-
అమరావతి కలిపింది ఇద్దరినీ..
సాక్షి, అమరావతి : ప్రపంచంలో అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ది ఐదో స్థానం.. అలాంటి దేశానికి మంత్రిగా ఉండి భారీ అవినీతికి బరితెగించి సింగపూర్ ప్రతిష్టకు మాయని మచ్చ తీసుకొచి్చన అమాత్యుడు ఈశ్వరన్.. అతనికి మన అమరావతి రింగ్ మాస్టర్ బినామీ బాబు జతకలిశారు. ఇంకేముంది రాజధాని పేరుతో ప్రజలకు గ్రాఫిక్స్ చూపించి అందినంత దోచేశారు. తోడుదొంగలు ఇద్దరూ కలిసి అమరావతిలో స్టార్టప్ ఏరియా అంటూ ఏకంగా 1,400 ఎకరాలను కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. పాపం పండి ఇద్దరి బాగోతం బట్టబయలైంది. స్కిల్ స్కామ్ కేసులో ‘రాజధాని ఫైల్స్’ సూత్రధారి చంద్రబాబు, సింగపూర్లో అవినీతి అభియోగాలతో ఈశ్వరన్ అరెస్టయ్యారు. వీరిద్దరి అవినీతి లింకులు కలిసింది మాత్రం అమరావతిలోనే.. అవినీతి ‘ఆట’లో ఈశ్వరన్ వాటా.. సింగపూర్లో భారీ ఎత్తున అవినీతికి బరితెగించిన ఆ దేశ మంత్రి ఈశ్వరన్ ఆట కట్టింది. ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలకు పాల్పడ్డారని సింగపూర్ అవినీతి నిరోధక విభాగం కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’(సీపీఐబీ) నిగ్గు తేలి్చంది. ఈ కేసులో నేరం రుజువైతే కనీసం ఏడేళ్లు శిక్ష పడవచ్చు. సింగపూర్కు ఫార్ములా వన్ కార్ రేసింగ్ ముసుగులో ఆయన ముడుపులు స్వీకరించారని ఆ దేశ అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేలి్చంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్, సింగపూర్ పర్యాటక విభాగం మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్బాల్ మ్యాచ్లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్లో హ్యారీపోటర్ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్తోపాటు ఈశ్వరన్ను గతేడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో చార్జ్షిట్లు దాఖలు చేసింది. మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్లు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నారని రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించారని ఒకటి ఉంది. చంద్రబాబు ‘స్కిల్’తో కటకటాలకు ఈశ్వరన్ తోడు దొంగ చంద్రబాబు స్కిల్ స్కామ్లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రూ.5 వేల కోట్ల మేర అసైన్డ్ భూముల కుంభకోణం, రూ.2 వేల కోట్ల మేర ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు, రూ.10 వేల కోట్ల ఇసుక కుంభకోణం, రూ.6,500 కోట్ల మద్యం కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల్లో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సెక్షన్ 17 ఏ ప్రకారం తన అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు వాదనను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. ఆయనపై కేసు కొట్టివేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. రూ.66 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ స్టార్టప్ ఏరియా 20 ఏళ్ల పాటు సింగపూర్ కన్సార్షియం ఆ«దీనంలో ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణకు నియమించిన మేనేజ్మెంట్ కమిటీలో చంద్రబాబు కుటుంబసభ్యులు, బినామీలే ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఏమైనా న్యాయ వివాదాలుంటే లండన్ కోర్టును ఆశ్రయించాలన్నారు. స్టార్టప్ ఏరియాలో ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా తేల్చారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి తరువాత అంతర్జాతీయ సంస్థలకు ఎకరా రూ.25 కోట్ల చొప్పున విక్రయించవచ్చని అంచనా వేశారు. 20 ఏళ్లలో ఎకరా విలువ రూ.50 కోట్లకు చేరుతుందని చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఆ ప్రకారం ...సింగపూర్ కన్సార్షియం గుప్పిట్లో 1,320 ఎకరాలు (1,070 + 250) ఉంటాయి. ఆ 1,320 ఎకరాలను రూ.50 కోట్ల చొప్పున విక్రయిస్తే రూ.66 వేల కోట్లు ఆర్జించే అవకాశముంది. బాబుతో కలిసి అభాసుపాలు కృష్ణా నదీ తీరాన స్టార్టప్ కేంద్రం అంటూ రూ.66 వేల కోట్ల పన్నాగాన్ని చంద్రబాబు, ఈశ్వరన్ రక్తి కట్టించారు. అమరావతి ప్రాంతంలో అతి పెద్ద వాణిజ్య కేంద్రంగా 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని బాబు ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ప్రభుత్వ ఖర్చుతో మౌలిక సదుపాయాలు కలి్పంచి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేశాక దానిని బినామీల పేరిట హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నారు. ఇందులో సింగపూర్కు చెందిన అసెండాస్ కంపెనీని తెరపైకి తెచ్చారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందమని నమ్మించి, తనకు సన్నిహితుడైన అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఓ ప్రైవేటు కంపెనీ అసెండాస్ను తెరపైకి తెచ్చారు. స్విస్ చాలెంజ్ విధానంలో ప్రాజెక్టుల ఖరారును గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టినా.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ను తన బినామీ కంపెనీకి కట్టబెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానాన్ని చంద్రబాబు అనుసరించారు. గ్లోబల్ టెండర్లు లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియానికి అప్పగించారు. ఆ 1,691 ఎకరాల్లోని 371 ఎకరాల్లో ప్రభుత్వం రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. సింగపూర్ కన్సార్షియం అసెండాస్కు ప్రభుత్వం 250 ఎకరాలను ఉచితంగా ఇస్తుంది. మిగిలిన 1,070 ఎకరాలను ప్లాట్లుగా విభజించి వేలం ద్వారా విక్రయిస్తారు. ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా నిర్ణయించారు. 1,070 ఎకరాల విలువ రూ.4,280 కోట్లుగా లెక్కతేల్చారు. నిధులు సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వానికి అందులో 42 శాతం వాటా, కేవలం పర్యవేక్షించే సింగపూర్ కంపెనీకి 58 శాతం వాటా దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. -
మనవాళ్ల కోసం ఎకరాకు పదివేలు.. రాజధాని ప్రాంతంలో సేకరణ
‘‘మనకు ఇదే ఆఖరి అవకాశం.... ఇప్పుడు తప్పితే మరెప్పుడూ రాలేం.. ఈసారి మనం ప్రాణాలకు తెగించి పోరాడాలి.. అవసరమైతే చందాలు ఇవ్వాలి.. విరాళాలు ఇవ్వాలి.. భోజనాలు పెట్టాలి.. ఆస్తులైనా అమ్మాలి... మనవాళ్లను మన పార్టీని మనం కాపాడుకోవాలి.. లేదంటే మన పార్టీతో బాటు మన పెద్దరికాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి.’’ ఇదీ అమరావతి ప్రాంతంలో భూములున్న రైతులు.. చంద్రబాబు సామాజికవర్గం మోతుబరుల్లోని అభిప్రాయం. అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినవాళ్లు.. అమరావతి కారణంగా భూముల ధరలు పెరిగి అమాంతం కోటీశ్వరులు అయినవాళ్లు.. వ్యాపారాలు చేసి పోగేసిన వాళ్లు.. వీళ్లంతా ఎక్కువమంది టీడీపీ సానుభూతిపరులుగా ఉన్నారు. గతంలో రాజధాని పేరిట బాగా లబ్ధిపొందిన ఈ వర్గం వారు 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడంతో హతాశులయ్యారు. ఇక కొందరైతే భారీగా భూముల ధరలు పెరుగుతాయని అప్పులు తెచ్చిమరీ భూములుకొన్నవాళ్ళు ఆ మేరకు ధరలు పెరగకపోవడం... రాజధాని కుంభకోణాలు బయటపడడంతో ఆ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడం... కోర్టు కేసుల్లో కొన్ని భూములు చిక్కుకోవడంతో తమ కలలు కల్లలయ్యాయని కలవరపడ్డారు. ఆ నష్టాన్ని పూరించుకోవాలని, మళ్ళీ రాజధాని పేరిట లబ్ధిపొందాలని సర్వదా ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ ఐదేళ్లు గడిచాక అసెంబ్లీ ఎన్నికలకు సమయం వచ్చింది. దీంతో ఇప్పుడు వాళ్లంతా ఏకమయ్యారు. ఈ ప్రాంతంలో ఎకరా భూమి ఉన్నవాళ్లు కనీసం రూ. 10 వేలు టీడీపీకి విరాళం ఇవ్వాలని .. ఆ మేరకు ఎంత ఎక్కువ భూమి ఉంటె అంత మొత్తంలో డబ్బులు జమచేసి టీడీపీకి విరాళంగా ఇవ్వాలని, టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని తీర్మానించారు. ఈమేరకు గ్రామాలూ.. వార్డులు.. మండలాలవారీగా చంద్రబాబు సామాజికవర్గం ప్రజలు.. వ్యాపారులు రైతులు కూడా ఎకరానికి కనీసం పదివేలు ఖచ్చితంగా ఇవ్వాలన్న నిబంధన విధించి ఆ మేరకు పని చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే గ్రామ.. మండలాల వారీగా కమిటీలు వేసి వసూళ్లు చేపడుతున్నారు. అందరం ఐక్యంగా ఉండాలని, ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ గెలిస్తే తెలుగుదేశానికి పుట్టగతులు ఉండవని, అందుకే ఖచ్చితంగా టీడీపీని గెలిపించుకునే బాధ్యత తామే తీసుకోవాలని తీర్మానించారు. ఈ క్రమంలో వారి వారి స్థాయిని బట్టి చందాలు రెడీ చేస్తున్నారు. ఇక ఇక్కడ భూములు కొనేసి ప్రవాసాంధ్రులు , అమెరికాలోని తానా(TANA) సంఘం సభ్యులు... వారి బంధుమిత్రులు సైతం ఈ బాధ్యతల్లో యాక్టివ్ గా పాల్గొనేలా చూస్తున్నారు. విదేశాల్లోని యువత, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు.. సాఫ్ట్ వేర్, ఇతర వృత్తుల్లోని వాళ్ళను సైతం ఈ చందాల కార్యక్రమంలో చేర్చుకుని టీడీపీ కోసం అందరం పని చేయాల్సిన అవసరాన్ని వాళ్లకు పదేపదే చెబుతున్నారు. ///సిమ్మాదిరప్పన్న /// -
సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ కరపత్రాలను ప్రజలకు అందజేసిన వెల్లంపల్లి
-
రాజధాని ‘ఫెయిల్స్’.. బాబు ‘భ్రమరావతి’
ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించినవి కావు... అని చెబుతున్నట్లే రియాలిటీకి ఏ మాత్రం సంబంధం లేకుండా వచ్చిన రాజధాని ఫైల్స్ను చంద్రబాబు భుజానికి ఎత్తుకుంటున్నాడు. కనీసం అమరావతికి దగ్గర్లో ఉన్న గుంటూరు థియేటర్స్కు కూడా ప్రేక్షకులు పోవడం లేదు. సినిమా రన్ కాగానే ఎంతమంది ఉన్నారో చూస్తే పట్టుమని పదిమంది కూడా థియేటర్లో కనిపించడం లేదు. ఈ సినిమా తెలుగుదేశం తమ్ముళ్లకే కాదు కనీసం అమరావతి రైతులకు కూడా కనెక్ట్ కాలేదని దీంతోనే తేలిపోతుంది. అందుకే చంద్రబాబు నాయుడు తాజాగా ఈ ఫెయిల్స్ సినిమా చూడండి. అందులో మన హరికథలు బాగా చెప్పామంటూ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ♦అమరావతి భూముల ఇష్యూలో నిత్యం పచ్చ మీడియాలో వచ్చే కథనాలే ఒక చోటుకు చేర్చి ప్రజల మీదికి ఈ సినిమాను వదిలాడు చంద్రబాబు. వాస్తవాలను మరచి అసత్యాలు, అబద్దాలను చేర్చి వెండితెర సాక్షిగా సరికొత్త విషప్రయోగాన్ని చంద్రబాబు ప్రయోగించాడు. అమరావతి రైతులు నష్టపోయిందే చంద్రబాబు వల్ల.. ఆ విషయాన్ని దాచి అమరావతిలోని తన పెత్తందార్లతో ఉద్యమాన్ని నడిపించాడు. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు, ఆయన బ్యాచ్ పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిందని, రాజధాని ప్రకటన సమాచారం ముందే తెలుసుకుని భూములు కొనుగోలు చేసి అక్రమాలకు తెగించారని రాష్ట్రం అంతటా తెలుసు. మరీ ఈ ఫెయిల్స్ సినిమాలో ఇవి ఎందుకు కనిపించలేదు చంద్రబాబు..? ఒకసారి ఆ జ్ఞానం లేని డైరెక్టర్ గారిని అడగాల్సింది. అసలు భూముల పేరుతో అమరావతిలో కుట్రలకు, దారుణాలకు తెర లేపింది చంద్రబాబు కాదా..? ఎల్లో మీడియాలో రోజూ వచ్చే కథనాలే నిజం అనేలా ఇలా మళ్లీ సినిమా పేరుతో ప్రజలపై రుద్దడం ఎందుకు. ♦ వాస్తవానికి ఈ సినిమా చుట్టూ రైతుల భూముల గురించే ఉంది. కానీ రాజధాని నిర్మాణ వైఫల్యంపై ఎందుకు ఫోకస్ చేయలేదు. అలా చేస్తే అది చంద్రబాబుకూ వ్యతిరేకం అవుతుంది కాబట్టి.. చంద్రబాబు 5 ఏళ్ల పాటు గ్రాఫిక్స్లతో కాలం గడిపి అమరావతిలో తనకు సంబంధించిన వారికే భూములు కట్టబెట్టి తన చూట్టూ ఇన్నర్ రింగ్రోడ్డు మాదిరి ఒక కోటరీనే ఏర్పరుచుకున్నాడు. ఇవన్నీ తెలుసుకున్న జనాలు ఆయన్ను ఓడగొట్టడంతో ఆ కోట కాస్త బద్దలైంది. అప్పటి నుంచి అమరావతి భూములపై ఎల్లో మీడియా చెప్పే కథలే ఈ రాజధాని ‘ఫెయిల్స్’లో అతుకులబొంతలా ఉన్నాయి. ♦ అమరావతి ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టింది టీడీపీ పెద్దలే అన్న విషయం ఈ ఫెయిల్స్ సినిమా డైరెక్టర్కు గుర్తుకు రాలేదేమో... చంద్రబాబుతో మొదలు పెడితే లోకేశ్,నారాయణ , గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు ఇలా చాంతాడంత లిస్ట్ ఉంది. అమరావతి ప్రకటనకు ముందు వీళ్లకు అక్కడ భూములు ఉన్నాయా..? ఉన్నాయని ఒక్కరైతుతో అయిన చెప్పించగలరా..? అమరావతి పేద రైతుల ఆశలపై నీళ్లు చల్లింది చంద్రబాబు అని అక్కడున్న వారందరికీ తెలుసు. అమరావతి పేద రైతులను చంద్రబాబు మంచి చేసి ఉంటే అదే ప్రాంతంలో నారా లోకేష్ ఎందుకు దారుణంగా ఓడిపోతాడు.. మళ్లీ ఈసారి ఎక్కడ పోటీ చేస్తాడో ఆయనకే క్లారిటీ లేదు. వీళ్ల మోసాల గురించి ప్రతి అమరావతి పేద రైతుకు తెలుసు.. అందుకే వారి వెంట పెత్తందార్లు మాత్రమే ఉద్యమం పేరుతో నడిచారు. ఇవన్నీ ఈ రాజధాని ఫెయిల్స్ సినిమాలో ఎందుకు లేవో చెప్పగలరా..? ♦టీడీపీ సర్కార్ అధికారంలోకి రాగానే చంద్రబాబు ఇచ్చిన లీకుల మేరకు ఆయన, ఆయన బినామీలు, మంత్రుల బినామీల ద్వారా రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున భూముల్ని తక్కువ ధరకు కాజేశారు. జూన్ 1, 2014 నుంచి డిసెంబర్ 31, 2014 మధ్య జరిగిన రిజిస్ట్రేషన్లు పరిశీలించాక.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా 4,069.94 ఎకరాలను కొల్లగొట్టారు. ఇదంతా ఎలా జరిగిందో సినిమాలో చూపించాల్సింది. ♦ మాజీ మంత్రి నారాయణ.. తన వద్ద పనిచేసే అవుల మునిశంకర్, రాపూరు సాంబశివరావు, పొత్తూరి ప్రమీల, కోతపు వరుణ్కుమార్ల పేర్లతో 55.27 ఎకరాల భూమిని కొన్నారు. నాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరిట 38.84 ఎకరాల భూమి.., అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తన బినామీ సంస్థ అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు సన్నిహితుడైన వేమూరు రవికుమార్ ప్రసాద్ ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గోష్పాద గ్రీన్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ ట్రెండ్స్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ పేరిట 62.77 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. భూసమీకరణ ద్వారా రైతుల నుంచి తీసుకున్న భూముల కేటాయింపులోనూ టీడీపీ సర్కార్ అక్రమాలకు పాల్పడింది. రాజధాని ప్రాంతంలో 850 ఎకరాల భూములను సన్నిహితుల సంస్థలకు చంద్రబాబు ధారాదత్తం చేసినట్లు లెక్కలున్నాయి. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. ♦ రాజాధాని ఫైల్స్లో శివరామకృష్ణ కమిటీతో పాటు కాగ్ ప్రస్తావనే లేదు.. కానీ వారికి నచ్చిన నారాయణ కమిటీ రిపోర్ట్ను మాత్రం కళ్లకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్.. అసలు అమరావతి గురించి శివరామకృష్ణ కమిటీ కీలకమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. వాటిని పట్టించుకోకుండా బాబుగారి ఇన్నర్ గేమ్ను వెండితెరపై చూపించే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డాడు డైరెక్టర్. ♦రాజధాని అమరావతి రాష్ట్రంపై అంతులేని భారీ ఆర్థిక భారాన్ని మోపుతుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక హెచ్చరించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తక్షణంతో పాటు భవిష్యత్తులోనూ మోయలేని ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ గుదిబండే అని కాగ్ హెచ్చరించింది. అంతేకాకుండా అమరావతిలో పేదలు, రైతులకు కౌలు చెల్లింపుల్లోనూ అక్రమాల జరిగాయని గుర్తించింది. అంతేకాకుండా అమరావతి విషయంలో శివరామకృష్ణ కమిటీ కీలంకంగా వ్యవహరించింది. ఏపీలో ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదని శివరామకృష్ణ కమిటీ తేల్చింది. ప్రభుత్వ వ్యవస్థలను ఒకేచోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్రంలో రాజధానిని, అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలని తెలిపింది. విజయవాడ-గుంటూరు, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి-నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వ వ్యవస్థలను వికేంద్రీకరించాలని కోరింది. రాజధానిని రెండు పట్టణాల మధ్య పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయని హెచ్చరించింది. ఇవన్నీ సినిమాలో చూపించకుండా నారాయణ కమిటీ గురించి మాత్రమే చెబితే ఎలా డైరెక్టర్ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ♦ అమరావతి గ్రామాలలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందన్నది పచ్చి నిజం. ఈ విషయం చిన్నపిల్లవాడికి కూడా తెలుసు. ఇంతటి దారుణమైన పాపానికి ఒడిగట్టిన చంద్రబాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంతటి సూపర్ హిట్ భాగాన్ని సినిమా కథలో ఎందుకు చెప్పలేదు. చంద్రబాబు హయాంలో దళితుల నుంచి అసైన్డ్ భూములను వారికి కొంత ధర చెల్లించో, భయపెట్టో, లేక రకరకాల సందేహాలు రేపి దళితేతరులు స్వాధీనం చేసుకున్నారన్నది నిఖార్సైన వాస్తవం. 2015 ప్రారంభం నుంచి రాజధాని నిర్మాణం పేరుతో భూసమీకరణ ప్రారంభించారు. అప్పుడు పట్టా భూములకే పరిమితం అయ్యారు. కానీ 2016 ఫిబ్రవరిలో అసైన్డ్ భూములను కూడా తీసుకుంటామని జీఓ 41 తెచ్చారు. ♦ఈ మధ్యకాలంలోనే పలువురు టీడీపీ నేతలు, ఇతర వ్యక్తులు ఈ భూములను 95 శాతం వరకు కొనుగోలు చేశారు. వారికి ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నది నిజం కాదా..? సినిమాలో ఇవన్నీ ఎందుకు లేవు. ఇలా అమరావతి భూముల విషయంలో చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన మోసాల గురించి చెప్పుకుంటూ పోతే 100 అసలైన రాజధాని ఫైల్స్ సినిమాలు తీయవచ్చు అనేది నిజం. సినిమా పేరుతో అసలు నిజాలు దాచి వదిలితే నమ్మే రోజులు పోయాయని ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తెలిసినట్లు లేదు. అందుకే ఇప్పుడు ఆ సినిమాను నెటిజన్లు ట్రోల్ చేస్తూ నవ్వుకుంటున్నారు. డైరెక్టర్ భానుతో పాటు చంద్రబాబుకు వీటికి సమాధానం చెప్పగలరా? ►అసలు రాజధాని ఎక్కడ పెట్టమని కేంద్రం చెప్పింది? ►ప్రభుత్వ భూములు ప్రకాశం జిల్లాలో ఉన్నాయని చెప్పినా.. బాబు ఎందుకు వినలేదు? ►కృష్ణా నది తీరం పంటలకు అనువైన భూమి, రాజధాని కట్టడం వల్ల కాంక్రీట్ జంగిల్గా మారుతుందని చెప్పినా పెడచెవిన ఎందుకు పెట్టారు? ►కృష్ణా నదిని ఆక్రమించి కట్టిన కరకట్ట ఇంట్లో బాబు ఎందుకు ఉంటున్నాడు? ►క్విడ్ ప్రో కోలా ఎక్కడ రాజధాని వస్తుందో ముందే తన పార్టీ నేతలకు చెప్పించి భూములు ఎలా కొనిపించాడు? ►పొలాలు ఇవ్వని రైతుల పంటలు తగులబెట్టిందెవరు? ►ఇంత చేస్తే బాహుబలి సినిమాలోలా గ్రాఫిక్స్ భ్రమరావతిని ఎందుకు చూపించారు? ►ఇంకెన్నాళ్లు రాజధాని పేరు చెప్పి మోసం చేస్తారు? -
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారు.. చివరకు
'అమరావతి రాజదాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది.. ఇదంతా తనకు అంతర్జాతీయగా ఉన్న పలుకుబడివల్లే .."అని 2014-2019 మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పదే, పదే చెప్పుకున్న మాటలు. ఆయనకు మాటలకు తగినట్లే సింగపూర్ దేశ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ తరచు అమరావతి రావడం, చంద్రబాబుతో ముచ్చట్లు పెట్టుకోవడం, ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ ను ఆరంభించడానికి ఒప్పందం చేసుకోవడం గమనించిన పలువురు నిజంగానే ఏపీ మీద, ఎపి రాజధాని మీద అభిమానంతోనే సింగపూర్ మంత్రి తరచు వస్తున్నారేమోలే అని అనుకునేవారు. కాని అప్పట్లోనే నిశితంగా పరిశీలన చేసే కొందరు మాత్రం ఇందులో ఏదో మోసం ఉందని అనేవారు. వారి మాటలను తోసిపుచ్చుతూ వారిని అమరావతి యజ్ఞాన్ని పాడుచేసే రాక్షసులు మాదిరి అని చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శిస్తుండేవారు. ఈశ్వరన్ లాగానే బిడిశెట్టి అనే మిత్రుడు కూడా చంద్రబాబుకు ఉన్నారు. ✍️ ఆయనకు కూడా ఏదో మెడికల్ హబ్ పెడతారని చెప్పి అమరావతిలో వంద ఎకరాల భూమిని తక్కువ ధరకు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. విశేషం ఏమిటంటే చంద్రబాబు మిత్రులు ఇద్దరూ అవినీతి , హవాలా కేసులలో చిక్కుకోవడం. ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కి సింగపూర్ లో అరెస్టు అవడం తదుపరి మంత్రి పదవిని కోల్పోవడం జరిగింది. బిడి శెట్టిని దుబాయి జైలులో అక్కడి ప్రభుత్వం పెట్టింది. మరో ఆసక్తికరపరిణామం ఏమిటంటే ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, రాజదాని కేసులు మొదలైనవాటిలో ఇరుకున్నారు. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయి 53 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ముగ్గురు మిత్రులు అవినీతి ఊబిలో ఉన్నారన్నమాట. సింగపూర్ లో ఈశ్వరన్ పై మొత్తం 27 అభియోగాలు వచ్చాయి. ✍️చంద్రబాబుకు సన్నిహితులైన ఈశ్వరన్ ,బిడి శెట్టి వంటివారు అరెస్టు అవడంంతో తెలుగుదేశం పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. వీరి అరెస్టుపై చంద్రబాబు స్పందించలేదు. కనీసం ఈశ్వరన్ కు సానుభూతి కూడా తెలపలేదు. అదే వైసిపికి సంబంధించినవారికి తెలిసినవారెవరైనా ఇతర దేశాలలో కేసులలో చిక్కితే ఇదే చంద్రబాబు కొండెక్కి అరిచేవారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ కేసులలో కొందరు అధికారులను పెడితే అదంతా జగన్ తో సంబంధాల వల్లే అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు తన మిత్రుల అరెస్టుపై కిక్కురుమనలేకపోతున్నారు. ఈశ్వరన్, శెట్టిల పై వచ్చిన అవినీతి కేసుల గురించి ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు కుక్కిన పేల మాదిరి నోరు మెదపలేదు. సింగపూర్ దేశ ప్రభుత్వం వారు మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇస్తున్నారని కూడా అప్పట్లో చంద్రబాబు ప్రచారం చేశారు. ✍️తీరా చూస్తే అది అసత్యమని ఆ తర్వాత తేలింది. సింగపూర్ కు చెందిన కొన్ని ప్రైవేటు కంపెనీలతో కన్సార్టియమ్ ఏర్పాటు చేసి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ తయారు చేయాలని సంకల్పించారు. మామూలుగా అయితే దానిని తప్పు పట్టనక్కర్లేదు. కాని అవేదో సింగపూర్ దేశ ప్రభుత్వ కంపెనీలే వచ్చి ఈ వెంచర్ ను ఆరంభిస్తున్నట్లు చంద్రబాబు చెబుతుండేవారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు బాకాలు ఊదుతుండేవి. తీరా చూస్తే అవి ప్రైవేటు కంపెనీలని తదుపరి వెల్లడైంది. సింగపూర్ ప్రభుత్వంతో ఆ సందర్భంలో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అందరిని విస్తుపరచింది. సింగపూర్ కంపెనీలు 300 కోట్ల రూపాయలను పెట్టుబడి పెడితే, ఏపీ ప్రభుత్వం సుమారు 5600 కోట్ల రూపాయల మేర వ్యయం చేసి ఆ వెంచర్ కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి అంగీకరించింది. ✍️ కంపెనీతో ఏదైనా తేడా వస్తే లండన్ కోర్టులో తేల్చుకోవాలన్న కండిషన్ పెట్టారు. స్విస్ చాలెంజ్ పద్దతిన ఈ వెంచర్ కు భూమి కేటాయించినట్లు అప్పట్లో ప్రకటించారు. దీనిపై అప్పట్లో హైకోర్టు తప్పుపడితే, మళ్లీ చట్టాన్ని మార్చి మరీ తాము అనుకున్న స్కీమును చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసింది. విశేషం ఏమిటంటే 300 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీకి 56 శాతం వాటా ఇచ్చి, ఏపీ ప్రభుత్వం మాత్రం మైనర్ వాటాదారుగా ఒప్పుకోవడం. ఈ వ్యవహారంపై ఎందరు అభ్యంతరం చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు. ఏకంగా 1600 ఎకరాల భూమిని ఇందుకోసం కేటాయించారు. ✍️నిజానికి ఇలాంటి స్కీములు అమలు చేయడానికి ముందుగా వాస్తవ పరిస్థితిని సర్వే చేసి డిమాడ్ నిర్ణయించుకుంటారు. అవేవి లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేయడం అంటే, చుట్టుపక్కల ఉన్న తమ భూముల విలువలను పెంచుకోవడానికే అన్నది బహిరంగ రహస్యం. ఈ వివాదాస్పద నిర్ణయం పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చే టైమ్ కి చంద్రబాబు ప్రభుత్వం ఓటమిపాలైంది. కొత్తగా వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని విషయాలను పరిశీలించడంతో ,తమ లొసుగులు బయటపడుతున్నాయని భావించిన సింగపూర్ కంపెనీల కన్సార్షియం తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెళ్లిపోతామని ప్రభుత్వానికి తెలియచేసింది.దాంతో ఆ కధ ముగిసింది. చంద్రబాబు,ఈశ్వరన్ కలిసి చేపట్టిన రియల్ ఎస్టేట్ వెంచర్ భాగోతం అంతా బట్టబయలైంది. ఆ తర్వాత కాలంలో ఈశ్వరన్ పై అవినీతి కేసులు వచ్చాయి. ✍️సింగపూర్ దేశం ఇలాంటి అవినీతి వ్యవహారాలను అసలు అంగీకరించదు.అందువల్లే ఆయనను పదవినుంచి తప్పించడమే కాకుండా ఆ కేసుల విచారణకుఆదేశాలు ఇచ్చారు. ఈ నేపధ్యంలో చంద్రబాబుకు సింగపూర్ లో కూడా బినామీ లావాదేవీలు ఉన్నాయని, వాటికి ఈశ్వరన్ సహకారం ఉండి ఉంటుందని, అందువల్లే ఆయనకు ఏపీలో లాభం చేకూర్చే యత్నం చేశారని వివిధ రాజకీయ పక్షాలు ఆరోపిస్తుంటాయి. ఈశ్వరన్ కు సంబంధించిన అన్ని లావాదేవీలను పరిశీలిస్తే ఇలాంటి స్కామ్ లు ఏవైనా ఉంటే బయటపడవచ్చన్న భావన కూడా ఉంది. అమరావతి రాజధానిని ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్ గా చంద్రబాబు మార్చారనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం ఉండదు. ✍️ అవసరం లేకపోయినా 34 వేల ఎకరాల భూమి సేకరించడం, వారికి ఏటా సుమారు 250 కోట్ల రూపాయల కౌలు చెల్లించవలసి రావడం, వారికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వడానికి లక్ష కోట్ల రూపాయల వ్యయం చేయాల్సి ఉండడం ..ఇవన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాని ఫలితంగానే అమరావతి ప్రాంతంతో సహా రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయితే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు భోగి మంటలు వేసుకుని, మళ్లీ అమరావతిలోనే లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. తద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాల ప్రజలకు నష్టం చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. ✍️రాష్ట్ర ప్రజల సొత్తు అంతటిని ఒక్క అమరావతిలోనే ఖర్చు చేస్తామని చంద్రబాబు, పవన్ లు చెబితే మళ్లీ ఇతర ప్రాంతాలలో వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి కుల రాజధాని అని, ఇక్కడ శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చినవారెవరైనా నివసించే పరిస్థితి ఉందా అని అడిగేవారు.కాని ఆశ్చర్యంగా ఏ రకమైన ఒప్పందం కుదిరిందో తెలియదు కాని చంద్రబాబు తో ఆయన కూడా మిలాఖత్ అయిపోయారు. ✍️ఇన్ సైడ్ ట్రేడింగ్ ,అస్సైన్డ్ భూముల స్కామ్ మొదలైనవి ఉండనే ఉన్నాయి. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కు అమరావతి అవినీతితో కూడా ఏమైనా సంబంధం ఉందా? చంద్రబాబుకు, ఆయనకు మద్య ఉన్న లావాదేవీలు ఏమిటి? అన్నవాటిపై విచారణ జరగలేదు. మొత్తం మీద అమరావతి అంటే అదొక అవినీతి కేంద్రం అన్న భావన ఏర్పడిన నేపధ్యంలో ఈశ్వరన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అలాగే శెట్టి గోల్ మాల్ వెల్లడైంది. వీటిపై చంద్రబాబు వివరణ ఇచ్చి, ఆ తర్వాత అమరావతి గురించి మాట్లాడితే జనం అప్పుడు ఆయన చెప్పిన మాటలలోని విశ్వసనీయత గురించి ఆలోచిస్తారు. లేకుంటే కచ్చితంగా ఈ అవినీతి ఊబిలో చంద్రబాబు బృందానికి కూడా ఏదో లింక్ ఉందని అనుమానిస్తారు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement