-
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
అన్నమయ్య జిల్లా, సాక్షి: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని.. పొరపాటున బాబుకు ఓటస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు రోడ్డులో ప్రచార సభలో మాట్లాడుతూ చంద్రబాబు.. మోదీ, అమిత్షాను తీసుకొచ్చి సభలు పెట్టించారు. ప్రత్యేక హోదా హామీ వస్తుందేమోనని ప్రజలు ఎదురుచూశారు.. వాళ్లు ప్రత్యేక హోదా హామీ ఇవ్వకుండా.. విమర్శించి వెళ్లిపోయారు’’ అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.‘‘చంద్రబాబు అంతటి అవినీతిపరుడు దేశంలోనే లేడని మోదీ అన్నారు. కూటమిలో చేరగానే అదే నోటితో చంద్రబాబును పొగుడుతున్నాడు. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఏం కావాల్లో అది మాత్రమే మాట్లాడారు. పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి’’ అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు.‘‘2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?. చంద్రబాబు కూటమి.. పెత్తందార్ల కూటమి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే.. వ్యతిరేకించారు. పెత్తందార్ల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా? 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. అక్క చెల్లెమ్మలకు నేరుగా రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించాం’’ అని సీఎం వివరించారు.గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు. ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన. ఇంటర్నేషనల్ యూనివర్శిటీలతో సర్టిఫైడ్ కోర్సులు. పిల్లల చదువు కోసం తల్లులను పోత్సహిస్తూ అమ్మఒడి. విద్యారంగంలో జరిగిన విప్లవాలు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?. మహిళా సాధికారతకు అర్థం చెప్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. మొదటిసారి మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
ఈత సరదా ప్రాణం తీసింది
వైఎస్సార్: లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో ఈత నేర్చుకోవాలని చిన్నారి సరదా పడగా... ప్రమాదవశాత్తూ ఆమె ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తోట రవీంద్రారెడ్డి, మంజుల దంపతుల కుమార్తె మహిత(12) బుధవారం గ్రామంలోని చెరువులో ఈత నేర్చుకునేందుకు తోటి పిల్లలతో కలిసి వెళ్లింది.నడుముకు ఖాళీ క్యాన్ కట్టుకుని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలో నడుముకు ఉన్న క్యాన్ ఊడిపోయింది. అక్కడున్న పిల్లలు, పెద్దలు చూస్తుండగానే భయానికి గురైన మహిత నీటిలో మునగగానే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
టీడీపీ ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగి
అట్లూరు : వేల రూపాయల జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి విధులకు డుమ్మా కొట్టి టీడీపీ ప్రచారంలో పాల్గొనడం మండల వ్యాప్తంగా దుమారం లేపుతోంది. అట్లూరు మండలం వరికుంట గ్రామానికి చెందిన శింగన సుబ్బరామిరెడ్డి ముంపు బాధితుల కోటాలో పుట్టపర్తి జిల్లా కదిరి జలవనరుల శాఖలోని డివిజన్–9 కింద సబ్ డివిజన్–3లోని మదనపల్లిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. విధులకు డుమ్మా కొట్టి బద్వేల్ ఉమ్మడి బీజేపి అభ్యర్థిని గెలిపించాలంటూ బుధవారం అట్లూరు క్రాస్రోడ్డులోని పునరావాస కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు. -
అకాల వర్షం... అపారనష్టం
కడప అగ్రికల్చర్: అకాల వర్షం అన్నదాతకు అపారనష్టాన్ని మిగిల్చింది. పంట దిగుబడి చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షం రైతన్న ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లావ్యాప్తంగా మంగళవారం అర్థరాత్రి 12 గంటలకు నుంచి దాదాపు గంట సేపు ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రైతులకు అపారనష్టం వాటిల్లింది. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి పంట దిగుబడి చేతికొచ్చే సమయంలో వచ్చిన గాలి, వానలతో పంటలన్నీ దెబ్బతిన్నాయి. వేసవిలో సాగు చేసిన నువ్వు, దోస పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఇక అక్కడక్కడ నూర్పులను చేసి పొలాల్లో ఆరబెట్టుకున్న వరిధాన్యం, నువ్వులు, వేరుశనక్కాయలు వర్షానికి తడిచిముద్దయినట్లు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జిల్లాలోని పలు మండలాల్లో అరటి,నిమ్మ, మామిడి, మునగ పంటలు బాగా దెబ్బతిన్నాయి. అరటి రైతులకు కొలుకోలేని దెబ్బతగిలింది. వ్యవసాయ బోర్లకు సంబంధించిన పలు చోట్లు ట్రాన్సుఫార్మర్లు, స్తంభాలు నేలకొరిగాయి. దెబ్బతిన్న ఉద్యాన పంటల వివరాలు ఇలా.. జిల్లాలోని ఉద్యాన పంటలకు సంబంధించి సికెదిన్నె, సిద్దవటం, గోపవరం ఖాజీపేట, ఒంటిమిట్ట, కాశినాయన, కలసపాడు, సింహాద్రిపురం మండలాల పరిధిలో 208 మంది రైతులకు సంబంధించి 456.75 ఎకరాల్లో (182.70 హెక్టార్లలో) ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. సీకేదిన్నె మండల పరిధిలో 5.80 హెక్టార్లలో ఆరటిపంట, సిద్దవటంలో 3 హెక్టార్లలో ఆరటి, గోపవరం మండలంలో రెండు హెక్టార్లలో మామిడిపంట, ఖాజీపేట మండలంలో 80 సెంట్లలో ఆరటి, 1.20 హెక్టార్లలో మునగపంట, ఒంటిమిట్ట మండలంలో 2 హెక్టార్లలో అరటి, కాశినాయన మండలంలో 156.30 హెక్టార్లలో అరటి, రెండు హెక్టార్లలో నిమ్మపంట, కలసపాడు మండలంలో 5.60 హెక్టార్లలో అరటి, సింహాద్రిపురం మండలంలో 4 హెక్టార్లలో ఆరటి పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా పంటనష్టాన్ని గుర్తించారు. కాశినాయన మండలంలో... జిల్లాలోని కాశినాయన మండలంలో అత్యధికంగా 173 మంది రైతులకు సంబంధించి 156.30 హెక్టార్లలో ఆరటిపంట దెబ్బతింది. అలాగే ఆదే మండలంలో పలు చోట్లు విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్పార్మర్లు గాలిదాటిని నేలకోరిగాయి. దీంతోపాటు ఖాజీపేట మండలం పాటిమీదిపల్లెలో ట్రాన్సపార్మర్కు ఆర్త్ ఫెయిల్ కారణంగా అధిక వోల్టోజీ విద్యుత్తు సరఫరా అయింది. దీంతో ఇళ్లలోని ఫ్రిజ్జులు, కూలర్లు, ఫాన్లులతోపాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఎండల నుంచి ఉపశమనంనెల రోజులుగా కాస్తున్న ఎండలకు ఉక్కిరి బిక్కిరి అయిన జనాలకు మంగళవారం రాత్రి కురిసిన వర్షంతో కాసింత ఉపశమనం లబించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు ఎండలు తీవ్రంగా ఉండటంతో జనాలు బయటకు రావాలంటే హడలి పో యారు. దీంతోపాటు ఎండల తీవ్రత, వడగాల్పులతో ఇళ్లలో ఉన్న జనం సైతం ఉక్కపోతతో అవస్థలు పడ్డా రు. అలాంటిది ఒక్క వర్షంతో వాతావరణం చల్లిబడి జ నాలు ఊపిరి పీల్చుకున్నారు. గత ఇరవై రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 46 డిగ్రీల మద్య నమోదతూ తుండేవి. వర్షంతో ఒక్క సారిగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గి బుధవారం 37.4 డిగ్రీలు నమోదైయింది. రాజుపాలెంలో అధ్యధికంగా 95.8 మిల్లీమీటర్ల వర్షం కురవగా వేములలో అత్యల్పంగా 4 మిల్లీమీటర్ల వర్షం నమోదైయింది. జిల్లావ్యాప్తంగా నమోదైన వర్షపాత వివరాలుకడప అగ్రికల్చర్: రాజుపాలెం, 95.8, సిద్దవటం, 81.4, కడప 80.2, పోరుమామిళ్ల 78.4, దువ్వూరు 78.2,, చెన్నూరు 70.8, వల్లూరు 70.4, జమ్మలమడుగు 70.4, బిమఠం 68.2, పొద్దుటూరు 63.6, చాపాడు 61.0, సికెదిన్నె 60.4, ఆట్లూరు 58.2, ఆట్లూరు 58.2, కలసపాడు 57.2, గోపవరం 56.6, కమలాపురం 54.6, కాశినాయన 56.4, బికోడూరు 53.8, పెద్దముడియం 50.2, ఎర్రగంట్ల 50.0, మైదుకూరు 44.6, ఖాజీపేట 43.6, ఒంటిమిట్ట 32.2, మైలవరం 25.4, పెండ్లిమర్రి 19.4, తొండూరు 14.6, కొండాపురం 14.2, ముద్ద నూరు 14.0, వేంపల్లి 13.2, వీఎన్పల్లె 10.4, సింహాద్రిపురం 9.6, పులివెందుల 7.0, చక్రాయపేట 6.0, వేముల 4.0 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. విద్యుత్తుశాఖకు దాదాపు కోటి నష్టం..... విద్యుత్తుశాఖకు దాదాపు కోటి రుపాయలు నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు ప్రాథమిక నష్టాన్ని అంచనా వేశారు. ఇందులో భాగంగా 459 స్తంభాలు దెబ్బతినగా, 89 ట్రాన్సఫార్మర్లు, మరో 10.2 కిలోమీటర్లు మేర కండక్టర్ దెబ్బతిన్నట్లు తెలిపారు. జిల్లాలో వీచిన గాలులు, వర్షంతో నేలకొరిగిన ఉద్యాన పంటలు జిల్లా వ్యాప్తంగా 456.75 ఎకరాల్లో దెబ్బతిన్న ఉద్యాన పంటలు పలు చోట్లు నేలకొరిగిన విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ పలు చోట్ల వర్షానికి తడిసిన వరిధాన్యం -
●నేషనల్ హైవేలకు జగనన్న కృషి
పులివెందుల: పులివెందుల అభివృద్ధికి చిరునామా .. ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన నేల ఇది.. కుట్రలు, కుతంత్రాలను చేధించి నిలబడేది పులివెందుల అని, అటువంటి పులివెందుల గడ్డ మీద నుంచి 45 ఏళ్లుగా వైఎస్ కుటుంబాన్ని ఆదరిస్తున్న పులివెందుల ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పులివెందుల పాత ఆర్టీసీ బస్టాండు సర్కిల్ నుంచి స్థానిక వెంకటేశ్వరస్వామి గుడి వరకు మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్రెడ్డి, డాక్టర్ ఈసీ దినేష్రెడ్డి, అభిషేక్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డి, దుష్యంత్రెడ్డి, గండ్లూరి శివారెడ్డి తదితరులతో భారీ రోడ్షో నిర్వహించారు. ఈ రోడ్షోకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం వెంకటేశ్వరస్వామి గుడి వద్ద జరిగిన బహిరంగసభలో ఎంపీ అవినాష్రెడ్డి మాట్లాడుతూ జగనన్నకు పులివెందులపై ఎంత ప్రేమంటే గడిచిన ఐదేళ్లలో ఈ విషయాన్ని తాను దగ్గరుండి గమనించానన్నారు. ఈ ఐదేళ్లలో పులి వెందుల నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. మహానేత వైఎస్సార్ మరణం తర్వాత వచ్చిన పాలకులు పులివెందులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. ఇప్పుడు తిరిగి మన నాయకుడు జగనన్న సీఎం అయ్యాక పులివెందులను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడన్నారు. పులివెందుల రింగ్రోడ్డు, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, మెడికల్ కళాశాల, పులివెందుల రాణితోపు, రింగ్రోడ్డు అభివృద్ది, గరండాలవంక, ఉలిమెల్ల లేకవుట్, పులివెందుల సర్కిళ్లు ఇలా ఎన్నో విధాలుగా పులివెందుల అభివృద్ధి చెందిందన్నారు. వైఎస్సార్ హయాంలో గోవిందరాజ స్పిన్నింగ్ మిల్, పులివెందుల పాలిమర్స్ తెస్తే....జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆదిత్య బిర్లా, అపాచీ వంటి పరిశ్రమలు తెచ్చారన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే జగనన్న మళ్లీ సీఎం కావాల్సిన అవసరముందన్నారు. అబద్ధపు హామీలతో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు 2014లో ఇదే కూటమితో ఆరోజు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ఎన్నికలయ్యాక అధికారంలోకి వచ్చి హామీలన్నీ గాలికి వదిలి వేశారన్నారు. మళ్లీ నేడు అదే కూటమితో ప్రజలకు అబద్ధపు హామీలు ఇస్తున్నారన్నారు. పోలింగ్ శాతం తగ్గించేందుకు టీడీపీ కుట్ర పులివెందుల అసెంబ్లీ స్థానానికి 27 మంది నామినేషన్లు వేయడం జరిగిందన్నారు. అందులో 18 మంది టీడీపీకి చెందిన వారు స్వతంత్రులు, వివిధ పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు వేశారన్నారు. వీరంతా టౌన్లో అల్లర్లు సృష్టించి గొడవలు పడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి పోలింగ్ శాతం తగ్గించాలని కుట్ర పన్నుతున్నారన్నారు. వీరి ఆలోచనలు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రజలు గమనించాలన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఎంపీ ప్రజలను కోరారు. సింహాద్రిపురం: పులివెందుల అంటేనే బ్రాండ్.. నమ్మకం.. భరోసా అని.. కుట్రలు, కుతంత్రాలు చేసేవారిని తరిమికొట్టే శక్తి ఇక్కడి జనాలకు ఉందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సింహాద్రిపురంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా జగనన్న ఐదేళ్ల పాలన సాగిందని.. సంక్షేమ ప్రదాత జగనన్నను మళ్లీ రెండోసారి సీఎంగా ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గండికోట నుంచి పైడిపాలెం, అక్కడి నుంచి చిత్రావతి డ్యాములకు నీరు నింపారన్నారు. 18 మాసాలుగా వర్షాలు పడకపోయినా ఇబ్బందులు కలగకపోవడానికి కారణం అప్పట్లో వైఎస్సార్ చేసిన అభివృద్ధి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ చేసిన పనులే కారణమని వివరించారు. 2019 గండికోటలో 7టీఎంసీల నీరు నింపడానికి వీలు లేకపోవడంతో రూ.900కోట్లతో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించి ఆ గ్రామాలను ఖాళీ చేయించి 2021లో 27టీఎంసీలు నీరు నింపడానికి వీలు కల్పించారన్నారు. అలాగే పైడిపాలెం ప్రాజెక్టు కింద ముంపు గ్రామాలకు రూ.32కోట్లు నష్టపరిహారం అందించారని గుర్తు చేశారు. మండలం చుట్టూ రింగురోడ్డు వేస్తారా అంటూ మీకు రింగు వేయడానికి ప్రయత్నం చేస్తున్న పచ్చబ్యాచ్ మాటలు నమ్మొద్దన్నారు. లింగాల: లింగాల రోడ్షోలో ప్రజలనుద్దేశించి ఎంపీ మాట్లాడుతూ కృష్ణాజలాలను సీబీఆర్కు తీసుకురావడంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చేసిన కృషి ఎనలేనిదన్నారు. 2020లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఆర్లో నాలుగు మునక గ్రామాలకు రూ.240 కోట్లు చెల్లించి క్లియర్ చేశారన్నారు. 2020 నుంచి సీబీఆర్లో 3సార్లు 10 టీఎంసీల నీటిని నిల్వ చేయడం జరిగిందన్నారు. 2023లో 10టీఎంసీల నీటిని నిల్వ ఉంచడం వల్ల ఇంతటి అనావృష్టిలోనూ త్రాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉందన్నారు. ఇప్పటికీ సీబీఆర్లో 4.5 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. దీంతో నియోజకవర్గానికి నీటి సమస్య లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ప్రజలకు అందాల్సిన పథకాలను అడ్డుకుంటున్నారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు బటన్ నొక్కిన ఈబీసీ నేస్తం, చేనేత నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలను ప్రజలకు అందకుండా చేశారన్నారు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారని, కోర్టు నుంచి తీర్పు సానుకూలంగా వస్తే 48గంటల్లో ఆయా పథకాలకు సంబందించిన లబ్ధిదారులకు డబ్బు జమ చేయడం జరుగుతుందన్నారు. లేదంటే తిరిగి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వారం రోజుల్లో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. పులివెందుల ప్రజల రుణం ఏం చేసినా తీర్చుకోలేనిది పులివెందుల అంటే అభివృద్ధికి చిరునామా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పులివెందుల ఊరు చుట్టూ నేషనల్ హైవే కోసం జగనన్న ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి గడ్కరి దృష్టికి తీసుకువచ్చారన్నారు.పులివెందుల–బెంగుళూరు, పులివెందుల–విజయవాడ హైవే పనులు కొనసాగుతున్నాయన్నారు. మరోవైపు ప్యారలాల్గా పులివెందుల–బెంగుళూరు పనులు జరగుతున్నాయన్నారు. ఇవన్నీ పెద్ద ఎత్తున పులివెందుల ఊరుచుట్టూ జరుగుతున్నాయన్నారు. కడప–బెంగుళూరు రైల్వేలైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, 15 ఏళ్లుగా పనిచేసినా 245 కిలోమీటర్లకు సంబంధించి 27 కిలోమీటర్లు మాత్రమే పూర్తయిందన్నారు. దీనికి కారణం భూ సేకరణకు రైల్వేశాఖ ఇచ్చే డబ్బులు చాలా తక్కువని తెలిపారు. పెండ్లిమర్రి వరకు అయిపోయిన లైన్ను పెండ్లిమర్రి–పుట్టపర్తి వయా పులివెందులకు తీసుకు వెళ్లాలని కేంద్రానికి లేఖ రాయడం జరిగిందన్నారు. అదేవిధంగా పెండ్లిమర్రి–పుట్టపర్తి లైన్కు ముద్దనూరు నుంచి కూడా ఒక లైన్వేసి పులివెందులకు కలుపాలని విన్నవించారన్నారు. ముద్దనూరు ప్రాంతంలో సిమెంటు పరిశ్రమలు ఉండడం వల్ల ఇది రైల్వేశాఖకు ఎంతో ఆదాయం తెస్తుందన్నారు. ఇవన్నీ జరిగితే మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కొప్పర్తిలోని కారిడార్ 6600 ఎకరాల్లో నిర్మిస్తున్నారని, అందులో లక్ష మంది పనిచేయాలని జగనన్న ఆశయమన్నారు. బ్రహ్మంసాగర్ నుంచి కొప్పర్తికి నీరు అందించే పనులు కూడా జరుగుతున్నాయన్నారు. జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ వల్ల 25 వేల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. -
మేమంతా సిద్ధం సభాస్థలి పరిశీలన
కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 10వ తేది సాయంత్రం 4 గంటలకు కడప లో నిర్వహించబోయే ‘మేమంతా సిద్ధం’కు సంబంధించి సభాస్థలిని ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ కె. సురేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి అంజద్బాషా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి పరిశీలించారు. గోకుల్ సర్కిల్, ఏడు రోడ్ల కూడలి, క్రిష్ణా సర్కిల్ ప్రాంతాల్లో అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు వీలుగా వారు ఆయా ప్రాంతాలను పరిశీలించారు. సభా వేదిక, అన్ని వైపుల నుంచి జనం వచ్చి పోయేందుకు వీలుగా ఉన్న ప్రదేశంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మెన్ పులి సునీల్ కుమార్, వైఎస్సార్సీపీ నాయకులు పి. జయచంద్రారెడ్డి, రామ్మోహన్రెడ్డి, ఉమైర్, మునిశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఐటీఐలలో అడ్మిషన్లు ప్రారంభం
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీలలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 9వ తేది నుంచి ప్రారంభమవుతుందని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ జ్ఞానకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్మిషన్స్కు అర్హులని పేర్కొన్నారు. అడ్మిషన్లు 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామని వివరించారు. విద్యార్థులు పదవ తరగతి మార్కుల జాబితా, కుల ధృవీకరణ పత్రం, టీసీ, ఆధార్కార్డు, ఫొటో, మెయిల్ ఐడీ, పర్మినెంట్ సెల్ నెంబరుతో దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐ వద్దకు వెళ్లి ఐటీఐ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించారు. పాలిసెట్ ఫలితాలు విడుదల కడప ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం ప్రభుత్వం నిర్వహించిన పాలిసెట్–2024 ప్రవేశ ఫలితాలు విడుదలయ్యాయి. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుకు సంబంధించి జిల్లావ్యాప్తంగా ఏప్రిల్ 27వ తేదీ కడప, ప్రొద్దుటూరులలోని 16 కేంద్రాలలో నిర్వహించిన పాలిసెట్ పరీక్షలకు 7091 మంది హాజరుకాగా 6042 మంది పాసై 85.21 శాతం ఉత్తీర్ణతను సాధించారు. బాలురకంటే బాలికలో అధికశాతం ఉత్తీర్ణతను సాధించారు. ఇందులో ఖాజీపేట మండలం రంగాపురం గ్రామానికి చెందిన మద్దూరి హరీశ్వర్ 120 మార్కులకుగాను 117 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 84వ(జిల్లా పస్ట్ ర్యాంకు) ర్యాంకును సాధించి జిల్లా టాపర్గా నిలిచాడు. అలాగే ఆదే మండలం బక్కాయపల్లె గ్రామానికి ములపాకు శ్రీవాణి 116 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 128 ర్యాంకు, జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచారు. -
టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిక
చింతకొమ్మదిన్నే : మండలంలోని రసూల్పల్లె, కొత్తపేట గ్రామాలకు చెందిన 70 కుటుంబాల వారంతా బుధవారం టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను చూసి వైఎస్సార్సీపీలో చేరామని పార్టీలో చేరిన మడక రామాంజనేయులు, బాలరాజు, చరణ్ తేజ, చిన్న రామాంజనేయులు, గోవిందు, రామచంద్ర, రాముడు, పెద్ద కొండయ్య, చిన్న కొండయ్య, నిత్య పూజ, సాయి, భద్ర, బొలిశెట్టి రవి, శ్రీను, హనుమంతు, వెంకటేష్, శ్రీను, జి.ఉదయ్ కిరణ్ రెడ్డి, నాగేంద్ర, రాము, వాసుదేవ, ప్రవీణ్, రాఘవేంద్ర, అనిల్, సుబ్బరాయుడు, సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, రమణారెడ్డి, కొండ రాయుడు, సుబ్బారెడ్డి తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర రెడ్డి, జనార్దన్ రెడ్డి, గుడా ప్రభాకర్ రెడ్డి, గుత్తిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, గజ్జల సుధాకర్ రెడ్డి, కష్ణయ్య, నారాయణరెడ్డి, వెంకట్రెడ్డి, సురేంద్రరెడ్డి సుబ్బరాయుడు పాల్గొన్నారు. గొల్లపల్లి నుంచి 20 కుటుంబాలు జమ్మలమడుగు: మైలవరం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అన్నారెడ్డి రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ పెద్దిరెడ్డి, సుదర్శన్రెడ్డిలతో పాటు 20 కుటుంబాలు బుధవారం వైఎస్సార్సీపీలో చేరాయి. శాసనసభ్యుడు డాక్టర్ మూలె సుధీర్రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అదే విధంగా జి.ఉప్పలపాడు గ్రామానికి చెందిన దంపెట్ల రామమోహన్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ధన్నవాడ మహేశ్వరరెడ్డి, వినయ్కుమార్రెడ్డి, చెన్నకేశవరెడ్డి, కొమెర్ల మోహన్రెడ్డి, రామాంజనేయులు యాదవ్, తదితరులు పాల్గొన్నారు. నాగపట్నంలో 30 కుటుంబాలు మైదుకూరు : ఖాజీపేట మండలం పత్తూరు పంచాయతీ నాగపట్నం గ్రామానికి చెందిన సారే రంగయ్య, సారే వెంకటేష్, సారే సుధాకర్, బాలినేని వెంకటయ్య, నల్లగొండ చెన్నప్ప నాయుడు, సూర్య రామ సుబ్బయ్య, నిగినేని రామారావు, దాసరి శ్రీను, సుబ్బారావు, రాజా నాయుడు, పెండ్లిమర్రి గంగాధర్, ప్రసన్న కుమార్, రెడ్డయ్య తదితర 30 కుటుంబాల వారు బుధవారం టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. మైదుకూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ డి.గంగాధర్ రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, రాఘవరెడ్డి, రెడ్యం చంద్రశేఖర్రెడ్డి, మురళీమోహన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
చెట్టుపై నుంచి జారిపడి జీవిత ఖైదీ మృతి
కడప అర్బన్ : కడప నగర శివారులోని పురుషుల కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఉప్పర రంగయ్య అలియాస్ పూజారి (48)(సిటి నెం.7925) బుధవారం ఉదయం డైరీ షెడ్పై కూలిన చెట్టు కొమ్మలు తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడు. కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ఐ.ఎన్.హెచ్. ప్రకాష్ ఫిర్యాదు మేరకు రిమ్స్ సీఐ కె.రామచంద్ర, ఏఎస్ఐ యోగా రాయల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన వివరాలిలా వున్నాయి. సత్యసాయిజిల్లా అగలి మండలం హనుమాన్ పల్లెకు చెందిన ఉప్పర రంగయ్య అలియాస్ పూజారి(48) 2019 ఫిబ్రవరి, 2 నుంచి హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. అతని ప్రవర్తనను బట్టి సెమీ ఓపెన్ ఎయిర్ జైల్ ఖైదీ బృందంలో ఉంటున్నారు. మిగతా ఖైదీలతో కలిసి కడప కేంద్ర కారాగారం ఆవరణలో పాల డైరీ, గార్డెనింగ్ పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో కేంద్రకారాగారం ఆవరణలో వున్న డైరీ షెడ్పై పెద్ద చెట్టు విరిగి కూలిపోయింది. దీంతో కొమ్మలను తొలగించేందుకు జీవిత ఖైదీ రంగయ్య, అతని బృందం చెట్టుపైకి ఎక్కారు. కొమ్మ జారి షెడ్పై పడటం, రేకు విరిగిపోవడంతో పూజారి కిందపడిపోయారు. కడప ప్రభుత్వ సర్వజన అసుపత్రి (రిమ్స్)కు తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 10:56 గంటలకు అతను మృతి చెందాడు. మృత దేహాన్ని కడప రిమ్స్ మార్చురీలో వుంచారు. కేంద్ర కారాగారం అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై గురువారం కడప ఆర్డీఓ ప్రాథమికంగా మెజిస్టీరియల్ విచారణ తరువాత రిమ్స్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. కడప రిమ్స్ పీఎస్లో కేసు నమోదు -
నాణ్యమైన స్టడీ మెటీరియల్తో దూరవిద్య
వైవీయూ : అత్యంత నాణ్యమైన సిలబస్తో యోగివేమన విశ్వ విద్యాలయం దూరవిద్య అందిస్తోందని సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంచాలకులు ఆచార్య కె.కృష్ణారెడ్డి తెలిపారు. తన ఛాంబర్లో బుధవారం ఆయన సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైవీయూ దూరవిద్యకు సంబంధించి మొదటి సెమిస్టర్ స్టడీ మెటీరియల్ 48 టెక్ట్ బుక్స్ రూపకల్పన జరిగిందని తెలిపారు. 2, 3, 4 సెమిస్టర్ల స్టడీ మెటీరియల్ తయారీ గురించి చర్చించారు. ప్రతి విద్యార్థి డిగ్రీ, పీజీ రెగ్యులర్ కోర్సులతో పాటు దూరవిద్య కోర్సులను ఓకే అకడమిక్ ఇయర్లో చదువు కోవచ్చన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ ఆచార్య ఎస్.రఘునాథ్ రెడ్డి, డాక్టర్ శ్రీధర్ బాబు, తప్పెట రాంప్రసాద్ రెడ్డి, ఆచార్య పుత్తా పద్మ, ఆచార్య కంకణాల గంగయ్య, ఆచార్య ఎన్.ఈశ్వర రెడ్డి, ఆచార్య పి.రమాదేవి, విజయభారతి, అనిత పాల్గొన్నారు. -
ఈత సరదా ప్రాణం తీసింది
లింగాల : లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో ఈత నేర్చుకోవాలని చిన్నారి సరదా పడగా... ప్రమాదవశాత్తూ ఆమె ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తోట రవీంద్రారెడ్డి, మంజుల దంపతుల కుమార్తె మహిత12) బుధవారం గ్రామంలోని చెరువులో ఈత నేర్చుకునేందుకు తోటి పిల్లలతో కలిసి వెళ్లింది. నడుముకు ఖాళీ క్యాన్ కట్టుకుని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలో నడుముకు ఉన్న క్యాన్ ఊడిపోయింది. అక్కడున్న పిల్లలు, పెద్దలు చూస్తుండగానే భయానికి గురైన మహిత నీటిలో మునగగానే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ షాక్తో ఎనుములు మృతి సింహాద్రిపురం : మండలంలోని కోరకుంటపల్లె గ్రామానికి చెందిన పాడి రైతు రామకృష్ణ యాదవ్ నాలుగు ఎనుములు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఎనుములను తోటలో వదలగా మేత మేస్తున్న సమయంలో భూమి మీద ఎర్త్ లైన్ తగిలి నాలుగు ఎనుములు మృత్యువాత పడ్డాయి. రూ.2.50 లక్షలు నష్టపోయినట్లు రైతు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యమే కారణమని, నష్టపరిహారం అందించకపోతే విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నాకు పూనుకుంటామని గ్రామస్థులు హెచ్చరించారు. -
అండగా ఉంటాం.. అధైర్య పడవద్దు..
కమలాపురం : ఎవరి బెదిరింపులకు భయపడకుండా ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, నియోజకవర్గ నాయకుడు సాయినాథ శర్మ తెలిపారు. మండలంలోని పెద్దచెప్పలిలో సాయినాథశర్మ వర్గానికి చెందిన నాగరాజాచారి, గౌజ్లాజం, షుకూర్, నామాజ రాజ, రమేష్, మహరాజ్, లక్షుమయ్య, ఏసురత్నం, శ్రీను,షక్షావలి, సాదక్వలి తదితర 300 కుటుంబాలు బుధవారం వైఎస్సార్సీపీలో చేరాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ పెద్దచెప్పలికి తాగునీరు అందించే విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకున్నామన్నారు. నియోజకవర్గంలో 6880 కోట్లతో అభివృద్ధి పనులు జరుగతున్నాయన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కు ఓటు వేసి తనను, ఎంపీ అవినాష్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. సాయినాథ శర్మ మాట్లాడుతూ అభిమానంతో ఓటు సంపాదించుకోవాలేగాని, బెదిరింపు ధోరణిలో కాదన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు కురుక్షేత్రం లాంటివన్నారు. కమలాపురం ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి హ్యాట్రిక్ సాధించడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట క్రిష్ణ, మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఎల్లమ్మ ఆలయం, శివాలయంలో ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కమలాపురంలో: కమలాపురం పట్టణంలో హార్టికల్చర్ స్టేట్ అడ్వైజర్ సంబటూరు ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో మేసీ్త్ర గంగన్నతో సహా 20 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. వారికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈడిగపల్లెలో... ఈడిగపల్లెలో నియోజకవర్గ నాయకుడు సాయినాథ శర్మ ఆధ్వర్యంలో ఈడిగపల్లెకు చెందిన జగన్నాథరెడ్డి, క్రిష్ణయ్య, సూర్య నారాయణరెడ్డి, డి రెడ్డయ్య, రమణయ్య, భద్రయ్య, మురళీబాబు, గంగాధర్, సునీల్, శివారెడ్డి, నారాయణరెడ్డి, కె. చిన్నరెడ్డయ్య, పెద్ద రెడ్డయ్య తదితర 30 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. వారిని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మనోహర్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, తిరుపాలయ్య పాల్గొన్నారు. పెద్దచెప్పలిలో 300 కుటుంబాల చేరిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, సాయినాథ శర్మ -
10న ఏపీఎల్ సీజన్–3 క్రికెట్ ఎంపికలు
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 10వ తేదీన ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్–3కి సంబంధించిన క్రికెట్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్రెడ్డి, సౌత్జోన్ కన్వీనర్ ఎ.రెడ్డిప్రసాద్ తెలిపారు. ఏపీఎల్ సీజన్–3లో భాగంగా జూన్, జూలై నెలల్లో మూడు మ్యాచ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎంపికల్లో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పేరు, పూర్తి వివరాలను ఏపీఎల్ప్లేయర్ రిజిస్ట్రేషన్ లింకులో సంబంధిత ధృవీకరణ పత్రాలతో ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. -
వైభవంగా అష్టోత్తర కలశాభిషేకం
వల్లూరు : పుష్పగిరి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో అష్టోత్తర కలశాభిషేకాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు అఖిల్ దీక్షితులు ఉదయం స్వామికి విశ్వక్సేన పూజ, పంచామృతాభిషేకం, పారమాత్మక హోమం నిర్వహించారు. 108 కలశాలను ఏర్పాటుచేసి నదీజలాలు, విశేష ద్రవ్యాలతో నింపి 108 మంది దేవతలను ఆవాహన చేశారు. అనంతరం కలశాలలోని ద్రవ్యాలతో శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఉత్సవ మూర్తులను అభిషేకించారు. రాత్రి యాళీ వాహనంపై స్వామిని కొలువుంచి గ్రామోత్సవం జరిపారు. వైద్యనాథేశ్వర స్వామి ఆలయంలో ఽఅర్చకులు శ్రీనివాస మూర్తి స్వామికి రుద్రాభిషేకం, శ్రీచక్ర సహిత కామాక్షీ దేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపారు. తిరుచ్చి వాహన సేవ నిర్వహించారు. కాగా .. గురువారం ఉదయం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో చందనోత్సవం నిర్వహిచనున్నారు. యాళీ వాహనంలో దర్శనమిస్తున్న చెన్నకేశవుడు -
చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
పులివెందుల/లింగాల: తన అక్కలైన షర్మిల, సునీతలు చంద్రబాబు ట్రాప్లోపడి తమపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి చెప్పారు. 2021 నుంచి వారిద్దరూ తనను మానసికంగా ఎంతో ఇబ్బందిపాల్జేశారన్నారు. చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ, ఎల్లో మీడియా ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదివి ఇష్టమొచ్చినట్లు నన్ను, జగనన్నను తిడుతున్నారని.. అయినా, వారిపట్ల తనకెలాంటి కోపంలేదని చెప్పారు. వైఎస్ వివేకాను హత్యచేశానన్న వ్యక్తిని వారు ప్రోత్సహిస్తున్నారని, అతడు పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నా.. అతడిని ఓడించాలని ఒక్కమాట కూడా అనడంలేదన్నారు. హంతకుడు అప్రూవర్గా మారడంతో అతడినే సోదరుడిగా భావిస్తున్నారన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండల కేంద్రంలో అవినాశ్రెడ్డి రోడ్ షో, బస్టాండులో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..సభ్యతతో ప్రతి విమర్శలు చేయడంలేదు..వారిద్దరూ తనను ఎన్ని విమర్శలు చేసినా అదే రీతిలో తాను చేయగలను. కానీ, సభ్యత, సంస్కారాలవల్ల చేయడంలేదు. మా నాన్నను తప్పుడు ఆరోపణలతో 385 రోజులు జైల్లో పెట్టారు. ఎవరికీ ద్రోహం చేయలేదు, మనకెందుకీ శిక్ష అని అంటూ ఆయన బాధపడ్డారు. దేవుడి దయ, మీ ఆశీస్సులు ఉన్నంతవరకు మేం ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటాం. ఇక దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిల మరణాలకు కారణం ఎవరు? ఎక్కడ కుట్ర జరిగింది? ఎవరికి మేలు చేసేందుకు ఇలాంటివి చేశారన్న నిజాలను ఎన్నివేల అడుగుల లోతున దాచిపెట్టి ఉన్నా బయటికి వస్తాయి. వారికి కడప కోర్టు జరిమానా..వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చి టీడీపీకి లబ్ధిచేకూర్చాలని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ ఇచ్చారు. ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్ అవినాశ్రెడ్డిని ఏమీచేయలేరు. ఇక కొద్ది గంటలముందే కడప కోర్టు వీరుచేసే దుష్ప్రచారాలకు జరిమానా విధించింది. కేసు ట్రయిల్కు రాకముందే మీరెలా మాట్లాడతారని షర్మిలక్కకు, సునీతక్కకు, వారి సోదరుడు బీటెక్ రవికి రూ.10 వేలు జరిమానా విధించింది.న్యాయస్థానాలు కూడా వీరు చేసేది తప్పని చెబుతున్నాయి. వీరి టార్గెట్ కేవలం వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే. నా నిజాయితీని నూరు శాతం నిరూపించుకుంటా. ఇక ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లువేసి, వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, ఎంపీ అభ్యర్థినైన నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మా కష్టకాలంలో మీరు చూపిన ప్రేమ నేను జీవితాంతం మర్చిపోలేను. -
షర్మిల, సునీత, బీటెక్ రవిలకు కడప జిల్లా కోర్టు షాక్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: అడ్డగోలు ఆరోపణలు, దుష్ప్రచారంతో మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును రాజకీయ లబి్ధకోసం వాడుకుంటున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, టీడీపీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవిలకు కడప జిల్లా కోర్టు మరోసారి గట్టి షాక్ ఇచ్చింది.వివేకా హత్యకేసు సీబీఐ కోర్టు ముందు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఆ కేసు గురించి మాట్లాడొద్దని, దుష్ప్రచారం చేయవద్దని చంద్రబాబునాయుడు, లోకేశ్, షర్మిల, సునీత, బీటెక్ రవి, పవన్కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు ఆ పార్టీల కేడర్ను ఆదేశిస్తూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసేందుకు కోర్టు నిరాకరించింది.మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ షర్మిల, సునీత, బీటెక్ రవి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. కోర్టు ముందు పెండింగ్లో ఉన్న వివేకా హత్యకేసు గురించి మాట్లాడటానికి వీల్లేదని పునరుద్ఘాటించింది. షర్మిల, సునీత, బీటెక్ రవిలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు ఖర్చుల కింద విధించింది. ఆ మొత్తాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా జడ్జి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. విచారణను జూన్ 19కి వాయిదా వేశారు. తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రోద్బలంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై షర్మిల, పురందేశ్వరి, పవన్కళ్యాణ్, లోకేశ్, వివేకా కుమార్తె సునీతారెడ్డి తదితరులు చేస్తున్న దు్రష్పచారంపై వైఎస్సార్సీపీ కడప జిల్లా కోర్టులో దావా వేసింది. తమ పార్టీతోపాటు పార్టీ అధ్యక్షులు జగన్, కడప ఎంపీ అభ్యర్థితోపాటు పార్టీకి చెందిన వారిపై పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా షర్మిల, చంద్రబాబు, సునీతారెడ్డిలను నిరోధించాలంటూ వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు కె.సురే‹Ùబాబు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారించిన జిల్లా కోర్టు.. వైఎస్ వివేకా హత్యకేసు విచారణ హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్లో ఉన్నందున వైఎస్ అవినాశ్రెడ్డిని హంతకుడిగా ఆరోపిస్తూ చేస్తున్న దు్రష్పచారాన్ని ఆపాలని చంద్రబాబు, షర్మిల, సునీత, పవన్కళ్యాణ్, పురందేశ్వరి, బీటెక్ రవి తదితరులను ఆదేశిస్తూ గతనెలలో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.అవినాశ్రెడ్డిని వైఎస్ జగన్మోహన్రెడ్డి రక్షిస్తున్నారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆపాలని తేలి్చచెప్పింది. జగన్మోహన్రెడ్డి, అవినాశ్రెడ్డిలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశించింది.కడప కోర్టులోనే తేల్చుకోవాలన్న హైకోర్టు ధర్మాసనం జిల్లా కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలంటూ షర్మిల, సునీత, బీటెక్ రవి హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ కడప జిల్లా కోర్టులో వేర్వేరుగా అనుబంధ పిటిషన్లు వేశారు. షర్మిల తదితరుల వ్యాజ్యాలపై విచారించిన హైకోరుŠట్ ధర్మాసనం కడప కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేత కోసం కడప కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. షర్మిల తదితరుల అనుబంధ వ్యాజ్యాలపై కడప జిల్లా కోర్టు మూడు రోజులుగా విచారిస్తోంది. వైఎస్సార్సీపీ తరఫున పిటిషన్ వేయడంపై షర్మిల తదితరుల న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తమ వ్యాఖ్యల వల్ల నష్టం వాటిల్లిందని భావిస్తే జగన్మోహన్రెడ్డి లేదా అవినాశ్రెడ్డి పిటిషన్ దాఖలు చేయాలే తప్ప పార్టీ జిల్లా అధ్యక్షుడు కాదని చెప్పారు. ఈ వాదనలను వైఎస్సార్సీపీ న్యాయవాదులు ఎం.నాగిరెడ్డి, కె.సుదర్శన్రెడ్డి తోసిపుచ్చారు. తాము ఇచ్చిన ఆధారాలతో సంతృప్తి చెందినందునే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని చెప్పారు. చంద్రబాబు, షర్మిల, సునీత తదితరుల తప్పుడు ఆరోపణలు ప్రజల్లోకి వెళితే ఓట్లపరంగా వైఎస్సార్సీపీకి నష్టం కలుగుతుందని, అందుకే పార్టీ తరఫున పిటిషన్ వేశామని తెలిపారు. వివేకా హత్యకేసు గురించి మాట్లాడవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తరువాత కూడా షర్మిల తదితరులు ఆ కేసు గురించి మాట్లాడారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.ఇరుపక్షాల వాదనలు ముగియడంతో బుధవారం జిల్లా జడ్జి కోర్టు హాల్లోనే ఉత్తర్వులను వెలువరించారు. నాగిరెడ్డి, సుదర్శన్రెడ్డి వాదనలతో జడ్జి ఏకీభవించారు. మధ్యంతర ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ షర్మిల ఆ కేసు గురించి మాట్లాడారన్న వారి వాదనను పరిగణనలోకి తీసుకున్నారు. మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేతకు నిరాకరిస్తూ.. షర్మిల, సునీత, బీటెక్ రవి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేశారు. -
షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జిల్లా గుర్రాలచింతలపల్లెకు వచ్చిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను స్థానికులు అడ్డుకున్నారు. అనిల్కుమార్ స్నేహితుడినంటూ కొండలరావు అనే వ్యక్తి తమను మోసం చేశాడని మండిపడ్డారు. మైనింగ్ వాహనాలు బాడుగకు తీసుకొని.. దాదాపు రూ.4 కోట్ల వరకు బకాయి పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డబ్బుల గురించి కొండలరావును ప్రశ్నిస్తే ‘ఇది షర్మిల కంపెనీ’ అంటూ బెదిరిస్తున్నాడని వాపోయారు. వెంటనే తమ బకాయి డబ్బులివ్వాలని నిలదీశారు. వివరాలు.. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం చాబలి గ్రామంలో బెనిటా ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరిట 163 ఎకరాల్లో ఐరన్ ఓర్ లీజు లభించింది.వేణుగోపాల్ డైరెక్టర్గా ఉన్న ఆ కంపెనీ 203, ఆదిత్య ఎలెట్, బి.ఎస్.మక్తా, సోమాజిగూడ, హైదరాబాద్ అడ్రస్లో ఉంది. ఏపీఆర్ 2278 నంబర్తో మంజూరైన లీజు గడువు 2024 నవంబర్ 9వ తేదీ వరకు ఉంది. ఈ ఐరన్ ఓర్ గనుల్లో పదేళ్లుగా జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను స్థానికంగా కొండలరావు అనే వ్యక్తి చూసేవాడు. అతను షర్మిల భర్త అనిల్కుమార్కు స్నేహితుడిగా చెప్పుకుంటూ.. స్థానికంగా పరిచయాలు పెంచుకున్నాడు. ఇక్కడి వారి నుంచి టిప్పర్లు, ట్యాంకర్లు, బుల్డోజర్లు తీసుకొని మొదట్లో నెలవారీ బాడుగలు సక్రమంగా చెల్లించేవాడు. ఆ తర్వాత బకాయిలు పెండింగ్ పెడుతూ వచ్చాడు. అవి కోట్లాది రూపాయలకు చేరుకోవడంతో స్థానికులు డబ్బుల గురించి కొండలరావును అడగడం మొదలుపెట్టారు. అతను పట్టించుకోకపోవడంతో రెండేళ్ల క్రితం మాచునూరు గ్రామస్తులు కంపెనీ ప్రాంగణంలో ధర్నా చేశారు. అప్పట్లో సగం డబ్బులు చెల్లించి.. మిగిలినవి తర్వాత ఇస్తానని చెప్పాడు. అనంతరం ఆ డబ్బుల గురించి నిలదీయగా.. ‘షర్మిల కంపెనీ ఇది. తమాషా చేస్తున్నారా.. డబ్బులిస్తాం. వెయిట్ చేయండి’ అంటూ బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఆరు నెలల నుంచి కొండలరావు కంపెనీ వైపు రావడమే మానేశాడు. ట్రాన్స్పోర్ట్, టిప్పర్లు, ట్యాంకర్లు, బుల్డోజర్లు.. ఇలా బాడుగకు ఇచ్చిన అందరివీ కలిపి దాదాపు రూ.4 కోట్లకు పైబడి ఎగ్గొట్టినట్లు బాధితులు వాపోయారు. మాకు న్యాయం చేయండి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చి న షర్మిలను బాధితులు గౌరీశంకర్రెడ్డి, మహేశ్వరరెడ్డి నిలదీశారు. ఆమె స్పందిస్తూ.. తనకు ఆ కంపెనీతో సంబంధం లేదని స్పష్టం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. షర్మిల, అనిల్ పేర్లు చెప్పడం వల్లే ఇన్నాళ్లు ఆగాంబెనిటా మైన్స్లో టిప్పర్లు, బుల్డోజర్లు, ట్యాంకర్లు బాడుగకు పెట్టుకొని బకాయిలివ్వలేదు. 6 నెలలుగా కొండలరావు ఇక్కడికి రావడం లేదు. వైఎస్ కుటుంబానికి విధేయులమైన మేము షర్మిల, అనిల్ వల్లే ఇంతకాలం కొండలరావు ఏం చెప్పినా భరించాం. అదే విషయాన్ని షర్మిల దృష్టికి తీసుకెళ్లాం. నా ఒక్కడికే రూ.6.5 లక్షలు చెల్లించాల్సి ఉంది.మహేశ్వరరెడ్డితో కలిపి రూ.11 లక్షలు ఇవ్వాలి. మాచునూరు, ఆర్వేటిపల్లె చాబలి, రాజంపేట, ఇతర ట్రాన్సుపోర్టర్లు అందరికీ బకాయి పెట్టారు. దాదాపు రూ.4 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉంది. షర్మిల, అనిల్ పేర్లు చెప్పి బెదిరించారు. లేదంటే మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకొని బకాయిలు రాబట్టుకునేవాళ్లం. – గౌరీశంకర్రెడ్డి, గుర్రాలచింతలపల్లె -
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు షాక్ తగిలింది. పెండ్లిమర్రి బెనీటమైన్స్ బాధితులు షర్మిలను నిలదీశారు. తమ వాహనాలకు రూ.6 లక్షల అద్దె చెల్లించలేదని నిలదీశారు. మహేశ్వర్రెడ్డి, గౌరీశంకర్రెడ్డి షర్మిల ప్రచారాన్ని అడ్డుకున్నారు. డబ్బులు చెల్లించాలని బాధితులు నిలదీయగా.. బెనీటమైన్స్కు, తనకు సంబంధం లేదని చెప్పి షర్మిల వెళ్లిపోయారు.మరో వైపు, పీసీసీ చీఫ్ షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోమారు షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల హైకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయగా, కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. సునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాను ర్టు విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్కు కట్టాలని కడప కోర్టు పేర్కొంది. -
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పీసీసీ చీఫ్ షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోమారు షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల హైకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయగా, కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. సునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాను ర్టు విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్కు కట్టాలని కడప కోర్టు పేర్కొంది. -
మా అక్కలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడతా: వైఎస్ అవినాష్
సాక్షి, వైఎస్సార్: టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. వీరితో పోరాడే శక్తిని ప్రజలే నాకు ఇస్తారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ప్రతీరోజు నన్ను తిట్టడమే పనిగా పెట్టుకుని పచ్చ మీడియాకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. 2021 తర్వాత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నోటికి ఎంత మాట వస్తే అంత వరకు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్లు అలా మాట్లాడుతుంటే కోపం కంటే ఎక్కువగా బాధేస్తోంది. వాళ్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు.రెండున్నరేళ్లు ఎవరూ మాట్లాడలేదు. వాచ్మెన్ రంగన్నకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేసినా ఏమీ మాట్లాడలేదు. రెండున్నరేళ్ల తర్వాత రంగన్న మాట్లాడుతున్నాడు. ఓవైపు తానే చంపానని చెబుతున్న దస్తగిరి గురించి వీరద్దరూ ఏమీ అనడం లేదు. అతను ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి బయట తిరుగుతున్నాడు. అన్నీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు మాటలు చెబుతున్నారు.వైఎస్ భాస్కర్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉండి ఏ పని కావాలన్నా చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టించారు. నా తప్పు లేకపోయినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా గట్టిగా నిలబడతాం. మీ అందరి మద్దతుతో గెలిచి తీరుతాను. ఇప్పుడు తిట్టిన వాళ్లే మళ్లీ క్షమాపణలు చెప్పాలి.. అది నేను వినాలి. వివేకం చిన్నాన్నను చంపిన వాస్తవం వెలుగులోకి వస్తుంది. ఈ కుట్రలు ఎవరో చేశారో తప్పకుండా బయటకు వస్తుంది.దివంగత వైఎస్సార్ తాను బ్రతికినంత కాలం.. టీడీపీ, ఈనాడుతో పోరాడారు. అటువంటి వారితో ఇప్పుడు వీరిద్దరూ చేతులు కలిపారు. మీరు వాళ్ల వారసులా.. లేక వైఎస్సార్ వారసులా?. నన్ను కనుమరుగు చేయాలంటే దేవుడు ఒప్పుకోడు. మా అక్కలతో పోరాడే శక్తిని ప్రజలే ఇస్తారు. వైఎస్సార్సీపీ ఓట్లు చీల్చి టీడీపీకి లబ్ధి చేకూర్చాలనేది షర్మిలకు కాంగ్రెస్ పెట్టిన టాస్క్. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరిది నాటకమో.. ఎవరు నిజమో ప్రజలే నిర్ణయిస్తారు అని కామెంట్స్ చేశారు. -
నర్రెడ్డి సునీత, రాజశేఖర్రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
పులివెందుల: నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి చాలా నీచంగా మాట్లాడుతున్నారని వైఎస్ వివేకానందరెడ్డి వద్ద పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నర్రెడ్డి దంపతులు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినవనీ అబద్ధాలేనని తెలిపారు. కడుపుకు అన్నం తినేవాళ్లెవరూ ఇలా మాట్లాడరన్నారు. భార్యాభర్త రోజుకో అబద్ధపు స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నారు. నర్రెడ్డి బ్రదర్స్ నాటకాలాడుతున్నారని చెప్పారు. వైఎస్ వివేకా రక్తపు వాంతులతో చనిపోయాడని తాను నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో చెప్పలేదన్నారు. రూము మొత్తం రక్తపు మరకలున్నాయని, తలపైన గాయం ఉందని, బాడీ మొత్తం రక్తంలో ఉందని, సైడు వాకిలి, బెడ్ రూము వాకిలి తెరచి ఉన్నాయని, ఏసీ ఆన్లో ఉందని చెప్పానని తెలిపారు. రక్తపు వాంతులని ఎర్ర గంగిరెడ్డి అనగా, ఇంత రక్తం ఉంటే వాంతులంటావేమిటని తాను ఆయనతో వాదించానన్నారు. అలాంటిది రాజశేఖర్రెడ్డికి రక్తపు వాంతులని ఎలా చెబుతానని అన్నారు. అలాగే తాను వైఎస్ వివేకా లెటర్ను దాచిపెట్టడానికి ప్రయత్నం చేశానన్నారని, అదీ అబద్ధమేనని తెలిపారు. లెటర్ గురించి తాను రాజశేఖర్రెడ్డికి ఫోన్లో చెప్పగా ఆయనే దాచమన్నారని చెప్పారు. పోలీసులతో సమస్య కదా అని తాను అంటే ఆ విషయం ఆయనే చూసుకుంటానని చెప్పారన్నారు.అవినాశ్రెడ్డి తనను మేనేజ్ చేశారనడం నిజం కాదన్నారు. నర్రెడ్డి దంపతులే తనను మేనేజ్ చేయాలని చూసి విఫలమయ్యారని చెప్పారు. లెటర్ దాచిపెట్టమని చెప్పిన వారిని కేసులో పెడతారని, కానీ వీరు అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నాయకులతో కలిసి పోలీసులను మేనేజ్ చేసి తనను, మరో అమాయకుడైన ప్రకాష్ను కేసులో ఇరికించారన్నారు. తనది చిన్న ప్రాణం కాబట్టి ఇరికించారని, వారి కారణంగా తాను ఉద్యోగానికి 9 నెలలు సస్పెన్షన్కు గురయ్యానని, ప్రమోషన్, పాస్పోర్ట్ రెన్యువల్ ఆగిపోయాయన్నారు. తాను ఇప్పుడు 20 శాతం విషయాలే చెబుతున్నానని, మరలా మిగిలిన విషయాలు చెబుతానన్నారు.తాను వైఎస్ వివేకా దగ్గర 37 సంవత్సరాలు ఏ జీతం తీసుకోకుండా పని చేశానని తెలిపారు. వివేకాను తాను చూసుకున్నట్లు వారి ఇంట్లో వారు కూడా చూసుకోలేదన్నారు. వివేకా తన ముందరే ఎన్నోసార్లు వారిని ఛీ కొట్టారని తెలిపారు. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్రెడ్డి వారి బావ వివేకా ద్వారా కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని, అయినా వారిలో ఆశ చావలేదన్నారు. వివేకా రెండో వివాహం కారణంగా వారికి ఆయనతో తీవ్ర మనస్పర్థలు వచ్చాయన్నారు. వివేకా రెండో భార్య షమీమ్ కుమారుడికి ఆస్తులు పోకుండా రాజకీయంగా వివేకా ద్వారా ఎదగాలని విఫలమై ఈ రోజు వేరేవారిపై నిందలు వేస్తున్నారన్నారు. గతంలో డ్రైవర్గా దస్తగిరిని తొలగిస్తేనే పులివెందుల వస్తానని వివేకాకు రాజశేఖర్ గట్టిగా చెప్పడంతో ఆయన తొలగించారన్నారు. ఇప్పుడు అదే దస్తగిరిని ముందర పెట్టుకుని వీరు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. రామ్సింగ్ చెప్పినట్లు వినాలని సునీత బెదిరించారుఓసారి సునీత దంపతులు తనను హైదరాబాద్కు పిలిపించుకొని, రామ్సింగ్ చెప్పినట్లు వికపోతే కేసులో ఇరుక్కుంటావని బెదిరించారన్నారు. తాను అబద్ధం చెప్పనని కరాఖండిగా చెప్పానన్నారు. ఆ సమయంలో కృష్ణారెడ్డి మన మాట వినకపోతే నువ్వు కేసులో ఇరుక్కుంటావని రాజశేఖర్తో సునీత అన్నారని చెప్పారు. దీనికి అర్థమేమిటో మీడియా సోదరులే ఆలోచించుకోవాలని అన్నారు. ఎప్పటికైనా ఈ కేసులో రాజశేఖర్ జైలుకు వెళ్లక తప్పదన్నారు.వారి ముగ్గురు పేర్లు చెప్పాలని రామ్సింగ్ కొట్టాడుఢిల్లీలో సీబీఐ అధికారి రామ్సింగ్ నెలరోజుల పాటు తనను తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడన్నారు. హత్యలో వైఎస్ అవినాశ్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, శంకర్రెడ్డి హస్తం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని తీవ్రంగా కొట్టేవాడన్నారు. ఎంతకీ తాను ఒప్పుకోకపోవడంతో వదిలేశారన్నారు. ఆతర్వాత ఒకరోజు రామ్సింగ్ వాట్సప్ కాల్ చేసి తన కుమారుడిని తీసుకొని కడపకు రమ్మని చెప్పాడన్నారు.తామిద్దరం మరుసటిరోజు రామ్సింగ్ వద్దకు వెళ్లగా, వివేకా హత్యలో అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డి, శంకర్రెడ్డిల హస్తం ఉన్నట్లు చెప్పాలంటూ తన కుమారుడి ఎదుటే కట్టెతో కొట్టాడన్నారు. దస్తగిరి, రంగన్న చెప్పినట్లు విన్నారని, వారిని సేవ్ చేశామని, నువ్వు వినకపోతే కేసులో ఇరికిస్తామని చెప్పాడన్నారు. తన బెయిల్ రద్దు చేసి మళ్లీ జైలుకు పంపిస్తామని బెదిరించాడన్నారు. తాను అబద్ధం చెప్పనని గట్టిగా చెప్పడంతో పంపించేశాడన్నారు. కృష్ణారెడ్డి మాట వినలేదని సునీత దంపతులకు రామ్సింగ్ చెప్పగా.. తన కుమారుడితో వివాహం కుదుర్చుకున్న గుంటూరుకు చెందిన మా వియ్యంకుడికి సునీత ఫోన్ చేసి కృష్ణారెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేయిస్తామని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని, వివాహం రద్దు చేసుకోవాలని బెదిరించారని, దీంతో వారు భయపడి వివాహం రద్దు చేసుకున్నారని తెలిపారు.నాకేదైనా జరిగితే వారిదే బాధ్యతతనకు ఇప్పటికీ కొంతమంది నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వారి పేర్లు త్వరలో బయటపెడతానన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉందని, తనకు ఏదైనా జరిగితే సునీత, రాజశేఖర్, శివప్రకాష్రెడ్డిలే బాధ్యులవుతారని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు స్పందించకపోవడంతో కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నానన్నారు. కేవలం రాజకీయ ఎదుగుదల కోసం సునీత దంపతులు అవినాశ్రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని కృష్ణారెడ్డి తెలిపారు. -
టీడీపీ ప్రచారంలో రాష్ట్రీయ సమాజ్ దళ్(ఆర్) అభ్యర్థి
చాపాడు: తెలుగుదేశం పార్టీ మైదుకూరు నియోజకవర్గ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కోసం నిర్వహించే ఎన్నికల ప్రచారంలో రాష్ట్రీయ సమాజ్ దళ్(ఆర్) పార్టీ అభ్యర్థి పీవీ సుధాకర్రెడ్డి పాలుపంచుకుంటున్నారు. టీడీపీలో తానే అంతా అనే విధంగా పార్టీలో చేర్పులు, పార్టీ ప్రచారంలో సుధాకర్రెడ్డి తలమునకలయ్యారు. మండలంలోని అన్నవరం గ్రామానికి చెందిన పీవీ సుధాకర్రెడ్డి ఈ ఎన్నికలలో రాష్ట్రీయ సమాజ్ దళ్(ఆర్) పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఈయనకు ఎన్నికల కమిషన్ ఆపిల్ గుర్తును కేటాయించింది. అయితే ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కుతూ మంగళవారం మండలంలోని ఖాదర్పల్లె గ్రామంలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచారంలో యథేచ్చగా పాల్గొని తమ పార్టీని పక్కన పెట్టి టీడీపీకి ఓటు వేయాలని కోరారు. ఇదే క్రమంలో గ్రామంలో షఫీ అనే వ్యక్తిని టీడీపీలో చేరుతుండటంతో రాష్ట్రీయ సమాజ్ దళ్(ఆర్) అభ్యర్తి అయిన సుధాకర్రెడ్డి స్వయంగా టీడీపీ కండువా షఫీ మెడలో వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. కాగా సుధాకర్ రెడ్డి టీడీపీ చాపాడు మండల అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీకి రాజీనామా చేయకుండా రాష్ట్రీయ సమాజ్ దళ్(ఆర్) అభ్యర్థిగా పోటీలో ఉండడంపై ఓటర్లు విస్తుపోతున్నారు. ఇదేం తీరు అని చర్చించుకుంటున్నారు. ఖాదర్పల్లెలో ప్రచారంతో పాటు వ్యక్తిపై టీడీపీ కండువా వేసిన వైనం -
రైతన్నలకు విత్తన రాయితీ
వైఎస్సార్జిల్లాలో విత్తన రాయితీలు ఇలా.. సంవత్సరం విత్తన పంపిణీ రైతుల ప్రభుత్వం అందచేసిన (క్వింటాళ్లలో) సంఖ్య రాయితీ (కోట్లలో) 2019–20 95661.73 114633 34.04 2020–21 116050.93 159211 41.99 2021–22 93040.31 119869 36.27 2022–23 46155.69 44976 3.75 2023.24 83696.82 75506 31.21 కడప అగ్రికల్చర్: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నలకు ఏ కష్టం రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆర్బీకే వ్యవస్థకు శ్రీకారం చుట్టి అన్నదాత ముంగిటే సంక్షేమ ఫలాలు అందిచింది. ఈ క్రమంలో ఖరీఫ్, రబీలలో రైతులు తమ పంటలసాగుకు విత్తనాల కోసం ఏరకమైనా ఇబ్బందులు పడుకుండా ఉన్న ఊరు దాటకుండా ఊరిలోని రైతు భరోసా కేంద్రం వేదికగా సకాలంలో రాయితీ విత్తనాలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా వేరుశనగ, శనగలు, కందులు పచ్చిరొట్ట విత్తనాలు, పెసలు తదితర విత్తనాలను ఐదేళ్లలో 5,14,195 మంది రైతులకు రూ.147.26 కోట్లు మేర సబ్సిడీని ప్రభుత్వం అందచేసింది. దీంతోపాటు 4.43 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను రైతులకు అందచేసింది. ఇలా సకాలంలో రైతులకు విత్తనాలను పంపిణీ చేయడంతో లక్షల ఎకరాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలను సాగు చేసుకునేందుకు వీలు కలిగింది. దీంతో అన్నదాతలు ఈ ఐదేళ్లలో వ్యవసాయాన్ని పండగలా చేసుకున్నారు. గతంలో పోరాటమే.... చంద్రబాబు హయాంలో విత్తనాలు కావాలంటే పెద్దపోరాటమే చేయాల్సిన పరిస్థితి నెలకొనేది. మారు మూల గ్రామాల నుంచి కిలోమీటర్ల దూరంలో ఉండే మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన విత్తన పంపిణీ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎర్రటి ఎండలో బారులు తీరితేకానీ రైతులకు కావాల్సిన విత్తనాలు దొరికేవి కాదు. ఒక్కోసారి విత్తనాలు దొరక్క పంపిణీ కేంద్రాలకు వేకువజామునే పనులన్నీ వదులుకుని చేరుకుని క్యూలైన్లో గంటలు తరబడి నిలబడలేక చెప్పులు, టవళ్లను క్యూలైన్లలో ఉంచి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. వేరుశనగ, శనగ, పచ్చిరొట్టె సబ్సిడీ విత్తనాల పంపిణీ అనగానే రైతులతోపాటు అధికారుల గుండె లు గుబేల్ మనే పరిస్థితి నెలకునేది. కానీ 2019 నుంచి ఆ పరిస్థితి లేదు. విత్తనాలు రాగానే రైతులు నేరుగా రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి పేర్లను నమోదు చేసుకుని విత్తనాలను సులభంగా ఇంటికి తెచ్చుకునే పరిస్థితి ఉంది. దీంతోపాటు నాణ్యతలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేయడంతో రైతున్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 40 నుంచి 50 శాతం రాయితీతో విత్తనాలు ఖరీఫ్, రబీకి ముందే పంపిణీ చేయడంతో సకాలంలో పంటలసాగు హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు -
సింహ వాహనంపై దేవదేవుడు
వల్లూరు: పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి కామాక్షీ వైద్య నాధేశ్వర స్వామి సింహ వాహనంపై , శ్రీ చెన్న కేశవ స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. ఉదయం శ్రీ వైద్యనాధ స్వామి ఆలయంలో అర్చకులు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీ కామాక్షీ అమ్మవారికి, శ్రీ చక్రానికి కుంకుమార్ఛన చేశారు. రాత్రి మంగళ వాయిద్యాలు, దివిటీల వెలుగుల మధ్య స్వామి వారి గ్రామోత్సవాన్ని పుష్పగిరి మాడ వీధుల్లో ఘనంగా నిర్వహించారు. కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలను, తోమాల సేవను నిర్వహించారు. శ్రీ లక్షీదేవికి అర్చనలు నిర్వహించారు. యాగశాలార్చన , చతుస్థానార్చన ,నిత్య హోమము, బలిహరణ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సాయంత్రం వివిధ హోమాలను నిర్వహించారు. రాత్రి హంస వాహనం అధిష్టించిన చెన్న కేశవ స్వామి వారిని కొండపై నుంచి పెన్నా నది మీదుగా దివిటీల వెలుగులో గ్రామంలోకి తీసుకుని వచ్చి పుష్పగిరి గ్రామ మాడ వీధులలో మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు సుమంత్ దీక్షితులు, రాజేశ్వర శర్మ , ఉభయ దాతలు పాల్గొన్నారు. పుష్పగిరిలో నేడు అష్టోత్తర కళశాభిషేకం బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం పుష్పగిరి లోని శ్రీ వైద్య నాధేశ్వర స్వామి ఆలయంలో ఉదయం రుద్రాభిషేకం, కుంకుమార్చనలు జరుగుతాయి. రాత్రి స్వామివారికి పురుషాన్మృగ వాహన సేవ ఉంటుంది. శ్రీ లక్ష్మీ చెన్న కేశవ ఆలయంలో ఉదయం అష్టోత్తర కళశాభిషేకం జరుగుతుంది. రాత్రి స్వామి వారికి యాళీ వాహన సేవ ఉంటుంది. -
తెలుగు యువత నాయకుల రాజీనామా
మదనపల్లె : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మదనపల్లె టీడీపీకి గట్టి షాక్ తగిలింది. నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటున్న టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి, మాజీ ఎమ్మెల్యే శోభల ఇద్దరు కుమారులు పార్టీ పదవులకు రాజీనామా చేయడం ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేసింది. రాటకొండ కుటుంబానికి చెందిన తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి రాటకొండ హర్షవర్ధన్రెడ్డి, తెలుగు యువత రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాటకొండ విష్ణువర్ధన్రెడ్డి మంగళవారం తమ రాజీనామా లేఖలను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్చినబాబుకు పోస్టు ద్వారా పంపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ... పట్టణంలో ఇటీవల జరిగిన తెలుగు యువత సమావేశంలో ప్రోటోకాల్ పాటించకుండా, ఇష్టానుసారంగా సమావేశాన్ని నిర్వహించారన్నారు. కార్యక్రమ నిర్వహణ సక్రమంగా చేయకపోగా, అకారణంగా తమపై నిందలు మోపుతూ, అవమానాలకు గురిచేశారన్నారు. 20 ఏళ్లుగా తమ కుటుంబాన్ని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పార్టీ నాయకులు అవమానాలకు గురిచేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ రాజీనామా లేఖలను ఆమోదించి, టీడీపీ తెలుగు యువత పదవుల నుంచి రిలీవ్ చేసి నోట్ పంపాల్సిందిగా కోరారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు
భారత టాప్ రెజ్లర్పై సస్పెన్షన్ వేటు
గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి: సీఎం జగన్
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
మోదీ, రాహుల్ గాంధీలకు ‘బహిరంగ చర్చ’ ఆహ్వానం
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
ఇది అభివృద్ధి కాదా? చంద్రబాబూ: సజ్జల
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement