-
చేయూత నిధులను అడ్డుకున్నది చంద్రబాబే
ప్యాపిలి: ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి వైఎస్సార్ చేయూత నిధులు మహిళల ఖాతాల్లోకి జమ కాకుండా అడ్డుకున్న పాపం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బూరుగల, కౌలుపల్లి, వంకమెట్టుపల్లి, సీతమ్మతండా గ్రామాల్లో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటి ప్రచారం, గ్రామాల్లో రోడ్షో చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ వలంటీర్ల ద్వారా పింఛన్దారులకు ఠంచన్గా వస్తున్న పింఛన్ను కూడా చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. బాబు నిర్వాకంతోనే రెండు నెలలుగా అవ్వాతాతలు, దివ్యాంగులు పింఛన్ డబ్బుల కోసం సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. హామీలను తుంగలో తొక్కడంలో బాబు తర్వాతే ఎవరైనా అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. అభివృద్ధి అంటే అర్థం తెలియని టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చవకబారు విమర్శలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు హామీలను నెరవేర్చి పేదల పక్షపాతినని నిరూపించుకున్నారన్నారు. ఈ నెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిపించాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ బొర్రా మల్లికార్జునరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ శ్యాంరెడ్డి, సర్పంచులు భువనేశ్వరి, రామలక్ష్మిబాయి, వైఎస్సార్సీపీ నాయకులు చంద్రశేఖర్రెడ్డి, తులసిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, నరసింహారెడ్డి, జగదీశ్వరరెడ్డి, మధుసూదన్, పెద్దపుల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, అంకాలగారి సుబ్బారెడ్డి, సాలన్న పాల్గొన్నారు. మళ్లీ వచ్చేది జగనన్న సంక్షేమ రాజ్యమే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి -
చల్లబడిన వాతావరణం
మండలం వర్షపాతం (మి.మీ) చాగలమర్రి 76.4 శిరివెళ్ల 72 గడివేముల 65.2 బండిఆత్మకూరు 64.2 వెలుగోడు 52.2 పాణ్యం 51.4 తుగ్గలి 22.4 పత్తికొండ 15.2 కర్నూలు(అగ్రికల్చర్): గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి వేసవి నిప్పుల వర్షం కురిపించింది. ఎండలు, వడగాడ్పులతో అల్లాడుతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనాన్ని కల్పించారు. ఉన్నట్టుండి ఉమ్మడి కర్నూలు జిల్లాపై వరుణడు విరుచుకుపడ్డారు. ఉరుములు, మెరుపులు, పెనుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిశాయి. నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవగా.. కర్నూలు జిల్లాలో కొన్ని మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. నంద్యాల జిల్లాలో ఒక్క రాత్రిలోనే జిల్లా సగటున 37.4 మి.మీ వర్షపాతం నమోదు కావడం విశేషం. అవుకు మండలం మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షం కురిసింది. పలు చోట్ల వడగండ్లు పడ్డాయి. ఎండల వేడిమితో ఉడికిన నంద్యాల జిల్లా ఒక్కసారిగా చల్లబడింది. అవుకులో ఏకంగా 102 మి.మీ వర్షపాతం నమోదైంది. గడివేముల మండలం పెసరవాయి గ్రామం వద్ద పిడుగు పడిన ఘటనలో 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కర్నూలు జిల్లాలో మాత్రం వర్షాలు అంతంత మాత్రానికే పరిమితమయ్యాయి. కల్లూరు మండలం పెద్దటేకూరు–ఎర్రకత్వ తండా మధ్య భారీగా వడగండ్లు పడ్డాయి. ఇదిలాఉంటే కర్నూలు జిల్లాలో అత్యధికంగా గూడూరులో 39.6 డిగ్రీలు, అత్యల్పంగా తుగ్గలిలో 35 డిగ్రీల వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలో అత్యధికంగా బేతంచెర్ల, చాగలమర్రిలో 38.3, అత్యల్పంగా శిరివెళ్లలో 33.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 95.2 శాతం
నంద్యాల: జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 17,939 మంది ఉండగా 16,287 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మూడు రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 95.2 శాతం నమోదు అయ్యింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. జిల్లాలోని ఒక పార్లమెంట్, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగిందన్నారు. ఇప్పటికే ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, పాత్రికేయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. మూడవ రోజు బుధ వారం 3,647 మంది అత్యవసర, ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 538 మంది ఓటర్లు, శ్రీశైలంలో 655, నందికొట్కూరులో 614, డోన్లో 511, నంద్యాలలో 824, బనగానపల్లెలో 505 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలి ఉన్న ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది, ప్రధానమంత్రి పర్యటనలో ఉన్న పోలీస్ సిబ్బందికి గురువారం కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వెసులుబాటు కల్పించామన్నారు. -
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేద్దాం
ఐదేళ్ల తర్వాత.. అవే ఫలితాలు వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆపార్టీ పైచేయి సాధిస్తోంది. 2012లో ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరులో జరిగిన రెండు ఉప ఎన్నికలలో ఖాతా ప్రారంభించి, 2014లో 11 అసెంబ్లీలు, 2 ఎంపీలను ఖాతాలో వేసుకుంది. 2019లో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను పూర్తిగా క్లీన్స్వీప్ చేసి టీడీపీ ఉనికి లేకుండా చేసింది. ఈ దఫా కూడా అవే ఫలితాలు పునరావృతమవుతాయనే భావనలో ఆపార్టీ ఉంది. ఇందుకు కారణం ఆ పార్టీ అధినేతకు ‘రాయలసీమ’పై ప్రత్యేక అనుబంధం ఉండటం. ఈ ఐదేళ్లలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ‘సామాజిక న్యాయాన్ని’ చేతల్లో చూపించి సాధారణ వ్యక్తులను చేయిపట్టుకుని చట్టసభలకు పంపడమే. ఇవే జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని సామాన్యులతో పాటు అన్ని వర్గాల్లో మరో మెట్టు పెంచాయి. ● 2019లో కర్నూలు అసెంబ్లీ నుంచి మైనార్టీ అభ్యర్థి హఫీజ్ను చట్టసభలకు పంపారు. ఆ తర్వాత నంద్యాల నుంచి ఇసాక్ను ఎమ్మెల్సీగా చేశారు. 2019లో 14 అసెంబ్లీలలో ఒక్క సీటు కూడా టీడీపీ మైనార్టీలకు ఇవ్వలేదు. ఈ దఫా ఎన్నికల్లో కర్నూలు నుంచి ఇంతియాజ్ను బరిలోకి దింపడంతో పాటు హఫీజ్ను రాజ్యసభకు పంపిస్తానని చెప్పారు. జిల్లా చరిత్రలో రాజ్యసభకు వెళ్లబోయే మైనార్టీ నేత కూడా హఫీజ్ మాత్రమే కానుండటం విశేషం. దీంతో మైనార్టీలు కూడా పూర్తి ఏకపక్షంగా జగన్మోహన్రెడ్డి వైపు నిలిచారు. ● 2014లో చేనేత వర్గానికి చెందిన బుట్టారేణుకకు ఎంపీ టిక్కెట్ ఇచ్చి పార్లమెంట్కు పంపారు. 2019లో చేనేత వర్గానికి చెందిన సంజీవ్కుమార్ను ఎంపీగా ఢిల్లీకి పంపారు. జిల్లా చరిత్రలో చేనేతలను చట్టసభలకు పంపిన తొలి నాయకుడు జగన్ మాత్రమే. ● 2014, 2019లో వాల్మీకి వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాంను చట్టసభలకు పంపి మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. జిల్లా చరిత్రలో వాల్మీకి వర్గానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించిందీ జగనే! ఆ తర్వాత మధుసూద్నుకు ఎమ్మెల్సీ, బీవై రామయ్యను మేయర్గా చేసి జిల్లాలో వాల్మీకుల ఆత్మగౌరవాన్ని పెంచడంతో పాటు చట్టసభలకు పంపిడంతో ఆ వర్గం మొత్తం వైఎస్సార్సీపీ వైపు నిలబడింది. ● ఆలూరు నుంచి విరూపాక్షి, కర్నూలు ఎంపీగా బీవై రామయ్య, ఎమ్మిగనూరు అసెంబ్లీ నుంచి బుట్టారేణుక, కర్నూలు నుంచి ఇంతియాజ్ పోటీ చేస్తున్నారు. దీంతో కర్నూలు జిల్లాలో నలుగురు బీసీలకు అవకాశం కల్పించినట్లయింది. ● ఇక 2019 నుంచి ఇచ్చిన నామినేటెడ్ పోస్టుల్లో 50శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించారు. జిల్లా, రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడూ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు. ఏ నాయకుడు, పార్టీకి సాధ్యం కాని విధంగా సామాజిక న్యాయం చేతల్లో చేసి చూపించి చరిత్ర సృష్టించారు. దీంతో ఈ వర్గాలన్నీ కూడా జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై మరోసారి విశ్వాసం ఉంచాయి.నేడు కర్నూలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ● ఎస్టీబీసీ మైదానం సమీపంలో వైఎస్సార్ సర్కిల్లో బహిరంగసభ ● గత నెలలో కర్నూలు, నంద్యాలలో బస్సుయాత్ర దిగ్విజయం ● పోలింగ్కు నాలుగు రోజుల ముందు మరోసారి జిల్లా పర్యటన ● ఉమ్మడి జిల్లాలో 2 ఎంపీలు, 14 అసెంబ్లీలు క్లీన్స్వీప్ చేస్తామంటోన్న ఆ పార్టీ నేతలుసభా స్థలం: కర్నూలు ఎస్టీబీసీ మైదానం సమీపంలోని వైఎస్సార్ సర్కిల్ సమయం: ఉదయం 10.55 గంటలకుసాక్షి ప్రతినిధి కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు కర్నూలుకు రానున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇటీవల జరిగిన బస్సుయాత్ర దిగ్విజయం కావడంతో 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయనే జోష్ ఆపార్టీ నేతల్లో కనిపిస్తోంది. అందులో భాగంగానే ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్కు నాలుగు రోజుల మందు మరోసారి తమ అధినేత రానుండటంతో రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి ఉదయం 10.15గంటలకు విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.35 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. 10.55 గంటలకు ఎస్టీబీసీ మైదానం సమీపంలోని వైఎస్సార్ సర్కిల్లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. 11.50కు మీటింగ్ ముగించుకుని కళ్యాణదుర్గం బయలుదేరుతారు. కర్నూలు అభివృద్ధిలోనూ అండగా.. అధికారంలోకి వచ్చాక కర్నూలు అభివృద్ధిలోనూ ముఖ్యమంత్రి తోడుగా నిలిచారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఆదోని డివిజన్ అభివృద్ధికి ‘ఆడా’(ఆదోని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేశారు. సోలార్ డ్రైయర్స్తో మహిళలకు ఉపాధి కల్పించారు. రూ.411.74కోట్లతో 2,709 ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించి 17,866 ఉద్యోగాలు కల్పించారు. ఎయిర్పోర్టు, గ్రీన్కో రెన్యువబుల్ ఎనర్జీప్లాంటు, జయరాజ్ ఇస్పాత్, రామ్కో సిమెంట్తో పాటు పారిశ్రామికరంగాన్ని అభివృద్ధి చేశారు. సంక్షేమం, గ్రామాభివృద్ధికి తీసుకొచ్చిన సంస్కరణలతో జిల్లా ప్రజల ఆర్థిక శక్తి మారింది. సచివాలయ వ్యవస్థతో ప్రతీ పల్లెలో సగటున 15 సర్కారు ఉద్యోగాలు వచ్చాయి. ఇలా జిల్లాలోని 92శాతం కుటుంబాలకు మేలు చేశారు. ముఖ్యంగా ఈ సంస్కరణలు పేద, సామాన్య కుటుంబాలకు తోడుగా నిలిచాయి. దీంతో ఈ వర్గాలన్నీ వైఎస్సార్సీపీ వైపు నిలబడ్డారు. జిల్లాలోని మొత్తం ఓటర్లలో 82శాతం గ్రామీణ ఓటర్లు, 18 శాతం అర్బన్ ఓటర్లు ఉన్నారు. దీంతో మెజార్టీ కుటుంబాలకు మేలు జరిగిందని చెప్పడం, ఈ దఫా మేనిఫెస్టోలో కూడా ఆచరణ సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇవ్వడంతో జగన్ చేసేదే చెబుతాడు, చెప్పింది చేస్తాడు అనే విశ్వసనీయతను ప్రజల్లో సంపాదించారు. దీంతోనే అన్ని వర్గాలు ఈ దఫా కూడా వైఎస్సార్సీపీ వైపు ఉన్నాయి. తిరిగి మరోసారి 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో క్లీన్స్వీప్ చేస్తామనే ధీమాతో ఆ పార్టీ ఉంది. డబ్బు మూటలకంటే నమ్మకమైన నాయకుడి వైపే ప్రజలు ఈ దఫా ఎన్నికల్లో టీడీపీ డబ్బుమూటలనే నమ్ముకుంది. కర్నూలులో టీజీ భరత్ ఓటుకు రూ.2వేలు, బనగానపల్లెలో బీసీ జనార్దన్రెడ్డి రూ.3వేల వరకూ పంచేందుకు సిద్ధమయ్యారు. ఆళ్లగడ్డ, శ్రీశైలం, డోన్, ఆలూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ ఇలా ప్రతీ చోట ఓటుకు రూ.వెయ్యి నుంచి 2వేలు పంచేందుకు సిద్ధమయ్యారు. ప్రతీ టీడీపీ అభ్యర్థి సగటున రూ.50కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం ఐదేళ్లకోసారి ఇచ్చే వెయ్యి, రూ.2వేల కంటే తమను కంటికి రెప్పలా చూసుకునే నాయకుడివైపు ఉంటామని తేల్చిచెబుతుండటం విశేషం. అప్పుడూ.. ఇప్పుడూ.. సామాన్యుల పక్షమేకర్నూలు(టౌన్): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు పర్యటనను వైఎస్సార్సీపీ శ్రేణులు కలసికట్టుగా విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు పార్లమెంట్ డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్ ఎస్వీమోహన్ రెడ్డి, కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎస్టీబీసీ కళాశాల క్రీడా మైదానంలో వైఎస్సార్సీపీ నేతలు హెలిప్యాడ్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువారం ఉదయం 10.45 గంటలకు స్థానిక వైఎస్సార్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని చెప్పారు. కర్నూలు నియోజవర్గంలోని కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. మహిళలు వేలాదిగా తరలిరావాలని కోరారు. వీరి వెంట పార్టీ నాయకులు రసూల్, తొట వెంకటక్రిష్ణారెడ్డి, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. -
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
నంద్యాల: బాధ్యత గల పౌరులుగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు సూచించారు. బుధవారం ఆయన చాంబర్లో స్వీప్ యాక్టివిటీ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై టోపీలను ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని, తమకు నచ్చిన వారికి ఓటు వేయాలన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరునికి మన రాజ్యాంగం ఓటుహక్కు కల్పించిందన్నారు. జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వివిధ రూపాల్లో స్వీప్ యాక్టివిటీస్ ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 10లోగా తత్కాల్ ఇంటర్ అడ్వాన్స్ ఫీజు చెల్లించండి నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ మొద టి, రెండో సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించని విద్యార్థులు తత్కాల్ స్కీమ్ కింద రూ.3వేలు అదనపు ఫీజు చెల్లించి పరీక్షలు రాయవచ్చని నంద్యాల జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారిణి సునీత బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. తత్కాల్ ఫీజు చెల్లించుటకు ఈనెల 10వ తేదీ వరకు గడువు ఉందన్నారు. ఈ ఫీజు చెల్లించే విద్యార్థులు జిల్లా హెడ్క్వార్టర్లో పరీక్ష సెంటర్లలో పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలలో 2024–25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు తొలి విడత కౌన్సెలింగ్ అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. iti.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఏడాది కోర్సులు కోఫా, బ్రెష్ మేకింగ్, ఫ్లంబర్, మెకానిక్ డీజిల్, రెండేళ్ల కోర్సులు డీ/మాన్ సివిల్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, మిషినిస్ట్ గ్రైండర్, మోకానిక్ మోటారు వెహికల్, రిఫ్రజరేషన్ ఎయిర్ కండీషన్ టెక్నీషియన్, ఇస్ట్రూమెంట్ మెకానిక్, ఐసీటీ ఎస్ఎం ట్రేడ్లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 18వ తేదీ నుండి 26వ తేదీలలో డోన్ ప్రభుత్వ ఐటీఐలో జరిగే కౌన్సెలింగ్కు హాజరు కావాలని ప్రిన్సిపాల్ కోరారు. విద్యార్థులకు కాల్ లెటర్స్ పంపడం జరుగుతుందని వివరించారు. పదవ తరగతి పాస్, ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. గిరిజన విద్యార్థులకు జాతీయ స్కాలర్షిప్ కర్నూలు(అర్బన్): 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల ఉన్నత విద్యకు జాతీయ ఓవర్సీస్ స్కాలర్షిప్ అందిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి జే రంగలక్ష్మిదేవి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పథకం ద్వారా స్కాలర్షిప్ పొందేందుకు మాస్టర్ లెవెల్ పీహెచ్డీ, పోస్టు డాక్టరల్ రీసర్చ్ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ నెల 31వ తేదిలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాలిసెట్ ఫలితాల విడుదల కర్నూలు సిటీ: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేశారు. గత నెల 27న జరిగిన పరీక్ష నిర్వహించగా.. ఈ నెల 4న తుది కీ విడుదల చేశారు. ప్రవేశ పరీక్షకు జిల్లా నుంచి బాలురు 4,856, బాలికలు 2,390 మంది.. మొత్తం 7,246 మంది హాజరుకాగా 6,373 మంది ఉత్తీర్ణులయ్యారు. నంద్యాల జిల్లా నుంచి బాలురు 3,607 మంది, బాలికలు 1,873 మంది..మొత్తం 5,480 మంది హాజరుకాగా 4,854 మంది ఉత్తీర్ణులయ్యారు. -
అకాల వర్షం.. అపార నష్టం
● ఈదురు గాలులు, కుండపోత వర్షం ● అరటి రైతులకు భారీగా నష్టం ● నేలకొరిగిన 400 విద్యుత్ స్తంభాలు, ● కూలిపోయిన 40 ట్రాన్స్ఫార్మర్లు, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా నంద్యాల(అర్బన్)/గోస్పాడు/ఆళ్లగడ్డ/దొర్నిపాడు: జిల్లాలో మంగళవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో పాటు ఉరుములతో వర్షం కురిసింది. జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. గోస్పాడు, గడివేముల, బండిఆత్మకూరు, మహానంది తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నంద్యాల పట్టణంలో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము 3 గంటల వరకు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గాంధీచౌక్ సర్కిల్లో రోడ్డు పక్కనపెట్టుకున్న తోపుడు బండ్లు ఈదురు గాలులకు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సంజీవనగర్ గేటు, మున్సిపల్ ఆఫీసు, ఎస్బీఐ కాలనీ ఏటీఎం సెంటర్, సాయిబాబానగర్ ఆర్చి, చామకాల్వ సెంటర్, కోవెలకుంట్ల జంక్షన్ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షం మొదలైనప్పటి నుంచి ఉదయం 10.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నేలకొరిగిన విద్యుత్ స్తంభాల పునరుద్ధరణలో విద్యుత్ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. జాతీయ రహదారిపై, పలు మండలాల పరిధిలోని గ్రామాల్లో పెద్దపెద్ద వృక్షాలు నేలకూలాయి. మహానంది మండలంలో అరటి రైతులు భారీగా నష్టపోయారు. దాదాపు 750 ఎకరాల్లో అరటి చెట్లు నేలవాలడంతో రూ. 6 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పలు ప్రాంతాల్లో రేకులషెడ్లు, పశువుల పాకలు గాలి వాన బీభత్సానికి ఎగిరిపడ్డాయి. చాపిరేవుల సమీపంలో జంగాల కులస్తుల గుడిసెలు కుప్పకూలడంతో రోడ్డున పడ్డారు. నంద్యాల విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో 400 విద్యుత్ స్తంభాలతో పాటు 40 ట్రాన్స్ఫార్మర్లు నేలకూలడంతో దాదాపు రూ.1.75 కోట్లు నష్టం వాటిల్లినట్లు విద్యుత్ శాఖ డీఈ రమణారెడ్డి తెలిపారు. గోస్పాడు మండలంలో 50 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చాగలమర్రి మండలంలో 76.4 మి.మీ వర్షపాతం నమోదైంది. రెండు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
Banaganapalle: ఓటమి భయంతో దాడులకు తెగబడిన బీసీ జనార్ధన్రెడ్డి
కోవెలకుంట్ల: ఓ వైపు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటం.. మరో వైపు ప్రజల్లో సరైన ఆదరణ కనిపించకపోవడంతో టీడీపీ అభ్యర్థుల్లో ఓటమి భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో బనగానపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్రెడ్డి ఎలాగైనా ఓటర్లను నయానో.. భయానో తమ వైపు మళ్లించుకునేందుకు ప్రధాన అస్త్రాలను బయటకు తీస్తున్నాడు. ఇప్పటికే రెండు నెలల నుంచి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాడు. వీటి ద్వారా గెలుపుసాధ్యం కాదని భావించి తాజాగా భౌతిక దాడులకు దిగాడు. మంగళవారం బనగానపల్లె పట్టణంలో కూరగాయల మార్కెట్ వద్ద బీసీ జనార్ధన్రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ సమక్షంలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. రౌడీయిజం ప్రదర్శిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులపై కర్రలు, రాడ్లతో దాడిచేశాయి. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎన్నికల వేళ ఓటమి భయంతో బరితెగింపు చర్యలకు పాల్పడటంతో ఓటర్లు భయాందోళన చెందుతున్నారు. వ్యాపారవేత్తగా భూకబ్జాలతో కోట్లాది రూపాయలు గడించిన బీసీ జనార్దన్రెడ్డి 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం చేశాడు. ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలపై విశ్వరూపం చూపాడు. ప్రభుత్వ ఉద్యోగులకు నరకం చూపించాడు. ఐదేళ్లపాటు నీరు– చెట్టుపేరుతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును దోచుకున్నాడు. దీంతో 2019 ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు బీసీకి బుద్ధి చెప్పి ఓడించారు. ఈ నెల 13వ తేదీన 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉండటంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో డబ్బులు, ప్రలోభాలు, భౌతిక దాడులను ఎన్నికల అ్రస్తాలుగా ఎంచుకున్నాడు.ప్రజా బలం లేక.. 2019లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమం, అభివృద్ధితో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి నవరత్న పథకాల్లో మహిళలకే అధిక ప్రాధాన్యత కలి్పంచి పేదరిక నిర్మూలను కృషి చేశారు. పేదలు, పెత్తందారుల మధ్య జరుగుతున్న ఎన్నికల్లో పెత్తందారులు టీడీపీ వైపు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల పక్షాన పోరాటం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్సార్సీపీ బనగానపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డికి గ్రామాల్లో వస్తున్న ఆదరణను ఓర్వలేక ఈ ఎన్నికల్లో మరలా ఓటమి తప్పదని భావించాడు. ఎలాగైనా గెలవాలన్న కుతంత్రంతో బరి తెగింపు చర్యలకు పాల్పడుతున్నాడు. నియోజకవర్గంలో ఆ పారీ్టకి ప్రజాబలం లేకపోవడంతో డబ్బును ప్రధాన అస్త్రం చేసుకుంది. అరకొరగా నిర్వహిస్తున్న ప్రచారానికి సైతం అద్దె కార్యకర్తలపై ఆధార పడాల్సి రావడంతో ఆ పార్టీ శ్రేణులను కలవర పరుస్తోంది. సొంత నేతలకు వడ్డీ లేని రుణాలు..ఓటర్లకు టోకెన్లు ఎన్నికలు సమీపిస్తుండంతో గెలుపుకోసం బీసీ కుయుక్తులకు తెరలేపాడు. పారీ్టలో చేరిన వైఎస్సార్సీపీ గ్రామ నాయకులకు కేడర్ను బట్టి రూ. 3 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు డబ్బులు ముట్టజెప్పాడు. ఇందులో ఎక్కువభాగం కొలిమిగుండ్ల మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ నాయకులకు డబ్బులు అందజేశాడు. అలాగే టీడీపీలో కొనసాగుతున్న నాయకులకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నాడు. ఒక్కో నాయకుడికి రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షలవరకు వడ్డీలేని రుణాలు ఇచ్చాడు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు ఓటరుస్లిప్లు అందజేస్తున్నారు. ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్ గ్యారెంట్’ పేరుతో ఓటరు స్లిప్కు మరోవైపు టోకన్ ముద్రించిన స్లిప్లు పంపిణీ చేశారు. త్వరలో పట్టణ ప్రాంతాల్లో ఓటుకు రూ. 3 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2 వేల చొప్పున డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. డబ్బులు పంపిణీ చేసే రోజు ఓటర్స్లిప్కు ఉన్న టోకెన్ చూపించిన వారికి డబ్బులు అందజేయనున్నారు. టీడీపీ సానుభూతి పరులైన ఓటర్లు, తటస్ట ఓటర్లకు స్లిప్లు పంపిణీ చేశారు. హత్యాయత్నం కేసులో జైలు..మొదటి నుంచి బీసీ జనార్ధన్రెడ్డికి క్రూరస్వభావం ఉంది. ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకుని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టే నైజం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ పారీ్టకి అనుకూలంగా ఉన్నాడన్న నెపంతో బనగానపల్లె పట్టణానికి చెందిన ఎస్టీ వర్గానికి చెందిన కోనేటి దుర్గ అనే వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ కేసులో బీసీ నెల రోజులపాటు కటకటాలపాలైన విషయం తెలిసిందే. ఆ క్రూరత్వాన్ని మళ్లీ ప్రదర్శిస్తున్నాడు. సామ, వేద, దండోపాయాలు ప్రదర్శించి ఎన్నికల్లో గెలవాలని కుతంత్రం చేస్తున్నాడు. ఎన్నికలకు ముందే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న బీసీ రాబోయే రోజుల్లో మరెంత బరి తెగిస్తాడని బనగానపల్లె ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వ్యక్తికి త్వరలో జరగబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఓటర్లు నిర్ణయించుకున్నారు. -
హజ్ యాత్రికులకు ఉచితంగా వ్యాక్సినేషన్
కర్నూలు(హాస్పిటల్): హజ్కు వెళ్లే ప్రతి యాత్రికునికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ వేయిస్తోందని డీఎంహెచ్వో డాక్టర్ వై. ప్రవీణ్కుమార్ చెప్పారు. మంగళవారం స్థానిక వడ్డేగేరి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హజ్కు వెళ్లే యాత్రికులకు వ్యాక్సినేషన్ వేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో డాక్టర్ వై. ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ హజ్ యాత్రకు వెళ్లే వారికి తప్పనిసరిగా ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మూడు రకాల టీకాలు(మెనింగోకాకల్, ఇన్ఫ్లూయింజా, ఓపీవీ ఓరల్ పోలియో) వేస్తారన్నారు. వీరికి స్పెషలిస్టు వైద్యులచే వైద్యపరీక్షలు కూడా నిర్వహిస్తామన్నారు. జిల్లా నుంచి హజ్ యాత్రకు బయలుదేరుతున్న వారందరికీ వ్యాక్సినేషన్ వేయించామన్నారు. కార్యక్రమంలో డీపీఎంయు డాక్టర్ ఉమా, డీపీవో విజయరాజు, వైద్య సిబ్బంది, హజ్ కమిటి సభ్యులు పాల్గొన్నారు. -
నిఘా నేత్రం.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
కర్నూలు(సెంట్రల్): సార్వత్రిక ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. గతంలో జరిగిన ఘటనల ఆధారంగా 1,500 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనుమతి ఇచ్చారు. అయితే జిల్లాకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉండడంతో డబ్బు, మద్యం అధికంగా రవాణా అవుతోందని, ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంత ఎన్నికల నిర్వహణకు జిల్లాలోని 2,204 కేంద్రాలకు వెబ్కాస్టింగ్ కోసం అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి జిల్లా కలెక్టర్ లేఖరాశారు. ఇటీవల అక్కడి నుంచి అనుమతి ఇస్తూ ఆదేశాలు రావడంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. వెలుపల, లోపల ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు వెబ్కాస్టింగ్లో భాగంగా పోలింగ్ కేంద్రంలో లోపల, బయట ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి సులభతరం అవుతుంది. ఇందుకోసం లోపలి దృశ్యాలను రికార్డు చేసేందుకు ఒక్క సీసీ కెమెరాను, బయటి దృశ్యాలను చిత్రీకరించేందుకు మరో సీసీ కెమెరాను అమర్చుతారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి రెండు సీసీ కెమెరాలను పంపారు. వీటిని ఈనెల 9, 10వ తేదీల్లో సరైన లోకేషన్లలో అమర్చి వాటిని సంబంధిత నియోజకవర్గ ఆర్వో, కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్, విజయవాడలోని సీఈఓ కార్యాలాయనికి కనెక్ట్ చేస్తారు. దీంతో పోలింగ్ కేంద్రాల లోపల, బయట జరుగుతున్న దృశ్యాలను అప్పటికప్పుడే జిల్లా ఎన్నికల అధికారులు, అబ్జర్వర్లు, సీఈఓ కార్యాలయం, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వారి కార్యాలయాల నుంచే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తీసుకెళ్లే వరకు ప్రతి నిత్యం కేంద్రాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి, ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే నివారించేందుకు చర్యలు తీసుకోవడానికి ఎంతో వీలు ఉంటుంది. సమస్యలను పరిష్కరించేందుకు సాంకేతిక బృందాలు.. వెబ్కాస్టింగ్లో ఏమైనా సమస్యలు ఉత్పన్నం అయితే పరిష్కరిచేందుకు సాంకేతిక బృందాలను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో సాంకేతిక బృందాలు అందుబాటులో ఉండి వచ్చిన టెక్నికల్ సమస్యల పరిష్కారానికి తగు సూచనలు చేస్తాయి. మే 11, 12 తేదీల్లో డ్రై రన్నిర్వహించి పోలింగ్ రోజైన మే 13వ తేదీన ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకుంటారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు కర్నూలులో 16, పాణ్యంలో 64, పత్తికొండలో 57, కోడుమూరులో 30, ఎమ్మిగనూరులో 33, మంత్రాలయంలో 25, ఆదోనిలో 49, ఆలూరులో నియోజకవర్గంలో 46 మొత్తం 320 అత్యంత సమస్మాత్మక పోలింగ్కేంద్రాలను గుర్తించారు. అలాగే కర్నూలు 7, పాణ్యంలో 3, కోడుమూరులో 2, మంత్రాలయంలో 2 మొత్తం 14 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గతంలో నమోదైన క్రైమ్ రిపోర్టు ఆధారంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీటిలో మైక్రో అబ్జర్వర్లు ఉండి ప్రతి నిత్యం పోలింగ్ కేంద్రంలో ఏమి జరుగుతుందో అబ్జర్వర్లకు నివేదిక ఇస్తుంటారు. అంతేకాక వీడియో గ్రఫీ కూడా తీయిస్తారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగిన తక్షణమే అణచి వేసి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. జిల్లాలోని 2,204 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ప్రతి కేంద్రంలో రెండు అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు -
కర్ణాటక మద్యం తరలిస్తున్న నలుగురి అరెస్ట్
ఆదోని రూరల్: మండలంలోని సాంబగల్కు చెందిన పెద్ద దస్తగిరి, రమేశ్, రాజు, దస్తగిరి అనే నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకొని అరెస్ట్ చేసినట్లు తాలూకా ఎస్ఐ ఎర్రిస్వామి మంగళవారం తెలిపారు. వీరు కర్ణాటక రాష్ట్రం నుంచి రెండు మోటార్ సైకిళ్లపై అక్రమంగా నాలుగు మద్యం బాక్సులను తరలిస్తుండగా సాంబగల్ గ్రామ శివారులో పట్టుకోవడం జరిగిందన్నారు. మద్యంతో పాటు రెండు మోటార్ సైకిళ్లను సీజ్ చేసి, సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. -
పింఛన్ కోసం వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వితంతువు ● రెండు కాళ్లు నుజ్జునుజ్జు చాగలమర్రి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నీచ రాజకీయాలకు ఇప్పటికే ఎంతో మంది పింఛన్దారులు అవస్థలు పడ్డారు. ప్రతి నెల ఠంచన్గా ఒకటో తేదీన ఇంటి వద్ద పింఛన్ అందుకోవాల్సి ఉండగా వలంటీర్ల సేవలను దూరం చేయడంతో లబ్ధిదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఓ వితంతువు పింఛన్ కోసం బ్యాంక్కు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైంది. మండలంలోని కదిరిపురం దళిత కాలనీకి చెందిన గాలిపోతుల అనందమ్మ అనే వితంతు మహిళ తన బ్యాంకు ఖాతాలో జమ చేసిన పెన్షన్ మొత్తాన్ని తీసుకోనేందుకు మంగళవారం జాన్స్న్ అనే యువకుడి బైక్పై చాగలమర్రికి బయలుదేరింది. మార్గమధ్యలో యాగంటయ్య బావి వద్ద పొలాల రస్తా నుంచి వేగంగా వస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆనందమ్మ రెండు కాళ్లు నుజ్జునుజ్జు కావడంతో తీవ్ర గాయాలయ్యాయి. జాన్సన్కు కుడి భూజానికి, అతని వెంట ఉన్న చిన్నారి మణికుమారికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం చాగలమర్రిలోని కేరళా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాలకు ఆసుపత్రికి తరలించారు. ఆనందమ్మ భర్త సంజీవరాయుడు కిడ్నీ వ్యాధితో మృతి చెందగా, కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. ఆమె కుమార్తెకు వివాహం కాగా భర్తతో విభేదాలతో పుట్టింటిలోనే ఉంటుంది. వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆనందమ్మ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆ కుటుంబంలో ఆందోళన నెలకొంది. చంద్రబాబు నీచ రాజకీయాలకు ఓ నిరుపేద కుటుంబం రోడ్డున పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకురాలు అవంతికారెడ్డి ఆసుపత్రి వద్దకు వచ్చి ఆనందమ్మను పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టరును స్వాధీనం చేసుకోని, డ్రైవర్ను అదపులోకి తీసుకోని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమణయ్య తెలిపారు. -
ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
డోన్ టౌన్ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 9 నుంచి జూన్ 10 వరకు స్వీకరిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, డోన్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్స్పాల్ ప్రసాద్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. iti.ap.gov.in అనే వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోని ప్రింట్ కాఫీని సమీప ప్రభుత్వ ఐటీఐల్లో ఈ నెల 10వ తేదీ నుంచి జూన్ 10వ తేదీలోపు ఓరిజినల్ సర్టిఫికెట్స్తో వెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. పదవ తరగతి పాస్, ఫెయిల్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
జిల్లాలో 28 మోడల్ పోలింగ్ కేంద్రాలు
కర్నూలు(సెంట్రల్): ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లాలో 28 మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.సృజన మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మహిళల నిర్వహణలో 8, యువత నిర్వహణలో రెండు, దివ్యాంగుల నిర్వహణలో మరో 2 ప్రత్యేక పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. పత్తికొండలో 5, కోడుమూరులో 4, కర్నూలులో 1, ఎమ్మిగనూరులో 3, పాణ్యంలో 4 చొప్పున వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మహిళలు, యువత, దివ్యాంగులకు ఓటుపై అవగాహన కల్పించేందుకు ఇవి ఎంతోగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రం మహిళల నిర్వహణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. యువత ఆధ్వర్యంలో నడిచే పోలింగ్ స్టేషన్లలో ఒక్క దానిని ఆదోనిలో, మరో దానిని కర్నూలులో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సమక్షంలో ఏర్పాటు చేసే ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో రెండింటిని కర్నూలు నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. యువతి ఆత్మహత్యాయత్నం ఆదోని అర్బన్: పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు చెప్పిన మాటలు నమ్మి మోసపోవడంతో మనస్తాపానికి గురై మంగళవారం ఓ యువతి ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. యువతి, బంధువులు పోలీసులకు తెలిపిన వివరాలు.. ఎమ్మిగనూరు మండలం దేవిబెట్ట గ్రామానికి చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెందిన ప్రశాంత్కుమార్ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రశాంత్కుమార్ లోబరుచుకున్నాడని యువతి తెలిపింది. అనంతపురంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆదోనికి తీసుకొచ్చాడని చెప్పింది. ఆదోనిలో కొత్త బట్టలు తీసుకుందామని తీసుకెళ్లి దృష్టిమరల్చి ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడని తెలిపింది. ఎంతసేపటికీ తిరిగిరాకపోగా ఫోన్కు నిన్ను పెళ్లి చేసుకోను అని ప్రశాంత్కుమార్ నుంచి మెసేజ్ రావడంతో మనస్తాపానికి గురై ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే స్థానికులు ఆదోని ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించండి
నంద్యాల: సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావివ్వకుండా బాధ్యతతో సమర్థవంతంగా ఎన్నికల విధులను నిర్వహించాలని స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో సాధారణ ఎన్నికల నిర్వహణపై జనరల్ అబ్జర్వర్లు పంకజ్ కుమార్, అన్నవి దినేష్ కుమార్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు, ఎన్నికల వ్యయ పరిశీలకులు మణికందన్, కిరణ్ తొట్టుపురం అశోకన్తో కలిసి స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా మాట్లాడుతూ సాధారణ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా నిర్వహించేందుకు భద్రతా పరంగా తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పించారు? వెబ్ కాస్టింగ్ ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పటి వరకు ఎంత నగదును, లిక్కర్, బంగారం సీజ్ చేశారు? బైండోవర్ కేసులు ఎన్ని నమోదు చేశారు? తదితర వివరాలను కలెక్టర్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 1,711 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, సంబంధిత పోలింగ్ కేంద్రాలలో లే అవుట్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నామన్నారు. పోలింగ్ కేంద్రాలలో వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బ్రెయిలీ ఓటర్ స్లిప్లు ఈరోజు జిల్లాకు రానున్నాయని, వాటిని కూడా వెంటనే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 1,568 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా -
శబరికి ఎదురుగాలి
సాక్షి, నంద్యాల: ఒకవైపు ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. మరోవైపు తెలుగుదేశంలో లుకలుకలు ఇప్పటికీ సద్దుమణగడం లేదు. ఎవరికి వారు యమునా తీరన్న చందంగా సాగుతున్నారు. ఎంపీ అభ్యర్థికి, ఎమ్మెల్యే అభ్యర్థులకు సమన్వయం కుదరడం లేదు. నెల రోజుల ముందు పార్టీలో చేరి, టికెట్ పొందిన బైరెడ్డి శబరిని లైట్ తీసుకుంటున్నారు. తమ నియోజకవర్గంలో ప్రచారం చేస్తే మైనారిటీ ఓట్లు ఎక్కడ దూరమవుతాయోనన్న భయంతో ఆమెను ప్రచారానికే పిలవడం లేదు. నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి మూడు ముక్కలాటను తలపిస్తోంది. మాండ్ర శివానందరెడ్డి ఒక వర్గంగా, గౌరు వెంకట్రెడ్డి మరో వర్గంగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఇంకో వర్గంగా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, మీడియాకు ఇచ్చే ప్రకటనల్లో ఎక్కడేగాని బైరెడ్డి శబరి ఫొటోను ప్రచురించడం లేదు. గిత్తా జయసూర్యతో పాటు మాండ్ర, గౌరు వెంకటరెడ్డి ఉన్న ఫొటోలను మాత్రమే ప్రచురిస్తున్నారు. ఇటీవల నందికొట్కూరులో చంద్రబాబు సభలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రచార వాహనం ఎక్కడానికి నిరాకరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాండ్ర శివానందరెడ్డి, బైరెడ్డి శబరి ఒకే వేదికను పంచుకోవాల్సి వచ్చింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి చేస్తున్న ప్రచారంలో ఎమ్మెల్యే ఓటు మాత్రమే తమకు వేయండని ప్రచారం చేస్తున్నట్లు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. మరోవైపు ఎంపీగా బరిలో ఉన్న శబరి.. ఎంపీగా తనకు ఓటు వేసి ఎమ్మెల్యేగా మీ ఇష్టం వచ్చిన వ్యక్తిగా ఓటు వేసుకోండని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నియోజకవర్గంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని టీడీపీ నాయకులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న గౌరు వెంకటరెడ్డి పూర్తిగా ముఖం చాటేసి పాణ్యంలోనే మకాం పెట్టారు. పాణ్యంలోనూ అదే పరిస్థితి... తొలుత పాణ్యం టికెట్ను బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆశించారు. కానీ, చివరి నిమిషంలో టీడీపీ టికెట్ గౌరు చరితారెడ్డికి దక్కింది. తమ టికెట్కే ఎసరు పెట్టడంతో బైరెడ్డి మీద గౌరు కుటుంబం రగిలిపోతోంది. దీనికితోడు రెండు కుటుంబాల మధ్య గతంలో ఫ్యాక్షన్ నడవడంతో పాత జ్ఞాపకాలను రెండు వర్గాలు నెమరువేసుకుంటున్నాయి. ఓ కేసు విషయంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా గౌరు వెంకటరెడ్డి సాక్ష్యం చెప్పారని టీడీపీలో ప్రచా రం జరుగుతోంది. పాత కక్షలు సమిసిపోలేదని కిందస్థాయి కేడర్ చెబుతోంది. దీంతో నియోజకవర్గంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆళ్లగడ్డలో అడుగుపెట్టని పరిస్థితి... ఎంపీ టికెట్ వచ్చిననాటి నుంచి శబరి ఆళ్లగడ్డలో అడుగుపెట్టలేదు. నామినేషన్ల సందర్భంగా నంద్యాల ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా అఖిలప్రియ భర్త మద్దూరు భార్గవ్రామ్ నాయుడు నామినేషన్ వేశారు. ఎన్నికలకు సంబంధించిన డబ్బుల విషయంలో భేదాభిప్రాయాలు రావడంతోనే భార్గవరాం నామినేషన్ వేసినట్లు ప్రచారం సాగింది. టీడీపీ పెద్దలు కల్పించుకుని ఆ వివాదాన్ని సద్దుమణిచేసి, డబ్బుల విషయమై సెటిల్మెంట్ చేసినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. దీంతో రెండు రోజుల క్రితం ఉయ్యాలవాడ గ్రామంలో ఒక పూట మాత్రమే బైరెడ్డి శబరి, అఖిల ప్రియ కలిసి ఎన్నికల ప్రచారం సాగించారు. వెంటాడుతున్న బీజేపీ భయం బైరెడ్డి శబరి రాజకీయ అరంగేట్రం భారతీయ జనతా పార్టీ నుంచి చేశారు. నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా చాలాకాలం పని చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొద్ది రోజుల ముందే ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లెలో మైనారిటీ ఓటర్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. మొన్నటి వరకు బీజేపీలో ఉంటూ బీజేపీ సిద్ధాంతాలను ప్రచారం చేసిన వ్యక్తికి తామెలా మద్దతుగా నిలుస్తామని వారు ప్రచారం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ చెబుతున్నా టీడీపీ స్పందించకపోవడంపై ముస్లింలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. శ్రీశైలం, బనగానపల్లెలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మూడు నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు లక్షా యాబై వేల వరకు ఉంటారు. వీరిలో తొంభై శాతం ఓట్లు టీడీపీ పడే అవకాశం లేదన్న చర్చ జిల్లాలో నడుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులను చూసి స్థానికంగా కొంత మంది ముస్లింలు ఓటు వేసినా, ఎంపీకి మాత్రం ఆ అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. డోన్లోనూ ఆమె ప్రచారం చెప్పుకోదగ్గస్థాయిలో జరగడం లేదు. ఫలితంగా శబరి ప్రచారం ఓటమి దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోందని రాజకీయ నిపుణులు తెలుపుతున్నారు. జిల్లాలో గ్రూపులుగా విడిపోయిన టీడీపీ శ్రేణులు నందికొట్కూరులో మాండ్రకు, బైరెడ్డికి కుదరని సయోధ్య ఆళ్లగడ్డలో అఖిలప్రియతో విభేదాల కారణంగా ప్రచారానికి దూరం పాణ్యంలో భారీగా క్రాస్ ఓటింగ్కు అవకాశం నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లెలో ముస్లిం మైనార్టీల నుంచి స్పందన కరువు ఓటమి దిశగా సాగుతున్న శబరి -
మొదటి రోజు 32.5 శాతం
నంద్యాల: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సందడి మొదలైంది. ఇప్పటికే హోమ్ ఓటింగ్ ద్వారా 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఓటేశారు. మూడు రోజుల పాటు జరిగే పోస్టల్ ఓటింగ్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సర్వీసు ఉద్యో గులు మొదటి రోజు ఓటు వేశారు. తొలి రోజు 32.5 శాతం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నమోదైంది. జిల్లాలో 17,939 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఉండగా అందులో 5,511 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న పీఓలు, ఏపీఓలు, ఓపీఓ, పాత్రికేయులు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నా రు. జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో ఎంపిక చేసిన పోలింగ్ బూత్ల్లో వీరు ఓటు వేశారు. సోమవారం ఓటు వేసిన వారిలో ఉపాధ్యాయులు, సర్వీసు ఉద్యోగులు అధికంగా ఉన్నారు. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరిగింది. జిల్లాలో పోస్టల్ ఓటింగ్ మంగళ, బుధవారాల్లో కూడా కొనసాగనుంది. అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి.. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లంరదూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు సూచించారు. సోమవారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని వైపీపీఎం హై స్కూల్, జూనియర్ కాలేజ్, బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం గిరినాథ్ సెంటర్లోని బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ సరళిని కలెక్టర్ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్రెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి ఓటరు సరళిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందన్నారు. ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జిల్లాలో 17,939 ఓటర్లలో 5,511 మంది ఓటేశారు నేడు, రేపు కూడా కొనసాగనున్న ప్రక్రియ పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ శ్రీనివాసులు -
చంద్రబాబే పెద్ద మాయలోడు!
● రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి డోన్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెద్ద మాయలోడని, టీడీపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో అంతా బూటకమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. స్థానిక వెంకటాచలం ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగిన గిరిజనుల, కుర్ని, పద్మశాలి కులస్తుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు సాధ్యం కానివన్నారు. మేనిఫెస్టో బుక్లెట్ను ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సిద్దార్థ్సింగ్ పట్టుకునేందుకు వెనుకాడటంతో ప్రజల్లో అనేక అనుమానాలను రేకెత్తిస్తుందన్నారు. చంద్రబాబు గతమంతా మోసమేనన్నారు. ఎలాగైనా గెలవాలనే ఆకాంక్షతో అమలు చేయ లేని వాగ్దానాలు ఇస్తున్నారే తప్ప, ఇందులో అమలు చేయడానికి సాధ్యం కానివే ఎక్కువ ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆర్థిక అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం.. అనాదిగా నిర్లక్ష్యానికి గురికాబడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీల అర్థిక అభ్యున్నతే లక్ష్యంగా సీఎం జగన్మోహన్రెడ్డి ఎన్నో చర్యలు చేపట్టారన్నారు. ఒక్క డోన్ నియోజకవర్గంలోనే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం నూతనంగా రెండు రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కొత్తకోట వద్ద నిర్మిస్తున్న ఐటీడీఏ ప్రాజెక్టు వల్ల యువతకు డ్రైవింగ్లో ఉపాధి లభిస్తుందన్నారు. డోన్ ఐటీఐలో సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఎంతోమందికి ఉపాధి లభిస్తుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడమంటే ఏ లోటు లేకుండా చేయడమేనని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో కుర్ని సంఘం అధ్యక్షులు బండికె హరిప్రసాద్, ఉపాధ్యక్షులు మైలా లక్ష్మీనారాయణ, కోశాధికారి రాజేంద్ర, కార్యదర్శి చాయే జగన్, సహాయ కార్యదర్శి రామచంద్రుడు, గిరిజన సమాఖ్య అధ్యక్షులు రాగుల రాముడు, గిరిజన సంఘం నాయకులు శ్రీరాములు, దొరపల్లె సర్పంచ్ సుంకన్న, పోదొడ్డి మాజీ సర్పంచ్ రంగనాయకులు, రాముడు, ఆవుల జనార్దన్, క్రిష్ణ, శ్రీనివాసులు, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, వైఎస్ఆర్సీపీ జిల్లా బీసి విభాగం అధ్యక్షులు పోసు్ట్రపసాద్, మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, వైస్చైర్మన్ జాకీర్హుసేన్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఫెసిలిటేషన్ కేంద్రాల వివరాలు నియోజకవర్గం ఫెసిలిటేషన్ కేంద్రం ఆళ్లగడ్డ వైపీపీఎం హై స్కూల్, జూనియర్ కాలేజ్, ఆళ్లగడ్డ నంద్యాల బాలికల ప్రభుత్వ జూనియర్ కాలేజ్, నంద్యాల బనగానపల్లె ప్రభుత్వ జూనియర్ కాలేజ్, బనగానపల్లె నందికొట్కూరు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్, నందికొట్కూరు డోన్ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్, పత్తికొండ శ్రీశైలం ప్రభుత్వ బాలుర హైస్కూల్, ఆత్మకూరు ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు నంద్యాల: జిల్లాలో సోమవారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.కె. శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 6,7,8 తేదీలలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఎక్కడైతే ట్రైనింగ్ నిర్వహిస్తున్నారో అక్కడే ఓటు హక్కు వినియోగించుకునేలా ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశా మన్నారు. ఎన్నికల పోలింగ్ విధులలో పాల్గొంటున్న ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు తదితర దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 17,939 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 3,372 మంది, బనగానపల్లెలో 2,858, డోన్లో 1,970, నందికొట్కూరులో 2,224, నంద్యాలలో 4,800, శ్రీశైలంలో 2,715 మంది ఎన్నికల విధులు, అత్యవసర సేవలకు సంబంధించిన శాఖల ఉద్యోగులు ఉన్నారన్నారు. హోం ఓటింగ్ సంబంధించి 85 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో సంబంధిత వ్యక్తులు శనివారం నిర్వహించిన హోమ్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న విషయం రాజకీయ పార్టీలు గమనించాలన్నారు. అత్యవసర సేవలు, ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది ఎక్కడైతే పని చేస్తూ ఫామ్– 12ఈ ఇచ్చిన రిటర్నింగ్ అధికారి ప్రాంతంలోనే పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. పాణ్యం, గడివేముల మండలాలకు సంబంధించి అక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మొదట ఎక్కడ శిక్షణ పొందారో ఆయా ప్రాంతాల్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. -
ప్రతి నోటా.. ఊరూరా ఇదే మాట
● ఐదేళ్లలో తలుపుతట్టిన సంక్షేమ పథకాలు ● సచివాలయం, విలేజ్ క్లీనిక్, రైతు భరోసా కేంద్రాలతో మారిన రూపురేఖలు ● వలంటీర్ల సేవలతో సరికొత్త చరిత్ర ● లంచాలతో పనిలేదు, ఆఫీసుల మెట్లు ఎక్కే పనిలేదు ● కర్నూలు నుంచి బేతంచెర్ల మధ్య ‘సాక్షి’ రోడ్ షోఉదయం 6.30 గంటలు. కర్నూలు నగరంలోని సెంట్రల్ ప్లాజా నుంచి నంద్యాల రోడ్డుకు వెళ్తుంటే కార్పొరేషన్ పరిధిలో కేసీ కెనాల్ పక్కనే ఏర్పాటు చేసిన హాకర్స్ జోన్ వద్ద వీధి వ్యాపారుల కోలాహలం కనిపించింది. ఏమ్మా.. వ్యాపారం ఎలాగుందని చౌడమ్మ అనే మహిళను ప్రశ్నించగా ఎంతో సంతోషంగా చాలా బాగుంది సార్ అని చెప్పింది. గతంలో తోపుడుబండ్ల మీద వ్యాపారం చేసుకుంటూ, ఎండకు ఎండుతూ వానకు నానుతూ చానా కష్టాలు పడ్డామంది. ఇప్పుడు యా బాధ లేదు. హాయిగా నీడ పట్టున వ్యాపారం చేసుకుంటున్నామంది. ప్రభుత్వం నుంచి ఏమైనా మేలు జరిగిందా? అని ప్రశ్నిస్తే.. పిల్లలకు అమ్మ ఒడి, తల్లికి పింఛను, తనకు ఇంటి స్థలం ఇచ్చారని తెలిపింది. పక్కనున్న వ్యాపారులదీ ఇదే మాట. ఎక్కడికీ పోయే పని లేకుండా అన్ని పథకాలు ఇంటి వద్దకే వస్తున్నాయని సంబరపడ్డారు. అక్కడి నుంచి తాండ్రపాడు మీదుగా నేషనల్ హైవే చేరుకున్నాం. ‘ఆరులైన్ల సూరత్ హైవే’ పనులు దాదాపు పూర్తయ్యాయి. అలా.. నన్నూరు మీదుగా ఓర్వకల్లు ఎయిర్పోర్డు చేరుకున్నాం. టీడీపీ ప్రభుత్వం రూ.38కోట్లు ఖర్చు చేసి హడావుడిగా ప్రారంభోత్సవం చేసినా, ఒక్క విమాన సర్వీసు నడపలేకపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.240 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తిం చేసింది. ప్రస్తుతం వైజాగ్, చైన్నె, బెంగళూరుకు సర్వీసులు నడుస్తున్నాయి. అక్కడి నుండి ముందుకెళ్తే 90శాతం పూర్తయి చివరి దశలో ఉన్న జయరాజ్ ఇస్పాత్ స్టీల్ప్లాంటు కన్పించింది. ఈ ప్రాంతంలో 10,900 ఎకరాలను ప్రభుత్వం మెగా ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేస్తోంది. సిగాచీ, ఆర్పీఎస్ లాంటి పరిశ్రమలు రాబోతున్నాయి. మారుతి–సుజుకికి కూడా ఫార్మా కంపెనీకి దరఖాస్తు చేసుకుంది. అక్కడి నుండి హుస్సేనాపురం చేరుకున్నాం. పాణ్యం నియోజకవర్గం. ఊళ్లోకి వెళ్లగానే రచ్చకట్టపైన కొందరు పడుకుని సేద తీరుతున్నారు. అందరూ రైతులే. ఏమన్నా! ఎన్నికల పరిస్థితి ఇలా ఉందని మాట కలిపాం. నిజం చెప్పాలంటే ఈ ప్రభుత్వంల ఎవరికీ ఎలాంటి కష్టం లేదు. ఎన్ని పథకాలు వస్తున్నాయో కూడా చెప్పలేం. వలంటీర్లు వస్తున్నారు, వేలిముద్రలు వేయించుకుంటున్నారు.. డబ్బులు అకౌంట్లలో పడుతున్నాయి. ఎవ్వరికీ లంచం ఇచ్చే పనిలేదు, యాడికీ పోయే పనిలేకుండా అన్ని పథకాలు ఇంటికే వస్తున్నాయి.. ఇంతకంటే ఏం కావాల..’ అని వెంకటేశ్వర్లు చెప్పారు. ఆయనే మళ్లీ కల్పించుకొని ఊర్లనే సచివాలయం, ఆర్బీకే, ఆస్పత్రి ఏర్పాటు చేసినారని.. శానా మంచి జరిగిందన్నారు. అక్కడి నుండి ఊళ్లోకి వెళ్లాం. రామలక్ష్మి అనే పెద్దావిడను పలకరించాం. ఏం పెద్దమ్మా.. రాజకీయం ఎలా ఉందని అడిగితే ‘మంచి సేసినోడికే అండగా ఉండాలయ్యా. లేదంటే పాపం!’ అని సెప్పింది. ఆమె ఇంటి ఎదురుగా తోపుడు బండిపై బట్టలు ఐరన్ చేస్తున్న నాగలక్ష్మిని పలకరించాం. ఆమెదీ అదే మాట. అలాగే ముందుకెళ్లాం.. మద్దమ్మ అనే ముసలావిడతో మాట్లాడితే.. గతంలో పించిని కోసం వెళ్లి శానా అవస్థలు పడేటోళ్లమంది. కూడు నీళ్లు లేకుండా ఆఫీసు కాడా ఉండాల్సి వచ్చేదంది. ఇప్పుడు నిద్ర మంచానే వచ్చి అవ్వా ఇదిగే నీ పించిను డబ్బులంటూ వలంటీర్లు చేతిలో పెడుతున్నారు. మాలెక్క ముసిలోళ్లకు శానా మంచి సేసినాడు నాయనా అంది. అక్కడి నుంచి తిరిగి హైవేకు వచ్చి సోమయాజులపల్లెకు పోయినాం. రాములమ్మ అనే వృద్ధురాలిని పలకరించాం. ‘భర్త చనిపోయాడు. పింఛన్ వస్తోంది. చేయూత వస్తోంది. ఈ డబ్బులతోనే అద్దె ఇంట్లో బతుకుతున్నా. ఇదీ లేకపోతే నా పరిస్థితి ఏంటయ్యా! ఆ మహానుభావుడి సలవే! అంది. పాలనపై స్పష్టత అక్కడి నుండి వెంకటాపురం వెళ్లాం. ఎండకు చెట్టుకింద అరుగుపై పది మందికి పైగా పడుకున్యారు. మేం వెళ్లగానే అంతా లేచి కూర్చన్యారు. వారితో కాసేపు మాట్లాడాం. రేపు ఒకటో తారీఖు.. పింఛన్ రావాల. ఇంతకు ముందు ఇంటికి తెచ్చిస్తుండ్రి. ఇప్పుడు ఆ నిమ్మగడ్డ రమేశ్, చంద్రబాబు చేసిన పనికి అకౌంట్లలో వేస్తారంట అని వెంకటేశ్వర్లు అనే రైతు బండిపై కూర్చుని వ్యంగంగా అన్యాడు. దీంతో రోజువారీ మార్పులతో పాటు పాలన, విధానపరమైన నిర్ణయాలపై పల్లె ప్రజలకు ఎంత స్పష్టమైన అవగాహన ఉందో స్పష్టమైంది. ఇంతలోనే వెంకట్రాముడు అనే మరో రైతు మాట్లాడుతూ మా ఊరంతా మంచిగా ఉంటామయ్యా! ఓట్లు వచ్చినప్పుడు ఎవరికి నచ్చినట్లు వాళ్లు వేసుకుంటారు. మాకు ఎవరు మంచి చేసింటే వాళ్లకే ఓటు వేస్తాం అన్యారు. నంద్యాల జిల్లా ప్రజల మాట ఇదే.. అక్కడి నుండి నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం బేతంచెర్ల మండలం గోరుమానుకొండ చేరుకున్నాం. అక్కడ విశ్వేశ్వరి, నాగమ్మ అనే ఇద్దరు మహిళలతో మాట్లాడాం. ఇద్దరి బిడ్డలకు అమ్మఒడి వస్తోంది. డ్వాక్రా రుణాలు సున్నా వడ్డీతోనే తీసుకుంటున్నారు. అనారోగ్యం వస్తే పక్కనే ఉన్న ఆస్పత్రికి వెళుతూ సంతోషంగా ఉన్నాం. బడి, సచివాలయం, ఆర్బీకే, ఆస్పత్రి ఒక్కమాటలో చెప్పాలంటే మా ఊరు మారింది.’ అని సంబరపడ్డారు. అక్కడి నుండి బేతంచెర్లకు బయలుదేరాం. దారిలో యూరోపియన్ మోడల్ భవనాలు కన్పించాయి. మహాత్మజ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూలు, కాలేజీ. విదేశాల్లో ఉన్నట్లు అన్పించింది. రూ.36కోట్లతో నిర్మిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇక్కడ తరగుతులు మొదలవుతాయి. అక్కడి నుంచి కాస్త ముందుకుపోతే మరో యూరోపియన్ మోడల్ నిర్మాణాలు. రూ.8కోట్లతో ఓ ఐటీఐ కాలేజీ, పక్కనే రూ.4కోట్లతో ఎంఎస్ఎంఈ శిక్షణ కేంద్రం. బహుశా రాష్ట్రంలో ఇలాంటి అద్భుత కట్టడాలు ఎక్కడ లేవు అన్పించింది. -
No Headline
పిన్నాపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్కో ప్రాజెక్టుఏ ఇంటికి వెళ్లినా.. ఏ ఊరులో అడుగుపెట్టినా.. సంక్షేమం స్వాగతిస్తోంది. లంచాలు ఇచ్చే పనిలేదు, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం అంతకన్నా లేదు.. అర్హులైతే చాలు ప్రభుత్వ పథకాలు తలుపుతడుతున్నాయి.. నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి చేరుతోంది. ఇల్లు లేదనే బాధ లేదు.. పొలం ఎండిందనే బెంగ లేదు.. ఊళ్లకు ఊళ్లు పుట్టుకొస్తున్నాయి. వ్యవసాయం పండుగ అవుతోంది. పిల్లల చదువుకు భరోసా లభిస్తోంది.. ఆరోగ్యం చేరువైంది. ఉద్యోగాల విప్లవం వచ్చింది.. ఉపాధి కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇలా ఒక్కటేమిటి, అన్ని వర్గాల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాటలు వేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు నమ్మకానికి ప్రతిరూపంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రజల నాడి తెలుసుకునేందుకు నిర్వహించిన రోడ్షో ఆద్యంతం సంక్షేమ బావుటా రెపరెపలాడింది.నిరుద్యోగ సమస్య తీరినట్లే కాల్వబుగ్గ మీదుగా పిన్నాపురం వెళ్లాం. కొండల మధ్యలో అద్భుతంగా ‘గ్రీన్కో’ నిర్మిస్తోన్న పవర్ప్లాంటు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు. రూ.15వేల కోట్లతో నిర్మిస్తున్నారు. సీఎం వచ్చి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర చరిత్రలో ఇదే భారీపెట్టుబడి పరిశ్రమ. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల ఉద్యోగాలు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీరనుంది.14 రకాల వైద్య పరీక్షలు గోరుమానుకొండ ఆసుపత్రికి చేరుకున్నాం. పుష్పరాణి అనే సీహెచ్ఓ ఉన్నారు. ఓ వృద్ధురాలు ఆస్పత్రికి వస్తే పరీక్షిస్తున్నారు. అక్కడే 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు ఇస్తున్నారు. మరీ అవసరమైతే పెద్ద డాక్టర్లకు ఫోన్ చేసి రోగి పరిస్థితి వివరించి మందులు ఇస్తున్నారు. రోగం వస్తే ఊరు దాటే పనేలేదని గ్రామస్తులు తెలిపారు. -
వైభవంగా వసంతోత్సవాలు
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలం క్షేత్రంలో అహోబిల లక్ష్మీనరసింహ స్వామి వసంతోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. చైత్ర కృష్ణఏకాదశి నుంచి మూడు రోజులపాటు స్వామికి వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా రెండో రోజు ఆదివారం ఉదయం దిగువ అహోబిలంలో వసంత మంటపంలో ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని కొలువుంచి తిరుమంజనం, అర్చన, నవకళశ పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో స్వామి, అమ్మవారిని కొలువుంచి మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ప్రశాంతంగా ‘నీట్’ కర్నూలు సిటీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఎన్టీఏ ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఏ నిబంధనలను అనుసరిస్తూ విద్యార్థులను గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. ఇండస్, ఏ క్యాంపులోని మాంటిస్సోరి ఇంగ్లిషు మీడియం హైస్కూల్, మదర్ థెరిస్సా ఫార్మసీ కాలేజీ, కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీ, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజీ, శ్రీలక్ష్మీ స్కూల్ (సంసిద్ధ్), అథెనా స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష జరిగింది. మొత్తం 4,944 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు పేర్లు రిజిస్టర్ చేసుకోగా.. 4,838 మంది హాజరయ్యారు. 106 మంది గైర్హాజరయ్యారు. ఎన్టీఏ నిబంధనల మేరకు క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. సెగలు..భగభగలు ● ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు కర్నూలు(అగ్రికల్చర్)/మహానంది: ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది వరకు 46 డిగ్రీల వరకే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది గరిష్టంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. గతేడాది కర్నూలులో గరిష్టంగా 43 నుంచి 44 డిగ్రీల వరకే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సారి 45.9 డిగ్రీలకు చేరింది. ఉదయం పూట గాలిలో తేమ 60 నుంచి 70 శాతం, మధ్యాహ్నం 30 నుంచి 40 శాతం ఉండాలి. గాలిలో తేమ శాతం కనిష్టస్థాయికి పడిపోవడంతో వేడిగాలుల తీవ్రత పెరిగింది. ఆదివారం నంద్యాలలో 45.8, సంజామలలో 45.4, కోవెలకుంట్లలో 44.7, బేతంచెర్లలో 44.5, ఎమ్మిగనూరులో 44.6,సి.బెళగల్లో 45.3, కల్లూరులో 44.8, కోసిగిలో 44.6, గూడూరులో 43.2, హొళగుందలో 43.7,కౌతాళంలో 44, మంత్రాలయంలో 41.4, పెద్దకడుబూరులో 43.2, బనగానపల్లెలో 43, డోన్లో 44.2, మహానందిలో 43.7, పాణ్యంలో 41.8, రుద్రవరంలో 41.3 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఇంట్లోనే ఓటేశారు
● జిల్లా వ్యాప్తంగా 504 మంది ఓటు హక్కు వినియోగంనంద్యాల: సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ నమోదు కావాలనే లక్ష్యంతో పోలింగ్ కేంద్రాలకు రాలేని వారు సైతం ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ హోమ్ ఓటింగ్ను ప్రవేశ పెట్టింది. 2024 ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జిల్లాలో 312 మంది 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు, 591 మంది విభిన్న ప్రతిభావంతులు మొత్తం 904 మంది హోం ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. శనివారం, ఆదివారాల్లో జరిగిన హోం ఓటింగ్లో వృద్ధులు 164 మంది, విభిన్న ప్రతిభావంతులు 340 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు హోం ఓటరు వద్దకు వెళ్లి పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల మధ్య వారి ఓటు వినియోగించుకున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు హోం ఓటింగ్ కొనసాగనుంది. ఇల్లే పోలింగ్ కేంద్రం... డోన్ టౌన్/బనగానపల్లె రూరల్: వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు ఓటు హక్కు వినియోగం కోసం ఇంటినే పోలింగ్ కేంద్రంగా మార్చేశారు. రహస్య ఓటింగ్ ప్రక్రియ దెబ్బతినండా, నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. డోన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మహేశ్వరరెడ్డి ఆదివారం ఉదయం డోన్ పట్టణంలో హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఇళ్లకు నోడల్ అధికారి శ్రీనివాసులు, సెక్టోరల్ అధికారి అబ్దుల్ షఫితో పాటు ప్రైసెడింగ్ అధికారులు, అసెంబ్లీ స్థాయిలో మాస్టర్ ట్రైనర్స్, మైక్రో అబ్జర్వర్స్ ఓపీఓలు, వీఆర్వోలు, బూత్ లెవల్ సిబ్బంది పాల్గొన్నారు. బనగానపల్లె నియోజవర్గంలో మొత్తం 158 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 65 మంది తమ ఓటు హక్కును ఇంటి వద్దనే వినియోగించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కామేశ్వరరావు తెలిపారు. నియోజకవర్గం హోమ్ ఓటేసిన వారు వృద్ధులు దివ్యాంగులు, రోగులు ఆళ్లగడ్డ 28 153 శ్రీశైలం 15 10 నందికొట్కూరు 57 69 నంద్యాల 19 22 బనగానపల్లె 24 41 డోన్ 21 45 మొత్తం 164 340 -
5 నిముషాల్లో పనయింది
నేను బ్యాంకులో పాసుబుక్కులు పెట్టి క్రాప్లోను తెచ్చుకున్నా! రెన్యువల్ చేసేందుకు వెళ్తే నా ఐదెకరాల్లో 2.5 ఎకరాలు నా పేరుతో లేదన్నారు. తీరా చూస్తే భర్త చనిపోతే ఓ మహిళ తన పేరుతో భూమి మార్చుకునేటప్పుడు నా భూమి ఆమె పేరున మారిపోయింది. నేను సచివాలయానికి వెళ్లా. అర్ధగంటలో వాళ్లు చూసి ప్రింట్ తీసిచ్చి ఓర్వకల్కు పంపినారు. అక్కడ 5 నిమిషాల్లో నా పని అయిపోయింది. ఇట్లాంటి సమస్య గత ప్రభుత్వంలో వచ్చింటే ఎన్ని నెలలు తిరగాల్సి వచ్చో. – వెంకటేశ్వర్లు, హుసేనాపురం ఇంత మంచి సేసినోన్ని యాడా సూడల్యా నాకు 10 ఎకరాలుంది. రైతుభరోసా, చేయూత, మా కొడుకు పిల్లోళ్లకు అమ్మ ఒడి వచ్చాంది. ఇంగో విషయం. నాకు కాలు దెబ్బతింటే ఇంతకు ముందు కర్నూలు గౌరీగోపాల్ ఆస్పత్రికి వెళ్లా. రూ.1.50లక్షలు అయింది. బాక్కాలేదు. తర్వాత నేను కర్నూలు పెద్దాస్పత్రికి వెళ్లి పదిరోజులుంటి. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ సేసినారు. రూ.2,850 నా డబ్బులతో బయట మందులు తెస్తే అది కూడా ఇచ్చినారు. ఇంటికి వస్తే నేను ఇంటి వద్దే ఉన్నానని ఆరోగ్య ఆసరా ద్వారా రూ.30వేలు ఇచ్చినారు. ఇంత మంచి చేసినోన్ని, పెభుత్వాన్ని నా జీవితంలో సూడల్యా. – అబ్దుల్ రసూల్, హుసేనాపురం -
నగర పంచాయతీ ‘మార్పు’
బేతంచెర్లకు రాగానే ఫోర్లైన్ దారి. పంచాయతీగా ఉన్నది ఈ ప్రభుత్వంలో నగరపంచాయతీకి ప్రమోట్ అయింది. అందుకే ఈ మార్పు. కొత్తగా బస్టాండ్, 11 పడకల ఆస్పత్రిని 30పడకలుగా అప్గ్రేడ్ చేశారు. రూ.2.29కోట్లతో ఆపరేషన్ థియేటర్తో పాటు ఆస్పత్రిని ఆధునికీకరించారు. రోగులకు మంచి వైద్యసేవలు అందుతున్నాయి. ప్రతీ వీధిలో సిమెంట్రోడ్లు నిర్మించారు. సంతమార్కెట్, మార్కెట్యార్డు, రైతుబజార్, పార్కులు అన్నీ అద్భుతంగా నిర్మించారు. రాష్ట్రంలోని మోడల్ నియోజకవర్గంగా డోన్ నిలిచింది. అందులో భాగంగానే అభివృద్ధి కన్పించింది. ఊళ్లోకి వెళ్లి విజయకుమారి అనే మహిళతో మాట్లాడాం. 30 ఏళ్లుగా తాగునీటి సమస్య ఉంది. మంత్రి బుగ్గన గోరుకల్లు నుంచి నీటిని తీసుకొచ్చి సమస్య తీర్చినారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేదని ఆమె ఎంతో సంతోషపడింది. ఇలా ఒక ఇల్లు, పల్లె కాదు.. కర్నూలు నుంచి పిన్నాపురం, అక్కడి నుంచి బేతంచెర్ల 70 కిలోమీటర్లలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ పనితీరుపై స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ‘కొట్టినోన్ని.. పెట్టినోన్ని మర్సిపోం’ అంటున్నారు. డోన్ నియోజకవర్గం బేతంచర్ల సమీపంలోని ఐటీఐ కాలేజ్ -
ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంపైనే అందరి దృష్టి. టీడీపీ నుంచి ఓ ‘బిజినెస్’మ్యాన్, వైఎస్సార్సీపీ తరపున ఓ ఉన్నత విద్యావంతుడు పోటీలో ఉన్నారు. తండ్రి పేరు, ఇంటి పేరు మినహా మరో అర్హత టీడీపీ అభ్యర్థికి లేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థి సాధారణ కుటుంబం నుంచి వచ్చి పెద్ద చదువు, ఉద్యోగం చేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. పేదరికం విలువ తెలిసినోడు. పైగా తాను పోటీ చేసే సామాజికవర్గం మొత్తం తమ అభ్యర్థిని కచ్చితంగా గెలిపించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇదే ఇప్పుడు ప్రత్యర్థిపార్టీ అభ్యర్థిలో గుబులు రేపుతోంది. ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు 1.15లక్షలు. నియోజకవర్గంలో గెలుపోటములను నిర్దేశించే ఓటర్లు వీరే. అయితే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో ఈ ఓట్లు తమకు రావనే భావనలో టీడీపీ అభ్యర్థి ఉన్నారు. అందుకే తన నామినేషన్ నుంచి ప్రచారం దాకా ఎక్కడా కాషాయ జెండా కనిపించలేదు. కషాయ జెండా, కమలం గుర్తు కనిపిస్తే బీజేపీ ఓట్లు దూరమవుతాయనేది ఈ అభ్యర్థి భావన. అయితే తన తండ్రి ఏకంగా బీజేపీలోనే ఉన్నారనే విషయాన్ని ఆయన మర్చిపోయాడు. ఇదే సమయంలో మైనార్టీ ఓటర్లకు మాత్రం ఈ దఫా ఎవరికి ఓటు వేయాలనే విషయంలో ఓ స్పష్టత ఉంది. ఇది గ్రహించిన టీడీపీ అభ్యర్థి తండ్రి రంగంలోకి దిగి ప్రలోభాలకు తెరలేపాడు. ఒకరిది జన బలం.. మరొకరిది ధన బలం వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రజల మద్దతుతో గెలవాలనే భావనలో ప్రచారం చేస్తుంటే, టీడీపీ అభ్యర్థి తండ్రి మాత్రం డబ్బుతోనే రాజకీయం చేస్తున్నాడు. ఓ టీంను నియమించుకుని, వారికి జీతాలు ఇస్తూ 50 ఓట్లు ప్రభావితం చేసే వ్యక్తుల నుంచి పారీ్టలతో సంబంధం లేకుండా ఓ జాబితా సిద్ధం చేయించారు. వీరందరికీ ఫోన్లు చేసి స్వయంగా పిలిపించుకుని డబ్బులిస్తూ, తన కుమారుడికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు. ప్రత్యర్థి పార్టీల నుంచి అనుకూలత లేకపోవడంతో తాను 2014, తన కుమారుడు 2019లో ఓడిపోయామని.. ఈ దఫా తన కుమారుడు ఓడిపోతే రాజకీయల నుంచి పూర్తిగా దూరం కావడంతో పాటు నియోజకవర్గాన్ని వదిలేసి హైదరాబాద్కు వెళ్లి రాజకీయాలు చేసుకుంటారని చెబుతున్నారు. ఓడిపోతే హైదరాబాద్కు వెళ్లి రాజకీయాలు చేసేవాడు, గెలిచినా అదే చేస్తాడు. అలాంటి వ్యక్తి రాజకీయాలకు ఏం పనికొస్తారని ప్రత్యర్థిపారీ్టల నేతలు గట్టిగానే బదులిస్తున్నారు. ఇలాంటి వారికి మాకు సాయం చేయకపోయినా ఫర్వాలేదు. వైఎస్సార్సీపీ కోసం తిరగకుండా ఇంట్లో మౌనంగా కూర్చుంటే సరిపోతుందని సెలవిస్తున్నారు. ఒకరిద్దరు డివిజన్స్థాయి నేతలు ఆయన ప్రలోభాలకు లొంగడం మినహా తక్కిన వారంతా ధిక్కారస్వరం వినిపించడం గమనార్హం. ఓటుకు రూ.2వేల చొప్పున రూ.50కోట్లు పంచేందుకు సిద్ధం పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. ఈ లోపు ఓటుకు రూ.2వేల చొప్పున 2.50లక్షల ఓట్లకు రూ.50కోట్లు పంచేందుకు నగదు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల ఇళ్లతో పాటు తన వ్యాపార సముదాయాల్లో నగదు నిల్వలను ఉంచినట్లు సమాచారం. ప్రతీ ఎన్నికల్లో కేవలం 50శాతం మాత్రమే ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది. ఇందులో మైనార్టీ ఓట్లు అధికంగా పోలవుతాయి. ఆ తర్వాతి స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లు. ఈ వర్గాలన్నీ వైఎస్సార్సీపీకి అనుకూలమనే భావనలో టీడీపీ అభ్యర్థి ఉన్నారు. దీంతో వీరికి అవసరమైతే మరికొంత ఎక్కువ ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే కూటమి నేతలకు భారీగా ఖర్చు పెట్టారు. ఈ ఎన్నికల్లో రూ.80 కోట్ల నుంచి రూ.100కోట్లు ఖర్చు పెట్టేందుకు ఈ నేత సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఖర్చు విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య తగువు నియోజకవర్గంలో ఓ సామాజికవర్గం ఓట్లు ఎన్ని, ఏ పారీ్టకి ఎవరు అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉందని లెక్కలు వేశారు. దీంతో మైనారీ్ట, ఎస్సీ ఓట్లు గెలుపును నిర్దేశించే స్థాయిలో ఉన్నాయి. ఎస్టీ, బీసీలు కూడా వైఎస్సార్సీపీ వైపు అధికంగా ఉన్నట్లు వారి లెక్కలో తేలింది. పోలింగ్కు కూడా వీరే ఎక్కువగా వస్తారు. దీంతో తక్కిన వర్గాల ఓట్లు తక్కువగా పోలయ్యే అవకాశం ఉందని అంచనా వేసి లెక్కలు వేస్తే తమకు పరాభావం తప్పదని తేలింది. అలాంటప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరం లేదని అభ్యర్థి తండ్రితో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ‘గత రెండు ఎన్నికల్లో మనం ఓడిపోయాం. ఈ దఫా ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో మనకు సీటు కూడా ఇవ్వరు. కచ్చితంగా గెలవాలి. డబ్బులు చూడకూడదు’ అని తండ్రి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీతో పొత్తు వల్లనే ఇదంతా జరగుతోందని, పొత్తు పెట్టుకున్నందుకు చంద్రబాబును కూడా నిషూ్టరమాడుతున్నట్లు చర్చ జరుగుతోంది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పిచ్ స్వరూపం మారిందా.. ఆ ఇద్దరూ మార్చేశారా.. మరీ ఈ రేంజ్లో విధ్వంసమా..?
Song: సెట్టయ్యిందే.. నీ వల్లే లైఫ్ సెట్టయ్యిందే..
కేవలం 30 శాతమే ఛాన్స్ అన్నారు: సోనాలి బింద్రే
పెదవుల నిగారింపుకై.. ఇలా చేస్తే చాలు..!
మనకేదయినా.. ప్రాబ్లం ఉంటుందంటారా!
అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తున్న డ్రాగన్ దేశం
పొరపాటున బాబుకు ఓటేస్తే..జరిగేది ఇదే..
భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
కర్నూలులో కదం తొక్కిన జగనన్న జనాభిమానం (ఫొటోలు)
హీరోయిన్తో బ్రేకప్! మరో బ్యూటీతో హీరో పార్టీ!
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement