-
'యానిమల్' ఓ చెత్త సినిమా.. చూస్తుంటే చిరాకేసింది: 12th ఫెయిల్ నటుడు
'యానిమల్' సినిమాని ఎంతమందికి నచ్చిందో తెలీదు గానీ విమర్శలు మాత్రం చాలా ఎక్కువే వచ్చాయి. చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాలోని సన్నివేశాలపై బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో 12th ఫెయిల్ నటుడు, మాజీ ఐఏఎస్ వికాస్ దివ్యకృతి కూడా చేశారు. ఈ చిత్రం మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుందని కౌంటర్స్ వేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?) ''యానిమల్' లాంటి సినిమా మన సమజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. ఇలాంటిది అసలు తీసి ఉండకూడదు. మీకు డబ్బులు వచ్చి ఉండొచ్చు. కానీ హీరోని మీరు జంతువులా చూపించారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ ని హీరో తన కాలికి ఉన్న షూ నాకమనే సీన్ ఒకటి ఉంటుంది. దీన్ని చూసి రేప్పొద్దున యూత్ కూడా ఇలానే ప్రవర్తిస్తే ఏంటి పరిస్థితి? ఇలాంటి కేర్ లెస్, బుద్ధిలేని సినిమాలు తీయడం చూస్తుంటే బాధేస్తోంది. మూవీ చూస్తుంటే చిరాకేసింది' అని వికాస్ దివ్యకృతి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, రష్మిక, తృప్తి దిమ్రి హీరోహీరోయిన్లుగా నటించారు. హింస, శృంగార సన్నివేశాలు కాస్త ఈ మూవీలో ఎక్కువగానే ఉన్నాయి. దీంతో యూత్ కి తప్పితే ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ చిత్రం నచ్చలేదని కామెంట్స్ వచ్చాయి. సినిమా వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతున్నా సరే ఇప్పటికీ ఎవరో ఒకరు 'యానిమల్'పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?) -
'చిన్నా'పై ఇలాంటి వ్యాఖ్యలా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సిద్దార్థ్
సిద్ధార్థ్ ఇటీవలి చిత్రం చిత్త (తెలుగులో చిన్నా) ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా అభినందనలు పొందింది. సిద్ధార్ధ్ కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా 'చిన్నా' ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది విడుదలైన ఈ సినిమా సౌత్ ఇండియాలో మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో సిద్ధార్థ్ పాల్గొన్నారు. చిన్నా సినిమాకు గాను 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్'గా ఆయన అవార్డు అందుకున్నారు. ఆ సమయంలో పలు ఆసక్తికరమైన విషయాలతో పాటు పరోక్షంగా రణబీర్ కపూర్ యానిమల్ సినిమాపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిద్ధార్థ్ మాట్లాడుతూ.. చిన్నా సినిమాను చూసిన కొందరు డిస్టర్బ్ అయ్యామంటూ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా సినిమా చూడలేకపోయామని అన్నారు. అది నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల హిట్ అయిన బాలీవుడ్ సినిమాను కొంతమంది ఎలాంటి ఇబ్బందిలేకుండా చూశారు. కానీ మనసుని హత్తుకునే కథతో చిన్నా సినిమా చేస్తే మాత్రం వారికి ఇబ్బందిగా మారింది. ఇది నిజంగానే సిగ్గుచేటు మనస్తత్వం.' అని సిద్ధార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. యానిమల్ సినిమా పేరు ఎత్తకుండా సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై కొందరి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నా మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలపై జరుగుతోన్న లైంగిక దాడుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్నా సినిమాలో సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమాలో నిమిషా సజయన్, సహస్ర శ్రీ కీలక పాత్రలు పోషించారు. Siddharth’s strong attack on #Animal 👌 pic.twitter.com/lgO0XD2TuG — Haricharan Pudipeddi (@pudiharicharan) April 13, 2024 -
ఖరీదైన కారు కొన్న ఆర్ఆర్ఆర్ సింగర్.. ఎన్ని కోట్లంటే?
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ యానిమల్. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్లో రిలీజైన యానిమల్ దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలో కనిపించింది. అయితే ఈ చిత్రంలోని పెహేలే భీ మే, కబీర్ సింగ్ కైసే హువా అనే పాటలను ఆలపించారు ప్రముఖ సింగర్ విశాల్ మిశ్రా. తాజాగా అతను ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఆధునాతన సౌకర్యాలున్న లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ కారును సొంతం చేసుకున్నారు. ఈ కారు ధర దాదాపు రూ.3.50 కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా పంచుకున్నారు. సింగర్ విశాల్ గతంలో యోధా , సత్యప్రేమ్ కి కథ, చోర్ నికల్ కే భాగే, ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ నాటు నాటు సాంగ్ పాడారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన రాబోయే చిత్రం బడే మియాన్ చోటే మియాన్లో పాటలను ఆలపించారు. ఈ చిత్రంలో మానుషి చిల్లర్, అలయ ఎఫ్, సోనాక్షి సిన్హా, రోనిత్ బోస్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఏప్రిల్ 11, 2024న థియేటర్లలో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Vishal Mishra (@vishalmishraofficial) -
తండ్రి కష్టాలను తాను మోస్తూ.. పోరాటం కొనసాగించిన 'రష్మిక మందన్న'
రష్మిక మందన్నా.. నిజానికి కన్నడ నటి. నేడు 28వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. మోడల్గా కెరీర్ ప్రారంభించిన రష్మిక 'కిరిక్ పార్టీ' చిత్రంతో కన్నడ సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 'ఛలో' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప,యానిమల్ చిత్రాలతో నేషనల్ క్రష్గా వెలిగిపోతుంది. తనపట్ల పలు రకాలుగా రూమర్స్, డీప్ ఫేక్ వీడియోలు వంటివి ఎదురైనా బలంగా నిలబడింది. అందుకే నేడు ఆమె పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతూ చరిత్రలో తనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకుంది. రష్మిక విద్యాభ్యాసం వివరాలు రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్పేట్లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న రష్మిక.. చదువును నిర్లక్ష్యం చేస్తూ నటి కావాలని కలలు కనలేదు. చదువులో అగ్రస్థానంలో నిలిచిన రష్మిక మొదట మోడలింగ్ షోలలో పనిచేయడం ప్రారంభించింది. అలా ఒక షోలో ఆమెను చూసిన రక్షిత్ శెట్టి 'కిరిక్ పార్టీ' సినిమాలో ఎలాంటి ఆడిషన్ లేకుండానే ఛాన్స్ ఇచ్చాడు. అద్దె ఇంట్లో జీవితం ప్రారంభం రష్మిక చిన్నప్పుడు తమ కుటుంబం మొత్తం ఓ అద్దె ఇంట్లో ఉండేవారమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆర్థిక కష్టాల కారణంగా రెంట్ కట్టలేకపోవడంతో పదే పదే ఇల్లు మారాల్సి వచ్చేదని చెబుతూ ఆ సమయంలో కంటతడి పెట్టుకుంది. తల్లిదండ్రులు చివరికి తనకి ఆడుకోవడానికి ఒక బొమ్మని కూడా కొనివ్వలేకపోయారని వాపోయింది. పాఠశాల రోజుల్లో తన కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఆపై వ్యాపారాల్లో నష్టం వచ్చి తన నాన్నగారు బాధపడిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఎలాగైనా ఆ పరిస్థితిని మార్చాలని రష్మిక బలంగా కోరుకుంది. అందుకు తగ్గట్లు కష్టపడింది. తన తల్లిదండ్రులకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు.. అయినా ధైర్యంగా ఇందులో అడుగుపెట్టింది. ఇప్పుడు తను రెండుజేతులా ఆర్జిస్తూ తండ్రికి బిజినెస్లో ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తోంది. అలానే ఓ పెద్ద ఇల్లుని కూడా పేరంట్స్కి గిప్ట్గా ఇచ్చింది. ఛలో టూ పుష్ప కిరిక్ పార్టీ సినిమా విజయంతో రష్మిక మందన్నకు ఛలో సినిమాలో ఛాన్స్ దక్కింది. కేవలం రంగుల కలలు కని సినిమాల్లోకి తను రాలేదు. ఈ వృత్తిలో ఉండే సాధకబాధకాల గురించి ముందే తెలుసుకుంది. అయితే ప్రతి వృత్తిలో ఉన్నట్లే సినిమారంగంలో కూడా ఒడిదొడుకులు, ఎగుడుదిగుళ్లు ఉంటాయనేది కూడా బాగా తెలుసు అందుకే ఆమెపై ఎన్ని రూమర్స్ వచ్చినా బలంగా తట్టుకుని నిలబడింది. సరైన అవకాశం కోసం ఎదురుచూసింది. ఆ సమయం పుష్ప సినిమాతో వచ్చింది. దీంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం పుష్ప2 తో అంతకు మించి ఇమేజ్ ను సాధించడానికి రెడీగా ఉంది రష్మిక. ఫస్ట్ రెమ్యునరేషన్ కిరిక్ పార్టీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక రూ. 1.50 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఆ తర్వాత ఛలో సినిమాకు రూ. 50 లక్షలు అందుకున్నారని టాక్. టాలీవుడ్ తర్వాత కోలీవుడ్లోకి అడుగుపెట్టింది రష్మిక. తమిళంలో కార్తీ సరసన నటించిన ఆమె ఆ తర్వాతి సినిమాలోనే తలపతి విజయ్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుని కోలీవుడ్ మార్కెట్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్న రష్మిక యానిమల్ సినిమాకు మాత్రం రూ. 7 కోట్ల వరకు తీసుకున్నట్లు టాక్. పేదరికం నుంచి కోట్లలో సంపద చిన్నతనంలో నాన్న పడుతున్న కష్టాన్ని తన కళ్లతోనే చూసింది. ఎలాగైనా తన కుటుంబ పరిస్థితిని మార్చాలని కోరుకుంది. అందుకే సంపాదించిన ప్రతి రూపాయి ఇప్పటికి కూడా తన తండ్రికి అప్పజెప్పుతుంది. ప్రస్తుతం సినిమా రెమ్యునరేషన్తో పాటు ఆమె పలు ప్రకటనల్లో కూడా కనిపిస్తుంది. ఒక్కో ప్రకటనకి డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట. అలా ఇప్పటి వరకు మొత్తంగా రూ. 70 కోట్ల వరకు రష్మిక సంపాధించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న మాట. 23 ఏళ్లకే కోటీశ్వరురాలిగా మారిన రష్మికకు బెంగళూరు, కూర్గ్, గోవా, హైదరాబాద్, ముంబై సహా నగరాల్లో ఇళ్లు ఉన్నాయట. ఇందులో రష్మిక బెంగళూరులోని లగ్జరీ ఇంటి విలువ 10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రష్మికకు కార్లంటే చాలా ఇష్టం మరియు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. టయోటా ఇన్నోవా, ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్, హ్యుందాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఆమె గ్యారేజీలో వరుసలో ఉన్నాయి. ముఖ్యంగా ఆమె సినిమాల్లో సంపాదించని డబ్బును తన తండ్రి ద్వారా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతందని సమాచారం. దాంతో తన ఆస్తులతో పాటు.. సంపద కూడా భారీగా పెరుగుతూ వస్తోందట. చిన్నప్పుడు తన తల్లిదండ్రులను గర్వించేలా చేయాలని బలంగా కోరుకున్న రష్మిక అనుకున్నట్లు గానే సాధించింది. చిన్నతనంలోనే తన జీవితం గురించి ఏ విధంగా అయితే కలలుకనిందో వాటిని నిజం చేసుకుంది. అయినా జీవితంలో ఇంకా సాధించాల్సింది చాలానే ఉందంటున్న రష్మిక.. అవన్నీ నెరవేరాలని కోరుకుంటూ నేషనల్ క్రష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. -
అందం + అభినయం +అల్లరి.. హ్యాపీ బర్త్డే రష్మిక మందన (ఫొటోలు)
-
వీకెండ్లో రష్మిక ఎవరిని కలుస్తుందంటే..?
నటీ నటుల్లో ఒక్కొక్కరికి ఒక్కో పాలసీ వుంటుంది. కొందరు ఆదివారం షూటింగ్లకు సెలవు ప్రకటిస్తుంటారు. మరి కొందరు వారాంతర రోజున కుటుంబసభ్యులకు కేటాయిస్తూ వుంటారు. ఇంకొందరు పార్టీలకు, పబ్లకు వెళుతుంటారు. ఇక రష్మిక మందన్న ఏం చేస్తారో తెలుసా? ఇండియా క్రష్ అయిన ఈ బ్యూటీ చేతినిండా చిత్రాలతో క్షణం కూడా తీరికలేనంత బిజీ. ఇటీవల ఈమె నటించిన హిందీ చిత్రం యానిమల్ సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో రష్మిక మందన్న బాలీవుడ్లోనూ స్టార్ అంతస్థుకు చేరుకున్నారు. అక్కడ మరిన్ని అవకాశాలు ఈ బ్యూటీని వెతుక్కుంటూ వస్తున్నాయట. ఇటీవల జపాన్ వెళ్లి వచ్చిన రష్మికకు అక్కడ అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించడం విశేషమనే చెప్పాలి. ఇకపోతే తెలుగు, తమిళం భాషల్లోనూ పలు చిత్రాలలో నటిస్తూ రష్మిక మందన్న బిజీగా వున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన నటిస్తున్న పుష్ప–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా రెయిన్బో, ది గర్ల్ఫ్రెండ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. నటిగా ఇంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు వీకెండ్లో తన మిత్రబృందంతోనే ఎక్కువగా గడుపుతారట. కుటుంబసభ్యులకు కాస్త సమయాన్ని కేటాయించినా, ఎక్కువగా స్నేహితులతోనే జాలీగా గడిపేస్తారట. ఇది తన పాలసీ అని రష్మిక మందన్న వర్గం మాట. -
నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఆమెనే: యానిమల్ బ్యూటీ కామెంట్స్
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్తో ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ ప్రియురాలి పాత్రలో కనిపించి మెప్పించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. దీంతో యానిమల్ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో బ్యాడ్ న్యూజ్, భూల్ భూలయ్యా-3 చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమెలా ఉండడం చాలా గొప్ప అంటూ ప్రశంసలు కురిపించింది. త్రిప్తి మాట్లాడుతూ..' మరో దేశానికి వెళ్లి కెరీర్ ప్రారంభించాలంటే ధైర్యం ఉండాలి. ప్రియాంకకు ధైర్యంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువే. హాలీవుడ్కు వెళ్లి సక్సెస్ను సాధించింది. ఆమె నాలాంటి వారికి స్ఫూర్తి. అందుకే ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ప్రియాంక మూవీ బర్ఫీ మొదటిసారి చూసినప్పుడు ఆమెను గుర్తుపట్టలేదు. యాక్టర్స్కు ఉండాల్సిన మొదటి లక్షణమదే. ఏ పాత్ర చేస్తున్నా మనం కనిపించకూడదు. కేవలం మన నటన మాత్రమే కనిపించాలి. ఆ పాత్రతోనే మనల్ని పిలుస్తుంటే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు’ అని అన్నారు. ప్రియాంక తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి అని త్రిప్తి కొనియాడారు. -
Tripti Dimri HD Photos: బ్లాక్ డ్రెస్ లో ‘యానిమల్’ హాట్ బ్యూటీ (ఫోటోలు)
-
యానిమల్ హీరోయిన్తో డేటింగ్ చేయాలనుంది: నటుడు షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం యానిమల్. రణ్బీర్కపూర్, రష్మిక జంటగా నటించిన బాక్సాఫీస్ను షేక్ చేసింది. పలువురు ప్రముఖుల నుంచి విమర్శలు ఎదురైనప్పటికీ భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో రష్మిక లీడ్ రోల్లో కనిపించగా.. బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంది. రణ్బీర్ కపూర్ ప్రియురాలిగా జోయా పాత్రలో మెప్పించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. యానిమల్తో త్రిప్తి డిమ్రీకి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో మరో నటుడు సిద్ధాంత్ కర్నిక్ కీలక పాత్ర పోషించారు. రణబీర్ కపూర్ బావగా వరుణ్ ప్రతాప్ మల్హోత్రా అనే పాత్రను పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సిద్ధాంత్.. త్రిప్తి డిమ్మీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెతో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు తన మనసులో మాటను సిద్ధాంత్ వెల్లడించారు. రీల్ లైఫ్ నుంచి నిజ జీవితాన్ని వేరుగా చూడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కాగా.. సిద్ధాంత్ కర్నిక్ యానిమల్తో పాటు మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, అమయా, తప్పడ్, ఆదిపురుష్ లాంటి చిత్రాల్లో కనిపించారు. మాహి వే, యే హై ఆషికి, ఏక్ థా రాజా ఏక్ థీ రాణి లాంటి సీరియల్స్లో నటించారు. -
ఆరు నెలల తర్వాత అక్కడ అడుగుపెట్టిన రష్మిక.. కారణం ఇదే
ఇప్పుడు ఇండియన్ సినిమా క్రష్ ఎవరంటే.. టక్కున రష్మిక మందన్నా పేరే చెబుతారు. పాన్ ఇండియా చిత్రం పుష్ప తరువాత ఈ కన్నడ బ్యూటీ క్రేజ్ బాలీవుడ్ వరకు పాకింది. 2016లో కన్నడ చిత్రం కిరాక్ పార్టీతో కెరీర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ అక్కడ మరో రెండు చిత్రాలు చేసి, టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 'ఛలో' చిత్రంలో నటించి, గుర్తింపు పొందిన రష్మిక మందన్నా గీతగోవిందంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని సాధించింది. కట్ చేస్తే బాలీవుడ్లో పాగా వేసేసింది. అక్కడ తొలుత నటించిన రెండు చిత్రాలు పెద్దగా ఆడకపోయినా, మూడో చిత్రం 'యానిమల్' సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంపై విమర్శలు వెల్లువెత్తినా, కలెక్షన్లు మాత్రం దుమ్మురేపాయి. దీంతో రష్మిక మందన్నా పాన్ ఇండియన్ నటిగా వీర లేవల్లో పాపులర్ అయింది. తాజాగా చావ అనే హిందీ చిత్రంలో నటిస్తున్న ఈమె ప్రస్తుతం తనకు అనూహ్య క్రేజ్ను తెచ్చి పెట్టిన పుష్ప చిత్ర సీక్వెల్ను పూర్తి చేసే పనిలో ఉంది. దీనితో పాటు రెయిన్బో అనే ద్విభాషా( తెలుగు, తమిళం) చిత్రం, ది గర్ల్ఫ్రెండ్ చిత్రాల్లో కూడా నటిస్తున్న రష్మిక మందన్నా ఇప్పుడు వర్కౌట్స్పై పూర్తిగా దృష్టి పెట్టిందట. అదేమిటీ ఇప్పటివరకూ వర్కౌట్స్ చేయడం లేదా? అని ఆశ్యర్యపోతున్నారా? నిజమే పని బిజీయో, లేక మరే కారణంగానో ఈ అమ్మడు గత ఆరేడు నెలలుగా వర్కౌట్స్ చేయడం లేదట. ఇక నుంచి వర్కౌట్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటానని చెప్పింది. దీని గురించి రష్మికనే తన ఎక్స్ మీడియాలో పేర్కొంది. అంతే కాదు ఇకపై కచ్చితంగా ప్రతి రోజు క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తానని చెప్పింది. ఈ సందర్భంగా తీవ్రంగా తను వర్కౌట్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
సందీప్ - జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం
-
సిగ్గుండాలి అంటూ సందీప్ రెడ్డి వంగాపై విరుచుకుపడిన స్టార్ రైటర్
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై ప్రముఖ స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ మరోసారి కామెంట్లు చేశారు. యానిమల్ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులను గతంలో తప్పుబట్టిన జావేద్కు సందీప్ రెడ్డి వంగా కూడా కౌంటర్ ఇచ్చారు. జావేద్ అక్తర్ కుమారుడు ఫర్హాన్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ను తెరపైకి తీసుకొచ్చి సందీప్ కూడా కడిగిపారేశారు. అంతా సద్దుమనిగింది అనుకుంటే తాజాగా మళ్లీ జావేద్ అక్తర్ ఇదే అంశంపై రియాక్ట్ అయ్యారు. సందీప్ రెడ్డి వంగాపై ఆయన పలు కామెంట్లు చేశారు. యానిమల్ చిత్రాన్ని తీసిన డైరెక్టర్ను తాను ఏమీ అనలేదని జావేద్ అక్తర్ క్లారిటీ ఇచ్చారు. అది రాజ్యాంగం అతనికి ఇచ్చిన హక్కు అని.. అయితే ప్రేక్షకుల గురించే తనకు ఆందోళన అని అక్తర్ పేర్కొన్నారు. 'నేను ఫిల్మ్ మేకర్ను ఏమాత్రం నిందించలేదు. ప్రజాస్వామ్య సమాజంలో ఒక యానిమల్ చిత్రమే కాదు.. అలాంటివి ఎన్నో సినిమాలు తీసే హక్కు అతనికి ఉంది. కానీ నా ఆందోళనంతా ప్రేక్షకుల గురించి మాత్రమే.. ఈ సమాజంలో పరిమితి మేరకు ఎలాంటి సినిమా అయినా చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. నేను యానిమల్ చిత్రాన్ని చూడలేదు. కొందరు మిత్రులు షేర్ చేసిన దానిని బట్టి యానిమల్ చిత్రంపై కామెంట్లు చేశాను.' అని జావేద్ అన్నారు. 'నా వ్యాఖ్యలకు సందీప్ రెడ్డి కూడా స్పందించడం నాకు గౌరవంగా అనిపించింది. నా 53 ఏళ్ల కెరీర్లో ఒక్క సినిమా, ఒక్క స్క్రిప్ట్, ఒక్క సీన్, ఒక్క డైలాగ్, ఒక్క పాటలో కూడా ఆయన అసభ్యత, తప్పును కనిపెట్టలేకపోయారు. ఇక చేసేది ఏమీ లేకపోవడంతో నా కుమారుడి ఆఫీస్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ను పట్టుకున్నారు. అందులో ఫర్హాన్ నటించలేదు, డైరెక్ట్ చేయలేదు. రాయలేదు. కేవలం అతని కంపెనీ ఎక్సెల్ మీడియా ప్రొడ్యూస్ చేసింది. ఆ సంస్థ నుంచి చాలా సిరీస్లు వచ్చాయి. అందులో ఇదీ ఒకటి. దాన్నే అతడు పట్టుకున్నారు. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నా 53 ఏళ్ల కెరీర్లో ఒక్క తప్పు కూడా వెతకలేకపోయావా.. చేసేది ఏమీ లేక నా కుమారుడి దగ్గరకు పోయావా సందీప్.. ఇదీ సిగ్గుచేటు.' అని జావెద్ అక్తర్ ఘాటుగా స్పందించారు. గతంలో జావేద్ అక్తర్పై సందీప్ చేసిన కామెంట్లు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాపై గతంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పరోక్షంగా విమర్శించారు. యానిమల్ సినిమా చాలా ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్ అయ్యాడు. 'సలహాలు ఇవ్వాల్సింది నాకు కాదు. ముందుగా మీ కుమారుడు ఫర్హాన్ అక్తర్కు ఇవ్వాలి. మీ కుమారుడు నిర్మించిన మీర్జాపుర్ సిరీస్లో ప్రపంచంలో ఉన్న బూతులన్ని అందులోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను ఆ సిరీస్ను పూర్తిగా చూడలేదు కానీ కొన్ని సీన్స్ చూస్తేనే వాంతి కలిగినట్లు ఉంటుంది. కాబట్టి ముందుగా జావేద్అక్తర్ తన కుమారుడు నిర్మించే చిత్రాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.' అని సందీప్ తెలిపాడు. -
'యానిమల్' బ్యూటీ రెమ్యునరేషన్ అంత తక్కువ..?
సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ చిత్రం గతేడాదిలో విడుదలయి సూపర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలోని నటీనటులకూ మంచి గుర్తింపు వచ్చింది. వారిలో త్రిప్తి డిమ్రి బాగా హైలెట్ అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆమె పేరు సోషల్ మీడియాలో నేషనల్ క్రష్గా కూడా తెగ చక్కర్లు కొట్టింది. సినిమా వచ్చి చాలా రోజులే అయినా.. ప్రస్తుతం ఆమె రెమ్యునరేషన్ గురించి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో రణ్బీర్ కపూర్తో ఇంటిమేట్ సీన్లో నటించి యూత్కు దగ్గరైంది త్రిప్తి. యానిమల్ సినిమాలో నటించినందుకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే పారితోషకం కింద ఇచ్చారట. ఈ సినిమా చేస్తున్న సమయంలో ఆమె ఎవరో ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. అంతే కాకుండా సినిమాలో కూడా ఆమె కొంత సమయం మాత్రమే కనిపిస్తుంది. అందువల్ల ఆమె తక్కువ పారితోషకానికే యానిమల్కు ఒప్పుకుంది. కానీ యానిమల్ చిత్రం బిగ్గెస్ట్ హిట్ కావడంతో త్రిప్తి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె ఒప్పుకుంటున్న సినిమాలకు భారీగానే డిమాండ్ ఉంది. తాజాగా ఆమె 'భూల్ భులయా'లో చిత్రంలో నటిస్తుంది. అందులో స్పెషల్ రోల్ నటిస్తున్నందుకు ఆమె కోటి రూపాయలు రెమ్యునరేషన్గా తీసుకుంటుందట. ఈ సినిమా హిట్ అయితే త్రిప్తి డుమ్రి మరో కోటి పెంచడం ఖాయం అని చెప్పవచ్చు. మేరే మెహబూబ్ మేరే సనమ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరిల స్పై థ్రిల్లర్లో త్రిప్తి నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసినట్లు టాక్. View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) -
టాలీవుడ్ డైరెక్టర్ గురించి విన్నా.. ఆ సినిమా తప్పకుండా చూస్తా: కిరణ్ రావు
బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్రావు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల లపట్టా లేడీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ రావు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతని క్రాఫ్ట్ అద్భతంగా ఉంటుందని.. యానిమల్ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. తన సినిమా లపట్టా లేడీస్కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపింది. కిరణ్ రావు మాట్లాడుతూ..'లాపట్టా లేడీస్ సినిమాకు విశేషమైన స్పందన వచ్చింది. మీ అభిమానానికి నా ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు యాక్షన్తో కూడిన భారీ చిత్రాలనే ఇష్టపడుతున్నారు. యానిమల్ లాంటి సినిమాను నేను చూడాలనుకుంటున్నా. అది అవసరం. ప్రజలు ఇష్టపడినందున యానిమల్ హిట్గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా క్రాఫ్ట్ చాలా బాగుందని విన్నాను. రణబీర్ కపూర్ కూడా మంచి నటుడు. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నా.' అని అన్నారు. -
టాలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్.. ఇలా సడన్ షాకిచ్చాడేంటి?
గతేడాది యానిమల్తో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. యానిమల్ సూపర్ హిట్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి కాంబోలో రానున్న స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సందీప్ రెడ్డి వంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. యానిమల్ సినిమా సమయంలో స్టైలిష్ హెయిర్ లుక్తో కనిపించిన సందీప్ రెడ్డి ఒక్కసారిగా గుండు కొట్టించుకుని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన సందీప్ రెడ్డి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. యానిమల్ సూపర్ హిట్ కావడంతోనే మొక్కులు చెల్లించుకున్నట్లు తెలుస్తోంది. #TFNReels: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందీప్ రెడ్డి వంగా Sensational director @imvangasandeep visits Tirumala & seeks divine blessings of Lord Venkateshwara, reveals his next film with Rebel star #Prabhas is gonna start soon! 💫#SandeepReddyVanga #Spirit #TeluguFilmNagar pic.twitter.com/kpgWhJ9hMU — Telugu FilmNagar (@telugufilmnagar) March 6, 2024 -
సందీప్ రెడ్డి సినిమాల కంటే ఆయనలో అదే నా ఫేవరెట్: స్టార్ హీరో
సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు చెప్పగానే 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలే గుర్తొస్తాయి. డిఫరెంట్ హీరోయిజాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇతడు.. పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ సృష్టించాడు. అయితే ఇతడి లేటెస్ట్ మూవీ 'యానిమల్'ని ఎంతలా బాగుందని మెచ్చుకున్నారో అంతే ఘోరంగా విమర్శించారు. మరీ ముఖ్యంగా తమిళ సెలబ్రిటీలు అందరూ 'యానిమల్' చిత్రాన్ని, సందీప్ రెడ్డి వంగాపై దారుణమైన కామెంట్స్ చేశారు. స్టార్ హీరో శివ కార్తికేయన్ మాత్రం తాజాగా ఓ కార్యక్రమంలో వీళ్లందరితో పోలిస్తే భిన్నంగా మాట్లాడాడు. (ఇదీ చదవండి: సెట్లో ఎవరు అలా చేసిన బాలకృష్ణ తట్టుకోలేడు: ప్రముఖ తమిళ దర్శకుడు) రెండే సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం పలు ఈవెంట్స్కి అతిథిగా హాజరవుతూ బిజీగా ఉన్నాడు. ఇలానే తమిళనాడులో తాజాగా జరిగిన ఓ అవార్డు వేడుకకు హాజరయ్యాడు. ఇందులో భాగంగా తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ పలు విషయాలు చెప్పుకొచ్చాడు. వీటిలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి మాట్లాడింది మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. 'సందీప్ రెడ్డి వంగా క్రాఫ్ట్ నాకా చాలా నచ్చుతుంది. సినిమాలో ఆయన మ్యూజిక్ని ఉపయోగించుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. 'యానిమల్' చూసేటప్పుడు నాకు థ్రిల్లింగ్గా అనిపించింది. ఆయన సినిమాల కంటే ఆయనిచ్చే ఇంటర్వ్యూలకే నేను అభిమానిని. సమాధానాలు చెప్పే విషయంలో చాలా ముక్కుసూటిగా ఉంటారు' అని శివకార్తికేయన్ స్టేజీపైనే చెప్పుకొచ్చాడు. దీంతో సందీప్పై విమర్శలు చేస్తున్న తమిళ సెలబ్రిటీలు అందరికీ చెప్పుతో కొట్టినట్లయింది. (ఇదీ చదవండి: పెళ్లికి రావాలంటే కోట్లు ఇవ్వాల్సిందే! స్టార్ హీరోయిన్ షాకింగ్ నిజాలు) #Sivakarthikeyan: Tamil actor Siva Karthikeyan expressed his love for Sandeep Reddy Vanga's work and music. Probably, the first actor outside telugu states to come front and appreciate the film, if I'm not wrong !pic.twitter.com/sycq7JxWwJ — Movies4u (@Movies4uOfficl) March 5, 2024 -
ప్రభాస్ కోసం రణబీర్ ని పక్కకి పెట్టిన సందీప్ వంగా
-
టాలీవుడ్పై అనిల్ కపూర్ వ్యాఖ్యలు వైరల్
బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ మరోసారి సౌత్ ఇండియా సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యానిమల్,ఫైటర్ చిత్రాలలో కీలక పాత్రలలో నటించిన ఆయన విజయాన్ని అందుకున్నారు. దక్షిణాది సినిమాల వల్లనే స్టార్గా ఎదిగానని అనిల్ కపూర్ అన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతుంది. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అనే అంశంపై మాట్లాడారు. 'మంచి పాత్రలకు నన్ను ఎంపిక చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని భాషల్లో నన్ను ఆధరిస్తారు. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిగా భావిస్తాను. ప్రస్తుతం వస్తున్న యూత్ ఆలోచనలు చాలా ఆసక్తిగా ఉంటాయి. అందుకే నేను సమయం దొరికితే ఎక్కువగా వారితో సంభాషిస్తాను. నేను హీరోగా ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం దక్షిణాది చిత్రాలే.. బాలీవుడ్లో నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఎక్కువగా సౌత్ చిత్రాలే.. దేశంలో ఉండే గొప్ప నటుల్లో ఎక్కువమంది కూడా దక్షిణాది చిత్రాలనే రీమేక్ చేసిన వారే.. అక్కడ గొప్ప యాక్టర్స్ ఉన్నారు. మంచి కథలతో సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలో వచ్చినవే బాహుబలి,ఆర్ఆర్ఆర్,పుష్ప,కేజీఎఫ్ వంటి చిత్రాలు ఉన్నాయి. సినిమాలను టాలీవుడ్, బాలీవుడ్ అంటూ విడదీయకండి. అన్నిటినీ భారతీయ చిత్రాలుగానే చూడండి.' అని ఆయన అన్నారు. 1980లో వంశవృక్షం చిత్రం ద్వారా హీరోగా టాలీవుడ్కు పరిచయం అయ్యారు అనిల్ కపూర్. డైరెక్టర్ బాపు ఆయన్ను పరిచయం చేశారు. బాపు వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ ఇప్పటికే పలుమార్లు అనిల్ కపూర్ చెప్పారు. -
యానిమల్ మూవీ చూడొద్దని పిల్లలే వార్నింగ్ ఇచ్చారు: ఖుష్బూ
యానిమల్ మూవీ.. ఎన్నో విమర్శలు, వివాదాలు.. అయితేనేం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్.. కళ్లు చెదిరే కలెక్షన్స్.. బ్రహ్మరథం పట్టిన జనాలు.. ఇది సరపోదా చిత్రయూనిట్ సంబరాలు చేసుకోవడానికి! ఈ మధ్యే ఈ సినిమాకు, అందులో నటించినవాళ్లకు అవార్డులు కూడా వచ్చాయి. ఇంత పేరు గడించిన యానిమల్ మూవీని తానింతవరకూ చూడలేదంటోంది సీనియర్ నటి ఖుష్బూ. కబీర్ సింగే సమస్య అనుకుంటే యానిమల్.. ఓ వేదికపై ఖుష్బూ మాట్లాడుతూ.. నాకు యానిమల్ తరహా సినిమాలు నచ్చవు. అందుకే ఇంతవరకు ఈ సినిమా చూడలేదు. అయినా ఈ తరహా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తున్నాయంటే జనాల మైండ్సెట్ ఎలా ఉందో ఆలోచించాలి. ఇంతకు ముందు వచ్చిన కబీర్ సింగ్ (అర్జున్ రెడ్డి) మూవీ కూడా ఒక సమస్యగానే ఫీలయ్యాం. నేను డైరెక్టర్ను తప్పుపట్టడం లేదు. ఎందుకంటే అతడు ఈ సినిమాలతో సక్సెస్ చూశాడు. యువత.. చదువుకున్నవాళ్లు ఇలాంటి సినిమాలను ఎంజాయ్ చేస్తుండటం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. సమాజం ఎటు పోతోందో.. మాకు ఈ సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చిందని చెప్పేవాళ్లను చూస్తుంటే అసలు మీ మెదళ్లలో ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయి? అని అనుకునేదాన్ని. నా పిల్లలు ఈ సినిమా చూసి వచ్చాక నేను చూడొద్దని హెచ్చరించారు. జనాలు ఎందుకిలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు? సమాజం ఎటు పోతోంది? ఈ సొసైటీలో మార్పు రావాలి? అని అదేపనిగా ఆలోచిస్తూ బాధపడతానని నన్ను యానిమల్ చూడొద్దన్నారు' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఖుష్బూ 'అరణ్మయి 4' సినిమాలో నటిస్తోంది. చదవండి: 'తనకేవేవో కలలు.. నేనేమో.. కనెక్షన్ మిస్ అవుతోంది.. ' భార్యతో విడిపోయిన నటుడు -
'యానిమల్' సక్సెస్ను ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదంటే.: రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన గత చిత్రం 'యానిమల్' సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా విజయంలో ఆమె పాత్ర చాలా కీలకం అని చెప్పవచ్చు. గీతాంజలిగా ఆమె అందరికి మెచ్చేలా నటించింది. యానిమల్ సినిమా విడుదలైన తర్వాత, తన తదుపరి చిత్రాలపై ఫోకస్ చేయడం ప్రారంభించిన ఈ బ్యూటీ.. యానిమల్ సక్సెస్ మీట్లో రష్మిక పెద్దగా కనిపించలేదు. యానిమల్కు మంచి పాపులారిటీ వచ్చినప్పటికీ, రష్మిక ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడకపోవడంపై అభిమానుల్లో పలు సందేహాలు ఏర్పడ్డాయి. ఈ విషయంపై ఆమె తాజాగా ఇలా మట్లాడారు. 'యానిమల్ విడుదల తర్వాత నా తదుపరి సినిమాల కోసం సెట్స్ పైకి వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్ షెడ్యూల్స్ వెనువెంటనే ఉండటం వల్ల ఎలాంటి ఇంటర్వ్యూలలో పాల్గొనలేకపోయాను.. అందువల్ల పెద్దగా బహిరంగంగా కనిపించలేదు. నా పట్ల ఉన్న ప్రేమతోనే ఈ ఆందోళన అని నాకు తెలుసు. అందరూ అనుకుంటున్నట్టుగా నేనూ యానిమల్ విజయాన్ని ఆస్వాదించాలనుకున్నాను. అందుకు కొంత సమయం కేటాయించాలనుకుంటే ఆ అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుతం నా కెరీర్లో అతి పెద్ద, కీలకమైన సినిమాల్లో నటిస్తున్నా. దీంతో రాత్రిళ్లూ ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఈ కారణం వల్ల చాలా వేడుకల్లో పాల్గొనలేకపోయాను. మీరందరూ నన్ను మిస్ అవుతారని నాకు తెలుసు. త్వరలో నా నుంచి వచ్చే సినిమాలు ఆ లోటుని భర్తీ చేస్తాయని నమ్ముతున్నాను. ఆ క్షణాల కోసం ఎదురుచూస్తున్నా.' అంటూ ఆమె చెప్పింది. రష్మిక పుష్ప పార్ట్2, ది గర్ల్ప్రెండ్, రెయిన్బో వంటి చిత్రాల్లో ఆమె బిజీగా ఉంది. తాజాగా తన ఇన్స్టాలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేసిన రష్మిక లుక్ రివీల్ చేయలేదు. అది ఒక సినిమాకు సంబంధించినది కావడంతో రివీల్ చేయలేకపోయానని ఆమె చెప్పింది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
వ్యాపారవేత్త ప్రేమలో త్రిప్తి డిమ్రి.. ఫోటోలు షేర్ చేసిన ప్రియుడు
'యానిమల్' సినిమాతో టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు త్రిప్తి డిమ్రి . ఆ సినిమాలో తన నటనతో యువ హృదయాలను కొల్లగొట్టింది ఈ బ్యూటీ. 'జోయ' పాత్రలో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఐఎండీబీ (ఇండియన్ మూవీ డేటాబేస్) ఇటీవల విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలోనూ ఆమె మొదటి స్థానంలో నిలిచింది. అంతలా యానిమల్ సినిమాతో ఆమె కిక్ ఇచ్చింది. ఆమెకు బాలీవుడ్, టాలీవుడ్లలో వరుస అవకాశాలు వస్తున్నాయనే వార్తలు కూడా వైరలవుతున్నాయి. ఫిబ్రవరి 23న త్రిప్తి డిమ్రి 30వ వసంతంలోకి అడుగుపెట్టింది. తన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె ప్రియుడు సామ్ మర్చంట్ కూడా ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపాడు. త్రిప్తితో తీసుకున్న ఒక సెల్ఫీని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ విష్ చేశాడు. 'నా ప్రియమైన త్రిప్తికి శుభాకాంక్షలు’ అంటూ తెలిపాడు సామ్ మర్చంట్. ప్రస్తుతం వీరిద్దరి సెల్ఫీ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో త్రిప్తి ప్రేమ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ సామ్ మర్చంట్ ఎవరు ? అంటూ వివరాల కోసం త్రిప్తి ఫ్యాన్స్ గూగుల్లో వెతుకుతున్నారు. సామ్మర్చంట్ తొలుత మోడల్గా పనిచేసి ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. గోవాలో అతనికి బీచ్ క్లబ్స్తో పాటు పలు హోటల్స్ ఉన్నాయని తెలిసింది. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి అధికారికంగా ఇద్దరూ ఇప్పటి వరకు తెలుపలేదు. -
'జమల కుదు' పాటకు అల్లు అర్జున్ కూతురు క్యూట్ డ్యాన్స్
అల్లు అర్జున్ పేరు చెప్పగానే ఇతడి సినిమాలు గుర్తొస్తాయి. అదే టైంలో బన్నీ కొడుకు అయాన్, కూతురు అర్హ కూడా గుర్తొస్తారు. ఎందుకంటే పేరుకే చిన్న పిల్లలు అయినప్పటికీ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటారు. తాజాగా అల్లు అర్హ.. అలా 'యానిమల్' సినిమాలోని హిట్ పాటకు స్టెప్పులేసి వైరల్ అయిపోతోంది. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) అల్లు అర్జున్ సినిమా వచ్చి దాదాపు రెండు మూడేళ్లకు పైనే అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాడు. ఇతడి కొడుకు అయాన్ కూడా మోడల్ పోజులిస్తూ నవ్విస్తుంటాడు. కూతురు అర్హ కూడా ముద్దుముద్దుగా మాట్లాడుతూ వైరల్ అవుతూ ఉంటుంది. ఇకపోతే 'యానిమల్' సినిమాలోని 'జమల్ కుదు' పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ పాటలో తలపై గ్లాస్ పెట్టుకుని డ్యాన్స్ చేశారు. అర్హ మాత్రం తలపై ప్లేట్ పెట్టుకుని.. ఆ పాటని పోలినట్లు నడుస్తూ వచ్చింది. ఇప్పుడీ వీడియో వైరల్ అయిపోయింది. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్స్టా పోస్ట్ వైరల్) Arha😂😂❤ pic.twitter.com/ywwSnzTtuw — AK. (@flawsomedamsel) February 21, 2024 -
'యానిమల్' బ్యూటీ కొత్త బాయ్ఫ్రెండ్.. అలా తెలిసిపోయింది!
'యానిమల్' సినిమాలో ఒక్కొక్కరికి ఒక్కో విషయం నచ్చింది. కొందరికి రణ్బీర్ యాక్టింగ్ నచ్చితే మరికొందరికి యాక్షన్ సీన్స్ నచ్చాయి. మిగతా చాలామందికి మాత్రం జోయ పాత్ర చేసిన నటి తెగ నచ్చేసింది. దీంతో ఆమె ఎవరా అని ఆరా తీసి, ఆమె గురించి తెలుసుకుని మొత్తానికి తృప్తిని ఫేమస్ చేసి పడేశారు. దీంతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ గురించి బయటపడింది. (ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్స్టా పోస్ట్ వైరల్) తృప్తి దిమ్రి చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది. 2017లో మామ్, పోస్టర్ బాయ్స్ చిత్రాల్లో నటించింది. బుల్ బుల్, కాలా తదితర చిత్రాల్లో బాగా చేసిందని పేరయితే తెచ్చుకుంది గానీ గుర్తింపు రాలేదు. కానీ 'యానిమల్' మూవీతో రాత్రికి రాత్రి ఈమె ఫేట్ మారిపోయింది. కుర్రాళ్లకు పాన్ ఇండియా క్రష్ అయిపోయింది. గతంలో ఈమె.. అనుష్క శర్మ తమ్ముడు కర్నేశ్ శర్మతో రిలేషన్ ఉందని అన్నారు గానీ కొన్నాళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయినట్లు కూడా మాట్లాడుకున్నారు. ప్రస్తుతానికైతే 'యానిమల్' బ్యూటీ తృప్తి సింగిల్గానే ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ఈమెకు ఆల్రెడీ ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని టాక్. సామ్ మర్చంట్ అనే యంగ్ బిజినెస్మ్యాన్.. తాజాగా తృప్తి పుట్టినరోజు సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే డియరెస్ట్ తృప్తి' అని ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ ఉందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఒకవేళ సీక్రెట్ రిలేషన్షిప్ లాంటిది ఏమైనా ఉంటే త్వరలోనే ఓ క్లారిటీ వచ్చేయొచ్చని కూడా మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) -
రష్మిక రెమ్యునరేషన్పై క్రేజీ రూమర్.. స్పందించిన నేషనల్ క్రష్!
ఇండియన్ క్రష్ నటి రష్మిక మందన్న. నటిగా ఏడేళ్లలోనే కథానాయకిగా అనూహ్య స్థాయికి చేరుకున్న ఈ బ్యూటీ 2016లో ఓ కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ బెంగళూరు భామ ఆ తరువాత మలయాళం, తెలుగు, తమిళం అంటూ బహుభాషల్లో అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులు ఈమెను మోసేశారు. వరుసగా స్టార్ హీరోలతో జతకట్టి క్రేజీ హీరోయిన్గా ఎదిగిపోయారు. పుష్ప చిత్రం విజయం ఈమె కెరీర్ను మార్చేసింది. దెబ్బతో బాలీవుడ్ దృష్టిలో పడింది. అక్కడ తొలి చిత్రం గుడ్బై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ఇటీవల విడుదలైన యానిమల్ చిత్రం విమర్శలను మూటకట్టుకున్నా, భారీ వసూళ్లను రాబట్టుకుంది. దీంతో రష్మిక మందన క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. సాధారణంగా ఒక్క హిట్ వస్తేనే తారలు తమ పారి తోషికాన్ని పెంచేస్తారు. అలాంటిది ఈ ఇండియా క్రష్ బ్యూటీ, సక్సెస్ఫుల్ కథానాయకి పారితోషికాన్ని పెంచకుండా ఉంటారా? ఏకంగా రూ.4 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది నిజమా, కాదా అన్నది పక్కన పెడితే రష్మిక మాత్రం అంగీకరించడం లేదు. పైగా ఈ వార్త నిజమైతే బాగుండు అంటూ సైటెర్లు వేస్తోంది. ఏదేమైనా నిప్పు లేనిదే పొగరాదుగా అంటూ నెటిజన్లు ఆమైపె ట్రోలింగ్ చేస్తున్నారు. మొత్తం మీద రష్మికపై ఈ టాపిక్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రష్మిక మందన్న నటిస్తున్న పుష్ప–2 , ద్విభాషా చిత్రం రెయిన్బో చిత్రాలపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. Says who I wonder 🤦🏻♀️.. after seeing all of this I think I should actually consider it.. and if my producers ask why.. then I’ll just say ‘media out there is saying this sir.. and I think I should live up to their words.. what do I do?’ 🤣🤦🏻♀️ — Rashmika Mandanna (@iamRashmika) February 6, 2024 -
సినిమానే అనుకుంటే.. అంతకుమించి.. ఆ వెబ్ సిరీస్ రికార్డ్!
ఈ రోజుల్లో సినిమా తీయాలంటే మాటలు కాదు. కోట్లతో కూడుకొన్న వ్యవహారం. ప్రస్తుత రోజుల్లో పాన్ ఇండియా సినిమాలను కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కిస్తున్నారు. అలా రోజు రోజుకు సినిమా బడ్జెట్ పెరుగుతూనే వస్తోంది. ఇక ఓటీటీ యుగం రావడంతో వెబ్ సిరీస్లు సైతం పోటీపడుతున్నాయి. సినిమాలే ఎక్కువ బడ్జెట్ అనుకుంటే.. ఇప్పుడు వెబ్ సిరీస్లు సైతం ఆ జాబితాలో చేరిపోయాయి. తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలంటే మనకు గుర్తుచ్చే పేరు రాజమౌళినే. బాహుబాలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు అత్యధిక బడ్జెట్తో చేసిన సినిమాలే. కానీ ఇప్పుడు సినిమా బడ్జెట్ను మించిపోయేలా ఓవెబ్ సిరీస్ వస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. గతంలో అలియాభట్తో తీసిన గంగూభాయి కతియావాడి బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఆయన సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ హీరామండి వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ బడ్జెట్కు సంబంధించిన నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. యానిమల్, బాహుబలి, డంకీ సినిమాల బడ్జెట్ను మించిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్గా నిలవనుంది. తాజా సమాచారం ప్రకారం హీరామండి వెబ్ సిరీస్ను రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రుద్రను వెనక్కి నెట్టి.. ఇప్పవరకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ నటించిన వెబ్ సిరీస్ రుద్ర:ఎడ్జ్ ఆప్ డార్క్నెస్ అత్యంత భారీ బడ్జెట్గా రూపొందించిన వెబ్ సిరీస్గా నిలిచింది. ఈ సిరీస్ను దాదాపు రూ.200 కోట్లతో తెరకెక్కించారు. తాజాగా హీరామండి వెబ్ సిరీస్ బడ్జెట్ మాత్రం రూ.200 కోట్లు దాటిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే బడ్జెట్లో ఎక్కువశాతం రెమ్యునరేషన్లకే వెళ్లినట్లు తెలుస్తోంది. పారితోషికం విషయాకొనిస్తే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీయే రూ.60 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా బాలీవుడ్ హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. వీరికి కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి బాహుబలి మూవీని రూ.180 కోట్లతో తెరకెక్కించగా.. యానిమల్ రూ.100 కోట్లు, డంకీ రూ.120 కోట్లతో తీశారు. ఆ లెక్కన ఈ సూపర్ హిట్ సినిమాల బడ్జెట్ కంటే ఎంతో ఎక్కువ ఖర్చుతో హీరామండి తీస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్కు సంబంధించిన ఫస్ట్ లుక్ పేరుతో టీజర్ను కూడా రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాదే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. దేశానికి స్వతంత్రం రాకముందు ప్రస్తుతం పాకిస్థాన్లోని లాహోర్లో వేశ్యల జీవితాలను ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
భారత్లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement