-
డీప్ ఫేక్ బారిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
సినిమా ఇండస్ట్రీ వాళ్లను డీప్ ఫేక్ వదలడం లేదు. రష్మిక డీప్ ఫేక్ వీడియో అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ మరోసారి డీప్ఫేక్ బాధితురాలిగా మారింది. అలియా ముఖాన్ని మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ వీడియో మరో నటి వామికా గబ్బికి సంబంధించినదిగా తెలుస్తోంది.గత నెలలో 27న వామిక గబ్బి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె ఎర్రటి చీరను ధరించి స్లీవ్లెస్ బ్లౌజ్తో కనిపించింది. తాజాగా ఆ వీడియోలో ఆలియా భట్ ఫేస్ను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ డీప్ఫేక్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో ఓ నెటిజన్ షేర్ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్గా మారింది.కాగా.. అలియా డీప్ఫేక్ ముప్పు బారిన పడడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది నవంబర్లో ఆమె ఫేస్ను మార్ఫ్ చేసిన వీడియో వైరలైంది. అంతుకుముందే రష్మిక మందన్న, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, అమీర్ ఖాన్, కాజోల్ లాంటి ప్రముఖ తారలు డీప్ ఫేక్ బారిన పడ్డారు. View this post on Instagram A post shared by Unfixface (@unfixface) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) -
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
-
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
గ్లోబల్ ఫ్యాషన్ షో మెట్ గాలాలో బాలీవుడ్ భామ ఆలియా భట్ మెరిసింది. ప్రత్యేకంగా రూపొందించిన శారీలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. గతేడాదే తొలిసారి మెట్ గాలా రెడ్ కార్పెట్పై కనిపించిన ఆలియా.. ఈ ఏడాదిలో తళుక్కున మెరిసింది. అయితే ఈవెంట్లో ఆలియా ధరించిన శారీపైన బీటౌన్లో పెద్ద చర్చ మొదలైంది. తన స్టైలిశ్ లుక్తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంతకీ ఆలియా ధరించిన శారీ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం.ఆలియా భట్ ధరించిన ఈ షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించారు. గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్కు సరిపోయేలా ఈ గ్రీన్ శారీ.. దానికి సరిపడా నగలతో ఆలియా చాలా అందంగా షోలో ప్రత్యేకంగా నిలిచింది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన పూల చీరలో అలియా స్పెషల్ అట్రాక్షన్గా కనిపించింది. దీంతో ఆమె రెడ్ కార్పెట్ పైకి రాగానే కెమెరాల కళ్లన్నీ ఆలియావైపై ఉన్నాయి. అయితే ఈ చీర రూపొందించడంలో పెద్ద కథ ఉందనే విషయం బయటకొచ్చింది. తాజాగా ఈ విషయంపై ఆలియా భట్ మాట్లాడింది. ఆలియా చీర వెనుక కథమెట్ గాలా ఈవెంట్లో ప్రపంచ వేదికపై మనదేశ మూలాలను చాటి చెప్పేందుకు భారతీయత ఉట్టిపడేలా శారీని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ శారీ కోసం దాదాపు 1965 గంటలు అంటే దాదాపు 80 రోజులు పట్టిందని డిజైనర్ వెల్లడించారు. ఆలియా చీరను రూపొందించేందుకు 163 మంది హస్తకళాకారులు అవిశ్రాంతంగా పనిచేసినట్లు తెలిపారు. అయితే ఈ చీరను ఇటలీలో తయారు చేయడం విశేషం. ఇందులో పాల్గొన్న కళాకారులను తాను వ్యక్తిగతంగా కలవాలని అనుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆలియా చెప్పింది. ఆరు గజాల చీరతో ఆకట్టుకోవడమే కాదు.. తన మాటలతోనే ఆలియా అక్కడి వాళ్ల మనసులు గెలుచుకుంది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
మెట్ గాలాలో అలియా చీరపైనే అందరి అటెన్షన్! ఏకంగా 163 మంది..
మెట్ గాలా ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటి. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో ఏటా ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలో రెండోసారి బాలీవుడ్ భామ అలియా భట్ రెడ్కార్పెట్పై మెరిసింది. భారతీయ సంస్కృతిని చాటేలా ప్రత్యేకమైన సబ్యసాచీ చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా కెమెరాల అటెన్షన్ ఆమె ధరించిన చీరవైపే దృష్టిసారించాయి. ఈ చీరను గ్లాస్ బీడింగ్, రత్నాలతో చేతి ఎంబ్రాయిడరీతో డిజైన చేశారు. పుదీనా ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ చీరలో అలియా అందర్నీ మిస్మరైజ్ చేసింది. ముఖ్యంగా పొడవాటి కొంగు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.ఎవరు డిజైన్ చేశారంటే..అలియా భట్ కట్టుకున్న ఈ షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేశాడు. ఈ ఏడాది మెట్ గాలా 2024 "గార్డెన్ ఆఫ్ టైమ్" అనే థీమ్కు సరిపోయేలా భారతీయ సంస్కృతిని చాటేలా అలియా చీరను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ప్రముఖ మ్యాగజైన్ వోగ్ (Vogue)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా కాన్ఫిడెంట్గా మాట్లాడింది. పైగా చీర కంటే గొప్ప డిజైనర్వేర్ లేదని తన వేషధారణతో చెప్పకనే చెప్పింది. అంతేగాదు ఈ శారీకి సరిపడా నగలతో ఆలియా చాలా అందంగా ఉండటమే గాక, మొత్తం షోలో ప్రత్యేకంగా నిలిచింది.alia bhatt wearing a custom sabyasachi saree for the met gala 2024 — it is detailed with florals delicately hand embroidered! 💕 pic.twitter.com/zhvM2RdgKV— ☁️ (@softiealiaa) May 7, 2024ఈ చీరను ఏకంగా 163 మంది..అలియా భట్ కట్టుకున్న చీర కొంగు మొత్తం రెడ్ కార్పెట్ను కవర్ చేసిందంటే..ఈ చీర ఎంత పెద్దగా ఉందో చెప్పొచ్చు. ఈ ఈవెంట్లో మిగిలిన వాళ్లంతా మోడర్న్ డ్రెస్లలో కనిపిస్తే.. అలియా మాత్రం ఇలా చీరలో కళ్లు చెదిరే అందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అయ్యాయి. అభిమానులు సైతం అద్భుతంగా ఉన్నావంటూ పోస్టులు పెట్టారు. అయితే ఈ చీర వెనుక ఏకంగా163 మంది చేతి కళాకారుల శ్రమ ఉంది. వాళ్లంతా దాదాపు గంటలు శ్రమించి ఆ చీరను ఇంత అందంగా ఆ వేడకలోని థీమ్కు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. దీన్ని ఇటలీలో తయారు చేశారట. ఈ మెగా మెట్ గాలా ఈవెంట్లో ఆరుగజాల అందమైన చీరతో అక్కడున్నవారందరీ మనుసులను గెలుచుకుంది అలియా. you are KIDDING me ALIA BHATT!!!!! pic.twitter.com/UNGe9Wu4Gd— kp (@earthlykisssed) May 7, 2024(చదవండి: సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి! -
మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
-
‘శ్రీ రాముడి’ కోసం రణ్బీర్ దిమ్మదిరిగే వర్కవుట్..వైరల్ వీడియో
చాక్లెట్ బాయ్గా బాలీవుడ్లో అడుగుపెట్టి.. నటుడుగా తానేంటో నిరూపించుకున్నాడు హీరో రణ్బీర్ కపూర్. ‘యానిమల్ మూవీతో టాలెండెట్ హీరోగా తెలుగు ఆడియెన్స్కు దగ్గరయ్యాడు. తాజాగా రానున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణం’ కోసం రణ్బీర్ కపూర్ తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. శ్రీరాముడి పాత్ర కోసం జిమ్లో తెగ కష్టపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్గా మారింది. రణ్బీర్ పెర్సనల్ ట్రైనర్ నామ్ వర్కౌట్ వీడియోను షేర్ చేశాడు. స్విమ్మింగ్ రన్నింగ్, బైక్ రైడింగ్.. జిమ్ బాల్, కెటిల్బెల్స్, జిమ్ రోప్లతో వర్క్అవుట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రశాంతంగా గ్రామీణ ప్రాంతంలో ట్రెక్కింగ్, బైక్ రైడింగ్, బరువులు ఎత్తడం లాంటి కీలకమైన ఎక్సర్సైజ్లు చేస్తుండటం గమనార్హం. రణ్బీర్ సతీమణి, హీరోయిన్ అలియా భట్, కూతురు రాహా కూడా ఉందంటూ ఫ్యాన్స్ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Training With Nam (@trainingwithnam) ఏ ప్రాతకోసమైనా పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయేలా తీవ్ర కసరత్తులు చేయడం రణబీర్కు అలవాటు. అలా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు మరింత దగ్గర య్యాడు. తాజా ఆయన వర్కవుట్స్ చూసి ఆయనఅంకితభావం అలాంటిది అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంతో రానున్న 'రామాయణం' మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా అలరించ నున్నాడు. గత ఏడాది రికార్డు కలెక్షన్స్ రాబట్టిన యానిమల్ మూవీ కోసం కూడా రణ్బీర్ భారీగా కండలు పెండిన సంగతి తెలిసిందే. -
అలియా భట్, మృణాల్ ఠాకూర్ ఆ గోల్డెన్ ఛాన్స్ దక్కేది ఎవరికి..?
ఇప్పుడు కోలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దళపతి విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసి, పార్టీని కూడా స్థాపించారు. 2026లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరొక చిత్రం మాత్రమే చేయనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అది ఆయన నటించే 169వ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి పలువురు ప్రముఖ దర్శకుల పేర్లు వినిపించినా, చివరికి హెచ్.వినోద్ పేరు ఖరారైనట్లు టాక్ వైరల్ అవుతోంది. ఈయన ఇంతకు ముందు ఖాకీ, తెగింపు, వలిమై వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ తరువాత కమలహాసన్ కథానాయకుడిగా చిత్రం చేయాల్సింది. దానికి సంబంధించిన కథా చర్చలు కూడా జరిగాయి. అయితే కారణాలేమైనా ఆ చిత్రం డ్రాప్ అయ్యింది. తాజాగా విజయ్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈయన చెప్పిన కథకు విజయ్ చాలా ఇంప్రెస్ అయ్యారని సమాచారం. ఈ రేర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది. ఇందులో నటించే హీరోయిన్ ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. రూ.10 కోట్ల పారితోషికం తీసుకునే రేంజ్ హీరోయిన్ను ఎంపిక చేయాలని యూనిట్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లిస్ట్లో లేడీ సూపర్స్టార్ నయనతార లేదట. ఇకపోతే బాలీవుడ్ భామ అలియా భట్, మృణాళ్ ఠాకూర్, త్రిష, సమంతలలో ఒకరిని ఎంపిక చేయడానికి వారితో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. త్రిష, సమంత ఇప్పటికే విజయ్ సరసన నటించారు. కాబట్టి ఇప్పటి వరకూ విజయ్తో జతకట్టని నటిని ఇందులో నటింపజేసే ఆలోచనలో యూనిట్ వర్గాలు ఉన్నట్లు సమాచారం. నటి అలియాభట్, మృణాళ్ఠాకూర్ ఇప్పటి వరకూ నేరుగా తమిళ చిత్రాల్లో నటించలేదు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో అలియాభట్, సీతారామం మృణాళ్ ఠాకూర్లో తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ రెండు అనువాద చిత్రాలేనన్నది గమనార్హం. దీంతో బాలీవుడ్ భామ అలియాభట్ గానీ, మృణాళ్ ఠాకూర్ గానీ విజయ్ 69వ చిత్రంలో నటించే చాన్స్ ఎక్కువగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. వీరిలో ఆ అదృష్టం ఎవరికి లభిస్తుందన్నదే తాజాగా జరుగుతున్న చర్చ. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన మేలో వెలువడే అవకాశం ఉంది. -
‘లవ్ అండ్ వార్’లో గాయనిగా ఆలియా భట్
‘హైవే’, ‘హంప్టీ శర్మకీ దుల్హనియా’ సినిమాల్లో హీరోయిన్గా నటించడంతో పాటు గాయకురాలిగా పాటలు పాడారు ఆలియా భట్. ఇలా గాయకురాలిగా కాస్త అనుభవం ఉన్నా కూడా స్వరాలాపనలో మరింత పట్టు సాధించేందుకు ఆలియా భట్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని బాలీవుడ్ సమాచారం. ఎందుకంటే తన తాజా చిత్రం ‘లవ్ అండ్ వార్’లో ఆలియా భట్ పూర్తి స్థాయి గాయకురాలి పాత్రలో కనిపిస్తారట. పాత్ర దృష్ట్యా కథలో చాలా పాటలు పాడతారట ఆలియా భట్. ఈ చిత్రం కోసమే ఆమె స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారు. రణ్బీర్ కపూర్, విక్కీ కౌశల్ ఇతర లీడ్ రోల్స్లో నటించనున్న ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ఆరంభం కానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. పెళ్లి తర్వాత రణ్బీర్ కపూర్, ఆలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. -
ఆలియాకు విలన్గా...?
ఆలియా భట్, షార్వరి లీడ్ రోల్స్లో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కనుందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. యశ్ రాజు ఫిలింస్ స్పై యూనివర్స్లో భాగంగా రానున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్గా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుందట. శివ్ రావైల్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మించనున్నారు. గతంలో ‘రాజీ’ సినిమాలో స్పై పాత్రలో నటించిన ఆలియా భట్ మళ్లీ ఈ సినిమాలో ఆ తరహా పాత్రను ఓకే చేయడం విశేషం. ఇక ‘యానిమల్’లో విలన్ రోల్లో బాబీ డియోల్ విజృంభించిన విషయం తెలిసిందే. మరి.. యశ్ రాజ్ ఫిలింస్ తాజా చిత్రంలో విలన్గా సై అంటే... మరోసారి బాబీ నెగటివ్ పెర్ఫార్మెన్స్ని చూసే వీలు దక్కుతుంది. -
అలియా చీర స్పెషల్ ఎట్రాక్షన్: విషయం తెలిస్తే మీరూ షాకవుతారు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ హోప్ గాలా 2024 ఈవెంట్లో అందరి చూపులను తన వైపునకు తిప్పుకుంది. ఇటీవల తన తొలి హోప్ గాలాను లండన్లో నిర్వహించింది. ఈసందర్భంగా 30 ఏళ్ల నాటి వింటేజ్ సారీని కొత్తగా డిజైన్ చేయించుని మరీ ధరించింది. ఇవరీ రేషమ్ సారీలో తన స్టయిలిష్లుక్తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. దీనికి జతగా టోర్టటైజ్ నెక్లైన్ క్రిస్టల్-ఎంబెడెడ్, వెనుక ముత్యాల లైన్లతో తీర్చిదిద్దిన బ్లౌజ్ మరింత అందంగా నప్పింది. (వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!) హోప్ గాలా 2024 ఈవెంట్కోసం ఈ చీరను ప్రముఖ డిజైనర్లు అబుజానీ, సందీప్ ఖోస్లా స్పెషల్గా డిజైన్ చేశారట. వీరు దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆకులు,పువ్వుల డిజైన్లతో పట్టు దారాలతో ఎంబ్రాయిడరీ చేసినట్టు తెలిపారు. అంతేకాదుఈ చీర వాస్తవానికి 1994లో తయారు చేసిందట. 30 ఏళ్లనాటి ఈ చీరను మళ్లీ కొత్తగా సిద్ధం చేయడానికి 3500 గంటలు పట్టిందని తెలిపారు. ఇదే ఈవెంట్లో పర్పుల్ కలర్ డ్రెస్తో మెరిసింది అలియా. (ముఖేష్ సర్ప్రైజ్ గిఫ్ట్ : ఆనంద్ మహీంద్ర ఫిదా!) 2023లోఅలియా మెట్ గాలా అరంగేట్రంలో లక్ష ముత్యాలతో చేసిన గౌనుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెట్టిన అలియా సక్సెస్పుల్ హీరోయిన్గా దూసుకు పోతోంది. బాలీవుడ్ స్టార్హీరో ప్రియుడు రణ్బీర్ కపూర్ని పెళ్లాడింది. పెళ్లి తరువాత ఇద్దరూ వరుస హిట్లతో దుమ్ము రేపుతున్నారు.అలాగే జాతీయ,అంతర్జాతీయబ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. అంతేనా ఒక దుస్తుల బ్రాండ్కు సీఈవో వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుకుంటోంది. ఈ స్వీట్ కపుల్కు రాహా కపూర్ అనే ముద్దుల కూతురుకూడా ఉన్న సంగతి తెలిసిందే. (మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు: సెల్ఫీ వీడియో పుణ్యమే!) View this post on Instagram A post shared by Mandarin Oriental (@mo_hotels) View this post on Instagram A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) -
బాలీవుడ్లో రిచెస్ట్ స్టార్ కిడ్.. ఏకంగా షారుక్, అమితాబ్ను మించి!
గతేడాది యానిమల్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన హీరో రణ్బీర్ కపూర్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. అయితే రణ్బీర్ కపూర్ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు రాహా కపూర్ అనే ముద్దుల కూతుకు కూడా ఉన్నారు. అయితే ఈ జంట తమ ముద్దుల కూతురి ఖరీదైన గిఫ్ట్ను ఇచ్చినట్లు బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. ఓ నివేదిక ప్రకారం లగ్జరీ బంగ్లాను నిర్మించి ఇవ్వనున్నట్లు సమాచారం. అది పూర్తయితే ముంబైలోనే అత్యంత ఖరీదైన బంగ్లాగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ బంగ్లా నిర్మాణానికి దాదాపు రూ.250 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నారు. ఇది పూర్తయితే షారుక్ ఖాన్ మన్నత్, అమితాబ్ బచ్చన్ జల్సా బంగ్లాలతో పోలిస్తే అత్యంత ఖరీదైన సౌధంగా నిలవనుంది. రిచెస్ట్ స్టార్ కిడ్.. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఓ బంగ్లాలో బాలీవుడ్ జంట రణ్ బీర్ కపూర్, అలియా భట్తోపాటు నీతూ కపూర్ కలిసి కనిపించారు. ఆ బంగ్లాకు రణ్ బీర్ తన కుమార్తె రాహా కపూర్ పేరు పెట్టనున్నట్లు సమాచారం. దీంతో ఏడాది వయసులోనే రాహా కపూర్ బాలీవుడ్లో అత్యంత పిన్న వయసులో ధనవంతురాలిగా గుర్తింపు దక్కించుకోనుంది. రణ్బీర్, ఆలియా తమ కూతురి కోసం సమానంగా పెట్టుబడి పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పాటు వీరికి ముంబైలో నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి. వాటి విలువ రూ. 60 కోట్లకు పైగానే ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. ఈ బంగ్లాకు రాహా నానమ్మ నీతూ కపూర్ సహ-యజమానిగా ఉంటారని తెలుస్తోంది. ఆమె ఇటీవల బాంద్రా ప్రాంతంలోనే రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. బంగ్లా పూర్తయిన తరువాత నీతూ కపూర్తో సహా ఫ్యామిలీ మొత్తం ఇదే బంగ్లాలో ఉండనున్నారని సమాచారం. అలియా, రణ్ బీర్, రాహా ప్రస్తుతం వస్తు అనే ప్రాంతంలో ఉంటున్నారు. -
Alia Bhatt Latest Photos: తల్లయినా తగ్గని అందం.. ఎంతైనా ఆమె రేంజే వేరు (ఫోటోలు)
-
రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్
హీరోయిన్ అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు హిందీ మూవీస్ చేసిన ఈమె.. 'ఆర్ఆర్ఆర్'లోనూ ఓ పాత్ర చేసి ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ చేస్తున్న టైంలోనే అలియా-రాజమౌళికి గొడవైందని ఏవేవో అన్నారు. అయితే వాటిలో నిజానిజాలు పక్కనబెడితే.. తనకు రాజమౌళి ఇచ్చిన సలహాని ఇప్పటికీ పాటిస్తున్నానని అలియా చెప్పుకొచ్చింది. అలా తన పద్ధతి పూర్తిగా మారిపోయిందని పేర్కొంది. (ఇదీ చదవండి: బాధతో ఆ విషయం ఒప్పుకొంటున్నా: డైరెక్టర్ రాజమౌళి) 'సినిమాలని ఎంచుకునే విషయంలో మొదటి నుంచి ఒత్తిడికి గురవుతూ ఉండేదాన్ని. అదే విషయం రాజమౌళికి చెప్పాను. 'ఏది చేసినా సరే ప్రేమతో చేయండి. అప్పుడు సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు మీ యాక్టింగ్ని మెచ్చుకుంటారు. మీకు కనెక్ట్ అవుతారు. ఈ ప్రపంచంలోనే ప్రేమతో చేసే పనికి మించిన గొప్పది ఏదీ లేదు' అని ఆయన చెప్పారు. అప్పటి నుంచి నేను అదే పాటిస్తున్నాను' 'ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా దగ్గరకు వచ్చిన ప్రతి కథకు ఓకే చెప్పేసేదాన్ని. నిజం చెప్పాలంటే నాకు సహనం తక్కువ. ఇప్పుడు ఆ పద్ధతి మారింది. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఎంత కష్టమైనా పాత్రనైనా సరే ఓకే చెప్పాలని డిసైడ్ అయ్యాను' అని అలియా భట్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె హిందీలో 'జిగ్రా' అనే సినిమా చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 27న ఇది థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: మహేశ్ -రాజమౌళి సినిమా కథేంటో చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్) -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఆలియా చాలారోజుల తర్వాత అలా.. హీట్ పెంచుతున్న సీరత్!
చాలా ఏళ్ల తర్వాత క్లాసికల్ డ్యాన్స్.. శ్రీలీల ఎమోషనల్ పోస్ట్ అంబానీ పెళ్లి వేడుకలో మెరిసిపోతున్న ఆలియా భట్ చీరకట్టులో మరింత క్యూట్గా ముద్దుగుమ్మ ప్రియమణి కలర్ఫుల్ సీతాకోకచిలుకలా కనిపిస్తున్న సీరత్ కపూర్ మేకప్ లేకపోయినా సరే అందంగానే మీనాక్షి చౌదరి ఎక్సర్సైజ్ చేస్తూ ఫొటోలు పోస్ట్ చేసిన మంచు లక్ష్మి భర్తతో కలిసి హీరోయిన్ దీపికా పదుకొణె క్యూట్ పోజులు రోజురోజుకీ మరింత హాట్గా సీరియల్ బ్యూటీ జ్యోతి రాయ్ View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Musskan Sethi Adlakha (@musskansethi9) -
వారికి అసలు మానవత్వం లేదా?: మహేశ్ బాబు పోస్ట్ వైరల్!
కొత్త ఏడాదిలో గుంటూరు కారంతో ప్రేక్షకులను అలరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇక మహేశ్ బాబు తదుపరి దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవలే బాలీవుడ్ భామ నిర్మాతగా వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఈనెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పోచర్ స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సిరీస్ వీక్షించిన మహేశ్ బాబు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఎలా ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. వారికి మానవత్వం లేదా? అలాంటి పనులు చేసేటప్పుడు వారి చేతులు వణకవా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోచర్ వెబ్ సిరీస్ చూశాక తన మైండ్లో ఇలాంటి ప్రశ్నలే తిరుగుతున్నాయని తన ఇన్స్టాలో రాసుకొచ్చారు. ఇలాంటి సున్నితమైన దిగ్గజాలను రక్షించమని కోరుతూ ఈ వెబ్ సిరీస్ ద్వారా పిలుపునిచ్చారని మహేశ్ బాబు పోస్ట్ చేశారు. కాగా.. ఎమ్మీ అవార్డు విన్నర్, దర్శకుడు రిచీ మెహతా రూపొందించిన మలయాళ ఫారెస్ట్ క్రైమ్ సిరీస్ పోచర్. ఏనుగు దంతాల స్మగ్లింగ్తో పాటు, క్రైమ్ ఎలిమెంట్స్తో ఈ సిరీస్ను తెరకెక్కించారు. కేరళ అడవుల్లో జరిగిన ఒక రియల్ స్టోరీని ఆధారంగా తీసుకోని ఈ చిత్రాన్ని రూపొందించారు. పోచర్లో నిమేషా సజయన్, రోషన్ మాథ్యూ కీలకపాత్రలు పోషించారు. కేరళ అడవుల్లో ఉన్న ఏనుగులను చంపి వాటి దంతాలతో కొందరు నేరస్థులు వ్యాపారం చేస్తుంటారు. అలాంటి నేరస్థుల ముఠాని పట్టుకోవడానికి కేరళ పోలీసులు, కొందరు ఎన్జీఓలో చేసిన ప్లానింగ్నే సిరీస్గా రూపొందించారు. ఈ సిరీస్కు అలియా భట్ నిర్మాతగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
మిమిక్రీ శాయవలే... ముంబైలో ఫ్లాట్ కొనవలే!
ఆలియా భట్ గొంతును అనుకరిస్తూ బోలెడు పాపులారిటీ సంపాదించింది 24 సంవత్సరాల కంటెంట్ క్రియేటర్ చాందిని భాబ్డా. ఈ పాపులారిటీనే ఆమెను ముంబైలో ఒక ఫ్లాట్కు ఓనర్ను చేసింది. సంప్రదాయ రీతిలో గృహప్రవేశంతో తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది చాందిని. ఇన్స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. 2022లో ఆన్–పాయింట్ మిమిక్రీ క్లిప్స్తో సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది చాందిని. సొంత ఇంటి కలతో మిమిక్రీ కళను నమ్ముకొని డబ్బులను పొదుపు చేసేది. ఎట్టకేలకు ఆమె కల ఫలించింది. ఈ ఫ్లాట్ కొనడానికి ఎన్నో ఇష్టాలను వదులుకొని, ఎలా డబ్బు పొదుపు చేసిందీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వివరించింది చాందిని. ‘ఫ్రెండ్స్ విదేశాలకు వెళుతున్నప్పుడు నాకు కూడా వెళ్లాలనిపించేది. బర్త్డే ఫంక్షన్ను ఘనంగా జరుపుకోవాలనుకునేదాన్ని... ఇలాంటి ఎన్నో సందర్భాలలో ఇంటికల గుర్తుచ్చేది. పొదుపు చేయడం ఎప్పుడూ మానలేదు’ అని రాసింది చాందిని. -
అదిరిపోయే పవర్ సూట్లో అలియా భట్! దాని ఖరీదే ఏకంగా..!
బాలీవుడ్ నటి అలియా భట్ ప్యాషన్కి ఐకాన్లా తనదైన శైలిలో ఉంటుంది. ఏ వేడుకకు తగ్గ ట్రెండీ డ్రస్తో అందర్నీ మిస్మరైజ్ చేస్తుంటుంది. ఎప్పటి కప్పుడూ ఓ ట్రెండీ లుక్తో వస్తూ.. సరికొత్త డ్రస్సింగ్ స్టయిల్ని పరిచేయం చేస్తుంది అలియా. అందుకు నిదర్శనం ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న ఘటన, అయోధ్య వేడుకలే. జాతీయ అవార్డుల ఫంక్షన్ తగ్గట్టుగా హుందాగా స్టన్నింగ్ శారీతో మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఆ తర్వాత ఇటీవల అయోధ్యలో జరిగిన బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో చీరపై రామాయాణ ఇతిహాస చిత్రాలతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎప్పడూ కొంగొత్త స్టయిలిష్ డ్రస్లతో వార్తల్లో నిలుస్తుంటారు అలియా. మళ్లీ ఈ పవర్ ఫుల్ పవర్ సూట్తో సరికొత్త ట్రెండ్ని సెట్ చేసి హాట్టాపిక్గా మారారు. ఈ మేరకు అలియా గురువారం తన రాబోయే సిరీస్ పోచర్ ట్రైలర్ లాంచర్ కోసం అలియా ఓంబ్రే పవర్ సూట్ని ధరించారు. ఈ లుక్లో ఆమె పవర్ ఫుల్ విమెన్లా ఉంది. అందరీ కళ్లు ఆమె డ్రస్ పైనే ఉన్నాయి. ఆ సూట్కి తగ్గ హైహిల్స్, చెవిపోగులు, లైట్ మేకప్తో కళ్లు తిప్పుకోలేనంత కలర్ఫుల్గా కనిపించింది అలియా. ఇంతకీ ఆ సూట్ ధర ఎంతో తెలిస్తే కళ్లు చెదిరిపోతాయి. ఆ ఓంబ్రే ప్యాంట్ సూట్ ధర ఏకంగా రూ. 3.15 లక్షలు/- (చదవండి: మిస్ వరల్డ్ 2023 పోటీల్లో భారత్ తరఫున సినీ శెట్టి ప్రాతినిధ్యం!!) -
స్టార్ హీరో ఫ్లాట్ కొనుక్కున్న మిమిక్రీ క్వీన్, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు!
బాలీవుడ్ స్టార్హీరోయిన్ అలియాభట్ను అనుకరించి పాపులర్ ముద్దుగుమ్మ చాందినీ భబ్దా గుర్తుందా? ఇపుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్తో వార్తల్లో నిలిచింది. విషయం ఏమిటంటే...! కంటెంట్ క్రియేటర్, చాందినీ భాబ్దా తన మిమిక్రీతో సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఇన్స్టాగ్రామ్లో ఈమె ఫాలోవర్ల సంఖ్య 4.5 లక్షల కంటే ఎక్కువే. తాజాగా తన లైఫ్లో ఒకముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. చాందినీ ముంబైలో ఒక విలాసవంతమైన ఫ్లాట్ని కొనుగోలు చేసింది. అదీ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఫ్లాట్ను కొనుగోలు చేసిందట. ఈఎంఐ అయినా.. 25ఏళ్ల లోపే సొంత ఇల్లు అంటూ ఆనందంలో మునిగి తేలుతూ సంబంధించిన సమాచారాన్ని ఇన్స్టాలో తన ఫ్యాన్స్తో షేర్ చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశ పూజాకార్యాక్రమాలను నిర్వహించింది. అంతేకాదు తనదైన స్టయిల్లో రెన్నోవేషన్ కూడా చేయనుందట త్వరలోనే. యాక్టింగ్పై కూడా అభిరుచి ఉన్న ఈ అమ్మడు ‘కానిస్టేబుల్ గిరాప్డే’ అనే కామెడీ టీవీషోలో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్లో అవకాశకాశాల కోసం ఎదురు చూస్తోంది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన చాందినీ భబ్దా అలియాతో పాటు హీరోయిన్లు అనన్య పాండే, కంగనా రనౌత్ వాయిస్లను కూడా బాగా అనుకరిస్తుంది. అయితే తన వాయస్ను అనుకరించడంపై స్పందించిన అలియా చాందినినీ ప్రశంసల్లో ముచెత్తడం,దీనికి చాందినీ సంతోషంగా ఉబ్బితబ్బిబ్బవడం తెలిసిందే. View this post on Instagram A post shared by Chandni Bhabhda 🧿 (@chandnimimic) -
అలియా భట్ నిర్మాత.. ఓటీటీలో చూడాల్సిన క్రైమ్ వెబ్ సిరీస్
ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'పోచర్' వెబ్ సిరీస్ విడుదల ప్రకటన వచ్చేసింది. క్రైమ్ సిరీస్లను ఇష్టపడే వారందరికి ఇదొక గుడ్న్యూస్ అని చెప్పవచ్చు. ఈ సిరీస్ను ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ సంస్థ క్యూసీ ఎంటర్టైన్మెంట్ నిర్మించగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా మరో నిర్మాతగా ఉంది. రిచీ మెహతా దీనికి రచన, దర్శకత్వం వహించారు. ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎమీ అవార్డును గతంలో ఆయన అందుకున్నారు. మలయాళ ప్రముఖ నటి నిమిషా సజయన్, రోషన్ మథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య ఈ సిరీస్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు కన్నడ,మలయాళం,హిందీ,తమిళ్లో అందుబాటులో ఉండనుంది. పోచర్ వెబ్ సిరీస్లో 8 ఎపిసోడ్లు ఉండనున్నాయి. ఇటీవల సుడాన్స్ ఫిల్మ్స్ ఫెస్టివల్లో ఈ సిరీస్ను ప్రదర్శించారు. విమర్శకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అడవుల్లో వణ్య ప్రాణులు ముఖ్యంగా ఏనుగులపై జరిగిన దాడుల గురించి ప్రధానంగా ఈ పోచర్ క్రైమ్ సిరీస్ తెరకెక్కించారు. ఎక్కువగా అడవుల్లోనే షూటింగ్ జరిగింది. కేరళలోని రియల్ లైఫ్ లొకేషన్లలో చిత్రీకరణ జరిగింది. భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఏనుగు దంతాల నెట్వర్క్ గుట్టు రట్టు చేసేందుకు కృషి చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులతో పాటు భారత వణ్యప్రాణుల ట్రస్ట్ ఎన్జీవో వర్కర్లు, పోలీసులు ఇలా ఎందరో కృషి పోచర్ వెబ్ సిరీస్లో కనిపిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ సిరీస్ కోసం సుమారు నాలుగు సంవత్సరాల పాటు పరిశోధన చేసినట్లు దర్శకుడు రిచీ మహతా చెప్పారు. ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్కు కూడా గతంలో రిచీ మెహతా దర్శకత్వం వహించారు. ఇదీ కూడా 2012 ఢిల్లీ గ్యాంప్ రేప్ కేసు ఆధారంగానే ఆయన డైరెక్ట్ చేశారు. నెట్ఫ్లిక్స్లో ఢిల్లీ క్రైమ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. beneath the silence, the forest reveals a deadly conspiracy... and the hunt for the Poacher begins! Alia Bhatt comes on board as #ExecutiveProducer on #PoacherOnPrime, a new Amazon Original Crime series, Feb 23@aliaa08 #RichieMehta @_QCEnt @NimishaSajayan @roshanmathew22… pic.twitter.com/B8RmMPMtRK — prime video IN (@PrimeVideoIN) February 6, 2024 -
Filmfare Awards 2024: దుమ్ము రేపిన బాలీవుడ్ కపుల్, స్వీట్ కిస్, పిక్స్ వైరల్
ప్రతిష్టాత్మక 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోబాలీవుడ్ జంట రణబీర్ కపూర్-అలియాభట్ దుమ్ము రేపారు. అలియా, రణబీర్ ఇద్దరూ ఉత్తమ నటీ, ఉత్తన నటుడు అవార్డులను గెల్చుకుని రీల్ లైఫ్లో కూడా బెస్ట్ కపుల్గా నిలిచారు. రణబీర్ చిత్రం యానిమల్లోని జమాల్ కుడు అనే పాటకు ఇద్దరూ స్టెప్స్ వేయడం అక్కడున్న వారందరిన్నీ ఉత్సాహపరిచింది. ఈ డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు ఆఖరులో రణ్బీర్ అలియాను ముద్దుపెట్టుకోవడం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అలియా భట్ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మూవీకిగాను ఉత్తమ నటి అవార్డును అందుకోగా, ఆమె భర్త రణబీర్ కపూర్ యానిమల్లో తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' మూవీ ఏకంగా ఆరు అవార్డులను కైవసం చేసుకుంది. అంతేకాదు ఓటీటీ రికార్డుల మోత మోగించిన '12 త్ ఫెయిల్' ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా దర్శకుడు విధు వినోద్ చోప్రా ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ వేదికగా అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలో 2023 లో విడుదలైన చిత్రాలకు సంబంధించి అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
భార్యతో స్టార్ హీరో డ్యాన్స్..
-
భార్యతో స్టార్ హీరో డ్యాన్స్.. తలపై గ్లాసు పెట్టుకుని..
బాలీవుడ్ పవర్ఫుల్ కపుల్ రణ్బీర్ కపూర్- ఆలియా భట్ అరుదైన ఘనత సాధించారు. 69వ ఫిలింఫేర్ అవార్డుల్లో ఇద్దరూ ఉత్తమ హీరో, ఉత్తమ హీరోయిన్లుగా పురస్కారాలు అందుకున్నారు. దీంతో సంతోషంలో మునిగి తేలుతోందీ జంట. గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన అవార్డుల వేడుకలో ఈ దంపతులు డ్యాన్స్తో కనువిందు చేశారు. అంతేనా.. యానిమల్ సినిమాలో హైలెట్ అయిన 'జమల్ కుదు' హుక్ స్టెప్ను రీక్రియేట్ చేశాడు రణ్బీర్. స్టేడియం ముందు వరుసలో ఉన్న భార్య దగ్గరకు వచ్చి చిందులేశాడు. తలపై గ్లాసు పెట్టుకుని డ్యాన్స్ చేశాడు. దీంతో ఆలియా కూడా భర్తతో కలిసి పాదం కదిపింది. ఈ జోష్లో భార్యను ఆప్యాయంగా ముద్దాడాడు హీరో. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మీ జంటను చూస్తే ముచ్చటేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. కాగా 'యానిమల్' సినిమాకుగానూ రణ్బీర్ ఉత్తమ నటుడిగా, 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని' చిత్రానికిగానూ ఆలియా భట్ ఉత్త నటిగా అవార్డులు అందుకున్నారు. #RanbirKapoor comes in all guns blazing at the 69th #HyundaiFilmfareAwards2024 with #GujaratTourism.@GujaratTourism @HyundaiIndia @VimalElaichi pic.twitter.com/N3ULAMvTsw — Filmfare (@filmfare) January 28, 2024 ఫిలింఫేర్ అవార్డులు ఏయే సినిమాలకు వచ్చాయో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
ఆలియా భట్, రామ్ చరణ్ జోడీ రిపీట్?
రాజమౌళి దర్శకత్వంలోని ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం..రణం..రుధిరం) సినిమాలో రామ్చరణ్, ఆలియా భట్ ఓ జంటగా నటించి మెప్పించారు. ఈ ఇద్దరూ మళ్లీ జోడీ కట్టనున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఆలియా భట్ పేరు వినిపిస్తోంది. మరి.. రామ్చరణ్, ఆలియా భట్ జోడీ రిపీట్ అవుతుందా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుందని తెలిసింది. రామ్చరణ్ బర్త్ డే (మార్చి 27) సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. కన్నడ స్టార్ శివరాజ్కుమార్ ఓ కీలక పాత్రలో నటించనున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమన్ స్వరకర్త. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్లతో కలిసి వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. -
అలియా భట్ ప్రొత్సాహంతోనే ఆ సన్నివేశాల్లో నటించా : రణ్బీర్ కపూర్
ఈ మధ్య కాలంలో సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు కామన్ అయిపోయాయి. ముద్దు సీన్స్ లేని సినిమాలు చాలా అంటే చాలా రేర్గా వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో కథ డిమాండ్ మేరకు అలాంటి సన్నివేశాలను పెడితే..మరికొన్ని సినిమాల్లో మసాల యాడ్ చేస్తేనే టికెట్లు తెగుతాయనే ఉద్దేశంతో శృంగార సన్నివేశాలను ఇరికిస్తున్నారు. ప్రేక్షకులు అయితే ఇంటిమేట్ సన్నివేశాలను లైట్ తీసుకొని, సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. (చదవండి: ఆ హీరో సడన్గా దగ్గరకు వచ్చి వింతగా ప్రవర్తించాడు: భాగ్యశ్రీ) ఇటీవల ఇంటిమేట్ సన్నివేశాలపై చర్చ జరిగిన ఏకైక సినిమా యానిమల్ మాత్రమే. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మోతాదుకు మించిన ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నప్పటికీ..అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. అలాంటి సన్నివేశాలే సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి కూడా. అయితే ఇంటిమేట్, హింసాత్మక సన్నివేశాల్లో నటించినప్పుడు హీరో రణ్బీర్ కపూర్ చాలా అసౌకర్యంగా ఫీలయ్యారట. కెరీర్ పరంగా చెడ్డ పేరు వస్తుందని భయపడ్డాడట. కానీ భార్య అలియా భట్ మాత్రం చాలా ఎంకరేజ్ చేసిందట. ఆమె ప్రోత్సాహంతోనే ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించానని రణ్బీర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. (చదవండి: ‘తొలిప్రేమ’లో పవన్ చెల్లెలు.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?) ‘ఒక నటుడిగా నాకుంటూ కొన్ని హద్దులు ఉన్నాయి. వాటిని దాటాలని ఎప్పుడూ అనుకోలేదు. దర్శకుడు సందీప్ వంగా యానిమల్ కథ చెబుతూ.. ఇంటిమేట్, హింసాత్మక సన్నివేశాలు ఇలా ఉంటాయని చెప్పారు. నేను చాలా భయపడ్డాను. కొన్ని సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు ఇలా చేయాలా? వద్దా? అనే డైలమాలో పడేవాడిని. కానీ నా భార్య అలియా భట్ చాలా సపోర్ట్గా నిలిచింది. ‘సినిమా కోసమే చేస్తున్నావు. ఇది కేవలం పాత్ర మాత్రమే’ అంటూ ధైర్యం చెప్పింది. సినిమాకు సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని ఆమెతో చర్చించేవాడిని. ఈ సినిమా విషయంలో తను నాకెంతో అండగా నిలిచింది’అని రణ్బీర్ చెప్పారు. యానిమల్ విషయానికొస్తే.. ‘అర్జున్ రెడ్డి’ఫేమ్ సందీప్ వంగా తెరకెక్కించిన మూడో చిత్రమిది. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్తో రూపొందిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 1న విడుదలై ఘన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి..రణ్బీర్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దీనికి కొనసాగింపుగా ‘యానిమల్ పార్క్’ రానుంది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మిస్టరీ.. 'ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు'..
ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా
కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’
బంగ్లాదేశ్ను చిత్తు చేసిన జింబాబ్వే.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
కేరాఫ్ క్లాసిక్ బ్యూటీ.. 'సంజనా బత్రా'!
మే 13న ఎన్నికలు.. ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచే పంచే చెట్లు ఇవిగో..
ఆ వ్యక్తుల హెల్త్ సీక్రెట్స్తో యూస్ ఉండదట!
కేకేఆర్ ఆల్రౌండర్కు బిగ్ షాక్.. మ్యాచ్ పీజులో 50 శాతం కోత
RCB vs DC: మరో కీలక మ్యాచ్
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- AP: వ్యవసాయం పండగ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఆడియోతో అడ్డంగా దొరికిపోయిన షర్మిల
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement