-
వైఎస్ జగన్ హయాంలో..
రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందనే మాటను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిజం చేసింది. ఉన్న గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సకల సేవలు అందించింది. సేద్యం సజావుగా సాగేందుకు ఏటా మూడు విడతల్లో రైతు భరోసాతో తోడ్పాటు అందించింది. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు, నాణ్యమైన విత్తనాలను ఇంటి వద్దకే అందజేసింది. ఏ పంటకు ఏ తెగులు సోకిందో అక్కడి సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన సూచనలు, సలహాలు అందించేలా చేసింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా అందించి ఆదుకుంది. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించింది. -
ఎన్నికల నిర్వహణపై శిక్షణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజిర్ జిలానీ సమూన్ అన్నారు. ఆయ న బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈవీఎమ్స్ హేండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రిసెప్షన్ సెంటర్ శివాని కాలేజీలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 17 అంశాలతో కూడిన ఫార్మేట్ ఉంటుందన్నారు. పోలింగ్ మెటీరియల్ పూర్తిస్థాయిలో తీసుకున్న ది చెక్ లిస్ట్ ద్వారా పరిశీలించుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్ మాట్లాడుతూ సెక్టోరియల్ అధికారులు పోలింగ్ రోజున అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి న రిపోర్టులను ఎన్నికల కంట్రోల్ రూమ్కు ని యమావళి ప్రకారం అందజేయాలని సూచించా రు. ఏదైనా పోలింగ్ కేంద్రంలో సమస్యలు ఉంటే తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు. పో లింగ్ కేంద్రంలో ఈవీఎంలలో సమస్య ఉత్పన్నమైతే సెక్టోరియల్ అధికారులు తమ వద్దనున్న రిజర్వ్ పరికరాలతో భర్తీ చేయాలని తెలిపారు. -
No Headline
నాటి దుస్థితి ఈ ఫొటో చూడండి. టీడీపీ హయాంలో విత్తనాల కోసం జి.సిగడాం మండలం పాలఖండ్యాంలో రైతులు క్యూలో నిలబడ్డ పరిస్థితి. కిలోమీటర్ల మేర విత్తనాల కోసం పడిగాపులు పడిన దృశ్యమిది. ● నాడు రైతులను నిలువునా ముంచిన చంద్రబాబు ● వ్యవసాయం దండగ అంటూ చులకన చేసిన టీడీపీ ● నేడు అన్నదాతకు అండగా వైఎస్ జగన్ ● రైతు భరోసాతో చేయూత ● రైతుల వద్దకే విత్తనాలు, ఎరువులు ● సకాలంలో పంట కొనుగోలు, చెల్లింపులుమూడు రోజులు లైను కడితే గానీ అందని ఎరువులు. ఆలి పుస్తెలు తాకట్టు పెడితే గానీ దొరకని విత్తనాలు. వ్యవసాయం దండగ అంటూ బాబు గారి వ్యాఖ్యానాలు. పంట అమ్మాలంటే దళారులే దిక్కు. పంటపై ప్రైవేటు వ్యాపారులదే హక్కు. అన్నదాతకు ఎవరు అండగా నిలిచారో ఈ ఐదేళ్ల కాలమే చెబుతుంది. ఐదేళ్లలో జిల్లాలో ఎక్కడా విత్తనాలు కోసం ఎవరూ లైను కట్టలేదు. ఎరువు కోసం క్యూలో నిలబడలేదు. పంట విక్రయానికి దళారులను వెతుక్కోలేదు. ఇదే టీడీపీకి వైఎస్సార్ సీపీ పాలనకు ఉన్న తేడా. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : తన పద్నాలుగేళ్ల పాలనలో అన్నదాతలను చంద్రబాబు హీనంగా చూస్తే.. ఐదేళ్ల పాలనాకాలంలో సీఎం వైఎస్ జగన్ రైతును రాజును చేయడానికి ప్రయత్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రైతులకు అన్ని విధాలుగా గుండెకోత కోశారు. ఒక్క బస్తా విత్తనాల కోసం రోజుల తరబడి, కిలోమీటర్ల మేర బారులు తీరిన దుస్థితి ఎదురయ్యేది. అప్పులు చేసి బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి ఉండేది. అంతేనా.. చంద్రబాబుకు, కరువుకు అవినాభావం సంబంధం ఉండేది. 2015–16లో 18 కరువు మండలాలు, 2016–17లో 11, 2017–18లో 9కరువు మండలాలు అధికారికంగా ప్రకటించారంటే అప్పట్లో కరువు ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అన్నదాతలపై బాబు చిన్నచూపు తనకు తాను విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు అన్నం పెట్టే రైతులంటే ఎప్పుడూ చులకనే. ఇంకా చెప్పాలంటే హీనంగా చూసేవారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోగా ధాన్యం తరలించినందుకు గాను రవాణా చార్జీలు సైతం ఏ ఒక్క రైతులకు చెల్లించలేదు. జిల్లాలో ప్రధాన సాగునీటి వనరులైన తోటపల్లి, నారాయణపురం, మడ్డువలస ప్రాజెక్టులను గాలికొదిలేసింది. నీటి పారుదల శాఖ అధికారులు నీరు–చెట్టు పనుల మీద చూపించే శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టుల మీద చూపించకపోవడంతోపాటు ఉన్న కాలువల్లో పూడికలు తీయకపోవడంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పలేదు. నా డు. .నే డు. .రైతుల కోసమే గ్రామానికో రైతు భరోసా కేంద్రం.. అన్నదాత మేలు కోసం భూసార పరీక్ష కేంద్రాలు.. కర్షకుడికి సాయంగా రైతు భరోసా పథకం. పంట పండితే మద్దతు ధర.. నష్టపోతే బీమా.. దళారుల బెడద లేకుండా ప్రభుత్వ అధికారులే పొలం వద్దకు వెళ్లి పంట కొనేలా చర్యలు. -
ఘనంగా రెడ్క్రాస్ దినోత్సవం
శ్రీకాకుళం కల్చరల్: రెడ్క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో బుధవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హ్యూమన్ రైట్స్ జనరల్ సెక్రటరీ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ మానవ జన్మ, సేవ చేయడానికేనని అన్నారు. రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ తాము చేస్తున్న సేవలకు ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ మాట్లాడుతూ నిత్యం సేవలందిస్తోంది రెడ్క్రాస్ మాత్రమేనని అన్నారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంకు ఆవరణలో రక్తదాన శిబిరానికి స్వచ్ఛందంగా 10మంది యువత వచ్చి రక్తదానం చేశారు. అలాగే తలసేమియా పేషెంట్లకు పౌష్టికాహార కిట్లను, డ్రైఫ్రూట్స్ కిట్లను సుమారు 50మందికి అందించారు. తలసేమియాతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు ఉచితంగా రక్తనిల్వలను అందించా రు. ఆడవారికి సంబందించి ప్రత్యేక కిట్లు, రిమ్స్ ప్ర భుత్వ వైద్యశాలలో రోగుల కుటుంబ సభ్యులు సు మారు ఆరు వందల మందికి టోపీలు, ఆహార పొ ట్లాలు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ అభ్యర్థన మేరకు పాడేరు రెడ్క్రాస్ బ్లడ్ కేంద్రానికి 20 యూనిట్ల రక్తాన్ని అందించారు. కార్యక్రమంలొ రిటైర్డ్ జేసీ–2 పి.రజనీకాంతరావు, ట్రెజరర్ కె.దుర్గా శ్రీనివాస్, సెక్రటరీ బి.మల్లేశ్వరరావు, పి.శ్రీకాంత్, ఆడిటర్ వి.ఎం.రావు, ఎం.సోమసుందరరావు, బి.సతీష్, వలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు. -
కారులో నగదు పట్టివేత
శ్రీకాకుళం క్రైమ్ : ఎన్నికల నేపథ్యంలో చేపడుతున్న తనిఖీల్లో భాగంగా బుధవారం విశాఖపట్నం నుంచి జిల్లా కేంద్రంలోకి ప్రవేశించే సింహద్వారం జాతీయ రహదారి వద్ద ఓ కారులో రూ. 1.03 లక్షల నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పట్టుకున్నారు. కుశాలపురం గ్రామానికి చెందిన డి.రాజశేఖర్ తన కారులో పీఎన్కాలనీ వెళ్తుండగా ఎఫ్ఎస్టీ బృందం సింహద్వారం వద్ద తనిఖీల కోసం ఆపారు. నగదును పట్టుకునేటప్పుడు ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో సీజ్ చేసి తహసీల్దార్ సమక్షంలో ట్రెజరీకి అందజేశారు. రాజశేఖర్ వస్తువులు తాకట్టు పెట్టిన రశీదు మళ్లీ తేవడంతో జిల్లా కమిటీకి చూపించాలని అధికారులు సూచించారు. జిల్లాలో పాలీసెట్ ఉత్తీర్ణత 88.09 శాతం ఎచ్చెర్ల క్యాంపస్: పాలీసెట్–2024 ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. జిల్లా నుంచి 10,891 మంది పరీక్షకు హాజరు కాగా, 9576 మంది ఉత్తీర్ణత సాధించారు. 88.09 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 6288 మంది బాలురకు 5452 మంది ఉత్తీర్ణత సాధించారు. 86.70 శాతం ఉత్తీర్ణత సాధించారు. 4583 మంది బాలికలకు 4124 మంది ఉత్తీర్ణత సాధించారు. 89.98 శాతం నమోదైంది. త్వరలో పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 112వ ర్యాంకు నరసన్నపేట: పాలిసెట్ ఫలితాల్లో స్థానిక శ్రీ జ్ఞానజ్యోతి స్కూల్లో టెన్త్ చదివిన విద్యార్థి గొల్లంగి అరవిందు రాష్ట్ర స్థాయిలో 112 వ ర్యాంకు పొందాడు. పోలాకి మండలం జిల్లోడుమాకివలసకు చెందిన అరవిందు రైతు కుటుంబానికి విద్యార్థి. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం ప్రతినిధులు అరవింద్ను అభినందించారు. మెరిసిన హర్షిత ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని రెడ్డి క్వార్టర్స్కు చెందిన కూన హర్షిత పాలిసెట్లో 116 మార్కులు పొంది 115వ ర్యాంకు సాధించింది. విద్యార్థిని తల్లి జలజాక్షి ప్రభుత్వ ఉద్యోగిని కాగా తండ్రి కూన నాగు సప్లయర్స్ బిజినెస్ చేస్తుంటారు. ఈమెను శ్రీవాణీ హైస్కూల్ యాజమాన్యం బి. రమణమూర్తి, నారాయణరావులు, తల్లిదండ్రులు అభినందించారు. 143వ ర్యాంకు కోటబొమ్మాళి: కోటబొ మ్మాళి గ్రామానికి చెందిన సకలాభక్తుల శ్రీవల్లి పాలిసెట్లో 143వ ర్యాంకు సాధించింది. శ్రీవల్లి తండ్రి శ్రీనివాసరావు ఓ చిరు వ్యాపారి. తల్లి పద్మాలక్ష్మి గృహిణి. కోటబొమ్మాళి ప్రభుత్వ హైస్కూల్లో శ్రీవల్లి 10వతరగతి చదువుకుని 595 మార్కులు సాధించింది. శ్రీవల్లిని ఎంఈఓ–1,2 ఎస్ అప్పలరాజు,లఖినేని విశ్వప్రతాప్,హైస్కూల్ హెచ్ఎం డబ్బీరు గోవిందరావు, గ్రామస్తులు అభినందించారు. -
No Headline
● బాబు హయాంలో కల్తీ ఎరువులతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● రైతులకు రుణ మయాఫీ చేస్తానని, తొలి సంతకం ఆ ఫైలు మీదే పెడతానని చెప్పారు. అయితే, ఐదేళ్ల కాలంలో మాఫీ జరగలేదు. ఈ లోపు వడ్డీ అసలు కంటే ఎక్కువైపోయింది. ఇక, రైతులకు పంట రుణాలు అందించలేదు. అంతకుమించిన రుణాలను రీషెడ్యూల్ చేశారే తప్ప కొత్తగా ఒక్కపైసా రుణమివ్వలేదు. ● ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ముఖం చాటేశారు. 2015–16లో 18 కరువు మండలాలు, 2016–17లో 11, 2017–18లో 9కరువు మండలాలుగా ప్రకటించినా అధికారంలో ఉన్నంతసేపూ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ● జిల్లాలో 2లక్షలకు పైగా కౌలు రైతులుండగా కేవలం 18వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డులిచ్చారు. ● టీడీపీ హయాంలో రైతులకు ధాన్యం రవా ణా చార్జీలు ఇవ్వలేదు. జిల్లాలో రూ.82.73 కోట్లు పక్కదారి పట్టించారు. అంతేకాదు కొనుగోలు చేసిన ధాన్యానికి సుమారు రూ.100కోట్ల వరకు చెల్లింపులే చేయలేదు. ● తిత్లీ తుఫాన్ బీభత్సానికి జిల్లాలో 52,164 మంది కొబ్బరి రైతులు, 78,108మంది జీడి రైతులు నష్టపోయినట్టు గుర్తించారు. అర్హుల ను పక్కన పెట్టి టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకే పరిహారం అందజేశారు. ● రైతు రథం కింద మంజూరు చేసిన ట్రాక్టర్లను టీడీపీ బినామీలకు కట్టబెట్టి దోచుకున్నారు. ● జల సంరక్షణ కోసం ఐదేళ్ల కాలంలో రూ.1026.19 కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డు ల్లో చూపించారు. కానీ, క్షేత్రస్థాయిలో పనులు జరగలేదు. బాబు హయాంలో మోసాలెన్నో.. -
పలాస కిడ్నీ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
కాశీబుగ్గ: పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో బుధవారం అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. లావేరు మండలం పాతకుంకాం గ్రామానికి చెందిన 69 ఏళ్ల గొబ్బక చంద్రవతికి కాలిపై గాయమైంది. సుగర్ వ్యాధి ఉండడంతో కాలిని తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె ఈ నెల 6న ఆస్పత్రికి వచ్చారు. ఆమెకు కాలు తీయకుండా ప్రత్యేక చికిత్సను అందజేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తెలిపారు. రోగికి వివిధ రక్త పరీక్షలు చేయించి కాలికి సంబంధించిన రక్తనాళాల్లో సమస్యను గుర్తించి వైద్యం అందించామన్నారు. కాలు తీసేయాల్సిన పరిస్థితి ఉండడంతో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు డాక్టర్ ఎ.కిశోర్కుమార్, డాక్టర్ భాస్కర్, డాక్టర్ సందీప్రాజు, డాక్టర్ అనుషా రక్తనాళాలకు బైపాస్ సర్జరీ చేసి కాలు తీసేయాల్సిన అవసరం లేకుండా చేశారు. ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటున్నారు. రక్తనాళాలలో అడ్డుతొలగి తిరిగి రక్త ప్రసరణ జరుగుతోందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ చేసిన వైద్యులకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ అభినందించారు. -
అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు
రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. జిల్లాలో 642 కేంద్రాల ద్వరా సేవలు అందుతున్నాయి. వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా తక్షణం పరిష్కరిస్తూ.. ఉపయుక్తమైన సలహాలు అందజేస్తూ రైతుకు సాయపడుతున్నాయి. గతంలో చాలా తక్కువ మందికి సబ్సిడీ విత్తనాలు అందేవి. ప్రస్తుతం ఆర్బీకేల ద్వారా రైతులకు నేరుగా అందుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభానికి ముందే ఎవరెవరికి ఎన్ని బస్తాల విత్తనాలు కావాలో ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. మూడు రోజుల్లో రైతుల ఇళ్లకే విత్తనాలు అందజేస్తున్నారు. కావాల్సిన ఎరువులను కూడా ముందుగానే ప్రతిపాదనలు తీసుకుని అందించారు. కూరగాయల రైతులు కియోస్క్ల ద్వారా పురుగుల మందులు, ఎరువులు బుక్ చేసుకుంటున్నారు. కష్టపడి సాగు చేస్తున్న పంట వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి, ప్రభుత్వ అందించే ప్రయోజనాలు పొందడానికి పంటల ఈ క్రాప్ను ఆర్బీకే స్థాయిలోనే చేశారు. పరీక్షల కోసం 7 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. ● వైఎస్సార్ రైతుభరోసా కింద 3.21లక్షల మంది రైతులకు గాను రూ.1919.46కోట్లు అందించారు. ● వైఎస్సార్ ఉచిత పంటల భీమా కింద 87,158 రైతులకు గాను రూ 85.14కోట్లు అందజేశారు. ● రూ. 424.74కోట్లతో 2,89,197 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందజేశారు. ● 82,745 మెట్రిక్ టన్నులు ఎరువులు (యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎన్పీకే) పురుగు మందులు 5592 లీటర్లు నానో యూరి యా వంటివి ఆర్బీకేల ద్వారా అందించారు. ● వైఎస్సార్ యంత్ర సేవాపథకంలో 505 ట్రాక్టర్లు, మల్టిపుల్క్రాప్ ట్రెసర్స్, పాడిరేపర్స్, రోటావెటర్స్ అందజేశారు. ● సీసీఆర్సీ కార్డులు 27,049 కార్డులు అందించారు. ● రైతులకు సున్నా వడ్డీ రుణాలు అందించారు. ● తిత్లీ తుపాను సమయంలో నష్టపోయిన వారికి ఏకంగా ఒక్కో చెట్టుకు రూ.3000, జీడి తోటలకు హెక్టార్కు రూ.50 వేలు మంజూరు చేశారు ● 2017–18 రబీ సీజన్లో మొక్కజొన్న పండించిన రైతులు గిట్టుబాటు ధర లేదని ప్రభుత్వం క్వింటాకు రూ.200 బోనస్ చెల్లిస్తామని ప్రకటించింది. 15,915మందికి రూ.11.17కోట్లు మేర లబ్ధి చేకూర్చారు. -
పోస్టల్ బ్యాలెట్కు నేడు చివరి అవకాశం
శ్రీకాకుళం పాత బస్టాండ్: ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు గురువారం చివరి అవకాశాన్ని కల్పిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. గడిచిన నాలుగు రోజులుగా జిల్లాలో 41,225 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆయా ఫెసిలియేషన్ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇంకా ఓటు హక్కు వినియోగించుకోని ఉద్యోగులు గురువారం ఒక్కరోజు చివరి అవకాశంగా తమ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కచ్చితంగా వినియోగించుకొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించామని కలెక్టర్ పేర్కొన్నారు. -
ఆటోబోల్తా: నలుగురికి గాయాలు
సీతంపేట: మండలంలోని జజ్జువ సమీపంలో బుధవారం ఆటో బోల్తాపడడంతో జరిగిన ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. తమ గ్రామం నుంచి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవడానికి పాలకొండకు ఆటోలో వస్తుండగా మార్గమధ్యంలో మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నిమ్మక మాణిక్యం, నారాయణమ్మ, సవర సూరయ్య, రామారావులకు గాయాలయ్యా యి. వారిని స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కో సం పాలకొండ ఒకరిని, శ్రీకాకుళం రిమ్స్కు మ రొ కరిని రిఫర్ చేశారు. మిగతా ఇద్దరు కోలుకున్నట్లు ఏఎస్సై సంజీవరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
పార్లమెంట్ నియోజకవర్గ ప్రత్యేకతలు..
రాష్ట్రంలో అత్యంత పొడవైన తీరరేఖ ఈ జిల్లాలోనే ఉంది. 193 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరంలో చెప్పుకోదగ్గ పర్యాటకులు విహరించడానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే నదీ–సాగర సంగమాలు అటు అందాలతో, ఇటు దేవాలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశిస్తున్నాయి. పార్లమెంట్ పరిధిలో అరసవిల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం వంటి ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రాలెన్నో ఉన్నాయి. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు తరలివస్తారు. శ్రీకాకుళం జిల్లాలో మరో ప్రముఖ బౌద్ధ కేంద్రం దంతవరపుకోట ఉంది. బౌద్ధులు విశిష్టమైనదిగా పరిగణించే శాలిహుండం అనే ప్రదేశం ఇక్కడుంది. శాలిహుండం కొండ పక్కగా వంశధార నది ప్రవహిస్తూ ఉంటుంది. కొండపైనుంచి చూస్తే వంశధార నది కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలిసే దృశ్యం లీలగా గోచరిస్తుంది. బారువలో ప్రసిద్ధి చెందిన కోటిలింగేశ్వర స్వామి ఆలయం, జనార్దనస్వామి ఆలయం ఉన్నాయి. తేలినీలాపురంలో సైబీరియన్ కొంగల విహారకేంద్రం ఉంది. ఇచ్ఛాపురం పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తేలుకుంచి గ్రామం విదేశీ పక్షుల విడిది కేంద్రంగా గుర్తింపు పొందింది. ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు నాణ్యతకూ, మన్నికకూ పేరుపొందిన పొందూరు ఖద్దరు పంచెలనే ధరించేవారు. ఈ ఖాదీ కేంద్రాన్ని సందర్శించిన ప్రముఖులలో మహాత్మాగాంధీ కుమారుడు దేవదాసు గాంధీ తదితరులు ఉన్నారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
టెక్కలి: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ విశ్రాంత జడ్జి బి.సత్యనారాయణ అన్నారు. బుధవారం టెక్కలి విద్యుత్ శాఖా డివిజన్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1912 టోల్ఫ్రీ నంబరు ద్వారా సమస్యలు తెలియజేయవచ్చన్నారు. 2005 నుంచి ఇప్పటి వరకు సుమారు 7823 సమస్యలు పరిష్కరించినట్లు వివరించారు. అనంతరం ఐదు ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ ఆర్థిక సభ్యుడు ఎం.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ అటెండర్పై సస్పెన్షన్ వేటు అరసవల్లి: నగరంలోని దేవదాయ శాఖ పరిధిలోని ఉమారుద్ర కోటేశ్వర ఆలయ అటెండర్గా పనిచేస్తున్న వి.సతీష్ను ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తూ (రిమూవల్ ఆర్డర్) ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆలయ ఈవో ఎం.సుకన్య తెలిపారు. ఆమె బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఉపాలయంగా ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయ భూముల నుంచి రెండేళ్లకు గాను ఏడుగురు రైతుల నుంచి రూ.2,16,800 శిస్తులను, ఉమారుద్రకోటేశ్వర ఆలయానికి చెందిన ఓ భూమి నుంచి రూ.3600 కలిపి మొత్తం రూ.2,20,400 నగదును నకిలీ రశీదులతో అటెండర్ సతీష్ వసూలు చేసినట్లుగా నిర్ధారణ అయ్యిందన్నారు. దీంతో ఉన్నతాధికారులతో సంప్రదించి దేవదాయ చట్ట నిబంధనల ప్రకారం అతడిని ఉద్యోగం నుంచి తొలిగించామని ప్రకటించారు. ఆలయానికి చెందిన 14.70 ఎకరాల భూముల నుంచి కొన్నాళ్లుగా శిస్తు వసూళ్ల లెక్కలేవీ డీసీబీ రికార్డులో నమోదు కాలేదని, ఈ అక్రమ వసూళ్లపై వన్టౌన్లో సతీష్పై ఫిర్యాదు చేయనున్నామని, తదుపరి విచారణ జరిగితే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశాలున్నాయని చెప్పారు. అసలు పాత్రధారునిపై ఆరా..! ఉపాలయాల ఆదాయాన్ని గండి కొట్టిన అక్రమాల్లో అసలు పాత్రధారుడెవరో తేల్చేందుకు దేవదాయ శాఖ ఆరా తీస్తోంది. గతంలో ఈ ఆలయానికి ఈవోగా పనిచేసిన ఓ అధికారి అండదండలతోనే అటెండర్ సతీష్ ఇలా నకిలీ రఽశీదులు, నకిలీ దర్శన టిక్కెట్ల విక్రయాల వంటి అక్రమాలకు పాల్పడ్డాడని దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. ప్రాణం తీసిన ఈత సరదా హిరమండలం: వంశధార నదిలో స్నానానికి దిగి ముగ్గురు బాలికలు మునిగిపోయారు. స్థానికులు గమనించి బయటకు తీసేలోపే అందులో ఒకరు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. హిరమండలం మేజర్ పంచాయతీ పాత హిరమండలంలోని కుమ్మరివీధికి చెందిన బాలమధురి(14) వీధిలోని ఇద్దరు స్నేహితులతో కలిసి వంశధార నదిలో స్నానానికి వెళ్లింది. స్నానం చేస్తుండగా మాధురి మునిగిపోయింది. ఆమెను కాపాడే క్రమంలో ఇద్దరు స్నేహితులు సైతం మునిగిపోయారు. కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చి ముగ్గుర్నీ బయటకు తీశారు. స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే బాలమాధురి మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మాధురి తల్లిదండ్రులు రోజువారి కూలీలు. వీరికి మాధురితో పాటు కుమారుడు ఉన్నాడు. మాధురి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి సింహాద్రి ఫిర్యాదు మేరకు ఎస్సై జి.నారాయణ స్వామి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం సీహెచ్సీకి తరలించారు. స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరిచేందుకు చిలకపాలేం శ్రీ శివానీ ఇంజినీరింగ్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలు, కౌంటింగ్ కేంద్రాలను బుధవారం కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ పరిశీలించారు. పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్రూంలు, కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రశాంతంగా కౌంటింగ్ కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమీమ్ అన్సారియా, నియోజకవర్గాలు రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
No Headline
పొందూరు: పొందూరు, ఎరుకులపేట, కృష్ణాపురం గ్రామాలకు చెందిన 100 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. వీరికి ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం పార్టీ కండువాలను వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో దన్నాన సూరిబాబు, గార హరిబాబు, దీన ప్రసాద్, జరజాపు మణికంఠ, అనకాపల్లి దేవ, అనకాపల్లి రాము, గాడు గన్నెయ్య, సతీష్, నాగరాజు ఉన్నారు. కార్యక్రమంలో కాళింగ కార్పోరేషన్ చైర్మన్ దుంపల లక్ష్మణరావు(రామారావు), మండల పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్కుమార్, కోట గోవిందరావు, గుడ్ల మోహన్, వండాన సూరపునాయుడు, పప్పల రాధాక్రిష్ణ, అనకాపల్లి గోవింద, అనకాపల్లి రామకృష్ణ, కొన్న సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘పథకాలు అమలు కావాలంటే మళ్లీ జగనే రావాలి’
కాశీబుగ్గ: శిష్టకరణాలతో పాటు పేదలందరికీ అన్ని పథకాలు అందాలంటే మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వమే రావాలని శిష్టకరణ నాయకులు కోరారు. వారు బుధవారం పలాసలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శిష్టకరణ కుల పెద్దలను కలిశారు. నాయకులు పోలుమహంతి ఉమామహేశ్వరరావు, సదాశివుని కృష్ణ, డబ్బీరు భవానిశంకర్లు పలాస అభ్యర్థి సీదిరి అప్పలరాజు సతీమణి సీదిరి శ్రీదేవితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, ఎమ్మెల్యే అభ్యర్థి సీదిరి అప్పలరాజుకు ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో అంపలాం వసంతకుమార్, జీఆర్జీ నాయుడు, కో ఆప్షన్ సభ్యులు సురేంధ్రనారాయణ త్యాడి పాల్గొన్నారు. -
రెండో పెళ్లికి సిద్ధపడిన కొడుకు!
● పోలీసులకు అప్పగించిన తండ్రి భువనేశ్వర్: ఇంట్లో తాళి కట్టిన ఇల్లాలు ఉండగా మరో మహిళతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు ఆ మృగాడు. అయితే దీన్ని తండ్రి అంగీకరించలేదు. కొడుకుని ఈడ్చుకొని తీసుకొని వెళ్లి స్వయంగా పోలీసులకు అప్పగించాడు. భద్రక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన చర్చనీయాంశమైంది. ఠాణాలో పెళ్లి తప్పిన దంపతుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తన కొడుకు అజయ్ను రెండో పెళ్లి చేసుకున్నందుకు శిక్షగా ఊరేగింపులో కనిపించిన వద్ధుడు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. భద్రక్ జిల్లాలోని బాసుదేవ్పూర్ ఠాణా పరిధిలోని ఎడ్తాల్ గ్రామస్తుడు అజయ్ మొదటి భార్య ఉంటుండగా చట్టబద్ధంగా కోర్టులో మరో మహిళతో రెండో పెళ్లికి సిద్ధం అయ్యాడు. ఈ విషయం తన కన్న తండ్రి బిష్ణుమోహన్ జెనా చెవిన పడడంతో హుటాహుటిన కొడుకు రెండో పెళ్లి ప్రాంగణానికి చేరి విషయంపై ఆరా తీశాడు. తాను విన్నది నిజమేనని తేలడంతో కోర్టు ఆవరణ నుంచి కన్న కొడుకు చొక్కా కాలరు పట్టుకుని ఈడ్చుకుంటు నడి రోడ్డు గుండా పోలీసు ఠాణాలో హాజరు పరిచాడు. పది సంవత్సరాల కిందట తన కొడుకు అజయ్కు వివాహం జరిగిందని.. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడని పోలీసులకు వివరించాడు. ఇల్లాలు, బిడ్డ ఉండగా రెండో పెళ్లికి పాల్పడడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన తండ్రి తక్షణ స్పందన అందరి హృదయాల్ని చలింప జేసింది. కోడలు, మనవడుతో కలిసి ఆరోగ్య పరీక్షల కోసం గ్రామంలో సామాజిక ఆరోగ్య కేంద్రానికి (సీహెచ్సీ) వెళ్లిన సమయంలో కొడుకు కోర్టులో అజయ్కు రెండో పెళ్లి జరుగుతుందని తండ్రి చెవిన పడింది. తక్షణమే బిష్ణుమోహన్ తన కోడలు, మనవడిని ఇంట్లో వదిలేసి కోర్టుకెళ్లి రెండో పెళ్లికి సిద్ధమవుతున్న కొడుకును చూసి అవాక్కయ్యాడు. ఈ విషయం దాచిపెట్టకుండా తన కొడుకును పోలీసులకు అప్పగించాలని బిష్ణుమోహన్ అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాడు. కొడుకును ఈడ్చుకుని పోలీస్ స్టేషకు తీసుకెళ్లాడు. అజయ్తో పెళ్లి చేసుకోబోతున్న మహిళ అతనితో పాటు పోలీస్స్టేషన్కు వెళ్లింది. విచారణ నిమిత్తం పోలీసులు అజయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో అజయ్ తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని అతని భార్య ఆరోపించింది. -
వైఎస్సార్ సీపీ వెంటే కాళింగ సామాజికవర్గం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కాలింగ సామాజికవర్గమంతా వైఎస్సార్సీపీ వెంటే ఉన్నారని రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల రామారావు(లక్ష్మణరావు) అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగానే సీఎం జగన్మోహన్రెడ్డి జిల్లాలో కాళింగ సామాజిక వర్గం బలాన్ని గుర్తించి జిల్లాలో ప్రస్తుతం ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం కల్పించారన్నారు. 2019లో మూడు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ప్రకటించినప్పటికీ స్వల్ప తేడాతో ఓడినప్పటికీ, ఒకరికి ఎమ్మెల్సీగా, ఒకరు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, ఒకరికి రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారన్నారు. తమ్మినేని సీతారాంను స్పీకర్గా నియమించి అత్యున్నత పదవిని అందించి సామాజిక వర్గానికి గౌరవించారని గుర్తు చేశారు. కాళింగ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి జిల్లాకు చైర్మన్ను నియమించడం గొప్ప విషయమన్నారు. సీఎం జగన్కు అండగా నిలిచి వైఎస్సార్సీపీ గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్లు బాడాన కృష్ణారావు, పప్పల రాధాకృష్ణ, తమ్మినేని మురళి, తమ్మినేని వాసుదేవరావు, బొడ్డేపల్లి గంగాధర్, గురుగుబిల్లి లక్ష్మణరావు, మొదలవలస పాపారావు, గురుగుబెల్లి కృష్ణారావు, మెట్ట శ్యామలరావు, కూన సత్తిబాబు, దుంపల గోవిందరావు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు
ఎచ్చెర్ల క్యాంపస్: ఎన్నికలు పూర్తయ్యాక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు తీసుకు వచ్చే వాహనాలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ జీఆర్ రాధిక తెలిపారు. ఈవీఎంలు స్వీకరించే రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటును చిలకపాలేం శ్రీ శివానీ ఇంజినీరింగ్ కాలేజ్లో బుధవారం పరిశీలించారు. ఎనిమిది నియోజకవర్గాల నుంచి ఈవీఎంలు ఇక్కడకు తరలించి స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చనున్నట్లు చెప్పారు. ఒకే సారి వాహనాలు వచ్చినా ట్రాఫిక్ సమస్య లేకుండా ఎప్పటి వాహనాలు అప్పుడు అన్లోడ్ చేసి స్ట్రాంగ్రూమ్లకు తరలించనున్నట్లు తెలిపారు. రిసెప్షన్ కేంద్రాల ఏర్పా ట్లు, సమీప లేఅవుట్లో ఏర్పాటు చేసిన రోడ్లు, పార్కింగ్ స్థలం పరిశీలించారు. ఆమె వెంట అద నపు ఎస్పీ ప్రేమ్కాజల్, సీఐలు జి.రామచంద్రరావు, ఎం.అవతారం, ఎస్ఐ చిరంజీవి పాల్గొన్నారు. -
ఆస్తులు ఇచ్చేది జగన్.. లాక్కునేది చంద్రబాబు
శ్రీకాకుళం రూరల్: నమ్మక ద్రోహమే పరమావధిగా ఉన్న పార్టీ తెలుగుదేశం కాగా, విశ్వశనీయతకు విలువలిచ్చే పార్టీ వైఎస్సార్ సీపీ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని వెంకటాపురం, నైరా తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ పొరపాటున చంద్రబాబుకు అధికారం కట్టబెడితే పథకాల పేరిట ప్రజాధనం లూటీ కావడం తప్ప ప్రజలకు ఒరిగేది లేదన్నారు. ఎల్లో మీడియా ఇటీవల ప్రజలను మభ్యపెట్టే విషప్రచారాలకు పూనుకుందన్నారు. సీఎం జగన్ భూములు లాక్కునేవారైతే జగనన్న కాలనీల కింద 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఎందుకు పంచుతారని ప్రశ్నించారు. ఇటీవల నిర్వహించిన కూటమి సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పేదల భూముల రక్షణకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రతిపాదించామని చెప్పారని గుర్తు చేశారు. ఎంతమంది ఏకమైనా వైఎస్సార్సీపీ విజయాన్ని అడ్డుకోలేరని ధర్మాన స్పష్టం చేశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు -
అభివృద్ధి మంత్రం..
● శ్రీకాకుళంలో రిమ్స్ మెడికల్ కళాశాల ● ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ ● మూలపేట పోర్టు(నిర్మాణంలో ఉంది) ● ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు(వైఎస్ జగన్ హయాంలో) ● పలాసలో కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి (వైఎస్ జగన్ హయాంలో) ● బుడగట్లపాలెం పిషింగ్ హార్బర్( నిర్మాణంలో ఉంది) ● వంశధార ప్రాజెక్టు (నిర్మాణంలో ఉంది) ● వంశధార లిఫ్ట్ ఇరిగేషన్( వైఎస్ జగన్ హయాంలో నిర్మాణం ● ఆఫ్షోర్ ప్రాజెక్టు(నిర్మాణంలో ఉంది) ● ట్రిపుల్ ఐటీ( వైఎస్ జగన్ హయాంలో పక్కా భవనాలు) ● వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల(వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు) ● అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాల ( వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు) ● పెద్దపేట హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ -
వైఎస్సార్ సీపీలో చేరికల జోష్
కోటబొమ్మాళి: కోటబొమ్మాళిలో రాజీనామా చేసిన 370 మంది గ్రామ వలంటీర్లు మారిటోరియం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి సమక్షంలో బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి, ఎంపీగా తిలక్, టెక్కలి ఎమ్మెల్యేగా దువ్వాడ శ్రీనివాస్లను గెలిపించేందుకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దుబ్బ వెంకటరమణారావు, మండల పార్టీ కన్వీనర్ నూక సత్యరాజు, కలింళ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.హేమసుందరరాజు, నాయకులు అన్నెపు రామారావు, రోణంకి మల్లయ్య, దుక్క రామకృష్ణ, మండల విప్ బొడ్డు అప్పన్న, ఏఎంసీ వైస్చైర్మన్ బొడ్డు వెంకటరమణ, సర్పంచ్లు బమ్మిడి గణపతి, కాల్ల సంజీవరావు, సుంకరి జనార్దన, ఎస్.వి.రమణమూర్తి, తలగాన గణపతి తదితరులు పాల్గొన్నారు. కాశీబుగ్గ: పలాస మండలం కేదారిపురం పంచాయతీ గంగువాడకు చెందిన మాజీ డీసీసీబీ అధ్యక్షుడు సిర్ల బుజ్జి ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి మంత్రి సీదిరి అప్పలరాజు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మామిడి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు: మండలంలోని లబ్బ, గొట్టిపల్లి పంచాయితీ దాపాకులగూడ గిరిజన గ్రామాలకు చెందిన 35 కుటుంబాలు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో నిమ్మ జోగారావు, మండా రామకృష్ణ, సురేష్, సవర భాస్కరరావు, నగేష్, సవర చిన్నోడు ఉన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ, సాధుబాబు పాల్గొన్నారు. కొత్తూరు: మదనాపురం గ్రామానికి చెందిన జన్ని భారతి, బాణాల ధనలక్ష్మి, సీతంనాయుడు, ఆగతమూడి చలపతిరావు, పెయ్యల పార్వతీశం, మాలువ ప్రభావతి, పెద్దింటి రాణి, మంగమ్మ, డిల్లేశ్వరి, అప్పారావు, జన్నోడి ఆదినారాయణ, కాంతమ్మ తదితరులు ఎమ్మెల్యే రెడ్డి శాంతి సమక్షంలో వైఎస్సార్ సీపీ చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ కొంచాడ వెంకటరమణ పాల్గొన్నారు. నందిగాం: మండలంలోని హరిదాసుపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 20 కుటుంబాలు స్థానిక నాయకుడు కణితి నారాయణమూర్తి, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఉప సర్పంచ్ కణితి నారాయణరావు, రామారావు, వినోద్కుమార్, చక్రధర్, ఆనందరావు చౌదరి, వినోద్ చౌదరి, మోహనరావు, సింగూరు రామారావు, గురువెల్లి బలరాం, పొందర పాపారావు, నర్సిపురం వినోద్, నర్సిపురం రాజు, రాజాం డొంబూరు, పినకాన జోగులు,మెట్ట పున్నయ్య, జొన్నాడ శివ, బమ్మిడి గణపతి ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి, కవిటి వీరన్న తదితరులు పాల్గొన్నారు. జి.సిగడాం: లావేరు మండలం వెంకటాపురం, లింగాలవలస గ్రామాలకు టీడీపీ నేతలు పిన్నింటి సత్యం, పిన్నింటి సూర్యారావులతోపాటు మరో 25 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే సతీమణి గొర్లె పరిమళ, విజయనగరం ఎంపీ సతీమణి బెల్లాన శ్రీదేవి, పీఏసీఎస్ చైర్మన్ బూరాడ చిన్నారావు, మాజీ సర్పంచ్ నడిమింటి కుమారి సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీలు మీసాల సత్యవతి, పిన్నింటి రజిని పాల్గొన్నారు. పాతపట్నం: మండలంలోని కుంచాడపేటకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బూరగాంకు చెందిన 20 కుటుంబాలు టీడీని వీడి వైఎస్సార్సీపీలోకి చేరారు. పార్టీలో చేరిన వారిలో మజ్జి లక్ష్మినారాయణ, సున్నాపురం నందీస్, మాకివలస దండాసీ, కొంచాడి పండు, దొర పారయ్య, దొర జగన్, కొంచాడి సోమేశ్వరరావు, చింతపల్లి వంశీ, ముకుందపురం అశోక్, చింతపల్లి ధర్మారావు, చింతపల్లి వంశీ, మాలువ అప్పన్న, జన్ని ఇంజాద్రి, అప్పారావు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జి.అప్పన్న, వైఎస్సార్సీసీ నాయకులు చీకటి పద్మరాజు, గార కాంతరావు, ఏనుతల హేమసుందరరావు, సురవరపు రమణమూర్తి పాల్గొన్నారు. -
గంజాయి నిల్వల పట్టివేత
కంచిలి: మండలంలోని అంపురం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి గంజాయి రవాణా చేస్తుండటాన్ని గుర్తించారు. ఒక వ్యక్తి ఇచ్ఛాపురం వైపు నుంచి స్కూటీలో మూడు బ్యాగులను తీసుకొస్తుండగా వాహనం ఆపి ప్రశ్నించారు. ఈ బ్యాగుల్లో జీడిపప్పు రవాణా చేస్తున్నట్లు ఆ వ్యక్తి చెప్పడంతో, సంబంధిత బిల్స్ చూపించా లని అధికారులు కోరారు. దీంతో ఆ వ్యక్తి వాహనం ఆపి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ స్కూటీలో ముందు భాగంలో ఒక బ్యాగు, వెనుక భాగంలో రెండు బ్యాగులు ఉన్నాయి. వాటిలో 40 ప్యాకెట్ల గంజాయిని తనిఖీ అధికారులు గుర్తించారు. ఒక్కో బ్యాగులో 2కిలోల 60గ్రాముల చొప్పున గంజాయి ఉంది. మొత్తంగా 82కిలోల570 గ్రాములు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ రూ.4,12, 850లుగా గుర్తించారు. ఈ సరుకును పట్టుకున్న వారిలో డిప్యూటీ తహసీల్దార్ డి.సంతోష్, ఆర్అండ్బీ ఏఈ మోహనరావు, పోలీస్ కానిస్టేబుల్ అశోక్, విఆర్వోలు ఉమాపతి, కృష్ణారావు ఉన్నారు. ఈ సరుకును, స్కూటీని స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించడంతో, దీనిపై స్థానిక ఎస్ఐ వి.రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇచ్ఛాపురానికి అశోక్ చేసిందేమిటి..?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇచ్ఛాపురం జన సాగరమైంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లింది. ఎన్నికల ప్రచార సభకు కనీవినీ ఎరుగని రీతిలో జనం తరలివచ్చారు. మున్సిపల్ ఆఫీస్ కూడలి రోడ్డుకి అటు అటూ జనం కిక్కిరిసిపోయారు. పట్టణంలోని వీధులన్నీ జనంతో పోటెత్తాయి. అభిమానుల సందడితో ఇచ్ఛాపురంలో విజయోత్సవం కనిపించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో మంగళవారం ఇచ్ఛాపురం మురిసిపోయింది. సంతపేట నుంచి ఇండియా గ్యాస్ గోడౌన్ వరకు రోడ్డు అంతా ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. విశా ఖపట్నం ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో ఇచ్ఛాపురం చేరుకున్న ీసీఎం జగన్మోహన్రెడ్డికి రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ రీజనల్ డిప్యూటీ కో ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు, పార్టీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, స్థానిక ఎమ్మెల్యే అభ్య ర్థి పిరియా విజయ, నరసన్నపేట అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, సమన్వయకర్త పిరియా సాయిరాజ్ తదితరులు స్వాగతం పలికారు. హెలీప్యాడ్ నుంచి బయల్దేరిన సీఎం జగన్ కోసం దారి పొడవునా పెద్ద ఎత్తున జనం బారులు తీరారు. సీఎం ప్రయాణించే వాహనానికి ఎదురుగా నిలబడి ..చిందులేసి....ఈలలతో తమ ఆనందాన్ని తెలియజేశారు. ఇక సభలో జగన్ మాట్లాడినంత సేపూ నినాదాలు, కేరింతలతో సందడి చేశారు. చంద్రబాబు ఒక్క మంచైనా చేశారా? మీ నియోజకవర్గాన్ని ఒక్క మేలైనా చేశారా? ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకమైనా అందించారా? గుర్తుండేలా ఒక్క అభివృద్ధి పనైనా చేశారా? మూడు సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబుతో ప్రజలకు ఒరిగిందేమైనా ఉందా? అని సీఎం వైఎస్ జగన్ అడిగితే సభకు వచ్చిన జనం రెండు చేతులు పైకెత్తి లేదు...లేదు.. అంటూ నినదించారు. ఎటు చూసినా జనమే.. సీఎం జగన్మోహన్రెడ్డి సభకు మధ్యాహ్నం ఒంటి గంట కల్లా నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. ఆయన వచ్చేంతవరకు వేచి చూశారు. ఆయన వచ్చాక పులకించిపోయారు. సభలో ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా వినడమే కాదు హర్షధ్వానాలు తెలియజేశారు. సీఎం ప్రశ్నలకు సైగలతో బదులిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. సభ ప్రాంగణానికి వచ్చిన దగ్గరి నుంచి తిరిగి హెలీప్యాడ్ వెళ్లేంతవరకు ఒక్కరూ కదల్లేదు. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవడంతో కిక్కిరిసిన జనాల మధ్యే సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లింది. సీఎం ఇచ్ఛాపురంలో అడుగు పెట్టిన దగ్గరి నుంచి తిరిగి వెళ్లేంతవరకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా జనం జేజేలు పలికారు. ఉద్దానం కోసం, ఇచ్ఛాపురం కోసం, జిల్లా కోసం, ఉత్తరాంధ్ర కోసం ఏమేం చేశారో చెప్పినప్పుడైతే ప్రజలు పెద్ద ఎత్తున ఽహర్షధ్వానాలు వ్యక్తం చేశారు. మోసాలు చేసిన చంద్రబాబును నమ్ముతారా.. అన్నప్పుడు ‘నమ్మం బాబు’ అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. చెల్లెమ్మ విజయ ఎమ్మెల్యే అభ్యర్థిగా... పేరాడ తిలక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, వీరిని గెలిపిస్తే మంచి చేస్తారని, ప్రజలకు మెరుగైన సేవలందిస్తారని చెబుతూ వారిని చేత్తో పట్టుకుని ప్రజలందరికీ అభివాదం చేయించిన దృశ్యాలైతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచా యి. ఆ సందర్భంలో ప్రజలంతా తమ మద్దతును తెలియజేయడం ప్రత్యేకంగా కనిపించింది. సీఎం పర్యటనలో మత్స్యశాఖ, పశు వైద్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, నియోజకవర్గ పరిశీలకుడు చింతాడ రవికుమార్, సీడాప్ చైర్మన్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేష్కుమార్ అగర్వాలా(లల్లూ), ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, ఎంపీపీలు బోర పుష్ప, పైల దేవదాస్రెడ్డి, డాక్టర్ నిమ్మన దాస్, కవిటి మండల నేత కడియా ప్రకాశ్, మున్సిపల్ వైస్ చైర్మన్లు లాభాల స్వర్ణమణి, ఉలాల భారతి దివ్య, జెడ్పీటీసీ సభ్యులు ఇప్పిలి లోలాక్షి, తడక యశోద, ఉప్పాడ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. బస్సు ఎక్కి మరీ అభిమాన నాయకుడిని చూస్తున్న ప్రజలువైఎస్సార్ కుటుంబంతోనే జిల్లా అభివృద్ధి: తిలక్ వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ హయాంలోనే జిల్లా అభివృద్ధి చెందిందని వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ అన్నారు. జిల్లాలో అంబేడ్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళంలో రిమ్స్, ఫేజ్–2 వంశధారను వైఎస్సార్ నిర్మిస్తే.. తర్వా త వైఎస్ జగన్ మూలపేటలో పోర్టు నిర్మించి ప్రపంచంతో అనుసంధానం చేస్తున్నారని తెలిపారు. ఉద్దానం సమస్య గు రించి నాయకులంతా హామీలు ఇచ్చి వెళ్లిపోయారని, వైఎస్ జగన్ ఒక్కరే పనులు చేశారని గుర్తు చేశారు. హిరమండలం నుంచి నీటిని తీసుకురావడంతో పాటు పలాసలో కిడ్నీ ఆస్ప త్రి ఏర్పాటు చేశారని తెలిపారు. 2014లో ముఖ్యమంత్రి కావడం కోసం చంద్రబాబు అనేక హామీలిచ్చి మోసం చేశారని, ఇప్పుడు మళ్లీ మోసం చేయడానికి సిద్ధమైపోయారని విమర్శించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్తో కోర్టులో కేసు వేసి వృద్ధులను క్షోభకు గురి చేశారని అన్నారు. కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల రైతులకు సాగునీ రు అందించేందుకు వంశధార కుడికాలువను ఇచ్ఛాపురం వరకు పొడిగించాలని ఆయన సీఎంను కోరారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ సూటి ప్రశ్న కంచిలి: పదేళ్ల పదవీ కాలంలో ఇచ్ఛాపురం నియోజకవర్గానికి బెందాళం అశోక్ చేసిందేమిటని వైఎస్సార్ సీపీ ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ సూటిగా ప్రశ్నించారు. ఇచ్ఛాపురం పట్టణంలో మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో ఆమె ప్రసంగించా రు. తాను రెండున్నరేళ్లు జెడ్పీ చైర్ పర్సన్ పదవి చేపట్టి ఎన్నో పనులు చేశానని, కానీ పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న అశోక్ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. అశోక్ నిత్యం రాకపోకలు సాగించే సోంపేట–కవిటి–ఈదుపురం–ఇచ్ఛాపురం రోడ్డును తానే వేశానని, అశోక్ కేవలం పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు వెళ్లడం తప్ప, ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే కేవలం వైఎస్ జగన్తోనే సాధ్యవుతుందన్నారు. ఉద్దానం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధి పరిష్కారానికి రూ.700 కోట్లతో వైఎస్సార్ సుజలధార నిర్మించారని గుర్తు చేశారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ రెండు పనులు చేసిన వైఎస్ జగన్కు ఉద్దానం రుణపడి ఉంటుందని తెలి పారు. ఇక్కడ రెండుసార్లు ఎంపీగా ఎన్నికై న కింజరాపు రామ్మోహన్నాయుడు ఈ ప్రాంత అభివృద్ధికి ఏమీ చేయలేదని అన్నారు. 2014లో టీడీపీ ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ఏదీ నిలబెట్టుకోలేదని అన్నారు. కానీ ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ చెప్పిన పను ల న్నీ చేశారని వివరించారు. వైఎస్ జగన్ పథకాలను కాపీ కొట్టి చంద్రబాబు మోసం చేయడానికి సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ను గెలిపించాలని కోరారు. -
No Headline
● ఇచ్ఛాపురంలో సీఎం వైఎస్ జగన్ సభకు వెల్లువలా తరలివచ్చిన జనం ● జగన్నినాదంతో మార్మోగిన గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ● మధ్యాహ్నం ఒంటిగంటకే ఇసుకేస్తే రాలనంత జనం ● అధినేతకు నాయకుల ఘనస్వాగతం ● కార్యకర్తలకు ఊపునిచ్చిన జగన్ ప్రసంగం ● ఆద్యంతం ఈలలు వేస్తూ మద్దతు తెలిపిన అభిమాన తరంగం ● ఆనందోత్సాహాల నడుమ ఆడిపాడిన అక్కాచెల్లెమ్మలు -
అపర భగీరఽథుడు
సీఎం వైఎస్ జగన్ జిల్లా ప్రజల పాలిట అపర భగీరథుడు. జిల్లాలో ఏర్పాటు చేసిన కిడ్నీ పరిశోధన కేంద్రం, హిరమండలంలో ఏర్పాటుచేసిన మంచినీటి ప్రాజెక్టు, మూలపేట పోర్టు అన్నీ ఆయన చలవే. జిల్లా అభివృద్ధి చెందాలంటే మళ్లీ ఆయనే రావాలి. – హరి మహాపాత్రో కన్న కొడుకులా చూసుకుంటున్నాడు ప్రతి నెలా ఒకటో తేదీకే నా ఇంటికే వచ్చి పింఛన్ వచ్చేలా చేశారు. సీఎం వైఎస్ జగన్ నా కన్న కొడుకులా ఆదుకుంటున్నారు. ఈ రెండు నెలలు పింఛన్లు సరిగ్గా అందక ఇబ్బందులు పడుతున్నాం. మళ్లీ జగన్ సీఎం అయితే ఆ ఇబ్బందులు ఉండవు. 104 ద్వారా ఇంటి వద్దనే మందులు అందజేస్తున్నారు. – బోర పుష్పమ్మ, వృద్ధురాలు, ఇచ్ఛాపురం ● -
మమ్మల్ని ఆదుకునే నాయకుడు
జగనన్న పాదయాత్రలో మా కష్టాలను చూశారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీనిచ్చి మాట నిలబెట్టుకున్నారు. ఏడాదికి రూ. 24 వేలు చొప్పున రూ. 1.20లక్షలు నా ఖాతాలో జమచేశారు. పింఛన్ నెలకు రూ. 3 వేలు అందుతోంది. నేత కార్మికుల అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. మమ్మల్ని ఆదుకునే నిజమైన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. – బస్వా మోహనరావు, చేనేత కార్మికుడు, పొందూరు చేయూతనిచ్చారు.. రాత్రి, పగలు మగ్గం మీద పనిచేస్తున్నప్పటికీ కడుపు నింపుకోలేకపోతున్న మా జీవితాలకు సీఎం వైఎస్ జగన్ భరోసానిచ్చారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద జమ చేసిన రూ. 24 వేలును సద్వినియోగం చేసుకుంటున్నాం. నేతన్నలకు చేదోడు వాదోడుగా నిలిచారు. చేనేత కార్మికులకు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిచింది. – మందుల హేమసుందరరావు, చేనేత కార్మికుడు, పొందూరు. ●
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- PK: 'పులుసు కారుతోంది'..!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement