-
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల మే 9 వ తేదీ షెడ్యూల్ను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ బుధవారం విడుదల చేశారు.సీఎం జగన్.. గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కర్నూలు సిటీ వై ఎస్సార్ సర్కిల్లోని ఎస్వీ కాంప్లెక్స్ రోడ్డులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం పార్లమెంట్ పరిధిలోని కళ్యాణ దుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్డులో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాజంపేట నియోజకవర్గంలో కోడూరు రోడ్డులో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. -
బాగా పనిచేస్తున్నారు.. ఇదే స్ఫూర్తి కొనసాగాలి
అనంతపురం అర్బన్: కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినోద్కుమార్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందని,ఇదే స్ఫూర్తిని పోలింగ్ ముగిసే వరకూ కొనసాగించాలని ప్రత్యేక సాధారణ పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఎన్నికల సంసిద్ధతపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్, పరిశీలకులతో కలిసి నోడల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో పనిచేయడం ఒక ప్రత్యేక అవకాశంగా భావించాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పకడ్బందీ చర్యలు: కలెక్టర్ వినోద్కుమార్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టామని ప్రత్యేక పరిశీలకునికి కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2,236 పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించామన్నారు. దివ్యాంగుల కోసం ర్యాంప్ లు నిర్మించామని, 576 వీల్ చైర్లు అందుబాటులో ఉంచామన్నారు. ఓటరు స్లిప్ల పంపిణీ త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ నిర్వహిస్తామన్నారు. 544 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ప్రతి ప్రక్రియను కచ్చితత్వంతో నిర్వహిస్తున్నామని వివరించారు. పటిష్ట పోలీసు బందోబస్తు: ఎస్పీ అమిత్ బర్దర్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ప్రత్యేక పరిశీకులకునికి ఎస్పీ అమిత్ బర్దర్ చెప్పారు. జిల్లాకు సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర, సమీకృత చెక్పోస్టులు ఏర్పాటు చేసి, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామన్నారు. పోలింగ్, కౌంటింగ్ కోసం భద్రత, బందోబస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో పరిశీలకులు మనీష్ సింగ్, అజయ్నాథ్ ఝ, రవికుమార్, విలాస్ వి. షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే, జాయింట్ కలెక్టర్ కేతన్గార్గ్, జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి, నగర పాలక కమిషనర్ మేఘ స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ విజయభాస్కర్రెడ్డి,ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, పార్లమెంట్ ఏఆర్ఓ రమేష్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అధికారులకు ప్రత్యేక సాధారణ పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా సూచన -
ఉన్న పెన్షన్లు తీసేస్తారు
చంద్రబాబు ఏవి చెప్పినా నమ్మడం సాధ్యం కాదు. అధికారంలోకి వస్తే సామాజిక పింఛన్ రూ.4 వేలు అంటున్నాడు. దాని అమలు కోసం అనేక నిబంధనలు పెట్టి ఉన్న పెన్షన్లు ఎన్ని ఊడిస్తాడో తెలియదు. సీఎం జగన్ రూ.3 వేలు ఇస్తున్నా క్రమం తప్పకుండా ఠంచనుగా ఒకటో తేదీనే వలంటీర్ గడప తట్టి ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. మరో రూ.500 పెంచుతానని చెప్పాడు. జగన్ చెప్పాడంటే.. చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. – మాలన్బీ, రాయదుర్గం పట్టణం ఆ పాలన వద్దే వద్దు టీడీపీకి పొరపాటున ఓటేస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు కొని తెచ్చుకున్నట్టే. అప్పట్లో ఏ పథకం కావాలన్నా ఆ కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఆ సమయాన వారు ప్రవర్తించిన తీరు తలిస్తేనే భయమేస్తోంది. చంద్రబాబు మానస పుత్రికగా ఏర్పాటైన ఈ కమిటీలు పేదల రక్తాన్ని పీల్చాయి. ఆ పాలన కావాలని మళ్లీ కోరుకోవడం లేదు. – నాగరాజు యాదవ్, తాళ్లకెర, గుమ్మఘట్ట మండలం బాబుకు బుద్ధి చెప్పాలి నాకు ప్రతి నెలా వలంటీరు ఇంటికి వచ్చి రూ.3 వేలు పింఛను ఇచ్చేవాళ్లు. బాబు తన అనుచరుల ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించాడంట. దీంతో రెండు నెలలుగా నాకు పింఛను సరిగా అందలేదు. పేదలను ఇంత ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి. ఆయన మాటలను నమ్మితే ప్రజలు మళ్లీ కష్టాలు కొనితెచ్చుకున్నట్లే. – దురగమ్మ, పింఛనుదారు, కంబదూరు -
పలకరించిన వరుణుడు
చీనీ టన్ను రూ.32 వేలు అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.32 వేలు పలికాయి. అనంతపురం అగ్రికల్చర్: వరుణదేవుడు పలకరించాడు. భానుడి దెబ్బకు అల్లాడుతున్న ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉపశమనం కలిగించాడు.మంగళవారం సాయంత్రం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. శెట్టూరు, ఉరవకొండ, బ్రహ్మసముద్రం, ఆత్మకూరు, డీ హీరేహాళ్, కళ్యాణదుర్గం, అనంతపురం, కూడేరు, రాయదుర్గం, బెళుగుప్ప, కంబదూరు, పామిడి, బీకేఎస్, పెనుకొండ, హిందూపురం, మడకశిర, పరిగి, గుడిబండ, బత్తలపల్లి, అమరాపురం, సోమందేపల్లి, నల్లచెరువు, రొద్దం తదితర మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. -
‘బాబు కుయుక్తుల్లో చిక్కుకున్న ఎన్నికల కమిషన్’
తాడిపత్రి: టీడీపీ అధినేత చంద్రబాబు పన్నుతున్న కుయుక్తుల్లో ఎన్నికల కమిషన్ చిక్కుకున్నట్లుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య అన్నారు. మంగళవారం తాడిపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ చంద్రబాబు కమిషన్లా మారిపోయిందన్నారు. చంద్రబాబు చెప్పినట్లు ఆడుతూ, గంగిరెద్దులా తల ఊపుతోందన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి నిరాటంకంగా అమలవుతున్న సంక్షేమ పథకాలకు.. టీడీపీ నేతల ఫిర్యాదుతో బ్రేక్ వేయడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తూ వస్తోందని, అయితే ఈ ఏడాది ఎన్నికల కోడ్ను సాకుగా చూపి 6,95,857 మంది రైతులకు రూ. 847 కోట్లు అందకుండా చేయడం దారుణమన్నారు. అలాగే, విద్యార్థుల విద్యాదీవెన నిధులు రూ. 611 కోట్ల విడుదలను కూడా అడ్డుకోవడంతో పాటు ఆసరా, ఈబీసీ నేస్తం వంటి పథకాల అమలును నిలిపివేయడం దుర్మార్గమన్నారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థుల జీవితాలతో కూడా టీడీపీ నాయకులు చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. ఈసీ తీరు బాధ కలిగిస్తోందన్నారు. ఇళ్ల వద్దకే పింఛన్ల పంపిణీని అడ్డుకుని ఇప్పటికే లక్షలాది మంది వృద్ధులకు అవస్థలు కలిగించారన్నారు. ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో మాత్రం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు అనుమతిచ్చిన ఎన్నికల కమిషన్.. మన రాష్ట్రంలో మాత్రం పథకాలు పాతవే, లబ్ధిదారులు కూడా పాతవారే అయినపుడు ఎవరికి మేలు చేసేందుకు అడ్డుకుందో ఇట్టే అర్థమైపోతోందన్నారు. కేవలం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేస్తూ చర్యలు తీసుకుంటుండడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ విజయాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని, ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తన నిర్ణయాలపై ఈసీ పునఃసమీక్షించుకుని, ప్రజలకు మేలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, రైతులు, మహిళలు అధైర్యపడరాదని, ఎవరెన్ని కుయుక్తులు పన్నినా, రెండో సారి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement