-
అప్పట్లో అభ్యర్థికో బ్యాలెట్ బాక్స్
పుట్టపర్తి టౌన్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో నేడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వినియోగిస్తున్నారు. 1952, 1957 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఒక్కొక్కరికి ఓ బ్యాలెట్ బాక్స్ను ఏర్పాటు చేసేవారు. ఓటర్లు ఏ అభ్యర్థికి ఓటు వేస్తే వారికి కేటాయించిన పెట్టెలోనే బ్యాలెట్ పేపర్ వేయాల్సి ఉండేది. సంస్కరణల్లో భాగంగా 1962లో నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్ బూత్కు ఓ బ్యాలెట్ బాక్స్ ఏర్పాట చేస్తూ వచ్చారు. కాలక్రమేణా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగం ఆరంభం కావడంతో ఓటింగ్ ప్రక్రియలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. 25న చింత, వేరుశనగ చెక్క వేలం బుక్కరాయసముద్రం: ఈ నెల 25న బుక్కరాయసముద్రం మండల పరిధిలోని ఓపెన్ ఎయిర్ జైలులో చింతపండు పంటకు వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ జైలు సూపరింటెండెంట్ చిన్నారావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేలంలో పాల్గొనే వారు రూ.3వేలు ధరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. వేలం ముగిసిన తర్వాత ధరావత్తును వెనక్కు చెల్లిస్తారు. అలాగే 25వ తేదీ జిల్లా జైలు ఆవరణలో 20 వేల కిలోల వేరుశనగ చెక్కకు వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ జైలు సూపరింటెండెంట్ రహమాన్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేలం పాటలో పాల్గొనేవారు రూ.17,600 చెల్లించాల్సి ఉంటుంది. వేలం పాట ముగిసిన తర్వాత డిపాజిట్ సొమ్ము వెనక్కు చెల్లిస్తారు. సెల్ఫోన్ ఇవ్వలేదని బాలిక ఆత్మహత్య బ్రహ్మసముద్రం : సెల్ఫోన్ చేతికి ఇవ్వకపోవడంతో క్షణికావేశంలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం ఎస్.కోనాపురం గ్రామానికి చెందిన రుద్రప్ప కుమార్తె రూప (16) తొమ్మిదో తరగతి వరకు చదువుకుని మధ్యలో స్కూల్ మానేసింది. ఈ క్రమంలోనే ఇంటి పట్టునే ఉంటూ పొలం పనుల్లో తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటూ వచ్చింది. ఇటీవల సెల్ఫోన్కు ఎక్కువగా అలవాటు పడడంతో విషయం గమనించిన తల్లిదండ్రులు మందలించారు. రెండు రోజులుగా ఆమె చేతికి సెల్ఫోన్ ఇవ్వకుండా కట్టడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె క్షణికావేశంలో సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొలానికి వెళ్లిన ఆలస్యంగా ఇంటికి చేరుకున్న తండ్రి... ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమార్తెను చూసి బోరున విలపించాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ పరుశురాముడు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. డబ్బు, మద్యం పంచినా.. ప్చ్ ● ‘గుమ్మనూరు’ నామినేషన్ కార్యక్రమానికి జనం కరువు ● అసహనంతో పోలీసులపై గుమ్మనూరు ఈశ్వర్ జులుం గుంతకల్లు: విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచినా గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరామ్ నామినేషన్ కార్యక్రమానికి జనం కరువయ్యారు. సోమవారం నిర్వహించిన నామినేషన్ కార్యక్రమానికి ప్రజలను తరలించేందుకు టీడీపీ నేతలు ఆపసోపాలు పడ్డారు. విచ్చలవిడిగా డబ్బు, కేసుల కొద్దీ మద్యం, పదుల సంఖ్యలో వాహనాలు సమకూర్చినా ఫలితం కానరాలేదు. వచ్చిన కొద్ది మంది కూడా ఆలూరు నియోజకవర్గ వాసులే. గుంతకల్లు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు ఆసక్తి కనబరచకపోవడంతో తన సొంత నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జనాన్ని తీసుకొచ్చారు. ఇక.. నామినేషన్ సందర్భంగా గుమ్మనూరు నిర్వహించిన ర్యాలీలో కొంతసేపు కనిపించిన జితేంద్రగౌడ్ ఆ తర్వాత కనిపించకపోవడం గమనార్హం. పోలీసులపై గుమ్మనూరు కుమారుడి జులుం.. మద్యం, డబ్బు గుమ్మరించినా జనం రాకపోవడంతో గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్ సహనం కోల్పోయాడు. పోలీసులపై జులుం ప్రదర్శించాడు. నిబంధనల ప్రకారం నామినేషన్ దాఖలు చేసే వ్యక్తితోపాటు నలుగురికి మాత్రమే అనుమతి ఉందని, అంతకంటే ఎక్కువ మంది వెళ్లడానికి వీలు లేదని పోలీసులు ఆయన్ను అడ్డుకోగా.. వారిపైనే దౌర్జన్యానికి దిగాడు. ‘నన్నే అడ్డుకుంటారా.. మీ కథేంటో త్వరలో చెప్తా’ అంటూ చిందులు తొక్కాడు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించాక తోక ముడిచాడు. పోలింగ్ కేంద్రాల పరిశీలన పెద్దపప్పూరు: మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన జూటూరు, చీమలవాగుపల్లి, నరసాపురం, పెద్దపప్పూరు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సోమవారం సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ, ఎస్ఐ శరత్చంద్ర పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలూ చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తలను చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. -
‘దేశం’.. గందరగోళం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎండలతో పాటే రాజకీయ వాతావరణమూ బాగా హీటెక్కింది. ఎన్నికల్లో మొదటి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది. అయినా, నేటికీ టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఎక్కడో ఒక చోట ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు ఫ్లెక్సీలు తగులబెట్టడం, బొమ్మలను చెప్పులతో కొట్టడం చేస్తున్నారు. అభ్యర్థుల డీలా.. టీడీపీలో చివరి నిమిషం వరకూ బీ ఫారం ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితి. ఉన్నత చదువులు చదివిన డాక్టరుకు టికెట్ ఇచ్చానని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు.. రెండు వారాల్లోనే మడకశిరలో అభ్యర్థిని మార్చి అగ్గి రాజేశాడు. రాప్తాడు నియోజకవర్గంలో సునీత, శ్రీరాం ఇద్దరూ నామినేషన్ వేయడంతో అభ్యర్థి ఎవరో ఇప్పటికీ తెలియక ఆ పార్టీ కేడర్ తికమకపడుతున్నారు. పుట్టపర్తిలో కోడలికి వద్దని తనకే టికెట్ ఇవ్వాలని ఇప్పటికీ పల్లె రఘునాథరెడ్డి చంద్రబాబు వద్ద ప్రాధేయపడుతున్నట్టు సమాచారం. ఈనెల 25 వరకూ ఎప్పుడు ఏం జరుగుతుందో తాము చెప్పలేమని టీడీపీ పార్టీ అభ్యర్థులే వాపోతున్నారు. చంద్రబాబు చర్యలతో ఆ పార్టీ అభ్యర్థులు పూర్తిగా డీలా పడిపోయినట్లు తెలుస్తోంది. దూసుకుపోతున్న వైఎస్సార్ సీపీ.. ఎన్నికల కదనరంగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దూసుకుపోతోంది. ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గడిచిన నెలన్నర రోజులుగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు జనంతో మమేకమై తిరుగుతున్నారు. అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థులను ప్రకటించడంతో జనంలోనూ ఒక నమ్మకం ఏర్పడింది. అభ్యర్థులకు నీరాజనం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా జనం నీరాజనం పడుతున్నారు. సోమవారం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ అభ్యర్థిగా వై.విశ్వేశ్వరరెడ్డి నామినేషన్లు వేశారు. వేలాది మంది సమక్షంలో అనంత, విశ్వ నామినేషన్లు దాఖలు చేశారు. అశేష జన వాహిని మధ్య నామినేషన్లు దాఖలు చేయడం అభ్యర్థుల గెలుపునకు సంకేతాలుగా చెప్పుకోవచ్చు. నేడు ఈరలక్కప్ప నామినేషన్.. అత్యంత సాధారణ వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి చరిత్ర సృష్టించిన పార్టీ వైఎస్సార్ సీపీ. అలా వైఎస్సార్ సీపీ టికెట్ పొందిన ఉపాధి హామీ కూలీ ఈర లక్కప్ప నేడు మడకశిరలో నామినేషన్ వేయనున్నారు. టిప్పర్ డ్రైవర్ అంటూ చంద్రబాబు హేళన చేసిన మరో సాధారణ వ్యక్తి వీరాంజనేయులు.. శింగనమల నియోజకవర్గంలో ఈనెల 24న నామినేషన్ వేయనున్నారు. అదే రోజు రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, 25న గుంతకల్లులో వెంకట్రామిరెడ్డి, రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి, కదిరిలో మక్బూల్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ గడువు రెండు రోజులే వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్లో జోష్ టీడీపీలో మాత్రం సందిగ్ధం తాజాగా మడకశిర అభ్యర్థి మార్పుతో ‘తమ్ముళ్ల’ తికమక గెలుపుపై ఆ పార్టీ అభ్యర్థుల్లో సన్నగిల్లుతున్న నమ్మకం -
గోవుకు అరుదైన ఆపరేషన్
అనంతపురం అగ్రికల్చర్: పశుశాఖ శింగనమల ఏడీ డాక్టర్ జి.పద్మనాభం మరో అరుదైన శస్త్రచికిత్సతో ఓ వీధి ఆవుకు ప్రాణం పోశారు. వివరాలు... గర్భంతో ఉన్న ఓ వీధి ఆవు ప్రసవం కాక అనంతపురంలోని పశుశాఖ కార్యాలయం సమీపంలో ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆ శాఖ జేడీ డాక్టర్ వై.సుబ్రహ్మణ్యం గుర్తించి, అత్యవసర వైద్యం చేయాలని డాక్టర్ జి.పద్మనాభంకు సూచించారు. వెంటనే సలకంచెరువు పశువైద్యశాల డాక్టర్ కిరణ్కుమార్రెడ్డితో కలసి అక్కడకు చేరుకున్న డాక్టర్ పద్మనాభం... ఆవును పరీక్షించి కటి కుహరం చాలా చిన్నదిగా ఉండడంతో దూడ బయటకు రాలేక లోపలే చనిపోయినట్లు నిర్ధారించారు. విషయాన్ని జేడీ దృష్టికి తీసుకెళ్లి, ఆయన అనుమతితో శస్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9.30 గంటలకు ఆపరేషన్ చేశారు. చీకట్లో వాహనం హెడ్లైట్లను ఉపయోగించుకున్నారు. దూడను ముక్కలుగా చేసి వెలికి తీసి, ఆవు ప్రాణాలు కాపాడారు. అరుదైన ఈ శస్త్రచికిత్సలో సిబ్బంది శివ, ప్రవీణ్, చైతన్య, రజాక్, నరేష్, ఆంజనేయులు, డ్రైవర్ రామసుబ్బారెడ్డి సహకరించారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత వైద్య బృందాన్ని జేడీ అభినందించారు. అనుబంధ కమిటీల నియామకం అనంతపురం కార్పొరేషన్: సీఎం, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ అనుబంధ కమిటీలను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుజ్జల శివయ్య, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోకుల్ రెడ్డి (శింగనమల) నియమితులయ్యారు. -
అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల నిర్వహణ క్రమంలో అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎనికల అధికారి వి.వినోద్కుమార్ ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధత, పోస్టల్ బ్యాలెట్, తదితర అంశాలపై కసోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నగర పాలక కమిషనర్ మేఘస్వరూప్, డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డితో కలిసి నోడల్, జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహనతో ఉంటూ పనిచేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయించాలన్నారు. క్లిష్టమైన, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులు లిఖితపూర్వకంగా అడిగితే ఇవ్వాలని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు తమ పరిధిలోని బృందాలతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని కావాల్సిన వివరాలు, సమాచారం తెప్పించుకోవాలని సూచించారు. పోలింగ్ విధుల్లో ఉండే ఉద్యోగులందరూ తప్పకుండా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ప్రభుత్వ ఆస్పత్రులు, సర్వజనాస్పత్రిలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎక్కువ సంఖ్యలో ఉంచుకోవాలని సూచించారు. ఈనెల 25న మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించాలన్నారు. వేసవిలో పశువుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ విజయభాస్కర్రెడ్డి, నోడల్ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. బాధ్యతగా పనిచేయాలి ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ విషయంలో పోల్ టీమ్లది క్రియాశీల పాత్రన్నారు. పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ ప్రక్రియపై పోల్ టీమ్లకు సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని దిశనిర్ధేశం చేశారు. 85 ఏళ్లు పైడిన వారికి, దివ్యాంగులకు హోమ్ ఓటింగ్కు సంబంధించి 13ఎ (డిక్లరేషన్), 13బి(బ్యాలెట్), 13సి (కవర్) ఉంటుందన్నారు. 13సి(కవర్)లో 13ఎ, 13బి ఉంటాయన్నారు. కవర్లో అవి రెండు ఉన్నప్పుడే అది వ్యాలీడ్ ఓటు అవుతుందన్నారు. ఎక్కడైనా ఓటు రికార్డు చేసేప్పుడు పోల్ ఆఫీసర్, పోలీసు అధికారి, వీడియో గ్రాఫర్, సూక్ష్మ పరిశీలకుడు ఉండాలన్నారు. కార్యక్రమంలో నగర పాలక కమిషనర్ మేఘస్వరూప్, డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డీపీఓ ప్రభాకర్రావు, శిక్షణ అధికారులు రఘునాథ్రెడ్డి, బసవరాజు, పోల్టీమ్ అఽధికారులు పాల్గొన్నారు. ఘనంగా రాములోరి కల్యాణోత్సవం శింగనమల: శింగనమలలోని ఆత్మసీతారాముల కల్యాణోత్సవం సోమవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించి, కల్యాణం వైభవంగా జరిపించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నేడు సంగమేశ్వరుడి రథోత్సవం కూడేరు: దక్షిణ భారత దేఽశంలోనే పేరొందిన శైవక్షేత్రాల్లో ఒక్కటిగా నిలిచిన కూడేరులోని శివపార్వతుల జోడులింగాల సంగమేశ్వరుడి రథోత్సవం మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ రమేష్బాబు, ధర్మకర్త రామదుర్గం క్రిష్టప్ప సోమవారం తెలిపారు. ఈ నెల 23న ఉదయం 10.45 గంటలకు మడుగు తేరు, సాయంత్రం 5.30 గంటలకు బ్రహ్మరథోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. -
విజయం మాదే: ఎమ్మెల్యే అనంత
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.ర్యాలీలో భాగంగా గీతామందిరం సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురం నియోజకవర్గంలో రూ.1,045 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా ప్రజలకు రూ.2 వేల కోట్ల సంక్షేమ ఫలాలు అందించామన్నారు. ఈ ఎన్నికల్లోనూ విజయం తమదేనని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనంతపురం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు. గతంలో వైఎస్సార్ సీపీకి వచ్చిన సీట్ల కంటే ఈసారి ఎక్కువగా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అవినీతిలో కూరుకుపోవడమే కాకుండా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై అప్పట్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. -
మండుటెండలోనూ పోటెత్తారు..
ఉరవకొండ: పట్టణంలో సోమవారం వైఎస్సార్ సీపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. వైఎస్సార్ సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు పోటెత్తారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా గ్రామాల నుంచి తరలివచ్చి విశ్వకు మద్దతు తెలిపారు. మహిళలు సైతం వేలాదిగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. డీజేలు, డ్రమ్స్, వాయిద్యాలు, తప్పెట్లు, బాణాసంచా పేలుళ్ల మధ్య డ్యాన్సులు చేస్తూ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా కూడేరు సంగమేశ్వరస్వామి ఆలయం, పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయాల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి విశ్వ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను తన కుమారుడు, పార్టీ యువనేత ప్రణయ్రెడ్డి, నాయకులు ఏసీ ఎర్రిస్వామి, మూలగిరిపల్లి ఓబన్న, ఎంసీ నాగభూషణంతో కలిసి ఆర్ఓ కేతన్గార్గ్కు అందించారు. ఉరవకొండ, విడపనకల్లు, కూడేరు, వజ్రకరూరు, బెళుగుప్ప మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి ర్యాలీ చేపట్టారు. దారి పొడవునా ఉప్పొంగిన ఉత్సాహంతో వేచి చూస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కవితాహోటల్ సర్కిల్ వద్ద నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ఉరవకొండ నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని, నిండు మనసుతో తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీంఅహ్మద్, యాదవ, రజక కార్పొరేషన్ల చైర్మన్లు హరీష్యాదవ్, మీసాల రంగన్న, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వీరన్న, ఆర్టీసీ రీజి నల్ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల, ఐదు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ యార్డు చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉరవకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ‘విశ్వ’ నామినేషన్ భారీగా తరలివచ్చిన నాయకులు -
34 నామినేషన్ల దాఖలు
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. నాల్గో రోజు సోమవారం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు 34 నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఆరు సెట్ల నామినేషన్లు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు 28 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వి.వినోద్కుమార్ వద్ద అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాలగుండ్ల శంకరనారాయణ తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, నాయకులు వెన్నపూస రవీంద్రారెడ్డి, రాజారామ్, పెన్నోబులేసు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయగా.. రెండో సెట్ను వైఎస్సార్సీపీ నాయకుడు పామిడి వీరాంజినేయులు దాఖలు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా జి.లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అదే విధంగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాలగుండ్ల రవీంద్ర, జాతీయ చేనేత వృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా ఉమ్మడిశెట్టి చిన్న వెంకట సుబ్బయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా జి.వి.రమణారెడ్డి, వడ్ల కేశవయ్య నామినేషన్లు దాఖలు చేశారు. -
పదిలో ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థుల ప్రతిభ
అనంతపురం రూరల్: ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం మౌలిక వసతులు మెరుగు పరచడంతో పాటు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాలోని 79 ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో 1,172 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా వీరిలో 964 మంది ఉత్తీర్ణత సాదించారు. 37 బీసీ వసతి గృహాల్లో 560 మందికి గాను 448 మంది ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. వీరిలో 22 మంది 500కు పైగా మార్కులు సాధించారు. 33 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని 360 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 321 మంది ఉత్తీర్ణత సాదించారు. వీరిలో 11 మంది 500కు పైగా మార్కులు సాధించారు. 3 ఎస్టీ వసతి గృహాలు, 6 గురుకుల పాఠశాలల్లోని 252 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వీరిలో 195 మంది ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. అత్యధికంగా గుత్తి ఎస్సీ బాలుర వసతి గృహం–1 విద్యార్థి డి.ఆసీఫ్ 570 మార్కులు, రాయదుర్గంలోని బీసీ (బాలికల) హాస్టల్ విద్యార్థిని అభిల 560 మార్కులు, గొల్లలదొడ్డిలోని గిరిజన సంక్షేమశాఖ హాస్టల్ విద్యార్థి గురుచరణ్ నాయక్ 533 మార్కులు సాధించారు. -
జిల్లా ఎన్నికల మస్కట్ ఆవిష్కరణ
అనంతపురం అర్బన్: ప్రతి పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకునే లక్ష్యంగా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ తెలిపారు. ఓటుహక్కుపై అవగాహన కల్పించడంలో భాగంగా రూపకల్పన చేసిన ఎన్నికల మస్కట్ను కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి, మస్కట్ రూపకర్త, ఆర్ట్స్ కళాశాల విద్యార్థి గూడురు ప్రశాంత్కుమార్తో కలసి సోమవారం ఆయన ఆవిష్కరించారు. రూపకర్తను అభినందిస్తూ రూ.5 వేలు నగదు బహుమతి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అలాగే మస్కట్ రూపకల్పన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మస్కట్ ప్రోగ్రాం చేయాలని ముందుగా జెడ్పీ సీఈఓ నిదియా దేవి ఆలోచన చేశారన్నారు. మస్కట్ రూపకల్పన క్రెడిట్ మొత్తం ఆమెదేనన్నారు. పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. డీఈఓ, సమగ్ర శిక్ష అధికారులతో మాట్లాడి విద్యార్థులను ప్రోత్సహించేలా చిత్రలేఖనం, ఆర్ట్స్ కాంపిటీషన్లు నిర్వహించాలని జెడ్పీ సీఈఓకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి పాల్గొన్నారు. రూపకర్త ప్రశాంతకు రూ.5వేలు బహుమతి -
బాలికలు.. భళా
● పదో తరగతిలో గతేడాదికంటే మెరుగైన ఫలితాలు ● బాలికలు 85.01, బాలురు 77.08 శాతం ఉత్తీర్ణత ● 598 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచిన విద్యార్థిని తన్నేరు ప్రణతి ● 76 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు భళా అనిపించారు. సోమవారం విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 30,893 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 25,0003 మంది ఉత్తీర్ణత (80.93) శాతం సాధించారు. వీరిలో 15,017 మంది బాలికలను గాను 12,766 మంది 85.01 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 15,876 మందికి గాను 12,237 మంది 77.08 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో గతేడది 16 స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించగా ఈసారి ఏకంగా 76 స్కూళ్లు ఈ వందశాతం ఫలితాలు సాధించడం విశేషం. ఉత్తీర్ణులైన వారిలో 18,432 మంది ప్రథమశ్రేణి, 4,100 మంది ద్వితీయ శ్రేణి, 2,471 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. టాప్లో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు టాప్లో నిలిచాయి. 273 మంది విద్యార్థులకు గాను 269 మంది 98.3 శాతం ఉత్తీర్ణత సాధించారు. సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 660 మందికి గాను 638 మంది 96.67 శాతం, ప్రైవేట్ స్కూళ్లలో 11,175 మందికి గాను 10,719 మంది 95.92 శాతం ఉత్తీర్ణత సాధించారు. మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 237 మందికి గాను 226 మంది 95.36 శాతం, ఏపీ మోడల్ స్కూళ్లల్లో 1,137 మందికి గాను 1027 మంది 90.33 శాతం, కేజీబీవీల్లో 1,252 మందికి గాను 1,053 మంది 84.11 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 190 మందికి గాను 145 మంది 76.32 శాతం, ఎయిడెడ్ స్కూళ్లల్లో 426 మందికి గాను 324 మంది 76.06 శాతం, మునిసిపల్ స్కూళ్లల్లో 2,155 మందికి గాను 1,522 మంది 70.63 శాతం, జిల్లా పరిషత్ స్కూళ్లల్లో 11,453 మందకి గాను 7,800 మంది 68.10 శాతం, ప్రభుత్వ స్కూళ్లల్లో 1,935 మందికి గాను1,280 మంది 66.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. 24వ స్థానంలో జిల్లా జిల్లాలో గతేడాదికంటే మెరుగైన ఫలితాలు వచ్చినా రాష్ట్రంలో నాలుగుస్థానాలకు కిందకు పడిపోయిది. గతేడాది 66.25 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మన జిల్లా 20వ స్థానంలో నిలవగా ఈసారి 80.93 శాతం అంటే 14.68 శాతం పెరిగింది. 24వ స్థానాన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 30లోగా ఫీజు చెల్లింపు ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఈనెల 30లోగా ఫీజు చెల్లించాలని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. మూడుకంటే ఎక్కువ సబ్జెక్టుల పైన రూ. 125, మూడు లోపు సబ్జెక్టులకు రూ. 110, ఒకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ ఫీజుతో పాటు అదనంగా రూ. 60 చెల్లించాలని సూచించారు. రీకౌంటింగ్కు రూ. 500, రీ వెరిఫికేషన్ ద్వారా జవాబుపత్రం నకలు కావాల్సిన వారు రూ. 1000 ఈనెల 30లోగా సంబంధిత పాఠశాల హెచ్ఎం లాగిన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. -
నిత్యం అప్రమత్తంగా ఉండాలి
అనంతపురం: నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి అన్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న విడపనకల్లు, ఓబుళాపురం అంతరాష్ట్ర చెక్ పోస్టులను డీఐజీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టుల వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీలలో డీఐజీ స్వయంగా పాల్గొన్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. కర్ణాటక నుంచి వచ్చే బస్సులు, లగేజీ వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. రాత్రి వేళ పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఊపందుకోవడంతో కలెక్టరేట్తో పాటు అనంతపురం, గుంతకల్లు, కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాలు, రాయదుర్గం, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బందోబస్తును స్వయంగా ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐ పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశారు. -
No Headline
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం అర్బన్ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి నామినేషన్ మహోత్సవం సోమవారం అట్టహాసంగా సాగింది. భారీ జన సందోహం మధ్య ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న అనంత.. రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆర్ఓ శ్రీనివాస్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అడుగడుగునా బ్రహ్మరథం.. అనంత వెంకటరామిరెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కాయి. నగరంలోని 50 డివిజన్లతో పాటు అనంతపురం రూరల్, ఏ. నారాయణపురం, రుద్రంపేట పంచాయతీ, రాజీవ్ కాలనీ ప్రాంతాల నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తరలివచ్చారు. ఉదయం 9.30 గంటలకే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకున్నారు. కోర్టు రోడ్డు, సుభాష్రోడ్డు, సప్తగిరి సర్కిల్ రోడ్లు జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. సరిగ్గా ఉదయం 11.06 గంటలకు ఎమ్మెల్యే రోడ్ షో ప్రారంభమైంది. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో పాటు ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర నారాయణ రోడ్షోలో అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రజలు వారికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జోనల్ ఇన్చార్జ్ రమేష్గౌడ్ ఆధ్వర్యంలో 800 మందితో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని రమేష్గౌడ్, వక్ఫ్బోర్డు జిల్లా చైర్మన్ కాగజ్ఘర్ రిజ్వాన్, కార్పొరేటర్ సాకే చంద్రలు వేర్వేరుగా భారీ గజమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, వైఎస్సార్ సీపీ అనంతపురం, హిందూపురం నియోజకవర్గాల డిప్యూటీ రీజినల్ కో ఆర్డినేటర్ రాగే పరుశురాం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, కార్పొరేటర్లు, సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు. అనంతపురం అర్బన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ‘అనంత’ నామినేషన్ కదం తొక్కిన పార్టీ శ్రేణులు అడుగడుగునా బ్రహ్మరథం -
నేటి నుంచి డిగ్రీ పరీక్షలు
అనంతపురం: ఎస్కేయూ పరిధిలో మంగళవారం డిగ్రీ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 29 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. 42,836 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేశారు. రెండో సెమిస్టర్లో రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలకు 15,703 మంది, నాలుగో సెమిస్టర్కు 14,436, ఆరో సెమిస్టర్కు 12,697 మంది దరఖాస్తు చేశారు.రెండో సెమిస్టర్(న్యూ రెగ్యులేషన్స్)పరీక్షలు ఈ నెల 23 నుంచి మే 15 వరకు, పాత రెగ్యులేషన్స్ ఈ నెల 23 నుంచి మే 29 వరకు జరుగుతాయి. నాలుగో సెమిస్టర్ (న్యూ, ఓల్డ్ రెగ్యులేషన్స్) పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహిస్తారు. ఆరో సెమిస్టర్ (న్యూ రెగ్యులేషన్స్) పరీక్షలు ఈ నెల 23 నుంచి మే 20 వరకు, పాత రెగ్యులేషన్స్ పరీక్షలు ఈ నెల 23 నుంచి మే 15 వరకు జరుగుతాయి. -
ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలి
● జేఎన్టీయూఏ రెక్టార్ డాక్టర్ ఎం.విజయకుమార్ అనంతపురం: ఉద్యోగం చేయడం కంటే పది మందికి ఉపాధి కల్పించే ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని విద్యార్థులకు జేఎన్టీయూఏ రెక్టార్ డాక్టర్ ఎం.విజయకుమార్ పిలుపునిచ్చారు. జేఎన్టీయూఏ కళాశాల 78వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళాశాల ఘన చరిత్రను కొనియాడారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్ధిరపడ్డారన్నారు. విద్యార్థులకు నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకుని అంకితభావంతో కృషి చేస్తే విజయం తథ్యమన్నారు. విద్యా ప్రణాళికలో ముఖ్యంగా క్రీడలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కార్యక్రమాలకు సైతం క్రెడిట్లు ఇచ్చినట్లు తెలిపారు. కళాశాల పురోగతికి విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల పాత్ర కీలకమన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ సి.శశిధర్ మాట్లాడుతూ.. యువత చేతిలో దేశాభివృద్ధి ఆధారపడిందన్నారు. విద్యార్థి దశలోనే జ్ఞానంతో పాటు క్రమశిక్షణ, ఇతరులతో ఎలా మెలగాలో తెలిసినపుడే పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదుగుతారన్నారు. ఈ కళాశాల విద్యార్థులు మంచి కంపెనీలు స్థాపించి, ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించిన అంశాన్ని గుర్తు చేశారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కళాశాలలో గతేడాది జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఈ.అరుణకాంతి, స్పోర్ట్స్ సెక్రెటరీ జోజిరెడ్డి, డైరెక్టర్లు ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి, ప్రొఫెసర్ డి.విష్ణువర్ధన్, ప్రొఫెసర్ ఎ.సురేష్బాబు, ప్రొఫెసర్ బాలనరసయ్య, ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎం.రామశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా పరిశీలకులను భారత ఎన్నికల కమిషన్ నియమించిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు చేస్తున్న వ్యయానికి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే పరిశీలకులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజలు, రాజకీయ పార్టీలకు చెందిన వారు కలిసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే వారి ఫోన్ నంబర్లకు కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. పరిశీలకుల నంబర్లు.. ● అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు విలాస్ వి.షిండే నగరంలోని ఆర్అంబ్బీ అథిగృహం సూట్ నంబర్–2లో ఉంటారు. 9408794122 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదులు తెలియజేయవచ్చు. ● రాయదుర్గం, ఉవరకొండ, గుంతకల్లు, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు నితిన్ అగర్వాల్ నగరంలోని పోలీసు అతిథి గృహం సూట్ నంబరు 2లో ఉంటారు. 824783873 నంబర్కు ఫిర్యాదు చేయవచ్చు. ● అనంతపురం అర్బన్, రాప్తాడు, శింగనమల, కళ్యాణదుర్గం నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు రాందాస్ టి.కాలే నగరంలోని పోలీసు అతిథి గృహం సూట్ నంబర్ 3లో ఉంటారు. 8074550860 నంబర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదులు తెలియజేయవచ్చు. రోజూ ఉదయం 10 నుంచి 11 గంటల వరకూ అందుబాటులో ఉంటారు కలెక్టర్ వినోద్కుమార్ -
వంచించడమే కాకుండా వేధింపులు..
జేసీ ప్రభాకర్రెడ్డి ప్రధాన అనుచరుడు, తాడిపత్రి 30వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున ఓ యువతిని వాడుకుని తల్లిని చేసి మొహం చాటేశాడు. పట్టణానికి చెందిన ఓ యువతితో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. వివాహం చేసుకుంటానని నమ్మబలికి ఆమెతో సహజీవనం చేశాడు. యువతి గర్భం దాల్చగా.. మాయ మాటలు చెప్పి అబార్షన్ చేయించాడు. ఈ క్రమంలోనే మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై బాధితురాలు నిలదీస్తే ఆమైపె దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు మల్లిఖార్జునపై కేసు నమోదు చేశారు. అయితే, బాధితురాలే తనను వేధిస్తోందంటూ కీచక కౌన్సిలర్ మల్లికార్జున ఆ అభాగ్యురాలిపై తన తల్లి ద్వారా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడు. -
వ్యయ పరిశీలన పక్కాగా చేపట్టాలి
● అధికారులకు పరిశీలకుల ఆదేశంఅనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వ్యయ పరిశీలన పక్కాగా చేపట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు విలాస్ వి.షిండే ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో వ్యయ పర్యవేక్షణపై అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివేదికలు ఇవ్వడంలో ఆలస్యం చేయకూడదన్నారు. కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో పకడ్బందీగా వ్యయ పరిశీలన చేపడుతున్నామన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. అసిస్టెంట్ ఎలెక్షన్ అబ్జర్వర్లు, ఎఫ్ఎస్టీ, వీఎస్టీ, ఎంసీసీ, వీవీటీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం, నగదు, వస్తువులను సీజ్ చేస్తున్నామన్నారు. అకౌంటింగ్ బృందం ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థుల రోజువారీ ఖాతాల నిర్వహణ కోసం షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్ నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి, నగర పాలక కమిషనర్ మేఘ స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి తదితరులున్నారు. -
జేసీ అస్మిత్పై 30 కేసులు
తాడిపత్రి: తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జేసీ అస్మిత్రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారులకు అందజేసిన అఫిడవిట్లో ఆస్తులు, కేసులు, అప్పులు తదితర వివరాలను పొందుపరిచారు. ఈయనపై 30 కేసులు ఉన్నాయి. క్రైం నంబర్ 123/2019 ,33 /2020, 74/2020, 142/2020, 272/2020, 4/2023, 405/2023లతో పాటు మరో 23 కేసులు నమోదయ్యాయి. ఇందులో మనీ ల్యాండరింగ్, ప్రభుత్వ ఉద్యోగులను దూషించడం, బెదిరించడంతో పాటు చీటింగ్, క్రిమినల్, సివిల్ కేసులు ఉన్నాయి. అనంతపురం, తాడిపత్రి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు తదితర మండలాల్లో నమోదై ఉన్నాయి. -
ఓటు అడిగేందుకు వచ్చి కండువాలు కప్పుతారా?
● వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం నాయకులు గుంతకల్లు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ పార్టీ నాయకుడైనా ప్రజలను కలసి ఓటు వేయాలంటూ అభ్యర్థించవచ్చునని, అయితే ఇంట్లోకి వచ్చిన తర్వాత బలవంతంగా పార్టీ లో చేరుతున్నట్లు ప్రకటించి కండువాలు కప్పి వెళ్లిపోవడం సబబు కాదని వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు బట్నాపాడు అల్లాబకాష్ దంపతులు హితవు పలికారు. గుంతకల్లులో స్థిరపడిన గుమ్మనూరు సమీపంలోని బట్నాపాడుకు చెందిన అల్లాబకాష్ ఇంటికి శుక్రవారం ఉదయం టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం సోదరుడు శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్ అన్వర్ చేరుకున్నారు. కాసేపు ఇతర అంశాలపై మాట్లాడిన తర్వాత టీడీపీ కండువాలు కప్పి ఫొటోలు తీసి, సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అల్లాబకాస్ దంపతులు వెంటనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఖండించారు. తమ కుమారుడు బుల్లెట్ సత్తార్ వైఎస్సార్సీపీలో ఉన్నాడని, తామంతా వైఎస్సార్సీపీకే మద్దతుదారులుగా ఉన్నామని చెప్పినా వినకుండా బలవంతంగా కండువాలు కప్పి తప్పుడు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. దొంగచాటు రాజకీయాలు వద్దు దొంగ రాజకీయాలకు గుమ్మనూరు సోదరులు తెరలేపడం సరికాదని వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం నాయకులు హితవు పలికారు. ఈ విధానాలకు స్వస్తి పలకాలని సూచించారు. శుక్రవారం వైవీఆర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మైమున్, మైనార్టీ సీనియర్ నాయకులు ఫ్లయింగ్ మాబు, నూర్ నిజామి, గఫార్ఖాన్, బుల్లెట్ సత్తార్, కాంట్రాక్టర్ జిలాన్ మాట్లాడారు. బెంచి కొట్టాలలో నివాసముంటున్న అల్లాబకాష్ ప్రముఖ వ్యక్తి అని గుర్తు చేశారు. వారి అనుమతి లేకుండా టీడీపీ కండువా కప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ తరహా రాజకీయాలు ఇప్పటి వరకూ గుంతకల్లులో ఏనాడూ చూడలేదని, వలస రాజకీయాలతో ఇక్కడకు వచ్చిన గుమ్మనూరు సోదరులు కొత్త సంప్రదాయాలకు తెరలేపడం సిగ్గుచేటని విమర్శించారు. -
రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విజయం తథ్యం
కనగానపల్లి: రాప్తాడు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విజయం తథ్యమని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో శుక్రవారం ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి తరఫున తల్లిదండ్రులు తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, ప్రేమకుమారి, సోదరులు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డితో కలసి నామినేషన్ పత్రాలను ఆయన దాఖలు చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ... శుభ దినం కావడంతో తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తరఫున తొలి సెట్ నామినేషన్ దాఖలు చేశామన్నారు. ఈ నెల 24న నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీతో తరలివచ్చి ప్రకాష్రెడ్డి మరోసెట్ నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం ముందు ఎన్డీఏ కూటమి పటాపంచలు కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు గువ్వల అంజనాదేవి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ధనుంజయ్యాదవ్, ఎంపీపీ జయలక్ష్మి వైస్ ఎంపీపీ బోయ రామాంజనేయులు, పార్టీ కన్వీనర్ జూటూరు శేఖర్, బీసీ సెల్ నాయకుడు పసుపుల ఆది, నాయకులు చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, నసనకోట ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ -
వ్యయ పరిశీలన పారదర్శకంగా ఉండాలి
అనంతపురం అర్బన్: ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల వ్యయ పరిశీలన పారదర్శకంగా ఉండాలని అసిస్టెంట్ ఎక్స్పెండేచర్ అబ్జర్వర్, అకౌంటింగ్ బృందం అధికారులకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ సూచించారు. కలెక్టరేట్లోని ఎన్నికలకు సంబంధించి అసిస్టెంట్ ఎక్స్పెండేచర్ అబ్జర్వర్, అకౌంటింగ్ బృందం కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించి అక్కడి అధికారులతో మాట్లాడారు. కేటాయించిన విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయంపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. ఏఈఓ, అకౌంటింగ్ టీమ్ కేంద్రంలో అన్ని వసతులు కల్పించాలని డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డికి కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డీసీఓ అరుణకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. హౌస్సర్జన్స్ అసోసియేసన్ అధ్యక్షుడిగా సమరసింహారెడ్డి అనంతపురం మెడికల్: హౌస్సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సమర సింహారెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో 2కే19 బ్యాచ్ హౌస్సర్జన్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఉపాధ్యక్షులుగా పునీత్రెడ్డి, త్రివేణి, కార్యదర్శిగా మౌనిక, కోశాధికారిగా వర్ష, సహాయ కార్యదర్శులుగా చేతన్, నవ్య, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా కళ్యాణ్, వికాస్, దేవసాయి, సంజు సత్యన్, అమీనా, సాయిసింధు ఎంపికయ్యారు. అనంతరం హౌస్ సర్జన్ అసోసియేషన్ నూతన కమిటీ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హౌస్సర్జన్ ఇంటర్నషిప్లో మరింత కష్టపడి పని నేర్చుకోవాలన్నారు. అందరూ సమష్టిగా ఉంటూ రోగులకు సేవలందించాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ పద్మజ, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, తదితరులు పాల్గొన్నారు. -
వలంటీర్ను వాతలు పడేలా కొట్టారు
టీడీపీ హయాంలో ప్రజలకెలాగూ మంచి చేయని పచ్చ మూకలు.. నేడు ప్రజలకు మంచి చేస్తున్న వలంటీర్లపైనా కక్షకట్టారు. దాడులకు దిగారు. యాడికి మండలంలోని పుప్పాల గ్రామంలో రజక కులానికి చెందిన వలంటీర్ హర్షపై 2020 డిసెంబర్ 1న జేసీ ప్రధాన అనుచరుడు, పుప్పాల మాజీ సర్పంచ్ దేవేంద్ర విచక్షణా రహితంగా దాడి చేశారు. అదే గ్రామానికి చెందిన రాజ, ఆయన తమ్ముడు బాబు, చరణ్తో కలిసి కర్రలతో హర్ష వీపు, గుండైపె వాతలు పడేలా కొట్టారు. తన 50 ఇళ్ల పరిధిలోని ప్రజలకు పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే వలంటీర్ హర్ష చేసిన తప్పయింది. పచ్చ గూండాల అరాచకాలపై పుప్పాల గ్రామస్తులంతా అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని మనసులో ఉంచుకున్న గ్రామ సర్పంచు దేవేంద్ర (టీడీపీ మద్దతుదారుడు), ఆయన అనుచరులు గంగిరెడ్డి, ప్రభాకర్లు మళ్లీ ఇదే వలంటీర్ హర్షపై 2023 మే 18న రాత్రి 9 గంటల సమయంలోదాడికి దిగారు. కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు కురిపించారు. హర్ష కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
●వైభవంగా రథోత్సవం
విడపనకల్లు: మండల కేంద్రంలో వెలసిన సుంకలమ్మ దేవి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేకువజాము నుంచే విశేష పూజలు, అర్చనలు జరిగాయి. గ్రామస్తులు అందజేసిన రూ.కోటి విరాళంతో నూతనంగా తయారు చేయించిన రథాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి, అమ్మవారి ఉత్సవ మూర్తిని అధిష్టింపజేశారు. రథానికి పూజలు నిర్వహించిన అనంతరం అంబేడ్కర్ విగ్రహం వరకూ లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు. రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు బళ్లారి జిల్లా నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలిరావడంతో విడపనకల్లు జనసంద్రమైంది. అలాగే కరకముక్కలలో వెలసిన చెన్నకేశవస్వామి రథోత్సవం శుక్రవారం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు పెద్ద ఎత్తున జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొండ తిమ్మప్ప స్వామి దేవాలయంలోనూ పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. ఎంపీపీ పుష్పావతి, సర్పంచ్ రామాంజనరెడ్డి, ఉపసర్పంచ్ ఆదమల్ల, ఎంపీటీసీ సభ్యుడు మల్లికార్జున, వైఎస్సార్సీపీ నాయకులు కరణం భీంరెడ్డి, రామురెడ్డి, జగదీష్రెడ్డి, తిమ్మారెడ్డి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ వేళ.. ముహూర్తాల గోల!
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో అత్యంత బిజీగా ఉన్నవారి జాబితాలోకి పండితులు, జ్యోతిష్యులు చేరిపోయారు. నామినేషన్ దాఖలుకు మంచి ముహూర్తం ఉంటే చెప్పాలంటూ వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఫోన్లు చేస్తున్నారు. మరికొందరు నేరుగా కలసి మంచి రోజులతో పాటు తమ భవిష్యత్తుపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో పేరు, జన్మ నక్షత్రాన్ని లెక్కలోకి తీసుకుని పండితులు మంచి రోజు ఏది, మంచి ముహూర్తం ఎప్పుడు అనేది నిర్ణయిస్తుండడం గమనార్హం. అనంతపురం కల్చరల్: సెంటిమెంటు అనేది రాజకీయ నాయకులకు, సినిమా యాక్లర్లకు కాసింత ఎక్కువగానే ఉంటుందని మరోసారి రుజువైంది. ఏ పనిచేయాలన్న మంచి ముహూర్తం లేకుండా ప్రస్తుతం రాజకీయ నాయకులు అడుగు ముందుకేయడం లేదు. ఈ క్రమంలో మళ్లీ పండితులు, జ్యోతిష్కులు, న్యూమరాలజిస్టుల చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టారు. మరో రెండు నెలల్లో తేలనున్న భవిష్యత్తుకు నామినేషన్ల ప్రక్రియ అనేది కీలకంగా మారిన నేపథ్యంలో శుభముహూర్తాల వేట మొదలైంది. దీంతో చిన్నాచితకా పురోహితులకు కూడా బాగా డిమాండ్ పెరిగిపోయింది. మరొక విషయమేమంటే హేతువాదులుగా, నాస్తికులుగా, దేవుడిని... జాతకాలను నమ్మరాదని చెప్పుకునే కమ్యూనిస్టులు కూడా తమ స్నేహితుల వద్ద ముహూర్తాల ప్రస్తావన తెస్తుండడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలోని తమకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల నుంచి కమ్యూనిస్టు నాయకులు బరిలో దిగుతున్న నేపథ్యంలో వారు సైతం జ్యోతిష్కులను, పండితుల చుట్టూ తిరుగుతున్నారు. నాలుగులో మిగిలింది రెండే.. నామినేషన్ల దాఖలకు ఈ నెల 18, 19, 22, 24 మంచి బలమైన ముహూర్తాలుగా పండితులు పేర్కొంటున్నారు. అయితే ఈ నెల 18న గురువారం అడపాదడపా కొందరు నామినేషన్లను దాఖలు చేయగా, శుక్రవారం సెంటిమెంట్ కలిసి రావడంతో 19వ తేదీ కూడా కొందరు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఈ నెల 22 చతుర్ధశి, హస్త నక్షత్రం కలసి రావడంతో మంచి ముహూర్తంగా భావిస్తున్నారు. అలాగే స్వాతి నక్షత్రం కలసి వచ్చిన 24వ తేదీ కూడా ఎంతో మంచి ముహూర్తమని జ్యోతిష్కులు అంటున్నారు. అయితే 23న పౌర్ణమి కావడంతో నామినేషన్ దాఖలకు సెంటిమెంట్ అడ్డుపడుతోంది. దీంతో చాలా మంది 22, 24 తేదీల్లో నామినేషన్లను వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. ముహూర్తం అనేది చాలా కీలకం సాధారణంగా చిన్నపాటి కార్యక్రమం చేసినా ముహూర్తం చూసే పెట్టుకుంటారు. పంచాంగం చూడకుండా ఏదీ చేయడం కుదరదు. ఇక ఎన్నికలంటే చాలా మంది జీవన్మరణ సమస్యగా భావిస్తుంటారు. కొన్ని రోజులుగా చాలా మంది మంచి ముహూర్తాలు చూసి పెట్టాలని కోరుతున్నారు. నామినేషన్ల దాఖలకు ఈ నెల 22, 24 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నాయి. అయితే గెలుపోటములను వారి జన్మ నక్షత్రాలే శాసిస్తాయి. కేవలం ఆత్మస్థైర్యం కోసమే జ్యోతిష్యం దోహదపడుతోంది. – వాసుదేవరావు, జ్యోతిష్యుడు, రాప్తాడు చంద్రుని శుభ దృష్టి అవసరం చంద్రుని దృష్టి వల్లే శుభ, అశుభ ఫలితాలు ఉంటాయి. వాస్తవం చెప్పాలంటే ఈ సారి మంచి ముహూర్తంలోనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. తొలి రోజు పోను 19, 22, 23, 24 తేదీలు బాగున్నా వ్యక్తిగత జాతకాల ఆధారంగానే ముహూర్తం నిర్ణయించాలని చాలా మంది కోరుతుంటారు. – కొడేకండ్ల నాగభూషణరావు, న్యూమరాలజిస్టు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదలైన నామినేషన్లు పేరు, జన్మ నక్షత్రాన్ని బట్టి మంచి ముహూర్తాన్ని చూసుకుంటున్న అభ్యర్థులు 22, 24 తేదీలు బాగున్నాయంటున్న పండితులు పౌర్ణమి ఎఫెక్ట్తో 23న నామినేషన్ దాఖలుకు పలువురి విముఖత బెస్ట్ ముహూర్తం చూడండి పంతులు గారు.... -
‘దుర్గం’లో హద్దే లేని ‘తమ్ముళ్లు’
రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. గత నెల మార్చి 29న కణేకల్లు మండలంలోని ఓ గ్రామంలో టీడీపీ నాయకుడు రఘునాథ్ అదే గ్రామానికి చెందిన ఓ వివాహితపై లైంగికదాడికి యత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో పరారయ్యాడు. ఈ క్రమంలోనే బాధితురాలు అవమాన భారంతో పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అదృష్టవశాత్తూ కోలుకుంది. ● డీ హీరేహాళ్ మండలం హొసగుడ్డంలో అయితే ‘తమ్ముడి’ వేధింపుల కారణంగా ఓ అభాగ్యురాలు ప్రాణాలు తీసుకుంది. కొన్నాళ్లుగా బాధితురాలిని వేధిస్తున్న గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు లోకేష్ గత నెల 31న రాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. బాధితురాలు ఆ సమయంలో మేల్కొని కేకలు వేయడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. దీనిపై కుటుంబీకులతో కలిసి సదరు వివాహిత పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రెండు రోజులు కనిపించని టీడీపీ నాయకుడు లోకేష్.. మూడు రోజే మళ్లీ గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. దీంతో మళ్లీ అతడు ఎక్కడ ఇబ్బంది పెడతాడోనని భయాందోళనకు గురైన వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ● డీ హీరేహాళ్ మండలంలోని ఓ గ్రామంలో టీడీపీ నాయకుడి మరో అకృత్యం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆంజనేయులు ఓ మైనర్ బాలికను లొంగదీసుకుని శారీరకంగా వేధింపులకు గురిచేశాడు. అతడి చెర నుంచి తప్పించుకున్న బాలిక స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఇటీవల జైలుకు పంపారు. ఇలా రోజూ ఎక్కడో చోట పచ్చ మృగాళ్లు రెచ్చిపోతూ సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement