారా? మరేం లేదు.. తనకంటూ ఓ ఇల్లు కొనుగోలు చేసింది. ఈమధ్యే గృహప్రవేశంఅందులోనే తన ప్రయాణం ఉండబోతుందని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇటీవలే గృహప్రవేశం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో సమంత ఎరుపు రంగు డ్రెస్ సాంప్రదాయంగా ముస్తాబైంది. ముఖానికి కుంకుమ పెట్టుకుని పూజలో పాల్గొంది. పూజగది ఫోటోను షేర్ చేసింది. అలాగే తన జిమ్ వర్కవుట్స్ వీడియోను కూడా జత చేసింది.సినిమాటాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన సమంత.. ‘ట్రలాలా’ బేనర్తో నిర్మాతగా మారింది. తన సొంత బ్యానర్పై తొలిసారి ‘శుభం’ చిత్రాన్ని నిర్మించింది. ఇదే బేనర్లో తాను కథానాయికగా ‘మా ఇంటి బంగారం’ సినిమా చేస్తోంది. అలాగే రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ అనే హిందీ వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: ఎన్టీఆర్ బామ్మర్ది రిసెప్షన్ వేడుక.. సతీసమేతంగా హాజరైన అక్కినేని అఖిల్ -
సమంత బ్లాక్ బస్టర్ కంబ్యాక్
-
హీరోయిన్ సమంత బ్యూటీఫుల్ లుక్స్.. (ఫొటోలు)
-
కొత్త ప్రయాణం అంటూ ఫోటో షేర్ చేసిన సమంత
దసరా పండగ సందర్భంగా తన జీవితంలోని ఓ స్పెషల్ న్యూస్ను అభిమానులతో పంచుకుంది హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu). కొత్తింట్లోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. ఈ మేరకు కొత్త ప్రయాణం అంటూ తన ఇంటి ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అలాగే పూజగది ఫోటోను కూడా షేర్ చేసింది. ఇంటి బయట గోడపై తన నిక్నేమ్ SAM అనే లోగో అందంగా అమర్చి ఉంది. అయితే ఈ ఇల్లు హైదరాబాద్లో ఉందా? ముంబైలోనిదా? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఏదేమైనా కొత్తిల్లు కొన్న సామ్కు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమాసమంత సినిమాల విషయానికి వస్తే.. ఏమాయ చేసావె మూవీతో తెలుగులో తన జర్నీ మొదలుపెట్టింది. బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మజిలి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అల్లుడు శీను, అ ఆ, జనతా గ్యారేజ్, రంగస్థలం.. ఇలా అనేక సినిమాలు చేసింది. పుష్ప 1లో ఉ అంటావా మావా.. అనే ఐటం సాంగ్లో తళుక్కుమని మెరిసింది. ఇటీవల శుభం సినిమాలో అతిథి పాత్రలో నటించడంతో పాటు ఈ మూవీని తనే నిర్మించడం విశేషం. ప్రస్తుతం మా ఇంటి బంగారం, రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.చదవండి: ఓజీ డైరెక్టర్ కొత్త సినిమా.. ఆ టాలీవుడ్ స్టార్తోనే! -
భాగ్యశ్రీ గ్లామర్.. 'మిరాయ్' బ్యూటీ చీరలో
గ్లామర్ ఒలకబోస్తున్న ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీఅందచందాలతో మాయ చేస్తున్న సమంతచీరలో మెరిసిపోతున్న 'మిరాయ్' రితికా నాయక్బీచ్ ఒడ్డున చిన్న పిల్లలా సంయుక్త ఎంజాయ్ఫ్రెండ్ సీమంతంలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ఎర్ర చీరలో అందగత్తెలా నటి సోనియా సింగ్ View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by SONIYA SINGH (@soniya_singh31) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) -
జాన్వీ సొగసులు.. సమంత వెరైటీ లుక్
జాన్వీ కపూర్ సొగసు చూడతరమాపాత కాలం ఇంగ్లీష్ హీరోయిన్లా సమంతచెల్లితో బీచ్ ట్రిప్.. వీడియోతో సాయిపల్లవిబ్లాక్ మోడ్రన్ డ్రస్సులో రష్మిక ఇలాఅమెరికాలో అనన్య బతుకమ్మ సెలబ్రేషన్స్ఎర్ర చీరలో మెరిసిపోతున్న శ్రద్ధా కపూర్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
గ్యాప్ ఇవ్వలా... వచ్చింది!
‘ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్...’ (మురళీ శర్మ), ‘ఇవ్వలా... వచ్చింది...’ (అల్లు అర్జున్) అనే డైలాగులు ‘అల వైకుంఠపురములో...’ సినిమాలో బాగా పాపులర్ అయ్యాయి. కొందరు కథానాయికల కెరీర్ విషయంలో ఈ డైలాగులు కరెక్టుగా సరి పోయాయనిపిస్తోంది. తెలుగులో ఒకప్పుడు వరుస సినిమాలు, ఫుల్ క్రేజ్తో బిజీ బిజీగా దూసుకెళ్లిన పలువురు హీరోయిన్లకు ప్రస్తుతం టాలీవుడ్లో గ్యాప్ వచ్చింది. అయితే ఆ గ్యాప్ కావాలని ఇచ్చింది కాదు... ఇతర భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, ఇక్కడ సరైన కథ, పాత్ర కుదరక పోవడం కూడా ఈ గ్యాప్కి కారణం అని చె పొ్పచ్చు. తమ అభిమాన హీరోయిన్ల సినిమా ఎప్పుడొస్తుందా అని టాలీవుడ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తెలుగులో గ్యాప్ వచ్చిన కథానాయికలెవరో ఓ లుక్కేద్దాం.పచ్చజెండా ఊపుతారా? తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణం కాజల్ అగర్వాల్ది. తేజ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్కి హీరోయిన్గా పరిచయమయ్యారామె. 2007 ఫిబ్రవరి 15న ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘చందమామ’ చిత్రంలో నటించారు కాజల్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో కాజల్కి వరుస అవకాశాలు వచ్చాయి. ‘ఆర్య 2, మగధీర, గోవిందుడు అందరివాడేలే, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మేన్, బ్రహ్మోత్సవం, బృందావనం, టెంపర్, బాద్ షా, వీర, నేనే రాజు నేనే మంత్రి, సీత, ఖైదీ నంబర్ 150, భగవంత్ కేసరి’... ఇలా తెలుగులో వరుసగా సినిమాలు చేశారు కాజల్. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీకి తెలుగులో గ్యాప్ వస్తోంది. ‘భగవంత్ కేసరి’ సినిమా తర్వాత ఆమె లీడ్ రోల్లో నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘సత్యభామ’ 2024 జూన్ 7న విడుదలైంది.ఆ చిత్రం తర్వాత తెలుగులో అటు హీరోయిన్గా కానీ ఇటు లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ కానీ చేయలేదు కాజల్. అయితే మంచు విష్ణు హీరోగా రూ పొందిన ‘కన్నప్ప’ చిత్రంలో పార్వతీ దేవి పాత్రలో కనిపించారామె. జూన్ 27న ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఆమె చేతిలో ఏ సినిమా లేనప్పటికీ తమిళ్, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరి... టాలీవుడ్కి ఆమె పచ్చజెండా ఊపుతారా? వేచి చూడాలి. కొత్త కబురు ఎప్పుడు? ఓ వైపు హీరోయిన్గా, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా దూసుకెళుతున్నారు తమన్నా. అంతేకాదు... ప్రత్యేక పాటల్లోనూ సందడి చేసి, అభిమానులను అలరిస్తుంటారామె. తెలుగులో ఆమె లీడ్ రోల్లో నటించిన ‘ఓదెల 2’ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 17న విడుదలైంది. ఆ సినిమా విడుదలై దాదాపు ఆర్నెల్లు కావస్తున్నా ఆమె మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపలేదు. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళ్లిన ఈ బ్యూటీకి ప్రస్తుతం మాత్రం గ్యాప్ వస్తోంది.ఆ మాటకొస్తే చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ (2023) చిత్రం తర్వాత ఆమె నటించిన ఒకే ఒక్క తెలుగు చిత్రం ‘ఓదెల 2’. అంటే... ఈ రెండేళ్లలో ఆమె కేవలం రెండు తెలుగు సినిమాల్లో మాత్రమే నటించారు. ఈ మిల్కీ బ్యూటీకి టాలీవుడ్లో గ్యాప్ వస్తున్నప్పటికీ బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ‘రోమియో, రేంజర్, వి వన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమాలతో పాటు రోహిత్ శెట్టి చిత్రంలో నటిస్తున్నారు.ఈ నాలుగు సినిమాల్లో ‘వి వన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారామె. అరుణభ్ కుమార్, దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. మైథలాజికల్ హారర్, థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా 2026 మే 15న విడుదల కానుంది. మరి... తమన్నా తెలుగుకి సంబంధించి కొత్త కబురు ఎప్పుడు వినిపిస్తారు? అన్నది వేచి చూడాలి.రెండేళ్లు దాటినా... తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు సమంత. పవన్ కల్యాణ్, మహేశ్బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్చరణ్, నాగచైతన్య, నాని, నితిన్, విజయ్ దేవరకొండ... ఇలా పలువురు హీరోలకి జోడీగా నటించారామె. అంతేకాదు.. తెలుగులో ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా నటించిన ‘ఖుషి’ (2023) చిత్రం తర్వాత సమంత మరో తెలుగు చిత్రంలో నటించలేదు. కాగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ని స్థాపించి, సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’.ఈ ఏడాది మే 9న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించి, నిర్మాతగా సమంతకు మంచి పేరు, లాభాలు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో ఆమె అతిథి పాత్రలో కనిపించారు. ఇక ‘ఖుషి’ సినిమా 2023 సెప్టెంబరు 1న విడుదలై, హిట్గా నిలిచింది. ఈ మూవీ రిలీజై రెండేళ్లు దాటి పోయినా ఇప్పటికీ తెలుగులో మరో సినిమాకి పచ్చజెండా ఊపలేదు సమంత.అయితే తన సొంత ్ర పొడక్షన్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించనున్న ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియంటెండ్ మూవీలో నటించనున్నట్లు ప్రకటించారు సమంత. అంతేకాదు... తన బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం పోస్టర్ని కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా గురించి ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇదిలా ఉంటే... సమంత ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. నో అప్డేట్ టాలీవుడ్లో శ్రుతీహాసన్ది దాదాపు పదిహేనేళ్ల ప్రయాణం. దర్శకుడు కె. రాఘవేంద్ర రావు తనయుడు కె. ప్రకాశ్ తెరకెక్కించిన చిత్రం ‘అనగనగా ఒక ధీరుడు’ ద్వారా తెలుగుకి పరిచయం అయ్యారు శ్రుతీహాసన్. 2011 జనవరి 14న విడుదలైంది ఈ చిత్రం. ఆ తర్వాత ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాలో నటించారు శ్రుతి. అయితే ఈ రెండు సినిమాలు పరాజయం కావడంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించడంతో ఐరన్ లెగ్ అన్నవాళ్లే గోల్డెన్ లెగ్ అన్నారు. ‘బలుపు, రామయ్యా వస్తావయ్యా, ఎవడు, రేసుగుర్రం, ఆగడు, శ్రీమంతుడు, ప్రేమమ్, కాటమరాయుడు, క్రాక్, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ పార్ట్ 1: సీజ్ఫైర్’ వంటి సినిమాల్లో నటించి, ప్రేక్షకుల మెప్పు పొందారు శ్రుతీహాసన్. ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్ పార్ట్ 1: సీజ్ఫైర్’ చిత్రం 2023 డిసెంబరు 22న విడుదలైంది.ఆ సినిమా హిట్ అయినప్పటికీ ఆ తర్వాత శ్రుతీహాసన్ నటించనున్న మరో తెలుగు చిత్రంపై ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ లేదు. ‘సలార్’ విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఆమె నుంచి మరో తెలుగు సినిమా అనౌన్స్మెంట్ లేదు. అయితే ‘సలార్ పార్ట్ 1: సీజ్ఫైర్’కి సీక్వెల్గా రూ పొందనున్న ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగపర్వం’లో ఆమె పాత్ర ఉంటుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగులో సినిమాలేవీ లేకున్నప్పటికీ తమిళ చిత్రాలు చేస్తున్నారు శ్రుతి. మరి... ఆమె నుంచి టాలీవుడ్లో కొత్త చిత్రం అప్డేట్ ఎప్పుడొస్తుందో చూడాలి.మూడేళ్లు అయినప్పటికీ... తెలుగు చిత్ర పరిశ్రమలో ‘అలా మొదలైంది’ చిత్రంతో ఆరంభమైంది మలయాళ కుట్టి నిత్యామీనన్ కెరీర్. నాని హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ‘అలా మొదలైంది’ చిత్రం 2011 జనవరి 21న విడుదలై, ఘన విజయం సాధించింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నిత్య. ఆ తర్వాత తెలుగు–తమిళ ద్విభాషా చిత్రం ‘180’లో నటించారామె. అనంతరం పలు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తెలుగులో నితిన్ హీరోగా నటించిన ‘ఇష్క్’ మూవీలో నటించి, మరో హిట్ అందుకున్నారు.ఆ తర్వాత ‘ఒక్కడినే, జబర్దస్త్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, ఒక్క అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్’ వంటి తెలుగు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. అయితే ‘భీమ్లా నాయక్’ చిత్రం రిలీజై మూడేళ్లు దాటి పోయినప్పటికీ మరో తెలుగు చిత్రంలో నటించలేదు నిత్య. ఆ సినిమా తర్వాత వరుసగా మలయాళ, తమిళ చిత్రాలకే పరిమితం అయ్యారామె. విజయ్ సేతుపతి–నిత్యామీనన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘తలైవన్ తలైవి’. ఈ చిత్రం తెలుగులో ‘సార్.. మేడమ్’ పేరుతో విడుదలైంది.ఈ మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన నిత్య తెలుగులో గ్యాప్ రావడంపై స్పందిస్తూ.. ‘‘తెలుగు ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమ, అభిమానం మరచి పోలేను. తెలుగులో నేను కావాలని గ్యాప్ ఇవ్వలేదు... వచ్చిందంతే. సరైన కథ, పాత్ర కుదిరితే నటించడానికి ఎప్పుడూ సిద్ధమే’’ అన్నారు. మరి రచయితలు, దర్శకులు ఆమెను దృష్టిలో పెట్టుకుని సరైన పాత్రలు రాస్తారేమో చూడాలి. ఏది ఏమైనప్పటికీ నిత్యామీనన్ తెలుగులో నటించే కొత్త సినిమా ప్రకటన కోసం వేచి చూడక తప్పదు.రెండేళ్లయినా.... టాలీవుడ్కి కెరటంలా దూసుకొచ్చారు రకుల్ ప్రీత్సింగ్. 2011 ఆగస్టు 26న విడుదలైన ‘కెరటం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు రకుల్. ఆ చిత్రం తర్వాత తెలుగులో రెండేళ్లు గ్యాప్ వచ్చింది ఆమెకి. ఈ గ్యాప్లో తమిళంలో మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ చిత్రంతో తిరిగి టాలీవుడ్కి వచ్చారు. సందీప్ కిషన్ హీరోగా మేర్ల పాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2013 నవంబరు 29న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు సొంతం చేసుకున్నారీ బ్యూటీ.‘లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయకి, స్పైడర్, మన్మథుడు 2, చెక్, కొండ పొలం, బూ’ వంటి సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారు రకుల్. ‘బూ’ చిత్రం 2023 మే 27న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం విడుదలై రెండేళ్లు దాటి పోయినప్పటికీ ఆమె నటించనున్న మరో తెలుగు సినిమాపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన లేదు. తెలుగులో రకుల్కి గ్యాప్ వచ్చినప్పటికీ తమిళ, హిందీ సినిమాలు చేస్తున్నారు. మరి... రకుల్ ప్రీత్సింగ్ తెలుగులో కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు? అంటే కాలమే సమాధానం చె΄్పాలి.గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ‘అమ్మాయిలు కాదు... అమ్మాయి... భానుమతి... ఒక్కటే పీస్... రెండు కులాలు... రెండు మతాలు... హైబ్రీడ్ పిల్ల’ అంటూ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశారు సాయిపల్లవి. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఫిదా’ సినిమాతో తెలుగుకి హీరోయిన్గా పరిచయం అయ్యారామె. తొలి చిత్రంతోనే తనదైన నటన, డ్యాన్సులతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్, పడి పడి లేచె మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, తండేల్’ వంటి సినిమాల్లో నటించి, ఆడియన్స్ని అలరించారు.నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహించిన చిత్రం ‘తండేల్’. ఈ ఏడాది ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రత్యేకించి సాయిపల్లవి, నాగచైతన్య నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాధారణంగా ఓ సినిమా హిట్ అయిందంటే హీరో, హీరోయిన్లకు, డైరెక్టర్స్కి వరుస అవకాశాలు వస్తుంటాయి. ‘తండేల్’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత తెలుగులో మరో కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదు సాయిపల్లవి.అయితే తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో నటించిన ఆమె ‘మేరే రాహో’ అనే చిత్రం ద్వారా తొలిసారి హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. అలాగే రణ్బీర్ కపూర్ రాముడిగా రూ పొందుతోన్న ‘రామాయణ : పార్ట్ 1, పార్ట్ 2’ సినిమాల్లో సీతగా నటిస్తున్నారు. ఈ సినిమాలు ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవి కావడంతో ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్కే పరిమితం అయ్యారామె. మరి... సాయిపల్లవి తెలుగులో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. ఏడాది దాటి పోయినా... తెలుగు ప్రేక్షకుల మనసుల్లో బేబమ్మగా అభిమానం సొంతం చేసుకున్నారు కృతీ శెట్టి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారామె. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా 2021 ఫిబ్రవరి 12న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆ సినిమా తర్వాత ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, కస్టడీ, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చె΄్పాలి, మనమే’ వంటి చిత్రాల్లో యువ హీరోలకి జోడీగా నటించారు కృతీ శెట్టి. ‘మనమే’ సినిమా 2024 జూన్ 7న రిలీజైంది.ఆ సినిమా విడుదలై ఏడాది దాటి పోయినా టాలీవుడ్లో ఇప్పటికీ మరో సినిమాకి పచ్చజెండా ఊపలేదు కృతి. అయితే తెలుగులో ఒక్క సినిమా చేతిలో లేక పోయినా తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం బిజీ బిజీగా ఉన్నారు ఈ బేబమ్మ. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, వా వాతియార్, జెనీ’ వంటి సినిమాల్లో నటిస్తున్నారీ బ్యూటీ. మరి... కృతీ శెట్టి తెలుగులో కొత్త సినిమాకి ఎప్పుడు పచ్చజెండా ఊపుతారు? అన్నది వేచి చూడాలి. పైన పేర్కొన్న కథానాయికలే కాదు... అంజలి, డింపుల్ హయతి, శ్రద్ధా శ్రీనాథ్, రీతూ వర్మ వంటి మరికొందరు హీరోయిన్లకు కూడా తెలుగులో గ్యాప్ వచ్చింది. వారు నటించనున్న తర్వాతి తెలుగు సినిమాలపై ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ లేదు. మరి... వీరి నుంచి కొత్త కబురు ఎప్పుడొస్తుందో వేచి చూడాలి. – డేరంగుల జగన్ మోహన్ -
జిమ్లో సమంత- రాజ్ నిడిమోరు.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత(samantha ruth Prabhu) ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. శుభం మూవీ నిర్మించిన సామ్.. ఆ తర్వాత కొత్త మూవీస్ ప్రకటించలేదు. అయితే కెరీర్ పరంగా కాస్తా వెనకపడినా సమంత.. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రక్త బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది.అయితే సినిమాల కంటే ఎక్కువగా.. రాజ్ నిడిమోరుతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల దుబాయ్లో జంటగా కనిపించిన వీరిద్దరు.. మరోసారి కెమెరాలకు చిక్కారు. ముంబయి బాంద్రాలోని ఓ జిమ్ నుంచి సామ్, రాజ్ బయటికి వస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.గతంలో వీరిద్దరు హనీ బన్నీ, ది ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్ల్లో కలిసి పనిచేశారు. అప్పటి నుంచి వీరి పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ తర్వాత చాలాసార్లు వీరిద్దరు పలు ఈవెంట్లలో జంటగా కనిపించారు. దీంతో ఈ సామ్, రాజ్ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు తమపై వస్తున్న రూమర్స్పై సమంత, రాజ్ స్పందించలేదు. కాగా.. గతంలో టాలీవుడ్ హీరో నాగ చైతన్యను పెళ్లాడిన సామ్.. 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.Queen @Samanthaprabhu2 💛#SamanthaRuthPrabhu𓃵#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/PlDCMUqD4Q— Samcults (@Samcults) September 23, 2025 -
ఈ హీరోయిన్ల సైడ్ బిజినెస్ ఏంటో తెలుసా?
ఓ వైపు కళారంగంలో తళుక్కుమంటూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు నేటి సినీ తారలు. నటనలో అవకాశాలను సద్వినియోగం చేయడంలోనే కాదు తమలో ఉన్న సాధికారిత శక్తిని కూడా నిరూపిస్తున్నారు. నేషనల్ క్రష్గా పేరొందిన రష్మికా మందన్నా నుంచి నయనతార, సమంత, తమన్నా... ఇలా ప్రతీ నటీమణి తమ జీవితాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారు. సినిమా స్టార్స్గా కోట్లలో పారితోషికం తీసుకుంటున్న ఈ తారలు ఆ డబ్బుని రెట్టింపు చేసే పని మీద ఉన్నారు. వ్యా పారంలోనూ కోట్లు సం పాదించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ‘షో (సినిమా) బిజినెస్’లో రాణిస్తూ వేరే ఏయే ‘బిజినెస్’లోకి ఈ స్టార్స్ ఎంటరయ్యారో తెలుసుకుందాం.తండ్రి బాటలో...మిల్కీ బ్యూటీగా నార్త్, సౌత్లో బోలెడంత క్రేజ్ సం పాదించుకున్నారు తమన్నా. హీరోయిన్ అయి, దాదాపు 20 ఏళ్లు కావొస్తున్నా అదే స్పీడుతో దూసుకెళుతున్నారు. ఇక ఇటీవల ఐటెమ్ సాంగ్స్తోనూ అలరిస్తున్నారు. మరోవైపు ఆన్లైన్ నగల వ్యా పారాన్ని ఆరంభించారు. ఈ ఆభరణాలను తనే డిజైన్ చేస్తున్నారు కూడా. ఇంతకీ తమన్నాకి జ్యుయెలరీ బిజినెస్ ఎందుకు చేయాలనిపించిదంటే... ఆమె తండ్రి వల్లే. తమన్నా తండ్రికి నగల వ్యా పారం ఉంది. దాంతో కుమార్తెకి కూడా ఆ వ్యా పారంపై ఆసక్తి కలిగింది. ఒకవైపు నటన... మరోవైపు జ్యుయెలరీ బిజినెస్తో మిల్కీ బ్యూటీ ఫుల్ బిజీ. మ్యూజిక్పై మమకారంతో..బహుముఖ ప్రజ్ఞాశాలి కమల్హాసన్ తనయగా శ్రుతీహాసన్ కూడా మల్టీ టాలెంటెడ్. తనలో మంచి నటి, గాయని, సంగీతదర్శకురాలు... ఇలా ఎన్నో ప్రతిభలు ఉన్నాయి. అయితే హీరోయిన్గా బిజీగా ఉంటున్న శ్రుతీహాసన్ తనకెంతో నచ్చిన మ్యూజిక్పై కూడా దృష్టి సారించాలనుకున్నారు. అందుకే ‘ఇసిడ్రో’ అనే నిర్మాణ సంస్థను ఆరంభించారామె. ఈ సంస్థ లఘు చిత్రాలు, యానిమేషన్ చిత్రాలు, వీడియో రికార్డింగ్లను ఈ రూపొందిస్తుంటుంది. క్లాతింగ్ బ్రాండ్... ప్రోడక్షన్నటనలో భేష్ అనిపించుకున్న సమంత తన స్టైలిష్ లుక్స్కు కూడా చాలా పాపులర్. సినిమాల్లోనే కాదు... విడిగా కూడా సమంత రకరకాల డ్రెస్ డిజైన్స్ ట్రై చేస్తుంటారు. ఇప్పటికే ‘సాకీ’ పేరుతో సమంతకు క్లాతింగ్ బ్రాండ్ ఉంది. 2020లో ఈ బ్రాండ్ని ఆరంభించారామె. అలాగే ఏ సినిమా ఫీల్డ్ అయితే తనకు నటిగా మంచి జీవితాన్ని ఇచ్చిందో అదే సినిమా రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుని, ‘ట్రా లా లా’ బేనర్ని ఆరంభించారు. ఈ బేనర్లో తొలి ప్రయత్నంగా ‘శుభం’ చిత్రాన్ని నిర్మించారు సమంత. అలాగే ఇదే బేనర్లో తాను కథానాయికగా ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించారు. నయన... నాలుగైదు వ్యా పారాలు నటనలో లేడీ సూపర్స్టార్ అని పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ‘ది లిప్ బామ్ కంపెనీ’ని స్థాపించారు. భర్త విఘ్నేష్ శివన్తో కలిసి ‘రౌడీ పిక్చర్స్‘ అనే నిర్మాణ సంస్థలో పాలు పంచుకున్నారు. చెన్నైలో ‘ఛాయ్వాలే’ అనే స్థానిక పానీయాల బ్రాండ్లో పెట్టుబడి పెట్టి, రెస్టారెంట్ వ్యా పారంలో కూడా రాణిస్తున్నారు. ఇటీవల ‘9 స్కిన్’ అనే చర్మ సంరక్షణ బ్రాండ్నూ ప్రారంభించారామె. మొత్తానికి ఈ లేడీ సూపర్ స్టార్ ఒక్క వ్యా పారంలో కాదు... నాలుగైదు వ్యా పారాల్లో పెట్టుబడి పెట్టి, దూసుకెళుతున్నారు. ఫ్యాషన్ రంగలోకి నేషనల్ క్రష్ ‘నేషనల్ క్రష్’గా పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న రష్మికా మందన్నా తన కొత్త వ్యా పారాన్ని ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తన తల్లితో జరిపిన సంభాషణ వీడియోను పంచుకున్నారామె. తన తల్లితో మాట్లాడుతూ– ‘అమ్మా... ఈ రోజు చాలా చాలా ముఖ్యమైన షూటింగ్ చేయబోతున్నాను. మీరు చెప్పినట్టుగా ఈ వ్యా పారాన్ని ప్రారంభించబోతున్నాను’ అని ఆమె తన తల్లితో పేర్కొన్నారు. రష్మిక తల్లి ‘దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు’ అని కుమార్తెను హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. ఇంతకీ రష్మిక ఏ బిజినెస్ చేయనున్నారంటే.... తన సొంత బ్రాండ్తో ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టనున్నారు.శ్రద్ధగా వ్యా పారంలోకి... కెరీర్ ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు ఆ బిజీని ఎంజాయ్ చేసి, కాస్త అవకాశాలు తగ్గగానే డీలా పడి పోతుంటారు కొందరు తారలు. కానీ శ్రద్ధా దాస్ అలా కాదు. ఒకప్పుడు మంచి కెరీర్ని చూసిన ఈ బ్యూటీ... ఇప్పుడు నటిగా అంత బిజీగా లేక పోయినా నగల వ్యా పారంతో జోష్గా ఉన్నారు. ‘పల్మోనాస్’ అనే డెమీ ఫైన్ జ్యుయెలరీ బ్రాండ్ని ఆరంభించారు. పల్మోనాస్కి ఆమె ఒక ఫౌండర్. ఈ నగల వ్యా పారాన్ని కూడా చాలా శ్రద్ధగా చేస్తున్నారు శ్రద్ధా దాస్. ఇలా మరికొందరు తారలు ఇతర వ్యా పారాల్లో పెట్టుబడి పెట్టి, ‘బిజినెస్ ఉమన్’గానూ రాణిస్తున్నారు. ప్రతిభ, వ్యా పార చతురతతో అటు కెరీర్ ఇటు వ్యా పార రంగంలోనూ విజయవంతంగా విస్తరిస్తున్నారు ఈ కథానాయికలు. ఈ స్టార్స్ నవతరానికి సవాల్తో కూడిన ఆలోచననూ అందిస్తున్నారు. -
ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు.. అర్థమైతే మంచింది: సమంత
సామాజిక మాధ్యమాలను బాగా వాడుకునే నటీమణుల్లో సమంత ఒకరు. తమిళం, తెలుగు భాషల్లో నటించి అగ్ర కథానాయకిగా ఏలిన ఈ అమ్మడు ఆ మధ్య మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురికావడంతో అది కెరీర్కు బాగా ఎఫెక్ట్ అయ్యింది. ఆ వ్యాధి నుంచి కోలుకున్నా, కథానాయకిగా మాత్రం బిజీ కాలేకపోతున్నారు. ఇటీవల నిర్మాతగా మారి శుభం అనే చిత్రాన్ని నిర్మించి అతిథి పాత్రలో నటించారు. ఆ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. అయినా తర్వాత చిత్రం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. అదేవిధంగా ఈమె మళ్లీ తమిళ చిత్రంలో హీరోయిన్గా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ దాని గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే సమంత మాత్రం ఏదో ఒక వార్తతో నిత్యం ప్రైమ్ టైమ్లో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలా తాజాగా సమస్యల కారణంగా తాను చాలా విషయాలను నేర్చుకున్నానని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.అదేవిధంగా ఇక్కడ కథానాయకి కెరీర్గానీ, గ్లామర్, అభిమానులు, పాపులారిటీ ఏదీ శాశ్వతం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా కొంత కాలమేనని అన్నారు. ఒక నటిగా ఎదగడానికి చాలా అదృష్టానికి మించి చాలా కావాలన్నారు. తాను తన జీవితంలో నటిగా కంటే పెద్ద ప్రభావాన్ని చూపాలని కోరుకున్నానన్నారు. దాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని తెలిసిందన్నారు. ఇలా వేదాంతం పలుకుతున్న సమంత గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు మాత్రం సమంతకు ఫుల్ సపోర్ట్గా నిలుస్తున్నారు. ఏదేమైనా సమంత మళ్లీ తెరపై ఎప్పుడు మెరుస్తుందో అని ఆమె అభిమానులు మాత్రం ఎదురు చూస్తున్నారు. -
అనసూయ సోలో ట్రిప్.. సమంత మేకప్ లేకుండా!
సోలోగా ట్రిప్ వేసిన యాంకర్ అనసూయక్యూట్ జ్ఞాపకాల్ని షేర్ చేసిన నివేతా థామస్జిమ్లో కష్టపడుతూ అలా.. మరోవైపు సమంత ఇలాచీరలో వయ్యారాలు పోతున్న అనుపమ పరమేశ్వరన్పొద్దుతిరుగుడు పువ్వుతో గ్లామర్ చూపిస్తున్న రకుల్అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న అనన్య నాగళ్ల View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
ఇకపై అలాంటి సినిమాలే చేస్తానంటున్న సామ్..!
-
సమంత దుబాయ్ వీడియో.. రాజ్ నిడిమోరు భార్య పోస్ట్ వైరల్!
కొద్ది నెలలగా సమంత సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితంపైనే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. శుభం మూవీ తర్వాత ఆమెపై ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సామ్ సైతం బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతోనే ఎక్కువగా కనిపిస్తోంది. విదేశాల్లో ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. గతంలో లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టిన వీరిద్దరిపై మరోసారి రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం సమంత ఓ ఫ్యాషన్ షో చూసేందుకు దుబాయి వెళ్లింది. ఆ తర్వాత తన సోషల్ మీడియాలోఓ వ్యక్తి చేతిని పట్టుకున్న వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఆ వ్యక్తి రాజ్ నిడిమోరు అని సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ నేపథ్యంలోనే రాజ్ నిడిమోరు భార్య శ్యామలి దే మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్టులు వైరలవుతున్నాయి. 'తెలివితక్కువగా ప్రవర్తించడానికి కూడా తెలివిగా స్పందించండి' అంటూ కొటేషన్ షేర్ చేసింది. అంతేకాకుండా 'నిష్పాక్షికత అంటే ఇక్కడ మీరు ఏది సొంతం చేసుకోకూడదు.. అలాగే ఏదీ కూడా మిమ్మల్ని సొంతం చేసుకోకూడదు' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. సమంత, రాజ్ దుబాయ్ వీడియో రిలీజ్ తర్వాతే ఆమె ఈ పోస్టులు పెట్టింది.కాగా.. రాజ్ నిడిమోరు.. శ్యామలిని 2015లో వివాహమాడారు. కొద్ది నెలలుగా సమంత-రాజ్ మధ్య రూమర్స్ వస్తుండటంతో శ్యామలి.. పరోక్షంగా కొన్ని పోస్టులు పెడుతోంది. అయినప్పటికీ వీరిద్దరు ఇప్పటివరకు తమ రిలేషన్పై అధికారికంగా స్పందించలేదు. ఇక సినిమాల విషయానికొస్తే వస్తే రాజ్ డైరెక్షన్లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2,స సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ల్లో సమంత నటించింది. ప్రస్తుతం వీరిద్దరు రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్డమ్ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో టాలీవుడ్ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకున్న సామ్.. 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను గతేడాది పెళ్లాడారు. -
ప్రియుడితో కలిసి సమంత దుబాయి ట్రిప్.. వీడియో వైరల్
సమంత ప్రస్తుతం సినిమాలేం చేయట్లేదు. కొన్ని నెలల క్రితం 'శుభం' అనే చిన్న చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ హిట్ కాలేదు గానీ పెట్టిన డబ్బులు వచ్చేశాయి. మరోవైపు సమంత రిలేషన్ గురించి గత కొన్నిరోజులుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఫొటోనో వీడియోనో వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు కూడా రూమర్ బాయ్ ఫ్రెండ్తో కలిసి సామ్.. దుబాయి వెళ్లినట్లు అనిపిస్తుంది.గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. అప్పటినుంచి సింగిల్గానే ఉంటుంది. అయితే సామ్ తనతో 'ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్' సిరీస్లు తీసిన రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉందని పుకార్లు గత కొన్నిరోజులుగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లు వీళ్లిద్దరూ అడపాదడపా కలిసి కనిపిస్తుండటం వీటికి ఊతమిస్తోంది.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. సైలెంట్గా మొదలుపెట్టేశారు)తాజాగా ఓ ఫ్యాషన్ షో చూసేందుకు దుబాయి వెళ్లిన సమంత.. ఆ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులోనే ఓ వ్యక్తి చేతిని పట్టుకుని కనిపించింది. అయితే ఆ వ్యక్తి రాజ్ నిడిమోరు అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో దిగువన వరుణ్ ధావన్, దిశా పటానీ, రుహానీ శర్మ తదితరులు కామెంట్ కూడా చేశారు.మరోవైపు రాజ్ నిడిమోరుకు ఇదివరకే పెళ్లయింది. శ్యామలిని 2015లో వివాహమాడారు. రీసెంట్ టైంలో సమంత-రాజ్ మధ్య రూమర్స్ వస్తుండటంతో శ్యామలి.. పరోక్షంగా కొన్ని పోస్టులు పెడుతోంది. మరి సమంత.. ఈ బంధాన్ని ఏమైనా అధికారికంగా ప్రకటిస్తుందా లేదా ఇలానే రహస్యంగా ఉంచుతుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: హీరోయిన్లు అంటే చిన్నచూపు.. హీరోలకు ఆ మాట చెప్పలేరు: కృతి సనన్) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
నాలో మార్పు వచ్చింది..ఇకపై అలా చేయను : సమంత
ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లిన సమంత..ఈ మధ్యకాలంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గింది. మయోసైటిస్ వ్యాధితో కొన్నాళ్లు ఇబ్బంది పడ్డ సామ్.. దాన్ని నుంచి పూర్తి కోలుకొని మళ్లీ మునుపటి అందంతో కనిపిస్తూ, కెమెరా ముందుకు వచ్చింది. అయితే గతంలో మాదిరి ఒకేసారి ఐదారు చిత్రాలు మాత్రం చేయనని చెబుతోంది ఈ బ్యూటీ. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ‘గ్రాజియా ఇండియా’ (Grazia India) లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజీపై మెరిసిన సామ్.. ఆ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్పై ఆసక్తిక విషయాలను పంచుకుంది.‘ఇకపై సినిమాలతో పాటు అరోగ్యంపై కూడా దృష్టిపెడతాను. గతంలో పోలిస్తే నాలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. గొప్ప పనులు చేసే స్థాయికి చేరుకున్నాను. ఇకపై సినిమాలతో పాటు ఫిట్నెస్పై కూడా ఎక్కువ దృష్టిపెడతాను. మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను. గతంలో మాదిరి ఒకేసారి ఐదారు సినిమాలు చేయను. తక్కువ సినిమాలు చేసినా..ప్రేక్షకులకు మనసుకు నచ్చే నచ్చే వాటితోనే పలకరిస్తాను. ప్రాజెక్ట్ల సంఖ్య తగ్గింది.. కానీ, వాటి నాణ్యత కచ్చితంగా పెరుగుతుంది’ అతని సమంత చెప్పుకొచ్చింది.సమంత సినిమాల విషయానికొస్తే.. ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ ఇటీవల ప్రేక్షకుల ముందుక వచ్చి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ వెబ్ సిరీస్లో నటిస్తూంది. రాజ్-డీజే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్లో ఆదిత్యారాయ్ కపూర్, అలీ ఫజల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
LCU లోకి సమంత అడుగు పెట్టనుందా..?
-
ఊ అంటారా?
బ్లాక్బస్టర్ సినిమా ‘రంగస్థలం’ తర్వాత హీరో రామ్చరణ్, హీరోయిన్ సమంత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ... వీరిద్దరూ ఈసారి హీరో, హీరోయిన్లుగా నటించడంలేదట. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ పలువురు హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే పూజా హెగ్డే, శ్రీలీల వంటి హీరోయిన్ల పేర్లు వినిపించగా, తాజాగా సమంత పేరు తెరపైకి వచ్చింది. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ (2021) సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా మావ...’ స్పెషల్ సాంగ్ బాగాపాపులర్ అయిన సంగతి తెలిసిందే.ఈపాట తర్వాత సమంత మరో స్పెషల్ సాంగ్ చేయలేదు. మరి... రామ్చరణ్ ‘పెద్ది’ సినిమాలోని ప్రత్యేకపాటకు సమంత ‘ఊ’ అంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమా మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్ -
సమంత-చైతూ పెళ్లి పీటలెక్కిన సినిమా.. థియేటర్లలో రిలీజ్
అక్కినేని ఫ్యామిలీ మూడు జనరేషన్స్ను కవర్ చేస్తూ వచ్చిన చిత్రం మనం. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సైతం నటించారు. సమంత హీరోయిన్గా మెప్పించిన ఈ సినిమా 2014లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. గతేడాది పదేళ్లు పూర్తి కావడంతో ఈ సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు. దీంతో సమంత-నాగ చైతన్యను బిగ్ స్క్రీన్పై మరోసారి చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.తాజాగా అభిమానులకు సామ్-నాగ్ జంటను మళ్లీ బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం వచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీని జపాన్లో విడుదల చేయనున్నట్లు నాగచైతన్య ట్వీట్ చేశారు. నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న చిత్రం మనం.. ఈ సినిమా జపాన్ ప్రజలకు చేరువవుతుండటం చాలా ఆనందంగా ఉందంటూ పోస్ట్ చేశారు. మనం ఆగస్టు 8న థియేటర్లలో విడుదల కానుందని చైతూ వెల్లడించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆడియన్స్కు మరోసారి సామ్- చైతన్యను బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం దక్కనుంది.అక్కినేని ఫ్యామిలీ నటించిన ఈ చిత్రం 2014 మే 23న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంలో అనుప్ రూబెన్స్ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సూపర్ హిట్గా నిలిచాయి. ఎక్కడ చూసిన ‘మనం’ పాటలే వినిపించేవి. ఆ మెలోడీ సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో మార్మోగిపోతూనే ఉంటాయి.అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన సమంత- నాగ చైతన్య రియల్ లైఫ్లోనూ పెళ్లి పీటలెక్కారు. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. గతేడాది డిసెంబర్లో నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాలను పెళ్లాడారు. ప్రస్తుతం సమంత ఇప్పటి వరకు సింగిల్గానే ఉంటోంది. అయితే బాలీవుడ్ డైరెక్టర్తో రిలేషన్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.Thrilled that #Manam a film very close to my heart is making its way to the people of Japan . The film will be releasing on the 8th August in theaters . #Anrliveson #50YearsOfAnnapurnastudios pic.twitter.com/3x6u3XlRVV— chaitanya akkineni (@chay_akkineni) August 3, 2025 -
సమంత చేతికి స్పెషల్ రింగ్.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందా..?
-
సమంత చేతికి స్పెషల్ రింగ్.. గుడ్ న్యూస్ చెప్పనుందా?
టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు ఇటీవల ఎక్కువగా మార్మోగిపోతోంది. ఎక్కడికెళ్లినా ఆమెతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కనిపించడం మరోసారి చర్చకు దారితీసింది. ఇద్దరు కలిసి డిన్నర్ తర్వాత ఓకే కారులో వెళ్లడంతో ఈ జంట డేటింగ్పై మరోసారి మొదలైంది. కొద్ది రోజుల క్రితమే లండన్ వీధుల్లో ఇద్దరు కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే తాజాగా ఓ రెస్టారెంట్లో ఉన్న ఫోటోలను సామ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. రెస్టారెంట్లో చిల్ అవుతూ కనిపించింది. ఇందులో ఒక ఫోటోలో మాత్రం సమంత చేతికి ఉంగరం కనిపించడం మరో చర్చకు దారితీసింది. ఇంతకుముందు ఎప్పుడు కనిపించని ప్రత్యేకమైన రింగ్ సామ్ చేతికి ఉండడంతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారా? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి సామ్ ఎపిసోడ్ టాలీవుడ్ హాట్ టాపిక్గా మారింది. మరోవైపు త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనుందా అనే చర్చ మొదలైంది. కాగా.. సమంత.. రాజ్ నిడిమోరు దర్శకత్వంలో నటించారు. రాజ్ తెరకెక్కించిన ఫ్యామిలీమ్యాన్ సీజన్- 2, సిటాడెల్: హనీ బన్నీలోసామ్ కనిపించింది. ఆ వెబ్ సిరీస్ల సమయంలోనే రాజ్తో సమంతకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగానే కనిపిస్తున్నారు. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
మృణాల్ బర్త్ డే సెలబ్రేషన్స్.. జాన్వీ క్లాసికల్ డ్యాన్స్
'డెకాయిట్' సెట్లో మృణాల్ బర్త్ డే సెలబ్రేషన్స్లైఫ్ మూమెంట్స్ షేర్ చేసిన హీరోయిన్ సమంతజూలై జ్ఞాపకాలని పంచుకున్న ప్రియాంక మోహన్క్లాసికల్ డ్యాన్స్తో ఆకట్టుకున్న జాన్వీ కపూర్లంగా ఓణీలో మల్లెపూలతో శ్రీముఖి సింగారంమేకప్ లేకుండా కాయదు లోహర్ సెల్ఫీలుకృతి సనన్ పుట్టినరోజు సెలబ్రేషన్స్లో చెల్లి నూపుర్ View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Nuupur Sannon (@nupursanon) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Sakshi (@_vaidyasakshi) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) -
లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సమంత (ఫొటోలు)
-
మరోసారి రాజ్ నిడిమోరుతో సామ్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎపిసోడ్ మరోసారి హాట్టాపిక్గా మారింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సింగిల్గానే ఉంటోన్న సామ్.. ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా మెలగడమే. ఇప్పటికే పలుసార్లు జంటగా కనిపించిన వీరిద్దరు మరోసారి కెమెరాలకు చిక్కారు.సామ్- రాజ్ నిడిమోరు ఓకే కారులో వెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో మరోసారి ఈ జంట గురించి చర్చ మొదలైంది. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని పలుసార్లు కథనాలొచ్చాయి. కానీ తమపై వస్తున్న వార్తలపై ఎవ్వరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ఏదో ఒక సందర్భంలో వీరిద్దరు ఓకే వేదికపై తరచుగా కనిపిస్తూనే ఉన్నారు.ఈ వీడియో చూస్తుంటే ఇద్దరు కలిసి ఓ రెస్టారంట్కు డిన్నర్కు వెళ్లినట్లు తెలుస్తోంది. సమంత క్యాజువల్ వైట్ డ్రెస్లో నవ్వుతూ కనిపించారు. వీరిద్దరూ ఒకే కారులో ఇళ్లకు వెళ్లడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.కాగా.. రాజ్-డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో సామ్ కనిపించింది. ఆ వెబ్ సిరీస్ల సమయంలోనే రాజ్తో పరిచయం ఏర్పడింది. View this post on Instagram A post shared by Bollywood Chronicle (@bollywoodchronicle) -
జాన్వీ కపూర్ వారెవ్వా.. మృణాల్ డోలు ప్రాక్టీస్
డోలు వాయించడం నేర్చుకుంటున్న మృణాల్అతిలోక సుందరిలా మెరిసిపోతున్న జాన్వీఫిట్నెస్ ఛాలెంజ్లో సమంత సూపర్ హిట్తాజ్ మహల్ని సందర్శించిన ప్రియమణి, అనన్యపట్టుచీరలో బుట్టబొమ్మలా ఐశ్వర్యా రాజేశ్మత్స్య కన్యలా మాయ చేస్తున్న ఫరియా అబ్దుల్లాఫ్రూట్స్లా డ్రస్సింగ్ చేసుకున్న రెజీనా కసాండ్రా View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Take 20 (@take20health) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra)


