-
అల్లు అర్జున్ను అన్ఫాలో చేసిన తేజ్పై నిహారిక కామెంట్
ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే మెగా హీరో సాయిధుర్గ తేజ్ తీసుకున్న నిర్ణయంతో సినిమా అభిమానులు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను సోషల్ మీడియాలో ఆయన అన్ఫాలో చేశారు. దీంతో మెగా vs అల్లు అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. అయితే సాయి దుర్గ తేజ్ తప్ప.. మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్ను ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు.తాజాగా ఈ వివాదం గురించి నిహారిక రియాక్ట్ అయింది. 'కమిటీ కుర్రోళ్లు' అనే సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన నిహారికను ఇదే విషయం గురించి ఒక విలేకరి ప్రశ్నించగా ఆమె స్పందించింది. అల్లు అర్జున్, సాయిదుర్గ తేజ్ విషయం గురించి తనకు ఇంకా తెలియదని చెప్పింది. అయినా, ఎవరి కారణాలు వారికి ఉంటాయని ఆమె చెప్పింది.కొత్త నటులను పరిచయం చేస్తూ 'కమిటీ కుర్రోళ్లు' అనే చిత్రాన్ని నిహారిక సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ చిత్రం ద్వారా 11 మంది గొప్ప ఆర్టిస్టులను టాలీవుడ్కు పరిచయం చేయబోతున్నట్లు చిత్ర డైరెక్టర్ యధు వంశీ తెలిపాడు. ఈ సినిమా గురించి నిహారిక మాట్లాడుతూ.. తామంతా ఓ ఫ్యామిలీలా కష్టపడి సినిమాను తెరకెక్కించామని తెలిపింది. ఈ చిత్రంలోని ఎమోషన్స్కు అందరూ కనెక్ట్ అవుతారని ఆమె చెప్పింది. త్వరలో 'కమిటీ కుర్రోళ్లు' ట్రైలర్ విడుదల చేస్తామని నిహారిక పేర్కొంది. -
ఫ్యాన్స్కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్పరాజ్
-
అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన సాయిధరమ్ తేజ్
-
అల్లు అర్జున్ను అన్ ఫాలో చేసిన మెగా హీరో!
మెగా హీరో సాయిధరమ్ తేజ్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు. అల్లు అర్జున్తో పాటు ఆయన భార్య స్నేహను ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో అన్ఫాలో చేసినట్ తెలుస్తోంది. అల్లు కుటుంబంలో కేవలం అల్లు శిరీష్ను మాత్రమే తేజ్ ఫాలో అవుతున్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ తప్ప.. మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్ను ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు.కాగా.. బన్నీ గతంలో నంద్యాలకు చెందిన తన స్నేహితుడు శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత తరువాత సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఆర్మీ మధ్య పెద్ద ఎత్తున వార్ జరిగింది. అందువల్లే సాయి ధరమ్ తేజ్.. అల్లు అర్జున్తో పాటు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డిని ఎక్స్, ఇన్స్టాలో అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అప్పట్లోనే నాగబాబు చేసిన ట్వీట్ సైతం వివాదానికి దారితీసింది. ఆ తర్వాత నాగబాబు తన ట్వీట్ను తొలగించారు. -
ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ వీడియో.. బన్నీ రిప్లై ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2: ది రూల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. పుష్ప-2లోనూ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ను ఊపేస్తున్నాయి.పుష్ప సినిమా తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం బన్నీకి ఫ్యాన్గా మారిపోయాడు. పుష్ప మేనరిజాన్ని బన్నీ స్టైల్లో చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. పుష్ప-2 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని వార్నర్ గతంలోనే వెల్లడించారు.అయితే తాజాగా వార్నర్ ఓ కంపెనీ యాడ్లో మెరిశారు. ఈ ప్రకటనలో పుష్ప సినిమాలోని ఫైర్ అనే డైలాగ్తో మెప్పించారు వార్నర్. ఈ ప్రకటన చూసిన బన్నీ ఫన్నీ రిప్లై ఇచ్చారు. నవ్వుతున్న ఎమోజీలు జత చేస్తూ థమ్సప్ సింబల్ ఇచ్చాడు. కాగా.. ఇటీవల విడుదలైన 'పుష్ప: ది రూల్'లోని 'పుష్ప పుష్ప' సాంగ్కు స్టెప్పులతో డేవిడ్ వార్నర్ అదరగొట్టాడు. షూ డ్రాప్ స్టెప్ ప్రాక్టీస్ చేస్తూ వార్నర్ కనిపించారు. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
బన్నీతో బాక్సాఫీస్ వార్కి సై అంటున్న బాలీవుడ్ హీరో
‘పుష్ప..పుష్పరాజ్..నీయవ్వ తగ్గేదే లే’అంటూ వచ్చి బాక్సాఫీస్ని షేక్ చేశారు అల్లు అర్జున్. ఇప్పుడా ‘పుష్ప’ సినిమాకి సీక్వెల్గా ‘పుష్ప 2’ రాబోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సారి పుష్పరాజ్తో పోటీ పడేందుకు బడా హీరోలెవరు సాహసించలేదు. ‘పుష్ప’కు వచ్చిన టాక్తో సీక్వెల్పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు ఉన్నాయి. దీంతో అప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సినిమాలు కూడా వెనక్కి తగ్గి.. పుష్పరాజ్ హవా తగ్గిపోయిన తర్వాత థియేటర్స్లోకి రాబోతున్నాయి. బాలీవుడ్లో ఆగస్ట్ 15న రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సింగం అగైన్ విడుదల కావాల్సింది. పుష్ప 2 కంటే ముందే రోహిత్ శెట్టి రిలీజ్ డేట్ ప్రకటించాడు. ఎప్పుడైతే పుష్ప 2 అనౌన్స్మెంట్ వచ్చిందో రోహిత్ వెనక్కి తగ్గాడు. కోలీవుడ్, మాలీవుడ్లోనూ పుష్పరాజ్తో పోటీ పడేందుకు ఎవరూ సాహసించలేదు. ఇక పుష్పరాజ్కి పోటీ లేదు అనుకుంటున్న తరుణంలో.. బాక్సాఫీస్ వార్కి నేను సై అంటూ ముందుకు వచ్చాడు జాన్ అబ్రహం. ఆయన హీరోగా నటించిన వేదా సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. దీంతో బాలీవుడ్ మీడియాలో పుష్ప వర్సెస్ వేదా అంటూ కథనాలు వస్తున్నాయి. అయితే బాలీవుడ్లోనే పుష్ప2 సినిమాకు ఎక్కువ బజ్ ఉంది. అక్కడే ఎక్కువ మార్కెట్ జరుగుతోంది. అయినా కూడా బన్నీతో జాన్ అబ్రహం పోటీ పడుతున్నాడు. అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోతో పోటీ పడే స్థాయి జాన్ అబ్రహంకి లేదని అంటున్నారు. ‘పుష్పరాజ్’తో పోటీ అంత వీజీ కాదంటున్నారు. మరి ఈ బాక్సాఫీస్ వార్లో ఎవరు గెలుస్తారో చూడాలి. -
పుష్ప 2 స్పెషల్ సాంగ్.. యానిమల్ బ్యూటీ కాదట..!
-
గేమ్ ఛేంజర్ గేమ్ స్టార్ట్...
-
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రను షేక్ చేస్తున్న పుష్ప 2 సాంగ్స్..
-
సుకుమార్ షాకింగ్ నిర్ణయం.. షాక్లో బన్నీ ఫ్యాన్స్!
ఆగస్ట్ 15.. బన్నీ ఫ్యాన్స్కి నిజంగా పండగ రోజే. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ మూవీ అదే రోజు రిలీజ్ కాబోతుంది. ‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ‘పుష్ప’ మూవీకి సీక్వెల్గా రాబోతుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్ ఈ మూవీపై మరింత ఆసక్తిని పెంచేలా చేశాయి. అయితే విడుదల తేది దగ్గర పడినా.. ఇంకా షూటింగ్ పూర్తికాకపోవడం బన్నీ అభిమానుల్ని కలవరపెడుతోంది. ముందు చెప్పినట్లుగా ఆగస్ట్ 15న బొమ్మ పడుతుందా లేదా వాయిదా పడుతుందా అనే అనుమానాలు తల్లెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో డైరెక్టర్ సుకుమార్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ని మార్చాలని భావిస్తున్నాడట.సాధారణంగా సుకుమార్ తన ప్రతి సినిమాకు రెండు క్లైమాక్స్లు ప్లాన్ చేస్తాడట. అలా పుష్ప 2 కోసం కూడా ఇప్పటికే రెండు క్లైమాక్స్లు సిద్ధం చేసుకున్నాడట. రెండింటిలో ఒకటి యాడ్ చేయాలని భావించాడట. అయితే ముందుగా అనుకున్న క్లైమాక్స్లు కాకుండా వేరేది యాడ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 కి కొనసాగింపుగా పుష్ప 3 కూడా చేయాలనే ఆలోచన రావడంతో..క్లైమాక్స్ కూడా పార్ట్ 3కి సెట్ అయ్యేలా ప్లాన్ చేయబోతున్నాడట. ఒకవేళ అదే నిజమైతే సుకుమార్ మళ్లీ రీషూట్కి వెళ్తాడా? లేదా ఇప్పటికే ఫిక్స్ అయిన వాటి నుంచి బెస్ట్ క్లైమాక్స్ని యాడ్ చేస్తారా? అనేది తెలియాక ఫ్యాన్స్ టెన్షపడుతున్నారట. ఒకవేళ రీషూట్కి వెళ్తే మాత్రం పుష్ప 2 ఆగస్ట్ 15కి రిలీజ్ కావడం కష్టమే అని సినీ పండితులు చెబుతున్నారు. ఇప్పటికి కెవలం రెండు పాటలను మాత్రమే విడుదల చేశారు. ఇంకా నాలుగు పాటలను రిలీజ్ చేయాల్సి ఉంది. ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా చేయాలి. ఇలా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో క్లైమాక్స్ చేంజ్ అని వార్తలు వినిపించడం బన్నీ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్కి జోడిగా రష్మిక నటించగా.. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. -
పుష్ప రాజ్ కు పోటీగా కీర్తి సురేష్
-
'పుష్ప 2'కు పోటీగా దిగుతున్న కీర్తి సురేష్
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. కథ నచ్చితే చాలు ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతూ తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. నేను శైలజతో సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన కీర్తి.. కెరీర్ ఆరంభమైన కొన్నాళ్లకే 'మహానటి'గా నిరూపించుకుంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో బిజీగా ఉందామె.ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రఘు తాత’. సుమన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రమిది. అయితే, తాజాగా రఘు తాత నుంచి టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రమంలో ఆగష్టు 15న ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అదే రోజున పాన్ ఇండియా చిత్రం అల్లు అర్జున్ నటించిన పుష్ప కూడా విడుదల కానుంది. 'మహానటి' చిత్రానికి గాను కీర్తి సురేష్ నేషనల్ అవార్డు అందుకుంటే.. అల్లు అర్జున్ కూడా పుష్ప చిత్రం ద్వారా నేషనల్ అవార్డు అందుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగష్టు 15న పుష్ప, రఘు తాత రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో ఇద్దరు నేషనల్ అవార్డ్స్ అందుకున్న స్టార్స్ ఒకేరోజున బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు. వాస్తవానికి కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 కూడా ఆగష్టు 15న విడుదల చేయాలనుకున్నారు. కానీ, పుష్ప 2 వల్ల దానిని విరమించుకున్నారు. అయితే, రఘు తాత చిత్రంతో కీర్తి సురేష్ బన్నీ సినిమాకు పోటీగా రేసులోకి దిగుతుంది. ఈ చిత్రంలో ఆమె NCC క్యాడెట్ శిక్షణలో ఉంటుంది. హిందీలో శిక్షణ ఇస్తుంటే తనకు హిందీ రాదని తమళంలో చెప్పాలని కోరుతుంది. హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ ఇప్పటికే తమిళ ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఇదే కాన్సెప్ట్లో రఘు తాత చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది. -
పుష్ప 2 పాటలు ఫలించాయా.. ?
-
సినీతారలకు ర్యాంకులు.. టాప్ టెన్లో అంతా వాళ్లే.. టాలీవుడ్ నుంచి ఎవరంటే!
సినీ ఇండస్ట్రీలో ఎక్కువ క్రేజ్ ఉన్న సెలబ్రిటీల జాబితాను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ వెల్లడించింది. గత పదేళ్లుగా వారికి లభించిన క్రేజ్ ఆధారంగా ఈ లిస్ట్ను రూపొందించారు. అయితే ఈ లిస్ట్లో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో షారుక్ ఖాన్, ఐశ్వర్యరాయ్, ఆలియా భట్, ఇర్ఫాన్ నిలిచారు. టాప్ టెన్లో ఆందరూ బాలీవుడ్ తారలే నిలవడం విశేషం. దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న మొదటి 100 మంది సినీతారల జాబితాను ఐఎండీబీ ప్రకటించింది.దక్షిణాది తారల విషయానికొస్తే ఈ జాబితాలో సమంత 13వ స్థానం దక్కించుకుంది. సౌత్ నుంచి టాప్ 15లోపు నిలిచిన స్టార్ సమంత కావడం విశేషం. ఆ తర్వాత తమన్నా 16, నయనతార 18 స్థానాల్లో నిలిచారు. టాలీవుడ్ హీరోల విషయానికొస్తే ప్రభాస్ 29, రామ్ చరణ్ 31, అల్లు అర్జున్ 47, జూనియర్ ఎన్టీఆర్ 67 స్థానాల్లో ఉన్నారు. టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ పేరుతో 2014 నుంచి 2024 వరకు ఎక్కువ ప్రజాదరణ పొందిన తారల జాబితాను ఐఎండీబీ ఇవాళ విడుదల చేసింది. టాప్-100 సినీ తారల జాబితాలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఉన్నారు.Presenting the Top 100 Most Viewed Indian Stars of the Last Decade on IMDb, globally! 📣✨Do you spot your favourites?The Top 100 Most Viewed Indian Stars of the Last Decade on IMDb list is based on the IMDb weekly rankings from January 2014 through April 2024. These… pic.twitter.com/4h8IEEwMAZ— IMDb India (@IMDb_in) May 29, 2024 -
పుష్ప 2 నుంచి వచ్చేసిన సెకండ్ సింగిల్.. శ్రీవల్లి దెబ్బకు ఆడియన్స్ ఫిదా..!
-
Sooseki Song: అదిరిపోయిన ‘కపుల్ సాంగ్’
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ‘పుష్ప పుష్ప పుష్ప..’ సాంగ్ విడుదలై సూపర్ డూపర్ హిట్టయింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ సాగే ఈ పాటకి ఆస్కార్ అవార్డు గ్రహిత చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. శ్రేయ ఘోషాల్ అద్భుతంగా ఆలపించింది. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ పాట మేకింగ్ విజువల్స్ చూస్తుంటే.. ఐ ఫీస్ట్ అన్నట్లుగా ఉంది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా మరోసారి తమ డ్యాన్స్తో దుమ్మురేపారనేది అర్థమవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్కి జోడిగా రష్మిక నటించగా.. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల కానుంది. -
అల్లు అర్జున్ భార్య స్నేహతో కలిసి రోడ్ సైడ్ దాబాలో భోజనం
-
యూట్యూబ్ ను షేక్ చేస్తున్న పుష్ప 2 సెకండ్ సింగల్
-
ఊ అన్నావా భామా..!
‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావ....’ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ ప్రత్యేక పాటలో అల్లు అర్జున్తో కలిసి హాట్ హాట్ స్టెప్పులేశారు సమంత. ఈ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్’లో కూడా ఇలాంటి ఓ ప్రత్యేక పాట ఉందని సమాచారం. ఈ పాటకు అల్లు అర్జున్తో కలిసి బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి కాలు కదపనున్నారని సమాచారం.రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’లో చేసిన ఓ పాత్రతో త్రిప్తి బాగా పాపులర్ అయ్యారు. ఈ చిత్రం తర్వాత త్రిప్తీకి హిందీలో అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు ‘పుష్ప: ది రూల్’ పాటకు ఆమెను తీసుకున్నారనే వార్త ప్రచారంలోకి రావడంతో ‘ఊ అన్నావా భామా...!’ అని అభిమానులు సరదాగా అంటున్నారు. మరి.. ప్రచారంలో ఉన్నట్లు ఈ పాటతో త్రిప్తి తెలుగుకి పరిచయం అవుతారా? వేచి చూడాల్సిందే.29న అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే...‘పుష్ప: ది రూల్’ సినిమా నుంచి ఈ నెల 1న ‘పుష్ప..పుష్ప’ అంటూ సాగే పాట విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి ‘సూసికి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ సాగే మరో పాట లిరికల్ వీడియోను ఈ నెల 29న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఈ పాట విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు స్వరకర్త. అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘పుష్ప: ది రూల్’ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది. -
Pushpa 2 Sooseki Song: ‘శ్రీవల్లి’ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. రష్మిక ఎక్స్ప్రెషన్స్ అదుర్స్
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 మూవీ నుంచి రెండో సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో వచ్చసింది. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’అంటూ సాగే ఈ కపుల్ సాంగ్ని ఈ నెల 29న విడుదల చేయనున్నారు. సాంగ్ రిలీజ్ డేట్ని పరిచయం చేస్తూ రష్మికతో ఓ స్పెషల్ వీడియోని షూట్ చేశారు మేకర్స్. అందులో ‘శ్రీవల్లి వదినా..పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారట కదా.. ఆ పాట ఏంటో చెబుతావా’ అని చిత్తూరు యాసలో ఓ వ్యక్తి అడగ్గా.. మేకప్ వేసుకుంటున్న రష్మిక వచ్చి ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో రిలీజ్ డేట్ని ప్రకటిస్తుంది. ఈ రొమాంటిక్ సాంగ్ని మే 29న ఉదయం 11.07 నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నారు. రాక్స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల కానుంది. -
అందుకే నా పేరుకి బ్లూ చేర్చా: ‘పుష్ప పుష్ప..’ సింగర్
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ ‘పుష్ప పుష్ప’ లిరికల్ వీడియో ఈ నెల 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజైంది. ఈ పాట తెలుగు, తమిళ వెర్షన్స్లోని కొంత భాగాన్ని ఆలపించిన సింగర్ దీపక్ బ్లూ మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం చెన్నై. మా నాన్నగారు కొంతకాలం రేపల్లెలో ఉన్నారు. అలా నాకు తెలుగు భాషపై అవగాహన ఉంది. మా అమ్మమ్మ, మా అమ్మగార్లకు సంగీతంలో ప్రావీణ్యం ఉంది. అలా సంగీతంపై నాకు ఆసక్తి కలిగింది. మైక్రోబయాలజీలో పీజీ చదివాను. కొంతకాలం ఉద్యోగం చేస్తూనే, సింగర్గా ఉన్నాను. ఆ తర్వాత ఉద్యోగం వదిలిపెట్టి సింగర్గా బిజీ అయ్యా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు మూడొందలకు పైగా పాటలు పాడాను. విజయ్ ఆంటోనీగారి ‘నాన్’ సినిమాలో తొలి పాడాను. తేజగారి దర్శకత్వంలో వచ్చిన ‘నీకు నాకు డాష్ డాష్’ చిత్రంలో ‘బాయ్ బాయ్’ పాడాను. తెలుగులో అదే నా తొలి పాట. ఆ తర్వాత ‘బీరువా, పండగ చేస్కో, కిక్ 2, చుట్టాలబ్బాయి, డిక్టేటర్, ఇటీవల ‘వారసుడు’ చిత్రాల్లో పాటలు పాడాను. కానీ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో..’ చిత్రంలోని ‘లవ్ దెబ్బ’, రామ్చరణ్ ‘బ్రూస్లీ’లోని ‘మెగా మీటర్’ పాటలు గుర్తింపు తీసుకువచ్చాయి. ఇక ‘పుష్ప’లోని ‘హే బిడ్డ..’ పాట బ్యాక్గ్రౌండ్లో ఓ చిన్న వాయిస్ ఇచ్చాను. ఇప్పుడు ‘పుష్ప: ది రూల్’ సినిమా టైటిల్ సాంగ్ ‘పుష్ప పుష్ప’ పాడటం హ్యాపీగా ఉంది. ఈ పాట నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్గా భావిస్తున్నాను. నాకు చాలా మంది సింగర్స్ స్ఫూర్తి. ఎస్పీబీగారు ప్రేరణ’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నా పేరు దీపక్. కానీ దీపక్ పేరుతో చాలామంది సింగర్స్ ఉన్నారు. నా ఫేవరెట్ కలర్ బ్లూ. అలా నా పేరుకి బ్లూ చేర్చుకున్నాను’’ అన్నారు. -
పుష్ప-2 మరో అప్డేట్ వచ్చేసింది.. అదేంటంటే?
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఈ మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్కు ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పుష్ప పుష్ప అంటూ సాగే లిరికల్ సాంగ్ యూట్యూబ్ను షేక్ చేసింది. ముఖ్యంగా పుష్ప షూ స్టెప్కు ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు.తాజాగా పుష్ప టీమ్ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. బుధవారం ఉదయం 11:07 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది. దీంతో పుష్ప-2 రెండో సింగిల్ రిలీజ్ ఉంటుందని తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు సుకుమార్ ఇప్పటికే ప్రకటించారు.✌️🎵Tomorrow 11:07 AM ❤️#Pushpa2TheRule 🎶— Mythri Movie Makers (@MythriOfficial) May 21, 2024 -
Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
హీరో అల్లు అర్జున్ ఈ మధ్య లేనిపోని వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడంతో బన్నీని ఉద్దేశిస్తూ నాగబాబు రెచ్చగొట్టే ట్వీట్ చేయడం.. ఇలా అనుకోని విధంగా వార్తల్లో నిలిచాడు. అయితే అదంతా సైలెంట్ అయిపోయింది. ఇక తాజాగా బన్నీ నుంచి ఊహించని ఫొటో ఒకటి బయటకొచ్చింది. ఇందులో భార్యతో కలిసి ఓ డాబాలో భోజనం చేస్తున్నాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?)'పుష్ప' మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన అల్లు అర్జున్.. బయట ఎక్కడ కనిపించినా సరే జనాలు బాగానే వస్తారు. అలాంటిది సింపుల్గా ఓ దాబాలో భోజనం చేస్తూ కనిపించడం ఆసక్తికరంగా అనిపించింది. ఎన్నికల్లో నిలబడ్డ ఫ్రెండ్కి సపోర్ట్ చేసేందుకు నంద్యాల వెళ్లిన బన్నీ.. తిరిగొచ్చే క్రమంలోనే దాబాలో లంచ్ చేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అల్లు అర్జున్.. 'పుష్ప 2' షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 15న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల ముందు తొలి లిరికల్ సాంగ్ రిలీజ్ కాగా, బన్నీ స్టైల్-స్టెప్పులతో ఆకట్టుకుంటోంది. (ఇదీ చదవండి: నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!) -
నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
మెగా ఫ్యామిలీలో ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ గురించి పరోక్షంగా నాగబాబు చేసిన ట్వీట్ వల్ల రచ్చ రచ్చ అయింది. ఏకంగా తన అకౌంట్ని కొన్నిరోజులు డీయాక్టివేట్ చేసిన నాగబాబు మళ్లీ.. ఆ ట్వీట్ డిలీట్ చేసిన తర్వాతే ట్విట్టర్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. గొడవ ఇక్కడితే అయిపోలేదు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్.. పేరేంటో తెలుసా?)మెగా ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయనేది సోషల్ మీడియాలో గత కొన్నాళ్ల నుంచి వినిపిస్తోంది. బన్నీ.. మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడని.. అందుకే చరణ్తో అంతంత మాత్రంగానే ఉంటున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇందుకు తగ్గట్లే పుట్టినరోజున వీళ్లిద్దరూ ఎవరూ కూడా ఒకరికి ఒకరు విషెస్ చెప్పకపోవడం లాంటివి ఇవి నిజమే అనే అందరూ అనుకునేలా చేశాయి. ఇందులో నిజానిజాలు పక్కనబెడితే కొన్నిరోజుల ముందు నాగబాబు, పరోక్షంగా బన్నీ గురించి చేసిన ట్వీట్ పెద్ద దూమారమే రేపింది.ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లాడు. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్రా రెడ్డి కోసం అక్కడికి వెళ్లాడు. దీని గురించి నేరుగా చెప్పకుండా.. 'మనవాడు, పరాయివాడు' అని నాగబాబు ట్వీట్ చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేశారు. ఇదంతా బన్నీకి కూడా నచ్చలేదని, దీంతో మెగా ఫ్యామిలీకి ఉన్న వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడని అనుకుంటున్నారు. ఇందులో నిజమేంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్) -
ఎల్బీ స్టేడియంలో ఘనంగా ‘డైరెక్టర్స్ డే’ సెలబ్రేషన్స్ ( ఫొటోలు)
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
బరాజ్లు కట్టిన సబ్ కాంట్రాక్టర్లు ఎవరు?
సామాజిక మోసంపైనే చంద్రబాబు మొదటి సంతకం
ప్రళయమొచ్చినా..ఈ ఐదూ బతికేస్తాయట!
Italian Premier Giorgia Meloni: రష్యా ప్రతిపాదన.. ఓ ఎత్తుగడ
దేశవ్యాప్తంగా డిజిటల్ క్రాపింగ్
‘సెర్చ్’ ఏదీ ?
థాయిలాండ్లో అద్భుతం
‘బంధం’ తెగిపోతోంది!
ప్రియుడి మోజులో భర్తను చంపించింది
G7 Summit 2024: చైనా అండతోనే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం
Advertisement