-
IPL 2024: కండల వీరుడిని ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్ నుంచి అర్దంతరంగా వైదొలిగిన మిచెల్ మార్ష్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్, కండల వీరుడు గుల్బదిన్ నైబ్ను ఎంపిక చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన నైబ్ను డీసీ మేనేజ్మెంట్ 50 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. త్వరలో నైబ్ జట్టుతో చేరతాడని డీసీ ఓ ప్రకటనలో తెలిపింది. నైబ్కు ఇది తొలి ఐపీఎల్.ఆఫ్ఘనిస్తాన్ తరఫున 82 వన్డేలు, 62 టీ20లు ఆడిన నైబ్.. రెండు ఫార్మాట్లలో కలిపి 99 వికెట్లు పడగొట్టి, 2038 పరుగులు చేశాడు. నైబ్ ఖాతాలో ఓ ఐదు వికెట్ల ఘనత, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 33 ఏళ్ల నైబ్ 2019లో ఆఫ్ఘన్ వన్డే జట్టుకు సారధిగా కూడా వ్యవహరించాడు. ఈ ఏడాది జనవరిలో భారత్తో జరిగిన టీ20 సిరీస్లో నైబ్ విశేషంగా రాణించాడు. ఈ సిరీస్లో బంతితో పర్వాలేదనిపించిన నైబ్.. బ్యాటింగ్లో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు.మార్ష్ విషయానికొస్తే.. ఈ ఐపీఎల్ సీజన్లో మార్ష్ తొలి నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఆతర్వాత అతను గాయపడటంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ సీజన్లో మార్ష్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు. డీసీ యాజమాన్యం మార్ష్ను ఈ ఏడాది వేలంలో 6.5 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది.ఢిల్లీ విషయానికొస్తే.. సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఈ జట్టు..ఇప్పుడిప్పుడే విజయాల బాట పట్టింది. గత నాలుగు మ్యాచ్ల్లో మూడింట విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు మరో ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.ఇందులో తప్పక గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. ఢిల్లీ ఏప్రిల్ 27న జరిగే తమ తదుపరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 26) కేకేఆర్, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. కేకేఆర్ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరుగనుంది. -
Afghan: ఆకస్మిక వరదలు.. 33 మంది మృతి!
అఫ్గానిస్తాన్లో కురిసిన భారీ వర్షాలు వరద బీభత్సాన్ని సృష్టించాయి. ఈ వరదల కారణంగా 33 మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. రాజధాని కాబూల్తో పాటు పలు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జనాన్ సాక్ దేశంలో సంభవించిన వరదలకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. వరదల కారణంగా దేశంలో 600కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని అబ్దుల్లా జనాన్ తెలిపారు. వర్షాల కారణంగా 200 పశువులు మృతిచెందాయని, 800 హెక్టార్లలోని పంటలు దెబ్బతిన్నాయన్నారు. 85 కిలోమీటర్లకు పైగా రోడ్లు దెబ్బతిన్నాయని ,పశ్చిమ ఫరా, హెరాత్, సదరన్ జాబుల్, కాందహార్లకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అఫ్గానిస్తాన్లోని 34 రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత ఫిబ్రవరిలో తూర్పు అఫ్గానిస్తాన్లో భారీ హిమపాతం కారణంగా కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి చెందారు. మార్చిలో కురిసిన వర్షాలకు 60 మంది మృత్యువాత పడ్డారు. అఫ్గానిస్తాన్లోని వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఐక్యరాజ్యసమితి గత ఏడాది హెచ్చరించింది. దీనికి గ్లోబల్ వార్మింగ్ కారణమని పేర్కొంది. -
టీ20కా 'డాన్' రషీద్ ఖాన్.. రోహిత్, రుతురాజ్, గిల్ కంటే ఎక్కువగా..!
ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ పొట్టి క్రికెట్ను శాసిస్తున్నాడని అనడం కాదనలేని సత్యం. ఈ ఫార్మాట్లో టోర్నీలు ఎక్కడ జరిగినా వాలిపోయే రషీద్.. ప్రతి మ్యాచ్లో తనదైన మార్కు వేస్తుంటాడు. ఐపీఎల్లో అయితే రషీద్ ఆటతీరు వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఆడే ప్రతి మ్యాచ్లోనూ రషీద్ సత్తా చాటుతుంటాడు. బంతితో కాకపోతే బ్యాట్తో అయినా చెలరేగుతుంటాడు. ప్రతి మ్యాచ్లో తన జట్టును గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటాడు. The winning celebration from Rashid Khan. 🥶pic.twitter.com/TqtvV2R1d6 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 రషీద్ ఆటతీరుకు అభిమానులతో పాటు దిగ్గజ క్రికెటర్లు సైతం ముగ్దులవుతుంటారు. ఇండియాలో రషీద్కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అభిమానులు టీమిండియా స్టార్లతో సమానంగా రషీద్ను అభిమానిస్తారు. క్రికెట్ అభిమానులు రషీద్ను ముద్దుగా టీ20కా 'డాన్' అని పిలుచుకుంటారు. Most Player of the Match awards in IPL at the age of 25: Rashid Khan - 12*. Shubman Gill - 9. Ruturaj Gaikwad - 8. Rohit Sharma - 7. pic.twitter.com/UFE6tn4tJ5 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 11, 2024 ఐపీఎల్ 2024 సీజన్లో రషీద్ తాను టీ20 డాన్ను అని మరోసారి రుజువు చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్లో రషీద్ బంతితో పాటు బ్యాట్తోనూ రాణించాడు. బౌలింగ్లో నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసిన రషీద్.. తన జట్టు కష్ట సమయంలో (చివరి ఓవర్లో 15 పరుగులు కావాల్సిన దశలో) ఉన్నప్పుడు బ్యాట్ పట్టి మెరుపు ఇన్నింగ్స్ (11 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు) ఆడాడు. The winning celebrations from the captain and the vice captain. 💥 pic.twitter.com/HKYINLqTdF — Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 ఫలితంగా తన జట్టు గుజరాత్.. రాజస్థాన్కు వారి సొంతగడ్డపై ఊహించని షాకిచ్చింది. బంతితో పాటు బ్యాట్తో చెలరేగి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించినందుకు గాను రషీద్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఐపీఎల్లో రషీద్కు ఇది 12వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. 25 ఏళ్ల వయసులో ఇన్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు ఐపీఎల్ చరిత్రలో ఎవరూ గెలవలేదు. టీమిండియా స్టార్లు శుభ్మన్ గిల్ 9, రుతురాజ్ 8, రోహిత్ శర్మ 7 అవార్డులు మాత్రమే గెలిచారు. RASHID KHAN, THE GOAT OF T20 CRICKET. 🐐 - Gill led Gujarat beats Rajasthan for the first time in IPL 2024. An IPL epic in Jaipur! 👏pic.twitter.com/OWVZCyvtmB — Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. చివరి బంతి వరకు ఉత్కంఠరేపిన మ్యాచ్లో రాజస్థాన్పై గుజరాత్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. రషీద్ ఖాన్ చివరి బంతికి బౌండరీ బాది గుజరాత్ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. సంజూ శాంసన్ (68 నాటౌట్), రియాన్ పరాగ్ (76) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. శుభ్మన్ గిల్ (72), రషీద్, తెవాతియా (22) రాణించడంతో గుజరాత్ చివరి బంతికి విజయతీరాలకు చేరింది. RASHID KARAMATI KHAN, YOU ARE WORLD CLASS 🔥🔥🔥He traps the dangerous Jos Buttler, what a bowler ❤️#IPL2024 #tapmad #HojaoADFree pic.twitter.com/56J7XcOnkR— Farid Khan (@_FaridKhan) April 10, 2024 -
వివాహేతర సంబంధం పెట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపుతాం
కాబూల్: అఫ్గానిస్తాన్లో మధ్యయుగాల నాటి ఛాందసవాద పాలనకు తెరలేపిన తాలిబాన్లు ప్రజల పట్ల మరింత దారుణంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా మహిళలపై కఠిన ఆంక్షల కొరడాను మరోసారి ఝులిపించారు. వివాహేతర సంబంధం, వ్యభిచారానికి ఒడిగట్టే మహిళలను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపుతామని తాలిబాన్లు హెచ్చరించారు. ఈ మేరకు తాలిబాన్ల సుప్రీం లీడర్ ముల్లా హిబాతుల్లా అకుంద్జాదా అఫ్గాన్లనుద్దేశిస్తూ ప్రభుత్వ టీవీ చానెల్లో శనివారం ఒక ఆడియో సందేశం ఇచ్చారు. ‘‘అంతర్జాతీయ సమాజం చెబుతున్నట్లు మహిళలకు హక్కులు ఉండాలంటారా? అవి మన ఇస్లామిక్ షరియా చట్టాలు, మన మతాధికారుల నియమాలకు వ్యతిరేకం. మేం చాయ్ తాగుతూ చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారేమో! ఈ నేలపై షరియా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి తీరతాం. వివాహేతర సంబంధాలు, వ్యభిచారం ఘటనల్లో మహిళలను అందరూ చూస్తుండగా కొయ్యకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతాం’’ అని అకుంద్జాదా హెచ్చరించారు. -
భారత్కు అఫ్గానిస్తాన్ షాక్
గువాహటి: ఫుట్బాల్లో భారత జట్టు దీనావస్థను చూపించే మరో ఉదాహరణ! ఆసియాలో అనామక జట్లలో ఒకటైన అఫ్గానిస్తాన్తో నాలుగు రోజుల క్రితం జరిగిన మ్యాచ్లో ఒక్క గోల్ కూడా చేయకుండా ‘డ్రా’గా ముగించిన భారత్ ఆటతీరు ఈసారి మరింత దిగజారింది. 2026 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్లో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం సొంతగడ్డపై జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లోనూ భారత్ కనీస ప్రదర్శనను ఇవ్వలేకపోయింది. చివరకు 1–2 గోల్స్ తేడాతో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ పరాజయంతో ఆసియా క్వాలిఫయర్స్లో భారత జట్టు మూడో రౌండ్కు అర్హత సాధించే అవకాశాలకు పెద్ద దెబ్బ పడింది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో నాలుగు మ్యాచ్ల తర్వాత భారత్ ఖాతాలో 4 పాయింట్లే ఉన్నాయి. మన టీమ్ తర్వాతి మ్యాచ్లలో కువైట్ (జూన్ 6న కోల్కతాలో), ఆసియా చాంపియన్ ఖతర్ (జూన్ 11న దోహాలో) జట్లతో తలపడాల్సి ఉంది. అఫ్గాన్తోనే ఓడిన మన టీమ్ ఈ నాణ్యమైన టీమ్లపై ఏమాత్రం ప్రభావం చూపిస్తుందనేది సందేహమే. చివరిసారి 2013లో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోయిన భారత జట్టు ఈ మ్యాచ్లో ముందుగా గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లి కూడా ఆఖరికి మ్యాచ్ను ప్రత్యర్థికి అప్పగించింది. భారత్ తరఫున 38వ నిమిషంలో సునీల్ ఛెత్రి కెరీర్లో 94వ గోల్ నమోదు చేయగా... అఫ్గానిస్తాన్ ఆటగాళ్లలో రహ్మత్ అక్బరీ (70వ ని.లో), షరీఫ్ ముఖమ్మద్ (88వ ని.లో) గోల్స్ చేశారు. తన 150వ అంతర్జాతీయ మ్యాచ్లో ఛెత్రి గోల్ చేయడం విశేషమే అయినా... ఓటమి భారత్ను నిరాశకు గురి చేసింది.
Pagination
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Advertisement